TRS cadres
-
కారు.. పోరు!
గులాబీలో ఆధిపత్య పంచాయితీ ► సభ్యత్వ నమోదులో రచ్చకెక్కుతున్న విభేదాలు ► పాత, కొత్త నేతల మధ్య అంతరం ► మహేశ్వరంలో భౌతికదాడులకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీలో ఆధిపత్య పోరు మొదలైంది. పాత, కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య, సఖ్యతతో పార్టీ పరువు రచ్చకెక్కుతోంది. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అసమ్మతి రాజకీయాలకు వేదికగా మారింది. మొన్న జిల్లా పరిషత్ మొదలు.. నిన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమన్ గల్లో బయటపడిన విభేదాలు తాజాగా మహేశ్వరంలో వైరివర్గాల భౌతికదాడులతో తారస్థాయికి చేరాయి. సంస్థాగతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘ విరామం అనంతరం అధికారపార్టీ సభ్యత్వ నమోదు పేరిట ప్రజల్లోకి వెళుతోంది. ఇదే అదనుగా ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కాస్తా ఒక్కసారి పెల్లుబికుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత, కొత్త నేతల మధ్య స్పష్టమైన విభజనరేఖ వచ్చింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించింది. దీనికితోడు ఇటీవల నామినేటెడ్ పదవుల పంపకంలోనూ కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తుండడం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి కోపం తెప్పిస్తోంది. ఉద్యమకాలంలో వెన్నంటి నిలిచినవారిని కాదని ఎన్నికలఅనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నవారి మాట చెల్లుబాటు అవుతుండడం.. ఆఖరికి సభ్యత్వ నమోదు పుస్తకాలను ఎమ్మెల్యేలకే ఇస్తుండడం పార్టీని అంటిపెట్టుకున్న పాతతరం నాయకులకు మింగుడు పడడంలేదు. ఈ పరిణామాలు అధికారపార్టీలో ముసలానికి దారితీస్తున్నాయి. మొన్న జిల్లా పరిషత్లో జెడ్పీటీసీ సభ్యులు ఏకంగా మంత్రి మహేందర్రెడ్డిపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. రాజీనామాస్త్రాలు సంధించడం ద్వారా అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు. నయానో భయానో వారిని బుజ్జగించి దారిలో పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం టీఆర్ఎస్లో అంతర్యుద్ధానికి అద్దంపడుతున్నాయి. లుకలుకలకు కారణం ఇదే! 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినవారిని పార్టీలో చేర్చుకోవడంతో గులాబీలో అసమ్మతి రాజకీయాలకు బీజం పడింది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ‘కారె’క్కడంతో పార్టీలో విభేదాలకు కారణమైంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎల్బీనగర్, షాద్నగర్లోనూ అంతర్గతపోరు ఉన్నప్పటికీ, బహిర్గతం కాకపోవడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు కాస్తా సజావుగానే సాగుతున్నాయని అనుకోవచ్చు. పట్నంలో రెండు శిబిరాలు! ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్లో అంతర్యుద్ధం వీధికెక్కింది. మూడు గ్రూపులు.. ఆరు కీచులాటలతో పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కంచర్ల శేఖర్రెడ్డితో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. దీనికితోడు ఈసీ శేఖర్గౌడ్, ఎంపీపీ నిరంజన్ రెడ్డి తదితరులు కూడా మంచిరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శేఖర్రెడ్డితో జతకట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో హైకమాండ్ జోక్యం చేసుకున్నప్పటికీ గాడిలో పడ్డట్లు కనిపించడంలేదు. కల్వకుర్తిలో వేరుకుంపట్లు అసమ్మతి రాజకీయాల్లో కల్వకుర్తి తనదైన ముద్ర వేస్తోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వర్గీయులు బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న మాడ్గులలో జరిగిన ఓ కార్యక్రమంలోనే రెండు వర్గాలు కలియబడగా.. తాజాగా తలకొండపల్లి, ఆమన్ గల్ మండలాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మందా, జైపాల్యాదవ్ సమక్షంలో కసిరెడ్డి వైఖరిని తూర్పారబట్టడం ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ ఓటమికి కారణమైన నేతలను అందలం ఎక్కించడం.. కాంగ్రెస్ సర్పంచ్లకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తూ కసిరెడ్డిని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి సమావేశాల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూ మందా, జైపాల్యాదవ్ మాట్లాడడం పట్ల ఎమ్మెల్సీ వర్గీయులు మండిపడుతున్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతుంటే ఓర్వలేకనే ఈ కార్యకర్తల్లో ఆగాధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చేవెళ్లలోను సేమ్ సీన్ చేవెళ్ల నియోజకవర్గంలోనూ అధికారపార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే రత్నం.. ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. తనను ఓడించిన యాదయ్యను పార్టీలో చేర్చుకోవడంతో నిరాశకు గురైన రత్నం.