సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా నిలుపుదల
గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పవర్హౌస్ టర్బయిన్లో శబ్ధాలు వచ్చాయి.
దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈ ఘటనను ఏపీ ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నీరు నిలుపుదలతో కుడి కాలువ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(మాచెర్ల టౌన్)