breaking news
Vaibhav Suryavanshi
-
సిరాజ్తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు!
దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నమెంట్ దులిప్ ట్రోఫీ-2026 సీజన్ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబరు 6న మొదలయ్యే ఫైనల్లో ఈస్ట్ జోన్- సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదిక.ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపుఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఆడాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ముగ్గురు టీమిండియా స్టార్లకు పిలుపు వచ్చినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, శతకాల వీరుడు దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు PTI వెల్లడించింది.కాగా ఈ ముగ్గురూ ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడారు. అయితే, సాయి సుదర్శన్ గాయం కారణంగా దూరం కాగా.. పడిక్కల్ ఊహించని రీతిలో తుదిజట్టులోకి వచ్చాడు. మూడో స్థానంలో వచ్చి రెండు సెంచరీలతో అలరించాడు.మళ్లీ దేశీ క్రికెట్ బరిలోతదుపరి న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉండగా.. పడిక్కల్ మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగుతుండటం విశేషం. దులిప్ ట్రోఫీ ఫైనల్లోనూ సత్తా చాటి టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని పడిక్కల్ పట్టుదలగా ఉన్నాడు.ఇక కేఎల్ రాహుల్తో పాటు పడిక్కల్ కూడా దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు చివరగా ఫిబ్రవరి 2026లో జమ్మూ కశ్మీర్తో రంజీ ట్రోఫీ ఫైనల్లో బరిలోకి దిగారు. అయితే, జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఇక సిరాజ్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.స్టార్ల మధ్య పోరు దులిప్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్ సౌత్ జోన్కు ఆడనున్నారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ తిలక్ వర్మ కెప్టెన్. మరోవైపు.. ఈస్ట్ జోన్ను ఫైనల్కు చేర్చడంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషించాడు. ఈ జట్టుకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ కాగా.. వైభవ్ అతడికి డిప్యూటీ.టీమిండియా స్టార్ల రాకతో దులిప్ ట్రోఫీ ఫైనల్ మరింత రసవత్తరంగా మారనుంది. తిలక్ వర్సెస్ ఇషాన్ పోరులో.. రాహుల్, పడిక్కల్, సిరాజ్... వైభవ్ సూర్యవంశీ ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ జోన్లో తనయ్ త్యాగరాజన్ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేస్తున్నట్లు సమాచారం.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ -
దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?
-
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! అస్సలు ఊహించి ఉండడు?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జాతీయ టీ20 జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న శాంసన్ను.. అఫ్గానిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. దీంతో అఫ్గాన్ సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. జింబాబ్వే టూర్లో శాంసన్ లేకపోవడంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ప్రారంభించారు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో సంజూ విఫలం కావడంతో సూర్యవంశీకి ఓపెనర్గా అవకాశమిచ్చారు. కానీ సంజూ స్ధానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ కూడా తీవ్ర నిరాశపరిచాడు.దీంతో ఇంగ్లండ్తో ఆఖరి టీ20కు వైభవ్ను తప్పించి శాంసన్ను మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఆ మ్యాచ్లో శాంసన్ 27 పరుగులు సాధించి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. అయినప్పటికి ఆ తర్వాత జింబాబ్వే టీ20 సిరీస్కు అతడిని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. టీ20 ప్రపంచకప్ హీరోని జట్టు నుంచి తప్పిస్తారా? అని సెలక్టర్లపై చాలా మంది మాజీలు మండిపడ్డారు. అయితే అతడిని జట్టు నుంచి తప్పించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బీసీసీఐ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంజూ టీ20 జట్టులోకి వచ్చాడు.ఈ క్రమంలో సంజూ రాకతో వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. ఎప్పటిలాగే భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే 15 ఏళ్ల సూర్యవంశీ బెంచ్కు పరిమితం కావాల్సిందే. ఒకవేళ శాంసన్ విఫలమైతేనే వైభవ్కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టుకు సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్తో సిరీస్ ప్రారంభం కానుండటంతో, తొలి మ్యాచ్ ఎంపికకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది.చదవండి: అతడు జట్టులో ఎందుకు? ముగ్గురిలో.. ఇద్దరు ఫిట్గా లేరు.. గ్రేట్! -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
రింకూ సింగ్ విఫలం.. వైభవ్ సూర్యవంశీ దంచికొడితే!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది.నామమాత్రపు లక్ష్యంతద్వారా ఈస్ట్ జోన్కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్.. సెంట్రల్ జోన్ను 266 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్, అభిజీత్ సర్కార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్అనంతరం బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్ మాత్రం టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్ దంచికొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.చెలరేగిన ముకేశ్ కుమార్, షమీఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (41) రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో అతడిదే టాప్ స్కోరు.Superb bowling 🙌Mukesh Kumar outsmarts Aman Mokhade with an excellent setup👌#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/voMx1Bt43n— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026మిగిలిన వారిలో రింకూ సింగ్ (20) నిరాశపరచగా.. హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్ రాయ్, ఎండీ కౌనియన్ ఖురేషి, అభిజిత్ సర్కార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఇక సౌత్ జోన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్ జోన్ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్లో మాదిరే వైభవ్ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్ జోన్ సులువుగానే ఫైనల్ చేరడం ఖాయం.చదవండి: భారత్తో సిరీస్.. ఆసీస్ జట్ల ప్రకటన -
కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా
-
సచిన్ను వెంటాడిన ఫోబియా వైభవ్కు అంటుకుందా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు (అన్ని ఫార్మాట్లు) సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉండేది. ఈ కారణంగా సచిన్ చాలాసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఒకవేళ సచిన్కు 90 ఫోబియా లేకపోయుంటే అతడి ఖాతాలో 150 సెంచరీలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా చిన్న వయసులోనే క్రికెట్లో అడుగుపెట్టి సచిన్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీని కూడా 90 ఫోబియా చుట్టుముట్టేసింది. ఈ మధ్యకాలంలో వైభవ్ తొంభైల్లో చాలాసార్లు ఔటయ్యాడు.ఇటీవలి కాలంలో ఐపీఎల్ నుంచి దేశవాళీ టోర్నీలు, అనధికారిక మ్యాచ్లు చూసుకుంటే వైభవ్ వరుసగా 93 (38 బంతుల్లో), 97 (29 బంతుల్లో), 96 (47 బంతుల్లో), తాజాగా దులీప్ ట్రోఫీలో 92 పరుగుల వద్ద సెంచరీలకు అతి సమీపంలోకి వచ్చి అవుట్ అయ్యాడు. ఇలా ఇప్పటికే నాలుగు సెంచరీలను చేజార్చుకున్నాడు.ఏమిటీ నెర్వస్ నైంటీస్?90 ఫోబియాను క్రికెట్ పరిభాషలో "నెర్వస్ నైంటీస్" (Nervous Nineties) అని పిలుస్తారు. ఒక బ్యాటర్ సెంచరీ (100 పరుగులు) మైలురాయికి చేరుకునే ముందు, 90 నుండి 99 పరుగుల మధ్య ఒత్తిడికి గురై అవుట్ అవ్వడాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా బ్యాటర్లు 90ల్లోకి రాగానే సెంచరీ కోసం కాస్త నెమ్మదిగా ఆడతారు. ఈ తరుణంలో అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్ను ఇచ్చేసుకుంటారు. సచిన్ తన కెరీర్లో చాలాసార్లు ఈ నెర్వస్ నైంటీస్ను ఎదుర్కొన్నాడు. తాజాగా వైభవ్ను కూడా నెర్వస్ నైంటీస్ ఫోబియా చుట్టుముట్టినట్లుగా అనిపిస్తోంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (5), ఆర్యన్ పాండే (4) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌటైంది.HEARTBREAKING MOMENT FOR VAIBHAV SOORYAVANSHI !💔Vaibhav Suryavanshi missed his maiden century in the Duleep Trophy by just 8 runs. - Just look at the reaction of Vaibhav Suryavanshi 😭😭 pic.twitter.com/BYA3KPUSc3— lndian Sports Network (@IS_Netwrk29) August 31, 2026Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్ -
పాపం వైభవ్ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ పదిహేనేళ్ల పిల్లాడు మరోసారి తృటిలో చేజార్చుకున్నాడు. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2026లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భాగంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ అయిన వైభవ్ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్తో మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్కు అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 ఇదే జోరు కొనసాగిస్తూ వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్ష్ దూబే బౌలింగ్లో అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్కు చేరాడు. మొత్తంగా 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదిన వైభవ్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 93. ఇప్పుడు 92 పరుగుల వద్ద అవుటై దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు.తొలి ప్లేయర్గా ఘనతకాగా సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అత్యంత పిన్న వయసులోనే దులిప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.ఆల్ టైమ్ రికార్డు మిస్అయితే, కాస్త నెమ్మదిగా ఆడి ఉంటే.. దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే శతక్కొట్టిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ ఆల్టైమ్ రికార్డు సాధించేవాడు. కానీ హర్ష్ దూబే బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్ విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్షద్ క్యాచ్ పట్టడంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. ఇదిలా ఉంటే.. అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.భోజన విరామ సమయానికి ఈస్ట్ జోన్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 58, సుదీప్ కుమార్ ఘరామీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు. వైభవ్ అవుటైన వెంటనే వన్డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: అదంతా నాటకం: పాక్ ఓపెనర్పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్జోన్ తాత్కాలిక కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 15 ఏళ్ల వైభవ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 92 పరుగులు చేసి తన ఫస్ట్క్లాస్ సెంచరీని తృటిలో చేజార్చకున్నాడు. కాగా ఈ ఫైరీ ఫిప్టీతో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయస్సులో సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 1969లో 16 ఏళ్ల 23 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో 57 ఏళ్ల లక్ష్మణ్ సింగ్ రికార్డ్ను వైభవ్ బద్దలు కొట్టాడు.తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 25 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్(53), ఎస్ కుమార్(4) ఉన్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు.చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్ బ్రేక్100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 strong> -
పాపం సంజూ..! వైభవ్ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించని మలుపు!
శ్రీలంకతో టెస్టు సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20ల్లో అఫ్గానిస్తాన్తో తలపడేందుకు సిద్దమైంది. న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 13 నుంచి భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 3న ప్రకటించనున్నారు.అయితే జింబాబ్వే టూర్కు దూరమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్ను స్క్వాడ్లోకి తీసుకున్నా తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే ఓపెనర్గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనను నిరూపించుకున్నాడు.మరోసారి భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ప్రారంభించే అవకాశముంది. అలాగే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కే యాజమాన్యం మొగ్గు చూపుతుండటంతో, సంజూ బెంచ్కే పరిమితం కాక తప్పదు. ఒకవేళ వైభవ్ లేదా ఇషాన్ విఫలమైతే శాంసన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కనుంది. మరోవైపు ఫిట్నెస్ సమస్యల కారణంగా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించడంతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పేస్ బౌలింగ్ బాధ్యతలను అర్ష్దీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు. జింబాబ్వే టూర్కు దూరంగా ఉన్న అర్ష్దీప్ అఫ్గాన్ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. రీఎంట్రీలో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన స్ధానాన్ని నిలబెట్టుకోనున్నాడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవిబిష్ణోయ్లకు చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అఫ్గానిస్తాన్తో టీ20లకు భారత జట్టు(అంచనా)శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్చదవండి: 11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్ -
అంపైర్కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడడడంతో వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ అద్భుతమైన రివ్యూతో సెంట్రల్ జోన్ స్టార్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ను పెవిలియన్కు పంపాడు.సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ తొలి బంతిని జుయల్కు ఔట్ సైట్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఆర్యన్ జుయల్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్తో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ వైభవ్ మొదట రివ్యూ తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. అయితే సహచర ఆటగాళ్లతో చర్చించి 3 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ డీఆర్ఎస్కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ 'అల్ట్రాఎడ్జ్' పరిశీలించగా బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్గా ప్రకటించాడు. 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ చూపించిన సమయస్ఫూర్తికి జట్టు సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్కు ‘కాశ్మీర్ ఎక్స్ప్రెస్’ ఆకిబ్ నబీ!Stand-in Captain Vaibhav Sooryavanshi goes for the review with 3 seconds remaining...and gets it right 👏DRS done right as the set Aryan Juyal (46) is dismissed ✅The celebrations say it all 🙌#DuleepTrophy pic.twitter.com/IwBQbr8hJQ— BCCI Domestic (@BCCIdomestic) August 30, 2026 -
15 ఏళ్లకే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్గా నియమితుడయ్యాడు.CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥- Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD— Johns. (@CricCrazyJohns) August 30, 2026రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్ -
వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు!
