Vedic Students
-
సుబ్బూ లేవరా..తల్లడిల్లిన మాతృహృదయం
నరసరావుపేట: ‘పిచ్చి కన్నా.... సుబ్బూ... లేవరా... ఎలా వెళ్లిన వాడివి ఎలా తిరిగి వచ్చావురా’అంటూ వృద్ధురాలైన మాతృమూర్తి అనంతలక్ష్మి విలపించిన తీరు చూపరులను, బంధువర్గాలను కదిలించింది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతి చెందిన వేద పాఠశాల ఉపాధ్యాయుడు కేతేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం (26) మృతదేహం శనివారం బరంపేటలోని అతని స్వగృహానికి చేరింది. ఆరు నెలల క్రితమే భర్త పాపయ్య శాస్త్రిని కోల్పోయిన ఆ మాతృమూర్తి రెండవ కుమారుడు కూడా విగతజీవుడై కళ్లముందు కనిపించే సరికి గుండెలవిశేలా రొదించింది. శుక్రవారం రాత్రి విషయం తెలుసుకున్న బంధువర్గం శనివారం ఉదయానికి నరసరావు పేటకు చేరుకున్నారు. సత్తెనపల్లిలో పోస్టుమార్టం అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం ప్రత్యేక అంబులెన్స్లో నరసరావుపేటకు చేరింది. దీంతో ఒక్కసారిగా బంధువర్గం రోదనలు మిన్నంటాయి. సుబ్రహ్మణ్యం పదవ తరగతి వరకు పట్టణంలోని శ్రీరామకృష్ణ ఓరియంటల్ హైస్కూల్లో చదువుకున్నాడు. అనంతరం జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ వేదపాఠశాలలో ఐదేళ్ల పాటు చదివి సంస్కృతంలో పట్టా అందుకుని మూడు సంవత్సరాల క్రితం మాదిపాడులోని వేదపాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టాడు. మరో ఆరునెలలో వివాహం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచిస్తుండగా ఇంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
‘వేద’గిరి.. జ్ఞాపకాల సిరి
పవిత్ర విద్య నేర్చుకున్నామన్న వేద విద్యార్థులు టీటీడీ కన్నబిడ్డల్లా ఆదరించిందని ఆనందం వేదపట్టాలతో సొంతూర్లకు పయనం సాక్షి, తిరుమల : ఎక్కడో పుట్టారు. మరెక్కడో పెరిగారు. వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల కొండెక్కారు. ప్రకృతి సుందర ప్రదేశంలో వేదగిరి గురుకులంలో కలిసారు. ధార్మికమైన వేద విద్య నేర్చుకునేందుకు శ్రీకారం చుట్టారు. సహజ జీవనశైలికి దూరంగా గడిపారు. కట్టుబాట్ల నడుమ ఎనిమిదేళ్లు కలసికట్టుగా వేద విద్యను అభ్యసించారు. గురువులను మెప్పించారు. పట్టాను చేతపట్టారు. రెక్కలు వచ్చిన పక్షుల్లా సాధారణ జీవన ప్రపంచంలోకి అడుగిడారు. సొంత ఇంటికన్నా.. తమను కన్నబిడ్డల్లా చూసుకున్న టీటీడీ యాజమాన్యం, పాఠశాల అధ్యాపక బృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలోని టీటీడీ వేద పాఠశాలలో వేదం(పన్నెండేళ్లు), ఆగమ, స్మార్థ, ప్రబంధం (ఎనిమిదేళ్లు) కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు శనివారం సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. గురుకుల విద్యాబోధనలో తమ అనుభవాలను, జ్ఞాపకాలను, గుర్తులను నెమరవేసుకున్నారు. కేకులు కట్ చేశారు. లడ్డూలు, స్వీట్లు సహచర చిన్నారులకు పంచిపెట్టారు. తల్లిదండ్రుల కంటే మిన్నగా తమ గురువులు తోడుంటూ వేదాలను నేర్పించారని కొనియాడారు. కటిక పేదరికంలో ఉన్న తమకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వేదపాఠశాలకు ఏడుస్తూనే వచ్చామని, వెళ్లేటప్పుడు కూడా ఏడుస్తూనే వెళుతున్నామని ఆనందబాష్పాలు రాల్చారు. తమ గురువులు నేర్పిన వేదాలతో భారతీయ సంస్కృతిని ప్రపంచం మొత్తం వ్యాపింపజేస్తామన్నారు. వేదవిద్యను నేర్పించడమే కాకుండా నగదు బహుమతి ఇచ్చిన టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గురువుల ప్రోత్సాహం మరువలేం మాది చాలా పేద కుటుంబం. నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న కాలం చెందారు. అమ్మ కూలి పనులకు వెళుతుంది. బంధువుల సహకారంతో వేదాలు నేర్చుకోవాలని తిరుమలకు వచ్చాను. వేదంలోని శ్రీపాంచరాత్ర ఆగమాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించాను. గురువుల ప్రోత్సాహం, ప్రిన్సిపల్ సహకారం మరువలేం. -ఎం.