breaking news
Wedding
-
తొలి వార్షికోత్సవం.. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి వీడియో
సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
Nivetha: ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్
-
పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలోని ఒక గ్రామంలో వివాహ వేడుకలో జరిగిన అనూహ్య ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతా పెళ్లి సంబరాల్లో ఉండగా ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. దాదాపు 20 మంది గాయపడ్డారు కానీ అదృష్టవశాత్తూ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.వివాహానికి సంబంధించి, హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో జరుపుకునే సాంప్రదాయ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక జాతర కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపైకప్పున చేరి, కింద మరికొందరు ఈ వేడుకను చూస్తున్నారు. అతిథుల జానపద నృత్యాలు, పాటలతో అక్కడి వాతావరణ అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో పక్కనే ఉన్న ఇంటి పైకప్పు ఒకటి అక్కడ గుమిగూడిన వారిపై ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా తీవ్ర కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్Accident caught in 4K.Just 2-3 ays ago during a marriage function in Chamba, the roof of a house suddenly collapsed where people were sitting. Around 20 people were injured but thankfully no major casualty. Now the drone footage of this incident has emerged . pic.twitter.com/U6CIOa4Os0— Nikhil saini (@iNikhilsaini) December 8, 2025 మరికొందరు వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స కోసం టీసా ఆసుపత్రికి తరలించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు -
దుబాయి యూట్యూబర్తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి
హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
-
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
-
చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్లోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!) 'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!
సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్ ఈ పెళ్లి వేడుకలో సడెన్గా మైక్ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shaadi Reelz | Wedding Content Creator (@shaadireelz) (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్గా హర్ష్ గోయెంకా పోస్ట్) -
సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్
హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
చైతూ- శోభిత పెళ్లి వీడియో.. లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన శోభిత! (ఫొటోలు)
-
పెళ్లిలో రసగుల్లా గోల : పిడిగుద్దులతో మల్లయుద్ధమే వైరల్ వీడియో
బిహార్లోని బోధ్ గయలో జరిగిన వింత ఘటన నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి విందులో వడ్డించిన స్వీట్ సరిపోకపోవడం దుమారం రేగింది. వధూవరుల కుటుంబ సభ్యుల వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద యుద్ధమే జరిగింది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది. అసలు ఏం జరిగిందంటే..ఒక వివాహం సందర్బంగా జరిగిన పెళ్లి విందులో రసగుల్లా కొరత వచ్చింది. దీంతో వధువు, వరుడి కుటుంబాలు ఘర్షణకు దిగడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలూ విచక్షణ మర్చిపోయి కొట్టుకున్నారు. నెట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. ఈ దృశ్యాలు వివాహం జరుగుతున్న హోటల్లోని సీసీటీవీలో రికార్డైనాయి. A chaotic scene unfolded in a wedding in #Bihar's #BodhGaya after the bride and the groom's families exchanged blows over a shortage of rasgulla.The incident was caught on CCTV installed inside the hotel where the wedding was taking place, and the video surfaced online.… pic.twitter.com/As6vU9WXSZ— Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2025 ఈ సంఘటన నవంబర్ 29న జరిగింది. పెళ్లి వేడుక కోసం వధూవరుల కుటుంబాలు ఒకే హోటల్లో బస చేశాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల తరువాత పెళ్లి మంటపానికి వెడుతుండగా వివాదం మొదలైంది. అది తీవ్రమై కొట్టుకునే దాకా వచ్చింది. రసగుల్లా కొరత కారణంగా జరిగిన గొడవ కారణంగా వివాహం రద్దయింది. తరువాత వధువు కుటుంబం వరుడి తరపు వారిపై వరకట్న కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా, ఒక గ్రూపు గొడవకు దిగి, కుర్చీలు, ప్లేట్లతో దాడికి దిగారు. దీంతో రెండు వైపుల నుండి చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ బుధవారం రసగుల్లా లేకపోవడం వల్ల గొడవ జరిగిందని ధృవీకరించారు. వరుడి కుటుంబం వివాహాన్ని కొనసాగించడానికి అంగీకరించగా, వధువు కుటుంబం ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంది.వరుడి తల్లి మున్నీ దేవి, గొడవ జరుగుతుండగా, వధువు కుటుంబం తాను బహుమతిగా తెచ్చిన ఆభరణాలను తీసుకుందని ఆరోపించింది. హోటల్ బుకింగ్ కూడా తామే చేశామని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం జరగాలని వధువు కుటుంబంతో సర్ది చెప్పాలని ప్రయత్నించాం. కానీ ఫలించలేదని వరుడి బంధువు సుశీల్ కుమార్ తెలిపారు. మొత్తానికి సర్దుకుపోవాల్సిన స్వల్ప విషయానికి ఒక శుభకార్యం ఆగిపోయింది. పంతాలు, పట్టింపులతో ఇరువైపు అవమానాలు, ఆర్థిక నష్టం తప్ప మరేమీ మిగల్లేదు. ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
కజిన్ వెడ్డింగ్లో మెరిసిన దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ దంపతులు (ఫొటోలు)
-
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
హీరోయిన్ సమంత రీసెంట్గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?దర్శకుడు రాజ్తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. ఒకవేళ వీళ్లకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్లకు ముందుగా వివాహం చేసేస్తారు. తర్వాత ఎప్పుడో టైమ్ చూసుకుని వీళ్లు కొత్త జీవితం ప్రారంభిస్తారు. గతంలో సాయిపల్లవి ఇలానే తనకంటే ముందు చెల్లి పెళ్లి చేసింది. ఇప్పుడు లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్)మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ అయిన కృతి సనన్.. తర్వాత 'దోచేయ్' అనే మరో తెలుగు మూవీ చేసింది. ఈ రెండు ఫ్లాప్ అయ్యేసరికి బాలీవుడ్కి వెళ్లిపోయింది. బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగానే ఉంది. ఈమె చెల్లి నుపుర్ కూడా నటినే. గతంలో ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేసింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిలైంది. ఈమె యాక్టింగ్ కూడా తేలిపోవడంతో తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతానికైతే హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.అలాంటిది ఇప్పుడు నుపుర్ పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకొచ్చింది. రాజస్థాన్లోని ఉదయపుర్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్తోనే నుపుర్ కొత్త జీవితం ప్రారంభించనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని.. జనవరి 8,9 తేదీల్లో ఈ శుభాకార్యం జరగనుందని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే నుపుర్ లేదా స్టెబిన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.(ఇదీ చదవండి: బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్') -
అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు. రాజ్ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్ శైలి పోట్రెయిట్కట్ డైమండ్ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్ కట్ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official)అరటి ఆకులో కమ్మటి భోజనంసమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం, పప్పు,కూరలతో కలర్పుల్గా కనిపించిన సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం, పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా ఈ ఫుడ్ను వడ్డించారు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది? -
'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?
సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' అనే సంప్రదాయం ప్రకారం సమంత.. ఈ వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటిది? దీనికి అర్థం ఏంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు.. పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ 'భూత శుద్ధి వివాహం'.ఈశా యోగ కేంద్రలో ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం. భక్తుల మనశ్శరీరాలకు, శక్తులని స్థిరపరుస్తూ, పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతిదశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత- రాజ్ రెండో పెళ్లి ఫోటోలు చూశారా..
-
ట్రెండింగ్లో సమంత (ఫొటోలు)
-
మరో పెళ్లి చేసుకున్న సమంత
హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి ఈమె.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే చాలాసార్లు వీళ్లు జంటగా కనిపించారు. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ సింపుల్గా వివాహం చేసుకున్నారు.పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈరోజు (డిసెంబరు 01) ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో కేవలం 20 మంది అతిథుల సమక్షంలోనే సామ్-రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మొదట వార్తలు బయటకొచ్చాయి. కాసేపటికే సమంత.. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసింది. నాగచైతన్యతోనూ పలు చిత్రాల్లో కలిసి పనిచేసింది. అలా చేస్తున్న టైంలోనే సామ్-చైతూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చేస్తున్న టైంలో సమంత-రాజ్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్లో ఆరుగురు) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. గతేడాది 'కల్కి 2989' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈమె కుటుంబం గురించి ఓ రూమర్ వినిపిస్తుంది. దీపిక చెల్లి కూడా సినీ నేపథ్యమున్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లనుందని అంటున్నారు. ఈ మేరకు అబ్బాయి ఎవరు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెకి ఇద్దరు కుమార్తెలు అందులో దీపిక పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అనీషా. నటిగా దీపిక గుర్తింపు తెచ్చుకోగా.. అనీషా మాత్రం ప్రొఫెషనల్ గోల్ఫర్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం అక్కకు చెందిన 'లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అనీషా గత కొన్నాళ్ల నుంచి రోహన్ ఆచార్య అనే బిజినెస్మ్యాన్తో ప్రేమలో ఉందని, త్వరలో వీళ్ల పెళ్లి జరగనుందనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.రోహన్ విషయానికొస్తే ఇతడి ముత్తాత బిమల్ రాయ్.. గతంలో బాలీవుడ్లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రోహన్ సోదరిని.. ధర్మేంద్ర మనవడు (సన్నీ డియోల్ కొడుకు) కరణ్ డియోల్ పెళ్లి చేసుకున్నాడు. అలా రోహన్ కుటుంబానికి సన్నీ డియోల్ కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు దీపిక సోదరి అనీషా.. రోహన్ని పెళ్లి చేసుకుంటే.. ఈమె కూడా ధర్మేంద్ర కుటుంబంలో ఒకరు అవుతుంది. అక్కలానే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లినట్లు అవుతుంది. ప్రస్తుతానికి దీని గురించి ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ రాబోయే కొన్ని నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!) -
‘నాకు పెళ్లైందోచ్..’ 62 ఏళ్ల ఆస్ట్రేలియా ప్రధాని
62 ఏళ్ల వయసులో ఆ దేశ ప్రధాని మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ‘నాకు పెళ్లైందోచ్..’ అంటూ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆరేళ్లుగా పబ్లిక్గా ఈ జంట డేటింగ్లో ఉండగా.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కావడం విశేషం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన గర్ల్ఫ్రెండ్ జోడీ హైడెన్ (Jodie Haydon)ను ఆయన పెళ్లాడారు. కాన్బెర్రాలోని ఆంథోనీ (Anthony Albanese) అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో కొద్దిమంది మధ్య ఈ వేడుకలు జరిగాయి. తన పార్ట్నర్ చేతిని పట్టుకుని నడుస్తున్న వీడియోను ఆంథోనీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I— Anthony Albanese (@AlboMP) November 29, 2025జోడీ హైడెన్(47) అడ్వొకేట్తో పాటు ఆర్థిక నిపుణురాలు కూడా. 2019లో మెల్బోర్న్లో జరిగిన ఓ బిజినెస్ డిన్నర్లో ఆంథోనీ అల్బనీస్ను తొలిసారి ఈమె కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో అల్బనీస్ తన భార్య(మొదటి) కార్మెల్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆల్బనీస్-హైడెన్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2022లో ఫెడరల్ ఎన్నికల ప్రచారంలో అల్బనీస్ వెంట జోడీ హైడెన్ సందడి చేశారు. ప్రధాని పదవి చేపట్టాక అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. దుబాయ్, మాడ్రిడ్, స్పెయిన్, పారిస్ పర్యటనల్లో పాల్గొన్న ఆమె.. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు, 2023లో నాటి అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన విందుకూ ఆల్బనీస్ వెంట ఆమె కనిపించారు. ఈ క్రమంలో వారి ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేశాయి. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రధాని హోదాలో ఓ వ్యక్తి వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో యూకే ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ 2021లో క్యారీ సైమండ్స్ను వివాహం చేసుకున్నారు. -
స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్స్టాలో అప్డేట్ చూశారా?