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టాప్ 5 ఆల్-ఫార్మాట్ ప్లేయర్లను ఎంచుకున్నాడు. ఈ జాబితాలో భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్కు అగ్రస్ధానం దక్కింది.ఆ తర్వాత రెండో స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు కార్తీక్ ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్దానాల్లో హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్), యశస్వి జైశ్వాల్(భారత్)కు చోటు దక్కింది. చివరగా ఐదో స్దానంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు డీకే అవకాశమిచ్చాడు.కాగా టాప్ ప్లేస్లో ఉన్న శుబ్మన్ గిల్ గత కొంత కాలంగా వన్డే, టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. భారత టీ20 జట్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కారణంగానే గిల్ను ఆల్ఫార్మాట్ ప్లేయర్గా కార్తీక్ ఎంపిక చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా మూడు ఫార్మాట్లలోనూ ఆసీస్కు కీలక ప్లేయర్గా మారాడు. తన దూకుడు బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా అతడిది. ఇక ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాక్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ దుమ్ములేపుతున్నాడు. అయితే యశస్వి జైశ్వాల్, రచిన్ రవీంద్రలు మాత్రం గత కొంతకాలంగా తమస్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయినప్పటికి డికే వారికి బెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ల జాబితాలో అవకాశమిచ్చాడు. కాగా ఈ లిస్ట్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు ఇచ్చి ఉంటే బాగుండేది అని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే వైభవ్ ఇంకా భారత జట్టు తరపున టెస్టు, వన్డే డెబ్యూ చేయనుందున కార్తీక్ ఈ లిస్ట్లో చోటు ఇవ్వలేదు.చదవండి: ‘బౌలింగ్ ఇవ్వమని పేచీ.. క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయా’ -
బుడ్జోడి ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్.. ఆస్ట్రేలియా సిరీస్ లో నో ఛాన్స్.. అసలు కారణం ఇదే
-
వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.I want to use my X payout to support a needy student’s education📚If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని వైభవ్ నిన్ననే (ఆగస్ట్ 28) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.వైభవ్ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, వైభవ్ స్వతహాగా ఇంకా స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్యాట్తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్ జోన్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్లో ఆ జట్టు సెంట్రల్ జోన్తో తలపడనుంది. చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా -
నో శ్రేయస్, నో వైభవ్.. నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్కు పంపే జట్టు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సందిగ్దంలో పడినట్లు సమాచారం. జపాన్లో జరిగే ఈవెంట్కు ద్వితీయ శ్రేణి జట్టును పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను తొలగించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.అయ్యర్ కెప్టెన్సీలోఈ క్రమంలో జూన్లోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించిన యాజమాన్యం.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి ఆసియా క్రీడల తాజా ఎడిషన్ మొదలుకానుంది.తీవ్ర అసంతృప్తి!జపాన్లోని ఐచి నగోయా ఇందుకు వేదిక. అయితే, అక్కడ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి సరైన వసతులు ఇంకా ఏర్పాటు చేయలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ మండలి సైతం జపాన్లోని క్రీడా వేదిక వద్ద ఉన్న సదుపాయాలతో సంతృప్తిగా లేదు.అందుకే ముందుగా అక్కడికి ఒక అబ్జర్వర్ను పంపించాలనకుంటున్నాయి. అబ్జర్వర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే జట్టు మార్పు విషయంలో నిర్ణయం ఉంటుంది. ఒకవేళ సరైన వసతులు అక్కడ లేనట్లయితే.. ద్వితీయ శ్రేణి జట్టును పంపే అవకాశం ఉంది.మరీ టెంట్లలోనా?ఈ విషయం గురించి ఇప్పటికే మేము జపాన్ ఒలింపిక్స్ అధికారులతో మాట్లాడాము. డ్రెసింగ్రూమ్లను టెంట్లలో ఏర్పాటు చేశారు. వాష్రూమ్లు టెంట్లకు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు. ఆటగాళ్లు కచ్చితంగా అసంతృప్తికి లోనవుతారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అందుకే బి- టీమ్?ఇక పిచ్ కూడా అత్యంత నాసిరకంగా ఉందని బీసీసీఐతో పాటు పాకిస్తాన్ బోర్డు ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ను కనీసం రెండు వేల మంది ప్రేక్షకులు అయినా వీక్షించేలా స్టేడియం ఉండాలి. కానీ జపాన్లో అలాంటి పరిస్థితి లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తమ ద్వితీయ శ్రేణి జట్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు స్వర్ణ పతకాలు సాధించాయి.ఆసియా క్రీడలకు భారత పురుషుల టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.మహిళల టీ20 జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.చదవండి: భారత జట్టులో లేని వైభవ్.. కారణం ఇదే! -
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యూత్ వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్లకు చోటు దక్కింది. ఇప్పటికే అన్వయ్ భారత అండర్-19 జట్టు తరఫున ఆడినప్పటికీ, ఆర్యవీర్ ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే ఈ జట్టులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి సత్తా చాటిన వైభవ్కు ఈ జూనియర్ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సూర్యవంశీని ఆసీస్తో సిరీస్కు ఎంపిక చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది.బీసీసీఐ 2016లో ఒక కీలక నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం.. వయస్సు పరంగా అర్హత ఉన్నప్పటికీ ఆటగాళ్లు కేవలం ఒక్క అండర్-19 ప్రపంచకప్లో మాత్రమే పాల్గొనాలి. సూర్యవంశీ ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచకప్లో ఆడాడు. దీంతో అతడు మరో ఎడిషన్లో పాల్గొనేందుకు అర్హుడు కాదు. అందుకే అతడిని అండర్-19 ప్రణాళికల నుంచి సెలక్టర్లు పక్కన పెట్టారు.ఇకపై సూర్యవంశీ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడు. గతంలో ఈ నిబంధన కారణంగానే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2018 అండర్-19 ప్రపంచకప్కు దూరమయ్యాడు. అయితే ఈ రూల్ అమలులోకి రాకముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ వంటి ఆటగాళ్లు రెండుసార్లు అండర్-19 ప్రపంచకప్లు ఆడారు. సూర్యవంశీ ప్రస్తుతం భారత సీనియర్ జట్టు తరఫున స్వదేశంలో అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు.భారత అండర్–19 వన్డే జట్టు: లక్ష్య రాయ్చందాని (కెప్టెన్), యశ్వర్ధన్ చౌహాన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, యశ్వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్.భారత్ అండర్–19 టెస్టు జట్టు: యశ్వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్చందాని, సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ విశ్వాస్, రోహిత్ యాదవ్, ఇషాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్. -
వైభవ్, జైస్వాల్పై కఠిన చర్యలు తీసుకోండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరు హద్దు మీరుతున్నారన్నాడు. కాబట్టి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.కాగా ఇటీవల భారత్-‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక-‘ఎ’తో కీలక మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ క్రీజును వీడుతుండగా.. లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. ‘మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్లు’ అని కవ్వించినట్లు తెలిసింది.ఇందుకు వైభవ్ ధీటుగా బదులిచ్చాడు. సహనం కోల్పోయిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు లంక ప్లేయర్పైకి దూసుకువెళ్లి విశేన్ను వెనక్కి నెట్టాడు. అతడూ వైభవ్నూ తోసేయగా.. మిగతా లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకోలేదని సమాచారం.ఇక తాజాగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా అసితా ఫెర్నాండోతో గొడవపడ్డాడు. జైసూను అవుట్ చేసిన తర్వాత అసితా ఏదో అనడంతో.. అతడిపైకి దూసుకెళ్లి హెల్మెట్తో డ్యాష్ ఇచ్చాడు. అతడూ జైసూ పైపైకి వెళ్లాడు. దీంతో ఐసీసీ జైస్వాల్, అసితాలకు జరిమానా వేయడంతో పాటు వారి ఖాతాలో డీమెరిట్ పాయింట్ జత చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ప్రియమైన ఐసీసీ, బీసీసీఐ.. ఇటీవల ఇండియా-ఎ టూర్ సందర్భంగా వైభవ్.. ఇప్పుడు జైస్వాల్.. వీళ్లిద్దరు హద్దు మీరి ప్రవర్తించారు. వీరిని ఇలాగే కొనసాగిస్తే కష్టం. మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తారు.క్రీడా స్ఫూర్తికి ముఖ్యంగా వాళ్లిద్దరి భవిష్యత్తుకు ఇది ఎంత మాత్రం మంచి కాదు’’ అని ఎక్స్ వేదికగా మంజ్రేకర్ ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంజ్రేకర్కు మద్దతు పలుకుతూ ఉంటే.. మరికొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే రెచ్చగొట్టారని.. అందుకు వైభవ్, జైసూ కేవలం స్పందించారంటూ వారిని సమర్థిస్తున్నారు.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
జట్టు మారనున్న జైస్వాల్!.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2027 వేలానికి ముందే పలువురు స్టార్ క్రికెటర్ల ట్రేడింగ్ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి జట్టు మారడం ఖాయమనే ఊహాగానాలు వస్తుండగా.. అలాంటిదేమీ లేదని యాజమాన్యం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.అయినప్పటికీ వదంతులు మాత్రం ఆగటం లేదు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ లేదంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో చేరతాడనే ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు రాజస్తాన్ రాయల్స్తో ముంబై చర్చలు జరుపుతోందని.. హార్దిక్ను ఇచ్చి అతడికి బదులు యశస్వి జైస్వాల్ను తీసుకోనుందనే రూమర్లు వినిపిస్తున్నాయి.రాయల్స్ తరఫున అరంగేట్రంకాగా 2020లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. తన అద్భుతమైన ఆట తీరుతో పోస్టర్ బాయ్గా మారిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత జైస్వాల్ ఒత్తిడికి లోనవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జైసూ ‘స్థానాన్ని’ ఆక్రమించేసిన వైభవ్?ముఖ్యంగా ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలవడం జైసూను ఒత్తిడిలోకి నెట్టేసిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. ఓపెనర్లుగా జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడగా.. వైభవ్ మాత్రం దూకుడుగా ఆడుతూ రోజురోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రాయల్స్ జట్టుకు ప్రధాన గుర్తింపుగా పేరు తెచ్చుకుంటున్నాడు.అసంతృప్తి.. ఒత్తిడి?మరోవైపు.. 2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నైకి ట్రేడ్ చేసింది. అతడి స్థానంలో జైస్వాల్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ రియాన్ పరాగ్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం జైస్వాల్ను కెప్టెన్సీ రేసు నుంచి పక్కనపెట్టింది. ఓవైపు కెప్టెన్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్న జైసూ.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో జట్టును వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.జైస్వాల్ మావాడుఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. తమకైతే జైస్వాల్ను వదులుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకైతే జట్టు మార్పు గురించి జైస్వాల్ మాతో ఏమీ చర్చించలేదు.వచ్చే సీజన్లో అతడిని దృష్టిలో పెట్టుకునే మేము ప్రణాళికలు రచించుకుంటున్నాము. అయితే, కొన్ని వదంతులు మా దాకా వచ్చాయి. మేము మాత్రం జైస్వాల్ను మా ప్లేయర్గానే భావిస్తున్నాము. అతడు మా ఆటగాడు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. మరి ఇంతకు జైస్వాల్ తనకు తొలి అవకాశం ఇచ్చిన రాయల్స్తో కొనసాగుతాడా?.. మీకో దండం అంటూ కొత్త దారి వెతుక్కుంటూ ఫ్రాంఛైజీ మారతాడా? అనేది త్వరలోనే తేలనుంది.చదవండి: శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా!.. ఫాలో ఆన్ అంటే? -
బౌలింగ్ లోను అదరగొట్టిన బుడ్లోడు ఒకే ఓవర్ లో రెండు వికెట్లు
-
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు
దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు.. అభిజిత్ సర్కార్ (5-20), షాబాజ్ అహ్మద్ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.ఆతర్వాత ఫాలో ఆన్లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్ రాయ్ (5-37) రెండో ఇన్నింగ్స్లో నార్త్ ఈస్ట్ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. చదవండి: బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ -
బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ
బ్యాటింగ్ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్ ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.నాలుగు బంతుల్లో రెండు వికెట్లునార్త్ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్లో అద్భుతం చేశాడు.28వ ఓవర్లో కిషన్ లింగ్డోహ్ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్ చేయడానికి లింగ్డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్లో వైభవ్కు రెండు వికెట్లు దక్కాయి.VAIBHAV SOORYAVANSHI, THE BOWLER 🔥- Sooryavanshi picks 2 wickets in 4 balls in Duleep Trophy Quarter-Final. pic.twitter.com/G5pfCmFXYF— Johns. (@CricCrazyJohns) August 25, 2026బంతితోనూ వైభవ్కు మంచి భవిష్యత్తు..?వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్టైమ్ ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం వైభవ్కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సచిన్తో మరో పోలికచిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి బ్యాట్తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్గా మారిపోయింది. ఇక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్ను ఇచ్చి ఉంటే మ్యాచ్లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన! -
ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విఫలమైనా.. భారీ స్కోరు!
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్లు ఆదివారం మొదలయ్యాయి.ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.వైభవ్ సూర్యవంశీ విఫలంఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఘరామీ, షాబాజ్ సెంచరీలుఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.A masterclass in grit and determination! 🏏Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026 స్కోరెంతంటే?ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్తో కలిసిషాబాజ్ ఏడో వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 23) మొదలైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.రెండో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ ప్లేయర్లు సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (100 బ్యాటింగ్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ జట్టు స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇషాన్ కిషన్ (4), వైభవ్ సూర్యవంశీ (8) నిరాశపరిచారు. మిగతా ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్ 15, కుమార్ కుషాగ్రా 55, విరాట్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 22 (బ్యాటింగ్) చేశారు. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో జొతిన్ 3, ఆకాశ్ చౌదరి 2, బిష్వోర్జిత్ ఓ వికెట్ పడగొట్టారు.సత్తా చాటిన తనుశ్, తుషార్నార్త్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్ బౌలర్లు తనుశ్ కోటియన్ (4-72), తుషార్ దేశ్పాండే (4-57) సత్తా చాటారు. వీరికి ముకేశ్ చౌదరి (1-47), శార్దూల్ ఠాకూర్ (1-38) సహకరించారు. నార్త్ జోన్ ప్లేయర్లలో తొమ్మిదో నంబర్ ఆటగాడు అన్షుల్ కంబోజ్ (60) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇతనితో పాటు ఆయుశ్ బదోని (51), ఆయుశ్ దొసేజా (42) రాణించారు. కమ్రాన్ ఇక్బాల్ 26, యశ్ ధుల్ 9, అబ్దుల్ సమద్ 6, కన్హయ్య వధవాన్ 5, నిషాంత్ సింధు 15, అబిద్ ముస్తాక్ 19, అర్షదీప్ సింగ్ 4, సునీల్ కుమార్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. పృథ్వీ షా (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆబిద్ ముస్తాక్ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ను (3) అర్షదీప్ సింగ్ పెవిలియన్కు పంపాడు. ఆట ముగిసే సమయానికి ముషీర్ ఖాన్ (6), శివాలిక్ శర్మ (0) క్రీజ్లో ఉన్నారు. -
నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ.. అంచనాలు తల్లకిందులు
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా నిరాశపరిచాడు. రెడ్బాల్ క్రికెట్ తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. నార్త్ ఈస్ట్ జోన్తో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్లో వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్కు ముందు వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం అతడి రెడ్బాల్ సామర్థ్యాన్ని పరీక్షించే కీలక అవకాశంగా ఉండింది. అయితే ఈ అవకాశాన్ని వైభవ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్కే ఔటై, అభిమానులను నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్కు దిగగా, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ ఓపెనర్గా వచ్చాడు. రెండో ఓవర్లో బంతిని ఎదుర్కొన్న అతడు బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి ఇన్నింగ్స్ ముగిసింది. కొంథౌజమ్ ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్లో బంతిని వేశాడు. దానిని పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, గల్లీలో ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చాడు.వైట్బాల్ క్రికెట్లో దూకుడుగా ఆడే వైభవ్కు రెడ్బాల్ ఫార్మాట్లో ప్రధాన సవాలు షాట్ ఎంపిక, ఓపికగా బ్యాటింగ్ చేయడం. కొత్త బంతిపై ప్రతి బంతినీ దాడి చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.సూర్యవంశీకి ఇదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో మరో అవకాశం లభించే అవకాశం ఉంది. అక్కడ భారీ స్కోరు సాధిస్తే తొలి ఇన్నింగ్స్లో ఎదురైన వైఫల్యాన్ని కొంతవరకు భర్తీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రెడ్బాల్ అవకాశాలకు తనను తాను బలంగా ప్రతిపాదించుకోగలడు.మ్యాచ్ విషయానికొస్తే.. 27 ఓవర్లు ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ స్కోర్ 13-4గా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), కుమార్ కుషాగ్రా (55), విరాట్ సింగ్ (2) ఔట్ కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), సుదీప్ కుమార్ ఘరామీ (49) క్రీజ్లో ఉన్నారు. -
వైభవ్కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి..!
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్ను రెడ్బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఐర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ద్రవిడ్.. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ మ్యాచ్లు కూడా ఆడేలా చూడాలని అన్నారు.దులీప్ ట్రోఫీ కీలకం2026 దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ అతడి రెడ్బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందిని.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.అయితే వైభవ్పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, ఇక ముందు ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ఇవ్వాలని సూచించారు.రెడ్బాల్లో ఇంకా మెరుగవ్వాలి..!వైట్బాల్ క్రికెట్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 17.25 సగటుతో 207 పరుగులు మాత్రమే చేశాడు.అందుకే దులీప్ ట్రోఫీ అతడికి ముఖ్యమైన పరీక్ష కానుంది. ఇందులో రాణిస్తే ఆస్ట్రేలియా-ఏతో జరిగే అనధికారిక టెస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.సెహ్వాగ్లా X-ఫ్యాక్టర్ అవుతాడా..?వైభవ్ సాంకేతికంగా ఇంకా సంపూర్ణ బ్యాటర్గా ఎదగాల్సి ఉన్నప్పటికీ, అతడి దూకుడు టెస్టు జట్టుకు ప్రత్యేకమైన X-ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.గతంలో భారత టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్గా దూకుడైన పాత్ర పోషించాడు. వేగంగా పరుగులు చేస్తూ ప్రత్యర్థి బౌలింగ్ దాడిపై ఒత్తిడి పెంచేవాడు. అదే తరహాలో వైభవ్ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో దూకుడైన ఓపెనర్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతానికి అతడికి టెస్టు జట్టులో స్థానం కంటే రెడ్బాల్ క్రికెట్లో ఎక్కువ అనుభవం, ఓర్పు, సాంకేతిక పరిణతి సాధించడం అవసరం. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకం. -
భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు!
వన్డే వరల్డ్కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు.ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్గా ఉన్న యశస్వి జైశ్వాల్ను కాదని వైభవ్కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.తన డెబ్యూ సిరీస్లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు.ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో భువనేశ్వర్ అద్భుతంగా రాణిస్తుండడంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక చివరగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్కు ఈ కర్ణాటక మాజీ క్రికెటర్ అవకాశమిచ్చాడు.ప్రపంచకప్ టోర్నీకి ఉతప్ప ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, అర్ష్దీప్ సింగ్ -
వైభవ్పై కామెంట్స్ తర్వాత ప్రియాన్ష్కు దిగ్వేశ్ రాఠీ ఝలక్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో యువ క్రికెటర్ల మధ్య పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎల్లో ఇప్పటికే సత్తా చాటిన ప్రియాన్ష్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ మధ్య తాజాగా జరిగిన పోరు చర్చనీయాంశమైంది.ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురానీ ఢిల్లీ-6 మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్య ఆరంభంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతడు కేవలం 20 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.అయితే దిగ్వేశ్ రాఠీ బౌలింగ్కు రావడంతో పరిస్థితి మారిపోయింది. రాఠీ వేసిన బంతిని ఆర్య లాంగ్-ఆన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆర్య వికెట్ పడగొట్టిన వెంటనే రాఠీ తనదైన శైలిలో ‘నోట్బుక్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు.ఐపీఎల్లోనూ రాఠీ ఇదే తరహా సెలబ్రేషన్తో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు DPLలో ఆర్య వికెట్ తర్వాత మరోసారి నోట్బుక్ తీసినట్లు సంబరాలు చేసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.ఆర్య vs సూర్యవంశీఇటీవల ప్రియాన్ష్ ఆర్య వైభవ్ సూర్యవంశీ కంటే తాను మెరుగైన సిక్స్ హిట్టర్ అని చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.ఇద్దరూ 2025 సీజన్ నుంచి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇప్పటివరకు ఆర్య 30 ఇన్నింగ్స్ల్లో 839 పరుగులు, 191.99 స్ట్రైక్రేట్తో సాధించాడు. సూర్యవంశీ 23 ఇన్నింగ్స్ల్లోనే 1,028 పరుగులు, 228.95 స్ట్రైక్రేట్తో దూసుకెళ్తున్నాడు.సిక్సర్ల విషయంలోనూ సూర్యవంశీదే పైచేయి. ఆర్య తన ఐపీఎల్ కెరీర్లో 57 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఇప్పటికే 100 సిక్సర్ల మార్క్కు చేరువయ్యాడు.DPLలో ఆర్యకు ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవుఔటర్ ఢిల్లీ వారియర్స్ తరఫున ఆడుతున్న ఆర్యకు DPL 2026లో ఇప్పటివరకు పెద్దగా కలిసిరాలేదు. ఏడు ఇన్నింగ్స్ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 156.47గానే ఉంది.ఆరంభాల్లో దూకుడుగా ఆడుతున్నప్పటికీ భారీ స్కోర్లుగా మార్చడంలో ఆర్య విఫలమవుతున్నాడు. పురానీ ఢిల్లీ-6పై 19 బంతుల్లో చేసిన 46 పరుగులే ఈ సీజన్లో అతడి అత్యుత్తమం. -
వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి? హర్భజన్ సమాధానమిదే
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు నిజంగా ఒక అద్భుతం.మైదానంలో సూర్యవంశీని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వైభవ్ను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతడికి డిఫెన్సివ్గా బౌలింగ్ చేయడం కంటే, వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నించడమే బెటర్ అని భజ్జీ తెలిపాడు. "వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ను శాసించే ఆటగాడిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు.అయితే అతడిని ఔట్ చేయాలంటే ఒకే మార్గం ఉంది. అతడిని పరుగులు సాధించకుండా ఉండేలా బౌలింగ్ చేస్తే మీరు అతడిని ఔట్ చేయలేరు. వికెట్ గురుంచే ప్రయత్నం చేయాలి. షాట్ ఆడేందుకు ఆఫర్ చేయాలి. ఇది ప్రతిసారీ వర్కవుట్ కాకపోవచ్చు. కొన్ని సార్లు ఆ బంతులు సిక్సర్లగా కూడి వెళ్లవచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ఏదేమైనప్పటికి వైభవ్ ఒక అసాధరణ ప్లేయర్ అని మనం అంగీకరించాలి" అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
వైభవ్ విషయంలో నేనైతే అది అంగీకరించను: ఆసీస్ దిగ్గజం
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని.. అతడు కేవలం పొట్టి ఫార్మాట్కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆరంభంలో విఫలమైనా..ఈ సిరీస్లో వైభవ్ (13,15,14) విఫలమైనప్పటికీ.. జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్లో జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు అతడు ఏకంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు.ఫిట్గా ఉండటం ముఖ్యంANIతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సంప్రదాయ ఫార్మాట్లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే, ఇందుకు వైభవ్ ఫిట్గా ఉండటం ముఖ్యం.అంతకంటే ముందు.. మానసికంగా అతడు మరింత దృఢంగా మారాలి. ఏదేమైనా పదిహేనేళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. ఏకంగా సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడుఅతడు కచ్చితంగా వరల్డ్క్లాస్ ప్లేయర్గా ఎదుగుతాడు. అయితే, వైభవ్ ఆట తీరును మరింత మెరుగపరచుకోవాల్సి ఉంటుంది. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. చదవండి: నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన -
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్షిప్తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్తో కలిసి వైభవ్ రెడ్బుల్ చాలెంజ్లో పాల్గొని అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్! -
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదే!
