TVK Government
-
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. -
టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్ఫామ్స్ వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు
'బాహుబలి' కట్టప్ప కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న నటుడు సత్యరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టాలిన్ ఓటమి తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీఎం విజయ్ తీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)స్టాలిన్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం అనే గౌరవం లేకుండా స్టాలిన్ని విజయ్ విమర్శించడం సరికాదు. మీకు బూతులు వస్తాయంటే నాకు మీకన్నా బాగా వస్తాయి. టీవీకే సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేసినా నేను ఎవరికీ భయపడను అని సత్యరాజ్ అన్నాడు.సీఎం విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడిన సత్యరాజ్.. పేర్లు మార్చితే సరిపోదు. ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చింది. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు. మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవసరముంది. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలి. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారు. ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇకపోతే సత్యరాజ్.. డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తుండగా ఈయన కొడుకు శిబి సత్యరాజ్ మాత్రం విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్) -
టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ప్రజలకు సరైన సేవ చేయలేకపోతున్నామని చెబుతూ 300 మందికి పైగా ఆ పార్టీ సభ్యులు టీవీకేలో చేరారు. శనివారం చెన్నై సమీపంలోని పనయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా వారు టీవీకేలో చేరి, సీఎం విజయ్ నాయకత్వాన్ని కొనియాడారు.టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మైలాపూర్ మాజీ ఎమ్మెల్యే నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమక్కుడి మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ నగర కార్యదర్శి డిటి కుమార్, మరో 300 మందికి పైగా ఉన్నారు.టీవీకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ ఆనంద్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఈ చేరిక జరిగింది.మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు ఉదుమలై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తనతో పాటు త్రిచి ఎన్ ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఎంసి సంపత్, పన్నీర్సెల్వం, గోవిందసామి, కొలత్తూర్ కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకులు అధికార టీవీకేలో చేరినట్లు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె హయాంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కఠిన క్రమశిక్షణ పాటించారని, ఆమె మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అన్నాడీఎంకేలో కొనసాగినా, ప్రజలకు సమర్థంగా సేవ చేయలేకపోయామని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశామని రాధాకృష్ణన్ తెలిపారు.ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్లో ఎంజీఆర్, జయలలిత ఆశయాలు కనిపిస్తున్నాయని, టీవీకేలో లభించిన గౌరవం, గుర్తింపే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. టీవీకే కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తూ యువ నాయకత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.పార్టీ క్రమశిక్షణ పట్ల తమ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నమ్మకంగా నిర్వర్తిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి కార్యకర్తలు, సీనియర్ అన్నాడీఎంకే నాయకులు మరింత మంది టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సెంగొట్టైయన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని నమ్మి తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని చెప్పారు. "భారత చరిత్రలో పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే విజయం సాధించిన ఉద్యమం ఏదైనా ఉంటే అది తమిళగ వెట్రి కళగమే. ఎన్ని కూటములు ఏర్పడినా, తమిళ నేలపై పుట్టిన ఎవరూ తమిళనాడులో మా ఉద్యమాన్ని ఓడించలేరు. స్వచ్ఛమైన పాలన అందించగల నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. అది సాధించగల వ్యక్తి ఆయనే. ఎప్పటికీ విజయ్ తమిళనాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను విప్లవ నాయకుడు ఎంజీఆర్తో ప్రయాణించాను. విప్లవ నాయకురాలు అమ్మతో కూడా కలిసి పనిచేశాను. విశ్వాసం లేని వారు గెలిచారు. ఇతరులను నమ్మిన వారు ఓటమిని చూశారు" అని అన్నారు.ఇదే కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. సెంగొట్టైయన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించే విషయంలో టీవీకే ప్రభుత్వం మాజీ డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను మించి పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గాలతో పోల్చుతూ.. వారి వారసత్వాన్ని టీవీకే ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు."అన్నా, ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మలా నిజాయితీగా ఎదిగిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మేము ముందే చెప్పాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న పార్టీల నాయకులతో కూర్చున్నారని సెంగొట్టైయన్ను అన్నాఏడీఎంకే సభ్యులు ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎంజీఆర్ మంత్రివర్గంలో మంత్రి. కుమార్ అమ్మ మంత్రివర్గంలో మంత్రి. ఇప్పుడు ఇద్దరూ జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు" అని చెప్పారు. -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
‘‘సీఎం విజయ్ను ఎంజీఆర్తో పోల్చడమేంటీ?’’
