Vijay Devarakonda
-
కుంభమేళాకు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్
-
కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ సతీమణి కూడా!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్డమ్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
వైజాగ్లో కింగ్డమ్
వైజాగ్ వెళ్లారట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ చిత్రీకరణ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ వైజాగ్ వెళ్లారని తెలిసింది.దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్లో ‘కింగ్డమ్’ చిత్రీకరణ జరుగుతుందని, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరణ జరిగేలా ఈ చిత్రదర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, రెండు రకాల టైమ్లైన్స్తో కథ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాను మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రమే కాకుండా దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలాలతో విజయ్ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. -
ఇయర్ ఎండ్ కు గీతగోవిందం మ్యారేజ్?
-
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. యూట్యూబ్లో 10 మిలియన్స్ వ్యూస్తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కింగ్డమ్ టీజర్ పోస్టర్ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్కు యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్తో టీజర్ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
జూనియర్ ఎన్టీఆర్తో విజయ్ దేవరకొండ.. మొత్తానికి లుక్ రివీల్ చేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్, టీజర్ రిలీజ్పై అప్డేట్ ఇచ్చారు. ఈనెల 12న టీజర్తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఒక రోజంతా జీవితం, సమయాలు, సినిమా గురించి మీతో నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా అనిపించింది.. టీజర్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు మీరు కూడా నాలాగే ఎగ్జైట్ అయ్యారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక రోజంతా సమయమిచ్చినందుకు థ్యాంక్ యూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్కు ధన్వవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.టీజర్కు ఎన్టీఆర్ డబ్బింగ్..అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం వీడీ12కు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. బుధవారం రిలీజ్ చేయనున్న టీజర్కు ఎన్టీఆర్ తన వాయిస్ను అందించారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మాకు అవసరమైన సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్న.. మీ వాయిస్తో వీడీ12 టీజర్ భావోద్వేగాలను మరోస్థాయికి తీసుకెళ్తుందని నాగవంశీ ట్వీట్ చేశారు.అయితే ఈ పోస్ట్లో విజయ్ దేవరకొండ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ మొహం కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన సందర్భంగా తన వీడీ12 లుక్ను అభిమానులకు పరిచయం చేశాడు. ఫుల్ గడ్డంతో మాస్ హీరోగా దర్శనమిచ్చారు రౌడీ హీరో. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Spent most of yesterday with him. Chatting about life, times, cinema. Laughing about the same.. Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life. Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025 -
మహాకుంభమేళాలో విజయ్.. గెటప్ కనిపించొద్దని...!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. ముఖానికి మాస్కుతో..అక్కడికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.సినిమావిజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 12వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించనున్నాడు.చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్న్యూస్తో సీరియల్ నటి -
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్లు,ఐపీఎస్లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్రాజ్కు వెళుతున్నారు. -
లైగర్ లో నటించడం నాకు ఇష్టం లేదు
-
'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా?
ఏదైనా సినిమా ప్రకటిస్తే చాలు దాని టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అభిమానులు. చిత్రయూనిట్ చెప్పేవరకు ఆగట్లేదు. టాప్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)ని కూడా ఇలాగే విసిగిస్తున్నారట. విజయ్ దేవరకొండ 12వ సినిమా (#VD12) టైటిల్ చెప్తావా? లేదా? అని ఏకంగా బండబూతులు తిడుతున్నారట.తిట్టు భరించాక..ఈ విషయాన్ని నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మీ అందరి తిట్లు భరించాక.. నేను దర్శకుడు గౌతమ్ను చాలా హింస పెట్టాక ఎట్టకేలకు ఓ టైటిల్ ఫిక్స్ చేశాం. అదేంటో అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నాడు. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ సామ్రాజ్యం అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!పోలీసాఫీసర్గా విజయ్?విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. కల్కి 2898 ఏడీలో ముఖ్య పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది విజయ్ కెరీర్లో 12వ సినిమా. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో విజయ్ పోలీసాఫీసర్గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా విడుదల ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది.#VD13 సినిమామరోవైపు విజయ్ తన పదమూడో సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారుపీరియాడిక్ మూవీలో విజయ్విజయ్ తన పద్నాలుగో సినిమాను శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో చేస్తున్నాడు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.చదవండి: వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? -
బ్రిటీష్ పాలన నేపథ్యంతో...
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. కాగా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా సెట్ వర్క్ని ప్రారంభించారు మేకర్స్. ‘‘బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’. ఇప్పటి వరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఒక పవర్ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.త్వరలోనే షూటింగ్ప్రారంభిస్తాం’’ అని రాహుల్ సంకృత్యాన్ పేర్కొన్నారు. ‘‘19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
యంగ్ హీరోస్.. స్టార్ టైటిల్స్
-
డేట్ మారిందా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ డేట్కి రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ చిత్రంలో విజయ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకులు రాహుల్ సంకృత్యాన్ , రవికిరణ్ కోలా సినిమాల్లో విజయ్ దేవర కొండ నటించనున్నారు. -
కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్లానింగ్ మార్చిన రౌడీ స్టార్
-
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి రూమర్స్ నిజమేనా..!
