Vaibhav Suryavanshi
-
‘‘రాజస్థాన్ రాయల్స్ను యశస్వి జైస్వాల్ వదిలివెళ్లాలి’’
చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ శాంసన్ వెళ్లడం ఖరారైనప్పుడు.. ఇకపై రాజస్థాన్ రాయల్స్ బాధ్యతలు యశస్వి జైస్వాల్ చేపడతాడని చాలా మంది భావించారు. లేదంటే జట్టులో ప్రధాన ఆటగాడిగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది. ఏడాది క్రితమే ఐపీఎల్లోకి ప్రవేశించిన టీనేజర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లోని కీలక ఆటగాళ్లను సైతం డామినేట్ చేస్తున్నాడు.మరోవైపు, 2023 ఐపీఎల్ సీజన్లో 600కుపైగా పరుగులు, 48.07 సగటుతో రాణించినప్పటి నుంచి యశస్వి జైస్వాల్ను భారత క్రికెట్ ఫ్యూచర్ స్టార్గా భావించారు. కానీ, 2026 మే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దాదాపు ప్రతి అంశంలోనూ అతడిని మించిపోయాడు.వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచాడు. ఆటను మరింత మెరుగుపర్చుకుని రాజస్థాన్ జట్టులోనే ఉండడం. లేదంటే జట్టు మారడం. జైస్వాల్ తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోకపోతే వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల ముందు అతడి పేరు, గుర్తింపు, ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంది.మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ నీడ నుంచి బయటకు వచ్చి(ఆర్ఆర్ నుంచి), మరో జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని జైస్వాల్కు సూచించాడు.“అతడు తన ఆటతీరును మార్చుకోవాలి. ఎందుకంటే సూర్యవంశీతో కలిసి ఆడుతూ ప్రతిసారీ అతడి పర్ఫార్మన్స్ ముందు మసకబారిపోతూ ఉండలేడు. జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు. మరో జట్టుకు వెళ్తే తన సొంత ప్రతిభతో మ్యాచ్లు గెలిపిస్తాడు. అతడికో ఓ వేదిక అవసరం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇకముందూ ఇతరుల ప్రభ తగ్గిపోయేలా చేస్తూనే ఉంటాడు” అని అంబటి రాయుడు అన్నాడు.“వైభవ్ సూర్యవంశీతో పాటు ఓ సీనియర్ భాగస్వామి ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అతడి విజయాన్ని చూసి ఆనందించాలి. పోటీగా భావించకూడదు. అతడితో పోటీ పడటం సాధ్యం కాదు” అని తెలిపాడు. జైస్వాల్కు ముంబై ఇండియన్స్ సరైన జట్టని అన్నాడు. -
సూర్యవంశీ విధ్వంసంపై స్పందించిన క్రిస్ గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్లో సంచలనాత్మక ఇన్నింగ్స్తో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్గేల్ ప్రశంసలు కురిపించాడు. సూర్యవంశీని సరికొత్త సిక్సర్ల యంత్రంగా వర్ణించాడు. అతడి ఆట అద్భుతం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. 29 బంతుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు సూర్యవంశీని ఓదార్చాడు. ఏదో ఒకరోజు ఈ యువ బ్యాటర్ తన రికార్డును బ్రేక్ చేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు.న్యూ చండీగఢ్ వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్తో పలు రికార్డు తిరగరాశాడు. 3 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 29 బంతుల్లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 334కు పైగా స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్గేల్ రికార్డును బ్రేక్ అవకాశాన్ని కొంచెంలో మిస్సయ్యాడు. 2012లో గేల్ చేసిన 59 సిక్సర్లను రికార్డును మాత్రం సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (65) కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ రికార్డుల స్క్రీన్షాట్ను ఇన్స్టా స్టోరీలో క్రిస్గేల్ షేర్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ మెచ్చుకున్నాడు. ఏ న్యూ సిక్స్ మెషీన్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ను మారణకాండతో పోల్చాడు. సెంచరీ మిస్ అయినందుకు దురదృష్టవంతుడు అంటూ కామెంట్ పెట్టాడు. తన రికార్డును ఎప్పటికైనా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. -
కాటీరమ్మ కొడుకులను ఆటాడుకున్న బుడ్డాడు
-
భయం ఎరుగని బ్యాటింగ్.." బౌలర్లకు చుక్కలు! చిన్న వయసులో రికార్డులు బద్దలు!
-
రోహిత్, విరాట్లను భయపెట్టిన పాట్ కమిన్స్ నే వణికించిన బుడ్డాడు..!
-
వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప
-
'ఆ సీక్రెట్ ఐపీఎల్ అయిపోయాక చెప్తా'
ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. అతడి విధ్వంసం ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. రాజస్తాన్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైభవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్పై సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం వైభవ్పై తన సహచరడు, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."అతడు బ్యాటింగ్ చూడాటానికి చాలా బాగుంటుంది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేయడానికి అన్ని ఎక్కువ పరుగులు లభిస్తాయి. వైభవ్ 150 పరుగులు కూడా చేయగలడన్న నమ్మకం నాకు ఉంది" అని ఆర్చర్ అన్నాడు. అదేవిధంగా వైభవ్ను ఆడ్డుకోవాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్న ప్రశ్నకు ఆర్చర్కు ఎదురైంది.అందుకు బదులుగా.. వైభవ్ను ఎలా ఔట్ చేయాలో నాకు తెలుసు. కానీ అది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెప్తాను అని ఆర్చర్ సరదాగా సమాధనమిచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ(680) అగ్రస్ధానంలో ఉన్నాడు. మే 29న రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.చదవండి: IPL 2026: వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే -
వైభవ్ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్.ఐపీఎల్ మొదలై 19 సీజన్లు అవుతున్నప్పటికి ప్లే ఆఫ్స్లో ఇలాంటి ఇన్నింగ్స్ను ఇప్పటివరకు చూడలేదు. ఈ నాకౌట్ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్-బి, ప్లాన్-సి అని చెప్పిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ను సైతం ఈ వండర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్గా క్రిస్ గేల్ ఆల్టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్కు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.థాంక్యూ సమర్..వైభవ్ సూర్యవంశీలోని టాలెంట్ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను మొదటిసారి చూశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లు, అతడిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చర్యపరిచాడు.వెంటనే వైభవ్ గురుంచి రాజస్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్స్లో వైభవ్ తను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్తరపోయాడు. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్లో అప్పటివరకు సంజూ శాంసన్, జైశ్వాల్ మాత్రమే తాము ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ జాబితాలో వైభవ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్ఆర్ మేనేజ్మెంట్కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్ను చూశాను అంటూ రాజస్తాన్ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభవ్ను పట్టుబట్టి మరి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటిలో ఒక యువ ఆటగాడిపై అంత మొత్తాన్ని వెచ్చించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ ఇప్పుడు అతడి విలువ వందల కోట్లతో సమానం.చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా -
ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్కు సచిన్ ఫిదా
ఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో రాజస్తాన్ రాయల్స్ యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు తన మెరుపు బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.15 ఏళ్ల వైభవ్.. పాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. తొలి ఓవర్ నుంచే సన్రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు కోల్పోయాడు. ఇక వైభవ్ సంచలన ఇన్నింగ్స్కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. వైభవ్పై మాస్టర్ బ్లాస్టర్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. అతడి కాళ్ల వైపు వచ్చే బంతులను ఫ్రంట్ఫుట్ క్లియర్ చేసి పక్కకు జరుగుతూ ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ స్వేచ్ఛే అతన్ని తనదైన శైలిలో ఆడేలా చేస్తోంది. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ నిజంగా అత్యుద్భుతం" అని సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా ఈ మ్యాచ్లో సన్రైజర్స్పై 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది: వైభవ్ సూర్యవంశీ
మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ విధ్వంసం సృష్టించాడు.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో సిక్స్తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్తో గేల్ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్తో గేల్ను అధిగమించాడు. మూడో సిక్స్తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది.ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేశ్ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్ప్లేలో అత్యధిక సిక్స్లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు.వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ ఔటయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి ఔటైనన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవ్వడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు."నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురుంచి అసలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా 'థర్డ్ మ్యాన్' దిశగా ఆ షాట్ ఆడి ఉంటే, బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రైయిట్గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో ఔట్ అవ్వాల్సి వచ్చింది" అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా సన్రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్కు ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్తాన్ కోచ్లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ను గాను ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ -
అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎస్ఆర్హెచ్.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బౌలింగ్లో విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక హైదరాబాద్ జట్టు చతికలపడింది.19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి(38), సైల్ ఆరోరా(35), ఇషాన్ కిషన్(33) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 97 పరుగులు చేసి తృటిలో రికార్డు సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోవడం వల్లే తమకు ఓటమి ఎదురైందని కమ్మిన్స్ తెలిపాడు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీపై కూడా ఈ ఆసీస్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.మా ఓటమికి కారణమదే..వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో మా బౌలర్లకు పెద్దగా ఆప్షన్స్ లేకుండా చేశాడు. అతడిని ఆపేందుకు ఏమి చేయాలో కూడా నాకు ఆర్ధం కాలేదు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ మ్యాచ్ ఫలితంలో వారికి మాకు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ ఆటకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. యార్కర్ కొంచెం మిస్ అయినా వైభవ్ వాటిని వదలకుండా సిక్సర్లగా మలిచాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై నాకేమీ పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే వికెట్ చివరి వరకు కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఈ సీజన్ ద్వారా మేము యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశాము.మేము టోర్నీని ఓటమితో ముగించినప్పటికి ఒక పరిపూర్ణమైన జట్టుగా మాత్రం నిలిచాం. ప్రఫుల్, సాకిబ్ ల రూపంలో ఇద్దరు నాణ్యమైన ఇండియన్ పేసర్లు వెలుగులోకి వచ్చారు. టోర్నీ అంతటా వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్కు చేరుకున్న యంగెస్ట్ టీమ్స్లో ఒకటిగా సన్రైజర్స్ నిలిచింది. మా జట్టులో చాలా వరకు యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో మా కోచింగ్ స్టాప్ది కీలక పాత్ర. వారి వల్లే ఆరెంజ్ ఆర్మీ ఒక పటిష్టమైన టీమ్గా మారింది. కాబట్టి ఒక కెప్టెన్గా వారు అలా రాణించడం చాలా సంతోషంగా ఉంది. 240 పరుగుల పైగా లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. అయితే ఈ లక్ష్యాన్ని చేధించేందుకు అనువైన పిచ్ ఏదైనా ఉందంటే? అది ముల్లాన్ పూర్ మాత్రమే అని కచ్చితంగా చెబుతాను. ఎందుకంటే ఈ పిచ్ బ్యాటింగ్కు అద్భుతంగా ఉంటుంది. ఛేజింగ్ చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చాము. సరైన రన్రేట్ మెయింటేన్ చేస్తూ ముందుకు వెళ్లాము. కానీ దురదృష్టవశాత్తూ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. గత మూడు సీజన్లలో మేము రెండు సార్లు ప్లే ఆఫ్స్కు చేరాం. ఈసారి టాప్-2లో నిలిచేందుకు చాలా దగ్గరగా వచ్చాం. ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఈ సీజన్ అంతటా మా బాయ్స్ అద్భుతంగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను కమిన్స్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు -
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)
-
ఎస్ఆర్హెచ్కు హార్ట్ బ్రేక్.. ఐపీఎల్ నుంచి నిష్క్రమణ
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్దికి భారీ స్కోర్ సమర్పించుకుంది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు) ఊచకోత కోయడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది.వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్ స్కోర్.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది.12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో ఎస్ఆర్హెచ్ పేసర్లు సాకిబ్ హుసేన్, నితీశ్కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రఫుల్ హింగే (4-0-54-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓ పక్క సహచరులంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా శివాంగ్ కుమార్ (2-0-19-1), నితీశ్ కుమార్ (2-0-12-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. కమిన్స్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎషాన్ మలింగ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్ తీయగా.. సాకిబ్ హుసేన్ 4 ఓవర్లలో వికెట్ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.రాజస్థాన్ ఇన్నింగ్స్లో వైభవ్, జురెల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జైస్వాల్ 29, కెప్టెన్ రియాన్ పరాగ్ 26, ఫెరియెరా 12, షనక 5, రవీంద్ర జడేజా 12 (నాటౌట్), ఆర్చర్ 4, బర్గర్ 1, సుషాంత్ మిశ్రా 1 (నాటౌట్) పరుగు చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్ఆర్హెచ్ ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఒత్తిడికి లోనైన ఆ జట్టు వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ (4-0-58-3), బర్గర్ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్ రాజ్ పూనియా (4-0-39-1), సుషాంత్ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై, 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఈ గెలుపుతో రాజస్థాన్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించగా.. ఎస్ఆర్హెచ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ గుజరాత్తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరింది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఎస్ఆర్హెచ్తో ఇవాళ (మే 27) జరుగుతున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సురేశ్ రైనాతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్16 - సురేశ్ రైనా vs PBKS, వాంఖడే, 201416 - వైభవ్ సూర్యవంశీ vs SRH, ముల్లాన్పూర్, 2026*17 - ఆడం గిల్ క్రిస్ట్ vs DC, సెంచూరియన్, 200920 - ఎంఎస్ ధోని vs MI, బెంగళూరు, 201221 - డ్వేన్ స్మిత్ vs CSK, ఢిల్లీ, 201321 - వీరేంద్ర సెహ్వాగ్ vs CSK, వాంఖడే, 201421 - రజత్ పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు61* - వైభవ్ సూర్యవంశీ (2026)59 - క్రిస్ గేల్ (2012)52 - ఆండ్రీ రస్సెల్ (2019)51 - క్రిస్ గేల్ (2013)45 - జోస్ బట్లర్ (2022)ఐపీఎల్ సీజన్లో ఒక అన్క్యాప్డ్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు680 - వైభవ్ సూర్యవంశీ (RR, 2026)*625 - యశస్వి జైస్వాల్ (RR, 2023)616 - షాన్ మార్ష్ (PBKS, 2008)573 - రియాన్ పరాగ్ (RR, 2024)549 - ప్రభ్సిమ్రాన్ సింగ్ (PBKS, 2025)ఐపీఎల్లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక 50లు6 - అభిషేక్ శర్మ5 - నికోలస్ పూరన్5 - వైభవ్ సూర్యవంశీ*ఐపీఎల్ పవర్ ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక 50+ స్కోర్లు6 - డేవిడ్ వార్నర్5 - వైభవ్ సూర్యవంశీ4 - ట్రావిస్ హెడ్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో (1-6) మధ్య ఓవర్లలో 50+ స్కోర్లు87 - సురేష్ రైనా vs PBKS, 201474 - ఆడమ్ గిల్ క్రిస్ట్ vs DD, 200960 - వైభవ్ సూర్యవంశీ vs SRH, 2026*ఐపీఎల్లో 1-6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు8 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026 ELM*7 - సనత్ జయసూర్య (MI) vs CSK, ముంబై WS, 20087 - జోస్ బట్లర్ (RR) vs DC, ఢిల్లీ, 2018 (వర్షం కుదించిన గేమ్)7 - జానీ బెయిర్స్టో (PBKS) vs RCB, బ్రబౌర్న్, 20227 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, ముల్లన్పూర్, 20267 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026ఐపీఎల్ సీజన్లో అత్యధిక పవర్ప్లే (1-6 ఓవర్లు) పరుగులు490 - వైభవ్ సూర్యవంశీ (2026)*467 - డేవిడ్ వార్నర్ (2016)402 - ట్రావిస్ హెడ్ (2024)402 - సాయి సుదర్శన్ (2025)382 - ఆడమ్ గిల్క్రిస్ట్ (2009)ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు4 - క్రిస్ గేల్4 - వైభవ్ సూర్యవంశీ*2 - అభిషేక్ శర్మ2 - ఫిన్ అలెన్ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు11* - V సూర్యవంశీ vs SRH, జైపూర్, 2026*10 - S గిల్ vs MI, అహ్మదాబాద్, 20239 - R పాటిదార్ vs GT, ధర్మశాల, 2026ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు)12 - వి సూర్యవంశీ (RR) vs SRH, 202612 - V సూర్యవంశీ (RR) vs SRH, 2026 ELM11 - మురళీ విజయ్ (CSK) vs RR, 201011 - వి సూర్యవంశీ (RR) vs GT, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 13.5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (12), ఫెరియెరా క్రీజ్లో ఉన్నారు. -
WWEని తాకిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్ను తాకింది. ఆ ఈవెంట్ సూపర్ స్టార్ డ్రూ మెక్ఇన్టైన్ (Drew McIntyre) వైభవ్పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. వైభవ్ ఐపీఎల్ జెర్సీతో జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్కు వచ్చిన క్రేజ్ చూసి భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Drew McIntyre (@dmcintyrewwe)బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్, ధోని, విరాట్ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్ క్రేజ్ చూసి ఔరా అంటున్నారు.డ్రూ మెక్ఇన్టైన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించడం మరింత వైరల్గా మారింది. "2K గేమ్లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ముల్లాన్పూర్ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు ఎస్ఆర్హెచ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో ఇప్పటివరకు అతనాడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.పైగా వైభవ్కు ప్లే ఆఫ్స్లో (నాకౌట్స్) మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్ ఆడిన 8 నాకౌట్స్లో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్ ఫ్యాన్స్ ధీమాకు మరో కారణం కూడా ఉంది. ఇదే సీజన్ లీగ్ మ్యాచ్లో వైభవ్ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్లో వైభవ్ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్ ఏం చేస్తాడో చూడాలి. -
వైభవ్ బాధ్యత వారిదే.. ఐపీఎల్ చైర్మెన్ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంతకంటే ముందు వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున వైభవ్ బరిలోకి దిగనున్నాడు. తిలక్ వర్మ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ సిరీస్లో కూడా అతడు మెరుగ్గా రాణిస్తే భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతోంది.ఈ నేపథ్యంలో వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 583 పరుగులు సాధించి ఆరెంజ్క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి."వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.చదవండి: IPL 2026: రాజస్తాన్తో ఎలిమినేటర్.. సన్రైజర్స్ తుది జట్టు ఇదే! -
వైభవ్ ఊచకోత ఖాయం..!
