TRC
-
టీఆర్సీ కంపెనీస్ చేతికి మ్యాజిక్మైండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాజిక్మైండ్స్ను టీఆర్సీ కంపెనీస్ కొనుగోలు చేసింది. 2010లో ఏర్పాటైన మ్యాజిక్మైండ్స్ సంస్థ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జీఐఎస్) కన్సల్టింగ్ సేవలు అందిస్తోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని యుటిలిటీస్, టెలికం సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్లో డెలివరీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. 130 మంది కన్సల్టెంట్లు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 40 పైగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నామని మ్యాజిక్మైండ్స్ డైరెక్టర్ చైతన్య చల్లా తెలిపారు. అటు 1969లో ఏర్పాటైన టీఆర్సీ అంతర్జాతీయంగా 1,000 పైచిలుకు సంస్థలకు టెక్నాలజీ ఆధారిత ఇంజినీరింగ్, కన్సల్టింగ్ తదితర సర్వీసులు అందిస్తోంది. చదవండి: భారత్లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
పొత్తు ముప్పు
సాక్షి, వరంగల్ రూరల్: ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ఢీకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు జట్టుకట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, మిగతా ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే పొత్తు కుదిరితే కొందరు ఆశావహులకు మొండి చేయి తప్పేలా లేదు. దీంతో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరితే టీడీపీ నాయకులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకటి నుంచి రెండు సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ జన సమితి సైతం ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో ఈ పార్టీలకు కేటాయించే సీట్లతో కాంగ్రెస్లో ఏ స్థానం గల్లంతవుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో తమ సీటు పొత్తులో గల్లంతయితే తమ పరిస్థితి ఏమిటని ఆశావహుల్లో ఆందోళన ప్రారంభమైంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారు అడుగుతున్న టికెట్లు ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల ఆశలు గల్లంతైనట్లేనని భావించవచ్చు. పరకాల నియోజకవర్గం.. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, గండ్ర జ్యోతి, ఆవేళి దామోదర్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నా టీడీపీ గెలుపొందిందని టీడీపీ వారు పరకాల టికెట్ను అడిగే అవకాశం ఉంది. వరంగల్ పశ్చిమ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వేం నరేందర్ రెడ్డి టికెటుఆశిస్తున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు పుల్లూరు అశోక్ కుమార్, టీజేఎస్ నుంచి శ్యాంసుందర్ రెడ్డి, తిరునహరి శేషు పోటీపడుతున్నారు. సీపీఐ వారు పొత్తులో భాగంగా టికెట్ ఈ అడిగే అవకాశం ఉంది. జనగామ జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు ప్రసాద్ బాబు, బొట్ల శ్రీనివాస్, కత్తుల రాజిరెడ్డి, టీజేఎస్ నుంచి తీగల సిద్ధుగౌడ్ టికెట్ అశిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారు జనగామ టికెట్ తప్పక కావాలని కోరుతున్నట్లు సమాచారం. పాలకుర్తి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీడీపీ నుంచి జాటోత్ ఇందిర టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా పాలకుర్తి టికెట్ కాంగ్రెస్కే అడిగినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం టీజేఎస్, సీపీఐ పోటీ పడడంలేదని తెలిసింది. డోర్నకల్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రామచంద్రునాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, టీజేఎస్ నుంచి తేజ నాయక్ టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ, సీపీఐ నుంచి పోటీలో ఎవరు లేరని తెలుస్తోంది. దీంతో పొత్తులో భాగంగా రామచంద్రునాయక్కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా పోటీ ఉంది. కాంగ్రెస్ నుంచి మున్సిçపల్ చైర్పర్సన్ ఉమా మురళీనాయక్ దంపతులు, మాజీ ఎంపీ బలరాం నాయక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుచిత్ర, పీసీసీ సభ్యుడు దస్రూ నాయక్, నునావత్ రమేశ్, టీడీపీ నుంచి భూక్యా సునీత, మోహన్లాల్, రాధ, టీజేఎస్ నుంచి పోరిక అభినందన టికెట్ ఆశిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామరావు, సింగపురం ఇందిర, టీడీపీ నుంచి శాగ రాజు, టీజేఎస్ నుంచి చింతం సాంబమూర్తి టికెట్ అశిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్ కోసం పట్టుబట్టే అవకాశముంది. భూపాలపల్లి.. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ నుంచి చాడ రఘునాథ రెడ్డి టికెట్ అశిస్తున్నారు. సీపీఐ, టీజేఎస్ నుంచి టికెట్ ఎవరు ఆశించడం లేదని తెలుస్తోంది. ఈ టికెట్ను పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఇవ్వాలని పట్టుబడుతున్న తెలిసింది. ములుగు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతక్క, పొదెం వీరయ్య, టీడీపీ నుంచి భూక్య జవహర్ నాయక్, నర్సయ్య ఆశిస్తున్నారు. కాంగ్రెస్లోనే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానాన్ని టీజేఎస్, సీపీఐ నుంచి ఎవరూ ఆశించడం లేదని సమాచారం. వర్ధన్నపేట వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్, నమిండ్ల శ్రీనివాస్ తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి తూల కుమారస్వామి, కొమ్ముల యాకయ్య ప్రయత్నిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఈ స్థానం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి కనిపించడం లేదా?