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్పై ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్బాబు. రాజమౌళి డైరెక్షన్లోని కొత్త సినిమా కోసమే మహేశ్బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్తో మరో గెటప్లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్చరణ్ క్లీన్ షేవ్ లుక్స్తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్చరణ్ హెయిర్ స్టైల్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్లో ఫుల్ వైట్ హెయిర్తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్తో, కరెక్ట్ ఫిజిక్తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్గా చాలా హార్డ్వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్లో.. మాసీ లుక్స్తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్లో నటించాలంటే స్పెషల్గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్తో, స్ట్రాంగ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ దీనిపై స్పందించకుండా కామ్గా ఉంటున్నారు. సమయం వచ్చినప్పడు తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని విజయ్ అంటున్నాడు. (చదవండి: యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి పోతారంటూ సెటైర్.. నాగవంశీ రిప్లై ఇదే!)ఇక రష్మిక అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచననే లేదని చెబుతోంది. కానీ వీరిద్దరు వెకెషన్ ట్రిప్ వెళ్లడం..అక్కడ కెమెరాకు చిక్కడం..ఆ ఫోటోలు వైరల్ అవడం జరుగుతూనే ఉంది. అయితే అఫిషియల్గా మాత్రం ఎక్కడా బయటపెట్టట్లేదు. తాజాగా యంగ్ ప్రొడ్యుసర్ నాగవంశీ రష్మిక ప్రేమాయణం గురించి స్పందించాడు. (చదవండి: దర్శకుడి చేతిలో ‘ప్రేమలు’ బ్యూటీ చెంప దెబ్బలు.. నిజమెంత?)రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసని చెప్పాడు. ప్రస్తుతం రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్’ లో నాగ వంశీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నువ్వు చెప్పకపోయినా ఆ తెలుగు హీరో మాకు తెలుసు’, ‘రష్మిక లవ్ చేస్తున్నది విజయ్ దేవరకొండనే’, ‘ఈ ఏడాదిలో రష్మిక- విజయ్ల పెళ్లి జరగాలి కోరుకుంటున్నాను’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్ ఇలా
సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్లను కొంతమంది సీరియస్గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. ‘నా రిలేషన్షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు. -
అల్లు అర్జున్ ను కలిసిన విజయ్ దేవరకొండ
-
రష్మిక 'గర్ల్ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాబోయే మార్చిలో రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇతడి తండ్రి స్వయంగా మాట్లాడటినట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామంది రష్మిక అని అంటారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా కిక్కురుమనరు.తాజాగా విజయ్ తండ్రి గోవర్దన్ని కొడుకు పెళ్లి గురించి అడిగితే.. విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమా ఉంటుందని, అనంతరం కొన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. అందుకే కాస్త వీలు చూసుకుని, విజయ్కి టైమ్ కుదిరినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తామని అన్నారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చని చెప్పారు. అంటే ఇప్పట్లో విజయ్ పెళ్లి లేనట్లే!(ఇదీ చదవండి: నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్) -
దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక
హీరోయిన్ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయం కనిపిస్తూనే ఉంటుంది. విజయ్-రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్స్కి వెళ్తుంటారు. కానీ ఎవరికి వాళ్లు ఒంటరిగా దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాటిని కలిపి చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది.బుధవారం రాత్రి మూవీ టీమ్తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్లో సినిమా చూసిన రష్మిక.. గురువారం సాయంత్రం ఏఎంబీలో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు విజయ్ కుటుంబాన్ని కలిసినప్పటికీ ఎప్పుడు ఇలా బయటపడలేదు. కానీ ఇప్పుడు సినిమాని కలిసి చూడటం లాంటివి చూస్తుంటే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్పేస్తారేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
అల్లు అర్జున్కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్ 'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి కాగా.. చివరి దశ ప్రమోషన్లలో టీమ్ అంతా ఫుల్ హడావుడిగా ఉంది. ఇలాంటి టైంలో బన్నీకి ఎప్పటిలానే క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గతంలో పుష్ప తొలి భాగం రిలీజ్ టైంలో ఇచ్చినట్లే ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ చేశాడు.(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?)తన సొంత 'రౌడీ' బ్రాండ్ కలెక్షన్స్ నుంచి అల్లు అర్జున్కి ఇప్పటికే పలుమార్లు విజయ్ దేవరకొండ డ్రస్సులు ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ కోసం మరో బహుమతి పంపాడు. 'పుష్ప' పేరుతో ఉన్న టీ షర్ట్లను ఇచ్చాడు. దీంతో వాటిని ఫొటో తీసిన అల్లు అర్జున్.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. 'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు థ్యాంక్యూ' అని బన్నీ రాసుకొచ్చాడు. 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని విజయ్ రిప్లై ఇచ్చాడు.డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అనే టాక్ నడుస్తోంది. ఇందుకు తగ్గట్లే పాట్నా, చెన్నై, కోచిలో భారీ స్థాయిలో ఈవెంట్స్ పెట్టారు. ముంబైలో శుక్రవారం ప్రెస్మీట్ జరగనుంది. డిసెంబరు 1న బెంగళూరులో ఈవెంట్ ఉంది. మరి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సందేహంగా ఉంది.(ఇదీ చదవండి: 'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్) -
ప్రేమ విషయం.. పబ్లిక్లో ఓపెన్ అయిపోయిన రష్మిక
రష్మిక పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజమని వీళ్ళిద్దరూ చెప్పరు. కానీ ఎప్పటికప్పుడు కలిసి ఎక్కడో ఓ చోటకు వెళ్తారు. ఎవరో వీళ్లిద్దరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో కొన్నిరోజుల పాటు ఈ టాపిక్ నెటిజన్ల మధ్య డిస్కషన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎందుకు అనుకుందో ఏమో గానీ రష్మక.. తన ప్రేమ విషయంలో సగం ఓపెన్ అయిపోయింది.'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చెన్నైలో ఆదివారం జరిగింది. గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలో రష్మి పెళ్లి టాపిక్ వచ్చింది. 'మీరు చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తినా? లేదంటే బయటి వ్యక్తినా?' అని యాంకర్ అడగ్గా.. ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని రష్మి నవ్వుతూ చెప్పింది. దీనికి శ్రీలీల చప్పట్లు కొడుతూ తనకు తెలుసు అన్నట్లు తెగ సంబరపడిపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు)మరి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరే ప్రపోజ్ చేస్తారా? అని యాంకర్ మరోసారి అడగ్గా.. అస్సలు వెయిట్ చేయను, నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తాను అని రష్మిక చెప్పింది. ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని అందరికీ తెలుసు. అయితే నేరుగా ఇతడి పేరు చెప్పగానే.. తాము ప్రేమలో ఉన్నది నిజమే అని హింట్ ఇచ్చేసింది. దీంతో అటు రౌడీ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.రష్మిక-విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నట్లు పబ్లిక్గా క్లారిటీ వచ్చేసింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారో చూడాలి? రష్మిక సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. 'ఛావా' అనే హిందీ మూవీ డిసెంబరు చివర్లో విడుదల కానుంది. 'సికిందర్' మూవీలో సల్మాన్కు జోడిగా నటిస్తుంది. వీటితో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.(ఇదీ చదవండి: స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!)Do you propose or wait for the proposal?Would you marry someone from the film industry or not“Everyone knows about it."- #RashmikaMandanna at #PushpaWildfireevent pic.twitter.com/x7dxjyM4gb— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 24, 2024 -