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 27) జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదారాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్కు ముందు అందరి చూపు రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఎందుకంటే ఈ బుడ్డోడు ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు.ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. వైభవ్ ఇవాళ ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లోనూ తప్పక చెలరేగుతాడని భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం. ఈ బిహారి చిన్నోడు అన్ని విభాగాల్లో ఇప్పటివరకు 8 నాకౌట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 209.62 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ దూకుడు ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతుంది.కాబట్టి నేటి మ్యాచ్లో అతడు చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. పవర్ ప్లేలోనే అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అంచనా వేయడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సీజన్ పవర్ ప్లేలో వైభవ్ 231కు పైగా స్ట్రయిక్ రేట్తో ఏకంగా 430 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం కాగానే వైభవ్ పని పట్టకపోతే పెను ముప్పు తప్పదని వారు ఓ అంచనాకు వచ్చేశారు.ఈ నేపథ్యంలో వారు వైభవ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ సీజన్లోనే జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్ ఎస్ఆర్హెచ్పై 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ ఇబ్బందిపడిన అంశాలను ఎస్ఆర్హెచ్ బౌలర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.గత మ్యాచ్లో అతడు ఎడమ భుజం వైపు గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. కమిన్స్, సాకిబ్ హుసేన్ ఈ ఏరియాలోనే వైభవ్ను టార్గెట్ చేసేందుకు వ్యూహరచన చేసుకొని ఉంటాయి.నాకౌట్ మ్యాచ్ల్లో వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్లు..2024 అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు 2026 అండర్-19 వరల్డ్కప్ సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్పై 33 బంతుల్లో 68 పరుగులు2026 అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు -
అతడు మాపై శతక్కొట్టొచ్చు.. కానీ..: కమిన్స్
ఐపీఎల్-2026లో ‘ఎలిమినేటర్’ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ ఇందుకు వేదిక.లీగ్ దశలో హైదరాబాద్ తొమ్మిది విజయాలు.. సాధించగా రాజస్తాన్ ఎనిమిది మ్యాచ్లు గెలిచింది. అయితే, ముఖాముఖి పోరులో ఈ సీజన్లో రెండుసార్లూ హైదరాబాద్ జట్టే రాజస్తాన్పై పైచేయి సాధించింది.తొలుత సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్రైజర్స్.. జైపూర్లో ఆతిథ్య జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ పోరులో రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలకం కానున్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టి..ఉప్పల్ మ్యాచ్లో ప్రఫుల్ హింగే వైభవ్ను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపగా.. జైపూర్లో వైభవ్ అతడి బౌలింగ్లో చితక్కొట్టాడు. అంతేకాదు.. 36 బంతుల్లోనే శతక్కొట్టి.. లీగ్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పడం విశేషం. జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఒక బౌలర్గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను.వైభవ్ కోసం ప్లాన్ బి, సి కూడాఓ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగలడని భావిస్తే.. అతడి కోసం ప్లాన్ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్ కోసం కచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు.అయితే, అంతకంటే ముందు మ్యాచ్లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్.. మరికొన్నిసార్లు బ్యాటర్ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.ఇక గ్రూప్ దశలో రాయల్స్ను రెండుసార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని.. అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో గుజరాత్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: మూడు కీలక యుద్ధాలు గెలిచిన ఆర్సీబీ! -
ఇప్పట్లో అతడిని ఎంపిక చేయొద్దు: గంగూలీ
భారత క్రికెట్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడేనన్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వైభవ్కు ఇప్పట్లో చోటు ఇవ్వడం సరికాదన్నాడు.అదే విధంగా.. టీ20 ఫార్మాట్కు ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందని తాను ఊహించలేదని గంగూలీ తెలిపాడు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి తన సహచర ఆటగాళ్లు సైతం దీనిని అంచనా వేయలేకపోయారని.. తమ తరం ఆట తీరు వేరుగా ఉండేదన్నాడు.త్వరలోనే జాతీయ జట్టులోకి!కాగా పన్నెండేళ్ల వయసులోనే దేశీ రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక భారత్ అండర్-19 జట్టు తరఫునా.. అదే విధంగా ఐపీఎల్లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన పదిహేనేళ్ల వైభవ్ త్వరలోనే జాతీయ జట్టులోకి రానున్నాడు.ఇటీవల సెలక్టర్లు వైభవ్ను భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన గంగూలీకి వైభవ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..అప్పటిదాకా టెస్టులకు ఎంపిక చేయొద్దు‘‘టీ20 జట్టులోకి అతడు తప్పక రావాల్సిందే. కానీ టెస్టు జట్టులో ఇప్పట్లో అతడికి చోటు ఇవ్వకూడదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మరిన్ని పరుగులు రాబట్టి.. తనను తాను నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయాలి.అయితే, అతడు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్. పదిహేనేళ్ల వయసులోనే ఈ రేంజ్లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడటం నిజంగా ఆశ్చర్యకరం. భారత క్రికెట్ భవిష్యత్ అతడే’’ అని గంగూలీ ప్రశంసలు కురిపించాడు.అస్సలు ఊహించలేదుఇక 25 ఏళ్ల టీ20 ఫార్మాట్ ఈ స్థాయికి చేరుతుందని ద్రవిడ్, టెండుల్కర్లతో పాటు మీరూ ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘అస్సలు ఊహించలేదు. మేము ముగ్గురమే కాదు.. మాతో పాటు రిక్కీ పాంటింగ్, కుమార్ సంగక్కర, జో రూట్, అలిస్టర్ కుక్ కూడా బహుశా ఇది ఊహించి ఉండరు.మాదొక విభిన్నమైన తరం. అయితే, ఆటలోనైనా.. ఇతర ఏ రంగంలోనైనా మార్పులు సహజం. కాబట్టి పరిస్థితులకు తగినట్లు ఆటగాళ్లు మారుతూనే ఉండాలి. టీ20 క్రికెట్లో యువ ఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. లైన్కు తగినట్లు ఆడుతూ.. బంతిని స్టాండ్స్లోకి పంపడమే వారి ముందున్న లక్ష్యం’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి లీగ్ దశలో ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లో) కూడా ఉంది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం! -
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2026 ఎలిమినేటర్లో భాగంగా బుధవారం ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్కు ముందు వైభవ్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్తో 583 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్-2024 సీజన్లో మెక్గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్రైజర్స్పై వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్గర్క్ను అధిగమించే అవకాశముంది.500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది.గేల్ రికార్డుపై కన్నుకాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2012)వైభవ్ సూర్యవంశీ: 53 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ - ఐపీఎల్ 2026)*ఆండ్రీ రస్సెల్: 52 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2019)క్రిస్ గేల్: 51 సిక్సర్లు (16 ఇన్నింగ్స్ -ఐపీఎల్ 2013)చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
మరీ ఇంత కుళ్లు పనికిరాదు!.. నీకంటే అతడే బెస్ట్!
పద్నాలుగేళ్ల వయసులోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు దేశీ క్రికెట్లో.. అటు ఐపీఎల్లో సత్తా చాటుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారిన ఈ బిహారీ కుర్రాడు ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.583 పరుగులుఇక ఇటీవలే పదిహేనవ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్లలో కలిపి ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం ఉంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తరఫున లీడ్ రన్స్కోరర్గా ఉన్న వైభవ్.. ఓవరాల్గా టాప్-5లో కొనసాగుతున్నాడు. తన అద్భుత బ్యాటింగ్తో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైభవ్కు రోజురోజుకూ ఆదరణ మరింత పెరుగుతోంది. నిజానికి ప్రస్తుతం రాయల్స్ పోస్టర్ బాయ్గా వైభవ్ అవతరించాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీ పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.వైభవ్ పట్ల రియాన్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వైభవ్ సహా రాయల్స్ జట్టు మొత్తం ముల్లన్పూర్కు పయనమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సెలబ్రిటీలను కెమెరాలో బంధించే పాపరాజీలు.. రియాన్ పరాగ్ను పిలిచి.. ‘రియాన్ వైభవ్తో ఒక్క ఫొటో కావాలి’ అని అడిగారు. ఇందుకు.. ‘మేమేమీ సినిమా స్టార్లము కాదు’ అని రియాన్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.Look at Vaibhav Suryavanshi’s reaction when the paparazzis said to Riyan Parag, “Riyan, Vaibhav ke saath ek photo please,” and Riyan replied, “Hum koi film star nahi hain.” After hearing this, Vaibhav Suryavanshi’s smile disappeared. 👀Later, the paparazzis said to Vaibhav,… pic.twitter.com/sXsyhTGgCb— Sonu (@Cricket_live247) May 26, 2026అందరి రికార్డులూ బద్దలు కొడతాడుదీంతో అప్పటిదాకా చిరునవ్వులు చిందించిన వైభవ్.. కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో ఓ పాపరాజీ.. ‘వైభవ్ ఏ సినీ స్టార్ కంటే కూడా తక్కువ కాదు. అతడు అందరి రికార్డులూ బద్దలు కొడతాడు’’ అని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరీ అంత కుళ్లు పనికిరాదుఈ నేపథ్యంలో.. ‘‘వైభవ్పై మరీ అంత కుళ్లు పనికిరాదు.. జట్టుకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు?.. పిల్లాడిని ఇంతలా అప్సెట్ చేస్తావా? నీ ఇగోకు మూల్యం చెల్లించకతప్పదులే’’ అని నెటిజన్లు రియాన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా రాజస్తాన్ విజయాల్లో ఆటగాడిగా రియాన్ పాత్ర పెద్దగా లేదు. పైగా ఇటీవల డ్రెసింగ్రూమ్లో చట్టవిరుద్ధంగా ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కి రాజస్తాన్ పరువు తీశాడు. ఇందుకు బదులుగా బీసీసీఐ జరిమానాతో సరిపెట్టగా.. రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి: ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్ -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
ఈ చిత్రం చూశారా.. వైభవ్ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన వైభవ్ 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్పై గెలిచిన రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.మే 27న (బుధవారం) ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను వీక్షించడానికి వైభవ్ కుటుంబం మొత్తం తరలివచ్చింది.మ్యాచ్లో వైభవ్ తుస్సుమన్నప్పటికీ రాజస్తాన్ గెలవడం, ప్లేఆఫ్ చేరడంతో అతడి కుటుంబం సంతోషంతో ఇంటిబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్టేడియం నుంచి బయటికి వస్తున్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం సహా అతడి సోదరులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తి కలిగించింది.కాగా, వైభవ్కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా హైట్లో తేడా ఉన్నప్పటికీ ముఖ కవలికల్లో మాత్రం అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) సహా మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో రాజస్తాన్ 200 పరుగుల మార్క్ను దాటింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia)Vaibhav’s carbon copy cute Family 🩷🤭 pic.twitter.com/WLUDhFyg0c— Charvi Vyas (@4Vvyas) May 25, 2026చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం! -
25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా ట్రెండింగ్లో నిలిచిన పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన యూట్యూబ్ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ 25 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే పీటర్సన్ తన యూట్యూబ్ చానెల్లో వైభవ్ సూర్యవంశీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్లోనే పీటర్సన్ వైభవ్కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలంటూ సవాల్ విసిరాడు. కానీ వైభవ్ మాత్రం పీటర్సన్ విసిరిన సవాల్ను 25 బంతుల్లోనే అందుకోవడం విశేషం. బౌలింగ్ మెషిన్ నుంచి వచ్చిన బంతులను వైభవ్ భారీ సిక్సర్లుగా మలిచాడు. అయితే 25 బంతుల్లోనే శతకం సాధించినప్పటికీ ఇదే పీటర్సన్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో సాధించిన వంద పరుగుల రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయాడు. మూడు బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. ఇక పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ తర్వాత నికోలస్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంతకముందు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే ఎపిసోడ్లో సూర్యవంశీ తన కోరికను వెల్లడించాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే టీ20 క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (175 పరుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్లో గేల్ ఆర్సీబీ తరఫున 175 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు టీ20ల్లో డబుల్ సెంచరీ బాదడమే తన టార్గెట్ అని మరోసారి స్పష్టం చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్ 16 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారం (మే 27న) జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. ఇక రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీజన్లో 14 మ్యాచ్లాడి 583 పరుగులు సాధించాడు.చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్రపంచకప్కు దూరం! -
వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫెయిల్!
పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. దేశీ క్రికెట్లో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలతో సత్తా చాటి ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ. 1.10 కోట్లకు వైభవ్ను కొనుగోలు చేసింది.వడ్డీతో సహా చెల్లిస్తున్నాడుఅయితే, నాడు పద్నాలుగేళ్ల పిల్లాడికి అంతమొత్తం చెల్లించి రాజస్తాన్ తొందరపడిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వైభవ్ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ తన అద్భుత ప్రదర్శనలతో వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుల జాబితాలోఅరంగేట్ర సీజన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో రాణించిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ దశలో 14 మ్యాచ్లలో కలిపి విధ్వంసకర సెంచరీ (36 బంతుల్లో) సాయంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 583 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో నిలిచాడు.ఒకప్పుడు రాజస్తాన్ పోస్టర్ బాయ్అదే సమయంలో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్లలో కలిపి కేవలం 397 పరుగులు చేశాడు. కాగా ఒకప్పుడు రాజస్తాన్ పోస్టర్ బాయ్గా యశస్వి ముందు వరుసలో ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని వైభవ్ ఆక్రమించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.భారత స్పిన్ దిగ్గజం, రాయల్స్ మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ ఆట తీరు వల్ల జైసూ ప్రభావితం అయ్యాడని.. అందుకే ఈ సీజన్లో సరిగ్గా ఆడలేకపోయాడని పేర్కొన్నాడు.జైసూ విఫలం.. వైభవ్ను నిందించిన అశూ!తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈసారి యశస్వి జైస్వాల్ ప్రదర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అంచనాలు అందుకోలేకపోయాడు. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండటమే ఇందుకు కారణం కావొచ్చు.అయితే, నాకు మరో సందేహం కూడా ఉంది. మరో ఎండ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం జైస్వాల్ను భయపెట్టిందని నాకు గట్టిగా అనిపిస్తోంది. నాకు తెలిసి వైభవ్ ఆట తీరు జైసూను కుదేలు చేసి.. గందరగోళంలోకి నెట్టేసి ఉంటుంది.సెహ్వాగ్- ఆకాశ్ మాదిరిటెస్టుల్లో టీమిండియా స్టార్లు వీరేందర్ సెహ్వాగ్- ఆకాశ్ చోప్రా ఓపెనింగ్ జోడీ మీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆకాశ్ చోప్రా బాగానే ఆడతాడు. 30- 40 రన్స్తో శుభారంభమే ఇస్తాడు. అయితే, సెహ్వాగ్ విధ్వంసకర ఆట తీరు కారణంగా ఆకాశ్ చోప్రా కనుమరుగైపోయేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ బాగా ఆడిన అనుభవం ఆకాశ్ చోప్రాకు ఉంది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.ఇప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీ ఊచకోత చూసి జైస్వాల్ కొద్దిగా షేక్ అయినట్లు కనిపిస్తోంది. ఓవైపు.. వైభవ్ చితక్కొడుతుంటే.. జైసూ బంతిని బాదేందుకు కష్టపడిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని అశూ పేర్కొన్నాడు.అశూ అభిప్రాయం సరైందేనా?అశ్విన్ అన్నట్లు వైభవ్ నిజంగానే జైసూను భయపెట్టాడా? అంటే.. నిజం కాకపోవచ్చనే అనిపిస్తోంది. 24 ఏళ్ల జైస్వాల్ 2020 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. టీమిండియా టెస్టు ఓపెనర్గానూ కావాల్సినంత అనుభవం ఉంది.నిజానికి వైభవ్ను చూస్తూ జైసూ భయపడుతున్నాడు అనడం కంటే.. 15 ఏళ్ల పిల్లాడిని స్ఫూర్తిగా తీసుకుని మరో ఎండ్లో సిక్సర్ల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. సీనియర్ ఓపెనర్గా మైదానంలో వైభవ్కు పెద్దన్నలా సలహాలు ఇస్తూ.. అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ ఝులిపించడంలోనూ జైసూ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఏదేమైనా వైభవ్ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం త్వరలోనే టీమిండియా ఓపెనర్గా సీనియర్లకు పోటీగా మారడం ఖాయం.చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్ ఫైర్ -
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు
ఐపీఎల్-2026లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. 6 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ త్వరగా అవుట్ అయినప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన పిన్న వయష్కుడిగా 15 ఏళ్ల వైభవ్ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడి 583 పరుగులు చేశాడు. 4 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ దేవ్దత్త్ పడిక్కల్ పేరిట ఉండేది. 2019/20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ కర్ణాటక తరఫున 580 పరుగులు చేశాడు. పడిక్కల్ 19 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజాగా ఇన్నింగ్స్తో పడిక్కల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ డూ ఆర్డై మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (27), ధ్రువ్ జురెల్ (38), దసున్ శనక (28), జోఫ్రా ఆర్చర్ (32) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై పోరాడుతోంది.చదవండి: మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!' -
‘హమ్మయ్య ఔట్ చేశా’.. వైభవ్ అంటే అంత భయమా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే పరమావధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజన్లో 14 మ్యాచ్ల్లో 583 పరుగులు సాధించి రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్తో రాజస్తాన్ ఆడిన తమ చివరి లీగ్ మ్యాచ్లో వైభవ్ నిరాశ పరిచాడు. చాహర్ వేసిన లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరబడిన వైభవ్ సూర్యవంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన నమన్ ధిర్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో వైభవ్ వికెట్ తీయగానే దీపక్ చాహర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హమ్మయ్యా ఔట్ చేశాను' అన్న తరహాలో చాహర్ సైగలు చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాహర్ వింత సెలబ్రేషన్ వెనుక ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. క్షణాల్లో ఆటను మార్చేసి ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్ల్లో అతడు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ అతని ఇంపాక్ట్ ఆటపై బలంగా ప్రభావం చూపించేది. అందుకే వైభవ్ను ఆరంభంలోనే ఔట్ చేయాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే సీజన్లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్లోనూ వైభవ్ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీపక్ చాహన్ ఈసారి పక్కా ప్రణాళికతో వైభవ్ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అందుకే పట్టరాని సంతోషంతో వినూత్న రీతిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు. 2025 సీజన్లోనూ వైభవ్ సూర్యవంశీ మంచి ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, ఈ సీజన్లో అతడి బలహీనతలు బయటపడతాయని అన్ని జట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్ ఆద్యంతం విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. pic.twitter.com/YXigIYta2M— crictalk (@crictalk7) May 24, 2026చదవండి: వెల్ డన్ అర్జున్.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్ -
కీలక మ్యాచ్లో తుస్సుమన్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 24) మధ్యాహ్నం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్పై ఈ మ్యాచ్తో దాదాపుగా క్లారిటీ వస్తుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఓడిందా ఇంటిముఖం పడుతుంది.ఇలాంటి కీలక మ్యాచ్లో రాజస్థాన్ టాస్ దగ్గరే సగం మ్యాచ్ కోల్పోయింది. టాస్ ఓడిన ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రత్యర్ది కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగాడు. బ్యాటింగ్కు వచ్చీ రాగానే రాజస్థాన్కు ఒకే స్కోర్ వద్ద రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17 బంతుల్లో 27; ఫోర్, 3 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (6 బంతుల్లో 4) నాలుగు బంతుల వ్యవధిలో 33 పరుగుల టీమ్ స్కోర్ వద్ద ఔటయ్యారు.ఈ పరిణామంతో రాజస్థాన్ ఢీలా పడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఫామ్లో ఉన్న ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో ఆ జట్టు డిఫెన్స్లో పడింది. ఈ మ్యాచ్లో వైభవ్పై రాజస్థాన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో ప్రారంభం నుంచి దుమ్మురేపిన వైభవ్ కీలక మ్యాచ్లో చేతులెత్తేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైభవ్ ఈ మ్యాచ్కు ముందు 13 మ్యాచ్ల్లో 232.27 స్ట్రయిక్రేట్తో 577 పరుగులు చేశాడు. ఇందులో 50 ఫోర్లు, 53 సిక్సర్లు సహా సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్, జైస్వాల్ వికెట్లు కోల్పోయిన మరికొద్ది సేపటికే రాజస్థాన్కు మరో షాక్ తగిలింది. 54 పరుగుల వద్ద కెప్టెన్ రియాన్ పరాగ్ (14) కూడా ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 60-3గా ఉంది. ధృవ్ జురెల్ (11), దసున్ షనక (2) క్రీజ్లో ఉన్నారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్, దీపక్ చాహర్, ఘజన్ఫర్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ రాజస్థాన్కు ప్రాణసంకటమే అయినా ముంబైకి మాత్రం సాధారణ మ్యాచ్గా ఉంది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ముంబైతో పాటు లక్నో, సీఎస్కే, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్తో పాటు పంజాబ్, కేకేఆర్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. అప్పుడు రేసులో పంజాబ్, కేకేఆర్ మిగిలి ఉంటాయి. రాత్రి ఢిల్లీతో జరిగే మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే, పంజాబ్తో పాటు 15 పాయింట్లు కలిగి ఉంటుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్ కలిగిన జట్టు ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్దడపడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న ఆర్సీబీ-గుజరాత్ క్వాలిఫయర్లో పోటీపడతాయి. -
BCCI: వరల్డ్కప్ ఓపెనర్ రేసులో ఊహించని పేరు!
భారత క్రికెట్లో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున, వరల్డ్కప్-2025లో సత్తా చాటాడు.గాలివాటం కాదుప్రపంచకప్ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్.. భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.భారత్-‘ఎ’ జట్టులో చోటుఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.రోహిత్కు గండంఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్కు జోడీగా ఇషాన్ కిషన్ను ఆడిస్తూ.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు ఇషాన్ ఎంపికయ్యాడు.జైసూ ఎదురుచూపులుఇక రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి.. ఈ సిరీస్లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.శ్రీలంకలో భారత్-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్కప్-2027 నేపథ్యంలో వైభవ్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ..ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్ జట్టులో చోటు‘‘వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్ కొనసాగిస్తే వన్డే వరల్డ్కప్-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’ -
టెన్షన్ వద్దు.. నేనున్నాగా.. కోచ్ కే ధైర్యం చెప్పిన బుడ్డోడు
-
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్గా మారింది. బీహార్కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్లాగే బీహార్కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్లోని సమస్తిపూర్కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్గంజ్లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ వైస్కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు
-
లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!
రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్లో చేరనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్తో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను సంజీవ్ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకోవడం విశేషం. మాటల సందర్భంలో లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు సంజీవ్ గోయెంకా అడిగినట్లు తెలుస్తోంది. అయితే కళ్లు చెదిరే మొత్తాన్ని వైభవ్కు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభవ్, ఆ తర్వాత ఆయనతో చాలాసేపు ముచ్చటించాడు. లక్నో జట్టులోకి వస్తాడా? రాడా అన్నది పక్కనబెడితే, వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అతడి టెక్నిక్, బ్యాటింగ్ రహస్యం గురించి చర్చించి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్కు ఆయన భారీ ఆఫర్ కూడా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఏడాది యాక్షన్ పూల్లో బరిలోకి దిగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీని తక్కువ ధరకే సొంతం చేసుకున్న రాజస్తాన్ రాయల్స్ అతడిని విడుదల చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అవసరమైతే ఎక్కువ అమౌంట్ను కోట్ చేసి వైభవ్ను తమ జట్టుతోనే అట్టిపెట్టుకునే అవకాశముంది. ఐపీఎల్ మెగావేలానికి మరో రెండేళ్లు ఉండడంతో అప్పటివరకు వైభవ్ సూర్యవంశీని తమతోనే ఉంచుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ తనంతట తానుగా రాజస్తాన్ నుంచి బయటికి వచ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలనుకుంటే మాత్రం అతన్ని దక్కించుకోవడానికి ఐపీఎల్లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం లేకపోలేదు. పట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో ఇవాళ ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలకు హాట్ కేక్లా మారిపోయాడు. అతడు వస్తానంటే ఎంత భారీ ధరకైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్లాడిన వైభవ్ 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో 221 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాన్ని బాటలు వేశాడు. ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ ఆ తర్వాత ఓటములతో ఢీలా పడింది. కానీ చివరి అంకంలో మళ్లీ ఫుంజుకున్న రాయల్స్ విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియన్స్తో జరగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాలని రాజస్తాన్ పట్టుదలతో ఉంది. ఇక టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభవ్కు ఇంకా సమయముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేసింది. మరి ఇండియా-ఏ తరఫున మ్యాచ్ల్లో వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.The world has seen your talent. The nation sees the future in you. That’s a lot of responsibility already on very young shoulders, very able ones at that. Preserve the innocence, keep honing your brilliance, and the world will be at your feet.Prayers, aashirwad, and love for… pic.twitter.com/LZS7pEe93s— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2026చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్ -
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం లక్నో సూపర్జెయింట్స్పై విజయం సాధించడం ద్వారా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ఆదివారం (మే 24న) ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా 16 పాయింట్లతో రాజస్తాన్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టనుంది. మ్యాచ్ విజయంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీదే కీలకపాత్ర. 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్తాన్ను గెలుపు తీరాలకు దగ్గర చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ మిగతాపనిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాతి 26 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతులతో విచిత్రమైన ఫోజు ఇచ్చాడు. దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్ పంచుకున్నాడు. మురళీ కార్తిక్తో వైభవ్ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ఇక నేను న్యూస్ పేపర్లు పెద్దగా చదవను. దీనివల్ల నా గురించి పేపర్లలో ఏం రాస్తున్నారన్నది తెలియదు. అయితే నా కెరీర్కు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా సుదీర్ఘమైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవలం ఆటపైనే తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో స్లోగా ఆడడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు.'మా జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను డగౌట్లో కూర్చున్నా. ఆ సమయంలో వికెట్ బాగుందనిపిచ్చింది. అయితే ఆదిలోనే తొందరపడితే మొదటికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ వేగంగా ఆడడంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ జైస్వాల్ ఔటయ్యేటప్పటికీ పిచ్పై పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగించాను. అయితే సెంచరీ మిస్ అవ్వడంపై కాస్త నిరాశకు లోనైనప్పటికీ జట్టును గెలిపించడం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్కు మరింత చేరువయ్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్పైనే ఉంది. ఆ మ్యాచ్లోనూ గెలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు.An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు! -
చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన అతడు.. ఈ సీజన్లో తన పరుగుల సంఖ్యను 579కి పెంచుకున్నాడు. తద్వారా ప్రపంచంలో ఏ టీ20 టోర్నీలోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. పంత్ 2018 ఎడిషన్లో 20 ఏళ్ల వయసులో (ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున) ఈ ఫీట్ను అందుకున్నాడు.ఈ మ్యాచ్లో వైభవ్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. ఇందులో మొదటిది ఈ సీజన్లో ఇప్పటివరకు 236.33 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసిన అతడు.. ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రయిక్రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 2019లో 204.8 స్ట్రయిక్రేట్తో ఈ ఫీట్ను సాధించాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా 200కు పైగా స్ట్రయిక్రేట్తో (202) పరుగులు చేశాడు. సిక్సర్ల ఫిఫ్టిఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. తద్వారా ఓ సింగిల్ సీజన్లో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓ సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (59) టాప్ ప్లేస్లో ఉన్నాడు.ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఈ సీజన్లో అతడి ‘స్లోయెస్ట్’ ఫిఫ్టీ కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్ విధ్వంసం ధాటికి లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు చేసుకుంది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. -
వైభవ్ ఊచకోత.. టాప్ 4లోకి రాజస్థాన్..
-
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు! -
వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్కు ఆ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జురెల్తో కలిసి వైభవ్ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. 𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx— IndianPremierLeague (@IPL) May 19, 2026Just when we thought we'd seen it all 😅🎥 How has that evaded the stumps? 😮Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/qxBKA8TMhS— IndianPremierLeague (@IPL) May 19, 2026 -
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
రాజస్తాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అఫ్గానిస్తాన్తో సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలను అగార్కర్ మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్లాట్కు వైభవ్ సూర్యవంశీ పేరును ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని ఒక విలేకరి ప్రశ్న సంధించాడు. దీనిపై అగార్కర్ ఆసక్తికరంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్లో సంచలన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. కానీ ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. ‘వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకముందే టీమిండియాలోకి వచ్చిన జైస్వాల్ను మనం మర్చిపోకూడదు. వైభవ్ అద్భుతంగా ఆడు తున్నప్పటికీ, అతడి కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇప్పటికే వైభవ్ ‘ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకు కూడా ఆడే అవకాశముంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇండియా-ఏ తరఫున వైభవ్ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ తరఫున ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ క్రీజులోకి అడుగుపెట్టడమే ఆలస్యం..ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.ఈ సీజన్లో 12 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అగార్కర్ టీమిండియాలో వైభవ్ ఎంపికకు ఇంకా సమయం ఉందని కుండబద్దలు కొట్టాడు.చదవండి: అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన -
వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.బౌండరీలు బాదుతూ స్టార్క్ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.ఈ ఏడాది సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో అభిషేక్ 42 సిక్సర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్తో అభిషేక్ను సూర్యవంశీ దాటేశాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి 486 పరుగులు చేశాడు.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే:వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026) అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024) శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025) విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024) సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025) -
వచ్చే నెలలోనే టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనికి భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేరారు. ఐపీఎల్-2026 తర్వాత ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు వైభవ్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని శాస్త్రి సూచించాడు. కాగా 15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 15 ఏళ్ల సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.56 స్ట్రైక్ రేట్తో 440 పరుగులు చేశాడు. ఈ బీహార్ చిచ్చర పిడుగు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. దీంతో వైభవ్ సీనియర్ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.వైభవ్ సూర్యవంశీ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయి. ఇది కచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి, వీలైనంత త్వరగా ప్రధాన జట్టులో భాగం చేయాలనుకుంటే అందుకు అత్యంత అనువైనది టీ20 ఫార్మాటే.వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అతడికి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు ప్రపంచ క్రికెట్లోని ఎన్నో జట్లలోకి నేరుగా వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు సంపాదించగలడు. యువతకు ఉండే ఆ ఉత్సాహం, తెగింపు అతడి బ్యాటింగ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.చాలామంది అతడికి 15 ఏళ్ళా? 16 ఏళ్ళా? 14 ఏళ్ళా?’ అని అడుగుతున్నాను. అది నాకు అనవసరం. తనకంటే రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ వయసున్న జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. వయసుతో అతడికి పనిలేదు. భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం వైభవ్ను భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది" అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జూన్లో శ్రీలంకలో జరగబోయే త్రైపాక్షిక సిరీస్ కోసం 'ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలఖారులో భారత సీనియర్ జట్టు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు -
భారత ‘ఎ’ జట్టులో వైభవ్ సూర్యవంశీ
న్యూఢిల్లీ: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి భారత సీనియర్ ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. బిహార్కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 11 మ్యాచ్లు ఆడి 440 పరుగులు చేశాడు. జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును గురువారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్లో భారత్తోపాటు అఫ్గానిస్తాన్, శ్రీలంక ‘ఎ’ జట్లు పాల్గొంటాయి. శ్రీలంక ‘ఎ’ జట్టుతో జూన్ 9న, 15న... అఫ్గానిస్తాన్ ‘ఎ’తో జూన్ 11న, 17న భారత్ ‘ఎ’ జట్టు ఆడుతుంది. జూన్ 21న ఫైనల్ జరుగుతుంది. భారత ‘ఎ’ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సుయాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర, విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యు«ద్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్. -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
ఈ ఏడాది జూన్లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు.ఇక ఈ జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్లలో 236.56 స్ట్రైక్-రేట్తో 440 పరుగులు సాధించాడు.ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా-ఎ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్లు గాలే వేదికగా జరగనున్నాయి.భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్చదవండి: హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు! -
'వైభవ్ సూర్యవంశీ కెరీర్కు ఆ రూల్ శాపం'
వైభవ్ సూర్యవంశీ... ఈ యువ క్రికెటర్ గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అద్భుత బ్యాటింగ్తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం ప్రస్తుతం ఐపీఎల్-2026లో కూడా దుమ్ములేపుతున్నాడు.వైభవ్ 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్లో అదరగొడుతున్న వైభవ్ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'ఇంపాక్ట్ సబ్' నిబంధన కారణంగా వైభవ్ ఒక ఆల్రౌండ్ క్రికెటర్గా ఎదగలేకపోతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో వైభవ్ను రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గానే వాడుకుంటోంది. రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఈ యంగ్ కిడ్ గ్రౌండ్లో కాకుండా బెంచ్పైనే కనిపిస్తున్నాడు."వైభవ్ సూర్యవంశీని కేవలం ఒక బ్యాటర్గా మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఒక క్రికెటర్ అంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. ఒక 'కంప్లీట్ క్రికెటర్'గా ఎదగాలంటే కచ్చితంగా ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంజమామ్ హల్ హక్ గొప్ప బ్యాటర్ మనందరికి తెలుసు. కానీ అతడు ఫీల్డ్లో కాస్త నెమ్మదిగా ఉంటాడు. అయినప్పటికి అతడు మైదానంలో ఉండి ఫీల్డింగ్ చేసేవాడు.ఫీల్డ్లో ఉంటేనే వారి లోపాలు, బలాలు అన్నీ స్పష్టంగా తెలిసేవి. కానీ ఇప్పుడు 'ఇంపాక్ట్ సబ్' వల్ల ఫీల్డ్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించడం లేదు. కేవలం 6 బంతులు ఆడే హిట్టింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ప్లేయర్లను వాడుకోవడం సరికాదు.ఆటగాడి నుంచి అన్ని కోణాలూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆశించకపోయినా, కనీసం అతను మైదానంలో ఉండి గేమ్ను ఆస్వాదించాలి. ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్లో రాణించాలనే కసి ఒక ఆటగాడి మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆటగాళ్లను కష్టపడే స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందుకే ఇంపాక్ట్ రూల్ను బీసీసీఐ రద్దు చేయాలని కోరుకుటున్నాను" అని మంజ్రేకర్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మ్యాచ్కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
వైభవ్ సరసన ప్రియాంశ్
పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ కెరీర్లో మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. 2026 ఎడిషన్లో భాగంగా నిన్న (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పవర్ప్లేలోనే హాఫ్ సెంచరీ బాది రికార్డుపుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బౌలర్నీ వదలకుండా కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్తో ప్రియాంశ్ పవర్ప్లేలో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సరసన చేరాడు. ఐపీఎల్ పవర్ప్లేల్లో అత్యధిక 50+ స్కోర్లు (భారత ఆటగాళ్లు):* వైభవ్ సూర్యవంశీ – 4* ప్రియాంశ్ ఆర్య – 3అలాగే ఐపీఎల్లో తొలి బంతికే (ఇన్నింగ్స్) అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి బంతికి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు:* యశస్వి జైస్వాల్ – 4* ప్రియాంశ్ ఆర్య – 3విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, సంజూ శాంసన్ తదితరులు తలో సారి ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్లు కొట్టారు.ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య రికార్డు ఇన్నింగ్స్తో చెలరేగినా పంజాబ్ కింగ్స్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రియాంశ్తో పాటు శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్) కూడా సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అద్భుత అర్ద సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. -
వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.ఐపీఎల్ 2026 సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో నాలుగోసారి సిక్సర్తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.చదవండి: సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్! -
వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్లో ఓవరాల్గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి. ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్లో 38 సిక్సర్లు, 2024 సీజన్లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్లో 37 సిక్సర్లు) ఉన్నారు.👉ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉 ఐపీఎల్ సీజన్లో ఇన్నింగ్స్ను సిక్సర్తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.MAKING IT A HABIT 🤩🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా? -
ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫునా.. అటు భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.టాప్-5లోఐపీఎల్-2026లో ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి 404 పరుగులు చేసిన వైభవ్.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన రీతిలో స్పందించాడు. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీతో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తనను తాను నిరూపించుకుంటున్న 22 ఏళ్ల జేకబ్ బెతెల్ను పోల్చాడు. ఈ మేరకు.. ‘‘గతంలోనూ ఇతడి పేరును నేను పలుమార్లు ప్రస్తావించాను.అతడు అత్యద్భుతమైన ఆటగాడు. అయితే, మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వయసులో తేడా ఉండవచ్చు కానీ.. అతడి ఆట వైభవ్ సూర్యవంశీని గుర్తుకుతెస్తుంది. ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే.ఇద్దరూ క్రికెట్ సూపర్స్టార్లుగా ఎదుగుతారుఅత్యద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. వీరిద్దరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇద్దరూ క్రికెట్ సూపర్స్టార్లుగా ఎదుగుతారు. ఈ క్రమంలో వారెంతో నేర్చుకుంటారు. అయితే, ముందుగా చెప్పినట్లు సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తేనే అంతా సజావుగా సాగుతుంది. నేను మాత్రం వీరి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.జేకబ్ వైభవ్లా చిన్నపిల్లాడు కాదని.. అయితే, ఇద్దరి బ్యాటింగ్ ఒకే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. జేకబ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ)తోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు డివిలియర్స్ తెలిపాడు. వైఫల్యాలే...కాగా ఇంగ్లండ్ ఓపెనర్గా జేకబ్ బెతెల్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. భవిష్య కెప్టెన్గానూ నీరాజనాలు అందుకుంటున్న అతడు.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియాపై 48 బంతుల్లోనే 105 పరుగులతో సత్తా చాటాడు. అయితే, జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బెతెల్కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఫిల్ సాల్ట్- విరాట్ కోహ్లి ఓపెనింగ్ జోడీగా కుదురుకోవడంతో అతడికి మొండిచేయి ఎదురవుతోంది. అయితే, సాల్ట్ వేలి గాయం కారణంగా దూరం కాగా.. బెతెల్కు అనూహ్యంగా అవకాశం వచ్చింది. కానీ అతడు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 43 పరుగులే చేశాడు.చదవండి: Shreyas Iyer: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
వైభవ్ సూర్యవంశీ 21 ఏళ్లకే రిటైరవుతాడు..!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసుకే దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో వైభవ్ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ బుడ్డోడి బీభత్సం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. త్వరలో ఇతగాడిని టీమిండియాకు ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అంటూ వేనోళ్లు కొనియాడుతున్నాయి.తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్ను పొగుడుతూనే, ఓ సరదా కామెంట్ చేశాడు. వైభవ్ ఇదే జోరును కొనసాగిస్తే 21 ఏళ్లకే బర్నౌట్ అవుతాడని అన్నాడు. ఆ వయసుకే కావాల్సినంత డబ్బు సంపాదించుకొని రిటైరవుతాడని చమత్కరించాడు. ‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్కాస్ట్లో టఫ్నెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ లాంటి ఇతర ఇంగ్లండ్ దిగ్గజాలతో కలిసి పాల్గొన్న ఈ షోలో టఫ్నెల్ వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతడి ఐపీఎల్ 2026 ప్రదర్శనలను కొనియాడాడు.తరుచూ టీమిండియా క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కే మైఖేల్ వాన్ కూడా వైభవ్ను ఈ సందర్భంగా ప్రశంసించాడు. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర యోధుడు కెరీర్ మధ్యలో 30 బంతుల్లో సెంచరీ చేస్తే వైభవ్ కెరీర్ ప్రారంభంలో, అదీ 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతక్కొట్టాడని కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లు కొట్టి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడని అన్నాడు.మరో ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ వైభవ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ సిక్స్ హిట్టర్ అని ఆకాశానికెత్తాడు. మొత్తంగా తొలిసారి ఇంగ్లండ్ దిగ్గజాలంతా వైభవ్ను ముక్తకంఠంతో కొనియాడారు.కాగా, 2011 మార్చి 27న జన్మించిన వైభవ్.. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్లో చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడి విధ్వంసం తారాస్థాయిలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్.. 40.40 సగటున, 237.65 స్ట్రయిక్రేట్తో ఓ సెంచరీ, రెండు అర్ద సెంచరీల సాయంతో 404 పరుగులు చేసి, తన జట్టు (రాజస్థాన్ రాయల్స్) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. -
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!
వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 జట్టును ఎంచుకున్నారు. తన ఎంపిక చేసిన జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బిషప్ చోటు ఇచ్చారు.ఐపీఎల్-2026లో అద్భుతంగా రాణిస్తున్న మరో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు కాదని వైభవ్ వైపు ఆయన మొగ్గు చూపుడం గమనార్హం.వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్గా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఆయన ఛాన్స్ ఇచ్చారు.ఈ బ్యాకప్ ఓపెనర్గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్కు చోటు దక్కింది. ఓ ఇంటర్వ్యూలో బిషప్ మాట్లాడుతూ.. "నా జట్టులో ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటాను. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం లెఫ్ట్ హ్యాండర్గా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేస్తాను. అతడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను" చెప్పుకొచ్చారు.ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, దేవ్దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ వంటి స్టార్ ప్లేయర్లకు బిషప్ అవకాశమిచ్చారు. ఆల్రౌండర్లగా కృనాల్ పాండ్యా, నితీశ్ కుమార్లను ఆయన ఎంచుకున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్గా ధ్రువ్ జురెల్కు ఛాన్స్ లభించింది.ముఖ్యంగా 35 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం. దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న చాహల్ను, రవి బిష్ణోయ్ను పక్కన పెట్టి మరి ఛాన్స్ ఇచ్చారు. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఉన్నారు.ఐర్లాండ్ టూర్కు వైభవ్!కాగా ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలకు సీనియర్ జట్టులో చోటు దక్కే అవకాశముంది. వైభవ్ ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 237.65 స్ట్రైక్ రేట్తో 404 పరుగులు చేశాడు.ఇయాన్ బిషప్ ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు: శుభ్మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
-
పూరన్ సిక్సర్ల వర్షం.. దెబ్బకు వైభవ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్ను ఝూళిపించాడు. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పూరన్.. తన తుఫాన్ బ్యాటింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న 8 సిక్సర్లు, ఒక ఫోర్తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. పూరన్ ఇప్పటివరకు 5 సార్లు 20 కంటే తక్కువ బాల్స్లోనే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు వైభవ్ సూర్యవంశీ(4) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో వైభవ్ను పూరన్ అధిగమించాడు. ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ(6) అగ్రస్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే..లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు.చదవండి: 'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్' -
'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'
ఐపీఎల్-2026 సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, టెక్నికల్గా మాత్రం ఇంకా చాలా మెరుగుపడాలి అని మంజ్రేకర్ అన్నాడు. అంతేకాకుండా భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు సూర్యవంశీకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు. కాగా వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, హేజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం విడిచిపెట్టలేదు.ఐపీఎల్ సీజన్కు ముందు జరిగిన అండర్-19 వరల్డ్కప్లోనూ వైభవ్ దుమ్ములేపాడు. దీంతో సంజయ్ మంజ్రేకర్ మాత్రమే కాకుండా సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు."వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై సెంచరీ, ఐపీఎల్లో ఫామ్ను బట్టి చూస్తే భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు. ఐపీఎల్ వంటి మహా వేదికపై ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే, కచ్చితంగా జాతీయ జట్టు అరంగేట్రానికి సిద్దంగా ఉన్నట్లే.ఇప్పుడు వైభవ్ కూడా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుత భారత టీ20 జట్టులో ఇప్పటికే ఓపెనింగ్ స్ధానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి వారు కూడా ఓపెనర్లగా రాణిస్తున్నారు.ఈ క్రమంలో వైభవ్ను ఓపెనర్గా ఆడిస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైభవ్కు మంచి టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్సైడ్లో షాట్లు కొడుతున్నాడు. ఇది కేవలం టీ20ల మాత్రమే సరిపోతుంది. టెస్టులకు సరిపోదు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి పిచ్లపై రాణించాలంటే బంతికి దగ్గరగా వెళ్లి ఆడాలి. ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడితే పరుగులు సాధించలేరు. టీ20 క్రికెట్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు మీకు మంచి పేరును తీసుకురావచ్చు. కానీ నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్లో రాణిస్తానే దక్కుతుందని" మంజ్రేకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. -
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
-
వైభవ్ సూర్యవంశీ 'అన్ ప్రొఫెషనల్'?.. తన వ్యాఖ్యలపై జితేష్ క్లారిటీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ "అన్ప్రొఫెషనల్" అనడం సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. జితేష్ ఇటీవల సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జితీష్ మాట్లాడుతూ.. "వైభవ్కు అస్సలు ప్రొఫెషనలిజం లేదు. ప్రతీ ఒక్కరూ అతడిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు మైదానంలో బాగానే ఉంటున్నాడు. కానీ ఆఫ్ది ఫీల్డ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాడు. నేనూ అతడిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినవద్దని చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట వినడం లేదు అని చెప్పుకొచ్చాడు.అయితే వైభవ్ పట్ల జితేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి. తను చేసిన కామెంట్స్పై తాజాగా జితేష్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ తనకు మంచి స్నేహితుడని, ఆన్ది ఫీల్డ్, ఆఫ్ది ఫీల్డ్ ఎలా ఉంటాడో అన్నది వివరించాని జితేష్ తెలిపాడు. తన వ్యాఖ్యలను తప్పు ఆర్ధంగా చేసుకున్నారని ఓ పాడ్కాస్ట్లో అతడు చెప్పుకొచ్చాడు."వైభవ్ 15 ఏళ్ల పిల్లవాడు. అతడికి ఐస్క్రీమ్ అంటే చాలా ఇష్టం. అతడు నా గదికి వచ్చి కూడా ఐస్క్రీమ్ తింటాడు. నేను తినను, అతడు మాత్రమే తింటాడు. ఒక చిన్న పిల్లాడు ఐస్క్రీమ్ కాకుండా ఇంకేం తింటాడు? వైభవ్తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు మా ఇంటికి కూడా వస్తాడు, నా భార్యతో మాట్లాడతాడు.యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటాడు. అతడు నాకు తమ్ముడి లాంటి వాడు. బయట వ్యక్తులు ఏమునుకున్నా నేను పట్టించుకోను. నేను అతడి అల్లరిని ఉద్దేశించి ప్రొఫెషనల్గా లేడు అన్నా. అతడు అంత చిన్న వయస్సులో అద్బుతంగా రాణిస్తున్నాడు కాబట్టి, అందరూ అతడి నుంచి ఎక్కువగా క్రమశిక్షణను ఆశిస్తున్నారు. కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే.. అతడికి ఇంకా 15 ఏళ్లే. ఒక చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడిలాగే ఉండనివ్వండి. నేను అతడికి పూర్తి స్వేఛ్చ ఇస్తాను. నీకు ఇంకా పదిహేనేళ్లే కదా, టీవీ చూసుకో, నీకు నచ్చినవి తిను, కేవలం నీ బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టు అని చెబుతూ ఉంటా" అని జితీష్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 404 పరుగులు చేశాడు. -
‘చైల్డ్ లేబర్.. FIR వేయిస్తా.. వైభవ్ చదువుకోవాలి’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్ క్యాప్ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్లో యాక్టివిస్ట్గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్ను ఐపీఎల్లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
‘జీవితంలో ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు’
న్యూజిలాండ్ స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైలీ జెమీసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో పదిహేనేళ్ల పిల్లాడికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. అతడిని అవుట్ చేసేందుకు ఆసీస్ దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్తో చర్చించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టాడుఅవును.. జెమీసన్ చెప్తున్నది రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే!.. ఐపీఎల్-2026లో ఈ లెఫ్లాండర్ బ్యాటర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో తన ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు వైభవ్. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఎదురుగా ఎవరున్నా డోంట్ కేర్ఇక ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచస్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనూ సిక్సర్లు బాది తన బ్యాట్ పవరేంటో మరోసారి చాటిచెప్పాడు వైభవ్. ఎదురుగా ఎంతటి దిగ్గజ బౌలర్ ఉన్నా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పిండుకుంటున్నాడు.నేనూ భయపడ్డాఈ నేపథ్యంలో తాను సైతం వైభవ్ సూర్యవంశీ విషయంలో భయపడ్డాడని కివీస్ స్టార్, ఢిల్లీ పేసర్ కైలీ జెమీసన్ అన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ రాజస్తాన్తో తలపడ్డ సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా టాస్ గెలిచిన రాజస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, ప్రతీ మ్యాచ్లోనూ అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4)లను త్వరగానే వెనక్కి పంపడంలో ఢిల్లీ సఫలమైంది. వైభవ్ను జెమీసన్ బౌల్డ్ చేయగా.. జైసూను మిచెల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు.ఢిల్లీ గెలుపుఓపెనర్లు విఫలమైనా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ధ్రువ్ జురెల్ (42), డొనోవాన్ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్)లతో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ (50 బంతుల్లో 90) ఇన్నింగ్స్ ఇందుకు కారణం.అయితే, 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అనూహ్య రీతిలో ఊదిపారేసింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (33 బంతుల్లో 62), కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75).. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా (17 బంతుల్లో 33) వేగంగా ఆడి పని పూర్తి చేశారు.ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదుఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని త్వరగా పెవిలియన్కు పంపేలా తాను ముందు నుంచే సన్నద్ధమయ్యాయని జెమీసన్ తాజాగా వెల్లడించాడు. ‘‘పదిహేనేళ్ల పిల్లాడికి కూడా ఇంతలా భయపడే రోజు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.అతడిని అవుట్ చేసేందుకు మేము ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించుకున్నాము. అందుకు తగ్గ ఫలితం వచ్చింది’’ అని జెమీసన్ చెప్పుకొచ్చాడు. రాజస్తాన్కు కీలకమైన ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు తానూ, స్టార్క్ ప్లాన్ వేశామని.. అనుకున్నట్లే ఆరంభంలోనే వారిని వెనక్కి పంపామని హర్షం వ్యక్తం చేశాడు.కాగా 15 ఏళ్ల వైభవ్ను అవుట్ చేసిన తర్వాత.. 31 ఏళ్ల జెమీసన్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. దీంతో బీసీసీఐ జెమీసన్ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'That is absolute class! 😮💨#KyleJamieson with a ripper to knock over #VaibhavSooryavanshi!🤯#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/MZ8LkaCvca— Star Sports (@StarSportsIndia) May 1, 2026 -
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
-
‘ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి.. వాళ్లిద్దరు అద్భుతం’
ఐపీఎల్లో ట్రోఫీలు గెలవకుండా ఎన్ని వ్యక్తిగత మైలురాళ్లు సాధించినా వాటికి విలువ ఉండదని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, భారత సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న రాహుల్... ఇటీవలే లీగ్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని అధిగమించాడు. ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలిఐపీఎల్లో ధోనీ 5439 పరుగులు చేయగా... తాజాగా రాహుల్ అతడిని దాటేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్లో మహీ భాయ్ పరుగులను దాటేశానని కూడా నాకు తెలియదు. వ్యక్తిగత మైలురాళ్లు మంచివే. సరైన దిశలోనే ఉన్నామని అవి భరోసా ఇస్తాయి. కానీ అసలైంది మాత్రం నిలకడగా ట్రోఫీలు గెలవడమే. ధోనీ గెలిచినన్ని ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.క్రికెట్ వ్యక్తిగత క్రీడ కాదు. టీమ్ స్పోర్ట్. అందుకే విజయవంతమైన జట్లలో భాగం కావాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటా’ అని రాహుల్ అన్నాడు. చిన్నప్పటి నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... అందుకే అక్కడ మ్యాచ్ అంటే భావోద్వేగానికి గురవుతానని రాహుల్ చెప్పాడు.నాకు బెంగళూరు అలాంటిదే‘కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనే అని కాదు. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడినా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మీరు చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. నాకు బెంగళూరు అలాంటిదే. అక్కడ క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలని అనుకుంటా. కొత్తతరం ప్లేయర్లు బౌలర్ చరిత్ర చూసి షాట్లు ఆడటం లేదు’ అని రాహుల్ వివరించాడు.వైభవ్, ఆయుశ్ అద్భుతంవైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు... ప్రపంచస్థాయి బౌలర్లయిన బుమ్రా, కమిన్స్లను ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం తడబడటం లేదన్నాడు రాహుల్. అవకాశం ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆధునిక టీ20 క్రికెట్కు ఇలాంటి మనస్తత్వమే అవసరమని రాహుల్ వెల్లడించాడు. వైభవ్, ఆయుశ్ మాత్రే వంటి వాళ్లు టీ20లు ఆడే విధానాన్ని మార్చేస్తున్నారని రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్కు బీసీసీఐ షాకిచ్చింది. జేమీసన్ను హెచ్చరించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్ను చేర్చింది.ఏమి జరిగిందంటే?రాజస్తాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జేమీసన్ బౌలింగ్లో వైభవ్ తన ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి పంపాడు. అయితే మరుసటి బంతికే జేమీసన్ ఒక అద్భుతమైన డెలివరీతో వైభవ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు.ఈ కివీ స్పీడ్ స్టార్ 15 ఏళ్ల వైభవ్ వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెండాఫ్ ఇచ్చాడు. అతడి ప్రవర్తనపై ఫీల్డ్ అంపైర్లు సైతం అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు 15 ఏళ్ల పిల్లోడుపై నీ ప్రతాపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు బోర్డు నిర్ధారించింది. దీంతో బీసీసీఐ అతడిపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 🫡But that Celebration pic.twitter.com/c1kQZv9UbM— Shobhit Chandrawanshi (@Shobhit202518) May 1, 2026 -
వైభవ్ క్లీన్ బౌల్డ్.. ఓవరాక్షన్ చేసిన ఢిల్లీ బౌలర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆదిలోనే షాక్లుతొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) బంతుల వ్యవధిలో ఔటయ్యారు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన జైస్వాల్.. మూడో బంతికి స్టార్క్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.7 బంతుల తర్వాత వైభవ్ జేమీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్.. ఆతర్వాత బంతికే జేమీసన్ వేసిన అద్భుతమైన యార్కర్కు దొరికాడు. ఈ సీజన్లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న వైభవ్ను ఔట్ చేసిన ఆనందంలో జేమీసన్ ఓవరాక్షన్ చేశాడు.An in-swinging yorker 😲🔥🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊Wait for the celebration 👀Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3— IndianPremierLeague (@IPL) May 1, 2026ముఖానికి దగ్గరగా వెళ్లి ఆరుస్తూ, చప్పట్లు కొట్టాడు. జేమీసన్ చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడి పట్ల ఈ ప్రవర్తన సరికాదని అంటున్నారు.బీసీసీఐ చర్య తీసుకుంటుందా..?ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా లేదా బెదిరించేలా ప్రవర్తిస్తే మ్యాచ్ రిఫరీ చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణ ఆగ్రహావేశ సెలబ్రేషన్గా పరిగణిస్తారా, లేక కోడ్ ఉల్లంఘనగా భావిస్తారా అన్నది మ్యాచ్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్స్ 10.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును తాకింది. జైస్వాల్, సూర్యవంశీ ఔట్ కాగా.. జురెల్ (35), కెప్టెన్ రియాన్ పరాగ్ (54) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ -
వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే: విండీస్ దిగ్గజం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. యశస్వి జైస్వాల్తో కలిసి రాజస్తాన్కు శుభారంభాలు అందిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 400 పరుగులు సాధించాడు.ఫాస్టెస్ట్ సెంచరీలుతద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-3లో కొనసాగుతున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో పనిలేకుండా బంతిని బాదడమే తన పని అంటున్న వైభవ్.. వరల్డ్క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా చుక్కలు చూపించాడు.బుమ్రాను వదల్లేదుముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బుమ్రాకు సిక్సర్తో స్వాగతం పలికిన 15 ఏళ్ల వైభవ్.. అతడి బౌలింగ్లోనే మరో సిక్స్ కూడా పిండుకున్నాడు. దీంతో మహామహ బౌలర్లు సైతం వైభవ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేడయం ఎలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం, క్రిక్ఇన్ఫో కామెంటేటర్ ఇయాన్ బిషప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టెక్నికల్గా చెప్పాలంటే... అతడి బ్యాట్ స్వింగ్ అయ్యే విధానం యూనిక్గా ఉంటుంది. బేస్బాల్ మాదిరి స్వింగ్ అని చెప్పవచ్చు.We’ve seen this shot before 🚁 😉 Vaibhav Sooryavanshi gives Rajasthan Royals the perfect start in this chase. 💪#TATAIPL 2026 ➡️ #PBKSvRR | LIVE NOW 👉https://t.co/saW6caCqT8 pic.twitter.com/A5EgtrJ0Sp— Star Sports (@StarSportsIndia) April 28, 2026బ్యాటింగ్లో అతడి బలహీనత ఏమిటో కచ్చితంగా ఇదీ అని చెప్పడం కష్టం. అయితే, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ (సాధారణంగా బ్యాటర్కు 7-8 మీటర్ల దూరంలో బాల్ను సంధిస్తే.. బంతి ఎక్కువగా బౌన్స్ అయి బ్యాటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది)తో అతడిని బోల్తా కొట్టించవచ్చు.పొరపాటున మిస్సయిందో!అయితే, బంతి త్వరగా టాప్ ఎడ్జ్కు గనుక రాకపోతే.. అతడు ఆ బాల్ను సిక్సర్గా మలచడం ఖాయం. అందుకే వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పలేమని ముందే చెప్పాను’’ అని ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. కాగా కేవలం టీ20లలోనే కాకుండా వైభవ్ భారత్ అండర్-19 జట్టు తరఫున ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ ఇటీవల వరల్డ్కప్ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు! -
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
-
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్కు చెక్పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్తో రాజస్తాన్ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
పాక్ ‘ఏఐ’ చిప్.. వైభవ్ అదిరిపోయే రిప్లై!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులోనే అద్భత బ్యాటింగ్తో అదరగొడుతున్న వైభవ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై అనుమానముందని, ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చని, వెంటనే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అనలిస్ట్కు వైభవ్ తన స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్కు ఆ ఏఐ చిప్ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.అసలేం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్ను అందుకునేందుకు వైభవ్కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. 2024 సీజన్లో అభిషేక్ శర్మ (195 బంతులు), 2025 సీజన్లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్లో మ్యాక్స్వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.𝘉𝘢𝘵 𝘱𝘦 𝘈𝘐 𝘤𝘩𝘪𝘱 𝘩𝘢𝘪 𝘬𝘺𝘢 𝘵𝘶𝘮𝘩𝘢𝘳𝘦?Vaibhav answers 😂💗 pic.twitter.com/uZcqABbaGS— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2026చదవండి: ‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’ -
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్కు చుక్కలు చూపించిన వైభవ్.. తాజాగా అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి స్పీడ్ స్టార్లను ఉతికారేశాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ మరో సిక్స్ కొట్టి ఉంటే ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించేందుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 511 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 99 సిక్సర్లు బాదాడు.మరో సిక్సర్ బాదితో ఈ చారిత్రత్మక రికార్డు అతడి సొంతం అవుతుంది. ప్రస్తుతం ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్(843 బంతులు) ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో మే1న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పొలార్డ్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది.కాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు.చదవండి: IND vs AFG: సంజూ, కిషన్లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్ -
వైభవ్ సూర్యవంశీపై విద్వేష విషం.. వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్, భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.36 బంతుల్లోనే శతకంఇక తాజాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.ఆరెంజ్ క్యాప్తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్టాండర్కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో... టీమ్ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది.విద్వేష విషంఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్ ఎందుకు?’’ అంటూ వైభవ్పై విద్వేష విషం చిమ్మారు.Shameless how grown men are mocking a 15-year-old for 'attitude.' He’s just a kid trying to process the pressure of being a professional athlete. Let him breathe.💔 pic.twitter.com/HrDY6uY33D— CSK Xtra (@Im_Kushall) April 28, 2026సిగ్గులేకుండా..అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
‘వైభవ్తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభమివ్వగా.. ఆఖర్లో శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజస్తాన్ను గెలిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సూర్యవంశీకి అందించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్లో ఉన్న ప్రతిభ అసాధారణం.’ అని తెలిపాడు. కాగా జైస్వాల్ వయసు 24 ఏండ్లు కాగా.. వైభవ్ సూర్యవంశీకి 15 ఏండ్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మ్యాచ్ గెలవడంపై కూడా జైస్వాల్ స్పందించాడు. ‘ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం. అందరూ ప్రతి మ్యాచ్లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.ఇక సీజన్లో జైస్వాల్ 9 మ్యాచ్ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.The duo that is fun to watch on the pitch and even off it 😄 💪🎥 Hear from Yashasvi Jaiswal on how it is batting with Vaibhav Sooryavanshi 🩷🤝#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/HICh8l5VIc— IndianPremierLeague (@IPL) April 28, 2026చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే? -
వైభవ్ సూర్యవంశీపై ఒలంపిక్స్ విజేత మనూ భాకర్ కామెంట్స్ వైరల్..
