Vaibhav Suryavanshi
-
సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
-
వైభవ్కు తోడుగా తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: భారత సీనియర్ జట్టులోకి తొలిసారి ఎంపికైన సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే 15 ఏళ్ల వైభవ్కు తోడుగా అతని తల్లిదండ్రులను పంపాలని బోర్డు నిర్ణయించింది. ఈ వయసులో అమ్మానాన్న తన పక్కన ఉండటం వైభవ్కు మేలు చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయ పడ్డారు. తనకంటే వయసులో పెద్దవారైన క్రికెటర్లతో కలిసి ఉండటంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వెల్లడించారు. ‘సాధారణంగా ఏదైనా సీనియర్ టీమ్లలో ఇంత చిన్న వయసు ఆటగాళ్లు ఉండరు. ఎప్పుడో సచిన్ టెండూల్కర్ చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చాక ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ వైభవ్లాంటి కుర్రాడు వచ్చాడు. సహజంగానే 15 ఏళ్ల అబ్బాయికి సీనియర్లతో కలిసి ఉండటంలో సమస్యలు వస్తాయి. మిగతా ఆటగాళ్లంతా 18 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారే. అలాంటి వాతావరణంలో అలవాటు పడేందుకు తల్లిదండ్రులు తోడుగా ఉండటం మేలు చేస్తుంది. స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినప్పుడు కూడా పెద్దవాళ్లు తోడుగా ఉంటారు. ఇదీ అలాంటిదే. వైభవ్ ఇంకా స్కూల్ కుర్రాడే. అతను రాబోయే కొన్నేళ్ల పాటు భారత క్రికెట్కు పెద్ద ఆస్తిలాంటివాడు’ అని సైకియా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల శ్రీలంకలో ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించిన అంశంపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ‘ఇదంతా ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటి అంశాల్లో మ్యాచ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఏం చేయాలనేది వారిష్టం. బీసీసీఐకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. మేం మ్యాచ్ రిఫరీ పాత్ర పోషించలేం కదా’ అని సైకియా స్పందించారు. -
బిహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ
వైభవ్ సూర్యవంశీ.. బిహార్ నుంచి వచ్చి తన సంచలన బ్యాటింగ్తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే బిహార్ నుంచి మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే తన అద్భుత బ్యాటింగ్తో పరుగుల సునామీ సృష్టించింది.ఈ చిచ్చర పిడుగు పేరు అక్షర గుప్తా. బిహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్లో అక్షర ఏకంగా అజేయ త్రిశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్ధి బౌలర్లను అక్షర్ ఉతికారేసింది. కేవలం 126 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 306 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.తొలుత 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. మహిళల దేశీవాళీ క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్గా అక్షర నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా (346) ఉంది. మరో 40 పరుగులు చేసి ఉంటే ఇరా గుప్తా రికార్డును అక్షర బ్రేక్ చేసి ఉండేది.ఎవరీ అక్షర గుప్తా?వైభవ్ సూర్యవంశీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అక్షర.. పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఆమె స్పెషాలిటి. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఆమె నాయకత్వం వహించింది. అంతేకాకుండా బిహార్ సీనియర్ జట్టుకు కూడా అక్షర్ ప్రాతినిథ్యం వహించింది. అయితే ఫిట్నెస్ పరంగా కూడా ఆమె కొంచెం మెరుగు పడాల్సి ఉంది.చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్ -
'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కారణం.అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్పటివరకు విజయాలనే చూసిన వైభవ్.. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయపడ్డారు.కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్గా తన సేవలను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయనదే కీలక పాత్ర."వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మైదానంలో చాలా సార్లు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అతడికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయర్ కూడా తన కెరీర్ అంతటా ఒకే విధమైన ఫామ్ను కొనసాగించలేడనే విషయాన్ని వైభవ్ గ్రహించాలి. అతడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే.. తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్.ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారుగత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు. వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా ఫెయిలూర్స్ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ను కేవలం టెక్నికల్గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు. -
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
-
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్కు తప్పని శిక్ష..
-
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్లో కూడా 50 శాతం కోత విధించారు.ఏమి జరిగిదింటే?ముక్కోణపు సిరీస్లో భాగంగా జూన్ 15న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 పరుగుల టార్గెట్ను భారత్ చేధించలేకపోయింది. అయితే సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక యువ ఆటగాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు” అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వదం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.చదవండి: అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ -
వైభవ్ సూర్యవంశీ విషయంలో మరో వివాదం!
తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగిన ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ చిచ్చర పిడుగు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 12 బంతుల్లో మూడు ఫోర్లు బాదిన వైభవ్ కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ ఒక్క మ్యాచ్లోనే మెరుపులుఇక అఫ్గనిస్తాన్- ‘ఎ’తో మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది ఫోర్ల సాయంతో 44 పరుగులతో రాణించాడు. అనంతరం శ్రీలంక- ‘ఎ’తో వన్డేలో 21 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి వన్డేలోనూ పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు.పరుగుల ఖాతా తెరవకముందే.. ప్రియాన్ష్ ఆర్య (58)కు జోడీగా ఓపెనర్గా వచ్చిన వైభవ్.. 28 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. నిజానికి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ పరుగుల ఖాతా తెరవకముందే.. అవుటయ్యేవాడు. రెండో ఓవర్ రెండో బంతికి వైభవ్ ఇచ్చిన క్యాచ్ను అఫ్గన్ ఫీల్డర్ ఫరీదూన్ దావూద్జాయ్ గాల్లోకి ఎగిరిమరీ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు.బతికిపోయిన బుడ్డోడుదీంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. వైభవ్ మైదానం వీడేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రీప్లేలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ గమనించినపుడు బంతిలోని కొంతభాగం నేలకు తాకినట్లుగా ఉందని చెబుతూ థర్డ్ అంపైర్ వైభవ్ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో అఫ్గనిస్తాన్ ప్లేయర్లు తెల్లముఖాలు వేయగా.. వైభవ్కు లైఫ్ లభించింది.అయినప్పటికీ వైభవ్ తన ఆట తీరును మార్చుకోలేదు. మూడో ఓవర్ నాలుగో బంతికి కూడా ఇలాగే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రెండో అవకాశం పొందాడు. కానీ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్లో ఖలీద్ తనీవాల్కు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.థర్డ్ అంపైర్ నిర్ణయంపై వివాదంవైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా అవుట్ అని తెలిసినా.. థర్డ్ అంపైర్ పదే పదే పరిశీలించి ఆఖరికి వైభవ్కు అనుకూలంగా తీర్పునివ్వడం సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో వైభవ్ ఆట తీరును విమర్శిస్తూ.. ‘ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. నువ్విక మారవా బుడ్డోడా’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతోమ్యాచ్ సందర్భంగా వైభవ్ సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐVaibhav survives the scare! Third umpire says NOT OUT 😮💨Watch #TalentTVCup LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 pic.twitter.com/txOaxjXdx3— Sony LIV (@SonyLIV) June 17, 2026 -
మారని వైభవ్ ఆట తీరు
-
వైభవ్ కోసం గంటసేపు వెయిట్ చేసిన శ్రీలంక ఫస్ట్ ODI కెప్టెన్ అనుర టెన్నెకూన్
-
ఆఫ్గన్-ఏతో కీలక మ్యాచ్.. మారని వైభవ్ ఆటతీరు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా-ఏ జట్టు ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్లో లంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలున్నాయి. వైభవ్ తాను ఆడిన గత మూడు మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్కు నిరాశే ఎదురైంది. అప్పటికే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదూన్ బౌలింగ్లో ఖాలిద్ తనివాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (48), రుతురాజ్ (3) క్రీజులో ఉన్నారు. ఇక మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రబ్సిమ్రన్తో పాటు ఆయుశ్ బదోని ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపాడు. మరోవైపు ఆఫ్గన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగింది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్గన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్అఫ్గానిస్తాన్-ఏ: ఇమ్రాన్ మీర్(కెప్టెన్), హసన్ ఈసాఖిల్, ఖలీద్ తనివాల్, ఫైసల్ షినోజాదా, బహిర్ షా, ఫర్మానుల్లా సఫీ, షమ్స్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్Read: టీమిండియాతో జాయిన్ అవనున్న వైభవ్, తిలక్ వర్మ -
టీమిండియాతో జాయిన్ అవనున్న వైభవ్, తిలక్ వర్మ
గత కొన్ని రోజులుగా తన ఆటతీరుతో హాట్టాపిక్గా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ లంక ఆటగాళ్లతో గొడవ వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇండియా-ఏ జట్టు తరఫున ట్రై సిరీస్ ఆడేందుకు లంక పర్యటనకు వచ్చిన వైభవ్ సూర్యవంశీ టీమిండియాతో జాయిన్ అవ్వనున్నాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు యువ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ కూడా జూన్ 22న చెన్నైలో భారత సీనియర్ జట్టుతో కలవనున్నాడు. చెన్నై నుంచి భారత జట్టు ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడేందుకు బెల్ఫాస్ట్కు బయల్దేరి వెళ్లనుంది. జూన్ 21న ట్రై సిరీస్ ఫైనల్ జరగనుంది. ఒకవేళ ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరితే ఆ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్, తిలక్లు నేరుగా చెన్నైకి వచ్చి జట్టుతో కలవనున్నారు. ఒకవేళ ఇవాళ ఆఫ్గన్తో మ్యాచ్లో ఓడితే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిబాట పట్టనుంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ను జూన్ 26న ఆడనుంది. ఇక బీసీసీఐ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను నియమించింది.చదవండి: ఆఫ్గన్-ఏతో కీలక మ్యాచ్.. నిలకడగా ఆడుతున్న వైభవ్ -
HI నాన్న
‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు నాన్న. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి. నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు. ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.శిక్షణ కోసం రిక్షా అమ్మి..!కొందరి కలలు నిద్రకే పరిమితమవుతాయి. మరికొందరి కలలు చరిత్రలో నిలిచిపోతాయి. కల సాకారం చేసుకోవాలన్న తపన ఎన్ని కష్టాలనైనా దిగమింగి, ఎంతటి అవాంతరాన్నైనా దాటేందుకు సిద్ధమైనప్పుడు విజయం కాళ్ల దగ్గరకు వస్తుంది. ఇందుకు ఉదాహరణే వారణాసికి చెందిన నారాయణ జైస్వాల్ జీవితం. జైస్వాల్ జీవితమంతా రిక్షాల చుట్టూతానే తిరిగింది. పగలంతా రిక్షా తొక్కడం, అద్దెలకు ఇవ్వడం, రాత్రయితే భార్యాపిల్లలతో భోంచేసి నిద్రపోవడం తప్ప వేరే ధ్యాసలేదు తనకి... కాని జైస్వాల్ కొడుకు గోవింద్ జైస్వాల్ కల మాత్రం చాలా పెద్దది. చిన్నప్పటి నుంచి తను ఐఏఎస్ అధికారి కావాలని ఆశపడ్డాడు. ఐఏఎస్ కావాలంటే ఆశ ఉంటే సరిపోదు ఆశయం కూడా కావాలి. కాని ఆ ఆశయానికి ఇంధనం కూడా డబ్బే... ఢిల్లీలోని మంచి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటే తప్ప గోవింద్ ఐఏఎస్ పాస్ కాలేడని జైస్వాల్ తెలుసుకున్నాడు. రిక్షా తొక్కితే వచ్చే ఆదాయం కంటే వాటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో మాత్రమే శిక్షణ ఇప్పించవచ్చని అనిపించింది. అంతే... తన కుటుంబానికి ఆధారమైన రిక్షాలన్నింటినీ అమ్మేసి కోచింగ్ ఇప్పించాడు. కాని జైస్వాల్ కష్టం ఊరికే పోలేదు. 22 ఏళ్ల గోవింద్ జైస్వాల్ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ర్యాంకు సాధించి చూపించాడు.కిడ్నీ అమ్మి చదివిస్తా..!తాను దెబ్బతిన్నా తన బిడ్డ బాగుండాలని కోరుకునే ఓ తండ్రి ప్రేమకు అద్దం పట్టే మరో సంఘటన ఇది. గుజరా™Œ లోని నవసారి జిల్లాకు చెందిన జయేష్ పటేల్ ఓ ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకపోవడంతో భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాని తన కుమారుడు సాహిల్ పటేల్ ఎప్పటికైనా డాక్టర్ కావాలన్నది తన కల. ఆ కల తన పేదరికం వల్ల మరుగునపడిపోకూడదని భావించిన జయేష్ తన కిడ్నీని అమ్మేసి తన కుమారుడిని చదివిస్తానని ప్రకటించాడు. నా కంట్లో వెలుగు పోయింది. కాని బిడ్డ బతుకు మాత్రం చీకట్లోనే మగ్గిపోకూడదు అంటూ బాధపడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు వచ్చి సాహిల్ చదువుకి తమ వంతు సహకారం అందించారు. అలాగే భవిష్యత్లో కూడా సాహిల్కి అన్ని విధాల అండగా ఉంటామని మాటిచ్చారు. కొడుకు భవిష్యత్ బాగుండాలని అందుకు తను ఏమైపోయినా పర్లేదని మాట్లాడిన ఆ తండ్రి ఆవేదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.వైభవ్ కోసం భూమిని అమ్మి..!దేశవ్యాప్తంగా క్రికెట్ పేరు చెబితే మొదట వినేమాట బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ టీంలో తన అప్రతిహత ప్రతిభను చాటి భళా అనిపించుకున్నాడు. కాని వైభవ్ అంతలా రాణించడం వెనుక అతని తండ్రి సంజయ్ సూర్యవంశీ కృషి ఉంది. బీహార్ లోని తాజ్ పూర్కి చెందిన ఈ మైథాలీలది మధ్య తరగతి కుటుంబం. అయితే చిన్నప్పటి నుంచి వైభవ్ క్రికెట్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపేవాడు. ఇది గమనించిన అతని తండ్రి మరింత ఉన్నత శిక్షణ కోసం తమ పూర్వీకుల భూములను అమ్మేశాడు. తాజ్పూర్కి, ట్రెయినింగ్ సెంటర్ మధ్య దాదాపు వంద కి.మీ దూరం ఉండేది. వైభవ్ కోసమే ఓ కారుని కూడా కొని అతనికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచాడు సంజయ్.. తరతరాల ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు..అది అనాదిగా వచ్చే వారసత్వం, బాధ్యత. కానీ అదేది అక్కర్లేదని, కేవలం తన బిడ్డ కలని నిజం చేయడమే లక్ష్యమని సంజయ్ సూర్యవంశీ భావించాడు కాబట్టే ఇండియాకి ఈరోజు వైభవ్ లాంటి చిచ్చరపిడుగు దొరికాడు.మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. 9281020501మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్టాపిక్గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
వైభవ్ తప్పు లేదు వల్లే రెచ్చగొట్టారు : Tilak Varma
-
షాకింగ్ న్యూస్..వైభవ్ సూర్య వంశీ పై బ్యాన్..?
-
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్రూమ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్!
ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ హైలైట్గా నిలిచింది. తప్పు ఎవరిదైనా వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. 15 ఏళ్ల వయసులో ఇంత అగ్రెసివ్ పనికి రాదని, ఓర్పు వహిస్తేనే జట్టులో ఎక్కువకాలం చోటు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీకి కోహ్లి అడ్వైజ్ ఇస్తున్న ఫొటో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆ ఫొటోలో కోహ్లి వైభవ్ భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా వైభవ్ వెల్లడించాడు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు. ఆటపైనే మన దృష్టి ఉండాలి. కెరీర్ ఎదుగుదలలో ఓపిక చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు క్రికెట్లో లాంగ్ కెరీర్కు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లి తనతో చెప్పినట్లు వైభవ్ పేర్కొన్నాడు. అయితే తాజాగా లంకతో మ్యాచ్లో వైభవ్ అగ్రెసివ్ ప్రవర్తన చూస్తుంటే కోహ్లీ చెప్పిన మాటలు ఏవీ అతడు చెవికె క్కించుకోలేదనిపిస్తోంది. కోహ్లి ఇచ్చిన సూచనలు, సలహాలు తూ.చా. తప్పకుండా పాటించి ఉంటే ఇవాళ వైభవ్ ప్రవర్తన ఇలా ఉండేది కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్గా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2025లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంలోనూ వైభవ్ ఇదే దూకుడు ప్రదర్శించాడు. ఆనాడు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పేసర్ అలీ రెజా వైభవ్ను ఔట్ చేశాడు. ఈ సమయంలో పాక్ బౌలర్ వైభవ్ను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఉడుకురక్తంతో ఉన్న వైభవ్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. అలీ రెజావైపు చూస్తూ చేతి వేలితో సైగ చేస్తూ, దూషిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలయ్యింది.టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు పెట్టింది పేరు. తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయితే కోహ్లి మైదానంలో ఉన్నంతసేపు మాత్రం హుందాగానే ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉన్నా మైదానంలో ఎక్కువశాతం ఫన్నీమోడ్లోనే ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాడు. మంచి విషయం ఆలస్యంగా.. కానీ ఒక చెడ్డ విషయం వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వైభవ్ విషయంలో నిజమైంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకున్న వైభవ్ ఇప్పుడు తన ప్రవర్తనతో అందరి దృష్టిలో బ్యాడ్గా మారిపోతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికైనా తన అగ్రెసివ్ ప్రవర్తనను తగ్గించుకొని ఆడితే క్రికెట్లో ఎక్కువకాలం కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026King meets Bihari Monster 💀 pic.twitter.com/927R0z8kF3— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) June 1, 2026చదవండి: ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే! -
శ్రీలంక ప్లేయర్ ను కొట్టబోయిన వైభవ్
-
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో
శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో విజయవంతంగా కొనసాగుతుంది. ట్రై సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ మరోసారి నిరాశపరిచాడు. మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహన్ అరాచిగే బౌలింగ్లో వనుజా సాహన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్గన్తో మ్యాచ్లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. ‘వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవం ప్లాఫ్ షో కొనసాగుతోంది’.. ‘టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు’.. ‘ఓవర్ హైప్ వల్ల ఆడలేకపోతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు.ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత-ఏ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తిలక్ వర్మ తెలిపాడు. యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, విషెన్ హలంబాగే, సదీర సమరవిక్రమ, అహన్ విక్రమసింఘే, సహన్ అరాచ్చిగే(కెప్టెన్), వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, కుగతస్ మతులన్, చమిక కరుణరత్నే, మహ్మద్ షిరాజ్. -
ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక రేపు శ్రీలంక-ఏతో జరగనున్న మ్యాచ్కు వైభవ్ దూరమైతే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఎలాగూ టాపార్డర్లో ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే, ఒకరు వన్డౌన్లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణావకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు కూడా వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశముంది. -
వైభవ్ ఎంట్రీ ..డేంజర్ లో అభిషేక్, ఇషాన్ కిషన్
-
అన్నను మించిన తమ్ముడు 10ఏళ్లకే బుడోడి తమ్ముడు సెంచరీ
-
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి వీరవిహారం.. 10 ఏళ్లకే సూపర్ సెంచరీ
నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తనకంటే సీనియర్ బౌలర్లను సైతం విడిచిపెట్టలేదు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఇప్పుడు అన్న బాటలోనే ఆశీర్వాద్ కూడా అడుగులు వేస్తున్నాడు.ఆశీర్వాద్ తాజాగా బిహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 'క్రికెట్ అకాడమీ తాజ్పూర్' తరపున ఆడిన జూనియర్ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 118.39గా నమోదైంది.తమ్ముడి క్లాస్ ఇన్నింగ్స్ చూసి మురిసిపోయిన వైభవ్ సూర్యవంశీ.. సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్కు సంబంధించి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నకు తగ్గ తమ్ముడు అని కామెంట్లు చేస్తున్నారు.కాగా వైభవ్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్ల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. తద్వారా భారత జట్టుకు సెలక్ట్ అయిన అతి పిన్న వయష్కుడిగా సచిన్ రికార్డును సూర్యవంశీ(15) బ్రేక్ చేశాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ వైభవ్ అసాధరణ ప్రదర్శన చేశాడు. మొత్తం 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs AFG: మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం -
‘సచిన్, కోహ్లిలను మించిపోతాడు.. అతడికి తిరుగులేదు’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియా లెజెండ్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలను మించిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆకాశానికెత్తాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధిగా వైభవ్ను అభివర్ణించాడు.ఫార్మాట్లకు అతీతంగాగతేడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో అలరించాడు.ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డలపై యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఇక అండర్-19 వరల్డ్కప్ ఆద్యంతం అలరించిన వైభవ్.. ఫైనల్లో ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతవరల్డ్కప్లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా వైభవ్ గెలుచుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల నుంచి వైభవ్ సూర్యవంశీ పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించడంతో పాటు ఆసియా క్రీడలు- 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్ వైభవ్పై ప్రశంసలు కురిపించాడు.సచిన్, కోహ్లిలను మించిపోతాడు‘‘సచిన్, విరాట్లను ఈ పిల్లాడు మించిపోగలడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ ఉంటే.. తన కెరీర్ ముగిసేనాటికి వీరిద్దరి కంటే పెద్ద స్టార్గా ఎదుగుతాడు. వైభవ్ సూర్యవంశీ విభిన్న ఆటగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్ల కంటే వైభవ్ ఎంతో బెటర్.అతడొక అద్భుతమైన పిల్లాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధి. అతడు ఇండియాలో ఆడినపుడు నేను దగ్గరగా చూశాను. అక్కడి బౌండరీలు చిన్నగానే ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు పవర్హిట్టింగ్ ఆడాడు’’ అని డేల్ స్టెయిన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.అయితే, వైభవ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీసీసీఐకి ఈ సందర్భంగా స్టెయిన్ సూచించాడు. పదిహేనేళ్ల పిల్లాడు ఒత్తిడికి లోనుకాకుండా.. అతడిపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నాడు.చదవండి: తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి? -
IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా?
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో హింసాత్మక అల్లర్లు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం నగరంలోని పలు వీధుల్లో ముసుగులు ధరించిన కొంతమంది ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్లు సిటీ బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి వాటర్ క్యానన్లను ప్రయోగించారు.జూన్ 8వ తేదీ రాత్రి బెల్ఫాస్ట్లో ఒక వ్యక్తిపై జరిగిన దారుణమైన కత్తిపోట్ల దాడి ఈ హింసకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు వేరే దేశానికి చెందిన వలసదారుడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో స్థానికంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలై, అవి కాస్తా హింసాత్మక అల్లర్లుగా మారాయి.భారత్-ఐర్లాండ్ సిరీస్ డౌటే!కాగా నెలఖారులో భారత క్రికెట్ జట్టుకు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సింది. ఈ రెండు మ్యాచ్లు (జూన్ 26, 28) కూడా బెల్ఫాస్ట్ వేదికగానే జరగాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ టీ20 సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.తాజాగా ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ స్పందించింది. భారత్తో జరగాల్సిన రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ నిర్వహణపై రాబోయే 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఐరీష్ క్రికెట్ బోర్డు తెలిపింది.బెల్ఫాస్ట్ నెలకొన్న పరిస్థితులను 'క్రికెట్ ఐర్లాండ్' నిశితంగా గమనిస్తోంది. భారత్తో టీ20 సిరీస్తో పాటు, ఈ ఆదివారం జరగాల్సిన 'ఐరిష్ సీనియర్ కప్', 'నేషనల్ కప్' మ్యాచ్ల నిర్వహణపై కూడా రాబోయే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లు, కోచ్లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే మాకు అత్యంత ముఖ్యమని" ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన పేర్కొంది. వైభవ్ డెబ్యూ వాయిదా?కాగా ఈ టూర్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నుంచి తప్పించి అయ్యర్కు జట్టు బాధ్యతలను అప్పగించారు. కాగా ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే సూర్యవంశీ అరంగేట్రం కోసం ఇంగ్లండ్ టూర్ వరకు వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా అతడు ఎంపికయ్యాడు.చదవండి: FIFA World Cup 2026: ఆరంభంలోనే ఆల్టైమ్ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి -
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..
-
IND vs AFG: భారత్కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ అఫ్గన్కు శుభారంభం అందించారు.ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్ ఇమ్రాన్కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్బహీర్ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే అఫ్గన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. భారత్పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.తొలి మ్యాచ్ శ్రీలంకతోశ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.లంకతో మ్యాచ్లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్లో భాగంగా గురువారం అఫ్గన్పై భారీ స్కోరు సాధించింది.అఫ్గన్పై చెలరేగిన ఓపెనర్లు దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.రుతు, తిలక్ మరోసారి..వన్డౌన్లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 49 ఓవర్లు ఎందుకంటే?వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గన్ లక్ష్యం 294వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి -
ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్పై మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు.15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.చెత్త షాట్ ఆడి..కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్నెస్ ఈ మ్యాచ్లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు. -
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
-
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్చదవండి: MPL 2026: సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనేIt's Vaibhav Suryavanshi show against Afghanistan 👏Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026 -
అఫ్గానిస్తాన్తో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్దే
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.మెన్ ఇన్ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు అఫ్గాన్పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ -
అఫ్గనిస్తాన్తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
మొదటి మ్యాచ్ లో తుస్సు మన్న వైభవ్
-
India A vs Sri Lanka: మొదటి మ్యాచ్ లో నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ..
-
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.ఇక ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్తో ఉతికి ఆరేశాడు.సీజన్లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతంఅంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్హిట్టర్ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.ఇలా అయితేనే టీ20 క్రికెట్ను కాపాడుకుందాంఅదే విధంగా.. టీ20 క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్తో ఆడే ప్రయత్నం చేశారు.పిచ్ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే! -
ఒక్క మ్యాచ్ ఆడకుండానే.. ఇంగ్లాండ్ లో బుడ్డోడి ప్రకంపనలు
-
పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో
-
వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!
టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఏతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినప్పటికీ మొహమ్మద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన వైభవ్ మిడాఫ్లో దొరికిపోయాడు. వైభవ్ కొట్టిన బంతిని సాహన్ అరాచిగే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ చెలరేగుతాడని ఆశించిన అభిమానులు నిరాశే ఎదురైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ సెషన్లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పెట్టింది పేరైన వైభవ్ వన్డే మ్యాచ్ కావడంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇవాళ్టి మ్యాచ్లో మాత్రం వైభవ్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి ఇండియా జట్టు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (12), రుతురాజ్ గైక్వాడ్ (2) పరుగులతో ఆడుతున్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన వైభవ్.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.గతేడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డాడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.Vaibhav Suryavanshi started brightly with a few beautiful strokes, but his innings was cut short on 14 off 12 balls, including three boundaries. pic.twitter.com/a2RiJi4SNn— CofCricket (@CofCricket) June 9, 2026చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
వైభవ్పై బాలీవుడ్ క్వీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో చెలరేగి, తొలిసారి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న 15 ఏళ్ల యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై రాజకీయ నేతగా మారిన బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ఈవెంట్తో ఆమె మాట్లాడుతూ.. వైభవ్ను ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్ కోసం అతడు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ స్థాయిని కూడా దాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అతడిపై ఒత్తిడి పెట్టడం కాదు కానీ.. ఇండియాకి వరల్డ్కప్ తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవ్ను ఉద్దేశిస్తూ కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.ఇప్పటికే ఓసారి..!స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో వైభవ్ ఇప్పటికే ఓసారి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. తాజా అండర్-19 వరల్డ్కప్లో అతడు కళ్లు చెదిరే ప్రదర్శనలతో టీమిండియాకు ట్రోఫీ అందించాడు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ ఆడిన 175 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ యావత్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే హైలైట్గా నిలిచింది.ఐపీఎల్ 2026లో ఉగ్రరూపంఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న వైభవ్.. ఐపీఎల్ 2026లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ సీజన్లో అతడు 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఏకంగా 72 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగా వైభవ్కు తొలిసారి టీమిండియాలో చోటు దక్కింది.ఇదిలా ఉంటే, త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇటీవలే ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశారు. పేలవ ఫామ్తో బాధపడుతున్న మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడింది. అతడికి జట్టులో కూడా చోటు లభించలేదు. వైభవ్కు మాత్రం మూడు జట్లలో చోటు లభించింది. -
వైభవ్కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేసిన భారత టీ20 జట్లలో 15 ఏళ్ల వైభవ్కు చోటు దక్కింది.దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ను సూర్యవంశీ అధిగమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని ఇప్పుడే అంచనాల భారంతో ఒత్తిడికి గురిచేయకూడదని దాదా అభిప్రాయపడ్డాడు."వైభవ్ సూర్యవంశీకి ఇంకా కేవలం 15 ఏళ్లే. ఇప్పుడే అతడి నుంచి అద్భుతాలు ఆశించి ఒత్తిడి పెంచకండి. స్వేచ్ఛగా ఆడనివ్వండి. అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలి. అయితే వైభవ్ ఒత్తిడి గురుంచి పెద్దగా పట్టించుకోడని నాకు అనిపిస్తోంది.అందుకే ఐపీఎల్లో ఒక సంచలనం మారాడు. కానీ భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండడం సహజం. అంతకుతోడు ఐపీఎల్ ఆడే పరిస్థితులకు, యూకే పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అక్కడ బంతి సీమ్ అవుతుంది.బౌన్స్ , మూవ్మెంట్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త బంతిని ఎదుర్కొవడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. అయినప్పటికి వైభవ్ స్కిల్స్పై నాకు నమ్మకం ఉంది. అక్కడ కూడా అతడు అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని గంగూలీ పేర్కొన్నాడు.అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. "వైభవ్ చాలా చిన్నవాడని, ఇంకా అనుభవం లేదని మనందరికి తెలుసు. కానీ అతడు తన ఆట తీరుతో సెలక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టి మరీ జట్టులోకి వచ్చాడు" అని డివిలియర్స్ అన్నాడు. కాగా భారత అండర్-19 జట్టు తరపున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా వైభవ్ తనను నిరూపించుకున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా -
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసేందుకు రంగం సిద్దమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో 15 ఏళ్ల సూర్యవంశీకి చోటు దక్కింది. దీంతో భారత జట్టు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ టెండూల్కర్ను వైభవ్ అధిగమించాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి చిన్న వయస్సులోనే భారత జట్టు ఎంపికైన వైభవ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మాన్లతో పోల్చడం సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని సంజీవ్ తెలిపాడు.సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సచిన్, బ్రాడ్మన్లతో వైభవ్ను పోల్చడం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ లెజండరీ క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో దశాబ్దాల పాటు రాణించి, దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం వైభవ్ వారి పాదాల దుమ్ముతో కూడా సమానం కాడు. కాబట్టి ఇలాంటి పోలికలు అస్సలు పెట్టవద్దు. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు కూడా లెఫ్ట్ హ్యాండరే. కాబట్టి లారా బ్యాటింగ్ వీడియోలను వైభవ్కు చూపించాను. గత కొన్నేళ్లుగా లారా, యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్ల బ్యాటింగ్ వీడియోలు కూడా వైభవ్ చూస్తున్నాడు.అయినప్పటికి అతడి ఆటతీరు పూర్తిగా విలక్షణంగా ఉంటుంది. అతడు ఎవరిని అనుకరించకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడతున్నాడని" పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపాడు. 776 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!? -
టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ!
15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్లో హాట్టాపిక్గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఎంపికైన వైభవ్ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ అనధికారిక టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన వీడియోనూ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని అనధికారిక టెస్టులోనూ కొనసాగించాడు. ఆ మ్యాచ్లో 86 బంతుల్లో 113 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు. అంతేకాదు వైభవ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 తరహా ఆటతో విజృంభించిన వైభవ్ను సంప్రదాయ క్రికెట్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఐపీఎల్కు, అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా తేడా ఉంటుందని, మొదట టీ20 ఫార్మాట్లో తనను తాను నిరూపించుకోవాలని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. Just look at the dominance of Vaibhav Suryavanshi in test cricket.🤯- Vaibhav Suryavanshi playing test cricket like T20.😊pic.twitter.com/NvljSRcTAi— Cricket Central (@CricketCentrl) June 5, 2026చదవండి: చరిత్ర సృష్టించిన వైశాలీ.. అన్న బాటలోనే చెల్లి! -
వైభవ్ వచ్చేశాడు...
