Vaibhav Suryavanshi
-
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది.ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్లు (Multi Day Matches) జరుగుతాయి.కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటుఇక ఇంగ్లండ్ టూర్కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్-2025లో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్, వైభవ్ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్లు ఆడి 252 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్ఫోర్డ్.చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా -
Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ నిష్క్రమించి ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడి ఆగమనం మాత్రం అద్వితీయంగా మలిచింది ఆ ఫ్రాంచైజీ! 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం రాజస్తాన్కు కోచింగ్ ఇవ్వడం... ముఖ్యంగా కుర్రాళ్లను సానబెట్టడంతో దిట్టయిన ద్రవిడ్ సూచనలు, హెచ్చరికలు వైభవ్పై మంచి ప్రభావమే చూపాయి. బ్యాటింగ్పైనే ధ్యాస పెట్టమని, ఎప్పుడైనా సరే చురుకుదనంతో అందుబాటులో ఉండాలనే హెచ్చరికలు తనను ఆటపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశాయని స్వయంగా వైభవ్ చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో తన ఫోన్కు ఏకంగా 500 పైచిలుకు మిస్స్డ్ కాల్స్ వచ్చాయని చెప్పాడు. ద్రవిడ్ సూచనలతో ఆటపై ఫోకస్ చేసేందుకు ఫోన్ను స్విచ్ఛాఫ్ చేయగా సెంచరీ తర్వాత ప్రశంసించేందుకు అన్ని కాల్స్ వచ్చినట్లు వైభవ్ చెప్పాడు. ‘మూణ్నాలుగు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం వచ్చింది. అదేపనిగా ప్రాక్టీస్లో నా బలహీనతల్ని అధిగమించడం వల్లే మ్యాచ్ల్లో ఆడటం సులువైంది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఎలాగో నేర్చుకున్నాను. జట్టు విజయానికి అవసరమైన బ్యాటింగ్ శైలీని అలవర్చుకున్నా. నా బలమెంటో నాకు తెలుసు. జట్టుకేం కావాలనేది అప్పటి పరిస్థితులకు తెలుసు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాణించాలి’ అని రాయల్స్ హెడ్కోచ్ ద్రవిడ్తో పాల్గొన్న వీడియోలో వైభవ్ చెప్పాడు. ఈ వీడియోను ఐపీఎల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీనేజ్ సంచలనాన్ని అభినందించిన ద్రవిడ్ అసలైన సవాళ్లు ముందున్నాయని అతనికి గుర్తు చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్లాడిన సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. 206.56 స్ట్రయిక్ రేట్తో 36 సగటును నమోదు చేశాడు. -
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్తో మ్యాచ్లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్గా ఇప్పటికి ఆరు మ్యాచ్లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్లో డకౌట్ అయిన వైభవ్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఏడు మ్యాచ్లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్-2025లో తమ ఆఖరి మ్యాచ్లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)👉ఆయుశ్ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉రియాన్ పరాగ్- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉సర్ఫరాజ్ ఖాన్- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0)👉అభిషేక్ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెటర్కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఇన్నింగ్స్ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
వైభవ్ వీర విహారం.. సీఎస్కేపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 57) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించాయి. -
ఆ యంగ్ క్రికెటర్కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా
ఐపీఎల్-2025లో ఆదివారం(మే 18) రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.అంతేకాకుండా 14 ఏళ్ల చిన్నారికి హాగ్ ఇవ్వడం ఏంటని కొన్ని వెబ్ సైట్లు కూడా కథనాలు ప్రచరించాయి. తాజాగా ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది."ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆఖరి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ఎక్స్లో ఆమె రాసుకొచ్చింది.కాగా అసలు వీడియోలో మాత్రం ప్రీతి జింటా వైభవ్తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడినట్లు ఉంది. కొంతమంది ఏఐ సాయంతో ప్రీతీ.. వైభవ్ ను కౌగిలించుకుంటున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖారారు చేసుకుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్This is a morphed image and fake news. Am so surprised now news channels are also using morphed images and featuring them as news items !— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025 -
IPL 2025: ధనాధన్గా దూసుకొచ్చారు
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన బిహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్క్యాప్డ్ ఓపెనర్లపై కథనం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్లు జరిగాయి. మరో 12 లీగ్ మ్యాచ్లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో స్టార్ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్ రాయల్స్), ఆయుశ్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), అభిషేక్ పొరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్లో అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు) ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది. ఆహా... ఆయుశ్ ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్... బెంగళూరుతో మ్యాచ్లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే. మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 163 94 181.11అభిషేక్ అదుర్స్ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్ కీపర్... కేఎల్ రాహుల్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్గా కొనసాగుతున్నాడు. పేస్తో పాటు స్పిన్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్ నైపుణ్యం అతడిని క్లాస్ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్లో భళా అనిపించుకుంటున్న పొరెల్... స్ట్రయిక్ రొటేషన్ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది. మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 265 51 149.71వైభవ్ జ్వాలఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడో మ్యాచ్లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్ ఎడంచేతి వాటం ఓపెనర్... గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్లతో చెలరేగిపోయాడు. రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా వైభవ్క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 155 101 209.45ఫటాఫట్.. ప్రభ్సిమ్రన్ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్సిమ్రన్ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా సజావుగా సాగుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్సిమ్రన్ సింగ్... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్... స్లో పిచ్పై కోల్కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 487 91 170.87ప్రియాన్ష్ ‘స్పెషల్ టాలెంట్’ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో ‘స్పెషల్ టాలెంట్’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్పూర్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.బ్యాటింగ్కు అంతగా అనుకూలంగా లేని పిచ్పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతోంది.మ్యాచ్లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 417 103 194.85 -
సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!
