లండన్ దాడి మా పనే: ఐసిస్
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై ఉగ్రదాడి చేసింది తమ మద్ధతు దారుడేనని ఐసిస్ చెప్పుకొచ్చింది. మా సంస్థకు చెందిన వ్యక్తే దాడిలో పాల్గొన్నాడని ఐసిస్ తెలిపింది. ఓ ముష్కరుడు దాడి చేసిన ఘటనలో బుధవారం నలుగురు చనిపోయిన సంగతి తెల్సిందే.
ఐసిస్ తన ఉగ్ర గ్రూపు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రదాడిలో పాల్గొన్నది ఐసిస్ సైనికుడని, మా గ్రూపు వ్యక్తి ఇలా చెయ్యడం మాకు సంతోషాన్ని ఇచ్చిందని ఐసిస్ మీడియాకు వెల్లడించింది.