మరోసారి విజయ్ దేవరకొండతో కనిపించిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలు ఫోటోలతో చాలా వార్తలు వచ్చాయి. పులు సినిమాల్లో జోడీగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వారిద్దరూ నిజ జీవితంలో కూడా ఒకరికొకరు అంతే దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఒకే స్పాట్లో ఉన్న ఫోటోలు చాలానే వచ్చాయి. అయితే, తాజాగా వారిద్దరూ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటూ కనిపించారు. ఎవరో వారి పోటోను సీక్రెట్గా తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. కానీ, ఈ ఫోటో ఎప్పుడు తీశారు..? ఎక్కడ తీశారు వంటి వివరాలు మాత్రం తెలపలేదు.గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో మెప్పించిన ఈ జోడీ.. వారిపై వస్తున్న రూమర్స్ గురించి ఇప్పటికే స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చింది. మొదట వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పరోక్షంగా రివీల్ చేయడంతో అప్పటి నుంచి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల క్రితం విజయ్ ఓ వేదికపై మాట్లాడుతూ తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు నటించిన వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు కూడా తెలిపారు. విజయ్ వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్దిరోజులకే ఈ ఫోటో బయటకు రావడంతో వారిద్దరి ప్రేమ నిజమేనేమో అనే సందేహాలు వస్తున్నాయి. -
35 ఏళ్లు వచ్చాయి.. ఇంకా సింగిల్గా ఉంటానా?: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్లో నటించాడు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్లో కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ తన రిలేషన్షిప్ స్టేటస్ బయటపెట్టాడు. తాను సింగిల్ కాదని ఒప్పేసుకున్నాడు. విజయ్ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు.ప్రేమ గురించి తెలుసుప్రేమ విషయానికి వస్తే.. ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో తెలుసు.. ఒకర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. షరతుల్లేని ప్రేమ గురించి నాకు తెలియదు. నా ప్రేమ మాత్రం అంచనాలతోనే ఉంటుంది. నాది అన్కండిషనల్ లవ్ కాదు అని తెలిపాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. అతడు రష్మిక కోసమే చెప్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మికతో లవ్!కాగా విజయ్-రష్మిక చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ అది బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే పండగలు, వెకేషన్స్ అప్పుడు మాత్రం ఒకే చోట ఫోటోలు దిగి వాటిని నెట్టింట్లో వదిలి తాము కలిసే ఉన్నట్లు హింట్లిస్తుంటారు.చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్లానింగ్ మార్చిన విజయ్
-
ఒకే ఫ్రేమ్ లో రౌడీ, రెబల్, యానిమల్.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..!
-
విజయ్ దేవరకొండ 'సాహిబా'ను మీరూ చూసేయండి
టాలీవుడ్ రౌడీ బాయ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. విజయ్ దేవరకొండ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి సాంగ్ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశారు. 'సాహిబా' అనే పాట కోసం రాధిక మదన్తో కలిసి విజయ్ కనిపించారు. బాలీవుడ్లో సత్తా చాటుతున్న సింగర్ జస్లిన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేశారు.మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం విజయ్ దేవరకొండ గతంలో కూడా పనిచేశారు. సుమారు ఆరేళ్ల క్రితం 'నీ వెనకాలే నడిచి' అనే సాంగ్ కోసం ఆయన వర్క్ చేశారు. 2018లో యూట్యూబ్లో విడుదలైన ఈ సాంగ్ కూడా అప్పట్లో ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు 'సాహిబా' కోసం సింగర్ జస్లిన్ రాయల్ ఫిదా చేశారు. 'హీరియే' పాటతో జస్లిన్ రాయల్ కూడా గతంలో భారీగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. -
ఆకాశంలో విహరిస్తూ ఫుడ్ ఆరగించిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఓ ఆల్బమ్ సాంగ్లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే విజయ్కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్లో విజయ్అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. తన కెరీర్లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్కు ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్లోనే విజయ్కి ఒక చక్కటి కథను తరుణ్భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్గా విజయ్ ఈ ప్రాజెక్ట్పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది. -
తెలుగులో ఆ రెండు సినిమాలే నా ఫేవరేట్: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవర ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్తో అభిమానులను అలరించాడు. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.తాజాగా హైదరాబాద్లో జరిగిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లిచూపులు హిట్ తర్వాత నా ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్ నుంచే.. త్రివిక్రమ్ సార్ నన్ను ఆఫీస్కు పిలిచి అందించారు. ఆయనను కలవడం నా జీవితంలో బిగ్ మూమెంట్ అన్నారు. నా ఫేవరేట్ సినిమాలు మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అని విజయ్ తెలిపారు. ఎవరైనా ఖలేజా సినిమా బాగలేదంటే వారితో గొడవపడేవాడిని అని విజయ్ దేవరకొండ అన్నారు.కాగా..వీడీ 12 తర్వాత మరో రెండు చిత్రాల్లో విజయ్ నటించనున్నారు. రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. వీడీ12 వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. #Trivikram గారు డబ్బులతో ధైర్యం ఇచ్చారు, #Athadu & #Khaleja are my most favourite films - @TheDeverakonda #VijayDeverakonda #VD12 #LuckyBaskhar #TeluguFilmNagar pic.twitter.com/6I5vkmfkOL— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అక్టోబరులో ఆరంభం
‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 19వ శతాబ్దపు నేపథ్యంలో 1854 – 1878 టైమ్ పీరియడ్లో ఈ సినిమా తెరకెక్కనుంది.రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ ఉంటుందని, ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభమయ్యేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
రెండు భాగాలుగా ‘వీడీ 12’.. టార్గెట్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. విజయ్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ను నవంబరు కల్లా పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట.(చదవండి: ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా) ఇందుకు తగ్గట్లుగా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్పై ఈ దసరా పండగ సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పెగా కనిపిస్తారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే చాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!)అలాగే రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాల చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం విజయ్ మేకోవర్ కావాల్సి ఉంది. అందుకే ‘వీడీ 12’ సినిమా చిత్రీకరణను తొందరగా పూర్తి చేసి, తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కంగారుపడ్డా..'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఫిక్స్ అయిపో..తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇకనైనా గొడవలకు చెక్!కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్వార్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
స్టార్ బ్రాండ్స్..