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్గా మారింది. వరుడు, స్వరకర్త పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేసిన కారణంగానే అంగరంగ వైభవంగా జరగాల్సిన అర్థాంతరంగా వాయిదా పడిందన్నపుకార్లు జోరుగా వ్యాపించాయి. ధృవీకరించని చాట్లు వైరల్ అయ్యాయి. స్మృతి-పలాష్ పెళ్లి వాయిదాకు సంబంధించి స్పష్టమైన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అనేక ఊహాగానాలు రోజుకొకటి వస్తూనే ఉంది. ఇన్ని పరిణామాల మద్య స్మృతి-పలాష్ ఇన్స్టా మార్పు అభిమానులు ఆశ్చర్యపరుస్తోంది.ఇన్స్టాగ్రామ్లో పలాష్ ముచ్చల్ - స్మృతి మంధాన ఇద్దరూ దిష్టి ('blueye') ఎమోజీని చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. స్మృతి , హల్ది ,మెహందీ వేడుకల ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే వారిద్దరూ ఇన్స్టా బయోకు ఒకే ఎమోజీని వాడటం సంచలనంగా మారింది.స్మృతి-పలాష్ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వారు అకస్మాత్తుగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని తొలుత వార్తలు వచ్చాయి. తరువాత, పెళ్లి ఎందుకు వాయిదా పడిందనే దానిపై సోషల్ మీడియాలో అనేక ఇతర వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, స్మృతి మరియు పలాష్ ఇన్స్టాగ్రామ్లో గణనీయమైన మార్పు చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు. మరోవైపు ఇన్ని ఊహాగానాలు, పుకార్ల మధ్య ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పలాష్ ముచ్చల్ తల్లి అమిత ముచ్చల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది యాదృచ్చింగా జరిగిందా? ఇన్స్టాలో వీరిద్దరి లేటెస్ట్ అప్డేట్ ఏంటో అర్థం కాగా ఫ్యాన్స్ మాత్రం ఒక పక్క తెగ సంతోషపడుతూనే, మరో పక్క అయోమయంలో పడిపోయారు. -
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి రిసెప్షన్.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి మరో వార్త వైరల్గా మారింది. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ-17) స్పెషల్ ఎడిసోడ్కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం కేబీసీ షూట్లో కనిపించింది.पिता की तबीयत और शादी की उलझन के बीच, क्रिकेट स्टार Smriti Mandhana ने KBC 17 में नहीं दिखीं, स्मृति के पिता को आया था हार्ट अटैक। #SmritiMandhana #KBC #Mumbai #Viralvideo #SocialMedia #SmritiMandhanaFans #heartattack pic.twitter.com/o4VcAINz3E— Nedrick News Punjab (@NedrickP) November 27, 2025కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టుఈ ఎపిసోడ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, బ్యాట్స్మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది. భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్ : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్కాగా సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో స్మృతి-పలాష్ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది. తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్ ముచ్చల్ మోసం చేశాడన్న ఆరోపణలు, స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం, చాలామంది పలాష్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి. ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా -
కొడుకు సమక్షంలో బిగ్బాస్ బ్యూటీ మరో పెళ్లి
ప్రముఖ నటి, తమిళ బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్లోనూ చేసింది. తమిళ బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్)అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్లానే క్రికెట్ని కెరీర్లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Samyuktha Shanmughanathan (@samyuktha_shan) -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. వధూవరులకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో దారి పొడవునా.. వివాహ వేదిక వద్ద ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆయన్ని ఫొటోలు తీసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ 23వ వార్డు ఇంఛార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయికిరణ్, వినీతలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తండోప తండాలుగా అక్కడికి తరలి వచ్చారు. ఆ సమయంలో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారాయన. -
స్మృతి పెళ్లి వివాదం : పలాష్ మాజీ ప్రేయసి ప్రపోజల్ వైరల్
టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ పుకారపై గురించి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్ చేసిన వడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్ వాతావరణంలో పలాష్ ఆమెకు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు.Palash Muchhal and his ex Birva Shah👀 pic.twitter.com/0nVRaia3CQ https://t.co/T8kNaz2REU— Mention Cricket (@MentionCricket) November 25, 2025 స్మృతిమంధానకు సోషల్ మీడియాలో సపోర్ట్మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలాష్ ముచ్చల్ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్ క్రికెట్ అనే ట్విటర్ హ్యాండిల్లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్కు భారీ స్పందన లభిస్తోంది.ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా >In 2019, Palash broke with his fiance. >Started dating to Smriti Mandhana,>Relationship with her for 6 years,>Got the fame,>Decided to marry for money,>Cheated on her just before wedding night.I wonder what smriti saw in him. pic.twitter.com/KCkTsk0x3v— `S.🚀 (@ThodaSaSanskari) November 25, 2025పాపం పాలక్మరోవైపు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.See this 👀👇🏻https://t.co/H5kpT5LcaV— Mention Cricket (@MentionCricket) November 25, 2025 -
ఆత్మీయుడి కొడుకు పెళ్లి వేడుకలో మెరిసిన అంబానీ కుటుంబం (ఫొటోలు)
-
స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా
Smriti Mandhana-Palash Muchhal wedding controversy మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలతో సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా స్థంభించిపోయింది. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు అంటూ పెళ్లి వేడుకలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ తరువాత వరుడు కూడా ఆసుపత్రిలో చేరినట్లు కూడా వెల్లడైంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అవును.. టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి వాయిదా గురించే. తన జీవితంలో బిగ్ డే కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది స్మృతి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబరు 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో పలాష్ ముచ్చల్తో ఆమె పెళ్లి వేడుక ముగియాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే పెద్ద చర్చగా మారింది. ఆమె వెళ్లి వాయిదాతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి తోడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా భారీ విజయానికి దోహదపడిన క్రికెటర్ స్మృతి, పలాష్ ముచ్చల్(Palash Muchhal)తో ఉన్న తన ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుండి తొలగించడం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అది పాత కథ.. నీతో పిల్లల్ని కంటా.. తొలుత స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణమని అందరూ భావించినా, క్రమంగా పలాష్ ముచ్చల్ కొరియాగ్రాఫర్తో డర్టీ మెసేజెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిని స్వరయంగా మేరీ డి'కోస్టా షేర్ చేసింది. తనతో పలాష్ ముచ్చల్తో చాట్ల యొక్క అనేక స్క్రీన్షాట్లను పంచుకుంది. ఈ స్క్రీన్షాట్లు నిజమైనవో కాదో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, పలాష్ పేరు, ఐడీ ఉన్నాయి గమనార్హం. ఈ చాట్ ప్రకారం తనను కలమని మేరీని అడిగాడు. మరి స్మృతి రిలేషన్ గురించి ఆమె ప్రశ్నించగా, అదొక పాత బంధం అని తేలిగ్గా కొట్టి పారేశాడు. పదే పదే స్మృతి ‘డెడ్’ అని సంబోధించడం, ఆమెను కలవని ఒత్తిడి చేయడం ఈ చాట్లో చూడవచ్చు. ఈమె వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. పలాష్ - స్మృతి వివాహానికి కొరియోగ్రఫీకి ఒప్పుకుందట.దీంతోపాటు రెడ్డిట్లో, పలాష్ ఒక అమ్మాయికి దగ్గరగా కనిపించాడని చాలా మంది యూజర్స్ పేర్కొన్నారు. వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో జరిగిన ద్రోహాన్ని తొలుత స్మృతి తండ్రే గుర్తించారట. దీంతో ఇద్దరి మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగానే, అతనికి గుండెపోటు వచ్చిందనేది ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే ఈ పుకార్లపై ఇరు వర్గాలు అధికారికంగా దృవీకరించనూలేదు, ఖండించనూ లేదు. అయితే పలాష్ స్మృతిని మోసం చేశాడనే ధృవీకరించని ఊహాగానాల మధ్య పలాష్ ముచ్చల్తో ఉన్న తన ఫోటోలన్నింటినీ తన సోషల్ మీడియా నుండి తొలగించడం ఈ అనుమానాలకు మరింత బలం పెరిగింది. పలాష్ ముచ్చల్ స్మృతి మంధానస్మృతి - పలాష్ తమ పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి 2019నుంచీ డేటింగ్ ప్రారంభించారు. క్రికెట్, సంగీతంపై వారి ఉమ్మడి ఆసక్తి వీరి మనసులు కలిసేలా చేసింది. 2024లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించగా, పలాష్ తన చేతికి స్మృతి జెర్సీ నంబర్ 'SM18' టాటూ వేయించుకున్నాడు. మరి అంత ప్రేమ కురిపించిన పలాష్, తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్మృతిని ఇంత దారుణంగా మెసం చేస్తాడా? మేరీ కాకుండా ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రస్తుతం కోట్లాది మంది స్మృతి అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అధికారిక వివరణ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.చదవండి : వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే! -
కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లికు ముందు కాబోయే భర్త లేదా భార్యకు సర్ప్రైజులు ఇస్తుంటారు. అవి చాలావరకు జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులుగా మిగిలిపోతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తనకు కాబోయే భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆమె షాక్లోనే ఉండిపోయింది. ఇప్పటికీ ఇది జరిగిందని నమ్మలేకపోతున్నానని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 27న హరిణ్య అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇప్పటికీ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజాగా హైదరాబాద్లో సంగీత్ పార్టీ జరగ్గా.. రాహుల్, హరిణ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదే వేడుకకు టీమిండియా స్పిన్నర్ చాహల్ కూడా వచ్చాడు. ఇతడు రావడానికి ఓ కారణముంది. హరిణ్యకు ఫేవరెట్ క్రికెటర్ ఇతడు. దీంతో ఇతడిని సంగీత్కి పిలిచిన రాహుల్.. తనకు కాబోయే భార్య హరిణ్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆనందం పట్టలేకపోయింది. చాహల్తో కలిసి దిగిన ఫొటోలను హరిణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్కు స్పెషల్ థాంక్స్ చెప్పింది. నిశ్చితార్థంలోనూ రాహుల్.. హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్ని పిలిచి ఆమెని మరింత సంతోషపెట్టాడు.రాహుల్-హరిణ్య పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురిని రాహుల్ స్వయంగా ఆహ్వానించాడు. View this post on Instagram A post shared by Harinya Reddyy (@harinya_reddyy) -
బిజినెస్మ్యాన్ కుమార్తె పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్ (ఫొటోలు)
-
ప్రియుడితో తెలుగు సీరియల్ నటి ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్
ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు. అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ సంగ్లీ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. -
వివాహాల్లో సరికొత్త లగ్జరీ ట్రెండ్..! హ్యాంగోవర్ రాకుండా..
పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్కే సై అంటోంది యువత.అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan) IV బార్ అంటే..విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు. దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై. తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan)(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
గ్రాండ్గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి
ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లో శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)అక్టోబరు 1వ తేదీన స్రవంతి-విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా.. తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫొటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి? వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కూమార్తెలు స్వప్న, ప్రియాంక.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్తో 'కల్కి' తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు.అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్.. ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్) -
ప్రతి ఇంటికి పెళ్లి కార్డు, చీర
యాదాద్రి భువనగిరి జిల్లా: కుమారుడి పెళ్లికి రావాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది మాధవరెడ్డి, మాధవి దంపతులు ఊరంతటినీ ఆహ్వానించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలను కలిసి బొట్టుపెట్టి పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు చీర అందజేశారు. మాధవరెడ్డి చిన్న కుమారుడు వరుణ్కుమార్రెడ్డి వివాహం ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని వధువు ఇంటి వద్ద జరగనుంది. -
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
-
Garam Garam Varthalu: ఊరంతా చీరలు పంచి పెళ్ళికి రమ్మని ఆహ్వానం
-
సొంత వదిననే పెళ్లాడాడు, ఎందుకో తెలుసా?
ఉత్తర ప్రదేశ్లో అరుదైన వివాహం పలువురిని ఆకట్టుకుంటోంది. అనుకోని ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించిన ఘటన నెట్టింట విశేషంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన రాజేశ్ సింగ్ సోదరుడు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో తన సోదరుడితో కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వదిన వేదనను గమనించాడు. అలాగే చెట్టంత కొడుకును కోల్పోయిన తన తన కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది. ఇదే రాజేశ్ను ఆలోచింప చేసింది. అటు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వదినకు,ఇటు కుటుంబానికి ఊరట నివ్వాలని అనుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబంతో చెప్పి, ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. దీనిపై వారిబంధువులతో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. -
ఉదయపూర్లో బిలియనీర్ కుమార్తె పెళ్లి : జూ. ట్రంప్ స్పెషల్ గెస్ట్
లేక్ సిటీ, ప్రశాంతతకు నెలవైన ఉదయపూర్ (రాజస్థాన్) నగరం పలువురు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాలకు హాట్స్పాట్. ప్రస్తుతం ఈ రాజ నగరం మరో గొప్ప విలాసవంతమైన వివాహానికి వేదికగా మారనుంది. జూ. ట్రంప్, , 40దేశాలనుంచి 126 మంది స్పెషల్ గెస్ట్స్అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన. అమెరికాకు చెందిన వరుడు వంశీ గదిరాజు వివాహ వేడుక జరుగనుంది. రాజస్థాన్ నడిబొడ్డున ఒక స్టార్-స్టడెడ్ ఈవెంట్కు అమెరి కాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వస్తారని అంచనా. దీంతో ఈ నగరం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.దాదాపు 40 దేశాల నుండి 126 మంది ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.నవంబర్ 21–22 తేదీలలో ఉదయపూర్లో రెండు రోజుల పాటు ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఫార్మాస్యూటికల్ సీఈఓ రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన, వంశీ గదిరాజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్తోపాటు, జెన్నిఫర్ లోపెజ్ ,స్టిన్ బీబర్ల పవర్హౌస్ షోస్ ఉంటాయి పలువురు సినీ, రాజీకయ రంగ ప్రముఖుల అతిథులతో ఐకానిక్ ప్యాలెస్లలో వేడుకలు జరగనున్నాయి. బాలీవుడ్ సె లబ్స్ హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, నోరా ఫతేహి, మాధురి దీక్షిత్ , దియా మీర్జా, షాహిద్ కపూర్ నోరా ఫతేహి, వరుణ్ ధావన్, కృతి సనన్, జాన్వీ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నారు. View this post on Instagram A post shared by Udaipur (@udaipur)చదవండి : ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే రాజస్థాన్ రాజ నిర్మాణ వైభవాన్ని ప్రదర్శించే అత్యంత ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాల్లో ఈ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. చారిత్రాత్మక సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్లోని ది లీలా ప్యాలెస్ ఉదయపూర్, మానెక్ చౌక్ , జెనానా మహల్,అలాగే పిచోలా సరస్సులోని గంభీరమైన జగ్మందిర్ ఐలాండ్ ప్యాలెస్లలో లగ్జరీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయి. ఎవరీ రాజు మంతెనభారత సంతతికి చెందిన వారు రాజు మంతెన. అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ అండ్ సీఈవో ICORE హెల్త్కేర్, ఇంటర్నేషనల్ ఆంకాలజీ నెట్వర్క్ (ION) , ఆన్కోస్క్రిప్ట్ల వ్యవస్థాపకుడిగా మంతెన ఆరోగ్య సంరక్షణ రంగంలో అమెరికా మంచి పేరు సంపాదించారు.ఇది చదవండి : రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్ -
ముఖ్యమంత్రిని పెళ్లికి ఆహ్వానించిన తెలుగు సింగర్
టాలీవుడ్లో మరో పెళ్లి జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వచ్చే గురువారం(నవంబరు 27) పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వివాహ ఆహ్వానపత్రిక అందజేశాడు. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది.హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్. సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్ పాడి చాలా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. రంగమార్తాండ అనే సినిమాలో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. కాలభైరవతో కలిసి రాహుల్ ఈ పాటని ఆస్కార్ స్టేజీ వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు!