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది. అభిమాన సంఘాల నెట్వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్లా చాలా సంవత్సరాలు విజయ్ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్తో విజయ్ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కే కృష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్ను చూడొద్దు. నేను విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.సినిమాలు చూసి ప్రభావితమయ్యారు.. ‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృష్ణస్వామి అన్నారు.విజయకాంత్, శరత్కుమార్, భాగ్యరాజ్ వచ్చారు.. ‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి. ఇప్పటి కాలం మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
తమిళనాట భారీ ట్విస్ట్.. విజయ్, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్మీట్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎం విజయ్పై ఘాటు వ్యాఖ్యలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్స్ట్రాగామ్, రీల్స్లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.సొంత ఆలోచన లేదుప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు. -
విజయ్ని అడిగితే.. డిప్యూటీ సీఎం ఇచ్చేవారు: ప్రేమలత
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పళనిస్వామి తీరుపై ఫైర్2024 లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫస్ట్ టైమ్ ప్రజల్లోకి విజయ్.. రేపు తిరుచ్చిలో పర్యటన
సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు. చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. -
విజయ్కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. -
ఆలయంలో మంత్రి రహస్య తనిఖీ.. అడ్డంగా దొరికిన అర్చకులు!
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ మురుగన్ ఆలయం తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో వీఐపీ, ప్రత్యేక దర్శనాల పేరిట అర్చకులు, సిబ్బంది భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హిందూ ధారి్మక దేవదాయ శాఖ మంత్రి రమేష్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయంలో ఒక సామాన్య భక్తుడిలా మారి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లంచం డిమాండ్ చేసిన అర్చకులు డిజిటల్ ఆధారాలతో సహా మంత్రికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. డిజిటల్ చెల్లింపు.. రెడ్ హ్యాండెడ్ ఆధారాలు ప్రస్తుతానికి తన వద్ద నగదు లేదని చెప్పిన మంత్రి, అక్కడి అర్చకుడి గూగుల్ పే నంబర్కు రూ.4వేలు ఆన్ లైన్ ద్వారా బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్లో పడ్డాయని అర్చకులు నిర్ధారించుకున్న మరుక్షణమే, మంత్రి తన ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి తానెవరో బయటపెట్టారు. డిజిటల్ లావాదేవీ ఆధారాలు సహా దొరకడంతో అర్చకులు, వారికి సహకరించిన సిబ్బంది షాక్కు గురయ్యారు. అక్రమాలకు పాల్పడిన అర్చకులను, సిబ్బందిని ఆలయ కార్యాలయానికి పిలిపించి మంత్రి రమేష్ వారి నుంచి లిఖితపూర్వక వివరణ లేఖలను తీసుకున్నారు.ఆ తర్వాత ఆయన అన్నదాన సముదాయానికి వెళ్లి సాధారణ భక్తులతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అక్కడ పంపిణీ చేసే అన్నదాన టోకెన్ల జారీలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. ఆలయ ఆస్తులు, నెలవారీ ఆదాయం, పరిపాలనాపరమైన అంశాలపై కూడా మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ వ్యవహారంపై మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నెట్లో తాజా తనిఖీలకు సంబంధించిన తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు. లంచం వసూలు చేసిన వారి నుంచి క్షమాపణ లేఖ తీసుకోలేదని, కేవలం వివరణ లేఖ మాత్రమే కోరామన్నారు. ఆలయ అన్నదానం, ఆస్తుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నామని అన్నారు. ఈ విచారణ నివేదిక వచ్చిన తర్వాత, తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, ఎలాంటి పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సామాన్యుడిలా మంత్రి చేసిన ఈ ఆకస్మిక తనిఖీలను ఆలయానికి వచ్చిన భక్తులు అభినందించారు.ఒక సామాన్య భక్తుడిలా మంత్రి ఎంట్రీ మంత్రి రమేష్ తన అధికారిక వాహనాన్ని ఆలయ సముదాయానికి దూరంగా నిలిపివేసి, ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ టీషర్ట్, మాస్క్ ధరించి తన సహాయకుడితో కలిసి కాలినడకన ఆలయంలోకి ప్రవేశించారు. శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలని మంత్రి సహాయకుడు అక్కడి అర్చకులను విచారించారు. వచ్చిన వ్యక్తి మంత్రి అని తెలియని అర్చకులు, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నలుగురికి కలిపి మొత్తం రూ.4వేలు ఇస్తే వెంటనే వీఐపీ దర్శనానికి తీసుకెళ్తామని బేరసారాలు మొదలెట్టారు. -
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రధాని మోదీతో సీఎం విజయ్ భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విజయ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంగీకారం లేకుండా అనుమతి ఇవ్వొద్దని విజయ్ కోరారు. దీనిపై తమిళనాడు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్ కలవనున్నారు.తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాలపై విజయ్ చర్చిస్తారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఇతర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారు. -
ఇది తమిళనాడా లేదా యూపీనా..?
తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు. వరుస నేరాల తో విమర్శల దాడి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు. సీఎం నియోజకవర్గంలోనే అరాచకం స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. -
వారితో జాగ్రత్త.. విజయ్కు తమిళిసై హెచ్చరిక
సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్కు అలవాటేనని, జాగ్రత్తగా ఉండాలని సీఎం విజయ్కు బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఆదివారం చైన్నెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందన్నారు. తమ విజయాల్లో డీఎంకే పాత్ర ఏమీ లేదని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్కు ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్లూ తమతో ఉన్న డీఎంకేకే వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ.. రేపు సీఎం విజయ్కు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడదని హెచ్చరించారు.అన్నాడీఎంకే విషయంలో త్వరలో నిర్ణయం..మరోవైపు.. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలనే విషయంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ.. రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తనకు వినతిపత్రాలు సమర్పించాయన్నారు.ఆ వినతిపత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోందన్నారు. తనపై ఆరోపణలు చేసే వారికి కూడా అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో, తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తాననని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుందని స్పీకర్ వివరించారు. -
ట్రోలింగ్ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన
సాక్షి, చైన్నె: ‘నేను సహజంగా నవ్విన నవ్వును కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... దానికి రాజకీయ రంగు పూసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా కలచివేసింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ వివరణను పోస్ట్ చేశారు.ట్రోలింగ్ చేయడం సరికాదుపరిశ్రమల శాఖ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్మీట్లో విలేకరుల ప్రశ్నలు–సమాధానాలు ముగిసిన తరుణంలో తాను సహజంగా నవ్వాననని, అది ఏ ఒక్క ప్రశ్నకో లేదా రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఘటనకో వ్యతిరేకంగా చేసిన ప్రతిబింబం కాదన్నారు. అయితే తన తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్ను తప్పుగా చిత్రీకరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నెగిటివ్గా ప్రచారం చేయడం బాధాకరం అని మంత్రి కీర్తనా పేర్కొన్నారు. இவர்கள் எல்லாம் மனிதர்களா...பத்து வயது சிறுமி பாலியல் வன்கொடுமைக்கு ஆளாக்கப்பட்டு மிகக் கொடூரமாக கொலை செய்யப்பட்டது தொடர்பாக செய்தியாளர்கள் கேள்வி கேட்டால் அமைச்சர் @Keerthana4VNR வுக்கு சிரிப்பு வருகிறது 🤬🤬🤬 pic.twitter.com/eALA6Cx8IV— Sivan - DMK (@SSivanDMK) May 24, 2026ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడులకు దిగడం , సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ట్రోలింగ్ చేయడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే కావచ్చని, అయితే, ఒకరి వ్యక్తిగత క్షణాలను అస్త్రంగా మార్చుకుని నిజాన్ని వక్రీకరించడం సమాజానికి ఆరోగ్యకరమైన పద్ధతి కాదని హితవు పలికారు.தொழில்துறை தொடர்பான அறிமுகக் கூட்டத்தை முடித்து பத்திரிகையாளர்களை சந்தித்து வெளியே வந்தபோது, கேள்வி-பதில்கள் முடிந்த தருணத்தில் இயல்பாக நான் சிரித்தேன். அது எந்தக் கேள்விக்கும் அல்லது சம்பவத்திற்கும் எதிரான பிரதிபலிப்பல்ல. ஆனால் அந்த உடல் மொழியை தவறாகப் புரிந்து கொண்டு, அரசியல்…— Virudhai Magal Keerthana (@Keerthana4VNR) May 24, 2026మరోవైపు.. మైనర్ హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్మీట్లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్లో నవ్వులాటలు సాగిస్తూ.. మీడియా ముందే నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.Insensitive 🤦🤦🤦 pic.twitter.com/xiMg9toeb7— Rajasekar (@sekartweets) May 24, 2026అసలు ఏం జరిగింది?కోయంబత్తూర్లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. -
10 ఏళ్ల బాలిక కిడ్నాప్, హత్య.. సీఎం విజయ్ ఏం చేశారంటే..?
చెన్నై: కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ విషాదంగా ముగిసింది. తాజాగా తీవ్ర గాయాలతో కూడిన ఆ బాలిక మృతదేహం సూలురులోని కన్నంపాల్యం లేక్ వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇటువంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 21వ తేదీ గత గురువారం రోజు సాయంత్రం సూలూరులో ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోహాన్ రాజ్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అపహరించారు. అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తాము మార్పు కోసం సీఎం విజయ్కు ఓటేశామని ఇప్పుడు ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి స్పందించేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.దీంతో ఈ నిరసనల నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం విజయ్ స్పందించారు."నిన్న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణ ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని" అని Xలో పోస్ట్ చేశారు.అయితే ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ సీరీయస్గా ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులను ఆ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే సుకుమార్ కలిశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే, లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, అధికార పార్టీ సభ్యుల దురుసు ప్రవర్తన, అరాచకాలు విపరీతంగా పెరిగి పోయాయాని ఇప్పుడు ఏకంగా బాలిక అపహరణ, అనంతరం హత్య జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తుందన్నారు. కేవలం 12 రోజుల్లోనే 30కి పైగా ప్రధాన ఘటనలు వార్తల్లోకి వచ్చాయని రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
విజయ్ గవర్నెన్స్ ఫాక్ట్ చెక్.. 108 సీట్లు..1000 అబద్దాలు ?
-
.............
– వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణసాక్షి, చైన్నె : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.వివాదం ఏమిటంటే..?ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ:ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు.