శ్రీనివాసచార్యులు, మార్కాపురం, ప్రకాశం జిల్లా వేదం కన్నా గొప్ప చదువులేదన్నారు అక్క ఎంఏ, అన్నయ్య ఇంజినీరింగ్ చదివారు. వేదం కన్నా గొప్ప చదువులేదని నాన్న చెప్పారు. ఆ ఉద్ధేశంతో నన్ను వేదపాఠశాలలో చేర్పిం చారు. ఎనిమిది సంవత్సరాలు కుటుంబానికి దూరంగా పాఠశాలలోనే ఉంటూ పవిత్రమైన వేద విద్యను నేర్చుకున్నారు. ఏమీతెలియని వయసులో వచ్చి అనేక గొప్ప విషయాలు నేర్చుకుని వెళుతున్నాను. - కే.భార్గవాచార్యులు, మెట్లపల్లి, కరీంనగర్ జిల్లా టీటీడీకి కృతజ్ఞతలు కటిక పేదరికంలో ఉన్న నాకు చదువుకోవటానికి అవకాశమిచ్చి, ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా చూసుకున్నారు. నిద్రలేచినపుడు వాడే బ్రష్ నుంచి నిద్రపోయేప్పుడు వాడే బెడ్షీట్ వరకు అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్ల పాటు శైవాగమాన్ని నేర్చుకున్నారు. ప్రజలకు వేదాలపై మరింత గౌరవం పెరిగేలా కృషిచేస్తాను. టీటీడీకి కృత జ్ఞతలు. - కే.గణేష్ శర్మ, కోటఉరట్ల, విశాఖపట్నం నా తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాను వేదాలు నేర్చుకుని భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలన్నది నా తండ్రి సంకల్పం. నన్ను ఈ వేద పాఠశాలలో చేర్చిన నాలుగు సంవత్సరాలకు నాన్న చనిపోయారు. ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రీవైష్ణవ ఆగమాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించాను. నా సోదరుడు కూడా ఇక్కడే స్టోర్ వర్కర్గా పనిచేస్తున్నాడు. -పీ.సత్యనారాయణ, ఉత్తనూరు, మహబూబ్నగర్ జిల్లా -
వేదమే జీవననాదం
వేదమే జీవననాదం వారికి. కాన్వెంటుల్లో చదువు ‘కొన’లేని వారు కొందరైతే, చతుర్వేదాలే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలిగిస్తాయని వేద పాఠశాలలో చేరిన వారు మరికొందరు. ‘కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న..’ అన్న పెద్దల మాటలే వేదంగా భావించి వేద పాఠశాలలో చేరినవారు మరికొందరు. వేదమంత్రాలను సుస్వరంతో వల్లె వేస్తూనే, ఇంగ్లిష్ పదాలతోనూ కుస్తీ పడుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ కంప్యూటర్తో దోస్తీ చేస్తున్నారు. కీసరగుట్టలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంస్కృత వేద పాఠశాల తమ విద్యార్థులను ఎందులోనూ తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు గురుకులాలు సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేవి. విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించి ధర్మాన్ని నడిపే సారథులుగా తీర్చిదిద్దేవి. ఇప్పుడు కాలం మారింది. వేద విద్యార్థులు నేటి సమాజంలో బతకాలంటే ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే, ఈ కాలానికి తగినట్లుగా ఇక్కడి విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లిష్, కంప్యూటర్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో పరీక్షలూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఈ ట్రెండ్ పదేళ్ల కిందటే మొదలైంది. బ్రహ్మ ముహూర్తంతోనే దినచర్య బ్రహ్మ ముహూర్తం నుంచే వేద విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. స్నానాదులు ముగించుకుని, ఉదయం ఆరు గంటలకల్లా మధుర స్వరంతో సుప్రభాతం ఆలపిస్తారు. ప్రాతఃకాల సంధ్యా వందనం ముగించుకుని అల్పాహారం తీసుకుంటారు. తొమ్మిది గంటలకు ప్రార్థనలో శ్రీ వేంకటేశ్వరుని అష్టోత్తరంతో కీర్తించి తరగతుల్లోకి వెళ్తారు. మధ్యాహ్నం వరకు గురువు చెప్పిన వేద మంత్రాలను వల్లె