tk ramamani
-
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి పేర్కొన్నారు. ఇందు కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 211.86 భూమి కేటాయించామన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి పర్యటక రంగ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి కోసం తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వద్ద 1.75 ఎకరాలు, లేపాక్షి జఠాయువు ప్రాజెక్టుకి 3.30 ఎకరాలు, లేపాక్షి యాంఫీ ధియేటర్ కోసం 2 ఎకరాలు, గుత్తిలో రోప్ వే కోసం 50 సెంట్లు కేటాయించామన్నారు. పర్యాటక ప్రాజెక్టు కోసం పెనుకొండలో 19.75 ఎకరాలు, తనకల్లు మండలం కోటిపల్లి వద్ద రూ.184.56 ఎకరాలు కేటాయించే భాగంలో అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం పర్యాటక రంగం పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యటక శాఖ రీజినల్ డైరెక్టర్ గోపాల్, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు వెంకటనారాయణ పాల్గొన్నారు. -
చిన్నారులందరికీ ఎంఆర్ టీకా తప్పనిసరి
అనంతపురం మెడికల్: జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులందరికీ మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయించాలని జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు. ఎంఆర్ క్యాంపెయిన్కు సంబంధించి లయన్స్ క్లబ్ అందజేసిన ప్రచార సామగ్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ఇతరత్రా ప్రాంతాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఆశకార్యకర్తలకు జూన్,జూలై ఇన్సెంటివ్ను త్వరగా విడుదల చేయాలని డీఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ డాక్టర్ అనిల్కుమార్, పీఓడీటీ సుజాత, యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్స్ దిలీప్కుమార్, రితీశ్ బజాజ్, డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో నాగరాజు, గంగాధర్, హెచ్ఈఓ సత్యనారాయణ, డీపీహెచ్ఎన్ రాణి, హెచ్ఈఈఓ లక్ష్మినరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగధనుల బాటలో నడవాలి
అనంతపురం అర్బన్: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు పాటుపడిన త్యాగధనుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో జాతీయపతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, జిల్లా ఖజానా డీడీ శర్మ, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలాజయరామప్ప, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఏడీ జయమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓలు వేణుగోపాల్రెడ్డి, రమేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.