Wedding
-
రిసెప్షన్, వెడ్డింగ్, పార్టీ ఏదైనా గోల్డ్ శారీతో స్టన్నింగ్ లుక్ (ఫోటోలు)
-
Moinabad: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడె ఎక్కాడు..
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
‘ప్లీజ్ మామ నాకు కట్నం వద్దు’.. సోషల్ మీడియాలో పెళ్లి కుమారుడి ఫొటోలు వైరల్
మామ బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం.. ఇంక నాకు ఈ కట్నకానుకలు ఎందుకు చెప్పు. ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే ఇస్తే చాలు’ అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన రూ.5,51,00 కట్నాన్ని వెనక్కి ఇచ్చాడు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రి మా అల్లుడు వెరిగుడ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళితే..రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన పరంవీర్ రాథోర్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ తరుణంలో ఫిబ్రవరి 14న కరాలియా అనే గ్రామంలో పిజీ చదువుతున్న నికితా భాటిను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వధువు తండ్రి పలు బహుమతులతో పాటు ఎర్రటి గుడ్డను అలంకరించిన ప్లేట్లో రూ. 5,51,000 నగదు తెచ్చాడు. ఆ మొత్తాన్ని అల్లుడికి ఇచ్చాడు. కానీ అల్లుడు వెంటనే ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చాడు. కట్నం ఇస్తే.. ఎందుకు తిరిగిచ్చారని పరంవీర్ను ప్రశ్నిస్తే.. నా పెళ్లి జరిగే సమయంలో కట్నం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇలాంటి దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం చూసి నాకు బాధ కలిగింది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత నా తండ్రితో, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నా. నిజమైన మార్పు తెచ్చే బాధ్యత చదువుకున్న మన మీద ఉంది. విద్యావంతులైన మనం మార్పు కోసం ముందుకు రాకపోతే మరెవరు రారు? మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభమవ్వాలి. ఆ మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు సమర్ధించారు. మనం ఈ తప్పుడు సంప్రదాయాలను ఆపకపోతే సమాజంలో మార్పు ఎలా వస్తుంది?’అని అన్నారు. పరంపవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. నేను రైతును. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాను. వరకట్న వ్యవస్థను పూర్తిగా నశింపజేయాలి’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వివాహా బంధంలోకి అడుగుపెట్టిన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ (ఫోటోలు)
-
Valentine's day ప్రేమా .. అంత టైం లేదు ప్లీజ్!
ప్రేమ.. రెండక్షరాలే కాదు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త..భయ్యా!పెద్దల అంగీకారంతో ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు వీరు. జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’. అని అనిల్ చెప్పుకొచ్చాడు.ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మా యి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తున్న కొన్ని గ్రామాలుప్రేమనగర్.. మరిమడ్లకోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నా లు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్తో ముంబయికి చెందిన రజిత వివా హాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు.మనసు పడ్డాం.. ఏకమయ్యాంమాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. పెద్దల మనసు మార్చి ఏకమయ్యాం. ప్రస్తుత యువత జీవింతంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. వేధింపులకు గురిచేస్తే చర్యలుయువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్లు కాగా, గతేడాది 40 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం.– శ్రీలత, మహిళా స్టేషన్ సీఐ, షీటీం ఇన్చార్జీ, కరీంనగర్ -
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?! ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి. ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు. సాయంగా మారిన ప్రేమరాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.సాయంగా ఉండాలనుకున్నాం.. అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది. – మూర్తి, రాములమ్మమనసులో మాట పంచుకోవడానికి...మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కన్నడ నటి మేఘనా.. సోషల్ మీడీయాలో వైరల్ (ఫోటోలు)
-
పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.లక్నోలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్డులో గల ఎంఎం లాన్లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్థానికుడు దీపక్ కుమార్ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. అటవీశాఖ అధికారులు మ్యారేజ్ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామన్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
నిరాడంబరంగా చెంగల్పట్టు కలెక్టర్ వివాహం
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ అరుణ్రాజ్ వివాహం తిరుపోరూర్ మురుగన్ ఆలయంలో సాదాసీదాగా జరిగింది. చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ అరుణ్రాజ్. ఇతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సముద్రపాండియన్ కుమారుడు. ఇతనికి చైన్నెకి చెందిన డాక్టర్ మేఘనాథన్ జయంతిల కుమార్తె కౌశిక ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం కౌశిక నిశ్చితార్థం కూడా జరిగింది. అనంతరం సోమవారం తిరుపోరూర్ మురుగన్ ఆలయ ఉత్సవ మండపంలో కలెక్టర్ ఎస్.అరుణ్రాజ్, డాక్టర్ కౌశిక వివాహం సాదాసీదాగా సాగింది. -
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్లో క్రూయిజ్తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్ని చేర్చడం విశేషం. -
హైదరాబాద్ యువకుడితో మలయాళీ నటి పెళ్లి.. ఫోటోలు వైరల్
-
ఫ్రెండ్ పెళ్లిలో సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు 'సారా అలీఖాన్' (ఫోటోలు)
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
వివాహానికి హాజరైన మాజీ సీఎం YS జగన్
-
Adani's Wedding: విలాసాలను విడిచి.. విరాళాలను పంచి..