ఐపీఎల్-2025 (IPL 2025)లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)తో పాటు వెలుగులోకి వచ్చిన మరో యువ సంచలనం ఆయుశ్ మాత్రే (Ayush Mhatre). వైభవ్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగితే.. ఆయుశ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నారు.అయితే, ఈ ఇద్దరూ ఆయా జట్ల కెప్టెన్లు గాయం కారణంగా దూరం కావడంతో తుదిజట్టులోకి రావడం సహా ఇద్దరూ ఓపెనర్లే కావడం విశేషం. వైభవ్ రాజస్తాన్ సారథి సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తే.. ఆయుశ్ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు బదులు బ్యాట్ ఝులిపిస్తున్నాడు.ఇద్దరూ ఇ ద్దరే..ఇక వైభవ్ ఇటీవల గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా అద్భుత శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. భారత్ తరఫున ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే సైతం వైభవ్ మాదిరే అరంగేట్ర మ్యాచ్లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ వంటి పటిష్ట జట్టుపై 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మాత్రం ఆయుశ్ దుమ్ములేపాడు.ఆర్సీబీ విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయుశ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ 17 ఏళ్ల టీనేజర్.ఇక ఈ మ్యాచ్లో చెన్నై ఆర్సీబీ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఆయుశ్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశాడని అతడి తండ్రి యోగేశ్ మాత్రే తెలిపాడు. అదే విధంగా ఆయుశ్ను వైభవ్తో పోల్చుకోవద్దని తాను సలహా ఇచ్చినట్లు వెల్లడించాడు.సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!ఈ మేరకు మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్.. నువ్వూ వేర్వేరు రకమైన బ్యాటర్లు అని ఆయుశ్కు చెప్పాను. ఎవరైనా నిన్ను వైభవ్తో పోలిస్తే పట్టించుకోవద్దనన్నాను.అంతేకాదు వైభవ్ను అనుకరించకూడదని కూడా చెప్పాను. అతడిలా సెంచరీ చేయాలనే తొందరపాటు కూడా వద్దన్నాను. ఎందుకంటే ఆయుశ్ కూడా ఇంకా చిన్నవాడే. ఇప్పుడే తనపై పోలికలతో భారం పడి.. వాడు ఒత్తిడికి లోనుకావడం నాకు ఇష్టం లేదు. తను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.ధోని చెప్పిందిదేఇక ఆర్సీబీపై ఆయుశ్ ఇన్నింగ్స్ తర్వాత దిగ్గజ క్రికెటర్ ధోని. ‘బాగా ఆడావు చాంపియన్’ అని ప్రశంసించారు. నిజానికి జట్టును గెలిపించలేకపోయానని ఆయుశ్ బాధపడ్డాడు. అయితే, ధోని వచ్చి వెన్నుతట్టిన తర్వాత వాడు ఎంతగానో సంబర పడిపోయాడు.‘బాగా బ్యాటింగ్ చేశావు.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆడాలి’ అని ధోని చెప్పారంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ధోని చెప్పినవి రెండు మాటలే అయినా ఆయన ప్రభావం మాత్రం ఎంతగానో ఉంటుంది. ఆయుశ్కు ఇష్టమైన, తను ఆరాధించే క్రికెటర్ నుంచి మెచ్చుకోలు మర్చిపోలేనిది’’ అని ఆయుశ్ తండ్రి యోగేశ్ మాత్రే చెప్పుకొచ్చాడు.చదవండి: కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు.. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
‘కళ్లుచెదిరే ప్రదర్శన.. వైభవ్ ఆట ఆకట్టుకుంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్తో అందరికంటా పడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు. కళ్లుచెదిరే ప్రదర్శనఈ సందర్భంగా క్రీడాకారుల కష్టాన్ని కొనియాడిన ఆయన వైభవ్ విధ్వంసక శతకాన్ని ఆ వీడియో సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘బిహార్ ముద్దుబిడ్డ వైభవ్ సూర్యవంశీ. అతను ఆడిన మ్యాచ్ను చూశాను. 14 ఏళ్ల కౌమార ప్రాయంలోనే కళ్లుచెదిరే ప్రదర్శన కనబరిచాడు.ఇన్నాళ్లు ఏ భారత బ్యాటర్కు సాధ్యంకానీ రికార్డును సాధించిన ఘనత వైభవ్కే దక్కుతుంది. ఇంతచిన్న వయసులో అంతటి ఇన్నింగ్స్ ఆడటం మాటలు కాదు. దీనికోసం అతనెంతో కష్టపడ్డాడు. ఆటకోసం తపించాడు. అంకితభావంతో ముందడుగు వేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అని ఆ సందేశంలో ప్రశంసల మోదీ వర్షం కురిపించారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంతో తమ ప్రభుత్వం క్రీడాకారుల సాఫల్యం కోసం కృషిచేస్తోందని చెప్పారు. అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలిమన భారత అథ్లెట్లు క్రికెట్, హాకీలే కాదు కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలని ప్రధాని సూచించారు. గ్రామీణ క్రీడ ఖో–ఖోతో పాటు గట్కా, మల్లకంభ, యోగాసన తదితర కొత్త క్రీడల్ని ‘ఖేలో–ఇండియా’లో భాగం చేశామని చెప్పారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో వైభవ్ను రాజస్తాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.వేగవంతమైన సెంచరీఈ టీనేజ్ కుర్రాడు వైభవ్ గుజరాత్ టైటాన్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విధ్వంసరచన చేశాడు. కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. 30 బంతుల్లో గేల్ చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్పై సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత రెండు మ్యాచ్లలో ఈ కుర్రాడు విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో డకౌట్ అయిన వైభవ్.. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, వైభవ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. తప్పక తన పొరపాట్లను సరిచేసుకుంటాడని పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్ -
KKR vs RR: ఒక్క పరుగు తేడాతో ఓటమి
IPL 2025 KKR vs RR- Eden Gardens, Kolkata Updates: ఐపీఎల్-2025లో 53వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్- రాజస్తాన్ రాయల్స్ తలపడ్డాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసి.. రాజస్తాన్కు 207 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో కేకేఆర్ పైచేయి సాధించింది. ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. రాయల్స్ బ్యాటర్లలో కెప్టెన్ రియాన్ పరాగ్ 95 పరుగులతో చెలరేగగా.. మిగతా వాళ్లలో యశస్వి జైస్వాల్ (34), శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు కూల్చగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ దక్కించుకున్నాడు.దంచికొట్టిన రసెల్, రింకూ.. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్ సునిల్ నరైన్ (11) మినహా మిగతా వాళ్లంతా మెరుగ్గా ఆడారు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 35), కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించగా.. ఆఖర్లో ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ మెరుపులు మెరిపించారు.రసెల్ 25 బంతుల్లో 57, రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు. కేకేఆర్ స్కోరు: 206/4 (20)రాజస్తాన్ స్కోరు: 205/8 (20)సెంచరీకి ఐదు పరుగుల దూరంలో17.3: హర్షిత్ రాణా బౌలింగ్లో రియాన్ పరాగ్ వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.15.5: హర్షిత్ రాణా బౌలింగ్లో సునిల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగిన హెట్మెయిర్ (29)గేరు మార్చిన రాజస్తాన్15 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 155/5 రియాన్ పరాగ్ 38 బంతుల్లో 86 పరుగులు, హెట్మెయిర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 82-5పరాగ్ 34, హెట్మెయిర్ 8 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్7.5: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ హసరంగ బౌల్డ్ అయి.. జురెల్ మాదిరి సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. స్కోరు: 71/5 (7.5) .హెట్మెయిర్ క్రీజులోకి రాగా.. రియాన్ పరాగ్ 31 రన్స్తో ఉన్నాడు.7.3: నాలుగో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జురెల్ బౌల్డ్. డకౌట్గా పెవిలియన్ చేరిన వికెట్ కీపర్ బ్యాటర్. స్కోరు: 71/4 (7.3). హసరంగ క్రీజులోకి వచ్చాడు.6.6: మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్జైస్వాల్ (34) రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్లో జైసూ.. రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 66/3 (7). పరాగ్ 26 పరుగులతో క్రీజులో ఉండగా.. జైసూ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చాడు.పవర్ ప్లేలో రాజస్తాన్ స్కోరెంతంటే?ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా రాజస్తాన్ తిరిగి గాడిలో పడుతోంది. ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. జైస్వాల్ 18 బంతుల్లో 32, పరాగ్ 11 బంతుల్లో 22 పరుగులు చేశారు.1.5: రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మొయిన్ అలీ బౌలింగ్ కునాల్ సింగ్ రాథోడ్ (0) రసెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ క్రీజులోకి రాగా... జైస్వాల్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 9-2. పాపం వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ విఫలంకేకేఆర్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు. వైభవ్ అరోరా బౌలింగ్లో రహానేకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. జైస్వాల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. కునాల్ సింగ్ రాథోడ్ క్రీజులోకి వచ్చాడు. కాగా వైభవ్ గత మ్యాచ్లో డకౌట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు మాత్రం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రాజస్తాన్ స్కోరు: 5/1 (1).18.4: ఈ సీజన్లో రసెల్ తొలి అర్ధ శతకంజోఫ్రా ఆర్చర్బౌలింగ్లో సిక్సర బాది యాభై పరుగుల మార్కు అందుకున్న రసెల్.నాలుగో వికెట్ డౌన్18.1: జోరు మీదున్న రఘువన్షీ అవుట్రఘువన్షీ రూపంలో కేకేఆర్నాలుగో వికెట్ కోల్పోయింది. 