-
టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ
భారత టీ20 జట్టులో స్థానం కోసం పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ రేసులో ముందు వరుసలో ఉండగా.. దేవదత్ పడిక్కల్, ఆకిబ్ నబీ, ప్రియాన్ష్ ఆర్య, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.చివరగా అపుడేఅయితే, వీరందరి కంటే అర్హుడైన ఆటగాడు మరొకడు ఉన్నాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. గత మూడేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన భారత జట్టుతో ప్రయాణించాడు జైసూ. ఆ తర్వాత శ్రీలంకతో జూలైలో జరిగిన సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా జైస్వాల్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో.. 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. పంజాబ్పై రాజస్తాన్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ‘‘గత మూడేళ్లుగా అతడి గణాంకాలు పరిశీలించండి. 2024లో వరల్డ్కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించేశారు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే.అయితే, యశస్వి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. అతడిని కచ్చితంగా భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని నేను అనడం లేదు. జట్టులో ఇప్పుడు చోటు ఖాళీగా లేదని నాకు కూడా తెలుసు.సెలక్షన్ సంగతి పక్కనపెడితే..కానీ ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. గత మూడేళ్లుగా అతడు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సగటు, స్ట్రైక్రేటు కూడా బాగుంది. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయినా సరే సెలక్షన్ సంగతి పక్కనపెడితే.. కనీసం చర్చల్లో కూడా ఎవరూ అతడి పేరు తీసుకురావడం లేదు.గంజిలో ఈగ లాగా తీసిపారేశారు. అతడు చేసిన తప్పేంటి?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 306 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతేడాది 14 మ్యాచ్లలో కలిపి 559.. అదే విధంగా 2024లో 16 మ్యాచ్లలో కలిపి 435 పరుగులు సాధించాడు యశస్వి జైస్వాల్. చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. ఈ బిహార్ కుర్రాడు కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ప్రస్తుత సీజన్లో వైభవ్ 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సరికొత్త చరిత్ర👉ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ దిగ్గంజ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. 2019 సీజన్లో రస్సెల్ 188 బంతుల్లో 400 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్తో రస్సెల్ను వైభవ్ అధిగమించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.👉అదేవిధంగా ఒకే సీజన్లో 400 పైగా పరుగులు చేసిన అత్యంత పిన్నవయష్కిడిగా తిలక్ వర్మ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. తిలక్ 20 ఏళ్ల వయస్సులో ముంబై ఇండియన్స్ తరపున 2023 సీజన్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.👉అలాగే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లతో రిషబ్ పంత్తో కలిసి సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (42), శ్రేయాస్ అయ్యర్ (39) అగ్రస్థానాల్లో ఉన్నారు.ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 238.10 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ వైభవ్ వద్దే ఉంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్? -
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త -
వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో నిలుస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఆడేందుకు ముల్లన్పూర్కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 234 స్ట్రైక్రేట్తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను మంగళవారం పంజాబ్ కింగ్స్తో ఆడనుంది.Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026చదవండి: గిల్పై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు! -
‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచనల బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతున్న వైభవ్ సూర్యవంశీ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో శతకంతో రెచ్చిపోయాడు. ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ 234 స్ట్రైక్రేట్తో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. వైభవ్ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్ను ఏమైనా ఇన్స్టాల్ చేశారేమోనని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. టీనేజీ వయసులో ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం. ఇప్పుడు వైభవ్కు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశముంది.నిజానికి అతడి బ్యాటింగ్లో పెద్దగా టెక్నిక్స్ కనిపించవు. కానీ అతడి మణికట్టు బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కుల చూపిస్తూ డేంజరస్ బ్యాటర్గా తయారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను మంగళవారం పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. -
వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు దేవ్దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ అద్బుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్వయంగా పడిక్కల్ను భారత జట్టు ఎంపిక చేయాలని సిఫారస్సు చేశాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్లోనూ చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తారని, అందరిని జాతీయ జట్టులోకి తీసుకోవాలంటే కుదరదని సెహ్వాగ్ అన్నాడు. కాగా పడిక్కల్ ఎప్పుడో ఐదేళ్ల కింద భారత తరపున రెండు టీ20లు ఆడగా.. పాటిదార్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు."పడిక్కల్ను కచ్చితంగా మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని దినేష్ కార్తీక్ అంటున్నాడు. అయితే ప్రతీ సీజన్లోనూ చాలా మంది అత్యుత్తమ ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు ఆశిస్తుంటారు. ఐపీఎల్లో బాగా ఆడిన ప్రతీ ఒక్కరికి తీసుకోవాలంటే ఎక్కడ అవుతోంది? భారత జట్టులో ప్రస్తుతం అస్సలు ఖాళీ ఉందా? భారత టీ20 సెటాప్ ప్రస్తుతం అద్భుతంగా ఉంది.ఇటీవలే వారు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. కాబట్టి రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు ప్రస్తుతం జట్టులో స్థానం లేదు. వీరికే కాదు యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్కు కూడా చోటు లేదు. ఈ ఐదుగురికి అవకాశమివ్వాలంటే ఎవరిని జట్టు నుంచి తీసేయాలి చెప్పండి?" అంటూ క్రిక్బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: Rishabh Pant: ఐపీఎల్కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా? -
నన్నే అంటావా?.. అందుకే చితక్కొట్టా: వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా వైభవ్.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.బ్యాట్తోనే సమాధానంతద్వారా ఐపీఎల్లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. గతేడాది గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే వైభవ్ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్రైజర్స్పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగేకు వైభవ్ కౌంటర్ వేశాడు.నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదుసన్రైజర్స్తో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తమ మేనేజర్ రోమీ భిందర్తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్కు దిగాను. గత మ్యాచ్లో నన్ను అతడు అవుట్ చేశాడు.ఆరోజు నేను నా ఫోన్ చెక్ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్ ఈ మేరకు స్పందించాడు.గత మ్యాచ్లో తొలి బంతికేకాగా సన్రైజర్స్తో ఆడిన గత మ్యాచ్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో తొలి బంతికే అవుటైన వైభవ్ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్... కమిన్స్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్ కొట్టాడు.మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా అవుట్ కాగా... వైభవ్ ఇచ్చిన క్యాచ్ను రైజర్స్ ఫీల్డర్ అనికేత్ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వైభవ్పై హింగే కామెంట్స్సకీబ్ ఓవర్లో వరుసగా 6, 4, 6తో వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్ సెంచరీ వృథా అయింది.కాగా హైదరాబాద్లో వైభవ్ను అవుట్ చేసిన తర్వాత ప్రఫుల్ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్) బౌన్సర్ వేసి అవుట్ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా జైపూర్లో వైభవ్ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాంA first-ball duck a few days ago to the fastest century by an Indian last night. Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026 -
'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్పై నెమ్మదిగా ఆడు'
ఐపీఎల్-2026 సీజన్లో శనివారం జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు."వైభవ్ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో తనకు వివరించాను. అతడు నిజంగా ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు గనుక మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు తలుచుకుంటుంటే భయమేస్తోంది. అతడి వికెట్ తీయడం మాకు కలిసొచ్చింది" అని కిషన్ వెల్లడించాడు.అంతేకాకుండా మా జట్టుపై కొంచెం నెమ్మదిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభవ్ను హెచ్చరించినట్లు కిషన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్ -
అతడొక అద్భుతం.. నా ఫేవరేట్ ప్లేయర్: కమ్మిన్స్
ఐపీఎల్-2026లో శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సంచలన సెంచరీతో చెలరేగాడు. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడు వైభవ్ ఆటతీరుకు సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సైతం ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం వైభవ్పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అతడు బ్యాటింగ్ స్కిల్స్ నిజంగా అద్భుతం. బంతిని చాలా బలంగా కొడుతున్నాడు. వైభవ్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అతడికి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం లైన్ తప్పినా బంతిని మైదానం వెలుపల పడటం ఖాయమని" కమ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో సూర్యవంశీ.. కమ్మిన్స్ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు. కాగా15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే వరల్డ్క్లాస్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్, అర్ష్దీప్ సింగ్లకు తన పవర్ ఏంటో చూపించాడు. ఈ ఏడాది సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 357 పరుగులు చేశాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్ -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్లే అయ్యాయి. రెండు మ్యాచ్ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్తో సోషల్మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
-
వైభవ్ సూర్యవంశీ గాయంపై అధికారిక అప్డేట్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసి భీకర ఫామ్లో ఉండిన వైభవ్ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.వైభవ్ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్ అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెక్ పెట్టాడు. వైభవ్ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.రాథోడ్ మాటల్లో.. "వైభవ్ హ్యామ్స్ట్రింగ్లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.రాథోడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్ రాయల్స్ తదుపరి మ్యాచ్ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 28న పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. ఆ మ్యాచ్ సమయానికి వైభవ్ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఒకవేళ వైభవ్ ఆ మ్యాచ్ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో వైభవ్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో రాయల్స్ పరాజయంపాలైంది. -
వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్ నుంచి అవుట్?
ఐపీఎల్-2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యవంశీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో వైభవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా కొంచెం అతడికి నొప్పి తగ్గలేదు. వైభవ్ నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇది నిజంగా రాజస్తాన్ రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. వైభవ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా భారీ సెంచరీతో సూర్యవంశీ చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో వైభవ్ గాయపడడం రాజస్తాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఒకవేళ వైభవ్ గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను వైభవ్ వైదొలగనున్నాడు.కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్తో పాటు అతడితో పాటు పాటు ధ్రువ్ జురెల్(51), ఫెరీరా(33) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, షకీబ్ హసన్, నితీశ్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు వరల్డ్ రికార్డ్స్ బ్రేక్
ఐపీఎల్-2026లో జైపూర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వైభవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశాడు.గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు సైతం చుక్కలు చూపించాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.వైభవ్ మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్లో తన హాఫ్ సెంచరీని వైభవ్ కేవలం 15 బంతుల్లోనే సాధించాడు. వైభవ్ ఈ ఏడాది సీజన్లో హాఫ్ సెంచరీ కేవలం 15 బంతుల్లో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన సంచలన రికార్డులు ఇవే👉ఐపీఎల్లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(గేల్ 21 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది.👉టీ20 ఫార్మాట్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డు సాధించాడు. కేవలం 26 ఇన్నింగ్స్ల్లోనే సూర్యవంశీ ఈ రికార్డును అందుకున్నాడు.👉ఐపీఎల్లో 20 ఏళ్ల లోపు వయసులో 5 కంటే ఎక్కువసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ రికార్డులకెక్కాడు. వైభవ్ మూడు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.👉అదేవిధంగా ఇది ఐపీఎల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి స్ధానంలో క్రిస్ గేల్(30) ఉండగా.. సెకెండ్ ప్లేస్లో సూర్యవంశీ(35)నే ఉన్నాడు.Records under threat every time he bats 🔥Vaibhav Sooryavanshi hits a 36-ball century, third-fastest in #TATAIPL history. #TATAIPL 2026 | #RRvSRH | LIVE NOW 👉https://t.co/HHSiOA288w pic.twitter.com/NggaHKljUS— Star Sports (@StarSportsIndia) April 25, 2026 -
వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడచూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్న ఈ బిహారీ పిల్లాడిని.. త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పదిహేనేళ్ల వయసులోనే ఎంతో పరిణతి సాధించిన క్రికెటర్లా అతడు షాట్లు బాదడం చూసి ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ సైతం ముచ్చటపడ్డాడు.ఇక ఇర్ఫాన్ పఠాన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు అయితే వీలైనంత త్వరగా వైభవ్ను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.తొందరపాటు చర్యే అవుతుందిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్కు సన్నద్ధమయ్యే క్రమంలో అతడు ఏడాదికి కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎమర్జింగ్ టూర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇండియా-‘ఏ’ టూర్లకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.వైభవ్ (Vaibhav Suryavanshi)కు ఇది రెండో ఐపీఎల్ సీజన్. గతేడాది అదరగొట్టిన అతడు.. ఈ ఏడాది కూడా శుభారంభం అందుకుని దానిని కొనసాగిస్తున్నాడు. ఈ పిల్లాడంటే నాకూ ఇష్టమే. అతడు విజయవంతం కావాలని నాలాగే ఎంతో మంది కోరుకుంటున్నారు.అయితే, వైభవ్ విషయంలో తొందరపాటు వద్దనేది నా అభిప్రాయం. ఇప్పటికే యశస్వి జైస్వాల్ భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని అతడు చూశాడు. కానీ అలా జరుగలేదు. జైస్వాల్తో పాటు ఎంతోమంది లైన్లో ఉన్నారు.ప్రియాన్ష్ ఆర్య కూడా టీమిండియా తలుపులు బాదుతున్నాడు. ప్రియాన్ష్, వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇద్దరూ ఆసియా ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీలో ఆడారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది.సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదువైభవ్ విషయంలో ఆలోచించినట్లే అందరి విషయంలోనూ ఆలోచించాలి. వైభవ్ను ఐర్లాండ్ లేదంటే జింబాబ్వే టూర్కు పంపితే మంచిదే. అక్కడ కూడా అతడు రాణిస్తాడనే అనుకుంటున్నా. భిన్నమైన పిచ్ పరిస్థితులు అతడికి అలవడతాయి.ముందుగా చెప్పినట్లు వైభవ్ ఒక్కడే కాదు.. మిగతా వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టీమిండియా క్యాప్నకు ఒక విలువ ఉంది. దానిని అందించే తీరు విస్మయంగా మాత్రం ఉండకూడదు. అంటే.. అందరితో పోలిస్తే.. ఆ ఆటగాడికి సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదు.వైభవ్ టీమిండియాకు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే బాగుంటుంది. అలా అయితేనే అతడి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని అశ్విన్ అన్నాడు.వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!వైభవ్ విషయంలో తొందరపాటు వద్దని.. యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య వంటి సీనియర్లకు ముందుగా అవకాశం ఇస్తే బాగుంటుందని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్-19 జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో రాణించిన వైభవ్.. వరల్డ్కప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తా చాటి జట్టును విజేతగా నిలిపాడు.ఇక ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఇప్పటికి ఏడు ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. 254 పరుగులు రాబట్టాడు. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో టాప్-6లో కొనసాగుతున్నాడు. రాయల్స్కే చెందిన యశస్వి జైస్వాల్ 245 పరుగులు చేయగా.. పంజాబ్ స్టార్ ప్రియాన్ష్ ఆర్య ఐదు మ్యాచ్లలో 211 పరుగులు చేశాడు.చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్పోర్ట్ ఉందా?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్రశంసల వర్షం కురిపించారు. ఈ దిగ్గజ క్రికెటర్లు తాజాగా వైభవ్ ప్రదర్శనపై 'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్కాస్ట్లో ఆసక్తికర చర్చ జరిపారు.ఈ సందర్భంగా వీరంతా వైభవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఐర్లాండ్తో టూర్తో వైభవ్ సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేస్తాడని వాన్ జోస్యం చెప్పాడు. వైభవ్ ఒక అద్బుతమైన ఆటగాడని, అతడి టాలెంట్ చూస్తుంటే ముచ్చటెస్తుందని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయపడ్డాడు.కాగా తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన సంబాషణ ఇదేమైఖల్ వాన్: సూర్యవంశీ నిజంగా ఒక సంచలన ఆటగాడు, ఈ ఏడాది ఐపీఎల్లో అతడి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.డేవిడ్ లాయిడ్: అతడు ఇప్పుడు స్కూల్కి వెళ్లాలి కదా? మధ్యలో స్కూల్ అలా మానేయకూడదు కదా వాన్!వాన్: అతడు మళ్లీ స్కూల్కు వెళ్తాడని నేను అనుకోను డేవ్. వైభవ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఉంటాడని నేను అనుకుంటా? ఒకవేళ నేను సెలక్టర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభవ్ను కచ్చితంగా ఎంపిక చేస్తాను.టఫ్నెల్: అవును కచ్చితంగా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు.అలస్టైర్ కుక్: ఇంతకి వైభవ్ దగ్గర పాస్పోర్ట్ ఉందా?(నవ్వుతూ)వాన్: అతడికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్లలోనే ఇలా ఆడుతున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. బుమ్రాను సైతం అతడు వదల్లేదు.హార్ట్లీ: వైభవ్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడిని భారత జట్టుకు ఎంపిక చేయాలి.వాన్: భారత టీ20 జట్టుకు కొత్త ఓపెనర్ అతడే. మరో ఎండ్లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభవ్ ప్రదర్శనల కారణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేకపోతున్నాడు. -
‘లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో అతడు అంతలా బంతిని బాదడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. ఇంత వరకు తాను ఇలాంటి ఆటగాడిని చూడలేదంటూ కొనియాడాడు. అయితే, అదే సమయంలో వైభవ్ చేస్తున్న తప్పును కూడా బోర్డర్ ఎత్తి చూపాడు.పరుగుల వరదపద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్కు చెందిన ఈ పిల్లాడు దేశీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ గతేడాది రూ. 1.10 కోట్లకు వైభవ్ను కొని అరంగేట్రం చేయించింది.విధ్వంసకర భారీ సెంచరీయాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటూ పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై విధ్వంసకర భారీ సెంచరీ (175)తో రాణించి జట్టుకు ట్రోఫీ అందించాడు.ఇక ఐపీఎల్-2026లో రాజస్తాన్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విధ్వంస కొనసాగుతోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను కూడా చితక్కొడుతూ... ఇప్పటికి ఏడు మ్యాచ్లలో 254 పరుగులతో టాప్ రన్ స్కోరర్లలో టాప్-5లో కొనసాగుతున్నాడు.అత్యద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం అలెన్ బోర్డర్ వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ను చూస్తే తనకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా గుర్తుకువస్తున్నాడని తెలిపాడు.‘‘అతడు అత్యద్భుతమైన ఆటగాడు. గొప్ప ప్రతిభ. 14-15 ఏళ్ల వయసులోనే బంతిని ఇంత గొప్పగా బాదిన ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. అతడొక పవర్ హిట్టర్. అయితే, ఇప్పుడే అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయలేము.లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీటెస్టు క్రికెటర్గా విజయవంతం అవుతాడా? లేడా? అనేది చెప్పలేను. అయితే, అతడిని చూస్తే మాత్రం నాకు బ్రియన్ లారా గుర్తుకువస్తున్నాడు. వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మైదానంలో నలువైపులా అతడు బంతిని బాదగలగాలి. అంతేకాదు.. డిఫెన్స్ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అలెన్ బోర్డర్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ వదిలి ఇక్కడికి వచ్చెయ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
వైభవ్కు చుక్కలు చూపించిన మొనగాడు.. ఎవరంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్తో ముప్పుతిప్పలు పెట్టాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్కు వేసిన మొహ్షిన్ ఖాన్.. ఓవర్ను వికెట్ మెయిడిన్గా మలిచాడు.తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటికి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: PSL 2026: హైదరాబాద్పై స్మిత్ విధ్వంసకర సెంచరీ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. వైభవ్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్లో ఫుల్ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను సూర్యవంశీ కోల్పోయాడు.ఈ మ్యాచ్లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ కేవలం 222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మాక్సీ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో వైభవ్ 7 మ్యాచ్ల్లో 220.87 స్ట్రైక్ రేట్తో 254 పరుగులు చేశాడు.చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో' -
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
క్రికెట్ ప్రపంచానికి ప్రస్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అతడే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ను అతడు సూచించాడు."వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.ప్లేయింగ్ ఎలెవన్లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్పై ఒక అవగాహన వచ్చేది. వైభవ్కు జాతీయ జట్టు తరపున కూడా రాణించే సత్తాఉంది. బుమ్రా లాంటి బౌలర్కు మొదటి బంతికి వైభవ్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత హేజిల్వుడ్ను ఓ ఆడుకున్నాడు. బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ భారత జట్టులోకి వచ్చాడు. అతనే సచిన్ టెండూల్కర్. ఈ రోజు అతడిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభవ్కు క్రికెట్లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ కేవలం 7 మ్యాచ్ల్లో 220.87 స్ట్రైక్ రేట్తో 254 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్ -
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
-
అతడు వైభవ్ సూర్యవంశీ కంటే సమర్దుడు..!