గత నెలలో మహా కుంభమేళాకు వచ్చిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తన కుమారుడి వివాహం "సింపుల్గా సాంప్రదాయ పద్ధతిలో" జరుగుతుందని తెలిపారు. విలాసవంతమైన, ఆడంబరమైన వ్యవహారంగా ఉంటుందన్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ చెప్పిన మాటకు కట్టుబడి తన చిన్న కొడుకు జీత్ అదానీ (Jeet Adani) వివాహాన్ని సింపుల్గా జరిపించారు. అంతే కాకుండా రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు."సేవే సాధన, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ" అన్న తన తత్త్వానికి అనుగుణంగా గౌతమ్ అదానీ ఈ విరాళాలు అందిస్తున్నారని ఆయనకు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఆయన విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.కుమార్తె దివా..తన చిన్న కొడుకు వివాహం సందర్భంగా గౌతమ్ అదానీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన తన కోడలిని "కుమార్తె దివా" అంటూ సంబోధించడం విశేషం. అహ్మదాబాద్లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్షిప్లోని బెల్వెడెరే క్లబ్లో జీత్ అదానీ, వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా వివాహం జరిగింది. గుజరాతీ సాంప్రదాయం ప్రకారం సింపుల్గా జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, దౌత్యవేత్తలు, అధికారులు, సినీ తారలు వంటి వారెవరూ కనిపించలేదు.‘దివ్య’మైన సంకల్పంపెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దివా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదానీ ఈ చొరవను ప్రారంభించారు.మహా కుంభ మేళాలో చెప్పిన మాటగత జనవరిలో కొడుకుతో కలిసి మహా కుంభ మేళాకు వెళ్లిన సందర్భంగా ప్రయాగ్రాజ్లో మీ కుమారుడి వివాహం "సెలబ్రిటీల మహా కుంభ్" అవుతుందా అని విలేకరులు ప్రశ్నించగా గౌతమ్ అదానీ స్పందించారు. "ఖచ్చితంగా కాదు. మేము కూడా సామాన్యుల మాదిరిగానే. జీత్ గంగమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. అతని వివాహం సింపుల్గా, సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది" అన్నారు. -
పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ కొడుకు పెళ్లి (ఫోటోలు)
-
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్రెడ్డి–విజేత, సురేష్రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
సినిమాటోగ్రాఫర్ పెళ్లికి హాజరైన స్టార్ హీరో కార్తీ (ఫోటోలు)
-
పెళ్లి వేళ అదానీ చిన్న కొడుకు ‘పెద్ద’ మనసు..