ప్రముఖ సినీతారలు, క్రీడాకారులు, ఫ్యాషన్ ఐకాన్స్, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా విభిన్న రంగాల్లో సెలబ్రిటీలు తమ కళ, నైపుణ్యాలతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో, అభిమానులతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం వారిని సెలబ్రిటీలుగా మారుస్తుంది. ఇలా వారి వారి రంగాల్లో తారలుగా వెలుగొందుతూనే, వారికున్న ఇమేజ్, ప్రశస్తిని వ్యాపారంగానూ మార్చుకునే ట్రెండ్ గతంలోనే మొదలైంది. చాలా వరకూ సెలబ్రిటీలు వివిధ బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం సొంత బ్రాండ్లను ఆవిష్కరిస్తుండడం విధితమే. ఇందులో టాలీవుడ్ స్టార్లు మొదలు బాలీవుడ్ తారలు, భారతీయ క్రికెటర్లు తదితర సెలబ్రిటీలు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మోడ్రన్ ట్రెండ్స్, అధునాతన ఫ్యాషన్ హంగులకు ఎల్లప్పుడూ వేదికగా నిలిచే హైదరాబాద్ నగరం ఈ సెలబ్రిటీ బ్రాండ్లకు సైతం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నగర వేదికగా క్రేజ్ పొందుతోన్న కొందరు సెలబ్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందామా.. మేము సైతం.. టాలీవుడ్ సూపర్స్టార్గా వెలుగొందుతున్న మహేష్ బాబు కూడా ఈ ఓన్ బ్రాండ్ బిజినెస్లోకి అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు కొనసాగించారు. ‘ది హంబుల్ కో’ అనే క్లాతింగ్ బ్రాండ్తో మహేష్ అలరించి మధ్యలో ఆపేశారు. తన బ్రాండ్ పేరు మధ్యలో ‘ఎమ్బి’ అనే ఇంగ్లిష్ అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. ఇదే కోవలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 విడుదలై, విజయవంతమైన సమయంలో ‘బీ ఇస్మార్ట్’ అనే బ్రాండ్ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అది అందుబాటులో లేదని సమాచారం. యూ వి కెన్.. క్యాన్సర్ నుంచి బయట పడిన అనంతరం తనలాంటి క్యాన్సర్ బాధితులకు సహకారం అందించడమే లక్ష్యంగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ‘యూ వి కెన్( ్గౌu గ్ఛి ఇ్చn...)’ అనే ఎన్జీవోను ప్రారంభించారు. ఈ సంస్థకు ఆర్థిక వనరుల కోసం అదే పేరుతో అథ్లెటిక్ వేర్, క్యాజువల్ వేర్ను ఆవిష్కరించారు. క్రీడాకారులు, క్రీడా రంగానికి చెందిన వివిధ వ్యక్తులు ఈ బ్రాండ్ను బాగా ఆదరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యూవీ ఇదే సంస్థ తరపున నగరంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ‘రాన్’.. రన్ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు ఆటలో దూకుడుతోనూ.. ఇటు మోస్ట్ ఫ్యాషనబుల్ పర్సనాలిటీతోనూ ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా అలరిస్తుంటాడు. అయితే విరాట్ కోహ్లికి సైతం ‘రాన్’ అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్కు దేశవ్యాప్తంగానే కాకుండా నగరంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడి ఆదరణ గమనించిన కోహ్లి.. తన బ్రాండ్ అంబాసిడర్ ఎబీ డివీలియర్స్తో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించాడు. ఎబీ డివీలియర్స్ తనతో ఆర్సీబీ టీమ్ మేట్మాత్రమే కాదు, తన బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నాడు. మోడ్రన్, క్లాసీ లుక్స్ ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఏ ‘ఊకో కాక’.. సింగర్గా గల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించి ఆస్కార్ వేదిక వరకూ ఎదిగిన లోకల్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ఈ వ్యాపారంలోకి వచ్చారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టే ‘ఊకో కాక’ అనే పేరుతో క్లాతింగ్ స్టోర్లు ప్రారంభించాడు. మధ్య తరగతి కుటుంబాలు మొదలు రిచ్ పీపుల్ వరకూ ఈ బ్రాండ్కు ఫ్యాన్స్ ఉన్నారు. లోకల్ ఫ్లేవర్తో, మాస్, ట్రెండీ లుక్స్తో ఈ బ్రాండ్ దూసుకుపోతోంది. సచిన్ సైతం.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఒక మతమైతే సచిన్ టెందుల్కర్ని దేవుడిలా కొలుస్తారు. అలాంటి సచిన్ సైతం ఫ్యాషన్ రంగంలో సొంత బ్రాండ్తో బిజినెస్ చేస్తున్నాడు. అరవింద్ ఫ్యాషన్తో సంయుక్తంగా జతకట్టి మగవారికి సంబంధించిన నాణ్యమైన కలెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారసత్వ వైభవాన్ని ప్రదర్శించేలా అధునాతన హంగులనూ అవసోపన పట్టిన ఈ డిజైన్స్కు మంచి ఆదరణ ఉంది. దీంతో పాటు సచిన్ టెందుల్కర్ స్పిన్నీ, బూస్ట్, బీఎండబ్ల్యూ వంటి వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘అల్లూ’రిస్తూ... తెలుగు సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం పాన ఇండియా స్థాయిలో స్టైలిష్ స్టార్గా ప్రత్యేక గుర్తింపున్న అల్లు అర్జున్ సైతం ‘ఏఏ’ బ్రాండ్ ఆవిష్కరిస్తున్నారని పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ‘ఏఏ’ పేరుతో కొన్ని లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనర్..ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సైతం నగరంలో ప్రత్యేకంగా స్టోర్ ఉండటం విశేషం. తన డిజైన్స్ను నగరంలో ప్రమోట్ చేయడం కోసం కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారలతో నగరంలో అతిపెద్ద ఫ్యాషన్ షోలను సైతం ఈ ఫ్యాషన్ ఐకాన్ నిర్వహించాడు.‘రౌడీ’ బాయ్స్..టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న కథాంశాలు, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో అతి తక్కువ సమయంలో టాప్ హీరోల స్థాయిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే హవాను కొనసాగిస్తూ ‘రౌడీ’ అనే ఇండియన్ స్ట్రీట్ కల్చర్ టాప్, బాటమ్ వేర్ బ్రాండ్ను ప్రారంభించారు. సరికొత్త ట్రెండ్స్ను ఇష్టపడే యూత్ ఈ రౌడీ బ్రాండ్ను బాగా ఆదరిస్తున్నారు. ఈ బ్రాండ్ యాడ్స్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ సొంత బ్రాండ్ను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్. సినిమా ఫంక్షన్లు, టీవీ షోలలో విజయ్ తన బ్రాండ్ దుస్తులనే ధరిస్తూ హ్యండ్సమ్ లుక్స్తో అలరిస్తుంటారు. ఈ బ్రాండ్ ఆన్లైన్ రౌడీ క్లబ్లో లభ్యమవుతాయి.బీయింగ్ హైదరాబాదీ.. దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ మార్కెట్లో బీయింగ్ హ్యూమన్ది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ కావడంతో దీనికి మంచి ఆదరణ ఉంది. 2007 నుండి సల్మాన్ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి బీదవారి ప్రాథమిక విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. 