దీపాల కాంతుల్లో పూల పరిమళాల మధ్య అందంగా వివాహ వేడుక సిద్ధమైన వేళ.. నవవధువు శవంగా మారిపోయింది. ఆమె కలలు పంట ఆవిరైపోయింది. తనను తాను పెళ్లికూతురిగా చూసుకుంటూ ముస్తాబవుతున్న తరుణంలో.. యమపాశం తరముకొచ్చింది. పెళ్లి చేసుకోబోయే ప్రియుడే కాలయముడిగా మారిపోయాడు. ఆమె అందమైన ఊహాలోకం కాస్తా నిమిషాల వ్యవధిలో యమలోకానికి పయనమైంది. ప్రాణంగా చూసుకుంటానని సహజీవనంలో మాటిచ్చిన ప్రియుడు.. పెళ్లి పీటల వరకూ వచ్చేసరికి తనలోని సైకోను బయటకు తీశాడు. శారీ కోసం మొదలైన గొడవ ‘స్త్రీధనం( మన భాషలో కట్నం అంటామనుకోండి) వరకూ వెళ్లింది. ఆమె నుంచి డబ్సు ఆశించిన ఆ కసాయి.. ఏడు అడుగులు నడవకుండానే తనలోని కర్కశత్వాన్ని చూపెట్టాడు. ఆ నుదిట తిలకం దిద్దాల్చిన వాడే.. ఆమె రక్తం కళ్ల చూశాడు. ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు, పెళ్లి ముహూర్తానికి గంట దూరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని భావ్నగర్కు చెందిన సజ్జన్ బారైయా, సోని హిమ్మత్లు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరగా లివింగ్ రిలేషన్లో ఉన్నారు. వారి బంధాన్ని ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినా తాము పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ బంధాన్ని కొనసాగించారు. ఇక పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురుచూశారు. పెళ్లి శుభలేఖలు కొట్టించారు కూడా. వారి పెళ్లి ముహూర్తం శనివారం రాత్రి(అంటే నిన్న రాత్రి). ఆ రాత్రే ఆ యువతికి కాలరాత్రి అయ్యింది. శారీ కోసం గొడవమొదలైంది వీరివురి మధ్య. అది నగదు వ్యవహారం వరకూ వెళ్లింది. అంతే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ మృగాడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనే సంగతిని మరిచిపోయాడు. ఐరన్ పైప్తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆపై ఆమె తలను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె ప్రాణం వదిలేసింది. తాను కట్టుకోబోయేవాడు ప్రాణం కూడా తీస్తాడనే ఏనాడు ఆమె కల కూడా కని ఉండదు. కానీ ఆ రాక్షసుడు ఆవేశానికి ఆమె బలైపోయింది. వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి జరగాల్సిన చోట చావు కేకలు వినిపించాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు ఏడాదిన్నర కాలంగా లివింగ్ రిలేషన్లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడానికి ఇలా సిద్ధమైన క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా ఆ అమ్మాయి ప్రాణాన్ని ప్రియుడే తీశాడని డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఆర్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు (ఫొటోలు)
-
న్యూయార్క్లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళ వాడే అయినప్పటికీ అడపాదడపా మన దగ్గర కూడా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ టైంలో అయితే 'కింగ్డమ్'తో వచ్చాడు. కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్న అనిరుధ్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా అనే సందేహం వస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. ఈ పుకార్లు నిజమేనేమో అనే హింట్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనిరుధ్.. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉన్నాడు. గతంలో హీరోయిన్ ఆండ్రియాతో రూమర్స్ వినిపించాయి. కానీ గత కొన్నేళ్ల మాత్రం ఇతడి పాటలు మాత్రమే వినిపించాయి. కానీ ఈ ఏడాది జూన్లో మాత్రం అనిరుధ్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ని పెళ్లి చేసుకోనున్నాడనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందించిన అనిరుధ్.. చిల్ గాయ్స్ అలాంటిదేం లేదని ట్వీట్తో క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు కావ్యతోనే కనిపించడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.యూకేకి చెందిన ఓ యూట్యూబర్.. న్యూయార్క్లో వ్లాగ్స్ తీశాడు. అయితే ఓ వీడియోలో అనిరుధ్-కావ్య జంటగా నడుస్తూ కనిపించారు. అంటే ఇద్దరూ కలిసి ట్రిప్ వేశారని నెటిజన్లు అంటున్నారు. దీంతో పెళ్లి వార్తలు నిజమేనా అని రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. త్వరలోనే అనిరుధ్.. కళానిధి మారన్కి అల్లుడు కాబోతున్నాడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి అటు అనిరుధ్, ఇటు కావ్య సింగిల్గానే ఉన్నారు. కెరీర్ పరంగా ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. ఒకవేళ రూమర్స్ నిజమైతే మాత్రం పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: ఢిల్లీలో పేలుడు.. SSMB29 ఈవెంట్పై పడుతుందా..?)👋🏻 pic.twitter.com/kBrOCbivDQ— ranjii.in (@Ranjiiin) November 12, 2025 -
పెళ్లికి ఒకరోజు ముందు వరుడి ఆత్మహత్య
నిజామాబాదు జిల్లా: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్ కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతాప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయి తే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికి నా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్
కన్నడ సినిమా రేంజుని 'కేజీఎఫ్' సినిమా ఎంతో మార్చేసింది. హీరోహీరోయిన్, దర్శకుడితో పాటు మూవీ కోసం పనిచేసిన చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఫ్రాంచైజీలో రెండు చిత్రాల్లోనూ చాలావరకు పాటలు పాడిన సింగర్ అనన్య భట్ కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె తిరుమలలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)కన్నడలో ఫోక్ సింగ్స్, సినిమా పాటలు పాడే అనన్య భట్.. ఆదివారం (నవంబరు 09) వివాహం చేసుకుంది. తనలానే సంగీత పరిశ్రమకు చెందిన డ్రమ్మర్ మంజునాథ్తో ఏడడుగులు వేసింది. తిరుమలలో జరిగిన ఈ శుభకార్యం.. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగిపోయింది. తన పెళ్లి గురించి అనన్య.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సింగర్ మంగ్లీతో పాటు తోటి గాయనీగాయకులు అనన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అనన్య.. 'కేజీఎఫ్' ఒరిజినల్ వెర్షన్లోని మెహబూబా, ధీర ధీర, సుల్తాన్ పాటలు పాడింది. అలానే తెలుగు వెర్షన్లోని 'తరగని బరువైనా' అంటూ సాగే తల్లి సెంటిమెంట్ సాంగ్ కూడా పాడింది. ఇది కాకుండా 'పుష్ప' కన్నడ వెర్షన్లోని 'సామి సామి' పాటలో వినిపించే గొంతు ఈమెదే. రీసెంట్ టైంలో తెలుగులో అయితే 'షష్టిపూర్తి', 'గరివిడి లక్ష్మి' సినిమాల్లో ఈమె పాటలు పాడింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్) -
భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!
మన దేశానికి వచ్చిన విదేశీయులను మన వివాహ వేడుకలు ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతాయి అనడంలో సందేహం లేదు. దీనికి తాజా ఉదాహరణ జేక్ కోడియా అనే కొరియన్. గురుగ్రామ్లోని కాస్మెటిక్ రిసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్న కోడియా తొలిసారిగా ఒక భారతీయ వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఆ వేడుకలోని వైభోగం, అతిథి మర్యాదలలోని ఆత్మీయతను చూసి అతడికి వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. విందులోని రుచుల సంగతి సరే సరి. పానీపూరి అతడికి తెగ నచ్చేసింది. వధువు ఎంట్రీ నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నాడు. పెళ్లివారితో కలిసి డ్యాన్స్ చేశాడు.‘కొరియన్ విజిట్స్ ఇండియన్ వెడ్డింగ్స్’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజనుల మనసును హోల్సేల్గా దోచేసుకుంది. ఒక ఫారినీయుడు ఇలా స్పందించాడు... ‘తాజ్మహల్ చూడడానికి ఇండియాకు వెళ్లాలనుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి వేడుకలు చూడడానికే ఇండియాకు వెళ్లాలనిపిస్తోంది’. View this post on Instagram A post shared by Cha Jaeil🇰🇷🇮🇳💕 (@pyara_jake_kodia) (చదవండి: ఎక్కడైనా సీక్రెట్ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!) -
ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)
-
'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)
-
ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
బిర్లా కుటుంబ వారసుడు, పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యష్) బిర్ల , అవంతిక బిర్లా బిర్లా కుమారుడు వేదాంత్ బిర్లా (33) మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. ముంబైలో మలబార్ హిల్లోని బిర్లా నివాసంలో సంజీవ్ -సుప్రియా కులకర్ణిల కుమార్తె తేజల్ కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సమక్షంలో కుమార మంగళం బిర్లా ,ఆయన భార్య నీర్జా బిర్లా దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఈ వెడ్డింగ్ వేడుక కోసం, తేజల్ హ్యాండ్మేడ్ బంధాని , సబ్యసాచి రెడ్ లెహంగాలో అందంగా కనిపించింది అద్దాలు, ముత్యాలు, సాంప్రదాయ మరోడి పనితనంతో సున్నితంగా ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహెంగాకు వజ్రాల ఆభరణాలతో జత చేసింది, అందులో నెక్లెస్, మాంగ్ టేకు, నాథ్, సరిపోలే చెవిపోగులు, స్వల్ప మేకప్తో పెళ్లికళ ఉట్టిపడేలా కనిపించింది. వేదాంత్ తెల్లటి బంధ్గాలాలో మ్యాచింగ్ టర్బన్తో ముస్తాబయ్యారు. వివాహం తర్వాత సెయింట్ రెగిస్లో స్టార్-స్టడెడ్ రిసెప్షన్ జరిగింది.సన్నిహిత బంధువులు, స్నేహితులు, పారిశ్రామికవేత్తలు, ముంబైలోని ఇతర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Dr.Swami kailashanand giri ji (@swamikailashanandgiri_official)తేజల్ : విజిలింగ్ వుడ్స్ గ్రాడ్యుయేట్ , ఏజిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు, తేజల్ వ్యాపారంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. సుభాష్ ఘాయ్ స్థాపించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నుండి డిప్లొమా ఇన్ ఫిల్మ్ స్టడీస్తో తేజల్ తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించింది. సినిమాలు, కథలు మీద ఆసక్తి ఉన్నప్పనటికీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బిజినెస్ అండ్ మేనేజిరియల్ ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ చేసింది, తరువాత పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నమెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది.ప్రొడక్షన్ అసిస్టెంట్ నుండి ఒక కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా తనను తాను తీర్చిదిద్దుకుంది.వేదాంత్ బిర్లా దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వేదాంత్ బిర్లా పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యశ్) బిర్లా మరియు అవంతి బిర్లాల ఏకైక కుమారుడు. వేదాంత్ ప్రస్తుతం బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్లో బోర్డు ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ముంబైలోని కాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, BD సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశాడు. ఆతరువాత, HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అలాగే UK లోని RBS కాలేజ్ నుండి జనరల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చదివాడు.ఊర్వశి రౌతేలా , నీల్ నితిన్ ముఖేష్ ,పూనమ్ ధిల్లాన్, నీలం కొఠారి, భూమి పెడ్నేకర్, సీమా సజ్దే వరకు లాంటి సినీ ప ప్రముఖులతోపాటు, ఆదర్ జైన్, అనిస్సా మల్హోత్రా జైన్,అర్మాన్ జైన్,ఆదిత్య సీల్,అనుష్క రంజన్, ఇంకా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు - ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే,ఆదిత్య ఠాక్రే కూడా హాజరయ్యారు. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
-
ఈ వయసులో నటితో పెళ్లి.. వీడియో చూసి నెటిజన్స్ షాక్.. తీరా చూస్తే!
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యూలతో పాటు సినీతారలు సైతం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. అలా బాలీవుడ్లోనూ ఓ సెలబ్రిటీ జంటకు సంబంధించిన పెళ్లి వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే వీరిద్దరి పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇద్దరు సీనియర్ నటులు కావడంతో బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా పెళ్లి దుస్తుల్లో మెరిశారు. ఈ వీడియోలో ఇద్దరు కూడా ఫోటోలకు కూడా పోజులివ్వడంతో నిజంగానే పెళ్లి చేసుకున్నారని నెటిజన్స్ షాకయ్యారు. వీరి పెళ్లి వీడియో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహానికి సంబంధించి అసలు విషయం తెలియడంతో నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా ప్రస్తుతం 'దుర్లభ్ ప్రసాద్ కీ దుస్రీ షాదీ' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పెళ్లికి సంబంధించిన కథ కావడంతో సంజయ్ మిశ్రా వరుడి దుస్తులలో మహిమా చౌదరి ఫోటోతో వధువుగా కూర్చున్నట్లు కనిపించారు. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగానే ఇలా వధూవరుల్లా రెడీ అయ్యారు. అంతే తప్ప మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో వైరలైన విజువల్స్ 'దుర్లభ్ ప్రసాద్ కి దుస్రీ షాదీ' మూవీ కోసం ప్రమోషనల్ షూట్లో భాగంగానే చేశారురియల్ లైఫ్ విషయానికొస్తే.. మహిమా చౌదరి 2006లో ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాజ ఈ జంట విడిపోయారు, ప్రస్తుతం ఆమె తన కుమార్తె అరియానాను పెంచడంపై దృష్టి సారించింది. మరోవైపు సంజయ్ మిశ్రా.. కిరణ్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. View this post on Instagram A post shared by Namaste Bollywood (@namastebollywood.in) -
గ్రాండ్గా దిల్ రాజు సోదరుడి కూతురి పెళ్లి.. హాజరైన టాలీవుడ్ సినీతారలు (ఫొటోలు)
-
పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్
తెలుగు సీరియల్స్లో మనమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటిది 10కి పైగా సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బ్యూడీ సాండ్రా జైచంద్రన్. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈమె.. తన భర్త మరో అమ్మాయితోనూ రిలేషన్లో ఉన్నాడని విడాకులు ఇచ్చేసింది. తర్వాత సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ప్రియుడిని పరిచయం చేసిన ఈమె ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)'కలవారి కోడలు' సీరియల్తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాండ్రా.. 'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం'లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'ఆటో విజయశాంతి' సీరియల్ చేస్తోంది. అయితే కొన్నాళ్ల ముందు నుంచి 'మనసిచ్చి చూడు', 'శుభస్య శీఘ్రం' సీరియల్స్లో హీరోగా చేసిన మహేశ్ బాబు కాళిదాసుతో కలిసి సాండ్రా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అలా కలిసి వీళ్లిద్దరూ వీడియోలు కూడా చేస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే సాండ్రా-మహేశ్ ప్రేమలో ఉన్నారా అని అంతా అనుకున్నారు. సడన్గా ఈ ఏడాది జూలైలో ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు పెళ్లితో సీరియల్ నటులు ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాండ్రా.. సీరియల్స్తో పాటు ఆర్య, తకిట తకిట అనే తెలుగు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్) -
పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ అనే కుర్రాడు.. ఇప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల అనే అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టిన అభిషన్.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా మారి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు రూ.80-90 కోట్ల కలెక్షన్ ఈ మూవీకి వచ్చాయి. ఇదే చిత్రంలోనూ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. రీసెంట్గా హీరోగా ఓ మూవీ పూర్తి చేశాడు. రజనీకాంత్ కూతురు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్.మరోవైపు అభిషన్కి రీసెంట్గానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' నిర్మాత మగేశ్ రాజ్.. ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని పెళ్లి బహుమతిగా ఇచ్చాడు. గురువారం చెన్నైలో రిసెప్షన్ జరగ్గా.. పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు హాజరైన కొత్త జంటని దీవించారు. ఇప్పుడు పెళ్లి కూడా జరగడంతో నూతన వధూవరుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా) -
నారా రోహిత్, శిరీషల పెళ్లి.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఘనంగా నారా రోహిత్ వివాహం..