అదానీ గ్రూప్ (Adani Group) అధినేత, దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) వివాహం శుక్రవారం (ఫిబ్రవరి 7) అంగరంగ వైభవంగా జరుగుతోంది. దివా జైమిన్ షాను ఆయన పెళ్లాడుతున్నారు. వివాహం సందర్భంగా ఈ నవ జంట స్ఫూర్తిదాయక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ వధువులకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని గౌతమ్ అదానీ స్వయంగా తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. "జీత్, దివా తమ వివాహ జీవితాన్ని ఒక గొప్ప ప్రతిజ్ఞతో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ సోదరీమణుల వివాహానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని వారు 'మంగళ సేవ' ప్రతిజ్ఞ చేశారు. ఒక తండ్రిగా, ఈ ప్రతిజ్ఞ నాకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ఈ చొరవ చాలా మంది దివ్యాంగ అమ్మాయిలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో జీవించడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను" అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. కొత్తగా పెళ్లయిన 21 మంది దివ్యాంగ వధువులను, వారి భర్తలను తాజాగా కలుసుకున్న జీత్ అదానీ ఈ కొత్త చొరవను ప్రారంభించారు.ఇరవై ఏడేళ్ల జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్లో చేరారు. ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి పోర్ట్ఫోలియో ఉన్న దేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్కు డైరెక్టర్గా ఉన్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జీత్.. అదానీ గ్రూప్నకు సంబంధించిన రక్షణ, పెట్రోకెమికల్స్, కాపర్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రూప్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బాధ్యతలను కూడా ఆయనే చూస్తున్నారు.దివ్యాంగుల సమస్య జీత్ హృదయానికి దగ్గరగా ఉన్న అంశం. ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన సందర్భంగా ప్రముఖ టీవీ షోలో దివ్యాంగులైన ఎంట్రాప్రెన్యూర్లు, దివ్యాంగుల కోసం పనిచేసే వారి కోసం ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉండాలని ఆయన సూచించారు. పీపుల్ గ్రూప్, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఆ మేరకు "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించారు. అదానీ గ్రూప్ తన శ్రామిక శక్తిలో ఐదు శాతం దివ్యాంగులు ఉండేలా ఆదేశించిందని అదే సందర్భంగా జీత్ అదానీ వెల్లడించారు.అదే ప్రేరణఈ చొరవకు తనను ప్రేరేపించిన దాని గురించి మాట్లాడుతూ.. భారతదేశం అంతటా అవుట్లెట్లు ఉన్న.. వెనుకబడిన నేపథ్యాలకు చెందిన దివ్యాంగులకు ఉపాధి కల్పించే మిట్టి కేఫ్ను సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను మిట్టి కేఫ్ (ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో) ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు, అన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అక్కడి సిబ్బంది చిరునవ్వు, ఆత్మ స్థైర్యం నన్ను కదిలించాయి" అని జీత్ అదానీ అన్నారు. గుజరాత్లోని ముంద్రాలో ఒక చిన్న గ్రామీణ ప్రాజెక్ట్ నుండి అదానీ ఫౌండేషన్ను ఒక శక్తిగా మార్చిన తన తల్లి ప్రీతి అదానీ కూడా తనకు ప్రేరణ అని ఈ యువ వ్యాపారవేత్త చెబుతారు. -
పెళ్లి వేడుకలో సందడి చేసిన బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ (ఫోటోలు)
-
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
అందమైన మనసుతో.. పెళ్లి పీటలు ఎక్కిన బోల్డ్ బాల్డ్ బ్యూటీ (చిత్రాలు)
-
ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!
వివాహం మనకు నచ్చిన చోటు లేదా విదేశాల్లో చేసుకుంటారు. ఇంకాస్త బడా బాబులైతే లగ్జరీయస్ హోటల్స్ లేదా ప్యాలెస్లలో చేసుకుంటారు. కానీ ఇలా ఏకంగా రాష్ట్రపతిలో భవన్లో వివాహంలో జరగడం గురించి విన్నారా..!. ఔను సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా ఆ లక్కీఛాన్స్ కొట్టేసింది. ఇలా భారతదేశ రాష్ట్రపతి భవన్లో జరుగనున్న తొలి పెళ్లి ఇదే కావడం విశేషం. అసలు ఆ అధికారిణికి ఇలాంటి అవకాశం ఎలా దక్కింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా అనుమతించారు తదితరాల గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.