టి20 ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్ ఫామ్ సూర్యకుమార్ యాదవ్కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్ టీమ్లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ టీమ్లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో చక్కటి బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ సాధించాడు. ముంబై: టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే టి20 సిరీస్ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్తో 5 టి20లు ఆడుతుంది. శ్రేయస్పై నమ్మకం... టి20 ప్రపంచకప్ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కూడా భారత్ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్ రెగ్యులర్గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో భారత్కు ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్లు (ఢిల్లీ, కోల్తా, పంజాబ్)లను లీగ్లో ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా గుర్తింపు పొందిన శ్రేయస్ నాయకత్వంలో 2024లో కోల్కతా టైటిల్ నెగ్గింది. బ్యాటర్గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్గా సూర్యకుమార్కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా. తిలక్కు అరుదైన చాన్స్... భారత టి20 జట్టులో రెగ్యులర్గా మారిన తిలక్వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్కు సారథిగా ఉన్నాడు. భారత్ తరఫున 49 మ్యాచ్లలో 145.54 స్టైక్రేట్తో 1390 పరుగులు సాధించిన తిలక్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్ స్థానంలో అతను వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైభవ్పై విశ్వాసం... అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్ సీజన్లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్ ఐర్లాండ్తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు. స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ రింకూ సింగ్ టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్లో లేకపోగా... ఇటీవలి ఐపీఎల్ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్పై వేటుకు ప్రధాన కారణం. ఆల్రౌండర్ హార్దిక్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు. నితీశ్ రెడ్డి పునరాగమనం... టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి టీమ్లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. ఇదే తరహాలో లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్కు ఇప్పుడు టి20 టీమ్లో స్థానం లభించింది. ఆసియా క్రీడలకు బుమ్రా.... విశ్రాంతి అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన 15 మంది టీమ్లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్కు కూడా ఆసియా క్రీడల టీమ్లో చోటు దక్కలేదు.పాపం సూర్యకుమార్!గత ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్కు రోహిత్ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్ కప్కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. టి20 క్రికెట్లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టుశ్రేయస్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్. (ఆసియా క్రీడలకు సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్కు చోటు లేదు). -
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
-
BCCI మాస్టర్ ప్లాన్, వైభవ్ సెలక్షన్కి కారణం అదే
-
మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడు: అగార్కర్
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదేఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.వైభవ్ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పరుగుల వరదరాజస్తాన్ రాయల్స్ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్ అండర్-19 వరల్డ్కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడుఅయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్ ఒక్కటనే కాదు.. భారత్ అండర్-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్మెంట్ వైభవ్కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన 15 ఏళ్ల భారత బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వైభవ్ తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఎంపికై సరికొత్త పలు రికార్డులు నెలకొల్పాడు. త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన మూడు భారత జట్లలో ఈ బిహారి బుడ్డోడు చోటు దక్కించుకున్నాడు.తద్వారా అత్యంత పిన్న వయస్సులో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరటి 37 ఏళ్ల పాటు ఉండిన ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్తో జరుగబోయే సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ లెక్కన పదిహేనేళ్ల 91 రోజుల వయసులో వైభవ్ టీమిండియా అరంగేట్రం చేయడం కూడా ఖరారైనట్లే.ఈ క్రమంలో వైభవ్ మరో చారిత్రక రికార్డు నెలకొల్పడం కూడా ఖాయమైంది. అత్యంత చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేయనున్న ఐసీసీ ఫుల్ మెంబర్ జట్ల సభ్యుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018లో 16 ఏళ్ల 314 రోజుల వయసులో టీ20 అరంగేట్రం చేశాడు. త్వరలో (15 ఏళ్ల 91 రోజులు) వైభవ్ ముజీబ్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు రొమేనియాకు చెందిన ఎం ఘెరసిమ్ పేరిట ఉంది. ఇతను 2020లో 14 ఏళ్ల 16 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. -
సచిన్ రికార్డు బ్రేక్... టీమిండియాలోకి వైభవ్ అయ్యర్కు కెప్టెన్సీ
-
భారత జట్టులోకి బుడ్డోడు
-
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్గా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడి స్ధానంలో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్లో కూడా టీమిండియా కెప్టెన్గా అయ్యర్ వ్యవహరించనున్నాడు.వైభవ్కు ఛాన్స్ఇక ఐపీఎల్-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.సూర్య ఖేల్ ఖతంఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్కు టీ20 ప్రపంచకప్-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.ప్రిన్స్ యాదవ్కు చోటుమరోవైపు వైభవ్తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే అఫ్గానిస్తాన్తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్లో మెరుపులు మెరిపించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరపున సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్యవంశీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెటర్ తన లగేజ్తో పాటు బస్సు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.As soon as Vaibhav Suryavanshi arrived in Sri Lanka, he looked a bit upset. There was sadness and slight frustration visible on his face. He also seemed bothered by the fans, and his disappointment was clearly noticeable while taking pictures with them.👀 pic.twitter.com/8H48R1VLld— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 5, 2026 -
వండర్ బాయ్పై ఐఐఎం స్టడీ
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? ఐపీఎల్ 2026లో పరుగుల వరద, సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల సూర్యవంశీకి ఆ శక్తి ఎక్కడిది?‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ ఇది కనిపెట్టడానికే ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే సూర్యవంశీ తన ఫేమ్, ఒత్తిడి ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకే ఈ స్టడీ...కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురులో స్టేడియం. స్ట్రైక్లో పదిహేనేళ్ల కుర్రాడు. స్టాండ్స్లో నలభై వేల మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ‘వైభవ్... వైభవ్’.... మొదటి బంతి... బాదాడు. ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్. రెండో బంతి... గట్టిగా కొట్టాడు. థర్డ్మ్యాన్ మీదుగా మరో సిక్సర్. స్టేడియంలో సౌండ్ మీటర్ పగిలిపోయేలా అరుపులు. ఇన్ని వేలమంది తన కోసం అరుస్తున్నా ఆ కుర్రాడి కళ్లలో ఉద్వేగం లేదు, ఆనందం లేదు. కేవలం ప్రశాంతత. ఆ ప్రశాంతతే ఇప్పుడు ఐఐఎం క్లాస్రూమ్లో కేస్ స్టడీ అయింది. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, సిక్సర్లలో క్రిస్ గేల్ రికార్డు బద్దలుకొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్’ (ఇండోర్) ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే ఫేమ్ను, ఒత్తిడిని, అంచనాలను ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం.చిచ్చరపిడుగువైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ.1.10 కోట్లకు ఎంపికై, తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్ లో 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులతో చెలరేగిపోయాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు.‘మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్’ అవార్డు సహా ఐదు అవార్డులు గెలిచాడు. ఇంత చిన్న వయసులోనే కోట్ల మంది అభిమానాన్ని, మీడియా, సోషల్ మీడియా ఒత్తిడిని తట్టుకుంటూ రాణిస్తున్న వైభవ్ తీరుపై ఐఐఎం ఇండోర్ దృష్టి పెట్టింది. వైభవ్లాంటి చైల్డ్ ప్రాడిజీలు అసాధారణ ప్రదర్శన ఎలా చేస్తారు, ఫేమ్ వచ్చిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు అనే అంశాలపై మూడేళ్లలో పూర్తయ్యేలా ఇంటర్డిసిప్లినరీ స్టడీ మొదలవుతోంది.బ్యాట్తో రికార్డులు, బ్రెయిన్ తో బ్యాలెన్స్వైభవ్ సక్సెస్ కేవలం పరుగుల కథ కాదు. అది ‘ప్రెజర్ అండర్ పర్ఫార్మెన్స్’కు పాఠం. ఐ.ఐ.ఎం. డైరెక్టర్ హిమాన్షు రాయ్ ఇదే విషయమై స్పందిస్తూ ‘చైల్డ్ ప్రాడిజీల అసాధారణ ప్రదర్శన వెనుక పర్సనాలిటీ, ప్రవర్తన, ప్రాక్టీస్తో పాటు తల్లిదండ్రులు, కోచ్లు, సీనియర్ల సపోర్ట్ కీలకం అవుతాయి. ఆ వివరాలతోపాటు వైభవ్ మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలు, గ్రౌండ్లో బాడీ లాంగ్వేజ్, వైఫల్యాన్ని స్వీకరించే తీరును ఐఐఎం టీమ్ విశ్లేషిస్తోంది’ అన్నారు. ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ, ప్యాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ ఎదుర్కొన్న ధైర్యాన్ని కూడా స్టడీ చేస్తారు.‘సపోర్ట్ సిస్టమ్’ అసలు బలంవైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు క్రికెట్ కోసం వ్యవసాయం పక్కనపెట్టి రోజూ 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాక్టీస్కు తీసుకెళ్లాడు. కోచ్ మనీష్ ఓఝా అతనికి టెక్నిక్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ నేర్పాడు. ఈ పేరెంటల్ అండ్ కోచింగ్ సపోర్ట్ మోడల్ను ఐఐఎం డాక్యుమెంట్ చేస్తోంది. ఫేమ్ వచ్చినా వైభవ్ గ్రౌండెడ్గా ఉండటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం లాంటి అలవాట్లను కార్పొరేట్ లీడర్షిప్ పాఠాలుగా మార్చనున్నారు.గ్రౌండ్ నుంచి బిజినెస్ క్లాస్రూమ్కుఐఐఎం ఇండోర్ ఈ స్టడీ కోసం సైకాలజీ, సోషియాలజీ, కమ్యూనికేషన్, బిహేవియరల్ సైన్సెస్ నిపుణులతో టీమ్ ఏర్పాటు చేసింది. ‘వైభవ్ మోడల్’ పేరుతో జరిగే ఈ పరిశోధన ఫలితాలను రీసెర్చ్ జర్నల్స్తో పాటు బీసీసీఐతోనూ పంచుకుంటారు. భవిష్యత్ సీఈఓలకు ఎర్లీ సక్సెస్ మేనేజ్మెంట్, టాలెంట్ రిటెన్షన్, ప్రెజర్ హ్యాండ్లింగ్పై పాఠాలుగా దీన్ని వాడనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి సిలబస్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్లు చెబుతున్నారు.బిహార్ సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్లో హైస్కూల్ చదువు చదువుతున్న ఒక సాదాసీదా కుర్రవాడు 15 ఏళ్లకే ఐ.ఐ.ఎం. పుస్తకాల్లోకి ఎక్కుతున్నాడంటే ఇది కేవలం క్రికెట్ గెలుపు కాదు... 9 ఏళ్ల వయసు నుంచే చేసిన కఠోర సాధన, క్యారెక్టర్, కమిట్మెంట్ గెలుపు. గెలవాలనుకోవాలనుకునేవాళ్లు గెలవడం అంటే ఏమిటో తెలుసుకునే గెలుపు. -
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
టీమిండియా కెప్టెన్ గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
-
వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!
15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన కనపరిచి.. అందరినీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే.. ఇతడు ఐపీఎల్ కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్స్, స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా సుమారు రూ.7 కోట్ల వరకు ఆర్జించినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులో అతనకి వస్తున్న భారీ ఆదాయానికి పన్నులు ఎవరు కట్టాలి? అనేది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మైనర్ పిల్లల (18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు) ఆదాయానికి డైరెక్ట్ ట్యాక్స్ అంటూ ఉండదు. కాబట్టి.. వీరి ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంగానే పరిగణిస్తారు. పిల్లలు సంపాదించినప్పటికీ.. దానికి సంబంధించిన ట్యాక్స్ తల్లిదండ్రులు చెల్లించాలన్నమాట.సెక్షన్ 99 ప్రకారం (మునుపటి సెక్షన్ 64(1A) స్థానంలో), మైనర్ ఆదాయం.. తల్లిదండ్రులలో ఎవరి మొత్తం ఆదాయం ఎక్కువగా ఉంటుందో, వారి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు. తల్లిదండ్రులు విడిపోయిన సందర్భంలో.. పిల్లలను చూసుకునే తల్లి లేదా దండ్రి ఆదాయంలో అది కలుస్తుంది. దీంతో పిల్లల పేరుతో పెట్టుబడులు పెట్టినా, వాటి ద్వారా వచ్చిన వడ్డీ లేదా ఇతర లాభాలు సాధారణంగా తల్లిదండ్రుల పన్ను పరిధిలోకి వస్తాయి.అయితే.. ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. పిల్లలు తన సొంత ప్రతిభ, నైపుణ్యం, కృషి లేదా ప్రత్యేక జ్ఞానం ద్వారా సంపాదిస్తే, ఆ ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంలో కలపరు. ఈ కారణం చేతనే.. వైభవ్ సూర్యవంశీ వంటి క్రీడాకారుల ఆదాయానికి నేరుగా వారి పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది.ఇదీ చదవండి: బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!ఈ నిబంధన కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా.. యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, బాల నటులు, ఈస్పోర్ట్స్ ప్లేయర్లకు కూడా వర్తిస్తుంది. పిల్ల తన సొంత ప్రతిభతో సంపాదిస్తే.. ఆ ఆదాయం అతని లేదా ఆమె పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది. పిల్లల 18 సంవత్సరాలు పూర్తయితే నియమాలు మారిపోతాయి. అప్పుడు అతను లేదా ఆమె స్వతంత్రంగా పన్ను చెల్లింపుదారుడిగా మారి, తన ఆదాయానికి తానే బాధ్యత వహించాలి. -
ద్రవిడ్ కాదు వైభవ్ సూర్యవంశీని RR లోకి తెచ్చింది ఇతనే
-
క్రికెట్ దేవుడి రికార్డుకే ఎసరు.. చరిత్ర సృష్టించనున్న సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లకు వైభవ్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేయనున్నాడు. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాక్పై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 15 ఏళ్ల 70 రోజులు మాత్రమే. దీంతో మరో నెల రోజుల్లో సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. ఈ సందర్భంగా సెలక్టర్లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టు సారధిగా నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఎంపికను కూడా సెలక్టర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 776 పరుగులు పరుగులతో టాప్ రన్స్కోరర్గా వైభవ్ నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్,సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా సూర్యవంశీనే సొంతం చేసుకున్నాడు. అతడు ఐర్లాండ్ టూర్ కంటే ముందు శ్రీలంకలో ఇండియా-ఎ తరపున ఆడనున్నాడు.చదవండి: IND vs AFG: పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్! -
వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్ బ్రాండ్ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్వీర్ సింగ్ చరక్ -
బిసీసీఐ మాస్టర్ ప్లాన్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ రెడీ..
-
వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్ తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్మెషీన్ కల గతేడాది ఫలించింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, ఆరెంజ్క్యాప్ విన్నర్ వైభవ్ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్ల వీడియోను బుధవారం షేర్ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్లో 675 పరుగులు సాధించి టాప్-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో సంచలనాలు చేస్తుండడంపై దిగ్గజ క్రికెటర్లు కూడా వైభవ్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని, చిన్న వయసులోనే ఒత్తిడిని అధిగమించి ఇవాళ స్టార్ క్రికెటర్ రేంజ్కు ఎదిగిన వైభవ్ సూర్యవంశీ ఘనతను తమ పాఠ్యాంశంలో చేర్చాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వరలోనే ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్పై ఐఐఎం-ఇండోర్ పరిశోధనలు చేపట్టనుంది. చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన వైభవ్ సూర్యవంశీపై ఒక ప్రత్యేక కేస్స్టడీ చేయనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రతినిధులుతెలిపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, కెరీర్ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్రభావాలను వైభవ్ ఎలా అధిగమించాడనే దానిపై తమ సంస్థ అధ్యయనం చేయనుందని ఐఐఎం ఇండోర్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.‘బాల మేధావుల అసాధారణ ప్రదర్శనకు ఎలాంటి కారకాలు దోహదపడుతాయనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్నతనం నుంచే అలవడే వ్యక్తిత్వం, ప్రవర్తన, సాధన పద్దతులు.. కుటుంబం నుంచి అందుతున్న సహకారం, ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ల మద్దతుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్లలపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభవ్ సూర్యవం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అతడికి తెలియజేశాము.’ అని ఐఐఎం డైరక్టర్ తెలిపారు.బాలల ప్రతిభపై సంస్థ జరిపే అధ్యయనంలో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ వనరులు, సమాచారవ్యాప్తి, ప్రవర్తనకు సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం కేవలం క్రీడలకే కాకుండా చిన్న వయసులోనే గణితం, సైన్స్, కళలు, ఇతర వృత్తుల్లో రాణిస్తున్న ప్రతిభావంతులపై కూడా జరగనుంది. అయితే ఈ అధ్యయనం పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్ నంబర్వన్ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద! -
IPL 2026లో ఎవరికి ఏ అవార్డు.. ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?
