Tax adits
-
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్లు డీలా -
వ్యాపారంలో సొంత ఖర్చులా? అయితే చిక్కులు తప్పవు!
నేను చిరు వ్యాపారం చేస్తున్నాను. జీఎస్టీ నంబర్ ఉంది. స్వంత ఇంట్లోనే వ్యాపారం. నా స్వంత ఖర్చులను కూడా వ్యాపారపు ఖర్చుల్లో కలిపివేయవచ్చా. అలా కలపడం వల్ల లాభం తగ్గుతుంది కదా – ఆర్ చిట్టిబాబు, శ్రీకాకుళం చిరు వ్యాపారం అంటున్నారు.. కానీ జీఎస్టీ నంబరు ఉందంటున్నారు. సరే, సరిగ్గా అన్ని రికార్డులు నిర్వహించండి. స్వంత ఇంట్లోనే వ్యాపారం అన్నారు. ఇల్లు మీ పేరు మీదే ఉంటే అద్దె నిమిత్తం ఏ ఖర్చూ రాయకండి. ఇల్లు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అద్దె ఖర్చుగా రాయవచ్చు. అది కూడా మొత్తం ఇంట్లో ఎంత భాగం అయితే వ్యాపారానికి కేటాయిస్తున్నారో, అంతకు మాత్రమే ఖర్చు చేయండి. అలాగే కరెంటు, నీరు ఖర్చు కూడా . ఇక వ్యాపార నిర్వహణలో కేవలం వ్యాపారానికి సంబంధించిన ఖర్చును మాత్రమే పరిగణిస్తారు. వ్యక్తిగత ఖర్చులు, సొంత వాడకాలు, ఇతర ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు మొదలైనవి పరిగణించరు. ఇటువంటి ఖర్చులను వ్యాపార ఖాతాలో రాయకండి. సొంత వాడకాలని కూడా విడిగా రాయాలి. ఖర్చుల విషయంలో ‘‘సమంజసం’’, ‘‘ఉచితం’’, ‘‘సంబంధం’’ అన్న సూత్రాలు వర్తిస్తాయి. పుస్తకాలు సరిగ్గా రాయండి. ఆడిట్ అవసరం కాకపోతే ఖర్చులు రాయకుండా అమ్మకాల మీద 8 శాతం కన్నా ఎక్కువ లాభం చూపించవచ్చు. అప్పుడు లెక్కల బెడద ఉండదు. ఏది ఏమైనా సొంత ఖర్చులు కలపకూడదు. నేను ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నాను. ఒక కోర్టు కేసు వల్ల గతంలో జీతం చెల్లించలేదు. 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయీలు ఈ సంవత్సరం ఇస్తారు. దీని వల్ల నాకు పన్ను భారం పెరుగుతుందా? – యం. నాగమణి, రాజమండ్రి ఇలాంటి బకాయీలను ‘‘ఎరియర్స్’’ అంటారు. వీటిని ట్యాక్సబుల్ ఇన్కంగా పరిగణిస్తారు. అంటే ఈ అదాయం మీద పన్ను భారం ఉంది. అయితే, ఒక వెసులుబాటు కూడా ఉంది. ఏ సంవత్సరానికి తత్సంబంధమైన ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మీరు తక్కువ/చిన్న శ్లాబులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీలు, మినహాయింపులు తీసుకోవచ్చు. పన్నుభారం తక్కువ కావచ్చు. మీకు రెండు సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఎరియర్స్ని ప్రస్తుత సంవత్సరం ఆదాయంతో బాటు కలిపి పన్ను భారం లెక్కించండి. రెండో పద్ధతి ప్రకారంలో ఈ ఎరియర్స్.. ఆర్థిక సంవత్సరం ప్రకారం సర్దుబాటు చేయండి. గతంలో వచ్చిన జీతానికి ఈ ‘ఎరియర్స్’ భాగం కలిపి పన్ను భారం లెక్కించండి. అలా ఎన్ని సంవత్సరాలు వర్తిస్తుందో.. అన్ని సంవత్సరాలకు పన్నుభారం లెక్కించండి. ఆ తర్వాత అలా అన్ని సంవత్సరాల పన్ను భారం కలిపి మొత్తం పన్నుభారాన్ని కనుక్కోండి. ఇలా వచ్చిన మొత్తం పన్ను భారాన్ని ముందు/మొదట్లో లెక్కించిన పన్నుభారంతో పోల్చి చూడండి. ఏది తక్కువ ఉందో, అంతే చెల్లించండి. ఇలా తక్కువ చెల్లించడాన్ని 89 (1) రిలీఫ్ అంటారు. మీరే ఒక స్టేట్మెంట్ చేసుకుని ఫారం 10 ఉలో సమాచారాన్ని పొందుపర్చి, మీ యజమానికి ఇవ్వండి. రిలీఫ్ ఇస్తారు. ఒకవేళ ప్రస్తుత సంవత్సరంలోనే పన్నుభారం తక్కువగా ఉందనుకోండి. 10 ఉ ఇవ్వనవసరం లేదు. అన్ని రికార్డులు జాగ్రత్తగా భద్రపర్చుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూరి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
