Tamil Nadu Assembly Election 2026
-
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే ఆయనను పోటీకి దూరంగా పెట్టారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ వదంతులను అన్నామలై కొట్టిపారేశారు. తానే పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్టు వెల్లడించారు.తనకు టికెట్ నిరాకరించలేదని, తనకు తానుగా పోటీకి దూరంగా ఉన్నట్టు అన్నామలై చెప్పారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి చాలా ముందే అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు నేనుగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుంద''ని ప్రశ్నించారు.అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని మీడియాలో ప్రచారం జరుగుతుండడంతోనే తాను స్పష్టత ఇస్తున్నానని అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు, ఎన్డీఏ అభ్యర్థుల ప్రచారం చేసేలా అనుమతి ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, గెలిచే సత్తా నాయకులనే అభ్యర్థులుగా ఎంపిక చేసిందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ మోసాలతో విసిగిపోయారని, ఈసారి ఎన్డీఏకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్అన్నామలై అలిగారా?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై హాట్టాపిక్గా మారారు. అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని కీలక స్థానాలను అన్నాడీఎంకే పార్టికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఇదే విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి పెత్తనం ఆయనను మరింత క్షోభకు గురిచేసిందని అన్నామలై సన్నిహితులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీకి ఆయనకు దూరంగా ఉన్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అలాంటిదేమి లేదని అన్నామలై చెబుతున్నారు. -
పార్టీలో చేరిన వారంలో సీటు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సుదీర్ఘ మంతనాలతో కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఇందులో శ్రీపెరంబదూరు నుంచి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మళ్లీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో 11 మంది సిట్టింగ్లకు మళ్లీ అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే, కొత్త వారికి అత్యధికంగా సీట్లు కేటాయంచారు.డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు 28 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఆది నుంచి సీట్ల సర్దుబాటుతోపాటు నియోజకవర్గాల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్లో వివాదాల నడుమ సాగుతూ వచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై సిద్ధం చేసిన జాబితాపై విమర్శలు, ఆరోపణలు బయలుదేరాయి. చివరకు ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు సాయంత్రం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మదురై మేలూరు నియోజకవర్గానికి గట్టి పోటీ ఉండడంతో అభ్యర్థి ఎవరు అన్నది పెండింగ్లో పెట్టారు. గత ఎ న్నికలలో 18 మంది గెలవగా ఒకరు బీజేపీలోకి వెళ్లారు. మరొకరు మరణించడంతో ఆ సీటు కాస్త ఉప ఎన్నికలలో డీఎంకే ఖాతాలో చేరింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్లకు తాజాగా మళ్లీ అవకాశం కల్పించారు. వీరిలో సెల్వపెరుంతొగై, హసన్ మౌలానా, దురై చంద్రశేఖర్, గోపినాథ్, ఊర్వశి అమృతరాజ్, రూబీ మనోహరన్ ఉన్నారు. మిగిలిన స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థులుపొన్నేరి(రి)–దురైచంద్రశేఖర్, వేళచ్చేరి – హసన్ మౌలానా, శ్రీపెరంబదూరు– సెల్వపెరుంతొగై, షోళింగర్ –ఏఎం మునిరత్నం, ఊత్తంగరై(రి)– కుప్పుస్వామి,కృష్ణగిరి – చెల్లకుమార్, పెన్నగరం – జీకే ఎం తమిళ్కుమరన్, ఆత్తూరు (రి)–ఎస్కే అర్ధనారి, ఈరోడ్ ఈస్ట్– గోపినాథ్ పళణియప్పన్, ఊటి– పి.రామచంద్రన్, గౌండం పాళయం– సూర్యప్రకాష్, సింగానల్లూరు–శ్రీనిధినాయుడు, తురయూర్(రి)– విచ్చు లెనిన్ ప్రసాద్, కడలూరు– చంద్రశేఖరన్, మైలాడుతురై– జమాల్ యూనస్ మహ్మద్, అరంతాంగి–టి.రామచంద్రన్, కారైక్కుడి– ఎస్ మాంగుడి, ఉసిలంపట్టి– టి.శరవణకుమార్, శివకాశి–గణేశన్ అశోకన్, తిరువాడనై– రామకరుమాణిక్యం, శ్రీ వైంకుఠం–ఊర్వశి అమృతరాజ్, శంకరన్ కోవిల్(రి)–సెంగైగణేషన్, అంబాసముద్రం– వీపీ దురై, నాంగునేరి–రూబీమనోహరన్, కులచల్–తారగై, విలవన్ కోడ్ – టీటీ ప్రవీణ్, కిళ్లియూరు–రాజేష్కుమార్ పోటీచేస్తున్నారు.