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కంటే పంజాబ్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రియాంశ్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్, అయుశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.కాగా, అశ్విన్ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్ ఈ ఐపీఎల్ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్ల్లో 248.24 స్ట్రయిక్రేట్తో 211 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.వైభవ్ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో రెచ్చిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. అయితే ఇటీవల మ్యాచ్లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.54 స్ట్రయిక్రేట్తో 246 పరుగులు చేసి టాప్-5 లీడింగ్ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 201 పరుగులు చేసి సీఎస్కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.మొత్తంగా అశ్విన్ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్తో పోలిస్తే వైభవ్కు అధిక హైప్ దక్కింది. టాలెంట్ విషయం పక్కన పెడితే, ఏజ్ అతనికి అడ్వాంటేజ్గా మారింది. 14-15 ఏళ్ల వయసులో వైభవ్ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు. -
అతడిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు చేశాడు.ఓవరాల్గా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.ఇక ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్, బ్యాటర్గా అదరగొడుతున్నాడు. శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్-19, అండర్-23 జట్లు శ్రీలంక టూర్కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత యువ జట్లు శ్రీలంక అండర్-19, లయన్స్ టీమ్స్తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ త్వరలోనేఖరారు చేయనుంది.అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్లో ఒక ప్రత్యేక టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. వీరింతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నారు.ఈ యువ ఆటగాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్రదర్శన ఆటగాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్కనున్నారు. ఐపీఎల్-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే కూడా సీజన్ ముగిసిన తర్వాత ఈ క్యాంప్లో చేరనున్నారు.కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ?అయితే శ్రీలంక టూర్కు ముందు భారత అండర్-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్స్ట్రింగ్) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వియాన్ మల్హోత్రాను ఐపీఎల్-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ శ్రీలంక టూర్కు మాత్రే, వియాన్ ఇద్దరు అందుబాటులో లేకపోతే భారత జట్టు కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ అవకాశముంది. సూర్యవంశీ గతంలో సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన కేకేఆర్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ భావోద్వేగాలకు వేదికైంది. సీజన్లో 6 మ్యాచ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకోవడంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కొందరు ఆనందంలో ఏడ్చేసినంత పని చేశారు. మరోవైపు రాజస్థాన్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఓటమిని జీర్ణంచుకోలేక మైదానంలో ఓ మూలన కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్యాప్తో ముఖాన్ని దాచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఈ సమయంలోకేకేఆర్ సిబ్బందిలో ఒకరు అతని వద్దకు వచ్చి ఓదార్చారు. అతని పక్కన కూర్చుని కాసేపు మాట్లాడి, ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.Yesterday Vaibhav Sooryavanshi was spotted crying after the game… This guy is unbelievable! Whether he gets out early or the team loses, he wears his heart on his sleeve. Honestly, that’s that 15-year-old mindset I know I would’ve been doing the exact same thing at that age! 🤣… pic.twitter.com/Ug6X4gVqks— OldMonkOfCricket (@OldMonkOfCric) April 20, 2026వైభవ్ ఇలా బాధపడటం కొత్తేమీ కాదు. ఔటైనప్పుడు, జట్టు ఓడినప్పుడు తాను ప్రొఫెషనల్ క్రికెటర్ని అన్న విషయాన్ని మరిచిపోయి ఏడ్చేస్తాడు. ఇది ఓ రకంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. 52, 78, 39 లాంటి స్కోర్లు చేసినా, వైభవ్ తన తప్పులను విశ్లేషించుకుంటూ బాధపడ్డ పడ్డాడు. మొత్తంగా వైభవ్ క్రికెటర్గా ఎంత పరిణితి చెందినా, అతనిలోని పిల్లాడు భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాడు.తాజాగా కేకేఆర్ చేతిలో రాజస్థాన్ ఓడిన మ్యాచ్లో వైభవ్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటింగ్ను కుదిపేశారు. ఫలితంగా రాజస్థాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో కేకేఆర్ సైతం తడబడినా.. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకూల్ చౌదరి (29 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్ తొలి విజయాన్ని అందించారు.సూపర్ ఫామ్లో వైభవ్ప్రస్తుత సీజన్లో వైభవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 246 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 236.54 కాగా, సగటు 41.00గా ఉంది. ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే అతను డకౌటయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో స్థిరంగా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలోనూ వైభవ్ టాప్-5లో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (283 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. -
BCCI బిగ్ప్లాన్.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్గా అతడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా నుంచి.. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వరకు ఈ జాబితాలో ఉన్నారు.ఇక ఈ టోర్నీలో ఓవైపు సీనియర్లు ఫామ్ కొనసాగిస్తుండగా.. యువ ఆటగాళ్లు సైతం దుమ్మురేపుతున్నారు. దీంతో టీమిండియా సెలక్టర్లకు తల నొప్పులు తప్పడంలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా షెడ్యూల్ ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుందో తెలిసిందే. ఏడాదంతా భారత పురుషుల జట్టు బిజీబిజీగా గడుపుతుంది.పూర్తిస్థాయిలో రెండు జట్లు!ఇటీవలే అదనంగా ముందుగా షెడ్యూల్లో లేని ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు.. ఆసియా క్రీడలు- 2026 (Asian Games) టోర్నీకి కూడా జట్టును పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు టీ20 జట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం.సెలక్టర్ల రాడార్లో 30-35 మంది ఆటగాళ్లుఅంతర్జాతీయ షెడ్యూల్తో ఆసియా క్రీడల షెడ్యూల్ క్లాష్ అవుతున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఒకే సమయంలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్కు జట్లను పంపాల్సి ఉంది. కాబట్టి ఈసారి కూడా రెండు జట్లను సిద్ధం చేస్తున్నాం.అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక చేసే క్రమంలో 30-35 మంది ఆటగాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉన్నాము. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆసియా క్రీడల దాకా ఈ విధానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. గతంలో ఇలా..కాగా 2023 ఆసియా క్రీడల్లో భాగంగా తొలిసారి బీసీసీఐ తమ పురుష, మహిళా జట్లను చైనాకు పంపింది. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు పసిడి పతకాలు గెలిచాయి. అప్పుడు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లతో బిజీగా ఉండగా.. రుతు కెప్టెన్సీలో ద్వితీయశ్రేణి జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది.రేసుగుర్రాలుకాగా ఈసారి నయా సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య, అంగ్క్రిష్ రఘువన్షీ ఆసియా క్రీడల నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నారు. రజత్ పాటిదార్, ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, ఖలీల్ అహ్మద్, కార్తిక్ త్యాగి తదితరులు కూడా రేసులో ఉన్నారు.కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్!ఈసారి ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన ఈ ముంబైకర్.. గతేడాది కెప్టెన్గా పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. తాజా ఎడిషన్లోనూ సారథి, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. కాగా 2023 డిసెంబరులో చివరగా అయ్యర్ టీమిండియా తరఫున టీ20లు ఆడాడు. అయితే, ఈసారి ఆసియా క్రీడల ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనను తాను మరోసారి నిరూపించుకుంటే.. టీమిండియా కెప్టెన్గానూ సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం ద్వారా ఈ మిస్టరీ స్పిన్నర్ తన ఖాతాలో 200వ వికెట్ జమ చేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వరుణ్ చక్రవర్తి 155 మ్యాచ్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ను చేరుకున్న రెండో భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ (151 మ్యాచ్లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలుత పంజాబ్ కింగ్స్కు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన ఈ మిస్టరీ స్పిన్నర్ అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. గతంలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్లు ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో 89 మ్యాచ్ల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ను అందుకున్నాడు.WICKET x 2️⃣!🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv— IndianPremierLeague (@IPL) April 19, 2026 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్! -
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2030 నాటికి ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఎన్బీ , ఎన్ఎఫ్ఎల్ వంటి దిగ్గజ లీగ్లతో సమానంగా నిలుస్తుందని మోదీ అంచనా వేశాడు. అంతేకాకుండా టాప్ ఆటగాళ్లు ఒక్కో సీజన్కు రూ. 130 నుంచి రూ. 150 కోట్ల వరకు సంపాదిస్తారని అతడు జోస్యం చెప్పాడు. లలిత్ మోదీ తాజాగా ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖల్ వాన్తో కలిసి 'ది ఓవర్ల్యాప్' పాడ్కాస్ట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే ఒక్కో ఫ్రాంచైజీకి రూ.125 కోట్లుగా ఉన్న ప్లేయర్ పర్స్ విలువ, రాబోయే నాలుగేళ్లలో ఏడు రెట్లకు పైగా పెరగనుందని అతడు చెప్పుకొచ్చాడు."ఐపీఎల్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతోంది. ఫ్రాంచైజీలకు ఆటగాళ్లపై ఖర్చు చేయడానికి ఒక నిర్దిష్ట మొత్తం ఉంటుంది. ప్రస్తుతం పర్స్ విలువ రూ.125 కోట్లుగా ఉంది. కానీ 2030 నాటికి ఈ మొత్తం ఏకంగా 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 932 కోట్లు) చేరుకుంటుంది. దీంతో సీజన్లో 16 మ్యాచ్లు ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒక్కో మ్యాచ్కు ఒక మిలియన్ డాలర్ (రూ. 8 కోట్లు) చొప్పున పారితోషకం అందుకుంటారు. అంటే మొత్తంగా 16 మ్యాచ్లకు సుమారుగా రూ. 140 నుంచి రూ.150 కోట్లు దక్కనుంది" అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.ఈ భారీ మొత్తాన్ని అందుకునే సత్తా ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' ప్లేయర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకరు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాగా.. మరొకరు ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. తన సంచలన బ్యాటింగ్తో బుమ్రా, హేజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన వైభవ్ 263.16 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2027 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ వైభవ్ను విడిచిపెడితే అతడిని భారీ ధరకు దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!
రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనెజర్ రోమీ భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన వ్యవహారంపై విచారణ ఓ కొలుక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరమైన కారణాల వల్లే డగౌట్లో ఫోన్ చూడాల్సి వచ్చిందని భిందర్ బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అదేవిధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోమీ తన ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్, మేసెజ్లు గానీ చేయలేదని ఏసీయూ నిర్ధారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికి రోమీ భిందర్ నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీసీసీఐ జరిమానా విధించేందుకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా రోమీ పక్కన ఉండి ఫోన్ చూసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కేవలం హెచ్చరించి వదిలేయాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అసలేమి జరిగిందంటే?ఈ ఏడాది సీజన్లో భాగంగా ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రోమీ భిందర్ డగౌట్లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఆ సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉండి ఫోన్ వైపు చూడటం వివాదాస్పదమైంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం..మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. దీంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అతడికి నోటీసులు జారీచేసింది. నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాలని ఏసీయూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రోమీ బీసీసీఐ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.చదవండి: విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్ -
వైభవ్ సూర్యవంశీకి గోల్డెన్ ఛాన్స్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సెలక్టర్లు ఈ బుడ్డోకి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదే భారత సీనియర్ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న 15 ఏళ్ల వైభవ్ (Vaibhav Suryavanshi)... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టడం నిశ్చయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ అనంతరం భారత జట్టు ఐర్లాండ్–ఇంగ్లండ్లో పర్యటించనుంది. అనంతరం జింబాబ్వేతోనూ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలకు కుదరకపోయినా..ఈ పర్యటనల కోసం త్వరలోనే జట్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 35 మంది ప్రాబబుల్స్ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో వైభవ్ పేరు కూడా ఉంది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో దాయాది పాకిస్తాన్పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... ఆ వయసుకన్నా ముందే వైభవ్ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్తో పాటు దేశవాళీ, ఐపీఎల్లో సత్తా చాటుతున్న సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఆసియా క్రీడల వరకైనాఈ నేపథ్యంలో ఒకవేళ తక్షణమే అతడికి అవకాశం కల్పించకున్నా... ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా క్రీడల వరకైనా సీనియర్ టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయమే. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... అదే సమయంలో టీమిండియా వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడనుంది. ఆ సమయంలో రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయాల్సి వస్తే... అందులో ఒక దాంట్లో సూర్యవంశీని ఎంపిక చేయొచ్చు అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘35 మంది ప్రాబబుల్స్ నుంచి సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వారందరి వీసా పనులు ప్రారంభమయ్యాయి. వైభవ్ను ఎంపిక చేయాలంటే..వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను సెలక్టర్లు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో నాలుగో ఓపెనర్ అవసరమేముంది. అంతకు కావాలి అంటే యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. వైభవ్ను ఎంపిక చేయాలి అంటే అభిషేక్, సంజూలను తీసుకోకపోవడానికి బలమైన కారణం అంటూ ఉండాలి. వారిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టినా... కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఆసియా క్రీడల సమయంలో మాత్రం రెండు జట్లు అనివార్యమే కాబట్టి వైభవ్ను ఎంపిక చేయవచ్చు’ అని అయన అన్నారు. పసిడి పతకాలుకాగా 2023లో తొలిసారి ఆసియా క్రీడలకు బీసీసీఐ పురుష, మహిళా జట్లను పంపగా.. రెండు జట్లు స్వర్ణ పతకాలు గెలిచాయి. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో టీమిండియా.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు గోల్డ్ మెడల్అందుకున్నాయి.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్ క్రికెటర్ -
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని.. ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.స్ట్రైక్రేటు మరీ దారుణంకాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్యకుమార్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై 11, ఫైనల్లో న్యూజిలాండ్పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్లో విఫలమతే అంతే సంగతులుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్. అయితే, బ్యాటర్గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్ టూర్లో అతడే కెప్టెన్.అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
కావ్యా మారన్ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ నుంచి సన్రైజర్స్కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, అనూహ్య రీతిలో సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్ విధ్వంసకరవీరుడు వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపడంలో ఎస్ఆర్హెచ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఆ సమయంలో సన్రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రఫుల్ ఊహించని రీతిలో బ్రేక్ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026ఇక వైభవ్తో పాటు రాజస్తాన్ కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను కూడా ప్రఫుల్ హింగే వచ్చీ రాగానే పెవిలియన్కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.సన్రైజర్స్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి.It's all Orange in Hyderabad 🧡A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️They end #RR's unbeaten streak this season 👏Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026 -
అసంతృప్తిలో వైభవ్
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వయంగా వెల్లడించారు. రాయల్స్కు ఫీల్డింగ్ కోచ్ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్ 13) సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్కు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్ ఫెరియెరా ఫిట్నెస్ పాస్ చేశాడు. అతను గన్ ఫీల్డర్. అందుకే అతనిని మెయిన్ XIలో ఉంచాం. వైభవ్ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్ మంచి ఫీల్డర్ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నామని అన్నాడు.కాగా, ప్రస్తుత ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్లుగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనూ అతను ఇంపార్ట్ సబ్స్టిట్యూట్గా (బ్యాటర్గా మాత్రమే) ఆడాడు. రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో అతను డగౌట్కే పరిమితమయ్యాడు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి గోల్డెన్ డకౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన బంతితో వైభవ్ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో హింగే వైభవ్తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్లోనే హింగే వైభవ్తో పాటు జురెల్, ప్రిటోరియస్లను కూడా డకౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే ముగ్గురిని ఔట్ చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ముందు వైభవ్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్ స్కోరర్గా ఉన్నాడు. సీఎస్కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. -
షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్లో మొబైల్ ఫోన్ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.వైభవ్ సూర్యవంశీ కూడా...కాగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోమీ భిందర్ మొబైల్ ఫోన్ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. వీరిద్దరు మొబైల్లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా ఐపీఎల్ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్కు మొబైల్ ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.తొలి ఓటమిఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా సన్రైజర్స్ బ్యాటింగ్కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్రైజర్స్. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సన్రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాయల్స్ నాలుగు గెలిచింది. చదవండి: సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
నిరాశలో హింగే.. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?
‘ఈ మ్యాచ్తో ప్రఫుల్ హింగే ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్ కింగ్స్తో గత మ్యాచ్ టాస్ సమయంలో సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పిన మాట ఇది. రైజర్స్ బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ సబ్గా హింగే రావాల్సింది. నిరాశకు లోనైన హింగేదురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్ ఉనాద్కట్ను రైజర్స్ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ చాన్స్ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్ రాయల్స్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్ 2024–25 సీజన్తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 27 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్కు ఐపీఎల్కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్ యాదవ్ను అభిమానించే ప్రఫుల్ అభిమాన బౌలర్ ప్యాట్ కమిన్స్. నాగ్పూర్కు చెందిన ప్రఫుల్ ఒక్కసారిగా సీన్లోకి రాలేదు. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్లో జరిగిన పేస్ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు. విదర్భ టి20 లీగ్లో నెకో మాస్టర్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్రైజర్స్ ట్రయల్స్లో జట్టు బౌలింగ్ కోచ్ ప్రఫుల్ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్రైజర్స్ తీసుకుంది. మరోవైపు.. బిహార్కు చెందిన పేసర్ సాకిబ్ హుస్సేన్ కూడా ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్కతా టీమ్లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్ రూ. 30 లక్షలకు ఎంచుకుంది. చదవండి: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ -
వైభవ్ను ఔట్ చేయడంపై హింగే సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ అరంగేట్రం పేసర్లు ప్రఫుల్ హింగే (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా హింగే పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి రాయల్స్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.తొలి ఓవర్లో హింగే ఔట్ చేసిన ముగ్గురు బ్యాటర్లు (వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, ప్రిటోరియస్) డకౌట్ కావడం విశేషం. వీరిలో వైభవ్ వికెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ మ్యాచ్కు ముందు వైభవ్పై అతి భారీ అంచనాలు ఉండేవి. ఈ సీజన్లో అతను తొలి మ్యాచ్ నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దండయాత్ర తప్పదని అంతా అనుకున్నారు.అయితే వైభవ్ విషయంలో హింజ్ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న వైభవ్ను అతను రెండో బంతికే ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హింగే సంధించిన అద్భుతమైన డెలివరీ కారణంగా వైభవ్ గోల్డెన్ డకౌటయ్యాడు. హింగే వేసిన బౌన్సర్ను ఆడే క్రమంలో బంతి వైభవ్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ సలీల్ అరోరా చేతుల్లోకి వెళ్లింది.వైభవ్ వికెట్పై మ్యాచ్ అనంతరం హింగే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందే ప్లాన్ చేశాను. వైభవ్కి బౌన్సర్ వేసి ఔట్ చేస్తానని 2–3 మందికి చెప్పాను. నా తొలి మ్యాచ్లో నాలుగైదు వికెట్లు తీస్తానని గతేడాదే రాసుకున్నాను. పవర్ప్లేలో ఆధిపత్యం చూపుతానని ఊహించాను. అదే నిజమైంది అని అన్నాడు. హింగే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతని అరంగేట్రంపై ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. నిన్నటి మ్యాచ్లో ప్లాన్ ప్రకారమే వైభవ్ను ఔట్ చేసిన విషయమూ తెలుస్తుంది. తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్న హింగే రాబోయే మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్కు కీలక బౌలర్గా మారిపోయాడు. రాత్రిరాత్రే స్టార్ డమ్ సంపాదించి హీరో హైప్ తెచ్చుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్, ఇషాన్ కిషన్ (91) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్స్ను రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) ఆదుకున్నారు. ఆఖర్లో తుషార్ దేశ్పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
వైభవ్ టీమిండియా ఎంట్రీ ఖరారు
భారత క్రికెట్కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ కెరటం వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, జింబాబ్వే టీ20 సిరీస్లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.15 ఏళ్ల వైభవ్ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్ ఎంపిక కేవలం ఐపీఎల్ ఆధారంగానే కాకుండా అండర్-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.వైభవ్ ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్ జగజ్జేతగా అవతరించింది. వైభవ్ ఇటీవలే దేశవాలీ క్రికెట్లోకి (బిహార్ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్లకు వైభవ్ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్లలో వైభవ్కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్-అభిషేక్ జోడీ టీ20 ఫార్మాట్లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. చరిత్ర సృష్టిస్తాడుఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ జూన్ 26న ఐర్లాండ్పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కాకపోయినా, ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్ల్లో ఏ మ్యాచ్లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్-సచిన్కు చాలా గ్యాప్ ఉంటుంది.ఆకాశమే హద్దుప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్లో వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. -
ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకర ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. బరిలోకి దిగిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్రేట్తో 200 పరుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. తాను క్రీజులో ఉంటే బౌలర్ ఎవరైతే నాకేంటి.. బంతిపైనే తన దృష్టి ఉంటుందని ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం డైరెక్ట్ స్టేట్మెంట్ విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాజస్తాన్ ఆడిన ప్రతీ జట్టులో ఒక ప్రధాన బౌలర్ను వైభవ్ ఒక ఆట ఆడుకున్నాడు. చెన్నైతో మ్యాచ్లో మాట్ హెన్రీని, గుజరాత్తో మ్యాచ్లో రబాడను, ముంబైతో మ్యాచ్లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్లో హాజిల్వుడ్ను లక్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఇక ఇవాళ వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్హెచ్ను వారి సొంతగడ్డపైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్వుడ్, రబాడ వంటి టాప్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ ముందు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చిన్నబోతోంది. కమిన్స్ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనంగా తయారయ్యింది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేకపోవడం మైనస్గా మారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యావరేజ్గా చూసుకుంటే ప్రతీ ఓవర్కు 10.42 పరుగులివ్వడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో బౌలింగ్ పరంగా అత్యంత చెత్త ప్రదర్శన ఎస్ఆర్హెచ్దే. ఇక పేసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, ఉనాద్కట్, ఇషాన్ మలింగలతో కూడిన పేస్ త్రయం ప్రతీ ఓవర్కు సగటున 11.47 పరుగులు సమర్పించుకున్నారు. ఈ లెక్కన ఇవాళ్టి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగితే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లకు మూడినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్ల బౌలర్లు హడలెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇక ఐపీఎల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు 21 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 12 సార్లు, రాజస్తాన్ 9 సార్లు విజయాలు అందుకున్నాయి. సీజన్లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
వైభవ్ సూర్యవంశీపై నిషేధం?
రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఏమి జరిగిదంటే?ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్లో రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.వైభవ్పై వేటు!కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే పక్కన ఉండి ఫోన్ చూసిన వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అతడిపై జరిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశముందని క్రికెట్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?
వైభవ్ సూర్యవంశీ.. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 32 బంతుల్లో శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్లో యంగెస్ట్ సెంచరియన్గా చరిత్రను తిరగరాశాడు.గత సీజన్లో ఎక్కడైతే తన విధ్వంసాన్ని ఆపాడో ఇప్పుడు అక్కడే తిరిగి మొదలు పెట్టాడు. ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది మాత్రం బంతిని బాదడం అన్నట్లగా దూసుకుపోతున్నాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఈ బిహార్ చిన్నోడు వదల్లేదు. ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జబితాలో వైభవ్(200) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ నెట్వర్త్, తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం. వైభవ్ తన ఆటలోనే సంపాదనలో కూడా దూసుకుపోతున్నాడు.వైభవ్ సంపాదన ఎంతంటే?15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తన కొడుకును క్రికెటర్ను చేసేందుకు తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు. ఇప్పుడు వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వైభవ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.15 ఏళ్ల వయస్సులోనే కోటీశ్వరుడయ్యాడు. ఐపీఎల్-2025 వేలంలో రాజస్తాన్ రాయల్స్ సూర్యవంశీని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్కు ముందు కూడా అతడిని రిటైన్ చేసుకుంది. అంటే రెండు సీజన్లకు గాను రూ. 2.20 కోట్లు జీతంగా అతడు అందుకున్నాడు.అదేవిధంగా ఐపీఎల్లో ఆడే ప్రతి మ్యాచ్కు అదనంగా రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. లీగ్ కాంట్రాక్ట్ వాటా, మ్యాచ్ ఫీజులు కలిపితే.. వైభవ్ ఒక్కో మ్యాచ్కు సుమారు రూ.15.35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు ఇందుకు అదనం.డొమెస్టిక్ మ్యాచ్లు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ), అండర్-19 మ్యాచ్ల ద్వారా కూడా బీసీసీఐ నుండి ఫీజులు పొందుతున్నాడు. అండర్-19 సిరీస్లో వైభవ్కు ఫీజు రూపంలో రోజుకు రూ.20 వేలు లభిస్తోంది. బీహార్ రంజీ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్కు రూ.1.6 లక్షల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. ఐపీఎల్-2025లో సెంచరీ చేసినందుకు అతడికి రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. అదే సీజన్లో స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డ్ కింద రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్తో పాటు రూ. 20 లక్షల టాటా కర్వ్ ఎస్యూవీ కార్ బహుమతిగా లభించింది. అతడి వద్ద టాటా కర్వ్తో పాటు ఖరీదైన మెర్సిడెస్-బెంజ్ కారు కూడా ఉంది. మొత్తంగా అతడి నెట్ వర్త్ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. షాకిచ్చిన బీసీసీఐ!