-
వైభవ్కు నిజంగా 15 ఏళ్లేనా? ఆసీస్ దిగ్గజం బ్రెట్లీ సమాధానమిదే
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఐపీఎల్, జూనియర్ క్రికెట్లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.తన అరంగేట్ర సిరీస్లో విఫలమైనప్పటికి జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు ఇబ్బంది పడినప్పటికి .. సూర్యవంశీ మాత్రం వారిని ఉతికారేశాడు. అంతకుముందు ఐపీఎల్లో కూడా వరల్డ్క్లాస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హేజిల్వుడ్, కమిన్స్ను కూడా వైభవ్ వదల్లేదు.అయితే చిన్న వయసులోనే ఇంతటి పరిణతి సాధించడం వల్ల విదేశీ క్రికెట్ వర్గాలలో వైభవ్ వయస్సుపై ఇంకా సందేహలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వయస్సుతో సంబంధం లేదని, అతడు ఎంత గొప్పగా క్రికెట్ ఆడుతున్నాడనే దానిపైనే అందరూ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డాడు. 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే పర్వాలేదు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడికి నిజంగా 15 ఏళ్లేనా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కానీ నాకు అతడి వయసుతో సంబంధం లేదు. అతడు 15 ఏళ్ల కుర్రాడైతే చాలా సంతోషం. ఒకవేళ 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే నాకు అనవసరం. అతడు అత్యున్నత స్ధాయిలో ఎలా క్రికెట్ ఆడుతున్నాడన్నదే ముఖ్యం. టీమిండియాకు దొరికిన గొప్ప ఆణిముత్యం అతడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతడు ఇప్పటికే వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్లో సత్తాచాటాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ నేను ఎప్పటికి మర్చిపోను. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వారు ఎంత వేగంతో బౌలింగ్ చేస్తే వైభవ్ అంతే అలవోకగా షాట్లు ఆడాడు. అతడి బ్యాట్ స్పీడ్ నిజంగా అద్భుతం. సరైన టైమింగ్ కూడా అతడి వద్ద ఉంది. అతను ఇప్పటికీ ఒక చిన్నపిల్లవాడే, అతనిపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ఆడుకోనివ్వాలి" అని బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్లీ పేర్కొన్నాడు. -
‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’
క్రికెట్ ప్రపంచంలోకి దూసుకువచ్చిన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఫార్మాట్లకు అతీతంగా అదరగొట్టాడు. భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైభవ్.. ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ గడ్డపైతద్వారా అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్గా దిగ్గజ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో (13,15,14) విఫలమయ్యాడు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం రెండు అర్ధ శతకాలతో రాణించాడు. టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.వైభవ్ కుటుంబానికి కీలక సూచనలుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి కీలక సూచనలు చేశాడు.ఇంగ్లండ్ మాజీ స్టార్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నిల్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలోనే వైభవ్కు సరైన మార్గదర్శనం అవసరం. అతడి కుటుంబం మాత్రమే ఇది చేయగలదు.ప్రస్తుతం అతడికి ఏది అత్యంత ముఖ్యమో అతడి కుటుంబమే చెప్పాలి. అతడి కోసం షెడ్యూల్, ప్రణాళికలను రచించాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే వచ్చిన కీర్తిప్రతిష్టలు చూసి అతడు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలి.క్రమశిక్షణ ముఖ్యంజట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో కొత్త పరిచయాలు అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అతడికి చెప్పాలి. కుటుంబమే అతడి బలం. వచ్చే ఐదు, పదేళ్లలో వైభవ్ను వారెంత క్రమశిక్షణగా ఉంచుతారో అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించింది. వైభవ్ వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. చదవండి: ధోని గది తలుపు ఒక్కసారి మూతపడితే అంతే ఇక! -
వాళ్ళకి దూరంగా ఉండు లేదంటే.. బుర్డోడికి ఉతప్ప వార్నింగ్
-
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్ఫ్రెండ్స్పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్బాల్లో సచిన్ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
నా వరల్డ్ రికార్డును బద్దలు కొట్టేది అతడే: బట్లర్
టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున ఆడిన బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు 522 మ్యాచ్ల్లో 14,833 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. పొలార్డ్ 746 మ్యాచ్ల్లో 14,803 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో పొలార్డ్ను బట్లర్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించిన అనంతరం బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో తన రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని బట్లర్ అన్నాడు."టీ20 క్రికెట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదో ఒక రోజు నా రికార్డును వేరొకరు బద్దలు కొడతారు. ఆ ఆటగాడు బహుశా వైభవ్ సూర్యవంశీ కావచ్చు. క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరిస్థితులు త్వరగా మారుతుంటాయి.కొన్ని నెలల క్రితం నేను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు నాకెరీర్లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒడిదొడుకులు ఎదురైనప్పుడు వదిలేయడం లేదా ఫామ్ కోసం కష్టపడడం అనే రెండు మార్గాలే ఉంటాయి. నేను శ్రమించడానికే మొగ్గు చూపాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే!
టీ20 క్రికెట్ వచ్చాకా ఆటలో వేగం పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు నమోదు చేస్తున్న బ్యాటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంచరీ భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ నుంచి వచ్చింది. రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 37 బంతుల్లో శతకం సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వైభవ్ను ఆకాశానికెత్తుతున్నాం కానీ 95 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్మన్ కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ మార్క్ సాధించడం విశేషం. 1931 నవంబర్ 2న బ్లాక్హెత్ తరఫున బ్రాడ్మన్ న్యూ సౌత్వేల్స్ వేదికగా లిత్గో పొటరీస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటేంటే అప్పట్లో ఒక ఓవర్కు ఆరు బంతులకు బదులు 8 బంతులుండేవి. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లో 33 పరుగులు (8 బంతులు), రెండో ఓవర్లో 40 పరుగులు (8 బంతులు), మూడో ఓవర్లో 27 పరుగులు (ఆరు బంతులు).. మొత్తంగా 22 బంతులెదుర్కొని కేవలం 18 నిమిషాల్లోనే బ్రాడ్మన్ 100 పరుగుల మార్క్ను చేరుకోవడం విశేషం. ఇక ఆ మ్యాచ్లో ఓవరాల్గా బ్రాడ్మన్ 256 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి.అప్పటికే సూపర్ ఫామ్లో ఉన్న బ్రాడ్మన్కు ఈ రికార్డు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రాడ్మన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో బ్రాడ్మన్ సగటు 99.94. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. మొత్తంగా బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, రికార్డు స్థాయిలో 12 డబుల్ సెంచరీలున్నాయి. తన కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్లో ఒక్క పరుగు చేసి ఉన్నా బ్రాడ్మన్ సగటు వందగా ఉండేది. కానీ తన చివరి మ్యాచ్లో బ్రాడ్మన్ డకౌట్ అయ్యాడు.Read: పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం! -
వైభవ్నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్, భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్తో టీ20 సిరీస్లు ఆడింది భారత జట్టు.సంజూ వరుస వైఫల్యాలుఅయితే, ఐర్లాండ్లో సంజూ శాంసన్- అభిషేక్ శర్మను ఓపెనింగ్ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్ను బెంచ్కే పరిమితం చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇక సంజూ ఐర్లాండ్తో రెండు మ్యాచ్లలోనూ తేలిపోయాడు.అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.జింబాబ్వే గడ్డ మీద దూకుడుదీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్కు మళ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 50, 20, 81 పరుగులు సాధించాడు.జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‘‘వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్క్యాప్ గెలుచుకున్నాడు.నిజానికి ఐర్లాండ్లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్ను ఐర్లాండ్లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్కే పరిమితం చేసింది.వైభవ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్లో అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.అతడినే పక్కనపెడతారా?జోఫ్రా ఆర్చర్కు వైభవ్ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.అతడొక స్పెషల్ టాలెంట్. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు.చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్ -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్ను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
అందుకే వైస్ కెప్టెన్గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ను కెప్టెన్గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త -
కొడితే సిక్స్ పడాల్సిందే.. వైభవ్ కీలక వ్యాఖ్యలు
-
వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఊహించని ప్రమోషన్ దక్కింది. ఇటీవల జింబాబ్వే గడ్డ మీద టీ20 సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు... దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏకంగా వైస్ కెప్టెన్గా అతడు నియమితుడయ్యాడు. అభిమానుల హర్షంభవిష్యత్తులో వైభవ్ను అన్ని ఫార్మాట్ల ప్లేయర్గా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగు కానుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే వైభవ్కు ప్రతిష్టాత్మక టోర్నీలోని జుట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల అభిమానులు హర్షం చేస్తున్నారు.అదే విధంగా.. ‘వైభవ్ పిన్న వయసులోనే ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికవడం బిహార్ క్రికెట్కు గర్వకారణం. అతడి అద్భుత ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకముంచారు’ అని బిహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు?అయితే, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఈ పదిహేనేళ్ల పిల్లాడిని సీనియర్ జట్టుకు వైభవ్ను వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘సీనియర్ రెడ్బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటో నాకర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు ఇప్పటి వరకు రెడ్బాల్ క్రికెట్లో కేవలం 12 ఇన్నింగ్స్ ఆడి.. 207 పరుగులు చేశాడు.అతడి ప్రతిభ అసాధారణం. కానీ ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అతడు ఇంకా మొదటి దశలోనే ఉన్నాడు’’ అని హర్షా భోగ్లే సెలక్టర్ల నిర్ణయాన్ని విమర్శించాడు.ఇషాన్ కిషన్ సారథ్యంలోకాగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇషాన్ కిషన్ సారథ్యంలో 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టును బుధవారం ప్రకటించారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడి 207 పరుగులు చేశాడు. ఇక సూర్యవంశీకి ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాగా... సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ , షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్కు ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, షిక్జార్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రంసు సేనాపతి, డేనిశ్ దాస్, అభిజిత్ సర్కార్. చదవండి: శ్రీలంకతో టెస్టులకు పంత్ను ఎలా సెలక్ట్ చేశారు?: డివిలియర్స్I wonder what the thinking is behind making Sooryavanshi vice-captain of a senior red ball team. He has played 12 innings for 207 runs @ 17.25. His talent is extraordinary but there is a learning curve and he is at the bottom of it in red ball cricket.— Harsha Bhogle (@bhogleharsha) July 30, 2026 -
BCCI నుంచి వైభవ్కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్గా ప్రమోషన్!
-
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్ను చూపించాడు. ఇటీవల జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు.ఈ పర్యటనలో బ్లెస్సింగ్ ముజార్బానీ, రిచర్డ్ నగరావ వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరపిడుగు ఎంట్రీతో సంజూ జట్టులో చోటు కోల్పోయాడు.సెప్టెంబర్లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజూ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఇక జింబాబ్వే టూర్లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్కు డిప్యూటీగా సూర్య వంశీ వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అతడిని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడం బీహార్ క్రికెట్కు ఎంతో గర్వకారణమని హర్ష వర్ధన్ కొనియాడాడు,.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బిహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్తాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీరు ఏ బౌలర్ను ఎదుర్కోవడానికి భయపడతారు? అని హోస్ట్ వైభవ్ను ప్రశ్నించాడు. ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు" అని నాలుగు పదాల్లో తేల్చి చేప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సూర్యవంశీ ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హాజిల్వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. -
వైస్ కెప్టెన్గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న కొద్ది రోజులకే, భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడినా, భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా గుర్తింపు పొందుతున్నాడు.జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), దెనీష్ దాస్, అభిజిత్ సర్కార్.స్టాండ్బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సాంబిత్ ఎస్. బరాల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.కాగా, దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరుగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్తో తలపడనుంది. ఆగస్ట్ 15 నుండి 27 మధ్యలో టీమిండియా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నప్పటికీ.. టెస్ట్ జట్టులో ఇషాన్, వైభవ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. -
అగ్రపీఠంపై గిల్.. వైభవ్ భారీ జంప్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా నిలిచాడు.జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.అదే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్లను కూడా అధిగమించాడు. టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్ను దక్కించుకున్నాడు.మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. -
బుడ్డోడు దెబ్బకు అభిషేక్ పై వేటు.. వెళ్లి IPL ఆడుకో
-
వైభవ్కు బ్రాడ్మన్తో పోలిక
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి, భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్మన్ను గుర్తు చేస్తుంది. బ్రాడ్మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్తో ఆడుతున్నాడు"పోలికకు కారణంబ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే LBW అయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే LBWగా ఔటయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల LBW అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన వైభవ్ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 151 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.పోలికలపై జాగ్రత్త అవసరంఇదిలా ఉంటే, వైభవ్ను ఇప్పుడే డాన్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా, అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం. -
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
-
గాయపడిన వెనక్కి తగ్గని బుడ్డాడు.. వైభవ్ పై లక్ష్మణ్ ప్రశంసలు
-
సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను
-
నా కల నెరవేరింది.. వారి వల్లే ఇదంతా: వైభవ్ సూర్యవంశీ
తన అరంగేట్ర సిరీస్లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు."నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం. ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాను. ఈ గ్రౌండ్లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు. -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్లో రోహిత్కు జతగా వైభవ్ను పంపించి కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్కు గంభీర్ స్థానంలో కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్గానూ నిలిచాడు. వైభవ్లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026 -
అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?
జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత వైభవ్ తన బ్యాటింగ్లో దూకుడు పెంచాడు. దీంతో అతడు తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ స్పిన్నర్ మాధవిరే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.దీంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4జింబాబ్వే మూడో వికెట్ డౌన్యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3జింబాబ్వే తొలి వికెట్ డౌన్193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్లో బెన్నెట్ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్ ఎంతంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.భారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4వైభవ్ అవుట్వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.వైభవ్ ఫిప్టీవైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1అభిషేక్ అవుట్జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ -
చెలరేగిన తిలక్, ఇషాన్.. చేతులెత్తిసిన బుడ్జోడు, అభిషేక్..