30 బంతుల్లో 44 పరుగుల వద్ద ఉన్న అతడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అశోక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రసెల్ 20 బంతుల్లో 45 పరుగులతో ఉండగా.. రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. కేకేఆర్ స్కోరు: 173/4 (18.3) .15 ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 121/3రసెల్ 2, రఘువన్షీ 36 పరుగులతో ఆడుతున్నారు.మూడో వికెట్ డౌన్12.4: జోరు మీదున్న కేకేఆర్ కెప్టెన్ రహానే (30)ను రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ చేశాడు. పరాగ్ బౌలింగ్లో రహానే ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 111/3 (13). ఆండ్రీ రసెల్ క్రీజులోకి రాగా.. రఘువన్షీ 28 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో కేకేఆర్ స్కోరు: 86/2 (10) రహానే 24, రఘువన్షీ 11 పరుగులతో ఆడుతున్నారు.7.3: రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్మహీశ్ తీక్షణ బౌలింగ్లో ఓపెనర్ గుర్బాజ్ (35) హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. రహానే 20 పరుగులతో ఆడుతుండగా.. అంగ్క్రిష్ రఘువన్షీ క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి స్కోరు:72/2 (8).పవర్ ప్లేలో కేకేఆర్ స్కోరుగుర్బాజ్, రహానే నిలకడగా ఆడుతున్న క్రమంలో పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి గుర్బాజ్ 24, రహానే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్1.6: యుధ్వీర్ బౌలింగ్లో సునిల్ నరైన్ (11) బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అజింక్య రహానే క్రీజులోకి రాగా. రహ్మనుల్లా గుర్బాజ్ ఒక్క పరుగుతో ఉన్నాడు. కేకేఆర్ స్కోరు: 13-1 (2).టాస్ గెలిచిన కేకేఆర్రాజస్తాన్ రాయల్స్తో టాస్ గెలిచిన కోల్కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. వికెట్ కాస్త పొడిగా ఉన్నట్లు కనిపిస్తోందన్నాడు. ఏదేమైనా మెరుగైన స్కోరు సాధించి.. దానిని తప్పక కాపాడుకుంటామని పేర్కొన్నాడు. మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చినట్లు రహానే తెలిపాడు.మూడు మార్పులుఇక రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. నితీశ్ రాణా గాయపడ్డాడని.. అందుకే ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని తెలిపాడు. ఇక కుమార్ కార్తికేయ స్థానంలో హసరంగ వచ్చాడని.. అదే విధొంగా కునాల్ రాథోడ్, యుధ్వీర్లను ఆడిస్తున్నట్లు పరాగ్ చెప్పాడు.తుదిజట్లుకోల్కతారహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, రోవ్మన్ పావెల్, లవ్నిత్ సిసోడియారాజస్తాన్యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వాల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్పాండే, క్వెనా మఫాకా, అశోక్ శర్మ. -
IPL 2025: వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన కామెంట్స్
ఐపీఎల్లో తన మూడో ఇన్నింగ్స్లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు. రాయల్స్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్ అభిప్రాయపడ్డాడు. రాయల్స్ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.వైభవ్, నితీశ్పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్ మేనేజ్మెంట్ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్లో ఆర్చర్ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు. రాయల్స్ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్ బౌలర్లలో (తుషార్ దేశ్పాండే, యుద్ద్వీర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్ దేశ్పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు. గత సీజన్లో తమ పంచన ఉన్న బౌల్ట్, చహల్, ఆవేశ్ ఖాన్, అశ్విన్ను వదిలేసి రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్ ఎంపికలను తప్పుబట్టాడు.కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్లో బట్లర్, బౌలింగ్లో చహల్, బౌల్ట్ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ శాంసన్ గాయంతో సైడ్ అయిపోగా.. జురెల్, హెట్మైర్ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్కే పరిమితమయ్యాడు. పరాగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్ను నాలుగు మ్యాచ్లకే డిసైడ్ చేయలేని పరిస్థితి.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాయల్స్ మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది. -
వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ టైటాన్స్తో గత మ్యాచ్లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్ (RR vs MI)తో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ పెవిలియన్ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు ఇలా ఆరంభంలోనే షాక్ తగిలింది.ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్ మీడియా మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.వైభవ్ను ఓదార్చిన రోహిత్మరోవైపు.. వైభవ్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. వైభవ్ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.తప్పక పాఠాలు నేర్చుకుంటాడుఈ విషయం గురించి కామెంటేటర్ రవిశాస్త్రి లైవ్లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్లోనే ఇలా డకౌట్ అయ్యాడు. క్రికెట్ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.కాగా ఐపీఎల్-2025 ద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.ఐపీఎల్-2025: రాజస్తాన్ వర్సెస్ ముంబైవేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్ముంబై స్కోరు: 217/2 (20)రాజస్తాన్ స్కోరు: 117 (16.1)ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్పై ముంబై గెలుపు.చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ 6️⃣ on the trot & now they’re on 🔝A massive 1⃣0⃣0⃣-run win for #MI to sit right where they want to 👊Scorecard ▶ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI | @mipaltan pic.twitter.com/20KEle7S6n— IndianPremierLeague (@IPL) May 1, 2025Deepak Chahar saved lacs of children from getting embarassed in front of their parents tonight pic.twitter.com/fOiMFV4XzZ— Sagar (@sagarcasm) May 1, 2025Rohit Sharma appreciating Vaibhav Suryavanshi after the match win last night.❤️The true leader @ImRo45 🐐 pic.twitter.com/t0iFGnBLOG— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 2, 2025 -
IPL 2025: వైభవ్ ఒక్క మ్యాచ్లో చేస్తే, సీఎస్కేకు సీజన్ మొత్తం పట్టింది..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) రాత్రి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ను రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్కు ముందు క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం 14 ఏళ్ల రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. గత మ్యాచ్లో వైభవ్ గుజరాత్పై 35 బంతుల్లో శతక్కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ విధ్వంసకర ప్రదర్శన కారణంగా నేటి మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి. వైభవ్.. ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ను ఎలా ఎదుర్కోగలడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో అందరి కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సీఎస్కేను వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో పోటీ పెడుతున్నారు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆరు సిక్సర్లు బాదగా.. సీఎస్కే ఈ సీజన్ మొత్తంలో పవర్ ప్లేల్లో ఆరే సిక్సర్లు కొట్టింది.ఈ లెక్క చూస్తే ప్రస్తుత సీజన్లో సీఎస్కే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఆ జట్టు టాపార్డర్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ల కంటే నిదానంగా ఆడుతున్నారు. పోనీ వికెట్లైనా కాపాడుకున్నారా అంటే అదీ లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 50కి మించి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు నమోదు చేసింది.తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి జోష్లో ఉన్నట్లు కనిపించిన రచిన్ రవీంద్ర ఆ తర్వాత తేలిపోయాడు. దారుణమైన విషయమేమిటంటే, ఇతర ఆటగళ్లతో పోలిస్తే రచిన్ రవీంద్రనే కాస్త బెటర్. రచిన్ రెండు మూడు మ్యాచ్లకు ఒకసారైనా 20, 30 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు అదీ చేయలేక చేతులెత్తేశారు. నిన్న మొన్న వచ్చిన ఆయుశ్ మాత్రే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సామ్ కర్రన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటర్ల నుంచి ఇది తప్ప మంచి స్కోరే లేదు. -
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్తో 151 పరుగులు చేశాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్
-