వేస్తారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో ఉదయం చెప్పిన మంత్రాలను ఆవృతం (పునశ్చరణ) చేసుకుంటారు. సాయం సంధ్యా వందనం.. రాత్రి సహస్రనామ అర్చనలో పాల్గొని ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు. అనధ్యాయాలే సెలవుదినాలు సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, రెండో శనివారాలు సెలవులు. వేద విద్యార్థులకు మాత్రం అనధ్యాయ దినాలైన పాఢ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలే సెలవులు. ప్రతినెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పాఢ్యమి, అష్టమి, పక్షానికొకటి వచ్చే అమావాస్య, పౌర్ణమి కలిపి నెలకు ఆరు రోజులు పాఠశాల ఉండదు. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోవడం వంటి వ్యక్తిగత పనులు చూసుకుంటారు. పాత పాఠాలను కాసేపు పునశ్చరణ చేస్తారు. సెలవు రోజుల్లోనే కాదు, ప్రతిరోజూ సాయంత్రం 5-6 గంటల సమయంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలాడతారు. స్మార్త, ఆగమ, వేద విభాగాల్లో కోర్సులు ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు వేదపాఠశాలలో చేరడానికి అర్హులు. ఇక్కడి పాఠశాలలో వేద, స్మార్త, ఆగమ విభాగాలు ఉన్నాయి. స్మార్త, ఆగమ విద్యాభ్యాసానికి ఎనిమిదేళ్లు, వేదాధ్యయనానికి పదేళ్లు పడుతుంది. వేదం చదువుకున్న వారికి ఆలయాల్లో అర్చక ఉద్యోగాలు ఉంటాయి. స్మార్తంలో పట్టభద్రులైన వారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే షోడశ సంస్కారాలు (డోలారోహణం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం వంటివి), వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, కర్మకాండ వంటివి జరిపిస్తుంటారు. ఆగమ శాస్త్రాన్ని అభ్యసించిన వారు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిష్ణాతులవుతారు. ఆలయ నిర్మాణం, వాస్తు, దేవుడికి జరిగే కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో వారి మాటే శిలాశాసనం. ఆదరణకు కొదవ లేదు వేద పాఠశాలలో చేరిన రోజునే వేద విభాగ విద్యార్థుల పేరిట రూ.3 లక్షలు, స్మార్త, ఆగమ విద్యార్థుల పేరిట రూ.లక్ష టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. విద్య పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ , టీటీడీ డాలర్ ప్రదానం చేస్తారు. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆదరణ బాగానే ఉంటుంది. వేద పండితులు విదేశాల్లోనూ ’కొలువు‘దీరుతున్నారు. అక్కడి దేవాలయాల్లో ఇక్కడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లి నియమించుకుంటున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులతో విద్యార్థులు ముందుకెళ్తున్నారు. వేదం గొప్పతనం తెలిసింది : సుబ్రమణ్యం పోలీసు అవుదామనుకున్నా.. మా కుటుంబం బలవంతం మీదే వేద పాఠశాలలో చేరాను. ఇక్కడికొచ్చిన ఏడాదికే నా అభిప్రాయం తప్పని తెలిసింది. పోలీస్ ఉద్యోగంలోనైతే పరిమితమైన ప్రాంతానికే సేవ చే సే అవకాశముంటుంది. అదే వేద పండితుడిగా దైవానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే యావత్ సమాజానికి సేవ చేసినట్టే. వేదాల్లో మిగిలినవి కొన్ని మాత్రమే : దత్తు, తణుకు భాషలు, లిపులు అంతరించిపోతున్నట్లే, వేదాలు కూడా చాలావరకు అంతరించిపోతున్నాయి. అభ్యసించే వాళ్లే కాదు, బోధించేవాళ్లూ తగినంత మంది లేకపోవడమే దీనికి కారణం. రుగ్వేదంలో నిజానికి 21 శాఖలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మిగిలినవి రెండే. యజుర్వేదంలో వంద శాఖలు ఉంటే, వాటిలోనూ రెండే మిగిలాయి. సామవేదంలో వెయ్యిశాఖలు ఉంటే, మూడే అందుబాటులో ఉన్నాయి. -
అమెరికాలో 163మంది వేదవిద్యార్థుల అదృశ్యం