రాజస్తాన్ రాయల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అగ్రస్థానంలోఐపీఎల్-2026లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్తాన్ రాయల్స్.. శుక్రవారం నాటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని చిత్తు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లు నాలుగూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రాయల్స్ ఓపెనర్, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ పాత్ర కీలకం.అయితే, ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చేసిన పని వివాదానికి దారితీసింది. డగౌట్లో కూర్చుని అతడు మొబైల్ ఫోన్ను చూశాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ సైతం పక్కనే కూర్చుని ఫోన్లోకి చూసినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.రంగంలోకి బీసీసీఐకాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఇలా చేయడం ద్వారా అవినీతి నిరోధక ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఈ ఘటనపై విచారణలో భాగంగా బీసీసీఐలోని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రోమీ భిందర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించాడు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నివేదిక ఇవ్వాల్సిందిగా మేము ACSUను ఆదేశించాము’’ అని ధుమాల్ తెలిపాడు.PC: BCCIఅందుకే ఫోన్ చూశాడా?ఈ విషయంపై రోమి భిందర్ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘అనారోగ్యం కారణంగా రోమీ దాదాపుగా పది కిలోల బరువు తగ్గిపోయాడు. అతడికి ఆస్తమా కూడా ఉంది. అందుకే దూరప్రయాణాలు చేయొద్దని, మెట్లు ఎక్కడం తగ్గించాలని వైద్యులు సూచించారు.అయితే, టీమ్ మేనేజర్గా ఫ్రాంఛైజీ తరపున అతడు ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అతడికి నిబంధనలు తెలుసు. ఆరోజు కూడా వైద్యపరమైన కారణాల వల్లే అతడు ఫోన్ చూశాడు. హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో డగౌట్లో కూర్చుని ల్యాప్టాప్ లేదంటే మొబైల్తో కనిపించడం తప్పేమీ కాదు.నిజానికి అతడు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే.. ఎవరికైనా ఫోన్ చేస్తున్నట్లుగానో కనిపించలేదు. కేవలం అతడు ఫోన్ను స్క్రోల్ చేశాడంతే. ACSU విచారణలో అతడు తాను చేసిన పని గురించి వివరణ ఇవ్వగలడు. అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ACSU విచారణ జరుపుతుందని భావిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి ఫోన్ చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే అతడు అక్కడే కూర్చుని ఫోన్ చూసి ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026 -
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
-
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
ఐపీఎల్-2026లో శుక్రవారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ గెలుపొందినప్పటికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.మరోవైపు రుమీ బిందర్ పక్కన ఉండి ఫోన్ చూసిన 15 వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు.దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
ఎవడైతే నాకేంటి .. I DONT CARE
-
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్.. ఈ ఎడిషన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్ గైక్వాడ్ (24) ఉన్నారు.ఈ ఏడిషన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన వైభవ్ 266.67 స్ట్రయిక్రేట్తో 50 సగటున 2 హాఫ్ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్లో వైభవ్ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో టాప్-3 రన్ స్కోరర్లు రాయల్స్ ఆటగాళ్లే (వైభవ్ (200), జైస్వాల్ (183), జురెల్ (176)) కావడం మరో విశేషం.ఇదిలా ఉంటే, గత ఎడిషన్లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో చాలా అల్టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అతి చిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రంతో పాటు ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్.. ఈ సీజన్లో ఓవరాల్గా (ఐపీఎల్ చరిత్రలో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
15 ఏళ్ల కుర్రాడు ..15 బంతుల్లో RCB కి చుక్కలు చూపించాడు
-
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్కు డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్లు తీసుకురావడానికి అనుమతి లేదు. -
RCB కి చుక్కలు చూపించాడు.. ఈ బుడ్డోడి కొట్టుడికి కోహ్లి రియాక్షన్ చూస్తే
-
వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో అతడు విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్కు తోడు ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) రాణిచండంతో రాయల్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్ రాయల్స్ క్యాప్పై.. ‘‘ప్రియమైన వైభవ్.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 22), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్, ధ్రువ్ జురెల్లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026 -
చుక్కలు చూపించిన బుడోడు.. బిత్తరపోయిన కోహ్లి!
-
అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి !
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టాపార్డర్లో ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్లో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు లీగ్లో నాలుగు మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 266 స్ట్రైక్రేట్తో 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లోనూ వైభవ్ విధ్వంసం కొనసాగింది. కేవలం 26 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. సీజన్లో అతడికి ఇది రెండో అర్థసెంచరీ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు రాజస్తాన్కు కప్ అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వైభవ్ మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూమ్ నుంచి బయల్దేరిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తల్లి బయట నిలబడింది. పరాగ్ తల్లిని గమనించిన వైభవ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే పరాగ్ తల్లి మాత్రం వైభవ్ను వద్దంటూ వారించి హగ్ చేసుకొని ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం వీడియోలో కనిపించింది. వైభవ్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకున్నారు . ‘అమ్మ ఎవరికైనా అమ్మే’.. ‘పరాగ్ తల్లి పెద్ద మనసుతో వైభవ్ను ఆశీర్వదించడం గొప్ప విషయం’ అంటూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: ‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’ Vaibhav Sooryavanshi touched the feet of Riyan Parag's mother and took her blessings before the RCB vs RR match. ❤Vaibhav Sooryavanshi is a down-to-earth, pure desi boy. pic.twitter.com/Djgqn5mUiY— Sonu (@Cricket_live247) April 10, 2026 -
వైభవ్ విధ్వంసం.. బుడ్డోడు బాదుడే బాదుడు
-
‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్లతో రాజస్తాన్ సునాయాసంగా గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు విజయాలు సాధించడం సంతోషంగా అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పరాగ్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఈ వేదికపై మా రికార్డు అంత ఆశాజనకంగా లేదు, కానీ ఈరోజు ఆట తీరు బాగుంది. అయితే బౌలర్లు ఇంకాస్త క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేసేలా కనిపించినా.. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి వారిని కట్టడి చేశాం. కానీ నిజానికి వారిని 170 పరుగుల లోపే నియంత్రించి ఉండాల్సింది. కెప్టెన్గా నేను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం వారికి అనుకూలంగా మారింది. గౌహతి, జైపూర్లలో మేము చేసిన ముందస్తు సన్నద్ధత ఇక్కడ పనిచేసింది. గ్రౌండ్పై ఉన్న నల్లమట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనేది మాకు ముందే తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఒక జట్టుగా మా లక్ష్యం. ఇప్పటివరకు మేము స్టిక్కీ పిచ్లపై ఆడాము, బ్యాటింగ్కు అనుకూలమైన 'బెల్టర్' పిచ్ లభిస్తే మా ఆట ఇంకా అద్భుతంగా ఉంటుంది. వైభవ్ జట్టులో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను ఇంకా చిన్న పిల్లాడు, అతనికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. మేము అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి ప్రేమ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మా పని సులువైపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. 𝙐𝙣𝙗𝙚𝙖𝙩𝙚𝙣 & 𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚 🫡A sensational win for #RR to sign off from Guwahati in style 🩷Scorecard ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/eNq8gglcrL— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్లు కొనసాగుతూనే ఉన్నాయి. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లోనే 78 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్వైపు కన్నెత్తి చూడనని, కేవలం బంతిపైనే తన దృష్టి ఉంటుందని వైభవ్ పేర్కొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘కేక్ కటింగ్ లాంటిది ఏమీ లేదు. ఈరోజు తొందరగా పడుకోవాలి, ఎందుకంటే తెల్లవారి ఉదయమే మేము ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. నాకు భయం లేదని అనుకోవద్దు. అయితే ప్రాక్టీస్లో ఏదైతే అనుసరిస్తున్నానో మ్యాచ్లోనూ అదే గేమ్ను ఆడుతున్నా తప్పిస్తే దానికి అదనంగా ఏమీ చేయడం లేదు. ఎదురుగా బుమ్రా, హాజిల్వుడ్ లాంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ వారిని ఎదుర్కోవడానికి నా ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యా. బౌలర్ ఎవరయినా సరే బెరుకు లేకుండా ఆడుతూ షాట్స్ ఆడాలని నిర్ణయించుకున్నా. కనీసం బౌలర్ ఎవరన్నది కన్నెత్తి కూడా చూడను. కేవలం బౌలర్ వేసే బంతిపైనే ఫోకస్ ఉంటుంది. ఆ బంతి ఎలా వస్తుంది? ఏ షాట్ ఆడాలి అన్నదే మైండ్లో తిరుగుతుంది. అందుకే ఎదుట ఎంత పెద్ద బౌలర్ ఉన్నా భయపడకుండా నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇక నన్ను గైడ్ చేస్తున్న వాళ్లలో నా తండ్రితో పాటు కోచ్లు ఉన్నారు. ముఖ్యంగా రోమీ సార్ నా గార్డియన్. వీళ్లంతా నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, నువ్వు ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందని, అందుకు ఆటపైనే దృష్టి పెట్టాలని ఇతర ఆలోచనలు వదిలేయాలని పదే పదే నన్ను మోటివేట్ చేస్తుంటారు. ఔటవ్వడంపై పెద్దగా బాధ లేదు. ఎందుకంటే నేను ఉండుంటే నా నుంచి మరో 10 నుంచి 20 పరుగులు వచ్చేవి. టార్గెట్ కూడా రెండు ఓవర్ల ముందే ఫినిష్ అయిపోయేదేమో. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 10 నుంచి 20 పరుగులు ఎక్కువ చేసేవాళ్లమే. కాబట్టి నేను పేలవమైన షాట్ ఆడి ఔట్ అయితే జట్టుకు మైనస్ అయ్యేది అని బాధపడేవాడిని. కానీ ఆ చాన్స్ తీసుకోలేదు.’అని చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026Never satisfied. Never settling for less 🫡🎥 THE VAIBHAV SOORYAVANSHI MINDSET ✨#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/rdwKH9eReH— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: మొన్న బుమ్రా.. నేడు హాజిల్వుడ్! ఎవరైతే నాకెంటి? -
మొన్న బుమ్రా.. నేడు హాజిల్వుడ్! ఎవరైతే నాకేంటి?
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చుక్కలు చూపించిన వైభవ్.. నేడు ఆర్సీబీతో మ్యాచ్లో వరల్డ్ క్లాస్ బౌలర్లు జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లను ఉతికారేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వైభవ్ వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 18 పరుగులు పిండుకున్నాడు. అనుభవజ్ఞుడైన హాజిల్వుడ్ను ఒక నెట్ బౌలర్లా వైభవ్ ఆడుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా వైభవ్ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు.రెండు సిక్స్లు, ఓ ఫోర్తో 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు. వైభవ్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ప్రపంచ క్రికెట్లో అత్యంత డేంజరస్ బ్యాటర్ వైభవ్ అని కొనియాడుతున్నారు.చదవండి: IPL 2026: ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనేVaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026 -
వారెవ్వా వైభవ్
విజయలక్ష్యం ఎంతైతేనేమి... ప్రత్యర్థి ఎవరైతేనేమి... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లెక్కే లేదు... అతనికి తెలిసిందల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే... ఐపీఎల్లో మరోసారి అతను తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్కు వరుసగా నాలుగో విజయం దక్కగా, బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్ 78 పరుగుల సహాయంతో 49 బంతుల్లోనే 129కి చేరిన రాజస్తాన్కు మిగిలిన 73 పరుగులు రాబట్టడంలో ఇబ్బంది రాలేదు. ధ్రువ్ జురేల్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గువాహటి: ఐపీఎల్లో మాజీ విజేత రాజస్తాన్ రాయల్స్ దూసుకుపోతోంది. శుక్రవారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.కెప్టెన్ రజత్ పాటీదార్ (40 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి (16 బంతుల్లో 32; 7 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగిపోగా, ధ్రువ్ జురేల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రాణించిన కోహ్లి... ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ (0) వెనుదిరిగినా.... కోహ్లి కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను సందీప్ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. పడిక్కల్ (14) విఫలం కాగా, చక్కటి బంతితో కోహ్లిని బౌల్డ్ చేసి బిష్ణోయ్ దెబ్బ తీశాడు. పవర్ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేయగా, తక్కువ వ్యవధిలో కృనాల్ పాండ్యా (1), జితేశ్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) అవుటయ్యారు. షెఫర్డ్ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు జడేజా అడ్డుకట్ట వేశాడు. ఆఖరి 6 ఓవర్లలో 76 పరుగులు... ఆర్సీబీ స్కోరు 14 ఓవర్లలో 125/7... తడబడుతూ ఆడిన కెపె్టన్ పాటీదార్ 26 బంతుల్లో 27 పరుగులే చేయగా... తప్పనిసరి స్థితిలో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)ను ఇంపాక్ట్ సబ్గా జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో పాటీదార్ చెలరేగిపోయాడు. తర్వాతి 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో అతను 36 పరుగులు రాబట్టాడు. బర్గర్, బిష్ణోయ్ ఓవర్లలో అతను రెండేసి సిక్సర్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుటైన తర్వాత వెంకటేశ్ బాధ్యత తీసుకున్నాడు. సందీప్ వేసిన చివరి ఓవర్లో వెంకటేశ్ ఫోర్, 2 సిక్స్లు బాదడంతో స్కోరు 200 దాటింది. జురేల్ జోరు... భారీ ఛేదనలో రాజస్తాన్ వేగంగా దూసుకుపోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హాజల్వుడ్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ తనదైన శైలిలో చెలరేగిపోగా, జురేల్ కూడా దూకుడు ప్రదర్శించాడు. అభినందన్ ఓవర్లో జురేల్ వరుసగా 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 97కు చేరింది. ఎట్టకేలకు కృనాల్ వరుస బంతుల్లో వైభవ్, హెట్మైర్ (0)లను అవుట్ చేయగా, పరాగ్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) సంయమనంతో ఆడి జట్టును గెలిపించారు. మళ్లీ అదే బాదుడు... వైభవ్ సూర్యవంశీ మరోసారి తన స్థాయిని, సత్తాను ఈ మ్యాచ్లోనూ ప్రదర్శించాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో 2 ఫోర్లతో మొదలు పెట్టిన అతను అభినందన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. గత మ్యాచ్లో బుమ్రాపై చెలరేగిన తరహాలోనే ఈసారి మరో అంతర్జాతీయ స్టార్ బౌలర్ హాజల్వుడ్ పని పట్టాడు. హాజల్వుడ్ ఓవర్లో వైభవ్ వరుసగా 4, 4, 4, 6తో చెలరేగిపోయాడు. భువీ వేసిన తర్వాతి ఓవర్లోనూ 2 సిక్స్లు, ఫోర్ బాదిన అతను 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్ను నిలువరించే ప్రయత్నంలో పార్ట్టైమర్ డేవిడ్ను ఆర్సీబీ బౌలింగ్కు దింపగా, వైభవ్ వరుసగా రెండు సిక్సర్లతో దాడి చేశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడిని చివరకు కృనాల్ నిలువరించగలిగాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; కోహ్లి (బి) బిష్ణోయ్ 32; పడిక్కల్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 14; పాటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63; కృనాల్ (సి) హెట్మైర్ (బి) బిష్ణోయ్ 1; జితేశ్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 5; డేవిడ్ (సి) హెట్మైర్ (బి) బ్రిజేశ్ 13; షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22; వెంకటేశ్ (నాటౌట్) 29; భువనేశ్వర్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–0, 2–45, 3–58, 4–62, 5–76, 6–94, 7–125, 8–166. బౌలింగ్: ఆర్చర్ 3–0–33–2, బర్గర్ 3–0–32–0, సందీప్ 4–0–47–1, రవి బిష్ణోయ్ 4–0–32–2, జడేజా 2–0–14–1, బ్రిజేశ్ 4–0–37–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 13; వైభవ్ (సి) కోహ్లి (బి) కృనాల్ 78; జురేల్ (నాటౌట్) 81; హెట్మైర్ (సి) హాజల్వుడ్ (బి) కృనాల్ 0; పరాగ్ (సి) కృనాల్ (బి) హాజల్వుడ్ 3; జడేజా (నాటౌట్) 24 ; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–21, 2–129, 3–129, 4–134. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–37–0, హాజల్వుడ్ 4–0–44–2, అభినందన్ 3–0–54–0, కృనాల్ పాండ్యా 4–0–30–2, డేవిడ్ 1–0–18–0, షెఫర్డ్ 2–0–18–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X హైదరాబాద్ వేదిక: న్యూ చండీగఢ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచిచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
ముంబై: ఐపీఎల్లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిని అలా అతడి ఇష్టానికి వదిలేయాలని ఇప్పటి నుంచే అతడి మనసులో జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒత్తిడిని నింపొద్దని ఈ స్పిన్ దిగ్గజం హితవు పలికాడు. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా టీనేజ్ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి... ఆ తర్వాత బ్యాటింగ్ లెజెండ్గా ఎదగగా... ఇప్పుడు ఆ అవకాశం సూర్యవంశీకి ఉందని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కుంబ్లే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘అసాధారణ ప్రతిభ గల వైభవ్ సూర్యవంశీ దూకుడును ఆపడం కష్టతరమే. అయితే తొందరపాటు అంచనాలు యువ క్రీడాకారుడిపై అనవసర ఒత్తిడి పెంచుతాయి. ఈ వయసులోనే అతడు చక్కగా ఆడుతున్నాడు. అయితే మరో రెండు నెలల్లో నువ్వు టీమిండియాకు ఆడాలి అని చెప్పడం మాత్రం అతడిపై కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. మరో పదేళ్ల తర్వాత కూడా వైభవ్ వయసు ఇంకా పాతికేళ్లే ఉంటుంది’ అని కుంబ్లే అన్నాడు. క్రికెట్లో విజయవంతం కావడానికి ఒక నిర్దిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదని... నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని కుంబ్లే పేర్కొన్నాడు. ‘ఈ ఏడాదో, వచ్చే ఏడాదో అతడి పేరు సెలెక్టర్ల పరిశీలనకు రావడం ఖాయం. ఇప్పటికే అతడి ఆటతీరును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. కాస్త ఓపిక పట్టడం ముఖ్యం’ అని వివరించాడు. క్రీడా సంస్కృతి పెరగాలి... భారత్కు ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది దేశ క్రీడారంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని కుంబ్లే అన్నాడు. మౌలిక వసతులు పెంపొందడంతో పాటు... కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భారీ క్రీడా పోటీలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 1982లో జరిగిన ఆసియా క్రీడలు నాపై చాలా ప్రభావం చూపాయి. దీంతో దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందుతుంది’ అని కుంబ్లే అన్నాడు. ఏదో ఒక రోజు భారత ఫుట్బాల్ జట్టు కూడా ఫిఫా ప్రపంచకప్లో పాల్గొంటుందని జంబో ఆశాభావం వ్యక్తం చేశాడు. -
వైభవ్ వీర విహారం.. ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. రాయల్స్కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఔటైనప్పటికి.. తర్వాత వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి పాటిదార్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పాటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.వైభవ్ విధ్వంసంఅనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. వైభవ్ బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు. తొలిసారి హేజిల్వుడ్ను ఎదుర్కొన్న వైభవ్.. 4 ఓవర్లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ను తన సహచరుడు జైశ్వాల్ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్Vaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026 -
టీమిండియాలో దక్కని చోటు..!వైభవ్, ఆయుష్ మాత్రే కు షాకిచ్చిన BCCI
-
'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్ స్టార్ అవుతాడు'
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్బుత బ్యాటింగ్తో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ వైభవ్ సత్తాచాటాడు .ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్గా మలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ను "అసలైన సూపర్ స్టార్"గా స్మిత్ అభివర్ణించాడు.నేను ఊహించినట్లే ఫ్లాట్ పిచ్లు, అధిక స్కోరింగ్ మ్యాచ్లతో ఐపీఎల్ ప్రారంభమైంది. ఎప్పటిలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ సూపర్ స్టార్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరికంటే ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాడు. మొదటి బంతి నంచే తన పవర్ను అతడు చూపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ నిజంగా అద్భుతం. ఈ టోర్నమెంట్ ముగిసేలోపు వైభవ్ ఒక సూపర్ స్టార్ అవుతాడు. భారత క్రికెట్కు కూడా అతడు భవిష్యత్తు బ్యాటింగ్ స్టార్ అవుతాడని స్మిత్ పేర్కొన్నాడు.చదవండి: భారత లెజెండరీ క్రికెటర్ కన్నుమూత -
బుమ్రాపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ వైరల్
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలితో రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు బుమ్రా. అతడు బంతితో రంగంలోకి దిగాడంటే దిగ్గజ బ్యాటర్లు సైతం వణికిపోవాల్సిందే.అయితే, రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మాత్రం బుమ్రాను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఏకంగా సిక్సర్తో స్వాగతం పలికి ఔరా అనిపించాడు. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి.తొలి బంతికే సిక్సర్ ఈ మ్యాచ్లో వైభవ్- బుమ్రా ఫైట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన వైభవ్.. అతడి ఓవర్లో మరో సిక్స్ కూడా రాబట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముంబైపై విజయానంతరం రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బుమ్రాను ఎదుర్కొన్న అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ..గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు‘‘ఇందులో నేనేమీ గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. బౌలర్ కంటే కూడా బంతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేందుకు నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను. అయితే, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ఎదురుగా ఉండటం వల్ల కాస్త గాబరాగానే అనిపించింది.అయితే, నా అలవాటుకు తగ్గట్లే బంతిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అనుకున్న ఫలితం రాబట్టగలిగాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. కాగా ముంబైతో మ్యాచ్లో వైభవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ముంబైపై 27 పరుగుల తేడాతో గెలిచింది.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) -
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
-
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
-
BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా!