2009 నుండి బీయింగ్ హ్యూమన్ పేరుతో ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రారంభించాడు. వచ్చే ఆదాయాన్ని తన స్వచ్ఛంద సంస్థ తరపున సేవా కార్యక్రమాలకే ఖర్చుపెడుతున్నాడు. హైదరాబాద్లో సల్మాన్ ఖాన్కు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సల్మాన్కు నగరంతో ప్రత్యేక అనుబంధముంది. తన చెల్లి పెళ్లిని సైతం ఇక్కడే చేయడం తెలిసిందే.గ్లామర్ క్వీన్స్.. ప్రియాంక చోప్రా అనోమ్లీ బ్యాటీ ఉత్పత్తులు, దీపికా పదుకొనె ఆల్ అ»ౌట్ యూ, సమంత సాకి, అనుష్క శర్మ నుష్ వంటి బ్రాండ్లు కూడా ఇక్కడ లాభాల్లో అమ్ముడవుతున్నాయి. గ్లామర్కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న ఈ తారల సొంత బ్రాండ్లు ఫ్లిప్కార్ట్, మింత్ర లాంటి అన్లైన్ పోర్టల్స్లో లభ్యమవుతుండగా.. సమంత మాత్రం సాకి.కామ్ పేరుతో సొంత ఈకామర్స్ పోర్టల్ నడుపుతోంది. టాప్లో.. వీరితో పాటే ధోనీ సెవెన్ బ్రాండ్, విరేంద్ర సెహా్వగ్ వీఎస్ బ్రాండ్లకు సైతం ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ కామర్స్ పెరిగిపోవడంతో అందిరి సెలబ్రిటీల బ్రాండ్స్ అభిమానులు ఆర్డర్ చేస్తున్నారు. -
విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల సంచలన కామెంట్స్
-
'అర్జున్ రెడ్డి ఫుల్ కట్ చూపించు'.. డైరెక్టర్ను కోరిన విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి. బాలీవుడ్ భామ షాలినీ పాండే హీరోయిన్గా నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రిలీజై నేటికి ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మూవీ స్టిల్స్ షేర్ చేశారు. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకుండా పోతున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు. విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'పదో వార్షికోత్సవానికి అర్జున్రెడ్డి ఫుల్ కట్ను అందుబాటులోకి తీసుకురా. అర్జున్ రెడ్డి విడుదలై ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా గత సంవత్సరంలోనే జరిగినట్లుగా అనిపిస్తోంది' అంటూ మూవీ షూటింగ్ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పదో వార్షికోత్సవానికి ఫుల్ వెర్షన్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.కాగా.. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో రన్ టైమ్ దాదాపు 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ పలు కారణాల రీత్యా 3 గంటల 2 నిమిషాలకు కుదించారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల నిడివిని తగ్గించాలని సెన్సార్ బోర్డు కట్ చెప్పింది. తెలుగులో సూపర్హిట్ నిలిచిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా , హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేశారు.Give the people 'The SandeepVanga #ArjunReddy full cut' for the 10 years anniversary @imvangasandeep!I cannot believe it is 7 years already, remember so many moments as if it was last year ❤️ pic.twitter.com/J8CmcByHae— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2024 -
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ : సెవన్ ఓక్ పెట్ హాస్పిటల్లో సందడి చేసిన విజయ్ ,ఆనంద్ దేవరకొండ (ఫొటోలు)
-
టైగర్ తో ఫైటింగ్ కి దిగుతున్న లైగర్
-
ఏకంగా సల్మాన్ ఖాన్ తో విజయ్ దేవరకొండ క్లాష్
-
Vijay Devarakonda: మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్లో థియేటర్ ఆర్టిస్ట్స్ని కలిసేవాడిని. అప్పుడే విజయ్ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్తో చేశాం. నా వల్ల విజయ్కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్సైడర్గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్లో విజయ్ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్ని ఫ్యామిలీ మేన్గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్మేన్’.మీ బాయ్స్కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
లుక్ మార్చిన రౌడీ.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..
-
ఉగాదికి వస్తున్నా
ఉగాదికి థియేటర్స్లో కలుద్దాం అంటున్నారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి, మూవీని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదలను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే టైటిల్ను, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారనీ టాక్. ఈ సినిమాకు కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి. జాన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూశాను : విజయ్ దేవరకొండ
‘‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నిర్వహిస్తున్న దర్శక సంజీవని మహోత్సవంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మీరంతా ఎన్నో కలలు కంటుంటారు. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో హీరోగా ఎదగక ముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు... భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ, కలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగుతుంటారు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీని ‘దర్శక సంజీవని మహోత్సవం’ పేరుతో హైదరాబాద్లో నిర్వహించింది. దివంగత దర్శకుడు డా. దాసరి నారాయణరావు పేరు మీద దాసరి హెల్త్ కార్డులను అందించారు. ‘‘మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ అసోసియేషన్కు నా సహకారం ఉంటుంది’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ. ‘‘అసోసియేషన్లోని 720 మంది హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 1920 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాం’’ అన్నారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ సంజీవని మహోత్సవ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
పద్ధతిగా ఉండాలి.. విజయ్తో గొడవపై అనసూయ లేటెస్ట్ కామెంట్స్
యాంకర్ అనసూయ.. ఈ పేరు చెప్పగానే ఆమె అందంతో పాటు చిన్న చిన్న వివాదాలు కూడా గుర్తొస్తాయి. 'అర్జున్ రెడ్డి' రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, మూవీ కంటెంట్పై అనసూయ కొన్ని కామెంట్స్ చేసింది. అప్పటినుంచి విజయ్-అనసూయ పరోక్షంగా చిన్నపాటి గొడవ నడుస్తూ వచ్చింది. కొన్నిరోజుల క్రితమే దీనికి పుల్స్టాప్ అని చెప్పింది. తాజాగా మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్)'నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సినిమాలతో ఎలాగైతే మెసేజ్ ఇస్తారో నేను కూడా అలానే ఇవ్వాలని అప్పుడు రియాక్ట్ అయ్యాను. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆ రోజు మీరెవరూ మాట్లాడకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీడియా ప్రశ్నించలేదు. మళ్లీ తప్పు ఎత్తి చూపినందుకు నన్నే అన్నారు. ఎవరిపైనా నాకు ద్వేషం లేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చేసింది.అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ 'సింబా'. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఇందులోనే ఓ సీన్లో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని చెప్పగానే అనసూయ పాత్ర సిగ్గుపడుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత మీడియా.. విజయ్ దేవరకొండతో గొడవపై ప్రశ్నించింది. అనసూయ కూడా ఇక దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదని చెబుతూ స్పష్టత ఇచ్చేసింది.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ) -
విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
నా మాటలను వక్రీకరించారు. నా వ్యాఖ్యలను ఇష్టమొచ్చినట్లుగా మార్చేసి నెగెటివ్గా రాశారు. దాన్నే అందరూ నిజమని నమ్ముతున్నారు. ఇదంతాచూస్తుంటే నా బుర్ర వేడెక్కుతోంది అంటోంది బెంగాలీ నటి మలోబిక బెనర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముందుగా హీరో విజయ్ దేవరకొండకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.ఆయనకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పాను. దాన్ని మీడియాలో దారుణంగా చిత్రీకరించారు. హిందీ అంటేనే తనకు గిట్టదని, ఆ భాషను అసహ్యించుకుంటాడని రాస్తున్నారు. నేనసలు అలా చెప్పనేలేదు. అయినా ఎంతో దారుణంగా ఇష్టమొచ్చినట్లుగా రాస్తున్నారు. దీనివల్ల మంచి మిత్రుడికి దూరమయ్యాను. నేను చాలా సరదాగా అన్న మాటలను సీరియస్గా రాశారు. అది చదివాక విజయ్ నాతో టచ్లోనే లేకుండా పోయాడు. నేనేదో సరదాగా అన్నానే తప్ప ఆయన్ను ఇరికించాలనో, తప్పు పట్టాలనో పనిగట్టుకు చెప్పలేదు' అని పేర్కొంది.కాగా మలోబిక దిల్బర్, ప్రెట్టీ గర్ల్ వంటి ప్రైవేట్ సాంగ్స్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. దానికంటే ముందు బెంగాలీ, ఒరియా భాషల్లో అనేక సినిమాలు చేసింది. బంగ్లా బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. విజయ్ దేవరకొండతో.. నీ వెనకాలే నడిచి అనే ప్రైవేట్ సాంగ్లో నటించింది. చదవండి: కుడి కాలు, చేయి ఫ్రాక్చర్.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్ పొలిశెట్టి -
శ్రీలంకలో అడుగుపెట్టిన రౌడీ హీరో.. ఆ సినిమా కోసమేనా?
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ స్టార్తో అభిమానులను అలరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. అయితే విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. వర్కింగ్ టైటిల్ వీడి12 పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న రౌడీ హీరోకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబోలో మరో చిత్రం రానుంది. వీడీ13 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) -
ఇండియన్ ఐడల్ సీజన్ 2.. గెస్టుగా విజయ్ దేవరకొండ
తెలుగు ఇండియన్ ఐడల్ - సీజన్ 3 వినోదాన్ని రెట్టింపు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ వారం ఎపిసోడ్స్కి ఓ కొత్త గెస్ట్ వచ్చేస్తున్నాడు. 'కల్కి 2898 ఏ.డీ'లో అర్జునుడిగా కనిపించిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ షోలో కనిపించనున్నాడు.ఈ మేరకు ఓ ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ''ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆహా మన ప్లాట్ఫామ్. మన తెలుగు కంటెస్టెంట్స్కు సపోర్టుగా ఉండాలి. మీ జర్నీలో ఉండాలని వచ్చాను" అని ప్రోమోలో చెప్పాడు. విజయ్ షోకి రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ డబుల్ మ్యూజికల్ ట్రీట్గా ఉండబోతున్నాయని ఇట్టే తెలిసిపోతుంది. ఈ వారం నుంచే ఓటింగ్ కూడా స్టార్ట్ కానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 3.. ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. -
ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త ఆలోచనలతో సరికొత్త మూవీస్ చేస్తూ అబ్బురపరుస్తుంటారు. అలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ కుర్రాడు జస్ట్ రెండే సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లేటెస్ట్గా ఇతడి పేరు మరోసారి మార్మోగిపోతోంది. మరి హింట్స్ ఇచ్చాం కదా ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ముగ్గురు కుర్రాళ్లున్నారు. వీళ్లలో ఓవైపు చివరలో ఉంది విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. మరో చివర ఉన్నది ఎవరంటే టక్కున చెప్పడం కష్టం. అతడి పేరు నాగ్ అశ్విన్. తాజాగా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి' మూవీ తీసింది ఇతడే. డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన ఇతడు.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇతడి కెరీర్తో పాటు జీవితాన్నే మార్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాకముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది చూసిన నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు. పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు. తొలుత ఒకటి అనుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' బయటకొచ్చింది. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ నటుడిగా పూర్తిస్థాయిలో పరిచయమయ్యాడు. దీని తర్వాత 'మహానటి'తో సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి నాగ్ అద్భుతం చేశాడు.ఇక తనతో సినిమా తీసిన ప్రియాంక దత్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా నిర్మాత అశ్వనీదత్కి నాగ్ అశ్విన్ అల్లుడైపోయాడు. వీళ్ల కాంబినేషన్లోనే ఈ మధ్య వచ్చిన 'కల్కి' మూవీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ పాన్ ఇండియా సెన్సేషన్ అయిపోయాడు. తాజాగా ఇతడి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉన్నాడు మరి!(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్) -
ప్రభాస్తో పోటీ కాదు.. నాదొక పాత్ర మాత్రమే..
నాగ్, ప్రభాస్ అంటే చాలా ఇష్టం కల్కితో తెలుగు సినిమా దిశ మారింది‘సాక్షి’తో విజయ్ దేవరకొండ నాగీ (దర్శకులు నాగ్ అశ్విన్), ప్రభాస్ల కోసమే కల్కి సినిమాలో నటించానని.. ఆ ఇద్దరంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండ తెలిపారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్.. ఇటీవల విడుదలైన కల్కి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కల్కి సినిమాతో భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా చూస్తూ ఎమోషనల్కు లోనయ్యానన్నారు. ‘కల్కిలో ప్రభాస్ గొప్పనా, నేను గొప్పనా అనే వాదనలు కాదు... నాగ్ అశి్వన్ సృష్టించిన వినూత్న ప్రపంచంలో తామొక పాత్రలమేనని’ వివరించారు. వైజయంతి సంస్థతోనే తన ప్రయాణం మొదలైందని, ఎప్పుడు అడిగినా వారి సినిమాల్లో నటిస్తానన్నారు. నాగ్ ప్రతి సినిమాలో నటిస్తూ లక్కీ చార్మ్గా మారారనే ప్రశ్నకు సమాధానంగా.. నాగ్ దర్శకత్వంలో తను అతిథి పాత్రలు పోషించిన మహానటి, కల్కి సినిమాలు బాగున్నాయి కాబట్టే హిట్ అవుతున్నాయని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని మరోసారి తన సింప్లిసిటీని నిరూపించుకున్నారు. కల్కి పార్ట్–2లో మీ పాత్ర మరింతగా ఉంటుందని నిర్మాత అశ్వినీదత్ ఓ సమావేశంలో అన్నారనే మరో ప్రశ్నకు సమాధానంగా..అశి్వనీదత్ అంటే అది కరెక్టేనని సినీ ప్రియులకు హింట్ ఇచ్చారు. -
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్గా రిలీజైన 'కల్కి' సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. రెండు మూడు రోజుల నుంచి కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. 'కల్కి' సక్సెస్పై రౌడీ హీరో తొలిసారి స్పందించాడు. తానేం లక్కీ ఛార్మ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)'మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగీ, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగీ యూనివర్స్లో ఓ పాత్ర పోషించాను అంతే. వాళ్లందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతీ మూవీస్లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాగీ ప్రతి సినిమాలో చేస్తుంటా. మహానటి అద్భుతమైన సినిమా, 'కల్కి' అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేనేం లక్కీ ఛార్మ్ కాదు' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.విజయ్ దేవరకొండ తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడిని మీడియా 'కల్కి' గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ తర్వాత తీయబోయే మూవీస్లోనూ విజయ్ ఉండటం పక్కా.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్)#VijayDeverakonda about #Kalki2898AD movie ❤️The way he say #Prabhas anna 😍 is what I really like 😍 pic.twitter.com/o5D4g7538e— The Chanti (@chanticomrade_) June 30, 2024 -
Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898’మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ ప్రముఖులే సినిమాను ప్రశంసిస్తున్నారంటే.. నాగ్ అశ్విన్ మేకింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. ఈ మూవీలో ప్రభాస్తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్లో మెరిశారు.(చదవండి: ఒరిజినల్ మాస్ హీరో అమితాబ్.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్) అయితే వీరిలో బాగా హైలైట్ అయింది మాత్రం విజయ దేవరకొండ పాత్ర అనే చెప్పాలి. అర్జునుడి పాత్రలో రౌడీ హీరో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సినిమా చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. నిడివి తక్కువే అయినా ఆ సీన్స్ హైలెట్గా నిలిచాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్పై నెట్టింట చర్చ జరుగుతుంది. (చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట విజయ్. స్నేహితుడు నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట. పార్ట్ 2లోనూ విజయ్ పాత్ర కనిపించబోతుంది. విజయ్ ఒక్కడే కాదు గెస్ట్ రోల్గా నటించిన చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేలవం నాగ్ అశ్విన్, వైయంజతీ మూవీస్ బ్యానర్పై ఉన్న గౌరవంతో ఈ సినిమాలో నటించారట. -
కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే?
ప్రభాస్ భైరవగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాలుగైదేళ్లుగా ఈ సినిమా గురించి ఎంతగానో కష్టపడుతున్న దర్శకుడు నాగ్ అశ్విన్ చివరికి అనుకున్నది సాధించాడు. తను అనుకున్నట్లుగానే అత్యద్భుతంగా తెరకెక్కించాడు. జూన్ 27న రిలీజైన ఈ మూవీని చూసిన పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.రజనీకాంత్ రివ్యూ'వావ్.. కల్కి సినిమా ఎంత అద్భుతంగా ఉందో! దర్శకుడు నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, నిర్మాత అశ్వినీ దత్తో పాటు చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను' అని రజనీకాంత్ ట్వీట్ చేశాడు. Watched Kalki. WOW! What an epic movie! Director @nagashwin7 has taken Indian Cinema to a different level. Hearty congratulations to my dear friend @AswiniDutt @SrBachchan @PrabhasRaju @ikamalhaasan @deepikapadukone and the team of #Kalki2898AD. Eagerly awaiting Part2.God Bless.— Rajinikanth (@rajinikanth) June 29, 2024 నాగార్జున రివ్యూ'నాగి.. నువ్వు మమ్మల్ని మరో ప్రపంచానికి, మరో కాలానికి తీసుకెళ్లావు. ఇతిహాసాన్ని, చరిత్రను, ఫిక్షన్ను కలుపుతూ చేసిన సాహసం చాలా గొప్పది. ఈ సినిమాకు అమితాబ్ గారు ఒరిజినల్ మాస్ హీరో. ఈ మూవీలో కమల్గారిని ఎక్కువ చూపించలేదు. కాబట్టి సీక్వెల్లో ఆయనను చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ ఎప్పటిలాగే అదుర్స్ అనిపించాడు. దీపికగారు గొప్ప తల్లిగా బాగా యాక్ట్ చేశారు. టీమ్ కృషి ప్రశంసనీయం. మరోసారి ఇండియన్ సినిమా తన సత్తా చూపించింది' అని నాగార్జున ట్వీట్ చేశాడు. Congratulations to the team of Super duper #Kalki2898AD!!Naagi you took us to another time and another place . entwining fiction with mythology and history so effortlessly!!Amith Ji, the original mass hero… Sir, you are on fire🔥🔥🔥🔥🔥 can’t wait to see Kamalji in the…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 29, 2024 విజయ్ దేవరకొండ రివ్యూ'ఇప్పుడే కల్కి సినిమా చూశా.. మాటలు రావడం లేదు. ఇండియన్ సినిమాలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ చిత్రం వెయ్యి కోట్ల పైనే రాబడుతుందని ఆశిస్తున్నాను' అని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. Just watched the film.I don’t know what to say..OverwhelmedIndian cinema new level unlockedWth was that!I hope it makes a 1000 crores and more.. ❤️#Kalki2898AD— Vijay Deverakonda (@TheDeverakonda) June 29, 2024 ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం...!మా బావ ప్రభాస్కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు.తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.#Kalki2898AD #Prabhas @SrBachchan @nagashwin7…— Mohan Babu M (@themohanbabu) June 29, 2024 చదవండి: క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్ -
కల్కి లో ఎవరు గొప్ప..?
-
కల్కిలో భారీగా గెస్ట్ రోల్స్.. బాగా మెప్పిచ్చింది ఎవరంటే..?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ఈ సినిమాలో అనేక గెస్ట్ రోల్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా హైలైట్ అవుతోంది విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్రే అని చెప్పవచ్చు. ఈ పాత్రలో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారంటూ నెట్టింట పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్లోనూ ఓ స్పెషల్ మూవీ అనుకోవచ్చు. -
ఆ విషయాన్ని లీక్ చేసిన నాగ్ అశ్విన్.. ఆ హీరోలు కూడా ఉన్నారు!
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరికొద్ది గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కూడా పూర్తి కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.అయితే రిలీజ్ ముందు రోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టా వేదికగా ప్రభాస్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే అతిథి పాత్రల్లో నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటించారనే టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరి, వీళ్లు నటించారా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. "Dulquer Salmaan & Vijay Deverakonda are in the Film" - @nagashwin7 🔥#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DulquerSalmaan #VijayDeverakonda pic.twitter.com/HbGDVGO3kv— Ayyo (@AyyoEdits) June 26, 2024 -
రాయలసీమ వాసులకు గుడ్న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్తో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వీడీ14 వర్కింగ్ టైటిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీని ప్రధానంగా రాయలసీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ప్రత్యేకంగా ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి' అంటూ సీమ యాసలో పోస్టర్ను రిలీజ్ చేశారు. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారిని ఆడిషన్స్ ద్వారా సినిమా ఛాన్సులు ఇవ్వనున్నారు. మరి ఇక ఆలస్యమెందుకు? సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్ కొట్టేయండి. -
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్పై కథ ఆడియన్స్కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై మహేశ్బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్తో రామ్చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
అమెరికాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ టూర్ (ఫొటోలు)
-
అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా.. మామూలుగా లేదు!
కొత్త ఏడాదిలో ఫ్యామిలీ స్టార్తో హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ అతనికి జంటగా నటించింది. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. అయితే తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ప్రస్తుతం విజయ్- గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్ సంకృత్యాన్తో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు.Akkada ikkada clg oo mall oo kadhu raa idii US lo Ela mida padtunnaro chudandii adi ma @TheDeverakonda anna craze uuuu❤️🔥❤️🔥🔥#VijayDeverakonda pic.twitter.com/39FBZIfrF6— The Revanth (@Revanth__7) June 10, 2024Rowdy boy @TheDeverakonda receives overwhelming love and massive response from USA Telugu people-Women forum At ATA - USA! ❤️🔥😍#VijayDeverakonda #VD12 #TeluguFilmNagar pic.twitter.com/T3W7paaWPH— Telugu FilmNagar (@telugufilmnagar) June 10, 2024 -
సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్తో వచ్చి క్లిక్ అవడంతో అందరి కళ్లు సౌత్పై పడ్డాయి. పాన్ ఇండియా లెవల్లో సౌత్ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.సౌత్ వర్సెస్ బాలీవుడ్దీంతో అప్పటినుంచి బాలీవుడ్ను సౌత్ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా అంటున్నాడు. వీరేందర్ చావ్లా, ఫోటోగ్రాఫర్చెప్పులేసుకుని..అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సెలబ్రిటీలు ఫేక్గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్ చేశాడు. సౌత్లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు. ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..అతడు హోటల్కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆయన్ను క్లిక్మనిపించాడు. అందుకాయన నా టీమ్ మెంబర్పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో -
స్టార్ హీరోయిన్స్ జపం చేస్తున్న ‘రౌడీ’
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడం ట్రెండ్గా మారింది. గతేడాది రిలీజ్ అయిన ఖుషీ నుంచి ఇదే ట్రెండ్ రిపీట్ అవుతోంది. ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫ్యామిలీ స్టార్లో కూడా మరో స్టార్ హీరోయిన్ మృణాలు ఠాకూర్ మెరిసింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా విజయ్ స్టార్ హీరోయిన్ ట్రెండ్నే ఫాలో అవుతున్నాడు. తన తదుపరి చిత్రంలో కూడా స్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఆమె మరెవరో కాదు లేడీ పవర్స్టార్ సాయి పల్లవి. నిజానికి విజయ్, సాయిపల్లవి కాంబినేషన్లో సినిమా రావాలని టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ జోడికి దగ్గ కథ లేకపోవడం ఇన్నాళ్లు కలిసి నటించలేదు. తాజాగా యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కొల్లా ఓ అందమైన ప్రేమ కథతో వీరిద్దరిని కలిశాడు. స్టోరీ నచ్చడంతో కలిసి నటించేందుకు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రంతో అయినా విజయ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. -
విజయ్ దేవరకొండతో ప్రేమకథకు సిద్ధమవుతున్న సాయిపల్లవి..
-
దిల్ రాజు కు దిల్ లేకుండా చేస్తున్న మూవీస్..
-
అసలు విషయం చెప్పేసిన రష్మిక..గాల్లో తేలుతున్న రౌడీ బాయ్స్..
-
ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. విజయ్తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)#AnandDeverakonda: who's your fav co-star#Rashmika: Neeyabba.. Nuvvu Naa family anand #GamGamGanesha Pre Release pic.twitter.com/ZhiSfUU6pF— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 27, 2024 -
ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్.. వారికి కూడా అందుబాటులోకి!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందం కాంబినేషన్ కావడంతో అభిమానులు భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే ఓటీటీలో విడుదలైన ఫ్యామిలీ స్టార్కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 26న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్లో టాప్-5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మేకర్స్ మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.మొదట కేవలం తెలుగు, తమిళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్కు వస్తున్న ఆదరణను చూసి మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. విజయ్ దేవరకొండకు సౌత్లో ఉన్న క్రేజ్తో కన్నడతో పాటు మలయాళంలోనూ ఫ్యామిలీ స్టార్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ప్రస్తుతం నాలుగు భాషల్లో ఫ్యామిలీ స్టార్ అలరిస్తోంది.