Telangana leader
-
వ్యక్తిగత దూషణలకు మూలవిరాట్ కేసీఆర్
-
తొలి తెలంగాణ ఉద్యమనేత కన్నుమూత
మహబూబ్నగర్: 1969లో తొలి తెలంగాణ ఉద్యమనేత, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మసూద్ అలీ ఫారూఖీ(85) గురువారం హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రమాదవశాత్తు వెన్నెముకకు గాయం కావడంతో కొంతకాలంగా ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మహబూబ్నగర్లో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలి పారు. తొలితరం న్యాయవాదుల్లో ప్రముఖుడిగా పేరొందిన ఫారూఖీ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కు లీగల్ అడ్వయిజర్గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఆందోళనకారుల్లో స్ఫూర్తిని నింపారు. 80ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 60ఏళ్ల క్రితమే జిల్లా కేంద్రంలో తొలి ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించి వందలాది మంది విద్యార్థులను ఆంగ్ల భాషలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఆల్మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. -
'క్షమాపణలు చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకో'
హైదరాబాద్: ఎన్నికల సందర్బంగా రుణమాఫీపై రైతులకు ఆశలు కల్పించిన చంద్రబాబు... ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక అదే రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత చంద్రబాబు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై పాల్వాయి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రుణమాఫీపై హామీలిచ్చినప్పుడు తెలియదా ? అవి ఆచరణ సాధ్యం కానివని చంద్రబాబును ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు వెంటనే చంద్రబాబు మాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయాలేక పోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబుకు పాల్వాయి హితవు పలికారు. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, తన ఛాంబర్ హంగులకు చంద్రబాబు రూ. వందలాది కోట్లు దుబారా చేస్తున్నారని పాల్వాయి విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందుంచాలని పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబుకు సూచించారు.