పార్టీలో చేరిన వారంలో సీటుపీఎంకేలో జీకే మణి కీలక నేత అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎంకేలో వివాదాలు సాగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుకు మద్దతుగా జీకే మణి వ్యవహరిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి కుమారుడు తమిళ్కుమారన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరి వారం రోజులైన కాక ముందే ఆయనకు పెన్నగరం సీటు కేటాయించడం కాంగ్రెస్లో చర్చకు దారి తీసింది. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. అన్నాడీఎంకేతో జట్టు కట్టిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తాజాగా ప్రకటించింది. ఈ 27 మందిలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐదుగురు ఎస్సీలకు సీట్లు దక్కాయి. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందరాజన్.. మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం దక్కినందుకు తమిళసై సౌందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఎలాంటి తేడా లేదు. చెన్నై నాకు కొత్త ప్రదేశం కాదు. మేము మైలాపూర్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతోనే నేను గవర్నర్ పదవి నుంచి తిరిగి వచ్చాను. ప్రతి నాయకుడి కష్టానికి పార్టీ తగిన గౌరవం ఇస్తుంది. అన్నామలైకి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. డీఎంకే ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పార్టీ. డీఎంకే కుటుంబ రాజకీయాలను ప్రజలు తిప్పికొడతార''ని ఏఎన్ఐతో తమిళసై సౌందరాజన్ చెప్పారు. భుజం భుజం కలిపి ప్రచారం చేస్తా: అన్నామలైఅభ్యర్థుల ప్రకటనపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై 'ఎక్స్'లో స్పందించారు. గెలిచే వారినే అగ్రనాయకత్వం ఎంపిక చేసిందని పేర్కొంటూ, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. డీఎంకే వంచనతో విసిగిపోయిన తమిళనాడు ప్రజల మద్దతు ఎన్డీఏ అభ్యర్థులకు ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని, డీఎంకే ప్రభుత్వం కారణంగా అన్నిరంగాల్లో తమిళనాడు వెనుబడిపోయిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 210 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, దీనికి కార్యకర్తగా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.ఆ బాధ్యతను నెరవేరుస్తాఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అగ్రనాయకత్వం తనకు ప్రచార బాధ్యతలు అప్పగించిందని అన్నామలై తెలిపారు. కేరళలోని కన్నూర్ శుక్రవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్నట్టు చెప్పారు. "ఈ ఎన్నికలలో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే నా పాత్ర. ఈనెల 7వ తేదీ వరకు పుదుచ్చేరి, కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ప్రస్తుతం అదే పనిమీద ఉన్నాను. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు తమిళనాడులో ప్రచారానికి వెళతాను. ఇది పార్టీ నాకు అప్పగించిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నిర్విస్తానని చెప్పారు. Press ReleaseThe Central Election Committee of the @BJP4India has decided the following names for the ensuing General Elections to the Legislative Assembly of TAMIL NADU:TAMIL NADU Legislative Assembly Election 2026..!#TNElection2026#TNElection2026 pic.twitter.com/nSe4tgaupm— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 3, 2026చదవండి: 21 స్థానాల్లో కానరాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు -
విజయ్ ఇంపాక్ట్.. డీఎంకే, అన్నాడీఎంకే లేకుండానే పోటీ
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని ప్రిపోల్ సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) కూడా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులకు భారీగా ఆధిక్యాలు రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పోటీ ఎక్కువ ఉండడంతో ప్రధాన పార్టీలు చిన్న పార్టీలను కూడా తమ కూటమిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగస్వామ్య పార్టీలకు అధికంగా సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఫలితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూటముల మిత్రపక్షాల అభ్యర్థులు పోటీలో ఉండడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి మరో పది స్థానాలు జతయ్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెరగడంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. డీఏంకే కూటమిలో 20పైగా చిన్న పార్టీలు ఉండడం గమనార్హం.