సీఎస్టీ యాప్.. ట్యాక్స్లో టాప్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే తొలిసారిగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధానానికి శ్రీకారం చుట్టింది. అంతర్రాష్ట అమ్మకాల పన్ను వసూళ్లకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. దేశ పన్ను వసూళ్ల వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కమిషనర్ అనిల్ కుమార్ మార్గదర్శకాలతో ఉన్నత అధికారుల రూపొందించిన సీఎస్టీ యాప్తో పన్ను వసూళ్ల ప్రక్రియ ఎంతో సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. యాప్లో అంతర్రాష్ట అమ్మకాలు, డీలర్లకు సంబంధించిన వివరాలతో పాటు వారు సమర్పించాల్సిన సీ, ఎఫ్, ఐ ఫారాలతో పాటు బిల్ ఆఫ్ ల్యాండింగ్కు సంబంధించిన దస్తావేజులను ఉంచారు. దీంతో పాటు డీలర్లు పన్ను మినహాయింపునకు అందించాల్సిన ఫారాలు సమర్పించారా..? అమ్మకాలకు తక్కువ ధరల కోసం నివేధికలు అందింOచారా..? అనే సమాచారం యాప్లో పొందుపర్చారు. పన్ను వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్లో ఉండడంతో అధికారులకు విధులు సులభతరమయ్యాయి. యాప్తో అన్ని ప్రక్రియలూ సులువు.. సీఎస్టీ యాక్ట్ కింద ఈ ఏడాది జూన్ వరకు అంతర్రాష్ట్ర అమ్మకాలపై డీలర్లు కోరిన పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు సంబంధించి సీ, ఎఫ్, ఐ ఫారాల బిల్ ఆప్ ల్యాండింగ్ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై కోరిన మినహాయింపులు, అంతర్రాష్ట్ర, తక్కువ పన్ను రేట్లను తర్వాత త్రైమాసికం లోపు దస్తావేజులు రుజువులు, పత్రాలు వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు సమర్పించాలి. ఒకవేళ వారు సమర్పించని పక్షంలో.. సమర్పించని అమ్మకాల వివరాలను సాధారణ అమ్మకాలుగా పరిగణించి పన్ను మదింపు చేస్తారు. దీనికిగాను వాణిజ్య పన్నుల శాఖకు నాలుగేళ్లలోపు మదింపు చేయాల్సి ఉంటుంది. కానీ వాణిజ్య పన్ను శాఖ మదింపు చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది, సమయం కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్టీ యాప్ను రూపొందించారు. దీని ద్వారా అన్ని సీఎస్టీ నోటీసులు గత సంవత్సరాలకు సంబంధించినవన్నీ డీలర్ల నమోదు చేసిన ఈ మెయిల్ అడ్రస్కు ఒకే క్లిక్తో వెళ్లిపోయే వెసులుబాటు కలిగింది. ఈ ప్రక్రియతో వాణిజ్య పన్నుల శాఖకు సమయం ఆదా అవుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ మంది అవసరం ఉండదు. నోటీస్ అందిన డీలర్లు వాటిలో ఉన్న ఒక లింక్ ద్వారా అభ్యంతరాలు, రుజువులు, పత్రాలను, ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత డీలర్లు ఈ– మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరణ పత్రం చేరుతుంది. దీనిని ఆన్లైన్లో పూర్తి చేసి అధికారులు ఇచ్చిన తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి. పారదర్శకతకు అవకాశం.. సీఎస్టీ పన్ను వసూళ్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కంప్యూటర్, ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది. ఇటు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అటు డీలర్లు సమర్పిస్తున్న వివరాలు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. డీలర్లు సమర్పించాల్సిన పత్రాలు, రుజువులు, వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదు. ఒకవేళ ఏవైనా దస్తావేజు పత్రాలు సమర్పించకపోతే ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీంతో పన్ను వసూళ్ల ప్రక్రియా మొత్తం పారదర్శంగా కొనసాగుతోంది. ఈ యాప్తో పన్ను వసూళ్ల ప్రక్రియ సులభంగా మారింది. ఒక్కో అధికారికి 50 మంది డీలర్లు లక్ష్యంగా.. సీఎస్టీ పన్ను వసూళ్ల కోసం కేంద్ర కార్యాలయం ద్వారా సర్కిల్లోని ఒక్కో అధికారికి 50 మంది డీలర్ల పన్ను వసూళ్లకు టార్గెట్ ఇస్తున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం సీ, ఎఫ్, ఐ ఫారాలు, నివేదికలు అందజేసే డీలర్ల వివరాలను అధికారులకు టార్గెట్గా ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు తొలుత ఫోన్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. డీలర్ల వివరాలు అందజేయనివారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న డీలర్లు వివరాలను ఆన్లైన్లో అందించి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తున్నారు. -
స్క్రూటినీ అసెస్మెంట్కు సిద్ధమేనా?
ఇంకొక నెల రోజుల సమయం ఉంది. ట్యాక్స్ ఆడిట్స్, రిటర్న్స్, రిపోర్ట్స్ మూడింటి దాఖలుకూ ఈ నెల 31తో గడువు తీరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక పెద్ద పర్వం సమాప్తమవుతోంది. అయితే ఇంతలోనే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్క్రూటినీ నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. 2013-14 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ మీరు మీ ఆదాయ పన్ను రిటర్నులను సకాలంలోనే వేసి ఉంటారు. దీనికి సంబంధించిన రిఫండ్ కూడా వచ్చే ఉంటుంది. అయినా కూడా ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని కేసులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికను కంప్యూటర్ ద్వారా చేస్తారు. ఇలా చేయటాన్ని కంప్యూటర్ అసిస్టెడ్ స్క్రూటినీ సెలెక్షన్ (సీఏఎస్ఎస్) అంటారు. కొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఈ ప్రక్రియ ఉం టుంది. ఎంపిక చేసిన తర్వాత అధికారులు నోటీసులు పంపుతారు. మీకు స్క్రూటినీ నోటీసు వచ్చిందా? మీ కేసు స్క్రూటినీకి ఎంపికయితే ఇప్పటికే నోటీసు మీ చేతికి వచ్చి ఉంటుంది. వచ్చిన నోటీసులను స్వీకరిం చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దు. అలా తిరస్కరించటం వల్ల నాలుగు రోజులు వృథా అవుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నోటీసుకి సమాధానమివ్వండి... మీకు వచ్చిన నోటీసులో మీరు కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తి కానీ అధికారుల్ని ఎప్పుడు కలవాలనే విషయం ఉంటుంది. దీంతోపాటు నోటీసులో వారు అడిగిన సమాచారం, లెక్కలు, సాక్ష్యాలు ఇవ్వమని ఉంటుంది. ఇవ్వన్నీ కూడా ఆయా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించే. మీరు సంబంధిత అధికారులను స్వయంగా కానీ, మీ అనుమతి పొందిన వ్యక్తిని పంపించి కానీ విషయాన్ని తెలుసుకోవచ్చు. అవసరమైతే వారు అడిగిన అన్ని వివరాలను ఇవ్వడానికి సమయాన్ని అడగవచ్చు. ఇలా మొదటి నోటీసుకు సమాధానమిస్తే అధికారుల దృష్టిలో మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు చట్టానికి సహకరించిన వారు అవుతారు. దీంతో వారు మీరు అడిగినంత సమయాన్ని ఇవ్వడమే కాకుండా మీకు సహకరిస్తారు. తర్వాతేంటి? ఆ తర్వాత మొదలౌతుంది అసెస్మెంట్ ప్రక్రియ. ఈ లోపల మీరు గతంలో దాఖలు చేసిన రిటర్ను నఖళ్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయ లెక్కింపుల్లో వేతనం, ఇంటి అద్దె, వ్యాపారం, మూల ధన లాభాలు, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం అనే ఐదు అంశాలు ఉంటాయి. ఇవి కాకుండా వ్యవసాయం మీద ఆదా యం, డివిడెండ్ వంటి పన్నుకి సంబంధించని ఆదాయాలూ ఉంటాయి. సాధారణంగా అసెస్మెంట్ వీటి పరిధిలోనే జరుగుతుంది. అందులో మీరు క్లెయిమ్ చేసిన తగ్గింపులు/మినహాయింపులుంటాయి. వీటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, అకౌంట్ పుస్తకాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, బిల్లులు, ముందస్తు పన్ను చలానాలు, టీడీఎస్ పత్రాలు, ఫారమ్ 16/16ఏ ఇలా ఎన్నో వాటిని సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఇతర వివరాలను అడగవచ్చు. మీరు అధికారులకు ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ నఖలును మీ దగ్గర ఉంచుకోండి. పైవిధంగా సహకరిస్తూ ఉంటే మీ అసెస్మెంట్ సజావుగా అవుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు 1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి 2. కె.వి.ఎన్ లావణ్య