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. పద్నాలుగేళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చర పిడుగును చూసి దిగ్గజ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన తీరు తనకు ముచ్చటగొలిపిందని భారత లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వైభవ్ను కొనియాడాడు.అసలు పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి ఆటను అస్సలు ఊహించలేమని.. వైభవ్ మాత్రం బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అబ్బురపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాహుల్ ద్రవిడ్, మైకేల్ హస్సీ వంటి వారంతా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు.అయితే, టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఇప్పడే వైభవ్ సూర్యవంశీపై ఓ అంచనాకు రాకూడదని.. భవిష్యత్తులో అతడు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని పేర్కొన్నాడు. వైఫల్యాలు, ఒత్తిడిని అధిగమించే తీరుపైనే అతడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో భాగంగా రవిశాస్త్రి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో మాట్లాడుతూ.. వైభవ్ అరంగేట్రంలో ఆడిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతడికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో అతడు కొట్టిన మొదటి షాట్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది.అయితే, అతడు ఇంకా చిన్న పిల్లాడే. ఈ వయసులో వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి. ముఖ్యంగా తొలి బంతినే సిక్సర్గా మలిచిన వైభవ్ పట్ల బౌలర్లు ఇకపై కనికరం చూపబోరు.అతడి వయసు 14 లేదంటే 12, 20 ఏళ్లా అని చూడరు. అతడి ఆటకు తగ్గట్లుగా సరైన వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. అలాంటి వారిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అప్పుడే అతడి ఆట తీరుపై సరైన అవగాహన, అంచనాకు రాగలము’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్కు ఈ సందర్భంగా సలహా ఇచ్చాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ 1.10 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా అతడికి రాజస్తాన్ ఓపెనర్గా అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి రికార్డులకెక్కాడు.ఆడిన తొలి మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చివరగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముప్పై ఐదు బంతుల్లోనే శతక్కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడాలంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు. In case you missed it… 🍿🔥pic.twitter.com/rOXwTuxgyX— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2025 -
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా తెలియని వ్యక్తి నుంచి మొదలుకొని... ఆటలో తలపండిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! ఊరు, వాడా, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు! ‘ఏం కొట్టాడ్రా బాబు’ అని సాధారణ అభిమానులు కొనియాడుతుంటే... ఫ్లిక్, లాఫ్ట్, పుల్ అంటూ విశ్లేషకులు అతడి షాట్లను వర్ణిస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్తో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆ కుర్రాడే... బిహార్కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ స్థాయి క్రికెట్తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్లో అతడు బాదిన బాదుడు క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. అతని దూకుడుకు అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం స్కూలు కుర్రాళ్లలా కనిపించారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్... మూడో ఇన్నింగ్స్లోనే రికార్డు సెంచరీ... మరో సచిన్ టెండూల్కర్ దొరికాడు అనే ప్రశంసలతో ఆ పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంత ఎత్తులో ఉన్నాడు! ఇదంతా నాణేనికి ఒకవైపే! మన దేశంలో ఇలా ఒక్క ఇన్నింగ్స్తో సంచలనాలు రేకెత్తించిన వాళ్లు కోకొల్లలు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ వేదికలపై తళుక్కున మెరిసి... అంతే త్వరగా కనుమరుగై పోయిన వారికి కొదవే లేదు. అంచనాలకు మించి వచ్చే పేరు ప్రతిష్టలు... అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం... అప్పనంగా వచ్చే ప్రచార ఆర్బాటం ఇలా ఆటగాళ్ల దృష్టి మరల్చేవి ఎన్నో. పిన్న వయసులోనే విశేష గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సొదిలోనే లేకుండా పోయిన వాళ్లు ఎందరో! సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోకే వస్తారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించగలం అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరూపిస్తే... ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరై కెరీర్ను నాశనం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఇలా ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ కాకుండా ఉండాలంటే నిరంతర సాధన ముఖ్యమని మాజీలు సూచిస్తున్నారు. –సాక్షి క్రీడావిభాగం వయసుకు మించిన పరిణతితో అతడు బంతిని బాదుతుంటే... యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది! బౌలర్తో సంబంధం లేకుండా అతడు విరుచుకుపడుతుంటే... అభిమాన గణం మైమరిచిపోయింది! ముఖంపై పసితనపు ఛాయలు కూడా పోని ఆ చిన్నోడు చిందేస్తుంటే... క్రీడా లోకం తన్మయత్వానికి లోనైంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జైపూర్లో జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా... ఓవరాల్గా టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు్కడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఇక టి20 లీగ్ల్లో రికార్డులు తిరగరాసే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరేసరి. ఇలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ వైభవ్ సాగించిన ఊచకోత మాటలకందనిది! క్లాస్, మాస్, ఊరమాస్ ఇలా అతడి ఇన్నింగ్స్ను వర్ణించడానికి విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అతడి బాదుడుకు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం హోరెత్తింది. డగౌట్లో కూర్చున్న ప్రతి ఆటగాడు ఊగిపోతుంటే... మ్యాచ్ చూస్తున్న అభిమానులు బ్యాటింగ్ చేసేది తామే అన్నంతగా లీనమై పోయి ఆ ‘బుడ్డోడి’ ప్రతిభకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్ చొరవతో... ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత బిహార్లోని సమస్తీపూర్లో జని్మంచిన వైభవ్... కఠోర సాధన, పట్టువదలని తత్వంతో అంచలెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సహచరుడి తప్పిదం వల్ల రనౌట్ అయి బెంచ్మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్ను చూసిన వీవీఎస్ లక్ష్మణ్... అతడిలో ఆత్మవిశ్వాసం నింపి రాహుల్ ద్రవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో వైభవ్ దశ తిరిగింది. ప్రతిభాన్వేషణ సమయంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమి... వైభవ్ షాట్ల ఎంపికకు ముగ్ధులయ్యారు. దీంతో వారు వైభవ్ను ద్రవిడ్కు పరిచయం చేయడంతో అతడి జీవితం మారిపోయింది. ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ వేలంలో రూ. 1 కోటీ 10 లక్షలకు వైభవ్ను కొనుగోలు చేసుకుంది. ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటుదేలిన వైభవ్... దాన్నే మైదానంలో చాటాడు. అప్పటికే భారత అండర్–19 జట్టుకు ఎంపికైన వైభవ్... గతేడాది జనవరిలోనే ముంబై జట్టుపై ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. నెట్స్లో తీవ్రంగా శ్రమించడం, కోచ్ చెప్పిన అంశాలను ఆచరణలో పెట్టడం. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం వంటి సానుకూల లక్షణాలు అతడిని మూడో మ్యాచ్లోనే సెంచరీ హీరోగా నిలిపాయి. పొలం అమ్ముకున్న తండ్రి.. వైభవ్ విజయం వెనక... తాను సాధించలేకపోయిన దాన్ని కుమారుడైనా అందుకోవాలని తపన పడ్డ ఓ మధ్యతరగతి తండ్రి ఆశయం ఉంది. కుమారుడికి మెరుగైన శిక్షణ అందించేందుకు ఉన్న కాస్త పొలం అమ్ముకున్న ఆ తండ్రి ఇప్పుడు అత్యంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడు. గతంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా... ఇప్పుడు ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. దీని వెనక రాయల్స్ యాజమాన్య ప్రోత్సాహం ఉందని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. ‘వైభవ్ మెరుపుల వెనక బిహార్ క్రికెట్ సంఘం చీఫ్ రాకేశ్ తివారీ, రాజస్తాన్ రాయల్స్ జట్టు కృషి ఎంతో ఉంది. ఇక రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గత మూడు, నాలుగు నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని సంజీవ్ అన్నాడు. అయితే ఈ మెరుపులు కేవలం ఒకటీ అరా మ్యాచ్లకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే... ఇదే సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరు, డబ్బు తలకెక్కనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతుడు లభించినట్లే! అమ్మ, నాన్న కృషి వల్లే... తొలి బంతికి సిక్స్ కొట్టడం నాకు పెద్ద విషయం కాదన్న వైభవ్... అమ్మానాన్న కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశవాళీల్లో తొలి బంతికి చాలాసార్లు సిక్స్ కొట్టా. మొదటి 10 బంతులు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాను. బంతి నా పరిధిలో ఉంటే దాన్ని బలంగా కొట్టాలనే చూస్తా. తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను లేను. నా కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. తెల్లవారుజామను 3 గంటలకే నిద్రలేచే మా అమ్మ... మళ్లీ నేను పడుకున్న తర్వాత ఏ 11 గంటలకో గానీ నిద్రపోదు. వారు అలా నా కోసం అన్నీ వదిలేసుకొని శ్రమించడం వల్లే నేను ఆటపై దృష్టి సారించగలిగా. నాన్న నా వెంట ఉండటం వల్లే మరింత స్వేచ్ఛగా ఆడుతున్నా. కష్టానికి ఫలితం ఉంటుందని రుజువైంది. వారి కష్టానికి ప్రతిఫలమే ఇది’ అని వైభవ్ పేర్కొన్నాడు. మరో ఒకటీ రెండేళ్లలో వైభవ్ భారత టి20 జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా ఆశాభాహం వ్యక్తం చేశాడు. ‘కోచ్గా వైభవ్ను చూస్తే గర్వంగా ఉంది. బిహార్లో ఆటలకు పెద్దగా ఆదరణ ఉండదు. అలాంటి చోట నుంచి వచ్చి క్రికెట్పై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వైభవ్ ఎందరికో స్ఫూర్తి’ అని మనీశ్ ఓఝా అన్నాడు. రూ. 10 లక్షల నజరానా ఐపీఎల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారీ నజరానా ప్రకటించారు. 14 ఏళ్ల వైభవ్కు రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ‘గతేడాది వైభవ్తో మాట్లాడా. అతడిలో అపార ప్రతిభ ఉంది. తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ఫోన్ ద్వారా అతడిని అభినందించా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవ్ సూర్యవంశీకి రూ. 