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తను ప్రేమించిన సినీ నటి శిరీష (సిరి) (Sireesha)తో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఘనంగా వారి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
జేసీబీలో వాగు దాటిన పెళ్లికుమార్తెలు
జరుగుమల్లి(సింగరాయకొండ): ఓ పక్క దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తం...మరో పక్క గ్రామాన్ని చుట్టుముట్టిన వరద.. ఈ స్థితిలో వివాహాలు జరుగుతుందా లేదా.. అని రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీలో ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఊరు దాటించడంతో వివాహాలు జరిగాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేనికి చెందిన అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గకు గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె అంజలి వివాహం కూడా అదే గ్రామానికి చెందిన సుధాకర్తో సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం నుంచి గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. దీంతో రెండు కుటుంబాల వారు అధికారులకు సమస్యను వివరించారు. దీంతో అధికారులు జేసీబీల సాయంతో పెళ్లికుమార్తెలను వరద నీటిని దాటించారు. -
కజిన్ సిస్టర్ కూతురి పెళ్లిలో అనసూయ సందడి (ఫోటోలు)
-
అన్న కూతురి పెళ్లిలో రాజీవ్ కనకాల- యాంకర్ సుమ సందడి (ఫోటోలు)
-
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు
2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్ లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. సాక్షి, విశాఖపట్నం: 2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగం కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. మైదాన్ సాఫ్.. క్రికెట్ స్టేడియంలే లక్ష్యంగా.. క్రికెట్ అభిమానులైన ఈ జంట.. ఓ రోజు ముంబయిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వెళ్లారు. అక్కడ మ్యాచ్ల తర్వాత పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త విభజనపై అవగాహన లేకపోవడంతో ‘మైదాన్ సాఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపాలిటీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో మాట్లాడి మైదాన్ సాఫ్ అమలుకు మార్గం సుగుమం చేసుకున్నారు. 2023 ఐసీసీ ప్రపంచ కప్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐసీసీ, బీసీసీఐ మద్దతుతో.. కోకా–కోలా ఇండియాతో కలిసి ఇప్పుడు 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. నవీ ముంబయి, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తను రీసైక్లింగ్కు, తడి చెత్తను కంపోస్టింగ్కు పంపారు. పంపుతు న్నారు. 2030 నాటికి దేశంలో జరిగే పెద్ద కార్యక్రమాలన్నిటినీ వ్యర్థ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని గ్రీన్ దంపతులు చెబుతున్నారు.గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశి్వన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
'సలార్' సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. ప్రశాంత్ నీల్, యష్, శ్రీలీల సందడి (ఫొటోలు)
-
నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది బొగ్గు. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటినిలోనూ హీరోలు మసి లేదంటే బొగ్గుతో కనిపిస్తారు. డ్రస్సులు కూడా డార్క్ కలర్లోనే ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్తో తీస్తున్న 'డ్రాగన్' కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఇదివరకే పోస్టర్ రిలీజ్ చేస్తే అందులోనూ డార్క్ థీమ్ కనిపించింది.(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?)అయితే ప్రశాంత్ నీల్.. డార్క్ కలర్ డ్రస్సుల్లో కాకుండా వేరే వాటిలో కనిపించడం అరుదని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వైట్ షర్ట్, పంచెతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య కూడా ఫీలైనట్లుంది. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. 'నా దొంగమొగుడి ఫైనల్లీ వైట్ దుస్తుల్లో..' అని ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా సరదాగా నవ్వుకుంటున్నారు.ప్రశాంత్ నీల్ తొలి సినిమా 'ఉగ్రం' నుంచి సినిమాటోగ్రాఫర్ చేస్తున్న భువన్ గౌడకి రీసెంట్గా పెళ్లి జరిగింది. 'కేజీఎఫ్' హీరోహీరోయిన్ యష్, శ్రీనిధి శెట్టితో పాటు మూవీ టీమ్లోని చాలామంది హాజరయ్యారు. ఇదే వేడుకలో భార్య లిఖిత రెడ్డితో పాటు ప్రశాంత్ నీల్ కూడా కనిపించాడు. డార్క్ కలర్ డ్రస్సులో కాకుండా తెల్లని దుస్తుల్లో కనిపించేసరికి అందరూ షాకవుతున్నారు. ఈ పెళ్లిలో హీరోయిన్ శ్రీలీల కూడా తల్లితో కలిసి కనిపించడం విశేషం.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ తేదీ) View this post on Instagram A post shared by Likitha (@likithareddyneel) -
పెళ్లి పనులు మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)
-
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ
అక్టోబర్ చివరకొచ్చేసింది. ఈ కొద్దిరోజుల్లోనే టాలీవుడ్లో పలు శుభకార్యాలు జరగబోతున్నాయి. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఈనెల చివర్లో ఉండగా, నారా రోహిత్-శిరీష పెళ్లి కూడా రాబోయే కొన్నిరోజుల్లోనే జరగనుంది. మరోవైపు ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'నాటు నాటు' పాటతో ఆస్కార్ వరకు వెళ్లిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముందుగా ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఫొటోలు పోస్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈనెల మొదట్లో రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఇప్పుడు హరిణ్య స్వయంగా తమ పెళ్లిపనులు మొదలయ్యాయని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. లగ్నపత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ మూడు ఫొటోలని పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్, హరిణ్య జంట చూడముచ్చటగా కనిపించింది. రాహుల్లానే హరిణ్య కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. బిగ్బాస్ షోలో రాహుల్ పాల్గొన్నప్పుడే వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుర్రాడు. మాస్ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు ఇతడి పాడాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే.(ఇదీ చదవండి: నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్) -
పెళ్లి తర్వాత శోభితా తొలి దీపావళి కళ్లు తిప్పుకోలేకపోతున్న నాగ చైతన్య (ఫోటోలు)
-
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
భర్త, పిల్లల్ని వదిలేసి వస్తా.. నన్ను పెళ్లి చేసుకో..!
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ప్రేమిస్తున్నానని చెప్పి రూ.10లక్షలు, ప్లాట్, బంగారం తీసుకుంది.. పెళ్లి చేసుకోవాలని వేధించింది.. అంగీకరించకపోవడంతో చివరకు చంపించిందని ఈనెల 10న సెంటినరీకాలనీలో హత్యకు గురైన కోట చిరంజీవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ప్రెస్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతుడు చిరంజీవి సోదరులు రామ్చరణ్, సాయిచరణ్తోపాటు బావమరిది నరేశ్ మాట్లాడారు. చిరంజీవికి ఇంటర్లో క్లాస్మేట్ సంధ్యారాణి అని, మీసేవ కేంద్రానికి వచ్చి ఆన్లైన్ కోర్సులు నేర్చుకునేదన్నారు. ప్రేమిస్తున్నాని చెప్పి దాదాపు రూ.10లక్షల నగదు, 5 తులాల బంగారం, ఒక ప్లాట్ తీసుకుందని తెలిపారు. వివాహం చేసుకోవాలని వేధించిందని, ఇద్దరు పిల్లలతోపాటు ఇద్దరు పెళ్లి కాని సోదరులున్నారని, వివాహం చేసుకోనని తిరస్కరించాడని వివరించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతోనే పగ పెంచుకొని పథకం ప్రకారంగా హత్య చేయించినట్లు అనుమానముందని ఆరోపించారు. వీరి ప్రేమ వ్యవహారంలో వీర్లపల్లిలో గతంలోనూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు గుర్తు చేశారు. చిరంజీవి మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే వీడియోలు, మెసేజ్లు, డబ్బుల సమాచారముంటుందని, సీసీ కెమెరాలు పరిశీలించాలన్నారు. దీనివెనక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానముందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నాగరాజు, శ్రీజ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.ప్రాణం తీసిన వివాహేతర సంబంధం -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
కర్ణాటక: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశి్చతార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. -
ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో నార్నే నితిన్ ఓ ఇంటివాడయ్యారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ నెల పదో తేదీన వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. మ్యాడ్ స్క్వేర్ మూవీతో ఫేమస్ అయిన నితిన్ మన యంగ్ టైగర్ బామ్మర్ది అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్తో అభిమానులను అలరించిన హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు.తాజాగా నితిన్ -శివానీల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో మన అక్కినేని హీరో అఖిల్ కూడా పాల్గొన్నారు. తన సతీమణి జైనాబ్ రవ్దీతో కలిసి గ్రాండ్ రిసెప్షన్కు హాజరయ్యారు. అఖిల్ తన భార్య చేయి పట్టుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం
ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీ శివాని అనే అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని శంకరపల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది అందరికీ తెలుసు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి సొంత తమ్మడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర చిత్రాలతో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.మరి పెళ్లి కూతురు ఎవరు ఏంటనేది మాత్రం పెద్దగా తెలియదు. అయితే ఈ పెళ్లిలో హీరో వెంకటేశ్ కుటుంబం కూడా కనిపించడంతో అమ్మాయికి వీళ్లకు బంధుత్వం ఏంటా అని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు లక్ష్మీ శివానిది నెల్లూరు. కానీ వ్యాపారరీత్యా ఈమె తండ్రి కృష్ణప్రసాద్ హైదరాబాద్లో ఉన్నారు. దీంతో లక్ష్మీ శివాని.. చదువంతా భాగ్యనగరంలోనే పూర్తి చేసింది. అయితే దగ్గుబాటి కుటుంబంతో వీళ్లకు బంధుత్వం ఉంది. దివంగత రామానాయుడికి ఈమె మనవరాలు అవుతుంది. అంటే వెంకటేశ్, సురేశ్ బాబుకు కూతురు వరస అవుతుంది.(ఇదీ చదవండి: హీరో రానా నుంచి 'బూతుల' సినిమా.. టీజర్ రిలీజ్)అందుకే నార్నే నితిన్-శివాని పెళ్లిలో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితరులు సందడి చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఈ వివాహ వేడుకలో కనిపించారు. గతేడాది నవంబరులో నితిన్-శివానిల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి జరిగింది.నార్నే నితిన్ విషయానికొస్తే.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్, శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతానికైతే ఇతడి చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసి త్వరలో కొత్త చిత్రాల్ని ప్రకటిస్తాడేమో చూడాలి!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)#Venkatesh & #Rana at Narne Nithin Marriage pic.twitter.com/5XcCBoAtZz— Taraq(Tarak Ram) (@tarakviews) October 11, 2025 -
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుక (ఫోటోలు)
-
కోన వెంకట్ కూతురి పెళ్లి రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనిపిస్తోంది. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైపోయాయా అనే సందేహం కలుగుతోంది. తాజాగా రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. బిగ్బాస్లోకి టీమిండియా స్టార్ బౌలర్?)హరిణ్య కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. బిగ్బాస్ షోలో రాహుల్ పార్టిసిపేట్ చేసిన టైంలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. రీసెంట్గా ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పడు హరిణ్య ఫ్రెండ్ ఇంటిలో చిన్నపాటి పార్టీ జరిగింది. అయితే ఇది బ్యాచిలర్ పార్టీనా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోని హరిణ్య.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీడియో చూస్తుంటే ఈనెలలోనే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరగనుందేమో అనిపిస్తుంది.రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇతడు మాస్ సాంగ్స్ పాడటంలో స్పెషలిస్ట్. ఇప్పటికే 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి నజరానా కూడా అందుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
కిరణ్ అబ్బవరం కొడుకుని చూశారా? ఎంత ముద్దుగా ఉన్నాడో! (ఫొటోలు)
-
సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం.. తన భార్య, కొడుకుతో కలిసి పెళ్లిలో సందడి చేశాడు. తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న డేనియల్ విశ్వాస్.. మాధురి అనే అమ్మాయిని శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లిలోని ఓ చర్చిలో ఈ శుభకార్యం జరిగింది. దీనికి కిరణ్ అబ్బవరం ఫ్రెండ్స్ అందరూ హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం.. తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ గతేడాది రిలీజైన 'క' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'కె ర్యాంప్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఇకపోతే తన చిత్రాలు 'వినరో భాగ్యము విష్ణుకథ', 'క' సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసిన డేనియల్ విశ్వాస్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో కిరణ్.. తన భార్య రహస్య, కొడుకు హనుతో కలిసి మరీ వేడుకకు హాజరయ్యాడు.(ఇదీ చదవండి: 'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం) -
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అవికా గోర్ (ఫొటోలు)
-
అంతరిక్షంలో పెళ్లి చేసుకోబోతున్న 63 ఏళ్ల హీరో!
ఆ హీరోకి 63 ఏళ్లు..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు..విడాకులు అయ్యాయి. ఇప్పుడు 37 ఏళ్ల హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారట. పెళ్లంటే మాములు పెళ్లి కాదు..ఇంతవరకు ఎవరూ చేసుకొని విధంగా..అంతరిక్షంతో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. ఆ హీరో ఎవరో కాదు.. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్(Tom Cruise ). హీరోయిన్ అనాడి అర్మాస్(Ana de Armas). వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు హాలీవుడ్లో వార్తలు వచ్చాయి. లండన్లో ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. అప్పుడే పెళ్లికి సంబంధించి పుకార్లు అయితే వచ్చాయి. భూమిపై కాకుండా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తుందట. ఒకవేళ అది కుదరపోతే గాల్లో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ‘టాక్ క్రూజ్కి అంతరిక్ష ప్రయాణం అంటే చాలా ఇష్టం. స్పేస్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అవకాశం వస్తే.. అంతరిక్షంలో పెళ్లి చేసుకోని చరిత్రకెక్కాలని టామ్ ఆశపడుతున్నాడు’ అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ హాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు గాలిలో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అది కుదరకపోతే అండర్వాటర్ వెడ్డింగ్: (సముద్రంలోకి డైవ్ అయి, అక్వారియం లాంటి సెటప్లో పెళ్లి చేసుకోవడం) చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సాధారణ పెళ్లి కాకుండా ‘హెడ్లైన్’లో ఉండే వివాహాన్ని చేసుకోవాలని ఇద్దరు కోరుకుంటున్నారట. మరి ఈ స్పెషల్ జంట పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి.కాగా టామ్ క్రూజ్ ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. 1987లో మిమీ రోజర్స్ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. 1990లోనే నికోల్ కిడ్మన్ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్లియర్తో, సింగర్ చెర్తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు. ఇక అనాడి ఆర్మాస్ కూడా 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్ని పెళ్లి చేసుకొని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత టామ్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని హాలీవుడ్ టాక్. -
పెళ్లి సందడి : మెహిందీ వేడుకలో అవికా గోర్ చేసిన పని వైరల్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి అవికా గోర్ (Avika Gor). 'ఆనంది' పాత్ర ద్వారా పాపులరైన అవికా తన చిరకాల ప్రియుడు, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీ (Milind Chandwani)ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.అవికా గోర్ తన రోకా, నిశ్చితార్థాన్ని ప్రకటించినప్పటి నుండి చాలా వార్తల్లో నిలిచింది. ఇటీవల జంట 'పాటి పత్ని ఔర్ పంగా' షోలో వారి మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అవికా గౌర్ చేసిన పని ఇంటర్నెట్లో అందరి హృదయాలను గెలుచుకుంది. దీంతో అవికా గోర్ మెహందీ వేడుక వైరల్గా మారింది. ఈ సంప్రదాయంలో భాగంగా, అవికా తన కాబోయే భర్త మిలింద్ చాంద్వానీ పేరును తన అరచేతిపై అందంగా రాసుకుంది. అంతేకాదు తన అత్తమామల పేర్లను కూడా అదే అరచేతిలో పండించుకోవడం విశేషంగా నిలిచింది. దీనితో పాటు, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా మరొక అరచేతిలో రాయించు కుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల వైబ్స్లో మరింత జోష్ వచ్చింది. దీనిపై అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మిలింద్ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవంగా అభవర్ణిస్తున్నారు. అవికా అందమైన కలర్ఫుల్ లెహంగా, ఆభరణాల్లో కనిపించింది, మరోవైపు, మిలింద్ రాజస్థానీ శైలి తలపాగాను ధరించాడు. ఇద్దరూ ఎంతో సంతోసంగా డ్యాన్స్ చేశారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) ప్రస్తుతం మునావర్ ఫరూఖీ అండ్ సోనాలి బింద్రే హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో,పతీ పత్ని ఔర్ పంగా-జోడియోం కా రియాలిటీ చెక్లో కనిపించే అవికా గోర్ ,మిలింద్ చాంద్వానీ, ఇటీవల జాతీయ టెలివిజన్ ద్వారా లైవ్లో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతోంది. 2019లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ ప్రక్టించచారు. సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) -
ప్రియుడిని పెళ్లి చేసుకున్న పాప్ సింగర్ సెలెనా (ఫొటోలు)
-
E–ఈక్వల్ M–మ్యారేజ్ I–ఇన్స్టాల్మెంట్
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసిచూడు.. అని సామెత. రెండూ జటిలమైనవేనని అర్థం. ఇంటి కోసం అప్పు చేసినా తప్పు లేదు. అదొక నీడగా మిగులుతుంది. కానీ పెళ్లి? కం పాటబులిటీ కుదిరితే కుటుంబంగా స్థిరపడుతుంది. లేదంటే చేదుజ్ఞాపకంగా వెంటాడుతుంది. అయినా అంతా బాగుంటుందనే ఆశతో ఏడడుగుల ప్రయాణానికి సిద్ధపడినా.. దానికోసం లక్షలకు లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఉందా అని! ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరే పెట్టుకుంటున్నారు. అది వాళ్లిద్దరి జీవితాలకు తీరని రుణంగా పరిణమించి.. ఈఎమ్ఐల రూపంలో జీతాలనే మింగేస్తోంది. దాని గురించే ఈ కథనం..సాత్విక్ది మార్కెటింగ్ జాబ్, మానస ఒక కార్పొరేట్ కంపెనీలో లీడ్ రోల్లో ఉంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా, డెస్టినేషన్ వెడ్డింగ్. దాదాపు 80 లక్షల రూ పాయలకు పైనే ఖర్చయింది. ఆ భారం ఇరువైపుల తల్లిదండ్రుల మీద పడకుండా వీళ్లిద్దరే షేర్ చేసుకున్నారు. సేవింగ్స్ నుంచేనా ఖర్చు చేసింది అని అడిగితే.. ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్, ఎయిటీ పర్సెంట్ లోన్ అనే చెప్పారు ముక్తకంఠంతో. పెళ్లయి మూడేళ్లవుతోంది. ఆ ఖర్చుకు ఇంకా ఈఎమ్ఐ చెలిస్తునే ఉన్నారు. ఆ లోన్ తీరేదాకా పిల్లలు వద్దు అనుకుంటున్నారట. ఆ మాటతో మానస వాళ్ల మామ్మ హతాశురాలైంది. ఇదెక్కడి చోద్యమంటూ విచారపడింది.సర్వేలే సాక్ష్యం‘ఇండియా లెండ్స్’ చేసిన సర్వే మేరకు సొంత ఖర్చుతోనే పెళ్లిచేసుకోవాలనుకుంటున్న 26 శాతం అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆ ఖర్చును పర్సనల్ లోన్తో భర్తీ చేసుకుంటున్నార ట. వాళ్లలో చాలామంది పెళ్లికి సంబంధించి ఒక్క ఈవెంట్కే రూ. లక్ష నుంచి రూ. అయిదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని మీదే వెడ్డింగ్వైర్ ఇండియా అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఒక్క నిరుడే మన దేశంలో పెళ్లి ఖర్చు అమాంతం రూ. 29.6 లక్షలకు చేరినట్టు తేలింది. పెళ్లి జంటల్లోని మూడోవంతు జంటలు తమ పెళ్లికి రూ. 30 లక్షలకు పైనే వెచ్చిస్తుంటే మిగిలిన జంటలు రూ. 50 లక్షలకు పైగా ఖర్చుపెడుతున్నారని ఆ సర్వే నివేదిక.అప్పులు బారెడు... జీతం మూరెడుగానే! డబ్బు ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కూడబెట్టడమే బహు కష్టం. రూ. లక్ష సమకూర్చుకోవడానిక్కూడా కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మూడు లేదా అయిదురోజుల పెళ్లిలోని ఒక్కో వేడుకకు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల దాకా పెట్టే ఖర్చు జీవితానికి ఎంత భారమవుతుందో తెలుసా! ఆ అప్పు తీర్చడానికి ఆ జంటలు.. అప్పుడే పిల్లల్ని వద్దనుకోవడం దగ్గర్నుంచి ఇల్లు, ఇతర స్థిర, చరాస్తులను సమకూర్చుకోవడం దాకా అన్నిటినీ వాయిదా వేసుకుంటున్నారు. అ పార్ట్మెంట్ డౌన్పేమెంట్కి పనికొచ్చే డబ్బును, భవిష్యత్ ప్రణాళికలను.. ఆఖరకు ఇన్సూరెన్స్ పాలసీలను సైతం బ్రేక్ చేసి మరీ పెళ్లి బట్టలు, ఈవెంట్ డెకరేషన్ కోసం చేసిన అప్పు తీరుస్తున్న జంటలున్నాయి. ఇలా ఆ లోన్ వాళ్ల పెళ్లిని మధుర జ్ఞాపకంగా మలచకపోగా సంసారాన్ని చింతల చితిగా మారుస్తోంది.క్రైసిస్లో కాపురాలుదరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ను బట్టి వెడ్డింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఏడాదికి పది నుంచి 24 శాతం దాకా మంజూరవుతున్నాయట. వీటికి కట్టలేకుండా పేరుకుపోయిన ఈఎమ్ఐల వడ్డీ వచ్చి చేరి.. ఎంత జీతం వచ్చినా, అత్యవసరాలకే ఎసరు వస్తోంది. ఈ క్రైసిన్ కాపురంలో కలతలను రేపుతోందంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. పెరుగుతున్న రుణభారాన్ని తీర్చడానికి ఓవర్ టైమ్, పార్ట్టైమ్ జాబ్ల కోసం వెదుక్కుంటున్న జంటలూ ఉన్నాయి. నెల తిరిగేసరికల్లా వచ్చే ఈ ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక భార్యాభర్తల డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ కలహాలతో ముగుస్తున్నాయి. ఎడమొహం పెడమొహంగా ఉదయాలు మొదలవుతున్నాయి.అప్పు తప్పు కాదు కానీ.. లోన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఎందుకు తీసుకుంటున్నాం.. దేనిమీద ఖర్చు పెడుతున్నామనే ఎరుక, స్పష్టత చాలా అవసరం అంటున్నారు ఆర్థికవిశ్లేషకులు. ఇల్లు కట్టుకోవడానికో, వ్యా పారం ప్రారంభించడానికో, మెరుగైన ఉ పాధి అవకాశాలను కల్పించే చదువుకోసమో అప్పు చేయడం సబబే. కానీ.. పైసా రాబడి లేనిచోట అప్పు చేసి మరీ డబ్బును వెదజల్లడం తెలివైన నిర్ణయం కాదని చెబుతున్నారు. పరస్పర గౌరవ మర్యాదలు, సర్దుబాట్లు, ప్రేమాభిమానాలతో పెళ్లి చేసుకోవాలి. మంచి కుటుంబంగా స్థిరపడాలి. కానీ ఆడంబరాల వేడుకగా.. ఫొటోలు, వీడియోలతో కనిపించే అప్పుగా కాదని సూస్తున్నారు ఆర్థికనిపుణులు, విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు. కలలు సాకారమవ్వాల్సిందే! మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాల్సిందే! కానీ ఈ రెంటికి మూల్యం మన జీవితం కాకూడదు! అప్పుడే సాకారమైన కలలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన మ్యారేజ్ ఇండస్ట్రీ ఏటా కోటి పెళ్లిళ్లతో 10.79 లక్షల కోట్ల టర్నోవర్గా పురోగమిస్తోంది. ఫుడ్ అండ్ గ్రాసరీ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధాన, ప్రభావవంతమైన ఇండస్ట్రీగా విరాజిల్లుతోంది. -
అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?
అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బన్నీ సోదరుడు శిరీష్.. ప్రస్తుతం కొత్తగా సినిమాలేం చేయట్లేదు. చివరగా గతేడాది 'బడ్డీ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ పెద్దగా యాక్టివ్గా లేడు. అలాంటిది ఇప్పుడు ఇతడు త్వరలో వివాహం చేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))హైదరాబాద్కి చెందిన ఓ బిజినెస్మ్యాన్ కుమార్తెతో శిరీష్కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని.. ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో ఇది కాస్త వాయిదా పడిందని వినిపిస్తుంది. వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది.మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులు కూడా అయిపోయారు. నిహారిక వివాహం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతానికి సింగిల్గా ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?) -
పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..
హైదరాబాద్ నగరంలో పెళ్లి చేయాలంటే ఇంటి ముందు పందిరి వేసుకునేంత ప్రదేశం దొరకడం కష్టంగా మారింది. ఇరుకిరుకు రోడ్లు, నిత్యం వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యకృత్యాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ.లక్షలు చెల్లించి ఫంక్షన్ హాల్కు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది భారీ ఎత్తున పూల తోరణాలు, సెట్టింగులతో ముస్తాబు చేసి, స్టేటస్ చూపిస్తున్నారు. పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కల్యాణ మండపం ఖర్చులు పెట్టుకోలేని పేదలకు అండగా నిలిచేందుకు త్యాగరాయ గానసభ ముందుకొస్తోంది. పేద కుటుంబాల వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్, పెళ్లి కుమార్తెకు బంగారు తాళిబొట్టు, చీర, కాలి మెట్టెలు ఇస్తున్నారు. 150 మంది వరకు బందువులకు ఉచితంగా శాఖాహార భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే వివాహం అనేది పెద్దలు కుదుర్చిన సంబంధాలకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. ప్రేమ వివాహాలు వంటి వాటికి ఇక్కడ స్థానం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 97 వివాహాలు త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 97 వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్ అందించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఫంక్షన్ హాల్కు వెళ్లే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఇక్కడ ఆసరా లభిస్తోంది. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా త్యాగరాయ గానసభలో వివాహం చేసుకున్న కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకంలో త్వరితగతిన ప్రోత్సాహకాలను అందిస్తోంది. వివరాలకు ఫోన్: 93999 20008. (చదవండి: ఇల్లే గ్రంథాలయం..! హోమ్ లైబ్రరీ కోసం..) -
డబుల్ పీజీ ప్రొఫెసర్తో మంత్రి రెండో పెళ్లి
డబుల్ మాస్టర్ డిగ్రీ చేసిన ప్రొఫెసర్ అమ్రీన్ సెఖోన్ను ద్వితీయ వివాహం చేసుకున్నారు మినిస్టర్ విక్రమాదిత్య సింగ్. సెప్టెంబర్ 22న చండీగఢ్లో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనులు, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా వీరభద్ర సింగ్ కుమారుడే ఈయన.వధువు అమ్రీన్ సెఖోన్ (Amreen Sekhon) పంజాబ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇంగ్లీష్, సైకాలజీలో డబుల్ మాస్టర్స్ డిగ్రీలతో పాటు సైకాలజీలో పీహెచ్డీ చేశారు. విక్రమాదిత్యకు పాత స్నేహితురాలైన ఆమె.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నారు. సర్దార్ జోతిందర్ సింగ్ సెఖోన్, ఓపిందర్ కౌర్ ఆమె తల్లిదండ్రులు.యువరాణితో ఫస్ట్ మ్యారేజ్విక్రమాదిత్య సింగ్ 1989, అక్టోబర్ 17న జన్మించారు. హిమాచల్ ప్రదేశ్లోని బిషప్ స్కూల్లో చదువుకున్న సింగ్, 2011లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్రాజ్ కళాశాల నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2016లో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా. జాతీయ స్థాయి ట్రాప్ షూటర్గా 2007లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. రాజస్థాన్లోని అమేత్కు చెందిన యువరాణి సుదర్శన చుండావత్ను (Sudarshana Chundawat) 2019లో వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా 2024, నవంబర్లో వీరు విడిపోయారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నేత36 ఏళ్ల విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో సిమ్లా గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మండీ నియోజకవర్గంలో పోటీ చేసి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: నా రీల్స్ చూడడం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానితో ఒక్కటి కానుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు శుభవార్త చెప్పేశారు. ఓ రియాలిటీ షోలో జంటగా పాల్గొన్న వీళ్లిద్దరూ ఈ సంగతి బయటపెట్టారు. ఇంతకీ పెళ్లెప్పుడు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది.అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి డేటింగ్లో ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 30న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అవికా.. ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ క్రమంలోనే కాబోయే వధూవరులకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
అతడికి 72, ఆమెకు 27 : జోధ్పూర్లో ఏడడుగులు వేసిన విదేశీ జంట
రాజస్థాన్ విలాసవంతమైన పెళ్ళిళ్లకు పెట్టింది పేరు. తాజాగా జోధ్పూర్లో జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్పూర్ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన ఒక విదేశీ జంట. బారాత్నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే. హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్కు చెందిన వారు. జైపూర్, ఉదయపూర్, జోధ్పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్పుర్లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. జోధ్పూర్ ఎందుకు?రాజస్థాన్ చరిత్ర, జోధ్పూర్ నగర వైభవం, సాంస్కృతిక వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులువధూవరులిద్దరూ భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి, రత్నాలు పొదిగిన కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్పూర్లోని సుందరమైన ఖాస్ బాగ్లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) -
చిన్న ‘జేజమ్మ’ పెళ్లి పీటలెక్కింది.. అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేశ్ వెడ్డింగ్ హైలైట్స్
-
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. కానీ ఎలాంటి ప్రకటన లాంటివి లేకుండా సీక్రెట్గా వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది. 'జనాల్లేరు.. లైట్స్ లేవు.. సౌండ్ లేదు. ఫైనల్లీ మా పెళ్లి అయిపోయింది' అని మలయాళ నటి గ్రేస్ ఆంటోని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటి హీరోహీరోయిన్లు అందరూ కొత్త పెళ్లికూతురికి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న గ్రేస్ ఆంటోని.. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితరులు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా వచ్చిన తమిళ చిత్రం 'పరంతు పో'లో ఈమెనే హీరోయిన్. అయితే మలయాళ మూవీస్ ఓటీటీల్లో చూసే తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకున్నానని చెప్పి గ్రేస్ బయటపెట్టింది. కానీ భర్త ఎవరు? ఇండస్ట్రీకి వ్యక్తి అనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే రెండు ఫొటోలు అవి కూడా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న వాటిని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని రోజుల్లో భర్త ఎవరు ఏంటి అనేది చెబుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) View this post on Instagram A post shared by Grace (@grace_antonyy) -
మ్యారేజ్ గ్రాడ్యుయేషన్.. ! విడిపోయి కలిసి ఉండటం..