-
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్ను భవిష్యత్తులో ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్తో సిరీస్లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.బ్యాటింగ్తో పాటు బౌలింగ్పైనా దృష్టివైభవ్లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్టైమ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బౌలింగ్ అనుభవంవైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్గా పార్ట్టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్లో మూడు ఇన్నింగ్స్లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా బౌలింగ్లో దాదాపు అనుభవం లేని వైభవ్ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.నేడే రెండో టీ20భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
‘వైభవ్ సూర్యవంశీతో బౌలింగ్ కూడా చేయిస్తాం’
విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.మెరుపు అర్ద శతకంహరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.అతడొక సంచలన బ్యాటర్భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో నేను అతడితో సాధన చేయిస్తాను.వైభవ్తో బౌలింగ్ కూడా చేయిస్తాంఅతడు బౌలింగ్లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐర్లాండ్తో టీ20 సిరీస్లో వైభవ్తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.మూడు మ్యాచ్లలో విఫలం ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్కు ఓపెనర్గా అవకాశం దక్కింది.ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్ను ప్రశంసిస్తూ.. గంభీర్ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.అయినా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.అంకిత భావానికి సెల్యూట్నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.చదవండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు -
అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ మార్క్ను సూర్యవంశీ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయష్కుడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై తన సహచర ఆటగాడు మయాంక్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్లోనే అతడి టాలెంట్ చూశాను అని మయాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ నిలిచాడు."వైభవ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఐపీఎల్లో వైభవ్కు బౌలింగ్ చేసినప్పుడు, అతడు ఆడిన షాట్లను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడు.అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్లో మా బౌలింగ్ను వైభవ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అతడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన అరంగేట్ర సిరీస్లో అతడు అంతగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెషల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్
-
‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.Read: అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు! -
వైభవ్ మెరుపులు
హరారే: టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన తర్వాత ఎట్టకేలకు ఈ ఫార్మాట్లో భారత్ మరో మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లో ఆరు టి20ల్లో ఓడిన టీమిండియా ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో బోణీ చేసింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు కూడా ఇదే మొదటి విజయం. గురువారం జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వెస్లీ మదెవెరె (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మరుమని (20 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బర్ల్ (35 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో జింబాబ్వే స్కోరు 64/5 కాగా...మదెవెరె, మరుమని ఆరో వికెట్కు 37 బంతుల్లో 58 పరుగులు చేసి ఆదుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేయగా, రెండో టి20 శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది. స్వల్ప స్కోరుకే... దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన పేసర్ మయాంక్ ఘనంగా పునరాగమనం చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే బెన్నెట్ (0)ను అవుట్ చేసి జింబాబ్వే పతనానికి శ్రీకారం చుట్టాడు. మైయర్స్ (6) వికెట్ కూడా అతని ఖాతాలోకే చేరగా, ప్రిన్స్ తన తొలి ఓవర్లో బెన్ కరన్ (10) వికెట్ తీశాడు. పవర్ప్లేలో జింబాబ్వే స్కోరు 26/3కి చేరింది. కీలక బ్యాటర్ సికందర్ రజా (4)ను దూబే పెవిలియన్కు పంపగా, బర్ల్ వికెట్ బిష్ణోయ్కు దక్కింది. ఈ దశలో మదెవెరె, మరుమని పోరాటంతో స్కోరు 100 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో జింబాబ్వే మరో 2 వికెట్లు చేజార్చుకుంది. దూకుడైన బ్యాటింగ్... అభిషేక్ శర్మ (1) ఆరంభలోనే వెనుదిరగ్గా... కెరీర్ తొలి 3 మ్యాచ్లలో విఫలమైన వైభవ్ ఈసారి తనపై ఉన్న అంచనాలకు తగినట్లుగా చెలరేగాడు. ఐదు నెలల క్రితం ఇదే మైదానంలో అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసిన అతను స్వేచ్ఛగా ఆడాడు. ఎన్గరవా ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టిన అతను, ఇవాన్స్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ముజరబాని ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుటైనా... మరోవైపు కిషన్ కూడా ధాటిగా ఆడాడు. 62 బంతుల్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. కిషన్ అవుటైనా... అయ్యర్, తిలక్ వర్మ (6 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు.అశోక్ శర్మ@123 రాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 123వ ప్లేయర్గా అతను నిలిచాడు. ఐపీఎల్లో గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన అతను సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (154.2 కి.మీ.) వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే రోజు పుట్టిన పేసర్లు అశోక్, మయాంక్ (17/06/2002) ఈ మ్యాచ్లో తొలి బంతిని పంచుకోవడం విశేషం.15 ఏళ్ల 118 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) మయాంక్ 0; బెన్ కరన్ (సి) వైభవ్ (బి) ప్రిన్స్ 10; మైయర్స్ (సి) దూబే (బి) మయాంక్ 6; రజా (సి) (సబ్) సూర్యాంశ్ (బి) దూబే 4; బర్ల్ (సి) తిలక్ (బి) బిష్ణోయ్ 26; మదెవెరె (రనౌట్) 39; మరుమని (నాటౌట్) 27; ఇవాన్స్ (సి) అయ్యర్ (బి) ప్రిన్స్ 0; న్యూమన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–20, 4–32, 5–64, 6–122, 7–122. బౌలింగ్: మయాంక్ యాదవ్ 4–0–18–2, అశోక్ శర్మ 4–0–29–0, ప్రిన్స్ యాదవ్ 4–0–19–2, శివమ్ దూబే 4–0–32–1, రవి బిష్ణోయ్ 4–0–24–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఇవాన్స్ (బి) ముజరబాని 1; వైభవ్ (సి) బెన్ కరన్ (బి) ఎన్గరవా 50; ఇషాన్ కిషన్ (సి) మైయర్స్ (బి) ముజరబాని 35; అయ్యర్ (నాటౌట్) 28; తిలక్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (13.2 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–23, 2–68, 3–114. బౌలింగ్: ముజరబాని 4–0–26–2, ఎన్గరవా 2.2–0–30–1, ఇవాన్స్ 2–0–26–0, న్యూమన్ 2–0–30–0, రజా 3–0–14–0. -
భయమనేది లేదు.. అతడొక అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్
టీ20ల్లో టీమిండియా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలో ఊదిపడేసింది.యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు సాధించి భారత తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్బ్యాక్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు."ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాదవ్ సంచలన స్పెల్ బౌలింగ్ చేశాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఏ మాత్రం భయం లేదు. వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్యద్భుతం. హరారే పిచ్పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్లో అతడికి పనికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్లలో కూడా ఇదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ చేస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
వైభవ్ విశ్వరూపం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
వరుస ఓటములకు బ్రేక్.. జింబాబ్వేపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు కూడా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది.భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తన రీఎంట్రీ మ్యాచ్లో అదరగొట్టాడు. మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే బ్రియాన్ బెనెట్ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో ప్రిన్స్ యాదవ్ రెండు, దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వైభవ్ వీర విహారం126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో అతడు బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(35), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28 నాటౌట్) రాణించారు. ఫలితంగా 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. మయాంక్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్గా సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. 🇿🇼 𝐒𝐄 𝐊𝐄𝐇 𝐃𝐄𝐍𝐀 𝐒𝐎𝐎𝐑𝐘𝐀𝐕𝐀𝐍𝐒𝐇𝐈 𝐀𝐀𝐘𝐀 𝐇𝐀𝐈 🥵𝐑𝐔𝐊𝐄𝐆𝐀 𝐍𝐀𝐇𝐈, 𝐓𝐇𝐎𝐊𝐄𝐆𝐀 😎Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/ACaAC23Zoq— FanCode (@FanCode) July 23, 2026భారత అండర్-19, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అరుదైన ఫీట్లు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇంగ్లండ్లో విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. వైభవ్ను అరంగేట్రం చేయించింది. అయితే, తొలి మ్యాచ్లో పదిహేనేళ్ల ఈ లెఫ్టాండ్ ఓపెనర్ 13 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడు, నాలుగో టీ20లలో వరుసగా 14, 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో వైభవ్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి.. మళ్లీ సంజూను ఆడించారు. అయితే, జింబాబ్వేతో సిరీస్కు మాత్రం సంజూ శాంసన్ను పక్కనపెట్టిన మేనేజ్మెంట్.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఇక జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించాడు.ఆకాశమే హద్దుగా..తొలి ఓవర్లో అభిషేక్, వైభవ్ పెద్దగా పరుగులు చేయలేదు. బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్లో కేవలం చెరో పరుగు చేశారు. అయితే, రెండో ఓవర్లో రిచర్ట్ నగవర బౌలింగ్కు రాగా.. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినప్పటికీ.. రెండు, మూడు, నాలుగు బంతుల్లో వైభవ్ వరుసగా 6,4,6 బాదాడు. రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో మూడో ఓవర్ ఐదో బంతికి అభిషేక్ శర్మ (1)ముజర్బానీ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ.. వైభవ్ జోరు కొనసాగించాడు. కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో ఓవర్లో నగరవ బౌలింగ్లో తొలి బంతికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ మరుసటి బంతికే బెన్ కర్రాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెప్పాడు.. చేసి చూపించాడుఅయితే, నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ మీద వైభవ్ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్కు టైటిల్ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే స్పోర్ట్స్ క్లబ్ మీద ఆడిన అనుభవం, పిచ్ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్ సెంచరీతో తళుక్కుమన్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో తొలి అర్ధ శతకం బాదిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ (ఇండియా): జింబాబ్వే మీద హరారే వేదికగా 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ👉లూయీస్ బ్రూస్ (గిబ్రాల్టర్): మాల్టా మీద అల్బేగరియా వేదికగా 2021లో 16 ఏళ్ల 56 రోజుల వయసులో ఫిఫ్టీ👉కవిన్ చద్దా (ఇండోనేషియా): స్వీడన్ మీద బాలి వేదికగా 2026లో 16 ఏళ్ల 76 రోజుల వయసులో ఫిఫ్టీ👉ఆల్సినే టురే (సియెర్రా లియోన్): ఘనా మీద బెనోని వేదికగా 2023లో 16 ఏళ్ల 89 రోజుల వయసులో ఫిఫ్టీ👉టెంజిన్ రాబ్గే (భూటాన్): చైనా మీద కౌలాలంపూర్ వేదికగా 2023లో 16 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీసచిన్ రికార్డు బ్రేక్ఫుల్ మెంబర్ జట్లలో భాగంగా అఫ్గనిస్తాన్ స్టార్ రహ్మనుల్లా గుర్బాజ్ 17 ఏళ్ల 296 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. వైభవ్ తాజాగా అతడిని అధగమించాడు. అంతేకాదు.. ఫుల్ మెంబర్ జట్ల తరఫున అంతర్జాతీయ క్రికెట్ (ఆల్ ఫార్మాట్)లో అతి పిన్న వయసులోనే అర్ధ శతకం చేసిన తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండ్కులర్ పాకిస్తాన్ మీద 1989 నాటి టెస్టు మ్యాచ్లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ శతకం చేయగా.. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు అచ్చొచ్చిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఈ చిచ్చర పిడుగు ఉతికారేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. అయితే ఆర్ధ శతకం సాధించిన వైభవ్.. తర్వాత బంతికే భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ పవర్ప్లేనే 60 పరుగులు దాటింది.వైభవ్ వరల్డ్ రికార్డుఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సాధించిన వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ శతకం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్(15 ఏళ్ల 118 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్ ప్లేయర్ లూయిస్ బ్రూస్(16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో బ్రూస్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. -
వైభవ్ సూర్యవంశీ కాదు.. నెక్స్ట్ విరాట్ కోహ్లి అతడే..!
విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్లో తదుపరి స్టార్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మరో ఆటగాడిని నెక్స్ట్ విరాట్ కోహ్లిగా అభివర్ణించాడు.తాజాగా దూరదర్శన్ నిర్వహించిన 'ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో'లో మాట్లాడిన జాఫర్.. కేఎల్ రాహుల్ను భవిష్యత్ విరాట్ కోహ్లిగా పేర్కొన్నాడు. ప్రతిభ, టెక్నిక్ పరంగా రాహుల్ విరాట్తో సమానమని అన్నాడు. అయితే ఇద్దరి మధ్య తేడాను నిర్ణయించేది విరాట్ మానసిక దృఢత్వమని చెప్పాడు."కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలడు. టెక్నిక్, ప్రతిభ పరంగా చూస్తే అతడు విరాట్ కోహ్లితో సమానమే. కానీ విరాట్ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అసాధారణమైన మెంటాలిటీ" అని జాఫర్ వ్యాఖ్యానించాడు.అయితే గణాంకాల పరంగా విరాట్, రాహుల్ మధ్య భారీ అంతరం ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 28359 పరుగులు, 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు నమోదు చేయగా.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9830 పరుగులు, 22 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు.మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్లో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, అనంతరం టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇంగ్లండ్తో తొలి సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్లో మరోసారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడికి దొరికింది. -
IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇక మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి ఓపెనర్ సంజూ శాంసన్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.అదే విధంగా.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్ను కూడా తిరిగి పిలిపించింది.అభిషేక్ జోడీగా ఎవరు?ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.ప్రభ్సిమ్రన్ సింగ్కు అవకాశం ఉంటుందా?అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్సిమ్రన్ సింగ్.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ ఈ మేరకు రాణించాడు.నా జట్టు ఇదేఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన తుదిజట్టులో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్డౌన్లో ఇషాన్ కిషన్, నాలుగో నంబర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మను కొనసాగించిన బద్రీనాథ్.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్ను మాత్రం పక్కనపెట్టాడు.ఇక స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్.. పేస్ దళంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లకు చోటిచ్చాడు.జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్ ఎంచుకున్న జట్టువైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి -
'అతడికి సలహాలు అక్కర్లేదు.. కచ్చితంగా చెలరేగుతాడు'
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.ఈ మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరలకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. "ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యనటనలలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు. కానీ ఈ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, మైదానంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన.కాబట్టి ఇక్కడ కండీషన్స్కు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బయట నుంచి విమర్శలను పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైనే దృష్టి సారించి ఫియర్ లెస్ క్రికెట్ ఆడండి. మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. జింబాబ్వేను ఏ మాత్రం తేలికగా తీసుకోము. ప్రత్యర్ధి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో అయ్యర్ పేర్కొన్నాడు.అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి శ్రేయస్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.చదవండి: భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే -
అండర్-19 ఫైనల్ గుర్తుపెట్టుకోండి.. జింబాబ్వేకి బుర్డోడు వార్నింగ్..!
-
వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. అయితే, క్రికెట్లో ఇవన్నీ భాగమేనని.. జట్టు ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ వందశాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.కాగా ఐపీఎల్, భారత్ అండర్-19 జట్టు తరఫున విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.భారీ అంచనాల నడుమఈ పరిణామాల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్లలో వరుసగా 14, 13 , 15 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20లో ఈ బిహారీ పిల్లాడిని తప్పించి.. మళ్లీ సంజూనే ఆడించింది మేనేజ్మెంట్. ఇక ఈ సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 4-0తో క్లీన్స్వీప్ అయింది.అయితే, జింబాబ్వేతో తాజాగా మరో టీ20 సిరీస్ను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం.. అభిషేక్ శర్మకు జోడీగా జింబాబ్వే సిరీస్కు వైభవ్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..వంద శాతం కష్టపడతాను‘‘గడిచిన నాలుగు నెలల కాలంలో నేను ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే, ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే నేను దృష్టి పెట్టాను. జట్టు కోసం వందకు వంద శాతం కష్టపడతాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.అదే విధంగా.. ‘‘కోచ్లు, ఇతర సిబ్బంది నాకు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. అంతా బాగుంది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. రోజురోజుకీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోంది.ఈ పిచ్లపై నాకు అవగాహన ఉందిఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్లో ఆడటం గొప్పగా ఉంది. ఈ పిచ్లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో వైభవ్ ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత్ -
IND vs ZIM: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఖాయం..!