10 లక్షల నజరానా అందిస్తాం. భవిష్యత్తులోనూ అతడు ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. వైభవ్ దేశం తరఫున కూడా రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం’ అని నితీశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడిలో భయం ఏ కోశాన కనిపించడం లేదు. బ్యాట్ వేగం, బంతిని అంచనా వేసే తీరు చాలా బాగున్నాయి. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది. –సచిన్ టెండూల్కర్14 ఏళ్ల వయసులో మీరేం చేశారో గుర్తు చేసుకొండి. ఈ కుర్రాడు మాత్రం అంతర్జాతీయ బౌలర్ల భరతం పట్టాడు. భయమన్నదే లేకుండా బౌలర్లకు నిద్రలేని రాత్రి మిగిల్చాడు. భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతున్న ఇలాంటి ప్లేయర్లను చూస్తే గర్వంగా ఉంది. –యువరాజ్ సింగ్ -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్-2025లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరపున సంచలనాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్కే తరపున అద్బుత ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్లతో అందరని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్కు సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అరంగేట్రం చేశాడు. ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్లో భారత సీనియర్ జట్టు కూడా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనుంది. -
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. సోమవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అద్బుత సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అత్యంత చిన్న వయస్సులో ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 38 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏడు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బిహార్కు చెందిన సూర్యవంశీపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వైభవ్కు బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు."ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. సూర్యవంశీ తన అద్బుత టాలెంట్తో భారత క్రికెట్కు భవిష్యత్తు ఆశాకిరణంగా నిలిచాడు. అతడి అంకితభావాన్ని, పట్టుదలను చూసి మేము గర్విస్తున్నాము.నేను 2024లో సూర్యవంశీ, అతడి తండ్రిని కలిశాను. ఐపీఎల్లో అతడి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఫోన్లో సూర్యవంశీతో మాట్లాడాను. వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేయనున్నాము. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తాడని ఆశిస్తున్నాను" అని నితీష్ కుమార్ ఎక్స్లో పేర్కొన్నారు.చదవండి: IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్ కోచ్ ఓఝాआई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX— Nitish Kumar (@NitishKumar) April 29, 2025 -
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు, ఇదెంత: వైభవ్ కోచ్ ఓఝా
14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్లో నమ్మశక్యంకాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్ టాలెంట్ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.వైభవ్ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్కు ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్లో నిర్వహించిన ఓ మ్యాచ్లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్ 90 మీటర్లపైనే ఉండింది. ఆ సమయంలోనే వైభవ్ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్ అద్భుతాలు చేయగలడని నమ్మాను.14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్తో అతను భారీ షాట్లు ఆడుతాడు. వైభవ్కు ఈ స్థాయి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్ కూడా ఓ కారణం. వైభవ్ టైమింగ్, టెక్నిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్ ఎక్కువగా ఫుల్ టాస్ బంతులకు షాట్లు ప్రాక్టీస్ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.కాగా, ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్లో వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా.. రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి. -
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్రైజర్స్ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్, ఒకరు రాజస్థాన్ ఆటగాడు.ఈ సీజన్లో తొలి సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేశాడు. సీజన్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఇషాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో ఇషాన్ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో రెండో సెంచరీని పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య చేశాడు. సీజన్ 22వ మ్యాచ్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ మూడంకెల స్కోర్ను సాధించాడు. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.ప్రియాంశ్ ఈ సెంచరీని కేవలం 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్ ఈ రికార్డును సన్రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్తో షేర్ చేసుకున్నాడు. ట్రవిస్ కూడా గత సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.ఈ సీజన్లో మూడో సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ చేశాడు. సీజన్ 27వ మ్యాచ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అభిషేక్ది ఏడో వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో నాలుగో సెంచరీని రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేశాడు. సీజన్ 47వ మ్యాచ్లో వైభవ్ గుజరాత్ టైటాన్స్పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతుల్లో) పేరిట ఉంది.వైభవ్ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్ అత్యంత పిన్న వయస్కుడు. -
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ఐపీఎల్లో రికార్డు సెంచరీతో చెలరేగిన 'సిక్సర పిడుగు' వైభవ్ సూర్యవంశీపై శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు అలా మాట్లాడి ఉండాల్సి కాదని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో టీనేజీ సంచలనం సూర్యవంశీ (14) సూపర్ సెంచరీతో రాజస్తాన్ రాయల్స్కు ఘన విజయం అందించాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మార్మోగిపోతోంది. ఈ రోజు ఆ 14 ఏళ్ల ఈ కుర్రాడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.మ్యాచ్ ముగిసిన తర్వాత శుబ్మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. సూర్యవంశీకి అదృష్టం కలిసి వచ్చిందన్నట్టుగా వ్యాఖ్యానించాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని కామెంట్ చేశాడు. "ఇది అతడి (అదృష్ట) రోజు. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అతడు తన రోజును పూర్తిగా ఉపయోగించుకున్నాడ"ని గిల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై అజయ్ జడేజా తనదైన శైలిలో స్పందించాడు. "14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎంతగా అంటే తాను నమ్మినదాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్నాడు. చేసి చూపించాడు. ఎవరో ఆటగాడు చెప్పినట్లుగా ఇది అతడి అదృష్ట దినం" అని కౌంటర్ ఇచ్చాడు.చిన్న వయసులోనే రికార్డు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీపై అజయ్ జడేజా (Ajay Jadeja) ప్రశంసలు కురిపించాడు. "క్రికెట్ ఆడే మనమందరం.. డ్రాయింగ్ రూమ్లలో లేదా స్నేహితులతో ఆడుతున్నప్పుడో ఒక నిర్దిష్ట మార్గంలో మన ఆట గురించి కలలు కన్నాం. మనం ఇష్టపడేది సాధించాలని 14 మరియు 15 సంవత్సరాల వయస్సులో మనమంతా స్వప్నించాం. కానీ సూర్యవంశీ తన కలను నిజం చేసుకోవాలని జీవించాడు. అదే అతడి శక్తి. ఇక అతడి ఆటను వంద సార్లు విశ్లేషిస్తార"ని జడేజా పేర్కొన్నాడు.వైభవ్ సూర్యవంశీ సక్సెస్లో రాజస్తాన్ రాయల్స్ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ (Vikram Rathour) కీలంగా వ్యహరించారని జడేజా వెల్లడించాడు. సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించారని ప్రశంసించాడు. కాగా, రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 1న జైపూర్లో ముంబై ఇండియన్స్తో ఆడుతుంది. మే 12న చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్ఆర్ తలపడనుంది. చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో ఎదిగిన వైభవ్ సూర్యవంశీ -
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్ సాధించిన రికార్డులు..ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్తో కలిసి)టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వైభవ్ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్ గెలుపులో వైభవ్తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్లోనే సాకారం చేసుకున్నాను. సీజన్ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. -
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. రాయల్స్ గెలుపులో వైభవ్లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో వైభవ్ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.నిన్నటి మ్యాచ్ తర్వాత అందరి లాగే రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్ బౌలర్లపై వైభవ్ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.గత మూడు మ్యాచ్ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్లు కోల్పోయాము. ఈ మ్యాచ్లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. ఐపీఎల్లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్లో ఎలాంటి వికెట్ లభిస్తుందో చూడాలి. -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్ను క్రికెటర్గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో ప్లేయర్గా, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్ల్లోషాన్ మార్ష్- 52రుతురాజ్ గైక్వాడ్- 57కేఎల్ రాహుల్- 60యశస్వి జైస్వాల్- 62మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. -
IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ జపమే నడుస్తుంది. క్రికెట్ దిగ్గజాలు సూర్యవంశీ సృష్టించిన బీభత్సాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మాజీ ఆల్రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్.. ఇలా చాలామంది భారత మాజీలు వైభవ్ను ఆకాశానికెత్తారు. సోషల్మీడియాలో అభిమానులు వైభవ్కు 'బేబీ బాస్'గా బిరుదు ఇచ్చారు.స్కూల్కు వెళ్లాల్సిన వయసులో (14 ఏళ్ల 32 రోజులు) వైభవ్ సృష్టించిన ఈ విధ్వంసకాండ పొట్టి క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ కుర్రాడిలో ఎదో మ్యాజిక్ ఉందని భావించి ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఆ ఇన్నింగ్స్లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు.- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా- ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)- ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా- ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (మురళీ విజయ్తో కలిసి)- టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా - ఐపీఎల్లో హాఫ్ సెంచరీ (17 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్లో ప్రదర్శనకు గానూ వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఇషాంత్ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వైభవ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పిండుకున్నాడు. అనుభవజ్ఞుడు, కోపిష్టి అయిన ఇషాంత్ 14 ఏళ్ల వైభవ్ షాట్లు ఆడుతుంటే నిస్సహాయస్థితిలో చూస్తుండిపోయాడు. వైభవ్ కరీమ్ జనత్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనూ శివతాండవం చేశాడు. ఆ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఏ బౌలర్నూ వదల్లేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 2 సిక్సలు, 2 ఫోర్లు సహా 21 పరుగులు.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్లో అద్భుతాలు చేస్తున్న ప్రసిద్ద్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ ఇలా ప్రతి ఒక్క బౌలర్ను ఊచకోత కోశాడు. రషీద్ ఖాన్ ఒక్కడే తప్పించుకున్నాడు.వైభవ్ సృష్టించిన విధ్వంసం ధాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం 15.5 ఓవర్లలోనే ఛేదించబడింది. ఐపీఎల్ చరిత్రలోనే 200 ప్లస్ టార్గెట్ ఇంత తక్కువ బంతుల్లో ఛేదించబడటం ఇదే మొదటిసారి. రాయల్స్ ఇన్నింగ్స్లో జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84), జోస్ బట్లర్ (26 బంతులోల 50 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. -
సెంచరీతో కుమ్మేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (ఫోటోలు)
-
IPL 2025: విధ్వంసంలో వైభవం
సచిన్ వేగాన్ని ఆరాధించాం. సెహ్వాగ్ దూకుడును చూశాం. రో‘హిట్స్’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్లో సెర్చ్ చేస్తారు. ‘లైక్’లు కొట్టే షాట్లను ఫోన్ కెమెరాల్లో బంధించారు. ‘షేర్’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్ స్క్రైబ్’ అయిపోయారు. ఐపీఎల్ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్: ఐపీఎల్ 2008లో పుట్టింది. లీగ్ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అతనొక సంచలనం. బ్యాటింగ్ మెరుపులకే వైభోగం. క్రికెట్ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్లకే ఫిక్స్ అయినట్లు... అతని బ్యాట్ షాట్లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు.వైభవ్ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్లు) శతకానికి జైపూర్లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ ఆట అసాంతం హైలైట్స్నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్ల తుఫాన్ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్ పరుగుతో మొదలైన తొలిఓవర్ వైభవ్ సిక్సర్తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్ మూడో ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్ నాలుగో ఓవర్తో అతని షో మ్యాచ్ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్ బౌండరీ, సింగిల్ తీసివ్వగా, వైభవ్ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్ వీరబాదుడికి సిక్స్, ఫోర్ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్వికెట్ మీదుగా బాదిన సిక్స్తో వైభవ్ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్ను బౌల్డ్ చేయడం ద్వారా ప్రసిధ్ కృష్ణ తొలివికెట్ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్ వికెట్కు తెరపడింది. నితీశ్ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) పరాగ్ (బి) తీక్షణ 39; గిల్ (సి) పరాగ్ (బి) తీక్షణ 84; బట్లర్ (నాటౌట్) 50; వాషింగ్టన్ సుందర్ (సి) హెట్మైర్ (బి) సందీప్ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్: ఆర్చర్ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్వీర్ 3–0–38–0, సందీప్ శర్మ 4–0–33–1, పరాగ్ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 70; వైభవ్ (బి) ప్రసిధ్ కృష్ణ 101; నితీశ్ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 4; పరాగ్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్: సిరాజ్ 2–0–24–0, ఇషాంత్ 2–0–36–0, సుందర్ 1.5–0–34–0, ప్రసిధ్ కృష్ణ 4–0–47–1, రషీద్ 4–0–24–1, కరీమ్ 1–0–30–0, సాయి కిషోర్ 1–0–16–0. వైభవ్ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్ పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్గానూ వైభవ్ గుర్తింపు పొందాడు. యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్పై) తర్వాత ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్లో ఆడిన మూడో ఇన్నింగ్స్లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్తో కలిసి బ్యాటింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్ చేయడం సులువవుతుంది. ఐపీఎల్లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. – వైభవ్ సూర్యవంశీ -
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్కు రాజస్తాన్ షాక్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ జూలు విధిల్చింది. ఈ మ్యాచ్లో గుజరాత్ను 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ చిత్తు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ మరోసారి తన బ్యాట్కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 210 భారీ లక్ష్య చేధనలో 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు.మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఊతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. సూర్యవంశీ ఔటై పెవిలియన్కు వెళ్తుండగా స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇక మెరుపు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సూర్యవంశీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010 సీజన్లో ముంబై పై రాజస్తాన్ తరపున యూసఫ్ 37 బంతుల్లో శతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ.. యూసుఫ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో క్రిస్ గేల్(30 బంతులు) ఉన్నాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 32 రోజుల వయస్సులో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్తో జోల్ను వైభవ్ అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడు కూడా వైభవే కావడం విశేషం.టీ20ల్లో సెంచరీ చేసిన పిన్న వయష్కులు వీరే..వైభవ్ సూర్యవంశీ(14 సంవత్సరాల 32 రోజులు)విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు)పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (18 సంవత్సరాలు 179 రోజులు)గుస్తావ్ మెక్కీన్(18 సంవత్సరాల 280 రోజులు ) Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅Fastest TATA IPL hundred by an Indian ✅Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6— IndianPremierLeague (@IPL) April 28, 2025 -
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
బిహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె అయిన తాజ్పూర్లో పుట్టిన ఆ బాలుడు ప్రస్తుతం క్రికెట్లో దూసుకుపోతున్నాడు. రైతుబిడ్డగా ఎదిగిన అతను ఆటలో ప్రావీణ్యం చూపుతూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్కు ఎంపికైన ఘటన సాధించిన అతనే వైభవ్ సూర్యవంశీ. మార్చి 27, 2011న పుట్టిన సూర్యవంశీది రైతు కుటుంబం. పోలంలో పని చేస్తేనే ఇంట్లో అందరూ పోట్టనింపుకునే పరిస్థితి వారిది. చిన్ననాటి నుంచి క్రికెట్పై వైభవ్కు వల్లమాలిన ఇష్టం.ఆ ఇష్టాన్ని తండ్రి సంజీవ్ గమనించారు. ఎనిమిదేళ్ల తన కొడుకు ముందు ముందు క్రికెట్లో అద్భుతాలు సష్టిస్తాడని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం తన మద్దతు అవసరం అని గ్రహించి, తన పోలాన్ని అమ్మేసి మరీ కొడుకుకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి క్రికెట్పై దష్టి పెట్టిన వైభవ్ శిక్షణ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు. సమస్తిపూర్కు తండ్రితోపాటు వెళ్లి అక్కడ కోచ్ల దగ్గర శిక్షణ పోందేవాడు. 12 ఏళ్లకే శిక్షణలో రాటుదేలాడు. తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొని ముంబయి జట్టుపై ఆడాడు. అక్కడే అతని ప్రతిభ అందరికీ తెలిసింది. అనంతరం అండర్–16, అండర్–19 టోర్నమెంట్లలో వైభవ్ తన సత్తా చాటాడు. ఒక్కో చోట తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ మేలైన క్రీడాకారుడిగా మారాడు. అండర్–19 ఏషియా కప్లో తన ఆటతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.ఇన్ని విజయాలు సాధించిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంపికై దేశమంతటికీ తెలిశాడు. 14 ఏళ్లకు రూ.1.10 కోట్ల పారితోషికంతో ఐపీఎల్కు ఎంపికై, అతి చిన్నవయస్కుడైన ఐపీఎల్ ఆటగాడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా మైదానంలో విజంభిస్తూ అందరి ప్రశంసలు పోందుతున్నాడు..pic.twitter.com/ElkZUyaI2z— Sujeet Suman (@sujeetsuman1991) April 24, 2025 -