-
వైభవ్ టాలెంట్ కు ఫిదా, బుడోడికి లలిత్ మోదీ లైఫ్ టైమ్ బంపరాఫర్
-
వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో వండర్కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వస్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపికైన వైభవ్ రూ.55 లక్షలు అందుకున్నాడు. దీంతో వైభవ్ ఆట మారడంతోనే అతడి బ్రాండ్వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు తాను సంతకాలు చేసిన ఎండార్స్మెంట్లకు సంబంధించిన ఫీజులన్నింటిని డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వైభవ్.. ఇటీవలే ఐపీఎల్లో విధ్వంసకర ప్రదర్శనతో అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసినట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంతకాలు చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు. ఆట మారడంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఉన్నత దశలో ఉంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభవ్ సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం. క్రికెట్లో ఇప్పటికే వైభవ్ను దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆకర్షితుడవ్వకుండా కెరీర్ కోసం కష్టపడితే మాత్రం వైభవ్కు ఇంతమించి ఎండార్స్మెంట్లు వస్తాయనడంలో సందేహాం లేదు.చదవండి: కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి! -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్గా ఉంటాడు.మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు'
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో టెస్ట్, వన్డే సిరీస్లు ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్కు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికవుతాడా లేదా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ను ఇప్పుడే విదేశీ గడ్డపై జరిగే సిరీస్లకు ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.తొలుత ఐపీఎల్ తరహా పిచ్ల(ఉప ఖండ పరిస్థితులు)పై జరిగే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లలో వైభవ్ను ఆడించాలని అతడు సూచించాడు."ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారు.. కచ్చితంగా వీరి తర్వాత స్ధానం వైభవ్ సూర్యవంశీదే. అయితే అతడిని భారత జట్టు ఎంపిక చేయాలనుకుంటే.. మొదట ఐపీఎల్ తరహా బ్యాటింగ్ అనుకూల పరిస్థితులన్న పిచ్లపై మాత్రమే ఆడించాలి. ఐపీఎల్ లాంటి పిచ్లపై జరిగే మ్యాచ్లలోనే అతడు అరంగేట్రం చేయాలి. అతడిని నేరుగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ కండీషన్స్లో ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.ఐర్లాండ్లో ఉండే పచ్చని పిచ్లు, ఇంగ్లండ్ తరహా వాతావరణంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల కుర్రాడిని అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. ఇక ఓపెనింగ్ స్ధానం కోసం వైభవ్తో పాటు గిల్ కూడా పోటీలో ఉన్నాడు. కానీ ఈ రేసులో గిల్ ముందంజలో ఉన్నాడా లేక వైభవ్ సూర్యవంశీనా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాలివైభవ్ భవిష్యత్తు గురుంచి..టీ20ల్లో దుమ్ములేపుతున్న వైభవ్.. 'రెడ్-బాల్' క్రికెట్లో (టెస్టులు) ఎలా రాణిస్తాడో అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే అతడి భవిష్యత్తు నిర్ణయించేది మనం కాదు. అది బీసీసీఐ బాధ్యత కూడా కాదు. అతడు ఒక స్వతంత్ర వ్యక్తి. అతడు తన కోచ్ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే పరిమితమై, ఒక స్టార్గా మిగిలిపోవాలంటే తన ఇష్టమది. వైభవ్ 50 ఓవర్ల క్రికెట్ కూడా సరిపోతాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్-2023లో మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు. వైభవ్ కూడా రోహిత్ మాదిరే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించగలడు. అవసరమైతే రోహిత్ కంటే వేగంగా ఆడగలడని అని స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు! -
నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఇక ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ ఓపెనర్గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.ఈ క్రమంలో ప్రజెంటర్, టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానువచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్.. మ్యాచ్కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్నెస్ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్ మనీ?! -
కోహ్లికి కూడా సాధ్యం కానిది 15 ఏళ్లకే చేసి చూపించాడు..!
-
‘బాస్ బేబీ’ వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 776 పరుగులు సాధించాడు.తద్వారా తాజా ఎడిషన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్గానూ నిలిచి.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.యూనివర్స్ బాస్ బేబీఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్ బాస్ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ స్టార్ గేల్ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.తాజాగా... భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Virat Kohli' talking with "Vaibhav Suryavanshi ❤️ pic.twitter.com/0OVwtASeVp— Priyanka Yadav (@Priyankaji1998) June 1, 2026వైభవ్ సూర్యవంశీతో కోహ్లి ముచ్చటఇక అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి.. కింగ్ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లి.. వైభవ్ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్ నాతో అతడి గురించి మాట్లాడాడు.‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్ను ఏలగలడు’ అని విరాట్ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్ తెలియజేశాడు. కాగా సచిన్ సైతం వైభవ్ రిస్ట్ వర్క్, టెక్నిక్ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫైనల్ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్కు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్ను ఆస్వాదించాడు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ? -
IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ?
ఐపీఎల్-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్ కింగ్స్ను ఓడించి చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్లోనూ జయభేరి మోగించింది.Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026ఇక ఐపీఎల్ తాజా సీజన్లో చాంపియన్ ఆర్సీబీ, రన్నరప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్) 👉మ్యాచ్లు: 16; పరుగులు: 776 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుపర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కగిసో రబాడ (గుజరాత్) 👉మ్యాచ్లు: 17; వికెట్లు: 29 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 15 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్’ వైభవ్ సూర్యవంశీ👉స్ట్రయిక్ రేట్: 237.30 👉ప్రైజ్మనీ: టాటా కార్ ‘బెస్ట్ క్యాచ్’ ఆఫ్ ద టోర్నీ మనీశ్ పాండే (కోల్కతా)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు‘ఫెయిర్ ప్లే’ అవార్డుపంజాబ్ కింగ్స్ అత్యధిక సిక్స్లువైభవ్ (72 సిక్స్లు) 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక ఫోర్లుసాయి సుదర్శన్ (75 ఫోర్లు)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ‘గ్రీన్ డాట్బాల్స్ ఆఫ్ ద సీజన్’ సిరాజ్ (గుజరాత్) 👉మొత్తం 172 డాట్ బాల్స్ 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుటైటిల్ విజేతకు ఎంతంటే?ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్ గుజరాత్ టైటాన్స్కు రూ. 12.50 కోట్లు దక్కాయి.వైభవ్దే హవారాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు ఈ సీజన్లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.చదవండి: రజతాభిషేకం -
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
-
IPL 2026: సత్తా చాటిన యంగ్ గన్స్
గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు నిలిచాడు!జోఫ్రా ఆర్చర్ తన పేస్ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు!ఐదేసిసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్ జెయింట్స్ను నడిపించలేక రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్ లీగ్పై తమదైన ముద్ర వేశారు!ఢిల్లీ హార్డ్ హిట్టర్ సమీర్ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్లకే పరిమితమైతే... లక్నో పించ్హిట్టర్ ముకుల్ ఒక్క ఇన్నింగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్ విమర్శల పాలయ్యారు!వెస్టిండీస్ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్లకే పరిమితం కాగా... అన్క్యాప్డ్ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్ బలాన్ని చాటాయి! టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్ నబీ ఐపీఎల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు!ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే... 10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్–19వ సీజన్ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్లో పరుగుల వరద పారిందనేది వాస్తవం. 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్ రాయల్స్ తమ పదునైన బౌలింగ్తో 159 పరుగుల మ్యాచ్లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్ షమీ తొలి బంతికి వికెట్ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్ యాదవ్ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్’ అనిపించింది. గత సీజన్లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్ విజృంభిస్తే... బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ సత్తా చాటారు. టీమిండియా టెస్టు కెపె్టన్ గిల్ 16 మ్యాచ్ల్లో 45.75 సగటుతో 732 పరుగులు సాధించి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయన గిల్... తాజా సీజన్లో తన బ్యాట్తోనే బదులిచ్చాడు. నిదానంగా ఆడతాడనే ముద్రను చెరిపేసుకుంటూ 163.02 స్ట్రయిక్రేట్తో చెలరేగిపోయాడు. క్వాలిఫయర్–2 మ్యాచ్ను పరిశీలిస్తే అతడి ధాటి ఎలాంటిదో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ మినహా మిగిలినవాళ్లంతా బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పిచ్పై గిల్ మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టాడు. ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్, జడేజాతో కూడిన బౌలింగ్ లైనప్ను ఎదుర్కొంటూ 53 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అందులో ఎక్కడా మచ్చుకు కూడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు. అచ్చమైన క్రికెటింగ్ షాట్లతో చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ చూస్తుండగానే రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. పట్టు సాధించేంత వరకు సిక్స్ల జోలికి పోని గిల్... సరైన టైమింగ్ వాడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించాడు. మరోవైపు అతడి ఓపెనింగ్ సహచరుడు సాయి సుదర్శన్ కూడా ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. భారత టెస్టు జట్టు సభ్యుడైన సుదర్శన్ తాజా సీజన్లో 17 మ్యాచ్ల్లో 45.13 సగటుతో 722 పరుగులు సాధించాడు. గిల్, సుదర్శన్ల ఆటతీరు కారణంగానే టైటాన్స్ నిలకడైన ప్రదర్శన కొనసాగించగలిగిందనేది నిజం! టెస్టు ప్లేయర్లుగా ముద్ర పడ్డ ఈ ఇద్దరూ ఎక్కడా తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడటంతోనే పరుగుల వీరుల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. ఫార్మాట్ ఏదైనా టెక్నిక్ ముఖ్యం అని ఈ జంట మరోసారి చాటింది. అన్షుల్ అదుర్స్ రంజీ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్... ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ కుడిచేతి వాటం పేసర్... 14 మ్యాచ్ల్లో 26.32 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా జట్లతో పోల్చుకుంటే... పాతికేళ్ల అన్షుల్కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేనçప్పటికీ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. కోల్కతా నైట్రైడర్స్ పేసర్ కార్తీక్ త్యాగీ మంచి వేగంతో అభిమానులను ఆకర్షించాడు. ఈ సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ల్లో 27.66 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 28.68 సగటుతో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో భువనేశ్వర్ తన స్వింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కళ్లు చెదిరే అవుట్ స్వింగర్లతో బెంగళూరుకు ఇతోధిక సాయం చేశాడు. భారీగా పరుగులు ఇచ్చుకుంటాడనే ముద్రపడ్డ సిరాజ్ ఈసారి పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకుంటే... టి20 ప్రంపచకప్ హీరోలు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ అనామక బౌలర్లుగా కనిపించారు. వారెవ్వా వైభవ్ సూర్యవంశీ... నూనుగు మీసాలు కూడా రాని ఓ 15 ఏళ్ల కుర్రాడు... అంతర్జాతీయ స్థాయిలో కొమ్ములు తిరిగిన బౌలర్లను ఊచకోత కోయడం ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. గత సీజన్లో 35 బంతుల్లో సెంచరీతో తన రాకను ఘనంగా చాటిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... ఈ ఏడాది ప్రతి క్రికెట్ అభిమాని తన పేరు జపించేలా చేశాడు. 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. మామూలుగా ఒక వంద పరుగులు రెండొందల స్ట్రయిక్ రేట్తో కొట్టడమే కష్టం అనుకుంటే... వైభవ్ 776 పరుగులను ఏకంగా 237.30 స్ట్రయిక్రేట్తో బాదాడు. గణాంకాలు చూస్తే అతడి దూకుడును అర్ధం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు మాత్రం నభూతో! మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ల బౌలింగ్లో ఏమాత్రం బెరుకు లేకుండా తొలి బంతికే సిక్స్లు కొట్టిన అతడి తెగువకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సీజన్లో ఒక సెంచరీ తన పేరిట రాసుకున్న వైభవ్... మరో రెండుసార్లు శతకం గుమ్మం వద్ద అవుటయ్యాడు. ఫోర్ (63)ల కంటే సిక్స్ (72)లే ఎక్కువ కొట్టిన సూర్యవంశీ... అవసరమైతే నిదానంగానూ ఆడగలనని క్వాలిఫయర్–2లో నిరూపించుకున్నాడు. సహచరుల విఫలమైన చోట వికెట్ విలువ గుర్తెరిగి ఆచితూచి ఆడటంతోనే అతడిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 90వ దశకంలో సచిన్ టెండూల్కర్ తరహాలో... రాజస్తాన్ రాయల్స్ జట్టును ఈ సీజన్లో వైభవ్ తన భుజస్కందాలపై మోశాడు. అతడు ఇదే నిలకడ, క్రమశిక్షణ, కఠోర శ్రమ కొనసాగిస్తే... క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికినట్లే! –సాక్షి, క్రీడావిభాగం -
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్.. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్-2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్-2026 సీజన్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తాజా సీజన్తో గిల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచినందుకు వైభవ్కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.ఛాంపియన్స్గా ఆర్సీబీఇక ఐపీఎల్-2026 సీజన్ ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది -
వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్ జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు.అంతకంటే ముందు ఐర్లాండ్ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్ల కోసం భారత జట్టుకు వైభవ్ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా అభివర్ణిస్తున్నారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028లో భారత జట్టుకు వైభవ్ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్.. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్లతో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.కానీ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్ కోసం కొత్త భారత ఓపెనింగ్ జోడీని ఎంచుకున్నాడు. శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్లు భారత ఇన్నింగ్స్ను ఆరంభించాలని అతడు సూచించాడు. "ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్-శుభ్మన్ గిల్)ని ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా పిచ్లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్ను కలిగి ఉన్నాయి. అలాంటి పిచ్లపై కూడా గిల్-సుదర్శన్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్-సుదర్శన్లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం భారత టీ20 సెటాప్లోనే లేడు. అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ఆడాడు. వరుస మ్యాచ్లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్ -
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్
ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.బిహార్కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)If sooryavanshi wasn’t such a sensational cricketer.. I could have cast him in Masoom the film z.. pic.twitter.com/p8vaLzq1e2— Shekhar Kapur (@shekharkapur) May 31, 2026 -
Asian Games: వైభవ్కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్లో ఫేవరెట్గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్డౌన్లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు. ఇక గుజరాత్తో మ్యాచ్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
అది సెలక్టర్ల పని: వైభవ్ సూర్యవంశీపై సచిన్ వ్యాఖ్యలు
ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్లో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లోనే) కూడా ఉండటం విశేషం. క్వాలిఫయర్-2 ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ కూడా తన వద్దే పెట్టుకున్నాడు ఈ చిచ్చరపిడుగు.టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లుఇక అంతకు ముందు భారత అండర్-19 జట్టు తరఫున కూడా అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఈ పరిణామాల క్రమంలో ఇప్పటికే భారత్-‘ఎ’ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే, వీలైనంత త్వరగా ఈ పదిహేనేళ్ల పిల్లాడిని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అత్యద్భుతంఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా అతడి బ్యాటింగ్ చూశాను. నిజంగా అత్యద్భుతం. అతడు చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు.కేవలం బంతిని బాదడమే కాదు.. బ్యాటింగ్ చేసేటప్పుడు అతడు మణికట్టును ఉపయోగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మైదానం నలుమూలలా షాట్లు బాదాలంటే రిస్ట్ వర్క్ అత్యంత ముఖ్యం. వైభవ్ ఏదో దూకుడుగా, గుడ్డిగా బంతిని బాదడం లేదు.బాల్ను ఎదుర్కొనే ముందు లైన్ అండ్ లెంగ్త్ను సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడుతున్నాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే అతడు ఎక్కువగా బౌండరీలు బాదగలుగుతున్నాడు. అతడు టీమిండియాకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది..అయితే, ఇలాంటి విషయాలు వైభవ్పై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా అతడు తన సహజ శైలిని వదులుకోవద్దు. వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతీ బంతి ఒక ప్రశ్న లాంటిదే. దానికి బదులిచ్చే క్రమంలో పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానం పెరుగుతుంది. కెరీర్లో చివరి రోజు వరకూ కూడా ఈ సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వైభవ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తాను చేస్తున్న పనిపట్ల అతడికి చక్కటి అవగాహన ఉంది.అది సెలక్టర్ల పనిఅందరూ కోరుకున్నట్లుగానే వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే ఎంతో బాగుంటుంది. అయితే, అతడిపై ఒత్తిడి పెంచకూడదు. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. అతడిపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటూ మరీ ఎక్కువగా సూచనలు ఇచ్చి అతడిని గందరగోళంలోకి నెట్టేయకూడదు. వైభవ్ ఎంపిక గురించిన అంశాన్ని సెలక్టర్లకు వదిలివేయాలి. అతడిని ఏ జట్టుకు ఎంపిక చేయాలో వారికే తెలుసు. అది వారి బాధ్యత కూడా!.. కాబట్టి వైభవ్ విషయంలో తొందరపడటం మంచిది కాదు’’ అని సచిన్ టెండుల్కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం! -
ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం
గతేడాది ఐపీఎల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్.. తాజా ఎడిషన్లో మాత్రం అదరగొట్టింది. ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా.. ఎలిమినేటర్ గండం కూడా దాటి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.అయితే, ఫైనల్కు చేరే క్రమంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ముల్లన్పూర్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.సంజూ స్థానంలో..గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదోస్థానంలో నిలిచిన రాజస్తాన్.. ఈసారి మాత్రం ఈ మేరకు అద్భుతంగానే రాణించింది. నిజానికి ఐపీఎల్-2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసింది.సంజూ స్థానంలో కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన రాయల్స్.. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీని పూర్తిస్థాయిలో బరిలోకి దించింది. ఈ రెండు నిర్ణయాలు రాయల్స్కు బాగా కలిసి వచ్చాయి. ఈ సీజన్లో వైభవ్ పదహారు మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా (క్వాలిఫయర్-2 ముగిసేసరికి) నిలిచాడు.సీజన్ మొత్తానికి దూరంఇదిలా ఉంటే.. సంజూకు బదులు రాజస్తాన్ చెన్నై నుంచి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ (రూ. 2.4 కోట్లు)లను తీసుకుంది. అయితే, సామ్ కర్రాన్ గజ్జల్లో గాయం అని చెప్పి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రాజస్తాన్ శ్రీలంక స్టార్ దసున్ షనకను తీసుకుంది.అయితే, గాయం పేరు చెప్పి తప్పుకొన్న సామ్ కర్రాన్ ఇంగ్లండ్ దేశీ టోర్నీ టీ20 బ్లాస్ట్లో సర్రే జట్టుకు సుమారుగా మూడు మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను కావాలనే నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర తాజాగా స్పందించాడు.సర్రే తరఫున ఆడటం నేను చూశాను‘‘సామ్ కర్రాన్కు గాయమైందని మాకు సమాచారం అందింది. కానీ అతడు సర్రే తరఫున 2- 3 మ్యాచ్లు ఆడటం నేను చూశాను. నిజంగా ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది.అతడు మా జట్టుతో ఆడాలని మేము కోరుకున్నాము. అందుకే జట్టులో చేర్చుకున్నాము. కానీ అతడు ఇలా చేశాడు. కాకపోతే ముందుగానే విషయం చెప్పినందు వల్ల షనకను తీసుకువచ్చాము. ఆటగాళ్ల కెరీర్లో గాయాలు సహజమే.మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలిఅయితే, కొన్ని తీవ్రమైన గాయాలు ఉంటాయి. మరికొన్ని నామమాత్రంగా ఉంటాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు కఠినతరం చేయడం అత్యంత ముఖ్యం’’ అని సంగక్కర సామ కర్రాన్ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా ఐపీఎల్కు దూరమైతే తదుపరి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తోంది బీసీసీఐ. అయితే, గాయాలు, అనారోగ్య కారణాల వల్ల దూరమైన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.చదవండి: ఫైనల్కు ముందు ఆర్సీబీకి షాక్! -
టీమిండియా నుంచి సూర్యకుమార్ అవుట్..? వైభవ్కు ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్పై పడింది.ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత 'మెన్ ఇన్ బ్లూ' వరుస ద్వైపాక్షిక సిరీస్లతో బిజీబిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్లతో భారత్ తలపడనుంది.ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది భారత్కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఆసియా క్రీడలు (Asian Games) ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.'అమర్ ఉజాలా' కథనం ప్రకారం.. ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కపోయినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్త పత్రిక తమ కథనంలో పేర్కొంది.వైభవ్తో పాటు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్లో ఆడనున్నట్లు సమాచారం. కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీతో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 27న టీమిండియా విండీస్ పర్యటన ప్రారంభం కానుంది.అయితే తొలుత వన్డే సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20లు మొదలు కానున్నాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు జపాన్ టూర్ను ముగించుకుని భారత జట్టుతో చేరే అవకాశముంది.ఆసియా క్రీడలు 2026 కోసం ప్రాబుబుల్స్ లిస్ట్(అమర్ ఉజాలా ప్రకారం)తిలక్ వర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అనుకుల్ రాయల్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్ -
గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. బోరున ఏడ్చిన వైభవ్
-
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
-
‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆట ముగిసింది. లీగ్ దశలో చాలా కష్టపడి ప్లేఆఫ్స్ చేరిన రాజస్తాన్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు పరిమితమైనప్పటికీ.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. గత సీజన్లోనే తన మెరుపులను చూపెట్టిన వైభవ్ ఈ సీజన్లో దానిని పరిపూర్ణం చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో అతడు కొనసాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్ల్లో మెరిసి ఆ తర్వాత విఫలమయ్యుంటే వైభవ్ గురించి చర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ఉన్న అన్ని షాట్లను అలవోకగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్ల్లో 237కు పైగా స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలున్నాయి. క్రీజులోకి అడుగుపెట్టిందే మొదలు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం అలవాటు చేసుకోవడం వైభవ్ సూర్యవంశీలో కనిపించిన గొప్ప పరిణితి. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కమిన్స్ మొదలుకొని ఏ బౌలర్ను వదలని సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తన ముంగిట ఉండేదేమో. ఇక గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో పడిందన్న విషయాన్ని గుర్తించిన వైభవ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మెరుపులకు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకం చేజార్చుకున్న వైభవ్ ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇలా సీజన్ ఆద్యంతం తన ఆటతీరుతో అలరించిన వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టులతో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజన్లో ఒక జట్టును తన భుజస్కందాలపై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది వైభవ్’ అని ఒక అభిమాని వైభవ్కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్గా నిలిచింది.THE COLDEST EDIT ON VAIBHAV SOORYAVANSHI. 🥶 pic.twitter.com/LgDqruGc4A— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2026this IPL will be remembered for a 15 year old carrying an entire team on his shouldersTrophies come and go, but the impact you left will always stay🙏 pic.twitter.com/oPOW5ABYx2— OldMonkOfCricket (@OldMonkOfCric) May 30, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
వైభవ్పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లు!.. ఇదేం పద్ధతి?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరే ఒక సంచలనం. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై చితక్కొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. వరల్డ్కప్-2025 ఫైనల్లోనూ భారీ శతకం (80 బంతుల్లో 175)తో జట్టును గెలిపించాడు.అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా వైభవ్ దుమ్ములేపాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై లీగ్ దశలో 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్.. కీలక ఎలిమినేటర్లో మరోసారి సన్రైజర్స్ తన బ్యాటింగ్ పదునేమిటో చూపించాడు.ఒంటిచేత్తో.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. ఒంటిచేత్తో సన్రైజర్స్ను ఎలిమినేట్ చేసి.. రాజస్తాన్ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కూడా ఈ పదిహేనేళ్ల పిల్లాడు చితక్కొట్టాడు. ముల్లన్పూర్లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 96 పరుగులు రాబట్టాడు.బాడీలైన్ బౌలింగ్తోఅయితే.. సన్రైజర్స్కు ఎదురైన చేదు అనుభవం చూసిన గుజరాత్ బౌలర్లు వైభవ్ను గట్టిగానే టార్గెట్ చేశారు. ముఖ్యంగా కగిసో రబడ బాడీలైన్ బౌలింగ్తో వైభవ్ను భయపెట్టాడు. మరోవైపు.. మహ్మద్ సిరాజ్ సైతం బౌన్సర్లు సంధిస్తూ ఇబ్బందిపెట్టాడు.అయినా సరే బుడ్డోడు ఏమాత్రం బెదరకుండా నిలకడగా ఆడాడు. అయితే, ఆఖరికి రబడ వైభవ్పై పైచేయి సాధించి అతడిని అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల తీరును తీవ్రస్థాయిలో విమర్శించాడు.నాలోని తండ్రి మనసు‘‘పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడం కోసం బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్లపై అదరగొడుతున్నాడని నాకు తెలుసు. కానీ.. నాలోని తండ్రి మనసు ఈ రకమైన బౌలింగ్ను ఏమాత్రం అంగీకరించడం లేదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.ఇదేం పద్ధతి?అయితే.. చాలా మంది నెటిజన్లు ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా ఎలా మాట్లాడుతున్నారు?.. వైభవ్ సూర్యవంశీ ఏమో ఎదురుగా వరల్డ్క్లాస్ బౌలర్ ఉన్నా కనికరం లేకుండా బ్యాటింగ్తో విరుచుకుపడుతున్నాడు.మీరు మాత్రం అతడికి వ్యతిరేకంగా బౌలర్లు ఏపనీ చేయొద్దని చెబుతున్నారు. ఇదేం పద్ధతి?.. పదిహేనేళ్లకే అతడు విధ్వంసం సృష్టిస్తుంటే తప్పు లేదు గానీ.. బౌలర్లు తమ వ్యూహాలు అమలు చేస్తే తప్పా? బౌలర్లు బ్యాటర్ను అవుట్ చేయాలని మాత్రమే చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.బాడీలైన్ బౌలింగ్ అంటే ఏమిటి?ఆస్ట్రేలియాలో 1932-33లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ జట్టు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను నిలువరించేందుకు బౌలింగ్ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది.ఈ తరహా బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలు లేదంటే లెగ్స్టంప్కు కాస్త ఆవల బంతులు వేస్తూ నేరుగా బ్యాటర్ శరీరాన్ని టార్గెట్ చేశారు. తలపైకి డెలివరీలు సంధిస్తారు. ఈ ప్రమాదకర బౌలింగ్తో బ్యాటర్ తీవ్రంగా గాయపడొచ్చు లేదంటే చాకచక్యంగా ఆ బంతి నుంచి తప్పించుకోవాలి.గుజరాత్తో మ్యాచ్లో రబాడ ఈ తరహా బౌలింగ్తో చెలరేగడంతో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడి గ్లోవ్స్కు చాలాసార్లు బంతి తగిలింది. అయినా సరే అతడు పట్టుదలగా ఆడాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ రాజస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు? -
ధోని.. రోహిత్.. కోహ్లి వల్లే కాదు ..! 15 ఏళ్లకే ఇంత ప్రెజర్ ను ఎలా హ్యాండిల్ చేశావ్..?
-
ఒక్కడిని అవుట్ చేయడానికి ఎన్ని ప్లాన్ లు వేశార్రా..! ఒంటిచేత్తో జీత్ ని ఊచకోత కోసిన వైభవ్
-
వైభవ్కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ముల్లన్పూర్లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్తో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్పై👉శుబ్మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్మన్ గిల్- 2.కాగా గుజరాత్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
ఇదిరా సిరాజ్ అంటే.. గెలుపు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం!
-
‘మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప.. అంతా అతడి వల్లే’
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా ఫైనల్ చేరాలన్న రాయల్స్ కలలు చెదిరిపోయాయి.అంచనాలకు మించిఈ నేపథ్యంలో గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తమ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. తమ ప్రయాణం ఇక్కడి వరకు సాగడమే గొప్ప విషయమని అతడు అన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ పిచ్పై 215 అనేది కాపాడుకోదగ్గ స్కోరే. అయితే, రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింతగా అనుకూలించడం మాపై ప్రతికూల ప్రభావం చూపింది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా సాగింది.మేము మరో 15- 20 అదనపు పరుగులు సాధించి ఉండే బాగుండేది. ఏదేమైనా ఈ సీజన్ మాకు సానుకూలంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము అసలు ప్లే ఆఫ్స్నకు కూడా అర్హత సాధించే స్థితిలో లేము.చాలా మంది యువ ఆటగాళ్లే మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఐపీఎల్ ఆడుతున్నారు. సీజన్కు ముందు ఎన్నెన్నో మార్పులు.. ఎన్నో విభిన్న కాంబినేషన్లు ప్రయత్నించి చూశాము.అయినప్పటికీ మా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడి ఇక్కడి దాకా చేరుకున్నారు. మాకు ఇదొక గొప్ప ఆరంభం. ఈ ప్రయాణంలో మున్ముందు మెరుగ్గా రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.వైభవ్ సూర్యవంశీనే కారణంఇక గుజరాత్తో క్వాలిఫయర్-2లో తాము గట్టిగా పోరాడగలిగామంటే అందుకు వైభవ్ సూర్యవంశీనే కారణమని రియాన్ పరాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతడు టీమిండియాకు ఆడితే చూడాలని ఉందని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. వైభవ్ ఆట గాలివాటం కాదని.. పక్కా ప్రణాళికతోనే అతడు మైదానంలో దిగుతాడని ప్రశంసించాడు.ఆర్సీబీతో ఫైనల్లో గుజరాత్కాగా ముల్లన్పూర్ వేదికగా గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్) రాణించాడు.ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రాజస్తాన్ 214 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: హార్దిక్ పాండ్యా కూడా! -
చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)
-
హార్ట్ బ్రేకింగ్.. వైభవ్ మరో 'సారీ'
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో 97 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయిన వైభవ్.. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్పై అదే సీన్ రిపీట్ చేశాడు. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్తో క్వాలిఫయర్-2లో వైభవ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్ను వైభవ్ తన అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. గత మ్యాచ్తో పోలిస్తే కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ సులువుగా తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వైభవ్ నిలిచిపోయాడు.రబాడ బౌలింగ్లో భారీషాట్కు ప్రయత్నించి థర్డ్మ్యాన్లో వైభవ్ దొరికపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ ఈ విధంగానే అతడు తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్ల సరసన వైభవ్ చేరాడు. డేవిడ్ వార్నర్, కె.ఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును అతను సమం చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్లు వీరేవైభవ్ సూర్యవంశీ-3డేవిడ్ వార్నర్-3కేఎల్ రాహుల్-3గ్లెన్ మాక్స్వెల్-3రుతురాజ్ గైక్వాడ్-3 -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ను తన విరోచిత ఇన్నింగ్స్తో వైభవ్ ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్లో పవర్ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంTHE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷🎥 The Boy Wonder playing fire with fire 🔥Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP— IndianPremierLeague (@IPL) May 29, 2026 -
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
తనే నా క్వీన్... వైరల్ అవుతున్న వైభవ్ ఓల్డ్ వీడియో
-
‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆటను, అతడి ప్రదర్శనను క్రీడా నిపుణులు, అభిమానులు క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ మాత్రం వైభవ్ను మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో పోల్చడం వివాదాస్పదంగా మారింది.‘15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే నాకు మా షాహిద్ అఫ్రిది గుర్తుకు వస్తున్నాడు. అతడు కూడా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగులు రాబట్టేవాడు. 1996 వన్డే ప్రపంచకప్లో 37 బంతుల్లోనే అఫ్రిది సెంచరీ బాదాడు. అప్పుడు అఫ్రిది వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు వైభవ్ కూడా బౌలర్లు ఎంతవారైనా భయం, బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించడంలో విజయవంతమయ్యాడు. ఇక వైభవ్కు మంచి భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల వయసులో విధ్వంసకర బ్యాటింగ్ ఆడడం అతడి అదృష్టమని చెప్పొచ్చు. బ్యాటింగ్లో అదరగొడుతున్నప్పుడు వయసుతో పని లేకుండా సీనియర్ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది. అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాల్సిందే.’ అని డిమాండ్ చేశాడు. అయితే వైభవ్ బ్యాటింగ్ను మెచ్చుకోవడం నుంచి టీమిండియాలోకి అతడిని తీసుకోవాలని మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతృప్తి చెందిన అభిమానులు షాహిద్ అఫ్రిదితో వైభవ్ను పోల్చడంపై మాత్రం మండిపడ్డారు. వైభవ్తో అఫ్రిదిని పోల్చవద్దని హితవు పలికారు. ‘భారత్ పట్ల ఎప్పుడు విద్వేష భావంతో ఉండే అఫ్రిదితో పోల్చడం ఏంటి? ఇది వైభవ్ను అవమానించడం కిందే లెక్క’.. ‘ఉగ్రవాదులతో కలిసి విందులో పాల్గొనే వ్యక్తితో పోలుస్తారా’ అంటూ కామెంట్లు చేశారు. కాగా పాక్ క్రికెటర్గా కొనసాగుతున్న సమయంలో షాహిద్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ బలోచ్ నేత ఉజైర్ బలోచ్తో కలిసి డిన్నర్లో పాల్గొన్న ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదిగా ముద్ర పడిన వ్యక్తితో కలిసి అఫ్రిది భోజనం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ను ద్వేషించే క్రికెటర్లలో అఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. పదే పదే భారత్ను కించపరిచేలా మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం అఫ్రిదికి అలవాటుగా మారిపోయిందని గతంలోనూ భారత క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పించారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆడిన 15 మ్యాచ్ల్లో 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 15-year-old cricket sensation #Vaibhav Sooryavanshi reminds me of @SAfridiofficial young, fearless, explosive, full of energy. The future is here! 🔥🏏 #Cricket #IPL2026— Mohammad Yousaf (@yousaf1788) May 28, 2026No comparison at all with Afridi. Vaibhav is way different!— manak (@manakseervi) May 29, 2026Hmmm.. getting compared to a bottom tier slogger.. this is perhaps the biggest insult to Vaibhav Sooryavanshi, the lowest point of his life. And I’m happy it has come so early in his career. I’m sure he’ll get over it soon, and after this, nothing negative will ever affect him…— THE SKIN DOCTOR (@theskindoctor13) May 28, 2026Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013చదవండి: 'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!' -
వైభవ్ సూర్యవంశీ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్
-
'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!'