రెబ్బెన: స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ల చొరవతో రెబ్బెన మండలంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ఎంపీపీ కార్నాథం సంజీవ్కుమార్ ప్రశ్నించారు. గురువారం మం డల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వంకులంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలోనే రెబ్బె న మండలంలో అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ది చేయలేదని వ్యాఖ్యానించట్టా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అద్వానంగా ఉన్న అంతర్గత రోడ్లతో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రత్యేక చొరవతో మండలంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహాదారుల కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారన్నారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగయ్య, సర్పంచ్ గజ్జల సుశీల, నాయకులు చెన్న సోమశేఖర్, సుదర్శన్గౌడ్, శ్రీధర్, నవీన్ జైస్వాల్, చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్గౌడ్, వసంత్రావు, గజ్జల సత్యనారాయణ, రాజాగౌడ్, వినోద్జైస్వాల్ పాల్గొన్నారు. -
గ్రేటర్ పీఠం కోసం గ్ర్రేటర్ కసరత్తు
-
రేవంత్కి శిక్ష ఖాయమంటున్న నిపుణులు
-
సస్యశ్యామలం చేస్తాం
పాకాలకు జూరాల నీటిని రప్పిస్తాం వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతాం వంద శాతం హామీలు నెరవేరుస్తా పొన్నాల భూకబ్జాపై కలెక్టర్ స్పందించాలి ఆ భూములను తిరిగి దళితులకు ఇవ్వాలి {పచార సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ టౌన్, న్యూస్లైన్ : జిల్లాకు సాగు, తాగు నీరు అందించి సస్యశ్యా మలంగా మారుస్తామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మూడో దఫా హెలికాప్టర్ ద్వారా జిల్లాను చుట్టేశారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, నర్సంపేట, జనగామ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న భోజ్యానాయక్ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగా... వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్లో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల ఆక్రమిం చుకున్న భూములపై కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని కోరారు. ఆంధ్ర పార్టీల నేతలు 60 ఏళ్లుగా తెలంగాణను దోచుకుంటూనే ఉన్నారని... ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సోయిలోకి రావాలని, ఎవరిని గెలిపిస్తే తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణం, అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఉద్యమ గడ్డ ఘన్పూర్ స్టేషన్ఘన్పూర్ నియోజక వర్గం ఉద్యమాల గడ్డ అని, ఉప ఎన్నికల్లో రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిం చి ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. ఘన్పూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తానే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. ఉప ఎన్నికలు ఫలితాలు పునరావృతం కావాలని, సాధారణ ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని, ఘన్పూర్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను గెలిపించాలని ఆయన కోరారు. సభలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గట్టు రమేష్గౌడ్, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూరాల నుంచి పాకాలకు.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జూరాల, పాకాల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యావులం చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సవుగ్ర అభివృ ద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, వ్యవసాయు అభివృద్ధి ప్రాతిపదికలతో వుుందుకు సాగుతావున్నారు. నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం జూరాల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టి నర్సంపేటలోని పాకాలకు నీటిని తీసుకురావడం వల్ల వరంగల్ జిల్లాలో సాగు, తాగు నీరు సవుస్య తీరుతుందన్నారు. వ్యవసాయూనికి ఎనిమిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు వుూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు చేస్తే సహించబోవున్నారు. మన తలరాతలు మార్చే ఎన్నికలివి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక.. తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చేవని.. ఏమాత్రం ఏమరపాటుకు గురికాకుండా టీఆర్ఎస్కే ఓటు వేసి పట్టం కట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగామ ప్రెస్టన్ మైదానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే నీళ్లు లిఫ్ట్ చేయడం.. ఆంధ్రకు తెఫ్ట్ చేయడం అనేది ఇన్నాళ్లుగా జరిగిందన్నారు. జూరాల ఉంచి సక్కగా పాకాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా.. లిఫ్ట్ల పేరుతో ఆన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయం పొన్నాలకు తెలిసినా.. ఆంధ్ర ముఖ్యమంత్రులకు సేవలు చేస్తూ పట్టించుకోలేదని విమర్శించారు. 2003లో తాను బచ్చన్నపేట పర్యటనకు వచ్చినప్పుడు సభకు సుమారు 500 మంది వస్తే అందులో అందరు వృద్ధులే ఉన్నారని ఆ సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. ఇదేమని అడిగితే.. ఏడేళ్ల కరువుతో యువకులందరూ వలస వెళ్లారని చెప్పడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఉద్యమ తీవ్రతకు బచ్చన్నపేట కారణమైందన్నారు. తెలంగాణలో ముఠా, స్వార్థ, గ్రూపు రాజకీయాలు ఎక్కువ అభివృద్ధి జరగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను నిర్మించి.. వాటిని తానే స్వయంగా ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. అవసరమైతే తాను కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పూర్తి చేస్తామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జనగామలో పొన్నాల చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. దేవాదుల నీళ్లను ఎందుకు తెప్పించలేదని విమర్శించారు. పొన్నాల చేసిన అభివద్ధి... బొంద అభివద్ది, బోకే అభివద్ధి అంటూ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రాజెక్టులను పూర్తి చేసి జనగామ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ను గెలిపించాలని కోరారు.