సాంకేతికత నుంచి జీవనతత్వం దాకా ఎందులోనైనా ట్రెండ్ను క్రియేట్ చేయడంలో పేటెంట్ జపాన్దే! ఆ ధోరణి పెళ్లి బంధంలోనూ కనిపిస్తోంది. దాన్ని మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు. అదే జాపనీస్లో ‘సోసుకోన్’. సోసుగ్యోయు అంటే గ్రాడ్యుయేషన్.. కేకోన్ అంటే పెళ్లి.. ఈ రెండు పదాల కలయికే సోసుకోన్. మనసున మనసై బతుకున బతుకైన జీవన తోడు దొరకడం నిజంగానే భాగ్యం. ఆ భాగ్యం లేక΄ోతే సర్దుబాట్లతోనే సంసారం సాగుతుంది. ఆ సర్దుబాటూ కరవైతే విడాకులే! ఆ విడాకులూ ఊరికే మంజూరు కావు కదా.. ఆలుమగల గోల వినాలి.. సాక్ష్యాలు పరీక్షించాలి.. వాయిదాలు భరించాలి.. మానసిక క్షోభను అనుభవించాలి! ఇదంతా లేకుండా విడి΄ోయి కలిసి బతికే దారి ఉంటే బాగుండు అనిపిస్తుంది! అచ్చంగా అలాంటి పరిష్కార మార్గమే సోసుకోన్ ఆకా (ఏకేఏ ఆల్సో నోన్ యాజ్) మ్యారేజ్ గ్రాడ్యుయేషన్. కలహాల కాపురానికి చక్కటి సొల్యుషన్ అంటున్నాయి జపాన్ జంటలు.ఆ సొల్యుషన్ ఏంటంటే.. పెళ్లిని పునర్నిర్వచిస్తున్న ఈ ట్రెండ్ స్పర్ధలున్న భార్యాభర్తలు ఏ గొడవలేకుండా, విడాకుల ఊసెత్తకుండా పరస్పర గౌరవంతో ఎవరికివారే నచ్చినట్లు జీవించే వెసులుబాటును కల్పిస్తోంది. ఆ జంట ఇష్టపడితే విడి΄ోయి కూడా ఎవరిమానాన వారు ఒకే చూరు కింద కలిసి ఉండొచ్చు. ఇంటి పనుల దగ్గర్నుంచి వంట దాకా సపరేట్గా చేసుకుంటూ హౌజ్మేట్స్లా గడపొచ్చు లేదంటే వేరువేరుగా వేరు వేరు ఇళ్లల్లో ఉండొచ్చు.. నచ్చినప్పుడు, సమయం కుదిరినప్పుడు కాఫీ, లంచ్, డిన్నర్, మూవీ డేట్స్కి కలుసుకుంటూ! ఫ్రెండ్స్లా ఫోన్లో మాట్లాడుకోవచ్చు.. కెరీర్ నుంచి ఆస్తుల వ్యవహారాల దాకా ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. డబ్బు, సమయం వృథాకాని.. మానసిక బాధలేని ఈ పద్ధతి జపాన్లోని చాలా జంటలకు నచ్చి.. కలహాలతో కాపురం డిస్టర్బ్ అవుతుందనే అంచనాకు రాగానే వెంటనే మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ను అమలు చేస్తున్నారట. ఎప్పుడు మొదలైందంటే.. జపనీస్ ప్రఖ్యాత రచయిత యుమికో సుగియామా 2000 సంవత్సరంలో పెళ్లయిన జంటల మీద ఒక సర్వే నిర్వహించింది. విడాకులకు వెళ్లకుండా వైవాహిక జీవితంలోని కలతలను ఎలా పరిష్కరించుకుంటారని అడిగింది. అందులో సగానికి పైగా జంటలు అలాంటి అవకాశమే వస్తే.. సొసుకోన్ మెథడ్ను ఎంచుకుంటామని చెప్పారు. ఒకే ఇంట్లో ఉంటూ తమకు నచ్చినట్టు బతుకుతామని కొందరు, వేరువేరుగా ఉంటూ వీకెండ్ డేట్స్లో మీట్ అవుతామని మరికొందరు, ఫ్రెండ్స్లా కలిసి ఉండటానికి ఇష్టపడతామని ఇంకొందరు చెప్పారట. అలా రెండువేల సంవత్సరంలో ఆ సర్వే ద్వారా మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ ప్రచారంలోకి వచ్చి.. విడాకులకు ప్రత్యామ్నాయమైన ట్రెండ్గా స్థిరపడిపోయింది. హింస, వ్యథ లేని ఆ రిలేషన్షిప్ను నలభైల్లో ఉన్న జంటలు ఎక్కువగా ఇష్టపడతున్నాయని తర్వాత జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
చిరాగ్, పెళ్లి చేసుకో!
‘ఓటర్ అధికార్ యాత్ర’ సభ అనంతరం రాహుల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ పాల్గొన్న మీడియా భేటీ సరదా సన్నివేశాలకు, నవ్వులకు వేదికైంది. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య చిచ్చు పెట్టేందుకు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు తేజస్వి బదులిస్తూ, ఆయన ఎత్తులను చిత్తు చేస్తానని ధీమా వెలిబుచ్చారు. అయితే, ‘‘ చిరాగ్ వయసులో నాకంటే పెద్ద. పెద్దన్నయ్య వంటివాడు. అందుకే తనకు నాదో సలహా. త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది’’ అంటూ నవ్వులు పూయించారు. ‘‘నీ ఉచిత సలహాలు నాక్కూడా తగులుతున్నాయి, చూసుకో’’ అంటూ రాహుల్ చెణుకులు విసరడంతో అంతా మరోసారి గొల్లుమన్నారు. తేజస్వి అంతటితో ఆగకుండా, ‘పెళ్లి చేసుకొమ్మని మా నాన్న(లాలు) కూడా మీకిప్పటికే చాలాసార్లు చెప్పా’రన్నారు. అది నిజమేనని రాహుల్ అంగీకరించారు. ‘‘రెండేళ్లుగా లాలూజీని ఎప్పుడు కలిసినా నా పెళ్లి మాటే ఎత్తుతున్నారు. ఆయన సమక్షంలో ఇంకా నా పెళ్లి చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ మరోసారి అందరినీ నవి్వంచారు. ‘‘రాహుల్ పెళ్లి గురించి ఆయన తల్లి సోనియాగాంధీతో మాట్లాడా. రాహుల్ను పెళ్లికొడుకుగా చూడాలని మేమంతా ఆరాటపడుతున్నాం. ఆయన బారాత్లో మేం డ్యాన్స్ చేయాల్సిందే’’ అని లాలు గతంలో అనడం తెల్సిందే. బుల్లెట్ ర్యాలీలో... రాహుల్కు ముద్దు అరారియాలో బుల్లెట్ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు హఠాత్తుగా దూసుకొచ్చి రాహుల్ ఎడమ భుజంపై ముద్దు పెట్టాడు! జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్కు ఓ ఆగంతకుడు అంత సమీపానికి రావడం అందరినీ షాక్కు గురిచేసింది. భద్రతాధికారులు అతన్ని దూరంగా నెట్టడమే గాక చేయి కూడా చేసుకున్నారు. అనంతరం ఇంకెవరూ రాహుల్ను సమీపించకుండా వలయంగా మారి భద్రత కల్పించారు. అంతకుముందు కూడా ఓ బాలుడు రాహుల్ ర్యాలీగా వెళ్తున్న ఓపెన్ టాప్ కారుపైకి ఎక్కాడు. -
పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?
ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. హిట్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: సింగర్ 'రాహుల్ సిప్లిగంజ్' నిశ్చితార్థం)దర్శకుడు రామ్ జగదీశ్ పెళ్లి వైజాగ్లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు 'కోర్ట్' మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రామ్ జగదీశ్ పెళ్లి.. పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Neeha (@cinema_ammayi) -
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
బంధువుల పెళ్లిలో రమేశ్ బాబు కుటుంబం (ఫొటోలు)
-
ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. చాలామంది చెప్పే పేరు ప్రభాస్. అప్పుడెప్పటి నుంచో ఇతడు పెళ్లి చేసుకుంటాడు అనే మాట వినిపిస్తూనే ఉంది. కానీ అది అలా వినిపిస్తూనే ఉంది తప్పితే శుభకార్యం జరగట్లేదు. ఓవైపు ప్రభాస్ ఏమో సినిమాలతో బిజీ. మరోవైపు అతడి కుటుంబ సభ్యులు మాత్రం కచ్చితంగా వివాహం జరుగుతుందని చెబుతుంటారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామాలాదేవి ఇతడి పెళ్లి కోసం పూజలు నిర్వహించారు.కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. సోమవారం, కాకినాడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అలానే దాక్షారామం ఆలయాన్న సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా వాళ్లతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి టాపిక్ రాగా.. 'ప్రభాస్కి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి' అని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం తాను చెప్పలేనని పేర్కొన్నారు. అలానే తన కూతుళ్లకు కూడా త్వరలో వివాహం జరిపిస్తామని అన్నారు.(ఇదీ చదవండి: ధనుష్తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్) శ్యామలాదేవి చెప్పడం వరకు బాగానే ఉంది ప్రభాస్కి నిజంగా పెళ్లి జరుగుతుందా అంటే సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇతడి వయసు 45 ఏళ్లు. చేతిలో ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ(వర్కింగ్ టైటిల్), సలార్ 2, కల్కి 2.. ఇలా లెక్కకు మించి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల గురించి వినిపిస్తోంది. ఇవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి? ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు?గతంలో అంటే ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు అనుష్క పేరు వినిపించేది. ఇద్దరు సింగిల్గా ఉండటమే కారణం. కానీ తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని పలుమార్లు వీరిద్దరూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఆ టాపిక్ వదిలేశారు. కానీ అటు అనుష్క గానీ ఇటు ప్రభాస్ గానీ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. వీళ్లిద్దరికీ అవుతుందనే గ్యారంటీ కూడా ఫ్యాన్స్కి కనిపించట్లేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
తొలి అంతరిక్ష వివాహం: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్లో ఉండే తన గర్ల్ఫ్రెండ్ని డిమిత్రివ్ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్చెంకోని వివాహమాడింది. సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్. నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్చెంకో కార్డ్బోర్డు కటౌట్తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది. ఇక మాలెన్ చెంక్తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్లో ఉండటానికి అలవాటుపడ్డారు. నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!) -
'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్కి పెళ్లి.. ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది పెద్దోళ్లు అయిపోయారు. కొందరు నటులైతే మరికొందరు వేర్వేరు ఫ్రొఫెషన్స్లో సెటిల్ అయిపోయారు. అసలు విషయానికొస్తే 'అరుంధతి' సినిమాలో బాలనటిగా చేసిన దివ్య ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇంతకీ పెళ్లెప్పుడు? చేసుకోబోయే కుర్రాడు ఎవరనేది చూద్దాం.(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')తెలుగు-తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన దివ్య నగేశ్.. 'అరుంధతి' సినిమాలో చిన్న జేజమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంతో పాటు అపరిచితుడు, సింగం పులి తదితర మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం డ్యాన్సర్, మోడల్గా చేస్తూ నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ని ప్రేమిస్తున్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. మరో 8 రోజుల్లో అంటే ఆగస్టు 18న పెళ్లి చేసుకోబోతుంది.ఈ క్రమంలోనే వెడ్డింగ్ ఫొటోషూట్స్లో దివ్య బిజీగా ఉంది. అలానే తన లేడీ ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈమెకు అప్పుడే శుభాకాంక్షలు చెబుతున్నారు. స్వతహాగా ఈమె పేరు దివ్య నగేశ్.. కానీ దివ్య అరుంధతిగా ఇన్ స్టాలో పేరు మార్చుకుంది. అయితే 'అరుంధతి'లో చేసిన బాలనటికి పెళ్లయిపోతుంది కానీ ఇదే మూవీలో చేసిన అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంది. మరి స్వీటీ అసలు వివాహం చేసుకుంటుందో లేదో?(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్
ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. కానీ 2016లోనే జరిగిన ఒక వెడ్డింగ్ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా రికార్డ్ దక్కించుకుంది. అదేంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాని విలాసవంతమైన వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కానీ రష్యన్ బిలియనీర్ మిఖాయిల్ గుట్సేరీవ్ తన కొడుకు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు ఏకంగా ఒక బిలియన్ డాలర్లు (ప్రస్తుత ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 876.94 కోట్లు). 2016లో అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.మరిన్ని విశేషాలుమిఖాయిల్ గుట్సేరీవ్ కుమారుడు, 29 ఏళ్ల సయీద్ గుట్సేరీవ్, ఇరవై ఏళ్ల ఖాదీజా ఉజాఖోవ్స్ను వివాహం చేసుకున్నాడు. మాస్కోలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. అతిరథమహారథులు హాజరయ్యే ఈ వివాహానికి భద్రత రీత్యా ఈ వేదికను ఎంచుకున్నారు.వధువు 11.5 కిలోల ఎలీ సాబ్ గౌను ధరించింది. పెళ్లి నాటి తన దుస్తులు, తరాల బడి గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలని భావించిందట. అందుకే ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ ఎలీ సాబ్ చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఈ దుస్తులను పారిస్ నుండి దిగుమతి చేసుకున్నారు.ఈ వెడ్డింగ్ గౌను బరువు దాదాపు 11.5 కిలోలు. పెద్ద ఫ్లేర్ ,అంతే పొడవైన వీల్తో దీన్ని రూపొందించారు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఆ గౌను విలువ రూ. 2.28 కోట్లు.అత్యంత విలువైన వజ్రాభరణాలతో రాయల్ లుక్లో మెరిసిపోయింది వధువు. వజ్రాలు పొదిగిన తలపాగా, భారీ వజ్రాల చెవిపోగులు, మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. రెండు చేతులకు బ్రాస్లెట్లతో యువరాణిలా కనిపించింది.తొమ్మిది అంచెల వివాహ కేక్సాయిద్ గుట్సేరీవ్- ఖాదీజా ఉజాఖోవ్ వివాహ కేక్ మరో ప్రత్యేకత. అద్భుతమైన తొమ్మిది అంచెల ఐస్డ్ వెడ్డింగ్ కేక్ మరీ ముఖ్యంగా, నూతన వధూవరుల కంటే రెండు రెట్లు ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారట. దీనిని వైట్ క్రీమ్లో తయారు చేశారు.దానిపై పింక్ ఫ్రాస్టింగ్తో చేశారు.గిఫ్ట్లుగా గోల్డ్ బాక్స్లు: లగ్జరీ పెళ్లితోనే కాదు, అతిథులను కూడా ఆశ్చర్య పరిచాడు. ఈ వేడుకకు హాజరైన వారికి తీపి జ్ఞాపకంలా ఉండేలా గోల్డ్ బాక్స్ గిఫ్ట్గా అందించారు. ఇందులో జంట పేరు, వివాహ తేదీ చెక్కబడి ఉన్నాయి. వివాహ వేడుకలో జెన్నిఫర్ లోపెజ్, స్టింగ్, ఎన్రిక్ ఇగ్లేసియాస్ ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు.ఎవరీ గుట్సెరీవ్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సఫ్మార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, రష్యన్ బిలియనీర్ గుట్సెరీవ్ చమురు, బొగ్గు, రియల్ ఎస్టేట్ , రిటైల్ రంగాలలో వ్యాపారాలున్నాయి 2024 నాటికి ఆ కుటుంబ నికర విలువ రూ. 31,574.41 కోట్లు.కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంచనా. ఇది అంబానీ కుటుంబం నికర విలువలో 0.5శాతం మాత్రమేనని అంచనా. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
ఎంపీ లేటు వయసు పెళ్లి.. గ్రాండ్ రిసెప్షన్, అతిథుల్లో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం.. డోన్లో అభిమానుల సందడి (చిత్రాలు)
-
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇతడి మేనకోడలు ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ వేడుక జరగ్గా.. కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. విశాల్ కూడా వచ్చాడు. ఎనర్జిటిక్గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ పెళ్లి సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)విశాల్ తెలుగు మూలాలున్న కుర్రాడే. కానీ తండ్రి తమిళనాడులో స్థిరపడటంతో ఆ ఇండస్ట్రీలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ టైంలో ఇతడి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏంరాలేదు. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా విశాల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటి నుంచి ఈ మధ్యే కోలుకున్న విశాల్.. పూర్తి ఆరోగ్యంగా పలుమార్లు కనిపించాడు. అలానే తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న నటి ధన్సికని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్ల ముందు విశాల్ బయటపెట్టాడు. అయితే ఈ శుభకార్యం ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సంగతి అలా పక్కనబెడితే ఇప్పుడు తన మేనకోడలు వివాహ వేడుకలో విశాల్ పాల్గొన్నాడు. ఈమె ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే నూతన వధూవరుల్ని విశాల్ ఆశీర్వదించాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్) View this post on Instagram A post shared by Karthikeyan Ravikumar (@karthikeyan_youtuber) -
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
రామన్నపేట : వరంగల్ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్లోని పోచమ్మమైదాన్కు చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కుమారుడు రితేశ్, అమెరికాలోని పీట్స్బర్గ్కు చెందిన జూలియాన్ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. -
అప్పటివరకు అసలు పెళ్లి చేసుకోను: శ్రీలీల
యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా 'జూనియర్'లో వైరల్ వయ్యారిగా తెగ సందడి చేస్తోంది. సరే ఈ సంగతులు పక్కనబెడితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో ఈమె ప్రేమలో ఉందనే రూమర్స్ గత కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల ఈ పుకార్లతో పాటు తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ)'నేను లవ్ చేస్తున్నానని అంతా అనుకుంటున్నారు. కానీ నేనెలా ప్రేమలో పడగలను. ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది. అయినాసరే నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. లేకలేక మియామీ వెళ్లినప్పుడు కూడా నా వెంట అమ్మ వచ్చింది. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడతాను చెప్పండి' అని శ్రీలీల క్యూట్గా క్లారిటీ ఇచ్చింది.కొన్నిరోజుల క్రితం పెళ్లి కూతురిలా రెడీ వాటిని శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంతా ఈమెకు పెళ్లి అని ఫిక్సయ్యారు. కానీ అది తన పుట్టినరోజు, అలా బుట్టలో తీసుకెళ్లడం తన కుటుంబ సంప్రదాయం అని చెప్పింది. దీంతో కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక పెళ్లి విషయమై స్పందించిన శ్రీలీల.. తనకు ఇప్పుడు 23 ఏళ్లు అని, ఎలా లేదన్నా 30 ఏళ్లు వచ్చేవరకు తను అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. మరి అప్పుడైనా ప్రేమ వివాహమా? లేదంటే పెద్దల కుదిర్చిన పెళ్లా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు. -
అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది!