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తాజాగా నేడు గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 పోరులో వైభవ్ ప్రళయం సృస్టిస్తాడా లేక విఫలమవుతాడా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా హర్భజన్, సెహ్వాగ్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. మాటల సందర్భంలో వైభవ్ వేలంలోకి వస్తే ఎంత ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేస్తావంటూ సెహ్వాగ్కు హర్భజన్ ప్రశ్న సంధించాడు. భజ్జీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని సెహ్వాగ్.. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే గనుక రూ. 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటానంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సెహ్వాగ్ ఇచ్చే ఆఫర్కు సమాన మొత్తాన్ని తాను చెల్లిస్తానంటూ బదులిచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ దృష్ట్యా అతడిని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాకపోవడం, పైగా 15 ఏళ్లే ఉండడంతో జాతీయ జట్టులోకి అతడి ఎంపికకు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. అయితే అతడి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఇండియా-ఎ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ నేతృత్వంలో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ తరఫున సూర్యవంశీ ఆడనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ సత్తా చాటితే గనుక త్వరలో భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఐపీఎల్ 18వ సీజన్లోనే కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్లు గాలివాటం కాదని తాజా సీజన్ ద్వారా నిరూపించాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ఆకాశమే హద్దుగారాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో గ్రూప్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.దిగ్గజాలు ఫిదాకేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.దేవుడిని ప్రార్థిస్తున్నాప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది. చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను వదిలేయాలి’Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro— Star Sports (@StarSportsIndia) May 27, 2026 -
ఒక పక్క ఏడుస్తూనే.. వైభవ్ ను పిలిచి ఏం చేసిందో చూడండి!
-
‘‘రాజస్థాన్ రాయల్స్ను యశస్వి జైస్వాల్ వదిలివెళ్లాలి’’
చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ శాంసన్ వెళ్లడం ఖరారైనప్పుడు.. ఇకపై రాజస్థాన్ రాయల్స్ బాధ్యతలు యశస్వి జైస్వాల్ చేపడతాడని చాలా మంది భావించారు. లేదంటే జట్టులో ప్రధాన ఆటగాడిగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది. ఏడాది క్రితమే ఐపీఎల్లోకి ప్రవేశించిన టీనేజర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లోని కీలక ఆటగాళ్లను సైతం డామినేట్ చేస్తున్నాడు.మరోవైపు, 2023 ఐపీఎల్ సీజన్లో 600కుపైగా పరుగులు, 48.07 సగటుతో రాణించినప్పటి నుంచి యశస్వి జైస్వాల్ను భారత క్రికెట్ ఫ్యూచర్ స్టార్గా భావించారు. కానీ, 2026 మే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దాదాపు ప్రతి అంశంలోనూ అతడిని మించిపోయాడు.వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచాడు. ఆటను మరింత మెరుగుపర్చుకుని రాజస్థాన్ జట్టులోనే ఉండడం. లేదంటే జట్టు మారడం. జైస్వాల్ తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోకపోతే వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల ముందు అతడి పేరు, గుర్తింపు, ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంది.మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ నీడ నుంచి బయటకు వచ్చి(ఆర్ఆర్ నుంచి), మరో జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని జైస్వాల్కు సూచించాడు.“అతడు తన ఆటతీరును మార్చుకోవాలి. ఎందుకంటే సూర్యవంశీతో కలిసి ఆడుతూ ప్రతిసారీ అతడి పర్ఫార్మన్స్ ముందు మసకబారిపోతూ ఉండలేడు. జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు. మరో జట్టుకు వెళ్తే తన సొంత ప్రతిభతో మ్యాచ్లు గెలిపిస్తాడు. అతడికో ఓ వేదిక అవసరం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇకముందూ ఇతరుల ప్రభ తగ్గిపోయేలా చేస్తూనే ఉంటాడు” అని అంబటి రాయుడు అన్నాడు.“వైభవ్ సూర్యవంశీతో పాటు ఓ సీనియర్ భాగస్వామి ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అతడి విజయాన్ని చూసి ఆనందించాలి. పోటీగా భావించకూడదు. అతడితో పోటీ పడటం సాధ్యం కాదు” అని తెలిపాడు. జైస్వాల్కు ముంబై ఇండియన్స్ సరైన జట్టని అన్నాడు. -
సూర్యవంశీ విధ్వంసంపై స్పందించిన క్రిస్ గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్లో సంచలనాత్మక ఇన్నింగ్స్తో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్గేల్ ప్రశంసలు కురిపించాడు. సూర్యవంశీని సరికొత్త సిక్సర్ల యంత్రంగా వర్ణించాడు. అతడి ఆట అద్భుతం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. 29 బంతుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు సూర్యవంశీని ఓదార్చాడు. ఏదో ఒకరోజు ఈ యువ బ్యాటర్ తన రికార్డును బ్రేక్ చేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు.న్యూ చండీగఢ్ వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్తో పలు రికార్డు తిరగరాశాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 29 బంతుల్లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 334కు పైగా స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్గేల్ రికార్డును బ్రేక్ అవకాశాన్ని కొంచెంలో మిస్సయ్యాడు. 2012లో గేల్ చేసిన 59 సిక్సర్లను రికార్డును మాత్రం సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (65) కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ రికార్డుల స్క్రీన్షాట్ను ఇన్స్టా స్టోరీలో క్రిస్గేల్ షేర్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ మెచ్చుకున్నాడు. ఏ న్యూ సిక్స్ మెషీన్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ను మారణకాండతో పోల్చాడు. సెంచరీ మిస్ అయినందుకు దురదృష్టవంతుడు అంటూ కామెంట్ పెట్టాడు. తన రికార్డును ఎప్పటికైనా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. -
కాటీరమ్మ కొడుకులను ఆటాడుకున్న బుడ్డాడు
-
భయం ఎరుగని బ్యాటింగ్.." బౌలర్లకు చుక్కలు! చిన్న వయసులో రికార్డులు బద్దలు!
-
రోహిత్, విరాట్లను భయపెట్టిన పాట్ కమిన్స్ నే వణికించిన బుడ్డాడు..!
-
వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప
-
'ఆ సీక్రెట్ ఐపీఎల్ అయిపోయాక చెప్తా'
ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. అతడి విధ్వంసం ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. రాజస్తాన్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైభవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్పై సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం వైభవ్పై తన సహచరడు, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అతడు బ్యాటింగ్ చూడాటానికి చాలా బాగుంటుంది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేయడానికి అన్ని ఎక్కువ పరుగులు లభిస్తాయి. వైభవ్ 150 పరుగులు కూడా చేయగలడన్న నమ్మకం నాకు ఉంది" అని ఆర్చర్ అన్నాడు. అదేవిధంగా వైభవ్ను ఆడ్డుకోవాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్న ప్రశ్నకు ఆర్చర్కు ఎదురైంది.అందుకు బదులుగా.. వైభవ్ను ఎలా ఔట్ చేయాలో నాకు తెలుసు. కానీ అది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెప్తాను అని ఆర్చర్ సరదాగా సమాధనమిచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ(680) అగ్రస్ధానంలో ఉన్నాడు. మే 29న రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.చదవండి: IPL 2026: వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే -
వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్.ఐపీఎల్ మొదలై 19 సీజన్లు అవుతున్నప్పటికి ప్లే ఆఫ్స్లో ఇలాంటి ఇన్నింగ్స్ను ఇప్పటివరకు చూడలేదు. ఈ నాకౌట్ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్-బి, ప్లాన్-సి అని చెప్పిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ను సైతం ఈ వండర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్గా క్రిస్ గేల్ ఆల్టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్కు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.థాంక్యూ సమర్..వైభవ్ సూర్యవంశీలోని టాలెంట్ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను మొదటిసారి చూశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లు, అతడిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చర్యపరిచాడు.వెంటనే వైభవ్ గురుంచి రాజస్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్స్లో వైభవ్ తను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్తరపోయాడు. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్లో అప్పటివరకు సంజూ శాంసన్, జైశ్వాల్ మాత్రమే తాము ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ జాబితాలో వైభవ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్ఆర్ మేనేజ్మెంట్కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్ను చూశాను అంటూ రాజస్తాన్ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభవ్ను పట్టుబట్టి మరి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటిలో ఒక యువ ఆటగాడిపై అంత మొత్తాన్ని వెచ్చించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ ఇప్పుడు అతడి విలువ వందల కోట్లతో సమానం.చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా -
ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా
ఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు తన మెరుపు బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.15 ఏళ్ల వైభవ్.. పాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. తొలి ఓవర్ నుంచే సన్రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు కోల్పోయాడు. ఇక వైభవ్ సంచలన ఇన్నింగ్స్కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. వైభవ్పై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్ఫుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్ఛే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం" అని సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది: వైభవ్ సూర్యవంశీ
మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ విధ్వంసం సృష్టించాడు.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో సిక్స్తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్తో గేల్ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్తో గేల్ను అధిగమించాడు. మూడో సిక్స్తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది.ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేశ్ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్ప్లేలో అత్యధిక సిక్స్లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు.వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ ఔటయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి ఔటైనన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవ్వడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు."నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురుంచి అసలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా 'థర్డ్ మ్యాన్' దిశగా ఆ షాట్ ఆడి ఉంటే, బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రైయిట్గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో ఔట్ అవ్వాల్సి వచ్చింది" అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా సన్రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్కు ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్తాన్ కోచ్లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ను గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది.19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి(38), సైల్ ఆరోరా(35), ఇషాన్ కిషన్(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.మా ఓటమికి కారణమదే..వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ ఆటకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లగా మలిచాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే వికెట్ చివరి వరకు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ సీజన్ ద్వారా మేము యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశాము.మేము టోర్నీని ఓటమితో ముగించినప్పటికి ఒక పరిపూర్ణమైన జట్టుగా మాత్రం నిలిచాం. ప్రఫుల్, సాకిబ్ ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఇండియన్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. టోర్నీ అంతటా వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్కు చేరుకున్న యంగెస్ట్ టీమ్స్లో ఒకటిగా సన్రైజర్స్ నిలిచింది. మా జట్టులో చాలా వరకు యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో మా కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. వారి వల్లే ఆరెంజ్ ఆర్మీ ఒక పటిష్టమైన టీమ్గా మారింది. కాబట్టి ఒక కెప్టెన్గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల పైగా లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. అయితే ఈ లక్ష్యాన్ని చేధించేందుకు అనువైన పిచ్ ఏదైనా ఉందంటే? అది ముల్లాన్ పూర్ మాత్రమే అని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్కు అద్భుతంగా ఉంటుంది. ఛేజింగ్ చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చాము. సరైన రన్రేట్ మెయింటేన్ చేస్తూ ముందుకు వెళ్లాము. కానీ దురదృష్టవశాత్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. గత మూడు సీజన్లలో మేము రెండు సార్లు ప్లే ఆఫ్స్కు చేరాం. ఈసారి టాప్-2లో నిలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఈ సీజన్ అంతటా మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను కమిన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు -
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)
-
ఎస్ఆర్హెచ్కు హార్ట్ బ్రేక్.. ఐపీఎల్ నుంచి నిష్క్రమణ
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్దికి భారీ స్కోర్ సమర్పించుకుంది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు) ఊచకోత కోయడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్ స్కోర్.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది.12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో ఎస్ఆర్హెచ్ పేసర్లు సాకిబ్ హుసేన్, నితీశ్కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రఫుల్ హింగే (4-0-54-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓ పక్క సహచరులంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా శివాంగ్ కుమార్ (2-0-19-1), నితీశ్ కుమార్ (2-0-12-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. కమిన్స్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎషాన్ మలింగ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్ తీయగా.. సాకిబ్ హుసేన్ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.రాజస్థాన్ ఇన్నింగ్స్లో వైభవ్, జురెల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జైస్వాల్ 29, కెప్టెన్ రియాన్ పరాగ్ 26, ఫెరియెరా 12, షనక 5, రవీంద్ర జడేజా 12 (నాటౌట్), ఆర్చర్ 4, బర్గర్ 1, సుషాంత్ మిశ్రా 1 (నాటౌట్) పరుగు చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్ఆర్హెచ్ ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఒత్తిడికి లోనైన ఆ జట్టు వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ (4-0-58-3), బర్గర్ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్ రాజ్ పూనియా (4-0-39-1), సుషాంత్ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై, 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఈ గెలుపుతో రాజస్థాన్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించగా.. ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ గుజరాత్తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరింది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఎస్ఆర్హెచ్తో ఇవాళ (మే 27) జరుగుతున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సురేశ్ రైనాతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్16 - సురేశ్ రైనా vs PBKS, వాంఖడే, 201416 - వైభవ్ సూర్యవంశీ vs SRH, ముల్లాన్పూర్, 2026*17 - ఆడం గిల్ క్రిస్ట్ vs DC, సెంచూరియన్, 200920 - ఎంఎస్ ధోని vs MI, బెంగళూరు, 201221 - డ్వేన్ స్మిత్ vs CSK, ఢిల్లీ, 201321 - వీరేంద్ర సెహ్వాగ్ vs CSK, వాంఖడే, 201421 - రజత్ పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు61* - వైభవ్ సూర్యవంశీ (2026)59 - క్రిస్ గేల్ (2012)52 - ఆండ్రీ రస్సెల్ (2019)51 - క్రిస్ గేల్ (2013)45 - జోస్ బట్లర్ (2022)ఐపీఎల్ సీజన్లో ఒక అన్క్యాప్డ్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు680 - వైభవ్ సూర్యవంశీ (RR, 2026)*625 - యశస్వి జైస్వాల్ (RR, 2023)616 - షాన్ మార్ష్ (PBKS, 2008)573 - రియాన్ పరాగ్ (RR, 2024)549 - ప్రభ్సిమ్రాన్ సింగ్ (PBKS, 2025)ఐపీఎల్లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక 50లు6 - అభిషేక్ శర్మ5 - నికోలస్ పూరన్5 - వైభవ్ సూర్యవంశీ*ఐపీఎల్ పవర్ ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక 50+ స్కోర్లు6 - డేవిడ్ వార్నర్5 - వైభవ్ సూర్యవంశీ4 - ట్రావిస్ హెడ్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో (1-6) మధ్య ఓవర్లలో 50+ స్కోర్లు87 - సురేష్ రైనా vs PBKS, 201474 - ఆడమ్ గిల్ క్రిస్ట్ vs DD, 200960 - వైభవ్ సూర్యవంశీ vs SRH, 2026*ఐపీఎల్లో 1-6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు8 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026 ELM*7 - సనత్ జయసూర్య (MI) vs CSK, ముంబై WS, 20087 - జోస్ బట్లర్ (RR) vs DC, ఢిల్లీ, 2018 (వర్షం కుదించిన గేమ్)7 - జానీ బెయిర్స్టో (PBKS) vs RCB, బ్రబౌర్న్, 20227 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, ముల్లన్పూర్, 20267 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026ఐపీఎల్ సీజన్లో అత్యధిక పవర్ప్లే (1-6 ఓవర్లు) పరుగులు490 - వైభవ్ సూర్యవంశీ (2026)*467 - డేవిడ్ వార్నర్ (2016)402 - ట్రావిస్ హెడ్ (2024)402 - సాయి సుదర్శన్ (2025)382 - ఆడమ్ గిల్క్రిస్ట్ (2009)ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు4 - క్రిస్ గేల్4 - వైభవ్ సూర్యవంశీ*2 - అభిషేక్ శర్మ2 - ఫిన్ అలెన్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు11* - V సూర్యవంశీ vs SRH, జైపూర్, 2026*10 - S గిల్ vs MI, అహ్మదాబాద్, 20239 - R పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు)12 - వి సూర్యవంశీ (RR) vs SRH, 202612 - V సూర్యవంశీ (RR) vs SRH, 2026 ELM11 - మురళీ విజయ్ (CSK) vs RR, 201011 - వి సూర్యవంశీ (RR) vs GT, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 13.5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (12), ఫెరియెరా క్రీజ్లో ఉన్నారు. -
WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్ను తాకింది. ఆ ఈవెంట్ సూపర్ స్టార్ డ్రూ మెక్ఇన్టైన్ (Drew McIntyre) వైభవ్పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. వైభవ్ ఐపీఎల్ జెర్సీతో జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్కు వచ్చిన క్రేజ్ చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Drew McIntyre (@dmcintyrewwe)బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్, ధోని, విరాట్ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్ క్రేజ్ చూసి ఔరా అంటున్నారు.డ్రూ మెక్ఇన్టైన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించడం మరింత వైరల్గా మారింది. "2K గేమ్లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు ఎస్ఆర్హెచ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో ఇప్పటివరకు అతనాడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.పైగా వైభవ్కు ప్లే ఆఫ్స్లో (నాకౌట్స్) మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్ ఆడిన 8 నాకౌట్స్లో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్ ఫ్యాన్స్ ధీమాకు మరో కారణం కూడా ఉంది. ఇదే సీజన్ లీగ్ మ్యాచ్లో వైభవ్ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్లో వైభవ్ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్ ఏం చేస్తాడో చూడాలి. -
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ముందు వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున వైభవ్ బరిలోకి దిగనున్నాడు. తిలక్ వర్మ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ సిరీస్లో కూడా అతడు మెరుగ్గా రాణిస్తే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతోంది.ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 583 పరుగులు సాధించి ఆరెంజ్క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి."వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.చదవండి: IPL 2026: రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే! -
వైభవ్ ఊచకోత ఖాయం..!