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం కానుంది. వరుసగా మూడు సిరీస్లను కోల్పోయి జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదరు చూస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్లో విఫలమైన వైభవ్కు ఈ జింబాబ్వే టూర్ అద్భుత అవకాశంగా చెప్పుకోవాలి.సంజూ శాంసన్కు విశ్రాంతి ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ తనను తను నిరూపించుకుంటే భారత టీ20 జట్టులో అతడి స్దానం పదిలంగా ఉంటుంది. అయితే జింబాబ్వే గడ్డపై సూర్యవంశీ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.వైభవ్ చెలరేగడం ఖాయం!ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచకప్లో వైభవ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఫైనల్లో ఇంగ్లండ్పై అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇది యూత్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది.ఈ చిచ్చర పిడుగు జింబాబ్వేలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 169.49 స్ట్రైక్ రేట్తో మొత్తం 439 పరుగులు సాధించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కనబరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా జింబాబ్వే పర్యటనలో భారత జట్టు ప్రధాన కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. వరుస సిరీస్లతో బీజీగా ఉండడంతో రెగ్యులర్ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.చదవండి: వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా -
వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర సిరీస్లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో వైభవ్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 15 ఏళ్ల వైభవ్కు అంతర్జాతీయ వేదికపై తన టాలెంట్ను నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇప్పుడు లభించింది.జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో భారత ఇన్నింగ్స్ను వైభవ్ ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రపంచ క్రికెట్లో గొప్ప స్టార్గా ఎదుగుతాడని రజా కొనియాడాడు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన క్రికెటర్. కేవలం 15 ఏళ్ల వయస్సులో ప్రపంచస్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. అయితే అంతర్జాతీయ స్ధాయిలో ఆడేటప్పుడు సహజంగా ఆటగాళ్లపై ఒత్తడి ఉంటుంది. కాబట్టి కేవలం రెండు లేదా మూడు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రాన వైభవ్ను విమర్శించడం సరికాదు.ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో వైభవ్ డ్రెసింగ్ రూమ్ను షేర్ చేసుకుంటున్నాడు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. బీసీసీఐ వైభవ్ను సరైన దిశలో నడిపిస్తే, అతడు ఖచ్చితంగా ఈ తరంలో గొప్ప క్రికెటర్ అవుతాడని" రజా హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. వరుసగా మూడు సిరీస్లు కోల్పోయిన టీమిండియా.. తిరిగి జింబాబ్వే పర్యటనలో పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్ -
వైభవ్పై ఫార్ములా-1 స్టార్ రేసర్ ప్రశంసలు
భారత క్రికెట్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీపై ఫార్ములా-1 సంచలనం, రేసింగ్ బుల్స్ డ్రైవర్ అర్విడ్ లిండ్బ్లాడ్ (Arvid Lindblad) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రీడల్లో చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో వైభవ్ కూడా ఒకడని కొనియాడాడు.ఇటీవల ఇంగ్లండ్-భారత్ తొలి వన్డే సందర్భంగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడిన లిండ్బ్లాడ్.. సాంకేతికత అభివృద్ధి, చిన్న వయసులోనే మెరుగైన సమాచారం అందుబాటులోకి రావడం వల్ల యువ ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు."ఇది అన్ని క్రీడల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. చిన్న వయసులోనే సరైన సమాచారం, శిక్షణ లభిస్తోంది. అందుకే చాలా చిన్న వయసులోనే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ, ఫుట్బాల్లో లమీన్ యమాల్ అందుకు మంచి ఉదాహరణలు. వైభవ్ చాలా చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడల స్వభావంగా మారింది" అని లిండ్బ్లాడ్ వ్యాఖ్యానించాడు.ఇదే సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా అతడు మాట్లాడాడు. తన అమ్మమ్మ, తాతయ్య పంజాబ్కు చెందిన వారని, భారతీయ సంస్కృతితో తనకు బలమైన అనుబంధం ఉందని తెలిపాడు. గతేడాది ముంబైలోని ఆజాద్ మైదాన్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఎంతో ప్రత్యేకమని గుర్తు చేసుకున్నాడు. అలాగే తన అమ్మమ్మ వండే భారతీయ వంటకాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.ఫార్ములా-1లో అడుగుపెట్టడం తన చిన్ననాటి కల అని, ఈ ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్లో అరంగేట్రం చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానని లిండ్బ్లాడ్ వెల్లడించాడు. చిన్నప్పుడు తండ్రితో కలిసి తొలిసారి వెళ్లిన సిల్వర్స్టోన్ ట్రాక్లోనే ఎఫ్1 డ్రైవర్గా రేస్ చేయడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు.అలాగే బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ను కలవడం ఆనందంగా అనిపించిందని చెప్పిన లిండ్బ్లాడ్, ఫార్ములా-1 కార్లు నడిపినా ఇప్పటికీ రోడ్డు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తీసుకోలేదని సరదాగా వ్యాఖ్యానించాడు. -
ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ అమన్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో విలియనూర్ మోహిత్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న అమన్ ఖాన్.. మాహె మెగాలో స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన విలియనూర్ జట్టు 7.4 ఓవర్లలో 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన 29 ఏళ్ల అమన్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 34 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఈ యువ ఆల్రౌండర్ ఓవరాల్గా 43 బంతులు ఎదుర్కొని 300 స్ట్రైక్ రేట్తో 129 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, ఏకంగా 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ తుపాన్ ఇన్నింగ్స్తో అమన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత దేశీవాళీ/ లీగ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా అమన్ నిలిచాడు.ఈ క్రమంలో భారత యవ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డును అమన్ ఖాన్ బ్రేక్ చేశాడు. వైభవ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్లో కేవలం 34 బంతుల్లో శతక్కొట్టిన ఈ పాండిచ్చేరి ఆల్రౌండర్.. వైభవ్ను అధిగమించాడు. ఈ జాబితాలో తెలంగాణ క్రికెటర్ అమన్ రావు పెరాల(32) అగ్రస్ధానంలో ఉన్నాడు. -
‘అందుకే వైభవ్ను తప్పించి.. సంజూను ఆడించాము’
టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లలో క్లీన్స్వీప్ కావడమే ఇందుకు కారణం. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ గురైన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్నూ విజయమన్నదే లేకుండా ముగించింది. ఇంగ్లిష్ జట్టు చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది.ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కోసం వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా సంజూ ఐర్లాండ్తో రెండు టీ20లు (5, 0).. అదే విధంగా ఇంగ్లండ్తో తొలి టీ20 (1)లో విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే సంజూను తప్పించి.. అతడి స్థానంలో ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20తో అరంగేట్రం చేశాడు. అయితే, వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్.. 13, 14, 15 పరుగులు చేశాడు. అంతేగాక వైభవ్ రాకతో టాపార్డర్లో ముగ్గురూ (ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్) లెఫ్టాండర్లే అయ్యారు.ఈ నేపథ్యంలో నామమాత్రపు ఐదో టీ20లో మాత్రం వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ..‘‘సౌతాంప్టన్ పిచ్ పరిస్థితికి తగ్గట్లు మేము అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్తో ముందుకు వెళ్లాలని అనుకున్నాము. అభిషేక్ శర్మతో కలిసి కుడిచేతి వాటం బ్యాటర్తో ఓపెనింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాము. అందుకే వైభవ్ను తప్పించాము. ఈ మ్యాచ్కు ఇలా చేయడమే సరైన నిర్ణయం. సంజూ గన్ బ్యాటర్. గతంలో ఒంటిచేత్తో ఎన్నో సిరీస్లు గెలిపించాడు’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఐదో టీ20లో సంజూ 27 పరుగులు చేయగా.. అభిషేక్ 3 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అవకాశం లభించని వైభవ్కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ను రెండో మ్యాచ్లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే ముందే కేవలం టీమ్తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు)
-
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్కూ సిరీస్ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్తో వరుసగా మూడు మ్యాచ్లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్నప్పటికీ.. వన్డౌన్లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
వైభవ్కు క్లాస్పీకిన గౌతమ్ గంభీర్
భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 15 ఏళ్ల వైభవ్.. షార్ట్ పిచ్ బంతులను ఆడలేక ఇబ్బందిపడుతున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్లో స్టంపౌట్గా వెనుదిరిగిన వైభవ్.. తర్వాతి రెండు మ్యాచ్లలోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో దొరికిపోయాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి సూర్యవంశీ కేవలం 42 పరుగులు చేశాడు. అయితే వరుస మ్యాచ్ల్లోనూ విఫలమైనందుకు గాను వైభవ్కు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్ తీసుకున్నట్లు 'రేస్పోర్ట్స్' తమ కథనంలో పేర్కొంది. కాగా నాలుగో టీ20 అనంతరం గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్లు కలిసి తొలుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో ఏదో విషయం తీవ్రంగా చర్చించారు. ఆ తర్వాత శ్రేయస్ పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్కు వెళ్లడంతో, గంభీర్ సూర్యవంశీతో మాట్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 శనివారం రోజ్బౌల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.చదవండి: ENG vs IND: 'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి' -
చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్కు ఆర్చర్ స్ట్రోక్!
ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్తో అలరించిన వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదే జట్టులో సహచరుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సమయంలో వైభవ్ను ఔట్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అస్త్రాలున్నాయని అడిగినప్పుడు, అదేంటనేది ఐపీఎల్ ముగిసిన తర్వాత మీకే తెలుస్తోందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీని జోఫ్రా ఆర్చర్ రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను బయటపెట్టుకున్న వైభవ్ ఆర్చర్కు దొరికిపోయాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ షార్ట్ పిచ్ బంతులు ఆడలేక వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ చెప్పి మరీ వైభవ్కు స్ట్రోక్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఐపీఎల్లో ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై ఇబ్బంది పడడం వెనుక ప్రధాన కారణం ఇంగ్లండ్, ఇండియాలోని పిచ్ల మధ్య ఉన్న తేడానే. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. Jofra Archer was asked about how to bowl against Vaibhav Suryavanshi & he said, I will tell you after the IPL as he knew India & England will play after IPL.& here, he got Vaibhav out in 2 consecutive games🔥🔥pic.twitter.com/O3aiDalTQh— Rajiv (@Rajiv1841) July 9, 2026 Does Jofra Archer really have the secret to stop Vaibhav Sooryavanshi? 🤔😅Scorecard ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/MN65hq2gH9— IndianPremierLeague (@IPL) May 27, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో
-
నేపాల్తో చారిత్రక క్రికెట్ సిరీస్.. వైభవ్కు ప్రమోషన్!
నేపాల్తో క్రికెట్ బంధాన్ని పెంచుకునే క్రమంలో బీసీసీఐ మరో కీలక అడుగు వేయనుంది. సమీప భవిష్యత్తులో భారత జట్టు క్రికెట్ సిరీస్ ఆడేందుకు నేపాల్కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళిక రాజకీ యాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బంధం చారిత్రక క్రికెట్ సిరీస్ నిర్వహణతో మరింత బలపడనుంది. అయితే నేపాల్ పర్యటనకు సీనియర్ జట్టును కాకుండా ఇండియా-ఏ జట్టును పంపించనున్నట్లు దేవజిత్ స్పష్టం చేశారు.అయితే నేపాల్తో ఆడబోయే సిరీస్ ఏ ఫార్మాట్లో నిర్వహించాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇండియా-ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను వైభవ్కు అప్పగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికైతే తిలక్ వర్మ ఇండియా-ఏ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అతడికి విశ్రాంతినిచ్చి వైభవ్ను కెప్టెన్ హోదాలో నేపాల్కు పంపే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్ ఆటలో ఇంకా ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఇటీవల సంవత్సరాల్లో ఆసియా దేశాల నుంచి క్రికెట్లో అడుగుపెట్టిన దేశాల్లో నేపాల్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆటలో పురోగతి సాధించడం ద్వారా నేపాల్ జట్టు వరుసగా 2024తో పాటు 2026 టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్లో దక్షిణాప్రికాకు ఓడించినంత పని చేసిన నేపాల్.. 2026 టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ను కూడా ఓడించినంత పని చేసింది. చివరకు ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక ఇదే ప్రపంచకప్లో స్కాట్లాండ్పై విజయంతో నేపాల్ మెగా టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ టూర్కు ఎంపికైనప్పటికీ వైభవ్ సూర్యవంశీకి ఆ సిరీస్లో ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ టూర్లో మాత్రం తొలి టీ20 మినహా మిగతా అన్న్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ వైభవ్ రాణించడంలో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లు కలిపి వైభవ్ 42 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్తో పాటు లంకలో జరిగిన ట్రై సిరీస్లో పరుగుల పండుగ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. India A are likely to tour Nepal.. @BCCI secretary Devajit Saikia had hinted about this to reporters in Mumbai recently!— Gaurav Gupta (@toi_gauravG) July 10, 2026చదవండి: ‘శ్రేయస్ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’ -
శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
బ్రిస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓ వైపు క్రమం తప్పకొండా వికెట్లు పడుతున్నప్పటికి, అయ్యర్ తన దూకుడును కొనసాగించాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదన్పించాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ మరోసారి నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. రెండో టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి వైభవ్ దొరికిపోయాడు.తొలి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ను ఆచితూచి ఆడిన వైభవ్.. రెండో ఓవర్ వేసిన జోష్ టంగ్ బౌలింగ్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది తన రిథమ్ను అందుకున్నాడు. కానీ తర్వాత ఓవర్లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి వైభవ్ ఔటయ్యాడు.షార్ట్ లెంగ్త్ బంతిని 'పుల్' షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న సామ్ కుర్రాన్ సునాయస క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ గత రెండు మ్యాచ్లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మొదటి మూడు మ్యాచ్లలో 42 పరుగులు చేశాడు. కాగా వైభవ్కు ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను సైతం పక్కన పెట్టారు. కానీ వైభవ్ మాత్రం తన లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.Similar type of dismissals ☠️Weakness of Vaibhav Sooryavanshi which the bowlers have started exploiting....Need to work on this in the coming days else it will be difficult...#ENGvsIND pic.twitter.com/uDkthonNnB— Wanderer (@vkyash18oz) July 9, 2026 -
సంజూను తప్పించలేదు.. వైభవ్ కోసం తప్పుకున్నాడు.. సెలక్షన్ వెనుక అసలు కథ
-
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్కు అవకాశంకాగా ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా నాకౌట్ మ్యాచ్లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
ఒకే ఒక్క ఓటమితో చెత్త రికార్డు లిస్టులో టీమిండియా
-
మేం చెప్పాల్సిన పని లేదు ఎలా ఆడాలో వైభవ్ కు తెలుసు
-
టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్కు ఇదే నా సవాల్’
ఇంగ్లండ్ గడ్డపై తేలిపోతున్న టీమిండియాకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చురకలు అంటించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడడమంటే ఐపీఎల్లో ఆడినంత తేలిక కాదని, ఇక్కడి పిచ్లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని, గుడ్లెంగ్త్తో బంతులు విసిరితేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నాడు. టీమిండియాకు చురకలు అంటించడంతో పాటు వైభవ్ సూర్యవంశీకి కూడా ఓపెన్ చాలెంజ్ విసిరడం ఆసక్తిగా మారింది. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆర్చర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గడ్డపై పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో బౌలర్లకు కఠినంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలంగా అక్కడి మైదానాల్లోని బౌండరీలను తక్కువ దూరంలోనే ఉంటాయి. కానీ ఇంగ్లండ్లో పరిస్థితులు అలా ఉండవు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసిరితేనే ఇక్కడ వికెట్లు లభిస్తాయి. ఇక్కడి మైదానాల్లో బౌండరీల దూరం తక్కువ ఉన్నప్పటికీ బంతి వికెట్ల మీదకు వస్తుంది కాబట్టే ఆడడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఐపీఎల్లో 200 స్కోరు చేసినా కూడా ఓడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంగ్లీష్ పిచ్లపై 200 స్కోరు అంటే ఆషామాషీ కాదు. జాగ్రత్తగా ఆడకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వైభవ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్చర్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టడంపై ఆర్చర్ను ప్రశ్నించగా.. ‘రాబోయే మ్యాచ్ల్లో అతడిని ఎదుర్కొనే సమయంలో స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా. వైభవ్కు ఇదే నా సవాల్ (నవ్వుతూ)* అని ఆర్చర్ తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 125 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పూర్తి ఓవర్లు ఆడకుండానే 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (70), సామ్ కరన్ (44 నాటౌట్) రాణించారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్ వేదికగా జరగనుంది.Read: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
టీమిండియాలో తీవ్ర కలకలం గంభీర్ తో సంజూ గొడవ..
-
అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!
విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్ వేదికగా రెండో టీ20లో శ్రేయస్ సేన ఓటమి పాలైంది.ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్హామ్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.వరల్డ్కప్ ప్లాన్లో భాగమే!టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్కప్ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.ముందుగా ఏం చెప్పలేదుఇక వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. -
గౌరవం దక్కలేదన్నాడు!.. సూర్యకుమార్ పోస్ట్ వైరల్
తన గురించి జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని.. అసత్య వార్తలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. టీమిండియా గొప్ప విజయాలు సాధించాలని.. జట్టుకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.ఏకంగా జట్టు నుంచే తప్పించారుకాగా ఈ ఏడాది భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్గా వరల్డ్కప్ ట్రోఫీ గెలిచినా.. ఆటగాడిగా విఫలమయ్యాడనే కారణంతో అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించారు సెలక్టర్లు.సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించింది బీసీసీఐ. అయితే, శ్రేయస్ సారథ్యంలో.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీమిండియాకు ఇటీవల ఘెర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా ఊహించని విధంగా 2-0తో క్లీన్స్వీప్ అయింది.అనంతరం ఇంగ్లండ్ పర్యటనను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. సూర్యను తప్పించి పొరపాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సైతం ఇలాగే స్పందించాడనే వార్త వైరల్ అయింది.గౌరవం దక్కలేదన్నాడు!తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టంగా తెలియదని.. సమాచారం కూడా ఇవ్వలేదని.. అసలు తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని సూర్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై సూర్య తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.సూర్యకుమార్ పోస్ట్ వైరల్‘‘భారత జట్టు కూర్పు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. టీమిండియాకు మంచి జరగాలనే ఎల్లప్పుడూ కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.ముఖ్యంగా వైభవ్.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకాస్త ఆసక్తిగా సాగాలని నేను కోరుకుంటున్నా. ఆడుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు. దేశాన్ని గర్వపడేలా చేయాలి. ఇక సోషల్ మీడియాలో నేను అన్నట్లుగా ఓ వార్త ప్రచారం కావడం నా దృష్టికి వచ్చింది.అవన్నీ తప్పుడు కథనాలు. నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మవద్దు.భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నకిలీ వార్తల కంటే ఆట గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా’’ అని సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్కు గాయం! -
మూడో టీ20కు ముందు వైభవ్కు గాయం
ఇంగ్లండ్తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ విషయమై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్మెంట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో వైభవ్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది. దీంతో అతడు వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చాడు. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం కొద్దిసేపటికే మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో అతడికి ఎలాంటి తీవ్రమైన గాయం లేదని స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నాటింగ్హమ్ వేదికగా ఇవాళ రాత్రి 10 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమయ్యే మూడో టీ20లో వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగడం ఖాయమే. జులై 4న జరిగిన రెండో టీ20తో టీమిండియా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు, ఆ మ్యాచ్లో మంచి షాట్లు (10 బంతుల్లో 14; 2 సిక్సర్లు) ఆడినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు.దీంతో నేటి మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పై ఈ సిరీస్లో భారత్ 0-1తో వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల్లో వైభవ్ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా సిరీస్లో కుదురుకోవచ్చు.ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి రెండో టీ20లో టీమిండియానే గెలవాల్సి ఉండింది. అయితే కీలక దశలో రవి భిష్ణోయ్ ఓ ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా కొంపముంచాడు. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత అభిమానులు భిష్ణోయ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చెత్త ప్రదర్శన తర్వాత భిష్ణోయ్ నేటి మ్యాచ్లో ఆడటం దాదాపుగా అసాధ్యమే. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఒక్క మ్యాచ్కే పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే క్రికెట్ వర్గాలు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరపున డెబ్యూ చేసిన అతి పిన్నవయష్కుడిగా చరిత్రను తిరగరాసిన సూర్యవంశీ.. తన మొదటి మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్, తన మార్క్ను చూపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో శాంసన్ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకు రావాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20లో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో కీలకమైన మూడో టీ20లో శాంసన్ తిరిగి ఆడనున్నట్లు సమాచారం.టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన శాంసన్.. యూకే పర్యటనలో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. వరుసగా మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టి వైభవ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ అతడు కూడా విఫలం కావడంతో సీనియర్ అయిన సంజూకే మళ్లీ అవకాశమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్లో వైభవ్ను పూర్తి స్ధాయిలో ఆడించే యోచనలో మేనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జూలై ఆఖరిలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ సీనియర్ ప్లేయర్ అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ క్రమంలో వైభవ్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు అస్కారం ఉంది.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఈవెంట్ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్ మ్యాచ్లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్-2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఓవైపు గత మూడు మ్యాచ్లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను మాత్రం కొనసాగించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్ చేయడం లేదు కదా!నేనైతే ఇది జోక్ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్ మరొకటి ఉండదు.ఎందుకంటే వైభవ్ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్ చేసేవాడు’’ అని సంజయ్ మంజ్రేకర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా ఈ బిహారీ పిల్లాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సంజూ స్థానంలో...కేవలం పదిహేనేళ్ల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈ ఘనత సాధించాడు. గత మూడు మ్యాచ్లలో విఫలమైన ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ తుదిజట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, వైభవ్ను ఐర్లాండ్ పర్యటనలోనే అరంగేట్రం చేయాల్సిందంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యం కావాలనే అతడిని వేచి చూసేలా చేస్తోందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.విమర్శలపై బీసీసీఐ స్పందనవైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నేపథ్యంలో ANIతో మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి శుభాభినందనలు. గొప్ప అవకాశం అందుకున్నావు. బీసీసీఐ ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించదు. వివక్ష చూపించదు.అర్హత ఉన్న వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుంది. అయితే, వైభవ్ అరంగేట్రానికి ముందు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది గగ్గోలు పెట్టారు. కోచ్, కెప్టెన్ను నిందించారు. కానీ అందులో అర్థం లేదు.సరైన సమయం వచ్చినపుడు వైభవ్ తప్పకుండా అరంగేట్రం చేస్తాడని నేను ముందు నుంచే చెప్తున్నాను. అందుకు తగ్గట్లుగా శనివారం అతడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గొప్పగా ఆడుతూ భవిష్యత్తును బంగారం చేసుకుంటాడని నమ్ముతున్నాను. వైభవ్ విషయంలో యాజమాన్యం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకు వారిని తప్పక ప్రశంసించాల్సిందే’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ తప్పు చేశాడు: గావస్కర్An incredibly special moment in the #TeamIndia camp today 🥹💙🎥 Presenting T20I cap no. 122, Vaibhav Sooryavanshi 🧢#ENGvIND pic.twitter.com/hvOZdSN3Ow— BCCI (@BCCI) July 4, 2026 -
ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..