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రవాణా మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్రెడ్డిలు పార్టీ ఫిరాయించిన యాదయ్య వర్గీయులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తన అనుచరులకు వెన్నుపోటు పొడుస్తున్నారని రత్నం మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం చేవెళ్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి సైతం ఆయన గైర్హాజరవడం.. సీనియర్లు ముఖం చాటేయడం చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అంతరం పెరుగుతుందని చెప్పవచ్చు. మహేశ్వరంలో డిష్యుం.. డిష్యుం మహేశ్వరంలో గులాబీ రాజకీయం ఠాణాకెక్కింది. పాత, కొత్త నేతల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరి.. అది కూడా భౌతికదాడులకు దారితీసింది. పార్టీకి మొదట్నుంచి సేవలందిస్తున్న కప్పాటి పాండురంగారెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన కొత్త మనోహర్రెడ్డిలతో ప్రస్తుత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో అభిప్రాయబేధాలున్నాయి. టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరిన తీగల.. తన అనుచరులకే పెద్దపీట వేశారు. తనను అనుసరించిన నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఇది సోమవారం మహేశ్వరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిషు్యం.. డిషు్యంకు తెరలేపింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని కప్పాటి ప్రశ్నించిన పాపానికి ఆయన మద్దతుదారులపై భౌతికదాడి జరిగింది. దీంతో సమావేశం కాస్తా రసబాసగా ముగిసింది. తన రాకతోనే పార్టీ బలోపేతమైందని.. కబడ్దార్! అంటూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వైరివర్గానికి సవాల్ విసరడం.. ఆ తర్వాత ఈ వివాదం కాస్తా పోలీస్స్టేషన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది. -
ఇందూరుకు నేడు ఎంపీ శీనన్న
♦ రాజ్యసభ సభ్యుడిగా మొదటి సారి జిల్లాకు.. ♦ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద స్వాగత ఏర్పాట్లు ♦ కృతజ్ఞతగా ‘కేసీఆర్ అన్నకు షుక్రియా’కు ర్యాలీ ♦ ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్ శ్రేణులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) నేడు జిల్లాకు రానున్నారు. ఇటీవలే రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన ఆయన తొలిసారిగా జిల్లాకు శుక్రవారం వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయలుదేరనున్న డీఎస్ మధ్యాహ్నం వరకు జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందూరు నుంచి అంచెలంచెలుగా పెద్దల సభకు ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్ ఎంపీగా మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, అనుచరులు భారీ ఏర్పా ట్లు చేశారు. డీఎస్ తనయుడు, మాజీ నగర మేయర్ ధర్మపురి సంజయ్(జూనియర్ డీఎస్) ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మునిపల్లి సాయరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి గ్రామాలు తిరిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు .. హైదరాబాద్ నుంచి 12.30 గంటలకు జిల్లాకు చేరనున్న రాజ్యసభ సభ్యులు డీఎస్కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, అభిమానులు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలుకుతారు. ఈ మేరకు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో వేలాదిగా శీనన్న అభిమానులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, నగర, రూరల్ నియోజకర్గ పార్టీ నాయకులుతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి నుంచి కార్లతో కాన్వాయ్గా మాధవనగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు చేరుకుంటారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో డీఎస్కు ఆయన అనుచరు లు ఘన స్వాగతం పలికి ‘బాబా’ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాలువ కప్పి సన్మానిస్తారు. ఆ తర్వాత డీఎస్కు ఎంపీగా కల్పిం చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు పార్టీ వర్గాలు ‘కేసీఆర్ అన్నకు షుక్రియా ర్యాలీ’ని చేపట్టనున్నారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సమావేశం మాధవనగర్ నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో డీఎస్ ర్యా లీని ప్రారంభించి అక్కడి నుంచి బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్నగర్, పులాంగ్ చౌరస్తా, వర్ని రోడ్డు, రాజరాజేంద్ర చౌరస్తా, బడాబజా ర్, ఆజాంరోడ్డు, నెహ్రూపార్క్ చౌరస్తా, గాంధీచౌక్, బస్టాండ్, స్టేషన్రోడ్డు మీదుగా రాజీవ్గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగించేం దుకు రూట్మ్యాప్ను తయారు చేశారు. అనంతరం రాజీవ్గాంధీ ఆడిటోరియంలో డీఎస్కు అభినందనసభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ స భ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న డీఎస్కు టీఆర్ఎస్ నాయకు లు, ఆయన అనుచరవర్గీయులు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా హరి తహారం కార్యక్రమం ప్రారంభిస్తుండగా.. అం దులో భాగంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద, మధ్యాహ్నం 1.30 గంటలకు మాధవనగర్ సా యిబాబా మందిరం వద్ద, మధ్యాహ్నం 3 గంట లకు రాజీవ్గాంధీ ఆడిటోరియంలో మొక్కలు నాటుతారు. -
నాగార్జునకు గాయాలు...కారు ధ్వంసం