TS-IPASS
-
ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. లంచం ఇవ్వకుంటే పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా నోటీసులు, తనిఖీల పేరుతో వేధిస్తామని పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. అన్నీ పద్ధతి ప్రకారమే దరఖాస్తు చేసుకున్నా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు..’’ టీఎస్ఐపాస్ కింద పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి రెవెన్యూ యంత్రాంగం లంచాలు వసూలు చేస్తున్న వైనంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఇదీ! దరఖాస్తు చేసుకున్నప్పట్నుంచీ పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు, ఆ తర్వాత కూడా ఆమ్యామ్యాలు లేనిదే రెవెన్యూ శాఖలో ఏ పనీ జరగడం లేదని ఈ నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదిక నేపథ్యంలో సీఎంవో కార్యాలయం ఇటీవలే రెవెన్యూ శాఖను హెచ్చరించింది. టీఎస్ఐపాస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అవినీతి రహిత కార్యకలాపాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సీఎం భావిస్తున్నారంటూ ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ సీఈవో పేరిట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. టీఎస్ఐపాస్ కింద పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో హెచ్చరించడం గమనార్హం. ఈ లేఖకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహారంపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశిస్తూ ఈ నెల 12న సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయినా.. తీరు మారలేదు సాక్షాత్తూ సీఎంవో నుంచి హెచ్చరికలు వచ్చినా క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఓ ప్రైవేటు విద్యుత్ సంస్థకు సంబంధించిన గ్యాస్పైప్లైన్లను కొన్ని భూముల్లోంచి వేసుకునేందుకు అనుమతినిస్తూ ఇటీవల ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆ ఉత్తర్వులను సదరు కంపెనీ సంస్థ ప్రతినిధికి అందజేసేందుకు లక్షల్లో డిమాండ్ చేసినట్టు తెలిసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తెప్పించుకున్న ఉత్తర్వులను కూడా చివరకు ఎంతో కొంత ముట్టజెప్పి తీసుకెళ్లాల్సిన పరిస్థితి! ఇదేగాకుండా రెండు అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు ఉత్తర్వులను ఇదే డిమాండ్తో నిలిపివేశారని సమాచారం. హైదరాబాద్ స్థాయిలోనే వసూళ్ల పర్వం ఇలా ఉంటే... క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకెలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
పరిశ్రమలకు 24గంటల విద్యుత్ సరఫరా
-
టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్
-
టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను శుక్రవారం హెచ్ఐసీసీలో ఆవిష్కరించారు. హెటెక్స్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్నారు. -
టీఎస్-ఐపాస్పై సిస్కో ఆసక్తి
సంస్థ చైర్మన్ను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్) పట్ల ప్రఖ్యాత నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆసక్తిని కనబరిచారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు శనివారం శాన్జోస్ నగరంలోని సిస్కో కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టీఎస్-ఐపాస్లోని కీలక అంశాలను సిస్కో చైర్మన్కు మంత్రి కేటీఆర్ వివరించారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానం, పరిపాలనా సౌల భ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జాన్ చాంబర్స్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న విస్తృత అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని సిస్కో చైర్మన్ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రంగంలో పేరుగాంచిన జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) సంస్థ మాజీ చైర్మన్ జాక్వెల్స్తో మంత్రి కేటీఆర్ సంభాషించారు. జాక్వెల్స్ వంటి పారిశ్రామిక వేత్త ఇచ్చిన సూచనలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు. అనంతరం శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్లో ది ఇండస్ ఎంటర్పెన్యూర్స్ ఏర్పాటు చేసిన టైకాన్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రత్యేకతలను వారికి వివరించారు. ఆపై సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్కోస్లాతో భేటీ అయిన కేటీఆర్.. సాంకేతిక రంగానికి సంబంధించి ప్రపంచంలో వస్తున్న అధునాతన మార్పులపై చర్చించారు.