25 ఏళ్ల అవిభక్త కవలల్లో ఒకరైన కార్మెన్ ఆండ్రేడ్ (Carmen Andrade )న చిరకాల ప్రియుడు డేనియల్ (Daniel McCormack, 28)ని వివాహ మాడింది. గత ఏడాది అక్టోబర్లో తామిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టామని వెల్లడించిఅభిమానులను ఆశ్చర్చపరిచారు. తన ప్రియుడు డేనియల్ మెక్కార్మాక్ను అక్టోబర్ 2024లో వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారాకార్మెన్ వెల్లడించింది. ఇరు కుటుంబాల సమక్షంలోవివాహం చేసుకున్నారు.డైలీ మెయిల్ ప్రకారం, డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్న ఈ జంట నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. తరువాత కనెక్టికట్లో న్యూ మిల్ఫోర్డ్లోని లవర్స్ లీప్ బ్రిడ్జ్లో ఉంగరాలు మార్చుకున్నారు. ‘ఓవర్డ్యూ అప్డేట్' అంటూ తమ పెళ్లి కబురును అందించింది కార్మెన్. View this post on Instagram A post shared by Daily Mail (@dailymail)పెళ్లి దుస్తుల్లో ఒక వీడియోను షేర్ చేసింది కార్మెన్ కొత్త వధువు తన షేర్ వీడియోలో వెడ్డింగ్ రింగ్ను చూపించింది, అలాగే ఇపుడు నేను భర్తని అంటూ వరుడు-డేనియల్ కూడా ఈ వీడియోలో జతయ్యాడు. నల్లటి టక్సేడో ధరించిన డేనియల్తో పోజులివ్వగా వధువు కార్మెన్ సాంప్రదాయ తెల్లటి వివాహ దుస్తులకు బదులుగా గ్రీన్ గౌను ధరించింది. తనకు తెల్లని దుస్తులు నచ్చవని తెలిపింది. నాకు పెళ్లికాలేదుఅయితే మరో కవల లుపిటా తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. “ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,” అని ఆమె ప్రకటించింది. మరోవైపు ‘అమెరికాకు ఇష్టమైన జంట’ పోటీలో ఈ జంట కూడా ముందు వరుసలో ఉన్నారని, ప్రస్తుతం వారు 9వ స్థానంలో ఉన్నారని డైలీ మెయిల్ తెలిపింది. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా కార్మెన్ ఆండ్రేడ్, లుపిటా సోదరీమణులు సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఇద్దరికీ వారి యూట్యూబ్ , టిక్టాక్ హ్యాండిల్స్లో మంచా ఫాలోయింగ్ ఉంది. ఈ కవలలు మెక్సికోలో జన్మించారు. ఎవరి గుండెవారిదే, ఊపిరితిత్తులు ఇద్దరికీ వేర్వేరుగా ఉన్నాయి. వారి అవయవాలు ఛాతీ నుండి కటి వరకు కలిసి ఉంటాయి. భావోద్వేగాల పరంగా ఇద్దరు భిన్నంగా ఉంటారు. ఇద్దరు సోదరీమణులకు ఎండోమెట్రియోసిస్ ఉంది, కానీ హార్మోన్ బ్లాకర్లు తీసుకుంటారట, ఫలితంగా, గర్భం దాల్చడం అసంభవమని కార్మెన్ గతంలో వెల్లడించింది. ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)
-
ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!
భూమిపై అంగరంగ వైభవోపేతంగా వివాహాలు చేసుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకెళ్తే..కొందరూ నీటి అడుగున వివాహం చేసుకున్న తంతును కూడా చూశాం. కానీ ఈ దంపతులు ఆకాశంలోనే మా పెళ్లి జరగాలని ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాహ్ ఏం వెడ్డింగ్ రా ఇది అని అంతా అనుకునేలా అంగరంగ వైభవంగా జరిగింది.ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్సర్ సామ్ చుయ్ తన పెళ్లి వేలాది అడుగుల ఎత్తులో ఆకాశంలో జరగాలని కోరుకున్నాడు. అందుకోసం అని ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం (FJR)లో చార్టర్డ్ బోయింగ్ 747-400 విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఎంచక్కా తన భార్య ఫియోనా, కొందరు దగ్గరి బంధువుతో కలసి విమానం ఎక్కి ఒమెన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించారు. ఆ విమానంలో ముఖ్యమైన అతిథుల సమక్షంలో చుయ్ తన కాబోయే భార్య ఫియోనాని పరిణయమాడాడు. వాళ్లంతా ఆ జంటను అభినందిస్తూ..చుట్టూ చేరి ఆడుతూ, నృత్యం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఆకాశమే హద్దుగా పెళ్లి చేసుకున్న ఈ జంట మరో నింగిని తలపించేలా తెల్లటి దుస్తులే ధరించడం విశేషం. ఈ వివాహ వేడుక మా జీవితాల్లో అత్యుత్తమమైన రోజుగా అభివర్ణిస్తూ..అందుకు సంబంధించిన వీడియోకి "మా ప్రేమ గాలిలో ఉంది. మా 747 స్కై వెడ్డింగ్ ఫ్లైట్కు స్వాగతం. మా ఇద్దరికి జీవితకాల జ్ఞాపకాలు" అనే క్యాప్షన్ని జత చేస్తూ నెట్టింట షేర్ చేశారు. కాగా సింగపూర్ ఎయిర్లైన్కి సంబంధించిన ఈ బోయింగ్ 747 విమానం జూలై 12, 2025న ఒమన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించి, రాత్రి 8 గంటలకు ఫుజైరాకు తిరిగి వచ్చింది. View this post on Instagram A post shared by Sam Chui (@samchui) (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
భర్త వద్దని.. ప్రియుని చెంతకు
కర్ణాటక: ప్రియుని కోసం, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను కాదని వచ్చిందో యువతి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వద్ద ఉన్న రంపచోడవరం ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ లవ్ కహాని ఇది. రాజధాని బెంగళూరులో కాంట్రాక్టర్గా పని చేస్తున్న తిరుపతమ్మ తండ్రి వద్ద కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా సంగనాళకు చెందిన వెంకటేష్ గార పని చేసేవాడు. ఆ సమయంలో తిరుపతమ్మతో పరిచయమై మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం జరిగింది. ఈ విషయంలో తిరుపతమ్మకు నచ్చచెప్పి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వెంకటేష్ను బెదిరించడంతో పని మానేసి సంగనాళకు చేరుకున్నాడు. కానీ తిరుపతమ్మ భర్తను వదిలేసి సంగానాళులో ప్రియుని వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి కొప్పళ పట్టణానికి వచ్చి ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మరోవైపు తిరుపతమ్మ తల్లిదండ్రులు నాలుగు కార్లలో కుమార్తెను వెతుకుతూ కొప్పళకు వచ్చారు. ఆమె పెళ్లి జరిగి 15 రోజులు కాకమునుపే ప్రేమించిన వాని కోసం వచ్చేసిందని చెబుతున్నారు. తాను ప్రియునితోనే ఉంటానని తిరుపతమ్మ భీష్మించుకుని. -
'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో ప్రముఖ నటుడు పెళ్లి చేసుకున్నాడు. తమిళంలో 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' తదితర చిత్రాల్లో నటించిన ఇతడు.. ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఆర్కిటెక్ట్ జయశ్రీ చంద్రశేఖరన్తో ఏడడుగులు వేశాడు. ఆదివారం ఉదయం ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ చిదంబరం.. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2015లో వచ్చిన 'మూణే మూణు వార్తై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత రమ్, నేర్కొండ పార్వై, తీవిరమ్, పొన్నియిన్ సెల్వన్, అనీతి, కొలాయి, రత్తం, థగ్ లైఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికా మాప్పిలై, ఆటో శంకర్, బిహైండ్ కోజ్డ్ డోర్, అద్ధం, ద విలేజ్ వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశాడు. ఇక పెళ్లి కూతురు జయశ్రీ చంద్రశేఖర్ విషయానికొస్తే ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన పెళ్లి? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి) -
పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!
వధూవరులు లేని పెళ్లి గురించి విన్నారా? అసలు అలాంటి పెళ్లి అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా!సూటిగా మ్యాటర్లోకి వస్తే... ‘ఫేక్ వెడ్డింగ్’ అనేది యువతరంలో ఒక ట్రెండ్గా మారింది. మెట్రో సిటీస్లో ఎక్కువగా జరిగే ఈ ఉత్తుత్తి వివాహ వేడుకల్లో బ్యాండ్ బాజాలు ఉంటాయి. అతిథులు ఉంటారు. ఘన స్వాగతాలు ఉంటాయి. దండలు మార్చుకోవడాలు (మాక్) ఉంటాయి. పురోహితుడి వేదమంత్రాలు ఉంటాయి.అయితే వధూవరులు మాత్రం ఉండరు.ఢిల్లీ, బెంగళూరు, పుణేలలో ఈ ట్రెండ్ ఊపు అందుకుంటుంది. కాలేజి క్యాంపస్లలో, రూఫ్టాప్ బార్లలో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఫేక్ పెళ్లి వేడుకలకు ఉచిత ప్రవేశాలు ఉండవు. అయిదు వందల నుంచి మూడు వేల వరకు ప్రవేశ రుసుము ఉంటుంది.సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది. విశేషం ఏమిటంటే ఈ లోకల్ ట్రెండ్ కాస్త దేశ సరిహద్దులు దాటింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆహా’ అని కొందరు ఆకాశానికి ఎత్తుతుండగా...‘పిదపకాలం పిదప బుద్ధులు’ అని కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. -
గ్రాండ్గా డ్రమ్స్ శివమణి కుమారుడి వెడ్డింగ్ (ఫొటోలు)
-
‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఇటీవలి రోజులలో అది మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిపోతోంది. చివరికి పెళ్లిపీటల మీదే తెగతెంపులవుతున్న వ్యవహారాలూ కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది.జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో గల ప్రముఖ ఫెయిర్మాంట్ హోటల్లో గతంలో ‘వార్తల్లో’ నిలిచిన సౌరభ్ అహుజా వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. వేడుకలోని ఒక్కక్క కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతూ వస్తోంది. ఇక కొద్ది క్షణాల్లో నూతన వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం జరగనుంది. ఇంతలో హఠాత్తుగా వరుడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. సౌరభ్ అహుజా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వాంటెడ్ నిందితుడు. ఇతను ఫెయిర్మాంట్ హోటల్లో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరరేట్(ఈడీ) అధికారులు మండపానికి చేరుకున్నారు.ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిందితుడు సౌరభ్ అహుజా ఏడడుగుల తంతుకు ముందు పరారయ్యాడు. దీంతో ఈడీ అధికారులు నూతన వధువుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో అహుజా వాంటెడ్ నిందితుడు. అతన్ని అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. మహాదేవ్ యాప్ ప్రాథమిక ఆపరేటర్లలో అహుజా ఒకడు. అతిథులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు పెళ్లి దుస్తుల్లోనే పరారయ్యాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సౌరభ్ కొంతకాలంగా ఈడీ అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. కల్యాణ మండపం నుంచి అతను పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ -
బెజోస్తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్లో నిలిచింది.జెఫ్ బెజోస్తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
అంగరంగ వైభవంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి వేడుక (ఫోటోలు)
-
ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) -
కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్తో వెడ్ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి. గురువారం తమ మూడు రోజుల వివాహ వేడుకలు షురూ అయ్యాయి. ఈ వేడుకలకు కిమ్ చ ఖ్లో కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి టాప్ మోస్ట్ గెస్ట్లతో వేదిక కళకళలాడింది. This is Jeff Bezos’s $500 million yacht. Republicans are cutting Americans’ healthcare to give him a tax cut so he can buy a bigger yacht. pic.twitter.com/SxTRaIxqpn— Piyush Mittal 🇺🇸🇺🇦🇬🇪🇨🇦🟧🌊🌈 (@piyushmittal) June 26, 2025 బెజోస్, సాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్ లో బస చేయగా, ప్రపంచంలోని పురాతన చలనచిత్రోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన శుక్రవారం వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో ప్రముఖ అతిథులు హాజరయ్యే విలాసవంతమైన మరియు ప్రైవేట్ వేడుకలో వెనిస్,బెజోస్, సాంచెజ్తో వివాహం చేసుకోనున్నారు.శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలో ఉన్న విల్లా బాస్లిని తోటలలో గురువారం అతిథులు విందారగించారు. వివాహ వేడుక శనివారం తుది పార్టీతో ముగుస్తుంది.మరోవైపు ఇటాలియన్ మీడియా ప్రకారం, ద్వీపంలోని ఒక పెద్ద బహిరంగ యాంఫిథియేటర్ లో వివాహం జరుగుతుంది. వేడుక తర్వాత, ఈ జంటకు ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి సెరినేడ్ చేస్తారని సమాచారం. ఈ వివాహ వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారట. అంతేకాదుతమ వేడుకల్లో భాగంగా, బెజోస్ ,సాంచెజ్ నగరానికి 3.5 మిలియన్లు డాలర్లు (దాదాపు 30కోట్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా తెలిపారు. నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్ సందడి లవ్ బర్డ్స్ పెళ్లి సందడికోసం వెనిస్ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలను ఇన్స్టాలోపోస్ట్ చేసింది. భారతీయ దాతృత్వవేత్త , ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనవాలా ఈ వెడ్డింగ్ బాష్లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్మాత్రమే కాదు స్వయంగా వధువు సాంచెజ్ కూడాఫిదా అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. విశిష్ట అతిథులుప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖ అతిథులతోపాటు, జోర్డాన్ క్వీన్ రానియా, NFL స్టార్ టామ్ బ్రాడీ, అమెరికన్ డిజైనర్ స్పెన్సర్ ఆంట్లే, గాయని అష, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉన్నారు. వీరిని చేరవేసేందుకు మెగా యాచ్లు ,వెనిస్లోని మార్కో పోలో విమానాశ్రయంలో కనీసం 95 ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్ అనుమతిని అభ్యర్థించాయి.'నో స్పేస్ ఫర్ బెజోస్' ఆందోళనలుఅయితే, ఈ వేడుకపై పర్యావరణవేత్తలు స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నో స్పేస్ ఫర్ బెజోస్' (బెజోస్కు చోటు లేదు) అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనిస్లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.కాగా గతంలో జర్నలిస్టు, యాంకర్గా పనిచేసిన లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్లు 2018 నుంచి డేటింగ్లో ఉన్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్తో బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గతేడాది లారెన్ శాంచెజ్తో బెజోస్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. -
పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
పురులియా: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం లారీని బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు వివరాలు ప్రకారం.. అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని నిమ్దిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తిలైటాండ్కు వెళ్తుండగా, బొలెరో వాహనం అతివేగంగా ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.అయితే, తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదంలో ముంచెత్తింది. -
అఖిల్ వెడ్డింగ్.. శోభితను అలా చూస్తుండిపోయిన నాగచైతన్య!
ఏడాది వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఆ తర్వాత ఇటీవలే అఖిల్ అక్కినేని సైతం ఓ ఇంటివాడయ్యారు. గతేడాది తన ప్రియురాలు జైనాబ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ 6న తన మెడలో మూడు ముళ్లు వేశారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య- శోభిత పాల్గొని సందడి చేశారు. తమ్ముడి వెడ్డింగ్లో చైతూ- శోభిత స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు.తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పెళ్లి వేడుకలో శోభిత ధూలిపాళ్ల దోశ తింటూ ఉండగా.. పక్కనే నాగచైతన్య తన సతీమణి వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ వెడ్డింగ్లో తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు చైతూ. ఈ వీడియోను ప్రముఖ కేటరింగ్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో అఖిల్- జైనాబ్ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. -
సంప్రదాయానికి పెద్ద పీట.. కొబ్బరికాయలకు పసిడి వన్నెలద్దీ..!
సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు.కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. అంబాజీపేట పెద్ద వీధిలో కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, కొబ్బరి కాయలు, చెరకు గెడలు, ధాన్యం కుచ్చులతో ముస్తాబు చేసిన పెళ్లి ఇంటి వద్ద స్వాగత ద్వారం ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు.ఇతర ప్రాంతాలకు సైతం..కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.అరటి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసే వేదికలు అభిరుచి మారుతోందిపెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్లో డెకరేషన్లు చేస్తున్నాం.– బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారం¿ోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాకొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదిక -
అఖిల్ పెళ్లి బరాత్ జ్ఞాపకాలతో శోభిత (ఫొటోలు)
-
ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు) -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. కుమారుడి పెళ్లి వాయిదా!
దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధి చేసిన ఇజ్రాయెల్.. ప్రళయ భీకరంగా విరుచుకుపడుతోంది. మరోవైపు, సైన్యాధికారులను కోల్పోయి.. స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ కూడా ప్రతికార దాడులకు దిగుతోంది. వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెడుతోంది.ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు, అమిత్ యార్దేనీకి త్వరలోనే విహహం జరగనుంది. ఈ మెగా వేడుకను నిర్వహించేందుకు నెతన్యాహు కుటుంబం రెడీ అయ్యింది.అయితే, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధ పరిస్థితుల మధ్య నెతన్యాహు తన కుమారుడి పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో కూడా నెతన్యాహు కుమారుడి పెళ్లి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. -
విజయవాడలో వెడ్డింగ్ రిసెప్షన్లో చరణ్ దంపతులు (ఫొటోలు)
-
హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
అఖిల్ రిసెప్షన్లో అట్రాక్షన్గా 'శోభిత ధూళిపాళ' చీర.. ధర ఎంతో తెలుసా? (ఫోటోలు)
-
ఆ వెడ్డింగ్ గౌనుకి ఒకటిన్నర మిలియన్ల వ్యూస్..!
ఐదంటే ఐదు డాలర్లు పెట్టి ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం నాటి వెడ్డింగ్ గౌన్ కొనుక్కుందామె, అది తొడుక్కుని చూద్దామని టిక్టాక్లో అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసింది. అయితే అది ఆమెకు సరి΄ోలేదు. దాంతో తనకన్నా కొద్దిగా తక్కువ పర్సనాలిటీ ఉన్న తన చెల్లెలికి ఆ గౌన్ ఇచ్చింది. అది ఆమెకు అతికినట్లు సరి΄ోయింది. త్వరలో జరగనున్న తన వెడ్డిండ్కి ఆ గౌన్ని డ్రై క్లీనింగ్ చేయించి దానినే ధరించాలని డిసైడ్ చేసుకుంది. ఇక్కడ అది కాదు విశేషం. వీరిద్దరి వీడియోస్కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. షష్టిపూర్తి కూడా జరుపుకున్న నాటి ఆ గౌను అంత నాజూగ్గా ఉండటం, అది కారుచౌకగా కొనుక్కుని దానికి చిన్న చిన్న రిపేర్లు చేయించి తన వెడ్డింగ్ రోజున అదే గౌన్ను ధరించాలనుకోవడం చాలా బాగుందంటూ అందరూ ఆ అక్కచెల్లెళ్లని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓహియోలోని కొలంబస్కు చెందిన మ్యాడీ స్ట్రేయర్ అనే ఆమె వింటేజ్ వెడ్డింగ్ డ్రెస్లు దొరికే ఎస్టేట్ సేల్లో పాతకాలం నాటి ఈ వెడ్డింగ్ గౌన్ చూసి ముచ్చటపడింది. వెంటనే ఐదు డాలర్లు చెల్లించి దానిని కొనుక్కుంది. తనకు సరిపోకపోవడంతో చెల్లెలికి దానిని ప్రెజెంట్ చేసింది. అయితే ఆమె కూడా ఆ గౌనును చూసి మురిసిపోయి త్వరలో జరగబోయే తన పెళ్లికి బోలెడంత ఖరీదు చేసి అప్పటికే వెడ్డింగ్ గౌన్ను కొనుక్కున్నప్పటికీ దానిని పక్కనపెట్టి మరీ అక్క ఇచ్చిన ఈ గౌన్ తొడుక్కోవడానికి డిసైడైంది. వీరిద్దరి వీడియోలకూ ఒకటిన్నర మిలియన్లకి పైగా వ్యూస్, లక్షా ఇరవై ఆరువేల లైకులూ వచ్చాయి. Woman Buys 1963 Wedding Dress for $5 at Estate Sale—but There's a Twist - Newsweek https://t.co/s9Cgy4hgkE— Manuco (@manuco22) June 7, 2025 (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
ఫ్రెండ్ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ హంగామా (ఫొటోలు)
-
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
మోస్ట్ అడోరబుల్ సెలబ్రిటీ కపుల్ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.సూఫీ రాత్రిలో అఖిల్- జైనాబ్ అద్భుతంగాసెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్ నెక్పీస్తో తన లుక్ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.అఖిల్ - జైనబ్ వెడ్డింగ్ 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్రిసెప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
బావ పెళ్లి చేసుకోవడం లేదని ఆత్మహత్య
నిర్మల్టౌన్: బావ పెళ్లి చేసుకోవడం లేదని అనుమానంతో మరదలు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత ఆరేళ్ల క్రితం ఒంగోలు నుంచి గురునాథం శ్రీను కుటుంబంతో కలిసి నిర్మల్ రూరల్ మండలం డ్యంగాపూర్ గ్రామానికి వలసవచ్చి మేస్త్రి పని చేసుకుంటున్నారు. శ్రీను చెల్లెలు రాధ ఒంగోలులో నివాసం ఉంటోంది. రాధ భర్త తాగుడుకి బానిస కావడంతో.. ఆమె రెండో కుమార్తె భవాని(17)ని మూడేళ్ల క్రితం తీసుకువచ్చి వీళ్ల దగ్గరనే ఉంచుకున్నారు. ఇంకో నాలుగేళ్ల తర్వాత శ్రీను తన కొడుకును, భవానిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. అయితే శ్రీను కొడుకు వేరే యువతితో ఫోన్లో మాట్లాడుతున్నాడని, తనను పెళ్లి చేసుకోడేమోనని భవాని అనుమానించింది. శనివారం రాత్రి 10 గంటలకు పూలమొక్కలకు కొట్టే పురుగుల మందు తాగింది. గమనించిన కు టుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
అక్కినేని అఖిల్.. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహ నాగ్ ఇంట్లో జరగ్గా.. రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.నాగ్ చిన్న కొడుకు అఖిల్కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబరులో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
అఖిల్ అక్కినేని సతీమణి 'జైనబ్' ఫోటోషూట్ లుక్స్ చూశారా..? (ఫొటోలు)
-
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
అక్కినేని కుటుంబం మొత్తానికి అఖిల్ అక్కినేని , జైనాబ్ రవ్జీ మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల, సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను వైభవంగా జరిపించారు. అఖిల్-జైనాబ్ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే పెళ్లి ముస్తాబులో మొత్తం డైమండ్ నగలనే ఎంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్ లుక్ను తీర్చిదిద్దుకుంది. రెడ్ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్ చైన్, మూడు లేయర్ల డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు, ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్తో తళుక్కున మెరిసింది. అటు కొత్త పెళ్లికొడుకు అఖిల్ కూడా శ్వేత వస్త్రాల్లో సింపుల్గా అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)జైనబ్తో తన రిలేషన్షిప్ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్ డైమండ్ రింగ్ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. -
రెండో పెళ్లి చేసుకున్న హీరో.. పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే 2014లో ఓసారి కైవల్య అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు నటుడు కృష్ణ కులశేఖరన్ ప్రకటించాడు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్తోపాటు పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ నటుడు? టాలీవుడ్తో ఏమైనా సంబంధం ఉందా?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణ.. తర్వాత హీరోగానూ పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ టైంలో ఝాన్సీ, పారాచూట్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సిరీసుల్లో కనిపించాడు. ఇతడు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 'పంజా' దర్శకుడు విష్ణువర్ధన్ ఇతడికి స్వయానా అన్నయ్య అవుతాడు.2014లోనే కైవల్య అనే అమ్మాయిని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు తమిళ హీరో ఆర్యతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే అమ్మాయి ఎవరు? యాక్టరా కాదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్) View this post on Instagram A post shared by Krishna kulasekaran (@krishnakulasekaran) -
అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు జైనబ్ రవ్జీతో ఒక్కటయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్గా ఉంటారు. ఎంగేజ్మెంట్ జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్)అఖిల్ భార్య జైనబ్ రవ్జీ.. ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమెకు జైన్ రవ్జీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు.జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం. అలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్ల పెద్ద. అఖిల్ ప్రస్తుత వయసు 31 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 అని తెలుస్తోంది. జైనబ్ కూడా గతంలో 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే హిందీ సినిమాలో నటించిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
-
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్.. ఈ జూన్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. జూన్ తొలివారంలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడని అంటున్నారు. ఇదలా ఉండగానే ఇప్పుడు నాగ్ వైపు నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)శనివారం ఉదయం.. నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడి వివాహానికి సీఎంని ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగార్జున-అమల దంపతులకు పుట్టిన సంతానం అఖిల్. ఇప్పటికే హీరోగా ఐదు సినిమాలు చేశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అఖిల్ నిశ్చితార్థం జరిగి రద్దయింది. దీంతో గతేడాది ఎలాంటి హడావుడి లేకుండా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లికి రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్) -
తాళి కట్టే సమయంలో పెళ్లి ఆపేసిన వధువు
అన్నానగర్: ఓ యువతి తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి వద్దని ఆపివేసింది. వివరాల్లోకి వెళితే.. తేని జిల్లాలోని ఆండిపట్టి ప్రాంతానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ అమెరికాలోని ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు తమ కొడుకు కోసం పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన ఒక యువతితో వివాహం కుదిర్చారు. ఈ సందర్భంలో ఇరు కుటుంబాలు అంగీకరించినందున, వివాహ వేడుక గురువారం ఆండిపట్టి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో జరగాల్సి ఉంది. అంతకుముందు, ఈ జంట బుధవారం నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.ఆ సమయంలో వధూవరుల తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తి, వాదనగా మారింది. సమీపంలోని బంధువులు ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత పెళ్లి సన్నాహాలు జోరుగా జరిగాయి. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం, వధూవరులు బంధువుల చుట్టూ వివాహ వేదికపై కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత, వరుడు తల్లిని తీసుకుని వధువుకు తాళి కట్టడానికి వెళ్లాడు. అప్పుడు వధువు అకస్మాత్తుగా పెళ్లి పీటల పైనుంచి లేచింది. ఈ వివాహం తనకు వద్దని, తనకు ఆసక్తి లేదని వధువు చెప్పింది. ఇది విన్న వరుడు, అతని బంధువులు దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహం ఆగిపోయింది. -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)
-
పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?
అక్కినేని హీరో అఖిల్.. హీరోగా ఐదు సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా.. అది రద్దయింది. దీంతో చాన్నాళ్ల పాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు.జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్నిరోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో ఏడడుగులు వేసిన చైతూ.. నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఇతడు.. హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫొటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ) -
మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)
-
చివరకు.. లవర్తోనే పెళ్లి
యశవంతపుర(కర్ణాటక): తాళి కట్టే సమయంలో, ఈ పెళ్లి వద్దని రచ్చచేసిన పల్లవి అనే వధువు.. చివరకు పంతం నెగ్గించుకుంది. శుక్రవారం హాసన్లో ఆదిచుంచనగిరి కళ్యాణ మండపంలో వరుడు వేణుగోపాల్ తాళి కట్టే సమయంలో వధువు వద్దని చెప్పడంతో రభస జరిగింది. తాను రఘు అనే యువకున్ని ప్రేమించానని, అతనినే పెళ్లాడతానని పల్లవి తెగేసి చెప్పింది. ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పెద్ద గొడవే చెలరేగింది. దీంతో వరుడు, బంధుమిత్రులు అందరూ ఉసూరంటూ వెళ్లిపోయారు. ఆమె ప్రియుడు రఘుకు కాల్ చేసి పిలిపించింది. కుటుంబసభ్యుల సమక్షంలో పల్లవి తాళి కట్టించుకుంది. అదే మండపంలో సాదాసీదాగా ఈ తంతు జరిగింది. సినిమా కథను తలదన్నే ఈ వివాహం హాసన్లో హాట్ టాపిక్ అయ్యింది. -
గ్రాండ్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)
-
వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
విశాల్తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)