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్ ఆచితూచి అడుగేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్గా మలిచాడుకెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్ వచ్చాడు. టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్తో కలిపి రాజస్తాన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీహార్కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరపున సూర్యవంశీ డెబ్యూ చేశాడు.ఈ యువ ఆటగాడు తొలి మ్యాచ్లోనే 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందరి కళ్లు ఈ యువ ఆటగాడిపైనే ఉన్నాయి. గురువారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో వైభవ్ ఎలా ఆడుతాడో అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సూర్యవంశీపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ అతి త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడని శాంసన్ జోస్యం చెప్పాడు."అతడు చాలా కాన్ఫిడెంట్గా కన్పిస్తున్నాడు. అతడిలో చాలా పవర్ ఉంది. మా క్రికెట్ ఆకాడమీలో గ్రౌండ్ బయటకు సిక్సర్లు కొట్టేవాడు. ఇంత చిన్న వయస్సులో అతడు భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. సూర్యవంశీ ఒకట్రెండు సంవత్సరాలలో భారత్ తరపున ఆడే అవకాశం ఉందని" శాంసన్ పేర్కొన్నాడు. కాగా సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వేలంలో వైభవ్ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా? -
మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.తొలి బంతినే సిక్సర్గా మలిచాడుతద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.ఇక్కడికి రాగానే మటన్తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.యువీ- యువీ కలిస్తే అతడువైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ను కొనుగోలు చేసింది.చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్ 𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ మరోసారి దురదృష్టకర రీతిలో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సరిసమానంగా స్కోరు చేసినా సంజూ సేన సూపర్ ఓవర్లో బోల్తా పడిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లోనూ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్ (Avesh Khan) తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో లక్నోకు విజయం అందించాడు. ఫలితంగా రాజస్తాన్ మరోసారి ఓటమి భారంతో తలదించుకోవాల్సి వచ్చింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్- లక్నో (RR vs LSG) జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది.180 పరుగులుసొంత మైదానంలో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66)తో పాటు ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ తమ ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించింది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్ యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74) బ్యాట్ ఝులిపించగా.. అతడికి జోడీగా వచ్చిన అరంగేట్ర ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా దుమ్ములేపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఓపెనర్లు శుభారంభం అందించినా రాజస్తాన్ అదే జోరునుకొనసాగించలేకపోయింది. నితీశ్ రాణా (8) విఫలం కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39) ఫర్వాలేదనిపించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి కేవలం తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి.ఆఖరి ఓవర్లో హైడ్రామాఈ క్రమంలో బంతితో రంగంలోకి దిగిన లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో తొలి బంతికి ధ్రువ్ జురెల్ సింగిల్ తీశాడు. అనంతరం షిమ్రన్ హెట్మెయిర్ జురెల్తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 6 గా మారింది.సరిగ్గా అప్పుడే ఆవేశ్ ఖాన్ తన నైపుణ్యాలకు మెరుగుపెట్టి మూడో బంతికి హెట్మెయిర్ (12)ను పెవిలియన్కు పంపాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వకుండా డాట్ చేశాడు. అనంతరం శుభమ్ దూబే రెండు పరుగులు తీయగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ దూబే ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు.ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా సంబరాలుఫలితంగా రాజస్తాన్ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లాడిలా గంతులేస్తూ ఆయన స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ శిబిరంలో ప్రతి ఒక్కరి ముఖాలు నిరాశతో వెలవెలబోయాయి.రాజస్తాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాంటి స్పందనా లేకుండా.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం నెత్తికి చేతులు పెట్టుకుని నిరాశను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా బేలగా చూస్తూ అలా ఉండిపోయాడు.Heart-racing, nerve-wracking, and simply unforgettable! 🤯#LSG defy the odds and seal a 2-run victory over #RR after the most dramatic final moments 💪Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/l0XsCGGuPg— IndianPremierLeague (@IPL) April 19, 2025ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘ద్రవిడ్ హృదయాన్ని ఆవేశ్ ముక్కలు చేశాడు.. గోయెంకానేమో తొలిసారి చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు అరుదు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్కు భారీ షాక్! -
చిచ్చరపిడుగు.. సిక్సర్తో ఆగమనం! తగ్గేదేలే.. (ఫొటోలు)
-
లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్జెయింట్స్ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్లో ఉన్నారు. -
RR VS LSG: ఐపీఎల్లో సంచలనం
ఐపీఎల్లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది. బర్మన్ 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీనేజీ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ (బీహార్) ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.కాగా, వైభవ్ లిస్ట్-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ప్రాతినిథ్యం వహించిన బీహార్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్ సౌరభ్ (50), గనీ (48), ప్రబల్ ప్రతాప్ సింగ్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ఆర్యన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ హర్ష్ గావ్లి (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్ను ఎంచుకుంది. ‘వైభవ్లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది. -
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో మూడో మ్యాచ్లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
సచిన్, కోహ్లి కాదు! 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఆదర్శం ఇతడే!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్టాపిక్. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడిన వైభవ్ తన ఐడల్ ఎవరో చెప్పేశాడు. సచిన్, కోహ్లి కాదు! అతడే ఆదర్శంమెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్, రోహిత్ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను. నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.పట్టించుకోనుఐపీఎల్లో తన డిమాండ్, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్లోనే భారత్కు చేదు అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో జపాన్తో ఆడనుంది. చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! Vaibhav Sooryavanshi gears up for the big stage 🌟 🗣️ Hear from India’s rising star as the action unfolds against Pakistan 🎤 #SonySportsNetwork #NextGenBlue #AsiaCup #NewHomeOfAsiaCup #INDvPAK pic.twitter.com/PLG8UlvB6i— Sony Sports Network (@SonySportsNetwk) November 30, 2024 -
Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్ చేతిలో తప్పని ఓటమి
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్లో భారత్తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్లో శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాజైబ్ ఖాన్ భారీ శతకంఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.ఆదిలోనే ఎదురుదెబ్బఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024 నిఖిల్ వీరోచిత అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు. చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగాచేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.తదుపరి జపాన్తోఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్లో జపాన్తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
Ind vs Pak: ఐపీఎల్ కాంట్రాక్టు పట్టాడు.. పాక్తో మ్యాచ్లో ఫెయిల్! కారణం అదే!
పాకిస్తాన్తో మ్యాచ్లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్.. అండర్- 19 క్రికెట్లో అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్గానూ చరిత్రకెక్కాడు.కోటీశ్వరుడు అయ్యాడు.. దిష్టి తగిలిందిఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్తో జరిగిన అనధికారిక టెస్టులో 58 బంతుల్లోనే వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పదమూడేళ్ల లెఫ్టాండర్ను రాజస్తాన్ రాయల్స్ ఊహించని ధరకు సొంతం చేసుకుంది. ఈ బిహారీ అబ్బాయిని ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుక్కుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే అమ్ముడుపోయిన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అయితే, కొంతమంది మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ ఆరోపణలు చేయగా.. వైభవ్ తండ్రి సంజీవ్ వాటిని కొట్టిపారేశాడు.తమకు ఏ భయమూ లేదని.. కావాలంటే బీసీసీఐ ఏజ్ టెస్టుకు వైభవ్ను మరోసారి పంపించడానికి సిద్దమని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. వైభవ్ సైతం తన గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్.. ‘‘పదమూడేళ్లకే ఇతడు ఏం చేశాడో చూడండి’’ అంటూ వైభవ్ నైపుణ్యాలను కొనియాడింది.తీవ్రమైన ఒత్తిడిలోఓవైపు ఓవర్నైట్ స్టార్గా మారడటం.. మరోవైపు వయసు గురించి ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల నడుమ అండర్-19 ఆసియా కప్ బరిలో దిగాడు వైభవ్ సూర్యవంశీ. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్లో శనివారం చిరకాల ప్రత్యర్థిని ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఫలితంగా బౌలింగ్కు దిగిన యువ భారత్కు పాక్ ఓపెనర్లు కొరకరాని కొయ్యగా మారారు. ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు సాధించగా.. షాజైబ్ ఖాన్ ఏకంగా 159 పరుగులతో భారీ శతకం నమోదు చేశాడు. నాలుగో స్థానంలో మహ్మద్ రియాజుల్లా వచ్చిన 27 పరుగులు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అయితే, ఓపెనర్ల విజృంభణ వల్ల పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆయుశ్ మాత్రే రెండు, యుధాజిత్ గుహ, కిరన్ చోర్మలే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.Samarth takes his 3️⃣rd wicket! 💥Shahzaib Khan departs after scoring 159Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/m3dZn8YskL— Sony LIV (@SonyLIV) November 30, 2024 ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. అలీ రజా బౌలింగ్లో సాద్ బేగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ కూడా 15 పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 రన్స్తో ఫర్వాలేదనిపించాడు. నిఖిల్ కుమార్ హాఫ్ సెంచరీ(67) చేయగా.. మిగతా వారిలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26), మొహ్మద్ ఇనాన్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 238 పరుగులకే పరిమితమైన యువ భారత్ పాక్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ఆశలపై నీళ్లు! -
13 ఏళ్లకే కోటీశ్వరుడు
-
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్ను క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్లో ట్రయల్స్ సమయంలో వైభవ్ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్తో రెండో టెస్ట్కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవరీ సూర్యవంశీ?
ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. రూ.30లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్ను రాజస్తాన్ తమ సొంతం చేసుకుంది.ఎవరీ వైభవ్ సూర్యవంశీ?13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్లోని తాజ్పుర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్బుతమైన క్రికెటర్గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర. 8 ఏళ్లకే వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు.2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో బిహార్ తరపున ఫస్ట్క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు రంజీ మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్ రాయల్స్ పోటీపడి మరి సొంతం చేసుకుంది. -
Ind vs Aus: తొలి టెస్టులో ఆసీస్పై భారత్ గెలుపు
IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.కాగా ఓవర్నైట్ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్సెల్ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆసీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ కాగా... ఎయిడెన్ ఓ కానర్ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్స్పిన్నర్ మహమ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు.మరోవైపు.. కెప్టెన్ సొహమ్ పట్వర్ధన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్ కుమార్ (71 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్ ఓ కానర్ నాలుగు, విశ్వ రామ్కుమార్ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది. చదవండి: ఇంగ్లండ్ బజ్బాల్ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
Ind vs Aus: టీ20 తరహా ఇన్నింగ్స్.. వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అండర్-19 టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ఈ ఫీట్ నమోదు చేసి ఔరా అనిపించాడు.మొయిన్ అలీ తర్వాతచెన్నై వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగతున్న అనధికారిక తొలి టెస్టు సందర్భంగా మంగళవారం ఈ ఘనత సాధించాడు. కాగా అండర్ 19 స్థాయిలో వైభవ్ కంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ మొయిన్ అలీ. ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ 2005లో కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకన్నాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్కు వచ్చింది. పుదుచ్చేరిలో జరిగిన వన్డే సిరీస్లో పర్యాటక జట్టును 3-0తో వైట్వాష్ చేసిన యువ భారత్.. చెన్నైలోని చెపాక్లో అనధికారిక తొలి టెస్టు మొదలుపెట్టింది.వైభవ్ రనౌట్ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటలోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా 26 పరుగులతో ఆడుతుండగా.. వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రరెడ్బాల్ మ్యాచ్లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు.. దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు.. ఇదే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించి.. బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.కాగా దేశవాళీ క్రికెట్లో వైభవ్ బిహార్ జట్టుకు ఆడుతున్నాడు. ఇక 12 ఏళ్ల వయసులోనే రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు.చదవండి: ‘జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శి ఎవరో గానీ.. ఈసారి అక్కడ మ్యాచ్లు వద్దు’