మిత్రపక్షాలు బలంగా ఉన్నందువల్లే ఈ 21 స్థానాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వదులుకోవాల్సి వచ్చిందని జాతీయ పార్టీలకు ఎనలిస్టుగా వ్యవహరిస్తున్న వి. భారతి అభిప్రాయపడ్డారు. కొత్తగా బరిలోకి దిగిన టీవీకే, ఎన్టీకే పార్టీలు కూడా స్థానికంగా బలమున్న నేతలకే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుందన్నారు. విజయ్ ఎన్నికల బరిలోకి దిగడంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల లెక్కలు మారిపోయాయని సెపాలజిస్ట్ ఆర్. చంద్రశేఖరన్ అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలిచే అభ్యర్థులకు పెద్దగా మెజార్టీలు రాకపోవచ్చని తెలిపారు. చదవండి: హీరో విజయ్ విద్యార్హతలు ఇవే -
ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్ నామినేషన్ దాఖలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉధయనిధి స్టాలిన్ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ 2024 సెప్టెంబరు 28న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబరు 14 నుంచి క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.మళ్లీ ర్యాలీ నిర్వహించిన టీవీకే విజయ్టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్పై కేసు నమోదైంది.మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇవాళ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ మళ్లీ విజయ్ రోడ్ షో నిర్వహించడం గమనార్హం. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, విజయ్ తనకు రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. -
హీరో విజయ్ ఏం చదివారో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు సంబంధించిన ఆస్తులు, వాహనాలు, విద్యా వివరాలను పొందుపరిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.విలాసవంతమైన కార్లు, బైకులుఅఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం విజయ్కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్(అప్పీల్స్), హైకోర్టులో పెండింగ్లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.భార్య పేరిట విడిగా ఆస్తులువిజయ్ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.అప్పులు లేవుతనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ అఫిడవిట్లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్కు విజయ్ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్పీ ఆంటోనియస్ బ్రిటో, కోకిలాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్ ట్రస్ట్కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్ సంజయ్కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు.చదవండి: ఎన్నికల వేళ.. విజయ్కు మరో షాక్డిగ్రీ డిస్కంటిన్యూవిజయ్ విద్యార్హతలను గమనిస్తే.. 1989లో పదోతరగతి పాసయ్యారు. ఆ తర్వాత ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. -
ఎన్నికల వేళ.. టీవీకే విజయ్కు మరో షాక్!
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు.ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు కుమార్ చెప్పారు.కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విజయ్ సోమవారం (మార్చి 30న) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు భారీగా జనాలు వచ్చారు. అయితే, చెన్నై పోలీసులపై టీవీకే నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేదని అన్నారు.చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందిన తర్వాత కూడా విజయ్కు భద్రత కల్పించలేదని చెప్పింది.కాగా, విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, త్రిచీ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆయా స్థానాల్లో డీఎంకే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆర్డీ శేఖర్, ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ విజయ్కు ప్రత్యర్థులుగా ఉన్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో 2016 వరకు సీపీఎం ఆధిపత్యం ఉండేది. ఆర్డీ శేఖర్ 2019 ఉపఎన్నికలో గెలిచి ఈ స్థానం దక్కించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
జ్యోతిష్యంతో క్యాన్సర్ నయమవుతుందట..
కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి నరసింహనాయకన్పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.ఎలాంటి వారికి టికెట్లిచ్చారు? టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. -
నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. టీవీకే అధినేత ఆస్తులెంత?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్ ఓ పుస్తకం విడుదల చేశారు."మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్ నామినేషన్ సమర్పించారు. విజయ్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. TVK Chief Vijay declares ₹405 crore of movable assets and ₹115 crore of immovable assets in his affidavit while filing nomination for Perambur assembly constituency pic.twitter.com/03U4JC28GC— Arvind Gunasekar (@arvindgunasekar) March 30, 2026 -
స్టాలిన్ ప్రత్యర్థిగా సంతాన కృష్ణన్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థుల 3వ జాబితా ఆదివారం విడుదలైంది. ఇందులో చైన్నెలో 12 చోట్ల అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై అభ్యర్థులు పోటీ చేయనున్నారు. సీఎం స్టాలిన్కు కొళత్తూరులో ప్రత్యర్థిగా జయ పైరవై సంయుక్త కార్యదర్శి సంతాన కృష్ణన్ను రంగంలోకి దించారు. వివరాలు.. అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యూహాలకు పదును పెట్టి, ప్రజల్లోకి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు ముగించారు. తమ అభ్యర్థులు తొలి జాబితాను 23 మందితో విడుదల చేశారు. అనంతరం 127 మందితో రెండో జాబితా ప్రకటించారు. తాజాగా 17 మందితో మూడో, తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో చైన్నెలోనే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు కీలకంగా మారారు. వీరిలో ఒకరు బి సంతనా కృష్ణన్. ఈయన కొళత్తూరులో సీఎం స్టాలిన్ను అన్నాడీఎంకే అభ్యర్థిగా ఢీ కొడుతున్నారు. మరొకరు చేపాక్కం– ట్రిప్లికేన్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఢీ కొట్టేందుకు ఆది రాజా రాం సిద్ధమయ్యారు.మూడవ జాబితాలోని కీలక అభ్యర్థులుకొళత్తూర్: బి. సంతాన కృష్ణన్, థౌజండ్ లైట్స్ – మాజీ మంత్రి బి వలర్మతి, అన్నానగర్ – మాజీ మంత్రి గోకుల ఇందిర, చేపాక్కం, ట్రిప్లికేన్ – ఆది రాజా రాం, ఆర్.కె. నగర్ – ఆర్.ఎస్. రాజేష్, విల్లివాక్కం– ఎస్.ఆర్. విజయకుమార్, వేళచ్చేరి– అశోక్, షోళింగనల్లూరు – కందన్, విరుగంబాక్కం– విరుగై వి.ఎన్. రవి, టి. నగర్ – మాజీ ఎ మ్మెల్యే సత్యనారాయణన్ అలియాస్ సత్య, హార్బర్ – రాయపురం మనో, ఎగ్మూర్ (రి)– అభిషేక్ రంగసామి పోటీ చేస్తున్నారు.ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణికి సీటుబీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ చైన్నెలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన మరణం తదుపరి పరిణామాలతో సతీమని పొర్కొడి ఆర్మ్స్ట్రాంగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తమిళనాడు బీఎస్పీ పేరిట పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు న్యాయం కోసం పోరాడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు బీఎస్పీకి అన్నాడీఎంకే తరపున ఓ సీటును కేటాయించారు. అన్నాడీఎంకే రెండాకు చిహ్నంలో తిరువీకా నగర్ నియోజకవర్గం నుంచి ఆర్మ్ స్ట్రాంగ్ సతీమణి పొర్కుడిని అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు.కృష్ణస్వామికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదు: పళణిఅభ్యర్థులను ప్రకటించినానంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూత్తుకుడిలో పళని స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదియ తమిళగం అధ్యక్షుడు కృష్ణ స్వామి తనను సంప్రదించ లేదని స్పష్టం చేశారు. ఆయన మరొకరి ద్వారా తొలుత పది , ఆ తర్వాత 5 సీట్లకు పట్టుబట్టారని వివరించారు. గత ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 33 వేల ఓట్లు మాత్రమే సాధించిన పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఆయనకు గానీ, ఆ పార్టీకి గానీ సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో తూత్తుకుడి, నైల్లె జిల్లాల్లో వచ్చిన భారీ వరదల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. నటుడు విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఈ ఎన్నికలలో ద్విముఖ పోటీ మాత్రమే అని చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయనకు వాస్తవాలు అర్థమవుతాయి అని ఎద్దేవా చేశారు. -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా?
ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేదుటీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మెనూలోంచి దోశ, బోండా ఔట్మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్ పరిధిలో ఉన్న మావూర్ రోడ్లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - వెబ్డెస్క్ -
175 లక్ష్యంగా డీఎంకే వ్యూహం
సాక్షి, చైన్నె: డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో 175 మంది అభ్యర్థులను నిలబెట్టే దిశగా వ్యూహ రచనలో ఆపార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఉన్నట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆశావహులతో ఆయన ఐదు రోజుల పాటుగా నిర్వహించిన ఇంటర్వ్యూలు సోమవారంతో ముగిసింది. మంగళవారం లేదా బుధవారం నాటికి సీట్ల పంపకాలను ముగించి ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా ప్రకటన దిశగా స్టాలిన్ కార్యాచరణలో ఉన్నారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్కు 28 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. సీపీఐకు ఐదు ఇవ్వగా ఎండీఎంకేకు నాలుగు అప్పగించారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు, మనిద నేయక్కల్ కట్చి, కొంగు దేశీయ మక్కల్ కట్చిలకు తలా రెండు సీట్లు ఖరారు చేశారు. ఇక, సీపీఎం, వీసీకే, మక్కల్ నీది మయ్యం, డీఎండీకేకు సీట్లు కేటాయించాల్సి ఉంది. సీపీఎంకు ఐదు సీట్లు, వీసీకేకు ఐదు సీట్లు , మక్కల్ నీది మయ్యంకు రెండు, డీఎండీకేకు ఐదు చొప్పున సీటును డీఎంకే ఖరారుచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఎస్డీపీఐతో పాటుగా మిగిలిన చిన్న పార్టీలకు తలా ఓసీటు ఇవ్వడానికి నిర్ణయించారు. సీపీఎం అయితే, ఐదు సీట్లు తీసుకునేందుకు ముందుకు వచ్చినా మిగిలిన ఆయా పార్టీలు లెక్కను అంగీకరించాల్సి ఉంది. అదే సమయంలో ఎండీఎంకే మూడు, మనిద నేయమక్కల్ కట్చి, కొంగు దేశీయ మక్కల్ కట్చి డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నాయి. మక్కల్ నీది మయ్యంతో పాటుగా చిన్న పార్టీలన్నీ ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా డీఎంకే సూచిస్తున్నది. దీంతో డీఎంకే తరపున 175 మంది అభ్యర్థులు రేసులో ఉండే దిశగా ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీకి కార్యాచరణలో ఉన్నారు.ముగిసిన ఇంటర్వ్యూలుడీఎంకేలో ఆశావహులను ఐదు రోజుల పాటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన కార్యదర్శిదురై మురుగన్, కోశాధికారి టీఆర్బాలులు ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో మంత్రులు సైతం ఇంటర్వ్యూలకు హాజరై, తమ గెలుపు అవకాశాలు, నియోజకవర్గంలో బలం తదితర అంశాలను గురించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ సైతం ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సోమవారం డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రు మంత్రి అన్బిల్ మహేశ్ తదితరులతో పాటుగా కావేరి తీర డెల్టా జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఆశావహులను స్టాలిన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రక్రియను ముగించిన స్టాలిన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు. ముందుగా మంగళ, బుధవారం లోపు కూటమిలోని పార్టీలకు సీట్లను, నియోజకవర్గాలను ఖారారు చేయడానికి సర్దుబాటు కమిటీని ఆదేశించారు. ఈ ప్రక్రియ ముగియగానే, తొలుత మ్యానిఫెస్టో, ఆ తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటించి, రాష్ట్ర పర్యటనకు స్టాలిన్ సిద్ధం కానున్నారు.ఉదయ నిధి ఆసక్తికరం..కాగా, తనను ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అడిగిన ప్రశ్నలను ఓ మీడియాతో పంచుకుంటూ ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య తేడా, నియోజకవర్గ ప్రజల మనో భావాలను గురించిన ప్రశ్నలను అడిగి, చివరకు వెళ్లి రండి... అభ్యర్థి ఎవరో అన్నది ఆలోచించి చెబుతామని పంపించేశారని చమత్కరించారు. -
టీఎన్సీసీ సరికొత్త ప్రచార అస్త్రం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో వినూత్న పంథాను అనుసరించేందుకు చర్యలు చేపట్టింది. డీఎంకే కూటమిలో భాగంగా 28 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, తన ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) నేరుగా ఓటర్ల గుమ్మం వద్దకే చేర్చేందుకు నిర్ణయించింది. పార్టీ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్, ఎంపీ కార్తీ చిదంబరం నేతృత్వంలో ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.పోస్ట్కార్డులతో ఇంటింటికీ హామీలుకాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోని అత్యంత కీలకమైన, ప్రజలకు ఉపయోగపడే ప్రధాన వాగ్దానాలను ఒక పోస్ట్కార్డుపై ముద్రించనుంది. పార్టీ పోటీ చేస్తున్న 28 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరు ఇంటికి ఈ పోస్ట్కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీ హామీలు నేరుగా ప్రజల మనసుల్లోకి వెళ్తాయని నాయకత్వం భావిస్తోంది. మేనిఫెస్టో కమిటీ కసరత్తుల్లో భాగంగా చైన్నెలోని సత్యమూర్తి భవన్లో జరిగిన ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అనంతరం కార్తీ చిదంబరం మాట్లాడుతూ, కమిటీ ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశమై ప్రజా సమస్యలను అధ్యయనం చేసిందన్నారు. మార్చి 27 నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల కోరికలు, సమస్యలను సేకరించడానికి ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. వారు సేకరించిన సమాచారాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని వివరించారు.ఈ నివేదికను ముందుగా ఢిల్లీలోని ఏఐసీసీ పంపించి, వారి ఆమోదంతో పోస్టు కార్డు ద్వారా ఓటర్లకు చేరవేయనుమన్నారు. తమిళనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈసారి మేనిఫెస్టో ఉంటుందని కార్తీ చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతుల సమస్యలకు ఇందులో పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. -
డబ్బులు పట్టుకుని వచ్చారో..
ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ఓ ఆయుధం. దాన్ని డబ్బుకు అమ్ముకుంటుంటారు చాలా మంది. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తాం’ అని చెబుతుంటారు కొందరు. ఓట్లు వేసే వేళ తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగుతున్న వారు కూడా కనపడుతుంటారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉంటారు. ఓటుకు ఇంతగా అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్న ఈ కాలంలో.. తాము ఓటు వేసేందుకు డబ్బు వద్దని చెబుతున్నారు. రెండు గ్రామాల ప్రజలు. ‘అభ్యర్థులు డబ్బు ఇవ్వకూడదు, ఓటర్లు డబ్బు తీసుకోకూడదు’ అని బోర్డు పెట్టి మరీ, ఆచరణాత్మకంగా సందేశం ఇస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలోని తీర గ్రామ ప్రజలు ఓటుకు డబ్బు ఇచ్చే అభ్యర్థులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హెచ్చరిస్తూ గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ, స్థానిక ప్రజల తరఫున తీసుకున్నారు. డబ్బు లేదా బహుమతులు ఇచ్చే అభ్యర్థులను గ్రామం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే గ్రామం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.“మా ఓటుకు ధర నిర్ణయించవద్దు, మా జీవనోపాధికి మార్గం చూపండి” అని బ్యానర్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ సాధారణంగా జరుగుతుండటంపై గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ అభ్యర్థుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.డబ్బులు తీసుకోంగానీ 100% ఓటేస్తాంమరోవైపు, ‘మా ఓటు అమ్మకానికి లేదు’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఆలంపట్టు పెరియర్ నగర్ గ్రామ యువకులు. అంతేగాక, తమ గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదవుతుందని హామీ ఇస్తున్నారు. పెరియర్ మరుమలర్చి డాక్టర్ అంబేద్కర్ యువ నర్పణి మండలి సభ్యులు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. పలు పోస్టర్లను బస్ స్టాండ్ ప్రయాణికుల షెల్టర్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో అతికించారు.దీనిపై ఆలంపట్టు పెరియర్ నగర్ యువకులు మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో అందరం ఓటుకు డబ్బు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి రావద్దని గ్రామ సరిహద్దులోనే ప్రకటన బ్యానర్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. -
నగదు బట్వాడాపై ఉక్కుపాదం
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ధనబలాన్ని ఉపయోగించే రాజకీయ నాయకులపై నిఘాను ముమ్మరం చేయాలని కేంద్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ప్రతాప్ సింగ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి భయం కలిగేలా పర్యవేక్షణ కార్యకలాపాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్ అభినవ్తో కలిసి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తమిళనాడుపై ప్రత్యేక దృష్టిదేశంలోనే ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉండే రాష్ట్రంగా తమిళనాడును ఎన్నికల సంఘం గుర్తించింది. గతంలో 2016లో అరవకురిచ్చి, తిరుపరంకుండ్రం, 2017లో ఆర్.కె. నగర్ ఉపఎన్నికల్లో ధనప్రవాహం కారణంగా ఎన్నికలు రద్దు చేయబడిన విషయాలను ఆయన ఉదాహరణగా గుర్తు చేశారు. సాధారణంగా ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక వ్యయ పరిశీలకుడు ఉంటారని పేర్కొంటూ, ఈసారి తమిళనాడులోని 234 నియోజకవర్గాల కోసం ఏకంగా 151 మంది వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు సరికొత్త సాంకేతికతను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షించాలని ప్రతాప్ సింగ్ సూచించారు.అలాగే, ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మాజీ మంత్రి ఉదయకుమార్పై డీఎంకే ఫిర్యాదుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మదురై జిల్లా తిరుమంగళం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఏఐఏడీఎంకే కీలక నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నగదు పంపిణీ చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాయి.మనీ లాండరింగ్ ఆరోపణలుఉదయకుమార్ తన సొంత ట్రస్ట్ ద్వారా భారీగా నగదు బదిలీలు చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మదురై దక్షిణ జిల్లా డీఎంకే న్యాయవాదుల విభాగం ప్రతినిధి శివనేశన్, ఐటీ వింగ్ ఆర్గనైజర్ జయచంద్రన్ ఆరోపించారు. తిరుమంగళం నియోజకవర్గ పరిధిలోని టి. కున్నత్తూరులో ఉదయకుమార్ నిర్మించిన దివంగత సీఎం జయలలిత ఆలయాన్ని ఎన్నికల కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం భోజనాలు ఏర్పాటు చేస్తూ, నగదు పంపిణీకి వేదికగా మార్చుకున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, ఆ ఆలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ఎన్నికలు ముగిసే వరకు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని డీఎంకే నేతలు తిరుమంగళం ఎన్నికల అధికారి శివజ్యోతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్
అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ లొంగిపోయే రకం కాదని.. డబ్బుతో తనను ఎవరూ కొనలేరని అన్నారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్ ఇంజిన్ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్ ఇంజిన్ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. స్టాలిన్ను అడిగినా.. విజిల్ గుర్తుకే ఓటేస్తారని ఛలోక్తులు విసిరారు. విజయ్ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. అభిమానుల కోసం మూడు స్టెప్పులు..టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ హుషారుగా కనిపించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్-రిలీజ్ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్ వేలుమరుగన్ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.தவெக 3ஆம் ஆண்டு தொடக்க விழாவில் ”உங்கக் கூட கொஞ்சம் Dance ஆடிக் கொள்ளட்டுமா?” எனக் கேட்டுக்கொண்டு நடனமாடிய விஜய்#TVK | #Vijay| #TVKVijay | #Panaiyur pic.twitter.com/SVZIGZaE87— PttvOnlinenews (@PttvNewsX) February 2, 2026 -
టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు. కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?కరూర్లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మళ్లీ సినిమాలు చేస్తారా?.. దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తుతాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు.. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించాఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా? నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు.. షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నాతమిళనాడు రాజకీయాల్లో కింగ్మేకర్ అవుతారని అనుకుంటున్నారా?నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?ఎన్నికల చిహ్నంపై రియాక్షన్ మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది Source: NDTV -
విజయ్ టీవీకే పార్టీకి కొత్త కష్టాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సైలెన్స్లోనే..అయితే ఆయన తన పనిని తాను సైలెంట్గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు. కొత్త కష్టం.. టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్లో ఉన్న కామన్ సింబల్లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. -
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.అన్నాడీఎంకే(AIADMK) జనరల్ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.👉అమ్మా ఇల్లమ్ స్కీమ్.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. 👉అమ్మా.. టూ వీలర్ స్కీమ్ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ్సీడీ రూ.25,000 ఉంటుంది.Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party's election promises1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I— ANI (@ANI) January 17, 2026రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్ స్కీమ్.. కళైంగర్ హౌజింగ్ స్కీమ్ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది. -
విజయ్కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు


