breaking news
water colour change
-
ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్న స్విమ్మింగ్ పూల్ ను మూసేశారు. సాధారణంగా ఈత కొలను అనేది నీలి రంగులో దర్శనమిస్తూ ఉంటుంది. అయితే రియో ఒలింపిక్స్ ఆరంభమయ్యాక మారియా లెంక్ అక్వాటిక్స్ సెంటర్ లోని ఒక స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో మారడం వివాదస్పదమైంది. అయితే దీన్ని తొలుత తేలిగ్గా తీసుకున్న రియో యాజమాన్యం, ఆ తరువాత నీటిలో నాణ్యత లేకపోవడాన్ని గ్రహించి దాన్ని ఎట్టకేలకు మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలపడంతోనే రంగు మారినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్విమ్మింగ్ పూల్ లో పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని వారు విశ్లేషించారు. -
ఊసరవెల్లిలా రంగులు మార్చుతోంది!
సాధారణంగా ఈత కొలను(స్విమ్మింగ్ పూల్) అనగానే మనకు నీలి రంగులో ఉండే నీళ్లు గుర్తొస్తాయి. వాస్తవానికి ప్రతి కాంపిటీషన్లోనూ స్విమ్మింగ్ పూల్ లో ఉపయోగించే వాటర్ నీలి రంగులో దర్శనమిస్తుంది. అయితే రియోలో మాత్రం కాస్త విచిత్రం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తెల్లారేసరికల్లా ఆకుపచ్చ రంగులోకి మారాయి. అధికారులు చెప్పే పొంతనలేని మాటలతో ఏకీభవించకుండా, ఊసరవెల్లిలాగ స్విమ్మింగ్ పూల్స్ కూడా రంగులు మార్చుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం రియోలో బుధవారం చర్చనీయాంశమైంది. రియోలో ఓ ఈత కొలను ఆకుపచ్చగా మారిపోయింది. ముందు రోజు వరకు నీళ్లు నీలం రంగులో ఉన్నాయి. ఐతే తెల్లారేసరికి ఆకుపచ్చ రంగులోకి మారడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక బుధవారం నీళ్ల రంగు మారిన కొలనులోనే పోటీలు నిర్వహించారు. అక్కడి వాతావరణంలో మార్పుల వల్లే నీళ్ల రంగు మారే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య అధికారులు మాట్లాడుతూ.. ఈత కొలనులో నీళ్ల రంగు మారిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలిపినట్లు వెల్లడించారు. పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని అభిప్రాపడ్డారు. నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.