-
వైభవ్ తప్పు చేశాడు.. అస్సలు ఊహించలేదు: సునీల్ గవాస్కర్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఘనమైన అరంగేట్రం లభించలేదు. శనివారం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ఈ చిచ్చర పిడుగు, విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన జాక్స్.. ఐదో బంతిని వైభవ్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్, ఫ్రంట్ ఫుట్కు వచ్చి కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి వెళ్లింది. బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వైభవ్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదని, బౌలర్ ట్రాప్లో చిక్కుకున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు."అది వైభవ్ ఆడే షాట్ కాదు. అనవసరంగా క్రీజు వదలి బయటకు వచ్చాడు. కట్షాట్ ఆడుతాడని ఊహించలేదు. అతడి అసలైన బలం కవర్ డ్రైవ్" అని ఆయన అన్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యవంశీ ఇప్పుడు భారత్ ముద్దుబిడ్డగా మారాడు. ప్రతి ఒక్కరూ అతడి రాణించాలని కోరుకుంటున్నారు.అతడు తనదైన శైలిలో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడుతాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ బిహార్ క్రికెటర్కు మరో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో టీ20లో కూడా వైభవ్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 7న మూడో టీ20 ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. -
15 ఏళ్ల 99 రోజులు..
12 ఏళ్ల 284 రోజుల వయసులో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్... ఈ మైలురాయితోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత భారత సీనియర్ జట్టు ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఈ మధ్య కాలంలో అతను చూపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు, సంచలన ఇన్నింగ్స్లు చర్చనీయాంశంగా నిలిచాయి.తక్కువ వయసుకు సంబంధించి వరుసగా ఎన్నో ఫీట్లు నమోదు చేయడం ఒక ఘనత కాగా... వయసుతో సంబంధం లేకుండా అతని విధ్వంసక బ్యాటింగ్తో ప్రతీసారి అందరినీ అలరించడం వైభవ్ ప్రత్యేకతగా నిలిచింది. అలవోకగా సిక్సర్లు బాదే అతని నైపుణ్యం అందరితో ఔరా అనిపించేలా చేసింది. ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన (13 ఏళ్ల 187 రోజుల్లో) కొద్ది రోజులకే ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు అతడిని ఎంచుకుంది.2025 ఐపీఎల్లో 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్... తాను ఐపీఎల్లో ఆడిన తొలి బంతినే సిక్స్గా మలచి రాబోయే రోజులపై సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 35 బంతుల్లోనే సెంచరీ బాది సత్తా చూపించాడు.అండర్–19 జట్టు సభ్యుడిగా ఇంగ్లండ్పై 52 బంతుల్లో సెంచరీ, ఆ తర్వాత ఆసియా కప్లో యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు, విజయ్హజారే ట్రోఫీలో 36 బంతుల్లో సెంచరీ, ఇంగ్లండ్పై అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్లో 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175, ఇండియా ‘ఎ’ తరఫున శ్రీలంకపై 29 బంతుల్లో 94 పరుగులు... ఇలా వరుసగా వచ్చిన అద్భుత ప్రదర్శనలు అతని స్థాయిని పెంచుతూ వచ్చాయి. ఇక ఐపీఎల్–2026లో అతని విశ్వరూపం కనిపించింది. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో చేసిన 776 పరుగులు వైభవ్ను శిఖరానికి చేర్చాయి. ఇందులో 63 ఫోర్లు, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక అప్పటినుంచి అతను భారత జట్టుకు ఆడటమే మిగిలింది అని అందరికీ అర్థమైంది. అంచనాలకు అనుగుణంగా అతనికి అవకాశం దక్కాలని అంతా కోరుకున్నారు. ఐర్లాండ్తో తొలి రెండు మ్యాచ్లకు, ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టి20కి తుది జట్టులో చోటు లభించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎట్టకేలకు అందరూ ఎంతగానో ఎదురు చూసిన క్షణం శనివారం వచి్చంది. ఈ మ్యాచ్లోనూ తనదైన శైలిలో ఆర్చర్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా, టంగ్ బౌలింగ్ మిడ్వికెట్ మీదుగా వైభవ్ కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినా... భారత క్రికెట్లో అతని వైభవానికి పునాది పడినట్లే.'ఆర్చర్ బౌలింగ్లో తాను ఆడిన తొలి బంతినే వైభవ్ సిక్స్ కొట్టాడు. అతని ‘తొలి బంతి’ బాధితుల జాబితాలో ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, లుంగీ ఎన్గిడి, జస్ప్రీత్ బుమ్రాలాంటి స్టార్లు ఉండటం విశేషం.' -
వైభవ్ కోసం శాంసన్పై వేటు.. మైదానంలోనే ఓదార్చిన గంభీర్!
జెంటిల్ మ్యాన్ గేమ్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా.. సిక్సర్లు కొట్టినా.. రికార్డులు తిరగరాసినా.. ఒక్క రెండు మ్యాచ్లలో విఫలమైతే జట్టులో చోటు కోల్పవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ విషయంలో అదే జరిగింది.టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పుడు తుది జట్టులో తన స్ధానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20కు సంజూను టీమ్ మేనెజెమెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకు అవకాశమిచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.శాంసన్ను ఓదార్చిన గంభీర్కాగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంతో సంజూ శాంసన్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చాడు. టాస్ తర్వాత కోచ్ గంభీర్, శాంసన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయి వేసి ధైర్యం చెబుతూ కనిపించారు.శాంసన్ ఐపీఎల్-2026లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలతో 477 పరుగులు చేశాడు. అయినప్పటికి వరుసగా మూడు మ్యాచ్లలో ఫెయిల్ కావడంతో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు.Good to see Gautam Gambhir having a chat with Sanju Samson. That's always one thing you need from the management. pic.twitter.com/woihQi2l82— Pitch Perfect (@_pitch__perfect) July 4, 2026 -
వైభవ్ ఫెయిల్.. అయినా భారత్ భారీ స్కోర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు స్కోర్ సాధించింది.భారత ఇన్నింగ్స్లో అరంగేట్ర ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(14) విఫలమైనప్పటికి.. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 49), అభిషేక్ శర్మ(43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, డాసన్ తలా వికెట్ సాధించారు. వైభవ్ రెండు భారీ సిక్స్లు కొట్టి మంచి టచ్లో కనిపించినప్పటికి.. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి సూర్యవంశీ స్టంపౌటయ్యాడు.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్. -
నాడు సచిన్.. నేడు వైభవ్! తొలి మ్యాచ్లో ఇద్దరూ ఒకేలా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర మ్యాచ్లో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో భారీ అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన ఈ వండర్ కిడ్, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోలేక భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలచడంతో.. మాంచెస్టర్లో వైభవ్ షో ఖాయమని అంతా అనుకున్నారు.కానీ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో వైభవ్ అనవసర షాట్కు ప్రయత్నించి స్టంపౌట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. రెండు సిక్సర్ల సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.అయితే అరంగేట్రంలో వైభవ్ రాణించకపోయినప్పటికి ఓ చారిత్రత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయష్కుడిగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్(16) రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అరంగేట్రం చేశాడు.నాడు సచిన్.. నేడు వైభవ్కాగా ఈ మ్యాచ్లో విఫలమైన వైభవ్కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్తో వైభవ్ను పోలుస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ కూడా తన అరంగేట్ర మ్యాచ్లో పాకిస్తాన్పై కేవలం 15 పరుగులు చేసి.. వకార్ యనిస్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇప్పుడు సూర్యవంశీ కూడా దాదాపు అదే స్కోర్ వద్ద అవుట్ కావడంతో.. ఈ చిచ్చర పిడుగు కూడా సచిన్లా లెజెండరీ క్రికెటర్ అవుతాడని అభిమానులు జోస్యం చెబుతున్నారు.First Ball Archer To Sooryavanshi = SIX 🔥Bumrah, Boult, Starc, Hazlewood, Bhuvneshwar, Siraj, Rabada, Pat Cummins Now Jofra Archer 🔥Jigra Cahiye 15 Ki Age Me Itne Bade Bade Bowlers Ko SIXES Maarne Ke Liye Broo ☠️#VaibhavSooryavanshi 💎🔥📈#ENGvIND…— Manraj (@jatt_on_x) July 4, 2026 -
వండర్ కిడ్ ఎంట్రీ.. భారత క్రికెట్ సరికొత్త అధ్యాయం (ఫొటోలు)
-
టాస్ గెలిచిన టీమిండియా: అతడిపై వేటు.. వైభవ్ అరంగేట్రం
ఇంగ్లండ్తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఓపెనర్గా సంజూ శాంసన్ స్థానాన్ని పదిహేనేళ్ల వైభవ్ భర్తీ చేశాడు.టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈసారి కూడా తొలుత బ్యాటింగ్ చేస్తాం. మా తుదిజట్టులో ఒక మార్పు. సంజూ స్థానంలో వైభవ్ ఆడతాడు. గత రెండు నెలలుగా అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడు ఒత్తిడికి లోనుకాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఆడగలడు’’ అని వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. కాగా 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్.. అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. గత మూడు మ్యాచ్లలో విఫలమైన సంజూ (5, 0, 1)పై యాజమాన్యం వేటు వేసింది.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: శ్రీలంకతో వన్డే.. భారత్ ఘన విజయం -
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో వైభవ్కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకున్నారు. దీంతో భారత సీనియర్ జట్టు తరపున డెబ్యూ చేసిన అతి పిన్న వయష్కుడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులోఅరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదగా వైభవ్ భారత క్యాప్ను అందుకున్నాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రెండు మార్పులు చేసింది. జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున డెబ్యూ చేయగా.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ -
అతడిలో సచిన్, కోహ్లి కనిపిస్తున్నారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: కపిల్ దేవ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులతో దిగ్గజ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్కు జట్టుతో పాటు ఉన్నప్పటికి డెబ్యూ చేసే అవకాశం రాలేదు.ఇప్పుడు కనీసం ఇంగ్లండ్ టూర్లోనైనా 15 ఏళ్ల సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ భారత మాజీ కెప్టెన్, లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయి ప్రతిభ కనిపిస్తోందని ఆయన అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అతడి టాలెంట్ను చూసి అవకాశమివ్వాలని కపిల్ సూచించారు."వైభవ్కు సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి అంతటి ప్రతిభావంతుడు. ఈ యువ ఆటగాడు టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడు. ప్రపంచంలో ఇలాంటి రేర్ టాలెంట్ ఉన్నవాళ్లు ఒక శాతం కూడా ఉండరు. ఇంత చిన్న వయస్సులో ఈ తరహా బ్యాటింగ్ చేయడం నిజంగా అద్భుతం. అయితే మిగిలిన ఫార్మాట్లలో అతడు తనని తాను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అతడు టెస్ట్ క్రికెట్లో వరుసగా ఐదు ఓవర్ల పాటు మెయిడెన్లు ఆడగలడా? అనేది చూడాలి. నేను ఇప్పటివరకు పెద్దగా అతడి ఆట చూడలేదు.కానీ ఎక్కడకు వెళ్లినా అతడి గురించే చర్చనడుస్తోంది. ఈ యువ ఆటగాడిపై ఇప్పుడే అతిగా హైప్ క్రియేట్ చేస్తాన్నమని నాకనిపిస్తోంది. అతడిపై అనవసర ఒత్తిడి క్రియేట్ చేయకూడదు. ఈ వయసులో అంతటి అవగాహన ఉండదు. అతడికి కొంత సమయం ఇవ్వాలి.అయితే సచిన్ కూడా దాదాపు ఇదే వయస్సులో(16) అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటిలో మేము కూడా ఇంత చిన్న వయస్సు ప్లేయర్ ఆడించి తప్పు చేస్తాన్నామా? అని అనుకున్నాం. కానీ గత చరిత్రను పరిశీలిస్తే.. టాలెంట్ ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదని అర్థమవుతుంది. అందుకే వైభవ్ను వయస్సు బట్టి కాకుండా టాలెంట్ను చూసి జట్టులోకి తీసుకోవాలని" కపిల్ దేవ్ పేర్కొన్నారు.చదవండి: IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్గా విధ్వంసకర ప్లేయర్! -
టీం ఇండియా ఊపిరి పీల్చుకో.. బుడ్డాడు వస్తున్నాడు
-
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్ను బెంచ్కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్లో ఏదో ఒక మ్యాచ్లో వైభవ్కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్కు టాపార్డర్లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
అరంగేట్రంపై హింట్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ఎట్టకేలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో శనివారం (జులై 4) జరగనున్న రెండో టీ20లో వైభవ్కు తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.వైభవ్ తన అంతర్జాతీయ అరంగేట్రం విషయాన్ని సోషల్మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించాడు. రెండో టీ20కి ముందు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో "New Chapter" అంటూ పోస్ట్ చేసి అరంగేట్రంపై పరోక్ష సంకేతాన్నిచ్చాడు. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతోంది. వాస్తవానికి వైభవ్ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నారు. ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే రెండో మ్యాచ్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆతర్వాత ఇంగ్లండ్ సిరీస్ తొలి మ్యాచ్లోనూ వైభవ్ ఎంట్రీ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ మ్యాచ్లోనూ అతడిని అవకాశం దక్కలేదు. తాజాగా వైభవ్ స్వయంగా తన అరంగేట్రంపై హింట్ ఇవ్వడంతో అభిమానులంతా ఈ రోజు మ్యాచ్లో అతడి మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే, వైభవ్ అరంగేట్రంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడిని తొందరపడి జట్టులోకి తీసుకురావడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-2 బ్యాటర్గా ఉన్న అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి వైభవ్కు వెంటనే అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.వైభవ్పై కూడా ఎంతో నమ్మకం ఉందని.. అవకాశం వచ్చినప్పుడు అతడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడని అన్నాడు.మరోవైపు సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో అతని చివరి మూడు ఇన్నింగ్స్ల్లో వరుసగా 5, 0, 1 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టీ20లో సంజూకు విశ్రాంతి ఇచ్చి, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ
-
వైభవ్కు చాన్స్ దక్కేనా!
మాంచెస్టర్: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఇంకా గెలుపు బోణీ చేయని భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో టి20లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. వర్షంతో రద్దయిన గత మ్యాచ్లో భారత్ 189 పరుగులు చేసినా... ఇంకా అంచనాలకు తగిన రీతిలో ఆడలేదనేది వాస్తవం. ఆరంభంలో జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సామ్సన్, ఇషాన్ కిషన్ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమయ్యారు. అయినా సరే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై భారత్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చంటూ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమ్ మేనేజ్మెంట్ వైభవ్ విషయంలో నిర్ణయం తీసుకోలేదని అర్థమవుతోంది. అయితే నాయకుడిగా వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ కెపె్టన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయిన స్థితిని బట్టి చూస్తే సామ్సన్ ఇంకా ఎంతో కాలం తన వరల్డ్ కప్ మెరుపులతోనే జట్టులో కొనసాగలేడు. కాబట్టి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను నిలిచాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు సానుకూలాంశం. ఇంగ్లండ్పై ఆడిన గత ఏడు మ్యాచ్లలో 220 స్ట్రయిక్రేట్తో అభిషేక్ శర్మ 3 అర్ధసెంచరీలు చేయడం ఈ జట్టుపై అతని జోరుకు ఉదాహరణ. కెపె్టన్ శ్రేయస్ అర్ధ సెంచరీ చేసినా అతని బ్యాటింగ్లో తగిన ధాటి కనిపించలేదు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత తనదంటూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని తిలక్ వర్మపై రాణించాల్సిన ఒత్తిడి ఉందనేది వాస్తవం. గత మ్యాచ్లో ఎవరికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కాబట్టి బౌలర్ల బృందంలోనూ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.మరోవైపు ఆర్చర్ రాకతో ఇంగ్లండ్ పేస్ పదును పెరిగింది. జోష్ టంగ్ కూడా ఈ మ్యాచ్తో టి20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. మహమూద్, ల్యూక్వుడ్ స్థానాల్లో వీరిద్దరు బరిలోకి దిగుతారు. బట్లర్, బ్రూక్, బెతెల్, జాక్స్లతో పదునైన బ్యాటింగ్ లైనప్ జట్టు సొంతం. ఫిల్ సాల్ట్ తన సొంత స్టేడియంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఓల్డ్ట్రఫోర్డ్ మైదానంలో అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా బాగా ప్రభావం చూపగలరు. అయితే మంచి బౌన్స్తో చక్కటి షాట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. గత ఏడాది ఇక్కడి పిచ్పై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో ఇంగ్లండ్ 300కు పైగా స్కోరు నమోదు చేసింది. -
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా తరపున అరంగేట్రం కోసం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణ కొనసాగుతోంది. ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన వైభవ్.. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లోనూ డెబ్యూ చేసే సూచనలు కనిపించడం లేదు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో వైభవ్కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లనే ఓపెనింగ్ జోడీగా టీమ్ మేనెజ్మెంట్ కొనసాగిస్తోంది. సంజూ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలం కావడంతో సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు మాత్రం సీనియర్ ప్లేయర్లకే మద్దతు ఇస్తున్నారు. దీంతో గంభీర్, అయ్యర్ తీరుపై చాలా మంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్, కోచ్ విమర్శలు చేయడం సరికాదని శుక్లా అన్నారు.వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు మేనేజ్మెంట్పై వస్తున్న విమర్శలు నా వరకు వచ్చాయి.నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మ్యాచ్ పరిస్థితిని బట్టి కోచ్, కెప్టెన్ తుది నిర్ణయం తీసుకుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అంతవరకు ఇలాంటి అనవసర విమర్శలు చేయడం ఆపాలి." అని 'టైమ్స్ నౌ'తో శుక్లా పేర్కొన్నారు.చదవండి: IND vs ENG: భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు -
'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి'
యూకే పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఇప్పుడు ఇంగ్లండ్లో అదే తీరును కనబరుస్తున్నాడు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో శాంసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.దీంతో అతడిని పక్కన పెట్టి బెంచ్పై ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్ సబా కరీం నిలిచాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ శాంసన్నే టాప్ ఆర్డర్లో కొనసాగించాలని కరీం అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. యూకే గడ్డపై తన మార్క్ చూపించలేకపోతున్నాడు. సంజూ తన చివరి 10 విదేశీ టీ20లలో ఐదుసార్లు డకౌట్, రెండుసార్లు వందకు పైగా స్కోర్లు సాధించాడు. మరో మూడుసార్లుసింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు. ఏదేమైనప్పటికి శాంసన్ తన టీ20 కెరీర్లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడనే చెప్పాలి.సంజూ శాంసన్ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పించే సాహసం మేనెజ్మెంట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అతడొక అద్భుతమైన ప్లేయర్. సంజూకి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. అతడు ఐపీఎల్లో కూడా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు.ఒకట్రెండు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రాన అతడి విమర్శించడం సరికాదు. సంజూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వైభవ్ ఆడకపోయినప్పటికి సీనియర్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోని చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. అతడికి టాలెంట్ ఉన్నప్పటికి ప్రస్తుత పోటీలో అవకాశం ఎదురు చూడక తప్పదు అని సబా కరీం స్టార్ స్పోర్ట్స్ డిబేట్లో పేర్కొన్నాడు. -
వైభవ్ ఆడాల్సింది.. వాళ్ల ప్యాంట్లు ఊడదీసేవాడు: రవిశాస్త్రి
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో వైభవ్కు చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలో సూర్యవంశీ డెబ్యూ చేస్తాడని భావించారు.కానీ టీమ్ మేనెజ్మెంట్ మాత్రం రెండు మ్యాచ్లలోనూ అతడికి తుది జట్టులో అవకాశమివ్వలేదు. సీనియర్ ప్లేయర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను ఓపెనర్లగా కొనసాగించింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లోనూ వైభవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్పై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ సిరీస్లో సూర్యవంశీ కి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆడాల్సింది. బెల్ఫాస్ట్ పిచ్ స్లో అండ్ స్పాంజీ ట్రాక్. మైదానం కూడా చాలా చిన్నది. వైభవ్ గనక ఆడి ఉంటే బంతులను స్టేడియం బయటకు పంపేవాడు. తన బ్యాటింగ్తో వాళ్ల ప్యాంట్లు ఊడదీసేవాడు. అతడి ఆడి ఉంటి బాగుండేది. ఇంగ్లండ్ టూర్లో కూడా అతడిని ఆడిస్తారో లేదో స్పష్టత లేదు. వైభవ్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్. సూర్యవంశీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడికి కేవలం 15 ఏళ్లే. మైదానంలోకి వెళ్లి చెలరేగిపోవడమే అతడికి తెలుసు. వైభవ్ జట్టులో ఉంటే కచ్చితంగా పవర్ప్లేలో పరుగులు సాధిస్తాడు. అతడికి వీలైనంత త్వరగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించాలి" అని ఇంగ్లండ్తో తొలి టీ20 ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్లో రవిశాస్త్రి పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక -
వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు
-
‘వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే వద్దు.. అతడికే నా మద్దతు’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సత్తా చాటిన టీమిండియా స్టార్ సంజూ శాంసన్.. ఈ మెగా ఈవెంట్ తర్వాత మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్లలో 5, 0 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.తాజాగా ఇంగ్లండ్ పర్యటనను కూడా సంజూ (Sanju Samson) పేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.అతడిని తప్పించండిఇలా వరుసగా గత మూడు మ్యాచ్లలో సంజూ శాంసన్ విఫలమైన నేపథ్యంలో అతడిని తుదిజట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. సంజూకు బదులు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ మాత్రం భిన్నంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో తొందరపాటు తగదని.. సంజూ- అభిషేక్నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.సంజూకే నా మద్దతు.. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ మరోసారి విఫలమైన మాట వాస్తవమే. గత మూడు ఇన్నింగ్స్లో అతడు దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి మద్దతు మరింతగా పెరుగుతోంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. సంజూ శాంసన్ ఓపెనర్గా సరైనోడే.ప్రపంచకప్ టోర్నీలో తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు రాణించి.. జట్టును గెలిపించాడు. చాలా మంది వైభవ్ ఇంకెప్పుడు ఆడతాడంటూ చర్చోపర్చలు చేస్తున్నారు. వారి ఆవేదన, ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను. వైభవ్ ఆ హక్కు సంపాదించుకోవాలికానీ నేను ఇప్పటికీ సంజూ శాంసన్కే మద్దతు ప్రకటిస్తాను. ప్రపంచకప్ టోర్నీలో అతడు రాణించిన తీరు అద్భుతం. అలా అని నేనేమీ వైభవ్కు వ్యతిరేకం కాదు. అయితే, వైభవ్ తుదిజట్టులో చోటు దక్కించుకునే హక్కును సంపాదించుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ పిల్లాడు అద్భుతంగా రాణిస్తాడు’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2026 నాకౌట్ మ్యాచ్లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: IND vs ENG: ఇషాన్ రనౌట్.. తప్పు నీదే! -
వైభవ్ సూర్యవంశీకి పెరుగుతున్న మద్దతు
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లకు నామమాత్రంగా ఎంపిక చేశారే తప్పిస్తే, ఇప్పటివరకు అతడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. పసికూన ఐర్లాండ్పైనే అతడు అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నా.. అక్కడ అది జరగలేదు. ఇంగ్లండ్లో అయినా అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా అంటే, అదీ లేనట్లే కనిపిస్తుంది.తాజాగా ముగిసిన తొలి టీ20లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మున్ముందు జరిగే నాలుగు మ్యాచ్ల్లో దక్కుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి మద్దతు పెరుగుతుంది. అతడిని ఎట్టిపరిస్థితుల్లో రెండో టీ20లో ఆడించాలని అభిమానులు సహా చాలామంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు.ఈ జాబితాలోకి కొత్తగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరాడు. రవిశాస్త్రి ఈ డిమాండ్ను వినిపించే క్రమంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పరోక్ష విమర్శలు గుప్పించాడు. అనుభవం పేరుతో వరుసగా విఫలమవుతున్నా, సంజూ శాంసన్కు అవకాశాలు ఇస్తున్నారన్నట్లు మాట్లాడాడు.వాస్తవానికి వైభవ్కు ఐర్లాండ్ సిరీస్లోనే అవకాశం ఇవ్వాల్సిందని, చిన్న గ్రౌండ్స్లో అతని భయం లేని బ్యాటింగ్ బాగా ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్లో అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడని.. ఇంగ్లండ్ అండర్-19 పర్యటనలో కూడా అతని ప్రదర్శనలు బలంగా ఉన్నాయని.. ఇప్పటికైనా వైభవ్ అవకాశాలు ఇవ్వడం సమంజసమని అభిప్రాయపడ్డాడు.శాస్త్రి సహా చాలామంది మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అనుభవం, పరిస్థితులు, బ్యాటింగ్ కాంబినేషన్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్కు వరుసగా విఫలమవుతున్నా, అవకాశాలు వస్తున్నాయి. మరి రెండో టీ20లోనైనా వైభవ్కు అవకాశమిస్తారో లేదో చూడాలి. -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?
👉ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ ఫిఫ్టీలతో రాణించగా.. ఆఖర్లో దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు.👉ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.👉12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసిందిశ్రేయస్ అయ్యర్ (39), తిలక్ వర్మ (11) క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ (59) ఎల్బీగా వెనుదిరిగాడు.20 బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిఫ్టీ సాధించాడు. 8 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. దంచుతున్న అభిషేక్ శర్మఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అభిషేక్ 16 బంతుల్లో 44 పరుగులతో ఆడుతుండగా, కెప్టెన్ అయ్యర్ ఆరు పరుగులతో సహకరిస్తున్నాడు. చెస్టర్-లె-స్ట్రీట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది.తుది జట్లుఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
'వైభవ్ సూర్యవంశీ ఆట చూసి షాకయ్యా.. మరో స్టీవ్ వా'
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరపున అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికి అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు వైభవ్ టీమిండియాతో పాటు ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. కనీసం ఇగ్లండ్ సిరీస్లోనైనా ఈ చిచ్చర పిడుగును ఆడించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాట్ ప్రయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వాతో వైభవ్ను ప్రయర్ పోల్చాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఒత్తిడిని తట్టుకుని రాణించే సత్తా ఉందని అతడు కొనియాడాడు.వైభవ్కు కేవలం టాలెంట్ మాత్రమే కాదు, స్టీవ్ వా తరహా మానసిక దృఢత్వం కూడా ఉంది. నామమాత్రపు మ్యాచ్లలో ఆడడం కాదు, క్లిష్ట సమయాల్లో కూడా రాణించేవాడే అసలైన క్రికెటర్. వైభవ్ ఇప్పటివరకు ఆడిన దాదాపు అన్ని కీలక మ్యాచ్లలోనూ సత్తాచాటాడు. ప్రపంచం మొత్తం చూస్తున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు.ఇదే అతడి స్పెషాలిటీ. వరల్డ్క్లాస్ బౌలర్లు అయితన జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లే ఎదుర్కోలేకపోయారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు వారి బౌలింగ్ను ఉతికారేశాడు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. బ్యాట్ స్పీడ్ కూడా చూడటానికి చాలా బాగుంది. వైభవ్ ఖచ్చితంగా భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్ అవుతాడు అని టాక్ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: భారత్ తుది జట్టు ఇదే! వైభవ్కు నో ఛాన్స్ -
ENG vs IND: భారత్ తుది జట్టు ఇదే! వైభవ్కు నో ఛాన్స్
ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావం తర్వాత తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం డుర్హమ్ వేదికగా ఇంగ్లండ్తో మొదటి టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్బ్యాక్ ఇవ్వాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.బౌన్సీ పిచ్లపై రాణించేందుకు భారత బ్యాటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ మ్యాచ్కు ముందు శ్రేయస్ సేనకు ఓ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఐర్లాండ్ టూర్కు దూరమైన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో చక్రవర్తి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. అతడు పునరాగమనం చేస్తే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సూర్యన్ష్ షెడ్గేను పక్కన పెట్టే అవకాశముంది.మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్కు కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లను కొనసాగించాలని టీమ్ మేనెజ్మెంట్ నిర్ణయించే అవకాశముంది.ఐర్లాండ్ సిరీస్లో సంజూ విఫలమైనప్పటికి.. ఇంగ్లండ్ సిరీస్లో తిరిగి పుంజుకుంటాడని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ తొలి మూడు టీ20లలో శాంసన్ విఫలమైతే వైభవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.అదేవిధంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు మరో అవకాశమిచ్చేందుకు మేనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు ఇంగ్లండ్ క్రికెట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ -
బెదిరింపులకు భయపడం వైభవ్ ఎంట్రీపై కెప్టెన్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
-
బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 బుధవారం డర్హమ్ వేదికగా జరనగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు మరోసారి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైనప్పటికి వైభవ్కు మాత్రం డెబ్యూ చేసే అవకాశం లభించలేదు. సంజూ శాంసన్, అభిషేక్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండడంతో వైభవ్ను మేనెజ్మెంట్ బెంచ్కే పరిమితం చేసింది.ఈ క్రమంలో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్కు ఓ అవకాశం ఇవ్వాలని మేనెజ్మెంట్ను సూచించారు. కానీ ఇంగ్లండ్ టూర్లో కూడా వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు.Vaibhav Suryavanshi is taking out his frustration from the Ireland T20 series loss in the nets at Durham.😭🔥 pic.twitter.com/80T3ovtnRY— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 30, 2026సీనియర్లకు తమ మద్దతు ఉంటుందని కెప్టెన్ అయ్యర్ మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనప్పటికి వైభవ్ మాత్రం తన ప్రాక్టీస్ను ఆపడం లేదు. తొలి టీ20కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత బౌలర్లపై వైభవ్ విరుచుకుపడ్డాడు. ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, అర్ష్దీప్ సింగ్ వంటి సీనియర్ పేసర్లను సూర్యవంశీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్చదవండి: మ్యాచ్ రద్దయినా రూ.8 లక్షలు ఫిక్స్! అంపైర్ల సంపాదన ఎంతంటే? -
నీళ్లు అందిస్తే తప్పేంటి? వైభవ్ పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
-
గంభీర్కు గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్! "వైభవ్ను ఆడించండి"
-
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన శ్రేయస్
ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ సిరీస్లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వైభవ్ను ఐర్లాండ్ సిరీస్లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ టీమిండియా మేనేజ్మెంట్పై ధ్వజమెత్తారు. ఓ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పేపర్ స్టేట్మెంట్ను సోషల్మీడియాలో ట్యాగ్ చేస్తూ టీమిండియా సిస్టమ్పై అసహనం వ్యక్తం చేశారు.గిరిరాజ్ సింగ్ చేసిన రచ్చపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడుతూ..తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్లో వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని, జట్టు అవసరాలు మరియు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని నేరుగా తిప్పికొట్టాడు.ఇదిలా ఉంటే, ఇవాళ ఇంగ్లండ్తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్ అరంగేట్రం అనుమానమేనని తెలుస్తోంది. భారత మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్కు వత్తాసు పలుకుతున్నారు. దీన్ని బట్టి నేటి మ్యాచ్లోనూ వైభవ్ అరంగేట్రం లేనట్లే అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన వైభవ్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
యూకే పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల తొలి టీ20 డర్హామ్ వేదికగా బుధవారం జరగనుంది. ఐర్లాండ్ చేతిలో ఎదరైన ఘోర పరాభవం నుంచి తిరిగి పుంజుకుని ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాలని భారత్ పట్టుదలతో ఉంది.అయితే ఐర్లాండ్ సిరీస్లో బెంచ్కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కనీసం ఇంగ్లండ్తో తొలి టీ20లోనా ఆడిస్తారా? లేదా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్లలోనూ విఫలమైన సంజూ శాంసన్ స్ధానంలో సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు. మరికొందరు ఇషాన్ కిషన్ను పక్కన పెట్టి వైభవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రేయస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు కోసం అయ్యర్ను విలేకరులు ప్రశ్నించారు. అయితే తుది జట్టు కాంబినేషన్ను ముందుగానే వెల్లడించడం తనకు ఇష్టం లేదని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.తొలి టీ20 కోసం మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాం. అయితే మేము ఏ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామో బహిరంగంగా వెల్లడించలేను. ఎందుకంటే ప్రత్యర్థులకు మా వ్యూహాలు తెలిసిపోతాయి. అందుకే గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను అని శ్రేయస్ పేర్కొన్నాడు.అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ గురించి విలేకరులు శ్రేయస్ను మరోసారి ప్రశ్నించారు. అయితే సూర్యవంశీ జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా అయ్యర్.. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగుపై ప్రశంసల జల్లు కురిపించాడు."సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. వైభవ్ వంటి గన్ ప్లేయర్ను బెంచ్లో కూర్చోబెట్టడం కెప్టెన్గా ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే అతడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం టీమ్ మేనేజ్మెంట్కు కూడా సవాల్గా మారింది. ఎందుకంటే గత కొన్ని సిరీస్లుగా అద్భుతంగా రాణించిన ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కాబట్లట్టి సీనియర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. కానీ వైభవ్కు ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అత్యుత్తమంగా రాణిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" శ్రేయస్ వెల్లడించాడు. అయితే శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్కు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశముంది.చదవండి: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్రౌండర్ -
ఎన్ని మ్యాచ్లు ఓడినా.. వైభవ్కు అవకాశం లేదా? కోచ్ కామెంట్స్తో హాట్ టాపిక్
-
IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే!
ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియాపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి.. చెత్త ప్రదర్శనతో మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు. ప్రపంచ చాంపియన్గా ఐరిష్ గడ్డపై అడుగుపెట్టి అతి విశ్వాసంతో కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంచ్కే పరిమితంఇక మరికొందరు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ పిల్లాడిని ఆడిస్తేనైనా ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్ను రెండు మ్యాచ్లలోనే బెంచ్కే పరిమితం చేసింది.ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారేమోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ఆ అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు.సంజూకు మా మద్దతు ఉంటుంది‘‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, సంజూ శాంసన్ను తుదిజట్టు నుంచి తప్పించడం కూడా సాధ్యం కాదు.మూడు నెలల క్రితం జట్టు ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లోనూ 2026లో సత్తా చాటాడు. ఈ సిరీస్లో అతడు విఫలం కావొచ్చు. అయినప్పటికీ మా ఆటగాళ్లకు మేము మద్దతుగానే నిలబడతాము.అతడిలో ఆత్మవిశ్వాసం పెంచేలానే మా చర్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. అరంగేట్రం చేసేందుకు వైభవ్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో.. అతడి ఆటను చూడాలని మేమూ అంతే ఆతురతతో ఎదురుచూస్తున్నాం.వైభవ్ వేచిచూడక తప్పదు!అయితే, అందుకు ఇంకాస్త సమయం ఉంది. మిగతా ఆటగాళ్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంటుంది. అంతమాత్రాన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటలేడని మేము భావిస్తున్నట్లు కానేకాదు’’ అని డష్కాటే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనూ వైభవ్ అరంగేట్రం చేయకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (49) రాణించగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (5), వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (1) నిరాశపరిచారు.ఇక రెండో టీ20లో సంజూ, అభిషేక్.. ఇద్దరూ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి జట్టు కొంపముంచారు. ఇషాన్ కిషన్ (12) అనవసరంగా పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్ను పసికూన ఐర్లాండ్కు కోల్పోయింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది.చదవండి: IND vs IRE 2nd T20: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం🔴 NO PLACE FOR VAIBHAV YET! TEAM INDIA BACKS SANJU SAMSON🤯Q🎙️: Coach, How far Vaibhav Suryavanshi from debut?Ryan ten doeschate🎙️: Vaibhav is absolutely ready for international cricket, but we won't rush him. Sanju played a big role in India's T20 World Cup win and had a… pic.twitter.com/4FrYEXD9O2— Sam (@cricsam02) June 29, 2026 -
రెండో టీ20 ఆడనున్న వైభవ్.. వేటు పడేది ఎవరిపైనో!
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్లో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాది ప్రత్యర్థిపై ఒత్తడి పెట్టే ప్రయత్నం చేసేవాడని కొంతమంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వైభవ్కు తుదిజట్టులో చోటు దక్కాలంటే ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్గానే ఆడే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వైభవ్ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్ది కీలకపాత్ర. టీ20 ప్రపంచకప్లో శాంసన్ 321 పరుగులు సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్తో తొలి టీ20లో మాత్రం శాంసన్ విఫలమయ్యాడు. నాలుగు బంతులెదుర్కొన్న శాంసన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమే గాక తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ ఐర్లాండ్తో మ్యాచ్లో విఫలమయ్యాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలంటే మాత్రం ఇషాన్ కిషన్ను తప్పించడమే తొలి మార్గం. ఎందుకంటే అభిషేక్తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ వస్తే, సంజూ శాంసన్ వన్డౌన్లో బ్యాటింగ్కు రానున్నాడు. అంతేకాదు శాంసన్ మూడో స్థానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐపీఎల్లో మూడో స్థానంలో 94 మ్యాచ్ల్లో 143 స్ట్రైక్రేట్తో 3,096 పరుగులు సాధించాడు. శాంసన్తో పాటు ఇషాన్ కిషన్ను జట్టులో ఉంచాలనుకుంటే ఆఖరి ఆప్షన్ మాత్రం తిలక్ వర్మే. అయితే తిలక్ వర్మ ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తున్నాడు. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తూ ఫినిషర్గా రాణిస్తున్నాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. అయితే టీ20 ప్రపంచకప్లో 9 ఇన్నింగ్స్ల్లో తిలక్ వర్మ 209 పరుగులు సాధించిన తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇన్ని బేరీజులు వేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్తో రెండో టీ20లో మాత్రం ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.Read: టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు -
‘నేను 13 సిక్స్లు కొడతా.. మిగతాది మీరు చూసుకోండి’
టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. ఐర్లాండ్ చేతిలో భారత జట్టు మొట్టమొదటిసారి పరాజయం పాలైంది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది.ముఖ్యంగా ఐరిష్ బౌలర్ల దెబ్బకు టీమిండియా స్టార్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. టాపార్డర్లో అభిషేక్ శర్మ (49) ఒక్కడు రాణించగా.. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) సైతం పూర్తిగా విఫలమయ్యాడు.బెంచ్కే పరిమితంకాగా ఐర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే, అనుభవానికే పెద్దపీట వేసిన యాజమాన్యం వైభవ్ను బెంచ్కే పరిమితం చేసింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులను తప్పించలేమంటూ ఈ పదిహేనేళ్ల పిల్లాడికి మొండిచేయి చూపింది.అయితే, ఐర్లాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో ఉండి ఉంటే.. పరాభవం తప్పేదంటూ అభిమానులు పేర్కొంటున్నారు. అతడిని ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ..‘‘లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్. మేము ముందుగా ఫీల్డింగ్ చేశాము. లక్నో విధించిన 220 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి ఉంది. అప్పుడు వైభవ్ నడుస్తూ నా దగ్గరకు వచ్చి కన్నుగీటి మరీ.. ‘కోచ్. మీరేమీ ఆందోళన పడకండి. ఇది మనం చేసి తీరతాము’ అని చెప్పాడు.నేను 13 సిక్సర్లు బాదతానుడ్రెసింగ్రూమ్లో డొనోవాన్ ఫెరీరా, లువాన్ డ్రి ప్రిటోరియస్ దగ్గరకు వెళ్లి.. ‘మీ ఇద్దరూ కాస్త వినండి. నేను ఈరోజు 13 సిక్సర్లు బాదబోతున్నాను. నేను నా పని పూర్తి చేసిన తర్వాత మీరు మిగతాది చూసుకోండి’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఏకంగా పది సిక్సర్లు కొట్టాడు.అతడు ఐదు సిక్సర్లు బాదిన తర్వాత డొనోవాన్, ప్రిటోరియస్ కింద కూర్చుని మరీ.. సిక్సర్లు లెక్కించడం మొదలుపెట్టారు. ఈ పిల్లాడు చెప్పింది చేసేట్లుగానే ఉన్నాడే అని ఆశ్చర్యపోయారు. వైభవ్ ఆత్మవిశ్వాసం అచంచలమైనది’’ అని సంగక్కర ‘స్కై స్పోర్ట్స్’తో వ్యాఖ్యానించాడు.పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్కాగా ఐపీఎల్-2026లో భాగంగా మే 19న జైపూర్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా.. ఈ ఘటన జరిగినట్లు సంగక్కర మాటల ద్వారా అర్థమైంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్సర్లు బాది 93 పరుగులు చేశాడు. రాజస్తాన్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఏకంగా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర -
తప్పు చేసారు... అదే బుర్డోడిని తీసుకొని ఉంటే ఊదేసేవాడు
-
తప్పు చేశారు.. వైభవ్కు అవకాశమివ్వాల్సింది!
ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా దారుణ పరాజయం చవిచూసింది. ఐర్లాండ్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 148 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే పసికూన చేతిలో ప్రపంచ నంబర్వన్, చాంపియన్ అయిన భారత్ ఓటమిని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్తో తొలి టీ20లో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి సంగతి పక్కనబెడితే.. ఇవాళ వైభవ్ జట్టులో ఉండుంటే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ వచ్చేవాడు. ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ విధ్వంసంర చూశాకా ఐర్లాండ్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయకపోయినా వేగంగా పరుగులు చేసేవాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించేవాడేమో. అవసరమయితే 12 లేదా 13 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేసేవాడేమో. అతడి విధ్వంసంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుండేదేమో. అభిషేక్ శర్మ తన స్టైల్ ఆటను ఆడినప్పటికీ, ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్తో పాటు ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం టీమిండియా కొంపముంచింది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆదుకుంటాడునుకున్న తిలక్ వర్మ చేతులెత్తేయడం, ఆల్రౌండర్ ట్యాగ్లు తగిలించుకొని బరిలోకి దిగిన శివమ్ దూబే, అక్షర్పటేల్, వాషింగ్టన్ సుందర్లు బాధ్యతగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం కనిపించింది. ఇదంతా జరగకుండా ఉండాలని అనుకొని ఉంటే వైభవ్కు ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది అన్నట్లుగా.. వైభవ్ను ఆడించకుండా తప్పు చేశారు అని చాలా మంది అభిమానులు సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 🚨 🚨 Shreyas Iyer creates history in his first match as captain 🚨 🚨 INDIA LOST FOR THE FIRST TIME TO IRELAND 💥 Imagine having Vaibhav Sooryavanshi ( who could have finished the game in 12th over) & not making him play. And instead going with Test players like washington… pic.twitter.com/3fgLG08qV7— TheFakeFakeer (@TheFakeFakeer) June 26, 2026 -
వైభవ్ను ఆడించకపోవడంపై శ్రేయస్ వివరణ!
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. ట్రై సిరీస్లో ఇండియా- ఏ తరఫున ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిసిన వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్తో తొలి టీ20లో ఆడిస్తారనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే వైభవ్ను ఆడించకపోవడంపై టాస్ సమయంలో శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయ్యర్ మాట్లాడుతూ.. ‘బెల్ఫాస్ట్ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా జట్టులో అద్భుతమైన ప్లేయర్స్ ఉండడంతో ఎవరిని తీసేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే గతంలో (టీ20 ప్రపంచకప్ 2026) మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్కు అవకాశం దక్కుతుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్మెంట్ పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగుతుంది’ అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక తొలి టీ20 కోసం కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్రౌండర్, మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్పటేల్, అర్ష్దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
-
ఐర్లాండ్లోనూ వైభవ్కు క్రేజ్.. నిమిషాల్లో అమ్ముడైన టికెట్లు
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొద్దిసేపట్లో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. లంక వేదికగా జరిగిన ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో జరిగిన ఫైనల్లో వైభవ్ 29 బంతుల్లోనే 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో సంచనల ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లో హాట్టాపిక్గా మారిపోయాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా లేదా అనే సంగతి పక్కనబెడితే ఐర్లాండ్లో వైభవ్కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మతిపోతోంది. డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20కి మలాహిడే స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది. కానీ అక్కడ మ్యూజిక్ కాన్సెర్ట్ ఉండడంతో మ్యాచ్ వేదికను బెల్ఫాస్ట్కు మార్చారు. అయితే ఈ స్టేడియం సామర్థ్యం 4వేల నుంచి 6వేల మధ్యే ఉంటుంది. అయితే ఇంత తక్కువ కె పాసిటీ ఉన్నప్పటికీ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడవ్వడం విశేషం. వైభవ్ ఆటను కళ్లారా చూసేందుకే టికెట్లు ఎగబడి కొన్నట్లు పలువురు పేర్కొన్నారు. అయితే మ్యాచ్ను డబ్లిన్లో కాకుండా బెల్ఫాస్ట్లో నిర్వహించడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇక ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: కెప్టెన్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే? -
‘ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు సిద్ధంగానే ఉన్నాము’
టీమిండియా- ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేపథ్యంలో కళ్లన్నీ భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం ఈ చిచ్చర పిడుగు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, వైభవ్ కోసం ఎవరిని తప్పించాలో తెలియడం లేదంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ బాంబు పేల్చాడు. దీంతో మ్యాచ్ మొదలైనపుడే వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా నమ్మలేని విషయంమ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియాలో ఉండటం నిజంగా నమ్మలేని విషయం. ఇక ముందు కూడా ఇది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే.ఇదొక గొప్ప రోజుఅతడొక ప్రత్యేకమైన ఆటగాడు. ఈ వారంలోనే అతడు మాపై అరంగేట్రం చేయవచ్చు. అతడి కెరీర్లోనే ఇదొక గొప్ప రోజు అవుతుంది’’ అని టక్కర్ వైభవ్ను కొనియాడాడు. అయితే, అదే సమయంలో.. ‘‘వైభవ్ను త్వరగా పెవిలియన్కు పంపి అతడి సంతోషాన్ని చెడగొట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. ఐర్లాండ్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై భారీ అంచనాలు, హైప్ ఉన్నాయి. నిజంగానే అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న బ్యాటర్. ఐపీఎల్లో సంచలనం సృష్టించాడు. పరిశోధనలు చేశాముఅయితే, అతడిని ఎలా త్వరగా అవుట్ చేయగలమన్న అంశం గురించి మేము చేయాల్సినన్ని పరిశోధనలు చేశాము. సానుకూల ఫలితం రాబట్టేందుకు కృషి చేస్తాం’’ అని వైభవ్కు టక్కర్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.ఇక ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. శతకానికి చేరువలో భారత కెప్టెన్ -
అభిషేక్ అవుట్..? ఐర్లాండ్ తో ప్లేయింగ్ 11 ఇదే
-
వైభవ్ వస్తున్నాడు.. రికార్డులు బద్దలే
-
వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము: టీమిండియా కోచ్
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో సరికొత్త సంచలనం. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ చిచ్చరపిడుగు.. ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20 మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడతాడా? లేదంటే బెంచ్కే పరిమితమవుతాడా? అన్న చర్చ మొదలైంది. ఐర్లాండ్తో మ్యాచ్ కాబట్టి వైభవ్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. వైభవ్ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగించాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానుసారమే తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము‘‘ఈ విషయంలో మా కెప్టెన్, హెడ్కోచ్దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ ఆడితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అతడు ఆడకపోయినా నాకు గొప్పే. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతడు టీమిండియాకు ఎంపికయ్యాడు కదా!వైభవ్కు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే, కేవలం అతడిని ఆడించేందుకు ఇప్పటికే పరుగులు రాబడుతూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లను తప్పించలేము కదా!.. అలా చేయడం కూడా సరికాదు.ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, భారత టీ20 జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ ఓపెనర్లుగా పాతుకుపోయారు.ఆడతాడా? లేదా?కొన్నిసార్లు అభిషేక్ విఫలమైనా యాజమాన్యం అతడిని కొనసాగించింది. కానీ సంజూ బ్యాటింగ్ ఆర్డర్ను మాత్రం చాలాసార్లు మార్చడమే కాకుండా.. కొన్నిసార్లు అతడిని పక్కనపెట్టింది కూడా!.. అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో నాకౌట్ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా 94*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.తద్వారా భారత్ ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు. దీంతో గతంలో మాదిరి సంజూను తప్పించేందుకు ఆస్కారం లేదు. ఇక వన్డౌన్లో ఇషాన్ కిషన్ ప్రపంచకప్లో తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతడిపైనా వేటు పడదు.దీంతో వైభవ్కు టాపార్డర్లో చోటు దక్కదు కాబట్టి.. ఇప్పట్లో అరంగేట్రం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఐర్లాండ్తో సిరీస్కు అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి వైభవ్ను ఆడించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే.. కాగా ఇంగ్లండ్తో టీ20లతో పాటు వన్డేలకూ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతినిచ్చి.. సంజూను వన్డౌన్కు డిమోట్ చేసి.. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఓపెనర్గా పంపే అవకాశాలనూ కొట్టిపారేయలేము.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్- ‘ఎ’ జట్టును విజేతగా నిలిపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్లు!