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్కప్ విజేత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్లో.. అటు భారత జూనియర్ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్.మెరుపులు మెరిపించాడుఇక ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లూ గెలవడంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో వరల్డ్క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్తో వైభవ్ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026డెస్టినీ చైల్డ్ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడుఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్లో చితక్కొడతాను’ అని చెప్పాడు.అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్లోనే వైభవ్ అదరగొట్టాడు.20 ఏళ్లు ధనాధన్దయచేసి వైభవ్ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్’’ అంటూ టీమిండియాకు వైభవ్ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి సూచించాడు. చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ -
వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్లో 3 మ్యాచ్ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 10 ఇన్నింగ్స్ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్, ఉర్విల్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆండ్రీ రసెల్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.- వైభవ్ సూర్యవంశీ – 4.88 - రొమారియో షెపర్డ్ – 5.1 - ఉర్విల్ పటేల్ – 5.3 - జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ – 6.4 - ఆండ్రీ రసెల్ – 6.8 ఆకాశమే హద్దుప్రస్తుత ఎడిషన్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.ఈ సీజన్లో వైభవ్.. యశస్వి జైస్వాల్తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్ రాయల్స్ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, టేబుల్ టాపర్గా కొనసాగుతుంది.తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77 నాటౌట్) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది. -
అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ దూకుడు మాములుగా లేదు. అన్ని జట్లతో పోలిస్తే రాజస్తాన్ తుది జట్టులోని స్వదేశీ ఆటగాళ్లలో అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయినప్పటికీ యువరక్తం కావడంతో జోష్ రెండింతలు అయినట్లుంది. జట్టులో రవీంద్ర జడేజా మాత్రమే టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. జడేజాను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లకు అనుభవం తక్కువే. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తాము ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టులో కూడా ఒకరిని మించి మరొకరు చెలరేగిపోతుండడం వారికి సానుకూలాంశంగా మారింది. జైస్వాల్ నుంచి ఆర్చర్ దాకా బ్యాటింగ్ చేసే వాళ్లే ఉండడం రాజస్తాన్కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సమతుల్యతతో ఉండడం కలిసొచ్చే అంశం.భయపెడుతున్న వైభవ్..52, 31, 39.. ఇవి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన పరుగులు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ అతడి దనాధన్ బ్యాటింగ్ ప్రభావం ప్రత్యర్థి జట్లపై గట్టిగానే చూపిస్తోంది. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే పరమావధిగా పెట్టుకున్నసూర్యవంశీ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర స్ట్రైక్రేట్తో పరుగులు సాధించి తన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్లో బుమ్రా, దీపక్ చాహర్ పదునైన బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు అభినందనీయమని చెప్పొచ్చు.జైస్వాల్ మోత..సాధారణంగా యశస్వి జైస్వాల్ చూడ్డానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ అతడి ఆటతీరు మాత్రం అసాధారణమని చెప్పొచ్చు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. రాజస్తాన్కు ఓపెనర్లిద్దరే సగం బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చే ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో జురేల్ 75 పరుగుల ఇన్నింగ్స్ రాజస్తాన్ గెలుపుకు కారణమైంది.పరాగ్ నాయకత్వం..జట్టు విజయాలు సాధిస్తుంటే తప్పులు పెద్దగా కనిపించవు. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్లో మెరుపులు లేనప్పటికీ అతని కెప్టెన్సీలో రాయల్స్ చెలరేగిపోవడం అతని వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం లేదు. నాయకుడిగా మూడు మ్యాచ్ల్లో సక్సెస్ అయిన పరాగ్ బ్యాటింగ్లోనూ అదరగొడితే రాయల్స్కు తిరుగు లేనట్లే. హెట్మైర్, జడేజా వంటి అనుభవజ్ఞులు తమదైన రోజున ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బౌలింగ్లోనూ అదుర్స్..బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ రాజస్తాన్ అదుర్స్ అనిపిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్లో ఉండడం, స్పిన్నర్లు రవి బిష్ణోయ్, జడేజాల స్పిన్ మాయజాలాం, నండ్రీ బర్గర్ సూపర్ బౌలింగ్, తుషార్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్ర ఉండడంతో అంతా మ్యాచ్ విన్నర్లుగానే కనిపిస్తున్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగి తొలి టైటిల్ ఎగరేసుకుపోయిన రాజస్తాన్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. శాంసన్ వచ్చిన తర్వాత రాయల్స్ ఆటతీరు మారడమే గాక 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పుడు శాంసన్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న పరాగ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ సీజన్ మొత్తం ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026చదవండి: కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి! -
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
-
బుమ్రాకే చుక్కలు చూపించావు!.. నీ గుండె గట్టిదిరా!: హార్దిక్
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 18 బంతుల్లో 31 పరుగులతో మెరిశాడు.విధ్వంసకర బ్యాటింగ్తాజాగా ముంబై ఇండియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఇందులో ఓ ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో వైభవ్.. ముంబై స్టార్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదడం హైలైట్గా నిలిచింది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూడగా.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్లో రాజస్తాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.ఈ గుండె గట్టిదిరా బుడ్డోడాఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ముంబై కెప్టెన్, టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా వైభవ్ను ప్రత్యేకంగా అభినందించాడు. అతడి భుజం తడుతూ.. గుండెపై చేయి వేసి.. ‘ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026 ఏ బౌలర్ బౌలింగ్లోనైనాఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ‘‘పదహారు, పదిహేడేళ్ల పిల్లాడు ఇలా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. రాజస్తాన్తో మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో మేము వైభవ్ గురించి చాలా సేపు చర్చించాము.అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి అసలు భయమే లేదు. అందుకే ఏ బౌలర్ బౌలింగ్లోనైనా అలాంటి షాట్లు ఆడగలుగుతున్నాడు. అతడి భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని హార్దిక్ పాండ్యా వైభవ్కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’𝙂𝙖𝙢𝙚 𝙧𝙚𝙘𝙤𝙜𝙣𝙞𝙨𝙚𝙨 𝙜𝙖𝙢𝙚! 🤝🎥 #MI captain Hardik Pandya with some very kind words for the young Vaibhav Sooryavanshi 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/t5Wg9LCtoV— IndianPremierLeague (@IPL) April 7, 2026 -
యశస్వి, వైభవ్ మెరుపులు
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ మంగళవారం జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్ (8), రోహిత్ (5), సూర్యకుమార్ (6), తిలక్ (14), హార్దిక్ (9) విఫలమయ్యారు. దంచుడే... దంచుడు మ్యాచ్ను రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో జైస్వాల్ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో వైభవ్ రెండు సిక్స్లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ రెండు, వైభవ్ ఒక సిక్స్ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్లో హార్దిక్ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురేల్ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దుల్ 39; జురేల్ (ఎల్బీ) ఘజన్ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 20; హెట్మైర్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్ 1–0–22–0; హార్దిక్ 2–0–17–0; శార్దుల్ 2–0– 36–1; ఘజన్ఫర్ 2–0–21–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ (సి) జురేల్ (బి) సందీప్ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ (సి) హెట్మైర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్ఫోర్డ్ (సి) సందీప్ (బి) దేశ్పాండే 25; శార్దుల్ (సి) జురేల్ (బి) సందీప్ 8; దీపక్ (నాటౌట్) 5; బౌల్ట్ (రనౌట్) 1; బుమ్రా (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్: ఆర్చర్ 2–0–17–1; బర్గర్ 2–0–21–2; సందీప్ 3–0–26 –2; దేశ్పాండే 2–0–29–1; బిష్ణోయ్ 2–0–25–2. -
బుమ్రాను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను సైతం వదల్లేదు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో బుమ్రాను సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వైభవ్ మాత్రం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా బుమ్రాను ఉతికారేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో బుమ్రా తను వేసిన తొలి బంతినే వైభవ్ అద్భుతమైన సిక్సర్గా మలిచాడు. ఆషాట్కు బుమ్రా సైతం ఫిదా అయిపోయాడు. బుమ్రా నవ్వుతూ తన ఎండ్ వైపు వెళ్లిపోయాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని కూడా సూర్యవంశీ స్టాండ్స్కు పంపించాడు.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రాకే చుక్కులు చూపించావు.. బుడ్డోడా నీవు గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. కాగా వైభవ్ ఈ మ్యాచ్లో కేవలం 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.ఇక గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను వర్షం కారణంగా కేవలం 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: ముంబై ఇండియన్స్లోకి వైభవ్ సూర్యవంశీ?Vaibhav ka jawaab nahi! 😍🔥Jasprit Bumrah par bhi Vaibhav Sooryavanshi pade bhaari! 💪Bhojpuri ka asli mazza sirf JioHotstar par dekhiye! 😍#TATAIPL 2026 | #RRvMI | LIVE NOW 👉 https://t.co/Dc4qz69QC4 pic.twitter.com/QcsrgoF9rG— Star Sports (@StarSportsIndia) April 7, 2026 -
ముంబై ఇండియన్స్లోకి వైభవ్ సూర్యవంశీ?
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఐపీఎల్-2026 సీజన్లోనూ వైభవ్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభవ్ తన సంచలన బ్యాటింగ్తో వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్ఫుల్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే జోస్యం చెప్పాడు."ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత అండర్-19, అండర్-25జట్లు రెడ్ బాల్ సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాళ్లలలో రెడ్ బాల్ స్కిల్స్ను వెలికితీసేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒక ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.ఈ అండర్-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసింది. అయితే ఈ లిస్ట్లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రేలకు చోటు దక్కలేదు. వీరిద్దరూ ఐపీఎల్-2026లో బీజీగా ఉండడంతో బోర్డు పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రధాన జట్టులో మాత్రం వారు చోటు దక్కించుకునే అవకాశముంది.కాగా శ్రీలంక టూర్ కంటే ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. దేశవ్యాప్తంగా 64 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని 4 జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో 16 మంది ఉంటారు.ఇందుకోసం సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో రాణించిన 25 మందిని, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో సత్తాచాటిన 25 మందిని ఎంపికచేశారు. మిగిలిన 14 మందిలో అండర్-19 వరల్డ్కప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఈ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్లో రాణించిన వారికి 'ఇండియా ఎమర్జింగ్'(అండర్-25) ప్రధాన జట్టులో చోటు దక్కనుంది. ఈ జట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్లు ఆడనుంది. మొత్తం ఈ క్యాంప్ మొత్తం దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జరగనుంది.బీసీసీఐ అండర్-25 షార్ట్లిస్ట్ ప్లేయర్స్ వీరే:ఆయుష్ దోసేజా, యష్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింబాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖ్రాజ్ మాన్, యశ్వర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖాడే.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు -
‘వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్ లేదు’
భారత క్రికెట్ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఫార్మాట్లకు అతీతంగాఇక భారత్ అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా ఫార్మాట్లకు అతీతంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్కప్ ఫైనల్లో విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో భారత్కు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2026 బరిలో దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొలి మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్పై దంచికొట్టాడు.ఆది నుంచే దూకుడుకేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించి సత్తా చాటాడు వైభవ్. ఇక గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ 18 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ తమ మూడో మ్యాచ్లో భాగంగా మంగళవారం గువాహటిలో ముంబై ఇండియన్స్తో తలపడనుండగా.. వైభవ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.వరల్డ్క్లాస్ బౌలర్, టీమిండియా పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముంబై సైతం ఈ కుర్రాడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించిందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ పారస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.వైభవ్ గురించి తెలుసు‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. వైభవ్ కొత్త ఆటగాడేమీ కాదు. ఐపీఎల్లో అతడికి ఇది రెండో సంవత్సరం. కాబట్టి అతడు కొత్త కాదు. అయితే, అతడొక మంచి ప్లేయర్. అయినా అతడి కోసం మేమేమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. మిగతా వారిలాగే అతడు కూడా!’’ అని పారస్ మాంబ్రే కొట్టిపారేశాడు.అతడికి అంత సీన్ లేదుఇక రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి ప్రస్తావన రాగా.. ‘‘రవి మిస్టరీ స్పిన్నర్గానే కొనసాగుతున్నాడని నేను నమ్మను. గత కొన్నేళ్లుగా అతడు ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసు. ఆటగాళ్ల కెరీర్లో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి బాగా ఆడతారు.. మరోసారి తేలిపోతారు. ఇప్పుడు ఫామ్లో ఉన్నంత మాత్రాన అతడి గురించి భయపడాల్సిందేమీ లేదు’’ అని పారస్ మాంబ్రే అతడిని తేలికగానే తీసుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రవి బిష్ణోయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (73), గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), రాహుల్ తెవాటియా (12) రూపంలో కీలక వికెట్లు తీసి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’ -
అతడు నాకంటే ఎంతో బెటర్: యువరాజ్ సింగ్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారీ సెంచరీతో సత్తాచాటి భారత్ను ఛాంపియన్గా నిలిపిన వైభవ్.. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్నూ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.అతిపిన్న వయసులో వేగవంతమైన అర్ధశతకం చేసిన బ్యాటర్గా నిలిచాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా సూర్యవంశీ నిలిచాడు. ఇప్పుడు అదే దూకుడును శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో కొనసాగించాలని వైభవ్ భావిస్తున్నాడు.ఈ నేపథ్యలో సూర్యవంశీపై భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఒక అద్భుతమైన బ్యాటర్ అని యువీ కొనియాడాడు."ఐపీఎల్ ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అక్కడ నుంచే వచ్చాడు. అసాధరణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడి బ్యాట్ స్పీడ్ అద్భుతం. నిజం చెప్పాలంటే వైభవ్ బ్యాట్ స్పీడ్ నా కంటే మెరుగ్గా ఉంది.ఇంత వేగంగా బ్యాట్ తిప్పే ప్లేయర్లను నేను చాలా తక్కువ మందిని చూశాను. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడు. వైభవ్కు మైదానం నలుమూలలా షాట్లు ఆడే సత్తా ఉంది. అతడు మరిన్ని మ్యాచ్లు ఆడేకొద్దీ, మరింత మెరుగైన బ్యాటర్గా ఎదుగుతాడు" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. కాగా వైభవ్కు 15 ఏళ్లు నిండడంతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు అర్హత సాధించాడు.చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు -
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే! -
వైభవ్ను చూసి నేర్చుకో పంత్..!
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వ్యక్తిగతంగా, కెప్టెన్గా దారుణంగా నిరాశపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగి 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అద్భుతమైన బ్రేక్ ఇచ్చినా, పంత్ తన పేలవ నిర్ణయాలతో గెలిచే అవకాశమున్న మ్యాచ్ను జారవిడిచాడు. పంత్ వ్యక్తిగతంగా, కెప్టెన్గా విఫలం కావడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఘాటుగా స్పందించాడు. ఓ పక్క సలహాలు ఇస్తూనే, మరోపక్క తలంటాడు.వాన్ మాటల్లో.. పంత్కు ఉన్న ప్రతిభతో ఏ దేశ క్రికెట్ జట్టులోనైనా స్థానం సంపాదించగలడు. టీమిండియాలోనే కాస్త కష్టం. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జితేష్ శర్మ లాంటి మెరికలు ఉన్నారు. వీరితో పోటీ పడి నెగ్గుకు రావడం పంత్కు అంత ఈజీ కాదు.పంత్ మరో నిరుత్సాహకరమైన ఐపీఎల్ సీజన్ను భరించలేడు. అతను బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిలోనూ మెరుగుపడాలి. నేను అతని స్థానంలో ఉంటే వైభవ్ సూర్యవంశీని గమనించేవాడిని. వైభవ్ ఆడే తీరు పంత్ను గుర్తు చేస్తుంది. పంత్ కెరీర్ తొలినాళ్లలో చాలా ధైర్యంగా ఆడేవాడు. ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు.ముందుగా పంత్ తన మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా 40-45 బంతుల్లో సెంచరీ చేయగలననే ధీమాతో ఆడాలి.నెక్స్ట్ టాస్క్ ఎస్ఆర్హెచ్లక్నో సూపర్ జెయింట్స్కు నెక్స్ట్ టాస్క్ ఎస్ఆర్హెచ్. ఏప్రిల్ 5న హైదారాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లోనైనా పంత్ ఫామ్లోకి రావాలి. లేని ప్రయోగాలకు పోకుండా తన రెగ్యులర్ బ్యాటింగ్ స్థానంలోనే బరిలోకి దిగాలి. కెప్టెన్సీలోనూ చాలా మెరుగుపడాలి. ఒకవేళ తొలి మ్యాచ్ ప్రదర్శనే ఆ మ్యాచ్లో కూడా కొనసాగితే, పంత్కు కష్టాలు తప్పవు.వైభవ్ సూర్యవంశీ విషయానికొస్తే.. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తమ తొలి మ్యాచ్లోనే ఉగ్రరూపం ప్రదర్శించాడు. సీఎస్కేపై 15 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. -
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్.. అటు భారత అండర్-19 జట్టు తరఫున ఈ చిచ్చరపిడుగు విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 35 బంతుల్లోనే శతక్కట్టిన వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అప్పటికి వైభవ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఇక భారత్ అండర్-19 వరల్డ్కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులతో దుమ్ములేపాడు.ఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శుభారంభం అందుకున్నాడు. ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ రాజస్తాన్ స్టార్.. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను ఈ టూర్కు పంపాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.టీమిండియాలోకి వచ్చేస్తాడుఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, బసిత్ అలీ కూడా చేరారు. గేమ్ ప్లాన్ షోలో అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ పిల్లాడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. త్వరలోనే అతడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జాతీయ జట్టు ఆడే సిరీస్ల సందర్భంగా అతడు టీమ్లోకి రావొచ్చు. అదే జరిగితే అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే తప్పకుండా అతడు టీమిండియాలోకి వచ్చేస్తాడు’’ అని అంచనా వేశాడు.నాకు భయం వేస్తోందిమరోవైపు బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఆట పట్ల అతడికి పూర్తి అవగాహన ఉంది. చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించాడు. చెన్నైతో మ్యాచ్లో రాజస్తాన్ 128 పరుగులు చేధించాల్సి రావడం పెద్ద విషయం కాదు. అయితే, 15 బంతుల్లోనే వైభవ్ 50 పరుగులు చేయడం చర్చనీయాంశం.అతడి తండ్రి ఎంతగానో గర్వపడుతూ ఉంటాడు. కోచ్లు, క్రికెట్ క్లబ్ స్నేహితులు సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే.. అతడు పాతికేళ్ల వయసులోకి వస్తే బౌలర్ల పరిస్థితి ఏమిటోనన్న విషయం తలచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఈ పిల్లాడు అందరిపైనా ఆధిపత్యం చెలాయించగలడు’’ అంటూ వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు.చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంతకంటే ముందు భారత జట్టు.. ఇంగ్లండ్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్లతో వైట్బాల్ సిరీస్లలో తలపడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.అయితే ఈ వరుస సిరీస్ల నేపథ్యంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశముంది. సూర్య ప్రస్తుతం స్వల్ప గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ముఖ్యమైన సిరీస్లోనే అతడిని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తుందంట. ఈ క్రమంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్లో భారత జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ చివరగా రెండేళ్ల కిందట టీమిండియా తరపున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్