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 27) జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదారాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్కు ముందు అందరి చూపు రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఎందుకంటే ఈ బుడ్డోడు ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు.ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. వైభవ్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లోనూ తప్పక చెలరేగుతాడని భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం. ఈ బిహారి చిన్నోడు అన్ని విభాగాల్లో ఇప్పటివరకు 8 నాకౌట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ దూకుడు ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతుంది.కాబట్టి నేటి మ్యాచ్లో అతడు చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. పవర్ ప్లేలోనే అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అంచనా వేయడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సీజన్ పవర్ ప్లేలో వైభవ్ 231కు పైగా స్ట్రయిక్ రేట్తో ఏకంగా 430 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం కాగానే వైభవ్ పని పట్టకపోతే పెను ముప్పు తప్పదని వారు ఓ అంచనాకు వచ్చేశారు.ఈ నేపథ్యంలో వారు వైభవ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ సీజన్లోనే జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్ ఎస్ఆర్హెచ్పై 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ఇబ్బందిపడిన అంశాలను ఎస్ఆర్హెచ్ బౌలర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.గత మ్యాచ్లో అతడు ఎడమ భుజం వైపు గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. కమిన్స్, సాకిబ్ హుసేన్ ఈ ఏరియాలోనే వైభవ్ను టార్గెట్ చేసేందుకు వ్యూహరచన చేసుకొని ఉంటాయి.నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్లు..2024 అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు 2026 అండర్-19 వరల్డ్కప్ సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్పై 33 బంతుల్లో 68 పరుగులు2026 అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు -
అతడు మాపై శతక్కొట్టొచ్చు.. కానీ..: కమిన్స్
ఐపీఎల్-2026లో ‘ఎలిమినేటర్’ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ ఇందుకు వేదిక.లీగ్ దశలో హైదరాబాద్ తొమ్మిది విజయాలు.. సాధించగా రాజస్తాన్ ఎనిమిది మ్యాచ్లు గెలిచింది. అయితే, ముఖాముఖి పోరులో ఈ సీజన్లో రెండుసార్లూ హైదరాబాద్ జట్టే రాజస్తాన్పై పైచేయి సాధించింది.తొలుత సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్రైజర్స్.. జైపూర్లో ఆతిథ్య జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ పోరులో రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టి..ఉప్పల్ మ్యాచ్లో ప్రఫుల్ హింగే వైభవ్ను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపగా.. జైపూర్లో వైభవ్ అతడి బౌలింగ్లో చితక్కొట్టాడు. అంతేకాదు.. 36 బంతుల్లోనే శతక్కొట్టి.. లీగ్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పడం విశేషం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఒక బౌలర్గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను.వైభవ్ కోసం ప్లాన్ బి, సి కూడాఓ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలడని భావిస్తే.. అతడి కోసం ప్లాన్ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్ కోసం కచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు.అయితే, అంతకంటే ముందు మ్యాచ్లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్.. మరికొన్నిసార్లు బ్యాటర్ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.ఇక గ్రూప్ దశలో రాయల్స్ను రెండుసార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని.. అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో గుజరాత్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: మూడు కీలక యుద్ధాలు గెలిచిన ఆర్సీబీ! -
ఇప్పట్లో అతడిని ఎంపిక చేయొద్దు: గంగూలీ
భారత క్రికెట్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడేనన్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వైభవ్కు ఇప్పట్లో చోటు ఇవ్వడం సరికాదన్నాడు.అదే విధంగా.. టీ20 ఫార్మాట్కు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందని తాను ఊహించలేదని గంగూలీ తెలిపాడు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి తన సహచర ఆటగాళ్లు సైతం దీనిని అంచనా వేయలేకపోయారని.. తమ తరం ఆట తీరు వేరుగా ఉండేదన్నాడు.త్వరలోనే జాతీయ జట్టులోకి!కాగా పన్నెండేళ్ల వయసులోనే దేశీ రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక భారత్ అండర్-19 జట్టు తరఫునా.. అదే విధంగా ఐపీఎల్లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన పదిహేనేళ్ల వైభవ్ త్వరలోనే జాతీయ జట్టులోకి రానున్నాడు.ఇటీవల సెలక్టర్లు వైభవ్ను భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన గంగూలీకి వైభవ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..అప్పటిదాకా టెస్టులకు ఎంపిక చేయొద్దు‘‘టీ20 జట్టులోకి అతడు తప్పక రావాల్సిందే. కానీ టెస్టు జట్టులో ఇప్పట్లో అతడికి చోటు ఇవ్వకూడదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మరిన్ని పరుగులు రాబట్టి.. తనను తాను నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయాలి.అయితే, అతడు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్. పదిహేనేళ్ల వయసులోనే ఈ రేంజ్లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడటం నిజంగా ఆశ్చర్యకరం. భారత క్రికెట్ భవిష్యత్ అతడే’’ అని గంగూలీ ప్రశంసలు కురిపించాడు.అస్సలు ఊహించలేదుఇక 25 ఏళ్ల టీ20 ఫార్మాట్ ఈ స్థాయికి చేరుతుందని ద్రవిడ్, టెండుల్కర్లతో పాటు మీరూ ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘అస్సలు ఊహించలేదు. మేము ముగ్గురమే కాదు.. మాతో పాటు రిక్కీ పాంటింగ్, కుమార్ సంగక్కర, జో రూట్, అలిస్టర్ కుక్ కూడా బహుశా ఇది ఊహించి ఉండరు.మాదొక విభిన్నమైన తరం. అయితే, ఆటలోనైనా.. ఇతర ఏ రంగంలోనైనా మార్పులు సహజం. కాబట్టి పరిస్థితులకు తగినట్లు ఆటగాళ్లు మారుతూనే ఉండాలి. టీ20 క్రికెట్లో యువ ఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. లైన్కు తగినట్లు ఆడుతూ.. బంతిని స్టాండ్స్లోకి పంపడమే వారి ముందున్న లక్ష్యం’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి లీగ్ దశలో ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లో) కూడా ఉంది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం! -
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్కు ముందు వైభవ్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్తో 583 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్-2024 సీజన్లో మెక్గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్రైజర్స్పై వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్గర్క్ను అధిగమించే అవకాశముంది.500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది.గేల్ రికార్డుపై కన్నుకాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2012)వైభవ్ సూర్యవంశీ: 53 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ - ఐపీఎల్ 2026)*ఆండ్రీ రస్సెల్: 52 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2019)క్రిస్ గేల్: 51 సిక్సర్లు (16 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2013)చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
మరీ ఇంత కుళ్లు పనికిరాదు!.. నీకంటే అతడే బెస్ట్!
పద్నాలుగేళ్ల వయసులోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు దేశీ క్రికెట్లో.. అటు ఐపీఎల్లో సత్తా చాటుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారిన ఈ బిహారీ కుర్రాడు ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.583 పరుగులుఇక ఇటీవలే పదిహేనవ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్లలో కలిపి ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం ఉంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తరఫున లీడ్ రన్స్కోరర్గా ఉన్న వైభవ్.. ఓవరాల్గా టాప్-5లో కొనసాగుతున్నాడు. తన అద్భుత బ్యాటింగ్తో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైభవ్కు రోజురోజుకూ ఆదరణ మరింత పెరుగుతోంది. నిజానికి ప్రస్తుతం రాయల్స్ పోస్టర్ బాయ్గా వైభవ్ అవతరించాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీ పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.వైభవ్ పట్ల రియాన్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వైభవ్ సహా రాయల్స్ జట్టు మొత్తం ముల్లన్పూర్కు పయనమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సెలబ్రిటీలను కెమెరాలో బంధించే పాపరాజీలు.. రియాన్ పరాగ్ను పిలిచి.. ‘రియాన్ వైభవ్తో ఒక్క ఫొటో కావాలి’ అని అడిగారు. ఇందుకు.. ‘మేమేమీ సినిమా స్టార్లము కాదు’ అని రియాన్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.Look at Vaibhav Suryavanshi’s reaction when the paparazzis said to Riyan Parag, “Riyan, Vaibhav ke saath ek photo please,” and Riyan replied, “Hum koi film star nahi hain.” After hearing this, Vaibhav Suryavanshi’s smile disappeared. 👀Later, the paparazzis said to Vaibhav,… pic.twitter.com/sXsyhTGgCb— Sonu (@Cricket_live247) May 26, 2026అందరి రికార్డులూ బద్దలు కొడతాడుదీంతో అప్పటిదాకా చిరునవ్వులు చిందించిన వైభవ్.. కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో ఓ పాపరాజీ.. ‘వైభవ్ ఏ సినీ స్టార్ కంటే కూడా తక్కువ కాదు. అతడు అందరి రికార్డులూ బద్దలు కొడతాడు’’ అని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరీ అంత కుళ్లు పనికిరాదుఈ నేపథ్యంలో.. ‘‘వైభవ్పై మరీ అంత కుళ్లు పనికిరాదు.. జట్టుకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు?.. పిల్లాడిని ఇంతలా అప్సెట్ చేస్తావా? నీ ఇగోకు మూల్యం చెల్లించకతప్పదులే’’ అని నెటిజన్లు రియాన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా రాజస్తాన్ విజయాల్లో ఆటగాడిగా రియాన్ పాత్ర పెద్దగా లేదు. పైగా ఇటీవల డ్రెసింగ్రూమ్లో చట్టవిరుద్ధంగా ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కి రాజస్తాన్ పరువు తీశాడు. ఇందుకు బదులుగా బీసీసీఐ జరిమానాతో సరిపెట్టగా.. రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి: ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్ -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం! -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్లోనే పీటర్సన్ వైభవ్కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం! -
వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫెయిల్!
పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. దేశీ క్రికెట్లో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో సత్తా చాటి ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ. 1.10 కోట్లకు వైభవ్ను కొనుగోలు చేసింది.వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుఅయితే, నాడు పద్నాలుగేళ్ల పిల్లాడికి అంతమొత్తం చెల్లించి రాజస్తాన్ తొందరపడిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వైభవ్ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ తన అద్భుత ప్రదర్శనలతో వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుల జాబితాలోఅరంగేట్ర సీజన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో రాణించిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ దశలో 14 మ్యాచ్లలో కలిపి విధ్వంసకర సెంచరీ (36 బంతుల్లో) సాయంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 583 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో నిలిచాడు.ఒకప్పుడు రాజస్తాన్ పోస్టర్ బాయ్అదే సమయంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్లలో కలిపి కేవలం 397 పరుగులు చేశాడు. కాగా ఒకప్పుడు రాజస్తాన్ పోస్టర్ బాయ్గా యశస్వి ముందు వరుసలో ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని వైభవ్ ఆక్రమించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.భారత స్పిన్ దిగ్గజం, రాయల్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ ఆట తీరు వల్ల జైసూ ప్రభావితం అయ్యాడని.. అందుకే ఈ సీజన్లో సరిగ్గా ఆడలేకపోయాడని పేర్కొన్నాడు.జైసూ విఫలం.. వైభవ్ను నిందించిన అశూ!తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈసారి యశస్వి జైస్వాల్ ప్రదర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అంచనాలు అందుకోలేకపోయాడు. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండటమే ఇందుకు కారణం కావొచ్చు.అయితే, నాకు మరో సందేహం కూడా ఉంది. మరో ఎండ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం జైస్వాల్ను భయపెట్టిందని నాకు గట్టిగా అనిపిస్తోంది. నాకు తెలిసి వైభవ్ ఆట తీరు జైసూను కుదేలు చేసి.. గందరగోళంలోకి నెట్టేసి ఉంటుంది.సెహ్వాగ్- ఆకాశ్ మాదిరిటెస్టుల్లో టీమిండియా స్టార్లు వీరేందర్ సెహ్వాగ్- ఆకాశ్ చోప్రా ఓపెనింగ్ జోడీ మీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆకాశ్ చోప్రా బాగానే ఆడతాడు. 30- 40 రన్స్తో శుభారంభమే ఇస్తాడు. అయితే, సెహ్వాగ్ విధ్వంసకర ఆట తీరు కారణంగా ఆకాశ్ చోప్రా కనుమరుగైపోయేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ బాగా ఆడిన అనుభవం ఆకాశ్ చోప్రాకు ఉంది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.ఇప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీ ఊచకోత చూసి జైస్వాల్ కొద్దిగా షేక్ అయినట్లు కనిపిస్తోంది. ఓవైపు.. వైభవ్ చితక్కొడుతుంటే.. జైసూ బంతిని బాదేందుకు కష్టపడిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని అశూ పేర్కొన్నాడు.అశూ అభిప్రాయం సరైందేనా?అశ్విన్ అన్నట్లు వైభవ్ నిజంగానే జైసూను భయపెట్టాడా? అంటే.. నిజం కాకపోవచ్చనే అనిపిస్తోంది. 24 ఏళ్ల జైస్వాల్ 2020 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. టీమిండియా టెస్టు ఓపెనర్గానూ కావాల్సినంత అనుభవం ఉంది.నిజానికి వైభవ్ను చూస్తూ జైసూ భయపడుతున్నాడు అనడం కంటే.. 15 ఏళ్ల పిల్లాడిని స్ఫూర్తిగా తీసుకుని మరో ఎండ్లో సిక్సర్ల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. సీనియర్ ఓపెనర్గా మైదానంలో వైభవ్కు పెద్దన్నలా సలహాలు ఇస్తూ.. అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ ఝులిపించడంలోనూ జైసూ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఏదేమైనా వైభవ్ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం త్వరలోనే టీమిండియా ఓపెనర్గా సీనియర్లకు పోటీగా మారడం ఖాయం.చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్ ఫైర్ -
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఐపీఎల్-2026లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. 6 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ త్వరగా అవుట్ అయినప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన పిన్న వయష్కుడిగా 15 ఏళ్ల వైభవ్ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడి 583 పరుగులు చేశాడు. 4 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ దేవ్దత్త్ పడిక్కల్ పేరిట ఉండేది. 2019/20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ కర్ణాటక తరఫున 580 పరుగులు చేశాడు. పడిక్కల్ 19 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజాగా ఇన్నింగ్స్తో పడిక్కల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ డూ ఆర్డై మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (27), ధ్రువ్ జురెల్ (38), దసున్ శనక (28), జోఫ్రా ఆర్చర్ (32) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై పోరాడుతోంది.చదవండి: మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!' -
‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే పరమావధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజన్లో 14 మ్యాచ్ల్లో 583 పరుగులు సాధించి రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్తో రాజస్తాన్ ఆడిన తమ చివరి లీగ్ మ్యాచ్లో వైభవ్ నిరాశ పరిచాడు. చాహర్ వేసిన లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరబడిన వైభవ్ సూర్యవంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన నమన్ ధిర్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో వైభవ్ వికెట్ తీయగానే దీపక్ చాహర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హమ్మయ్యా ఔట్ చేశాను' అన్న తరహాలో చాహర్ సైగలు చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాహర్ వింత సెలబ్రేషన్ వెనుక ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. క్షణాల్లో ఆటను మార్చేసి ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్ల్లో అతడు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ అతని ఇంపాక్ట్ ఆటపై బలంగా ప్రభావం చూపించేది. అందుకే వైభవ్ను ఆరంభంలోనే ఔట్ చేయాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే సీజన్లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్లోనూ వైభవ్ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీపక్ చాహన్ ఈసారి పక్కా ప్రణాళికతో వైభవ్ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అందుకే పట్టరాని సంతోషంతో వినూత్న రీతిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు. 2025 సీజన్లోనూ వైభవ్ సూర్యవంశీ మంచి ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, ఈ సీజన్లో అతడి బలహీనతలు బయటపడతాయని అన్ని జట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్ ఆద్యంతం విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. pic.twitter.com/YXigIYta2M— crictalk (@crictalk7) May 24, 2026చదవండి: వెల్ డన్ అర్జున్.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్ -
కీలక మ్యాచ్లో తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 24) మధ్యాహ్నం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్పై ఈ మ్యాచ్తో దాదాపుగా క్లారిటీ వస్తుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఓడిందా ఇంటిముఖం పడుతుంది.ఇలాంటి కీలక మ్యాచ్లో రాజస్థాన్ టాస్ దగ్గరే సగం మ్యాచ్ కోల్పోయింది. టాస్ ఓడిన ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రత్యర్ది కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగాడు. బ్యాటింగ్కు వచ్చీ రాగానే రాజస్థాన్కు ఒకే స్కోర్ వద్ద రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17 బంతుల్లో 27; ఫోర్, 3 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (6 బంతుల్లో 4) నాలుగు బంతుల వ్యవధిలో 33 పరుగుల టీమ్ స్కోర్ వద్ద ఔటయ్యారు.ఈ పరిణామంతో రాజస్థాన్ ఢీలా పడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఫామ్లో ఉన్న ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో ఆ జట్టు డిఫెన్స్లో పడింది. ఈ మ్యాచ్లో వైభవ్పై రాజస్థాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో ప్రారంభం నుంచి దుమ్మురేపిన వైభవ్ కీలక మ్యాచ్లో చేతులెత్తేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైభవ్ ఈ మ్యాచ్కు ముందు 13 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 577 పరుగులు చేశాడు. ఇందులో 50 ఫోర్లు, 53 సిక్సర్లు సహా సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్, జైస్వాల్ వికెట్లు కోల్పోయిన మరికొద్ది సేపటికే రాజస్థాన్కు మరో షాక్ తగిలింది. 54 పరుగుల వద్ద కెప్టెన్ రియాన్ పరాగ్ (14) కూడా ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 60-3గా ఉంది. ధృవ్ జురెల్ (11), దసున్ షనక (2) క్రీజ్లో ఉన్నారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్, దీపక్ చాహర్, ఘజన్ఫర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ రాజస్థాన్కు ప్రాణసంకటమే అయినా ముంబైకి మాత్రం సాధారణ మ్యాచ్గా ఉంది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ముంబైతో పాటు లక్నో, సీఎస్కే, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్తో పాటు పంజాబ్, కేకేఆర్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. అప్పుడు రేసులో పంజాబ్, కేకేఆర్ మిగిలి ఉంటాయి. రాత్రి ఢిల్లీతో జరిగే మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే, పంజాబ్తో పాటు 15 పాయింట్లు కలిగి ఉంటుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్ కలిగిన జట్టు ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్దడపడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ఆర్సీబీ-గుజరాత్ క్వాలిఫయర్లో పోటీపడతాయి. -
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున, వరల్డ్కప్-2025లో సత్తా చాటాడు.గాలివాటం కాదుప్రపంచకప్ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్.. భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.భారత్-‘ఎ’ జట్టులో చోటుఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.రోహిత్కు గండంఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ను ఆడిస్తూ.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు ఇషాన్ ఎంపికయ్యాడు.జైసూ ఎదురుచూపులుఇక రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి.. ఈ సిరీస్లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.శ్రీలంకలో భారత్-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో వైభవ్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ..ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు‘‘వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’ -
టెన్షన్ వద్దు.. నేనున్నాగా.. కోచ్ కే ధైర్యం చెప్పిన బుడ్డోడు
-
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్గా మారింది. బీహార్కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్లాగే బీహార్కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్లోని సమస్తిపూర్కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్గంజ్లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ వైస్కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు
-
లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!
రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్లో చేరనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్తో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను సంజీవ్ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకోవడం విశేషం. మాటల సందర్భంలో లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు సంజీవ్ గోయెంకా అడిగినట్లు తెలుస్తోంది. అయితే కళ్లు చెదిరే మొత్తాన్ని వైభవ్కు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభవ్, ఆ తర్వాత ఆయనతో చాలాసేపు ముచ్చటించాడు. లక్నో జట్టులోకి వస్తాడా? రాడా అన్నది పక్కనబెడితే, వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అతడి టెక్నిక్, బ్యాటింగ్ రహస్యం గురించి చర్చించి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు ఆయన భారీ ఆఫర్ కూడా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఏడాది యాక్షన్ పూల్లో బరిలోకి దిగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీని తక్కువ ధరకే సొంతం చేసుకున్న రాజస్తాన్ రాయల్స్ అతడిని విడుదల చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అవసరమైతే ఎక్కువ అమౌంట్ను కోట్ చేసి వైభవ్ను తమ జట్టుతోనే అట్టిపెట్టుకునే అవకాశముంది. ఐపీఎల్ మెగావేలానికి మరో రెండేళ్లు ఉండడంతో అప్పటివరకు వైభవ్ సూర్యవంశీని తమతోనే ఉంచుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ తనంతట తానుగా రాజస్తాన్ నుంచి బయటికి వచ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలనుకుంటే మాత్రం అతన్ని దక్కించుకోవడానికి ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం లేకపోలేదు. పట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఇవాళ ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలకు హాట్ కేక్లా మారిపోయాడు. అతడు వస్తానంటే ఎంత భారీ ధరకైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్లాడిన వైభవ్ 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో 221 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాన్ని బాటలు వేశాడు. ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ ఆ తర్వాత ఓటములతో ఢీలా పడింది. కానీ చివరి అంకంలో మళ్లీ ఫుంజుకున్న రాయల్స్ విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియన్స్తో జరగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాలని రాజస్తాన్ పట్టుదలతో ఉంది. ఇక టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభవ్కు ఇంకా సమయముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేసింది. మరి ఇండియా-ఏ తరఫున మ్యాచ్ల్లో వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.The world has seen your talent. The nation sees the future in you. That’s a lot of responsibility already on very young shoulders, very able ones at that. Preserve the innocence, keep honing your brilliance, and the world will be at your feet.Prayers, aashirwad, and love for… pic.twitter.com/LZS7pEe93s— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2026చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్ -
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం లక్నో సూపర్జెయింట్స్పై విజయం సాధించడం ద్వారా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఆదివారం (మే 24న) ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా 16 పాయింట్లతో రాజస్తాన్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టనుంది. మ్యాచ్ విజయంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీదే కీలకపాత్ర. 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్తాన్ను గెలుపు తీరాలకు దగ్గర చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ మిగతాపనిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాతి 26 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతులతో విచిత్రమైన ఫోజు ఇచ్చాడు. దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్ పంచుకున్నాడు. మురళీ కార్తిక్తో వైభవ్ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ఇక నేను న్యూస్ పేపర్లు పెద్దగా చదవను. దీనివల్ల నా గురించి పేపర్లలో ఏం రాస్తున్నారన్నది తెలియదు. అయితే నా కెరీర్కు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా సుదీర్ఘమైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవలం ఆటపైనే తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో స్లోగా ఆడడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు.'మా జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను డగౌట్లో కూర్చున్నా. ఆ సమయంలో వికెట్ బాగుందనిపిచ్చింది. అయితే ఆదిలోనే తొందరపడితే మొదటికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ వేగంగా ఆడడంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ జైస్వాల్ ఔటయ్యేటప్పటికీ పిచ్పై పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగించాను. అయితే సెంచరీ మిస్ అవ్వడంపై కాస్త నిరాశకు లోనైనప్పటికీ జట్టును గెలిపించడం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్కు మరింత చేరువయ్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్పైనే ఉంది. ఆ మ్యాచ్లోనూ గెలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు.An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు! -
చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన అతడు.. ఈ సీజన్లో తన పరుగుల సంఖ్యను 579కి పెంచుకున్నాడు. తద్వారా ప్రపంచంలో ఏ టీ20 టోర్నీలోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. పంత్ 2018 ఎడిషన్లో 20 ఏళ్ల వయసులో (ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున) ఈ ఫీట్ను అందుకున్నాడు.ఈ మ్యాచ్లో వైభవ్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. ఇందులో మొదటిది ఈ సీజన్లో ఇప్పటివరకు 236.33 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన అతడు.. ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రయిక్రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 2019లో 204.8 స్ట్రయిక్రేట్తో ఈ ఫీట్ను సాధించాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా 200కు పైగా స్ట్రయిక్రేట్తో (202) పరుగులు చేశాడు. సిక్సర్ల ఫిఫ్టిఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. తద్వారా ఓ సింగిల్ సీజన్లో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓ సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (59) టాప్ ప్లేస్లో ఉన్నాడు.ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఈ సీజన్లో అతడి ‘స్లోయెస్ట్’ ఫిఫ్టీ కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్ విధ్వంసం ధాటికి లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు చేసుకుంది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. -
వైభవ్ ఊచకోత.. టాప్ 4లోకి రాజస్థాన్..
-
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు! -
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026 -
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
రాజస్తాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అఫ్గానిస్తాన్తో సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలను అగార్కర్ మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్లాట్కు వైభవ్ సూర్యవంశీ పేరును ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని ఒక విలేకరి ప్రశ్న సంధించాడు. దీనిపై అగార్కర్ ఆసక్తికరంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్లో సంచలన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. కానీ ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. ‘వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకముందే టీమిండియాలోకి వచ్చిన జైస్వాల్ను మనం మర్చిపోకూడదు. వైభవ్ అద్భుతంగా ఆడు తున్నప్పటికీ, అతడి కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇప్పటికే వైభవ్ ‘ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకు కూడా ఆడే అవకాశముంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇండియా-ఏ తరఫున వైభవ్ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ తరఫున ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ క్రీజులోకి అడుగుపెట్టడమే ఆలస్యం..ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అగార్కర్ టీమిండియాలో వైభవ్ ఎంపికకు ఇంకా సమయం ఉందని కుండబద్దలు కొట్టాడు.చదవండి: అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన -
వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.బౌండరీలు బాదుతూ స్టార్క్ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.ఈ ఏడాది సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో అభిషేక్ 42 సిక్సర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్తో అభిషేక్ను సూర్యవంశీ దాటేశాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 486 పరుగులు చేశాడు.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే:వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026) అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024) శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025) విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024) సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025) -
వచ్చే నెలలోనే టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనికి భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేరారు. ఐపీఎల్-2026 తర్వాత ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని శాస్త్రి సూచించాడు. కాగా 15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 15 ఏళ్ల సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.56 స్ట్రైక్ రేట్తో 440 పరుగులు చేశాడు. ఈ బీహార్ చిచ్చర పిడుగు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. దీంతో వైభవ్ సీనియర్ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.వైభవ్ సూర్యవంశీ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయి. ఇది కచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి, వీలైనంత త్వరగా ప్రధాన జట్టులో భాగం చేయాలనుకుంటే అందుకు అత్యంత అనువైనది టీ20 ఫార్మాటే.వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అతడికి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు ప్రపంచ క్రికెట్లోని ఎన్నో జట్లలోకి నేరుగా వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు సంపాదించగలడు. యువతకు ఉండే ఆ ఉత్సాహం, తెగింపు అతడి బ్యాటింగ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.చాలామంది అతడికి 15 ఏళ్ళా? 16 ఏళ్ళా? 14 ఏళ్ళా?’ అని అడుగుతున్నాను. అది నాకు అనవసరం. తనకంటే రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ వయసున్న జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. వయసుతో అతడికి పనిలేదు. భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం వైభవ్ను భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది" అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జూన్లో శ్రీలంకలో జరగబోయే త్రైపాక్షిక సిరీస్ కోసం 'ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలఖారులో భారత సీనియర్ జట్టు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు


