టాటాసుమో, టాటాఏస్ ఢీ..10 మందికి గాయాలు
గిద్దలూరు (కర్నూలు జిల్లా): నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు టాటా వాహనాలు ఢీకొని 10 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో జరిగింది. వివరాలు.. ఘాట్ రోడ్డులో టాటా సుమో, టాటా ఏస్ వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని గిద్దలూరు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.