భారతదేశ అత్యున్నత శక్తికి కేంద్రబిందువు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan). అలాంటి అత్యున్నత గౌరవనీయ ప్రదేశంలో సీఆర్పీఎఫ్ అధికారిణి వివాహం ఫిబ్రవరి 12, 2025న రాష్ట్రపతి భవన్లో జరగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతదేశ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే రెండొవ అదిపెద్ద నివాసం. దీన్ని సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు. దీన్ని దాదాపు 300 ఎకరాల ఎస్టేట్లో నిర్మించారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం నాలుగు అంతస్తులు, 340 గదులు ఉంటాయి. దీనితోపాటు అమృత్ ఉద్యాన్, మ్యూజియం, గణతంత్ర మండపం, అశోక మండపం, రాగి ముఖం గల గోపురం కూడా ఉన్నాయి. అంతేగాదు 1948 స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ రాష్ట్రపతి భవన్లో నివశించిన తొలి భారతీయుడు. అలా ఎందరో రాష్ట్రపతులు ఈ భవన్లో నివశించారు. అలాగే ఎందరో ఉన్నతస్థాయి ప్రముఖులు ఇందులో ఆతిథ్యం పొందారు. అలాంటి ఘన చరిత్ర గలిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్లో సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా(Poonam Gupta) వివాహం జరగనుండటానికి గల కారణం ఏంటంటే..అనుమతి ఎలా లభించిందంటే..సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా నియమితులయ్యారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవం పరేడ్(74th Republic Day Parade)లో పూర్తిగా మహిళా బృందానికి నాయకత్వం వహించింది. అలాగే పూనమ్ వృత్తిపరంగా నిబద్ధతగా, అంకితభావంతో పనిచేసే ప్రవర్త నియమావళే ఆ అదృష్టాన్ని పొందేలా చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అనుమతిచ్చారు. దీంతో పూనమ్ ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకున్న తొలిగా వ్యక్తి చరిత్ర సృష్టించనుంది. పూనమ్ గుప్తా ఎవరంటే..సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్(CRPF Assistant Commandant) పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన మహిళ. ఆమె 2018 యూపీఎస్సీ, సీఆర్పీఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణురాలై 81వ ర్యాంకుని సాధించింది. ఆ తర్వాత ఆమె సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా బాధ్యతలు చేపట్టింది. అలా బీహార్లోని నక్సల్స్ ప్రభావిత జోన్లో కూడా పనిచేశారు. అక్కడ ఆమె కనబర్చిన ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. ఇక ఆమె కాబోయే భర్త అవినాష్ కుమార్ కూడా సీఆర్ఎఫ్ కమాండెంట్. ప్రస్తుతం అతడు జమ్ము కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల(ఫిబ్రవరి 12, 20205న) రాష్ట్రపతి భవన్లోని ఆ జంట వివాహం మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో జరగనుంది. ఈ వివాహానికి ఇరువురి దగ్గరి కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతారు. ఇలా రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకునే అదృష్టం దక్కిన ఆ అధికారిణికి శుభాకాంక్షలు చెబుదామా..!.(చదవండి: బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..) -
బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..
కొందరూ బట్టతలను చాలా అవమానంగా చూస్తారు. అందులోనూ పెళ్లి అవ్వకమునుపే వస్తే ఆ బాధ మరీ వర్ణనాతీతం. కానీ కొందరూ బట్టతలే అందం అంటూ ఆత్మవిశ్వాసంగా ముందుకొచ్చి అందాలపోటీల్లో పాల్గొని స్ఫూర్తినిస్తున్నారు. కురులే సౌందర్య చిహ్నం అని చూసే రోజులు కాదివి అంటూ ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇక్కడ అలానే ఓ భారత సంతతి వధువు ఎలాంటి విగ్గులు ధరించకుండా పెళ్లి చేసుకుని నెటిజన్ల మనసులను దోచుకుంది.అమెరికాకు చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహార్ సచ్దేవా భారత మూలాలున్న అమ్మాయి. ఆమె అందానికి ఉండే ప్రమాణాలను సవాలు చేసేలా తన అసలైన రూపంతోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు చిన్న వయసులోనే అలోపేసియా బారినపడింది. దీని కారణంగా బాధితులకు కురులు ఉండవు. ఎందుకంటే అలోపేసియా(alopecia) అనేది రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడిచేసే పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు ఘోరంగా రాలిపోతుంది. అయితే వివాహం వంటి కార్యక్రమాల్లో జుట్టు లేని అమ్మాయి/అబ్బాయి ఇద్దరు కూడా ఆ వేడుకల సంప్రదాయం రీత్యా విగ్గులు(wigs) ధరించే పెళ్లిచేసుకుంటారు. గానీ ఈ అమ్మాయి ఆ నిబంధనలను సవాలు చేసేలా ఆత్మవిశ్వాసంగా తానెలా ఉన్నానో అలానే పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చింది. అలానే వివాహ దుస్తుల్లో బట్లతల(Bald)తోనే వివాహం(wedding) గ్రాండ్గా చేసుకుంది. తనను అలానే ఇష్టపడాలి అన్నట్లుగా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లంతా ఆ అమ్మాయిని ఔను..! "బట్టతల అందమే" అంటూ ప్రశంసిస్తూ ఆమెకు మద్దతు పలికారు. అంతేగాదు ఈ సమస్యను మనం ముందుగా మనస్పూర్తిగా అంగీకరిస్తే అవతివాళ్లు కూడా సహృద్భావంతో అంగీకరించగలుగుతారని అంటోంది కంటెంటట్ క్రియేటర్ నీహార్. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నీహార్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Neehar Sachdeva (@neeharsachdeva) (చదవండి: కేన్సర్ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!) -
ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!
కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్ సెన్స్తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!. ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది. కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే ఈ డ్యాన్స్ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
వివాహ వేడుకలో.. కాంట్రాస్ట్... కలర్ ఫుల్!
వివాహ వేడుక అనగానే ఆ సందడి, ఆ వైభవం మన కళ్ల ముందు ఇట్టే నిలుస్తుంది. వేదికపై వధూవరులిద్దరూ ప్రత్యేక అందంతో వెలిగిపోతుంటారు.అందుకు, వారి డ్రెస్ డిజైన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ‘ఈ వెడ్డింగ్ సీజన్కి కాంట్రాస్ట్ కలర్స్, కాన్సెప్ట్ థీమ్స్నితమ డ్రెస్సుల్లో ఉండేలా కోరుకుంటున్నారు’ అంటూ ప్రస్తుత ట్రెండ్ను పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ వాసి సెలబ్రిటీ, బ్రైడల్ అండ్ గ్రూమ్ ఫ్యాషన్ డిజైనర్ అమూల్య క్రిష్ణ కొచర్. ‘‘వెడ్డింగ్తో తోపాటు ప్రతి ఈవెంట్కి స్పెషల్గా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో రీసెర్చ్ చేస్తుంటాం. ఆ డిజైన్స్ కస్టమర్ల ముందు పెడుతుంటాం. వారు ఏయే స్టైల్స్, కలర్ కాంబినేషన్స్ కోరుకుంటున్నారో దానిని బట్టి ప్రస్తుతం వేటిని ఇష్టపడుతున్నారో అర్ధమైపోతుంది. కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్కిందటేడాది వరకు వధూవరులిద్దరికీ ఒకే కలర్ డ్రెస్సింగ్ ఎంపిక ట్రెండ్లో ఉండేది. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ ట్రెండ్ అయ్యింది. ఉదాహరణకు.. అబ్బాయి గోల్డెన్ కలర్ కుర్తా పైజామా దానికి కాంట్రాస్ట్గా అమ్మాయి లావెండర్ లేదా, రెడ్, గ్రీన్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఉండేలా ఎంచుకుంటున్నారు. అబ్బాయి సూట్కి తగినట్టు అమ్మాయి లెహంగా బార్డర్లోనో, ఎంబ్రాయిడరీలోనో చిన్న మార్పు కోరుకుంటున్నారు కానీ ఒకే కలర్లో కాదు. దీంతో ఇద్దరి డ్రెస్సింగ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతీ వెడ్డింగ్ సీజన్కి కలర్ కాంబినేషన్స్లో మార్పులు వస్తుంటాయి.రీ యూజబుల్ కాన్సెప్ట్పెళ్లికి చాలా ఖర్చు పెట్టి ఒక డ్రెస్ని డిజైన్ చేసుకుంటారు. తిరిగి దానిని మళ్లీ ఎప్పుడూ ధరించరు. ఇది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మాత్రం పెళ్లి, సంగీత్, రిసెప్షన్ డ్రెస్సులను చిన్న చిన్న మార్పులతో మళ్లీ మళ్లీ ధరించేలా కాన్సెప్ట్స్ని ఇష్టపడుతున్నారు. దీంతో ఒక ట్రెడిషనల్ డ్రెస్ను వెస్ట్రన్ స్టైల్తో ఎన్ని విధాలుగా మార్చులు చేసి ధరించవచ్చో స్టైలింగ్ చేసి చూపిస్తాం. పెళ్లికే కాకుండా ఇతర ఫంక్షన్స్కు కూడా అదే డ్రెస్ను మళ్లీ ధరించవచ్చు. ప్రతిసారి ఆ డ్రెస్ కొత్త స్టైల్తో ఆకట్టుకుంటుంది.సంప్రదాయ చేనేత–ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్సాధారణంగా పెళ్లికి మన చేనేతలనే ఇష్టపడతారు. వాటిలో కంచిపట్టుదే ప్రథమ స్థానం. పట్టు బ్లౌజ్కే కాదు చీరకూ ఎంబ్రాయిడరీని ఇష్టపడేవారున్నారు. పూర్తి సంప్రదాయబద్దమైన చీరకట్టు అయినా డ్రేపింగ్లో మార్పులు ఉన్నాయి. రిసెప్షన్ ఇతర వెస్ట్రన్ స్టైల్స్కి మాత్రం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్కి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ముఖ్యంగా ఇటలీ ఫ్యాబ్రిక్ని వెస్ట్రన్స్టైల్స్కి ఉపయోగిస్తున్నాం. మన డిజైన్స్ ఇంటర్నేషనల్ టెక్నిక్స్పెళ్లి అనగానే మనదైన సంప్రదాయ కళ ఉట్టిపడేలా ఏనుగులు, మామిడిపిందెలు. పల్లకి.. కాన్సెప్ట్ డిజైన్స్ ఉంటాయి. ఇవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్స్. ఈ డిజైన్స్కి ఇంటర్నేషనల్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ ఉపయోగిస్తుంటాం. వర్క్ నీటుగా, ఆకర్షణీయంగా, కోరుకున్న కాన్సెప్ట్ ఉండటంతో ఈ టెక్నిక్స్ను ఇష్టపడుతున్నారు’’ అని వివరించారు అమూల్య క్రిష్ణ కొచర్. (చదవండి: ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో..!) -
ప్రియుడ్ని పెళ్లాడిన కర్లీ గర్ల్ అందమైన ఫోటోలు వైరల్
-
ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే (Zanai Bhosle)తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.సోషల్మీడియా వేదికగా మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇలా పేర్కొన్నాడు. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని తన ఇన్స్టా స్టోరీలో తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒకరు' అని సిరాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ రూమర్స్పై రియాక్ట్ అయింది. సిరాజ్ అంటూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
చాలా సింపుల్గా ఆ గుడిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మూలాలు తమిళనాడులోనే అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో బాల తారగా నటించి అందరి మన్ననలను పొందిన శ్రీదేవి ఆ తర్వాత కథానాయకిగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించారు. అలాంటి శ్రీదేవి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మొదట హిందీలో కథానాయకిగా తెరంగేట్రం చేసిన ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపైన దృష్టి సారించారు. అలా ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. తాజాగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మరిన్ని అవకాశాలు జాన్వీ కపూర్ వైపు చూస్తున్నాయి. అలా త్వరలోనే కోలీవుడ్లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తిరుపతి , తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి చాలా ఇష్టం. గతంలో తన అమ్మగారు శ్రీదేవి నిత్యం తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఈమె తిరుపతి నుంచి కాలినడకన 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇటీవల కొత్త ఏడాది ప్రారంభ సమయంలో కూడా జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే ఈమెకు ఎంతో ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా..? అని జాన్వీని ప్రశ్నించారు. తన వద్దకు పెళ్లి ప్రస్తావన రాగానే తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది. నిజంగా ఇదే జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె తెలిపింది. జాన్వీ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, జాన్వీ మాత్రం తిరుమలలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తనలోని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంది. -
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..
హీరోయిన్ స్వాసిక విజయ్ (Swasika Vijay) మళ్లీ పెళ్లి చేసుకుంది. ప్రియుడు, నటుడు ప్రేమ్తో ఏడడుగులు వేసింది. వీరిద్దరికీ గతేడాది జనవరి 26న పెళ్లి జరిగింది. అయితే కేరళ సాంప్రదాయం ప్రకారం ఆ వివాహం జరిగింది. దీంతో తమ మొదటి వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ఆచరణలో పెట్టారు. మరోసారి వేలు పట్టుకుని..వధూవరుడిలా ముస్తాబై మండపంలో కూర్చున్నారు. ప్రేమ్.. మరోసారి అర్ధాంగితో కలిసి ఏడడుగులు వేశాడు. భార్య కాలికి మెట్టలు తొడిగాడు. ఈ వీడియోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. మేము తమిళ సాంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకోసం సహకరించిన అందరికీ థాంక్యూ. దీన్ని నిజమైన పెళ్లిలా అందంగా, అద్భుతంగా జరిపారు అని ప్రేమ్ రాసుకొచ్చాడు. స్వాసిక, ప్రేమ్ 'మనంపోలే మాంగళ్యం' సీరియల్లో కలిసి నటించారు.(చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)హీరోయిన్గా కెరీర్ మొదలుస్వాసిక అసలు పేరు పూజా విజయ్ (Pooja Vijay). వైగై (2009) అనే తమిళ సినిమాతో హీరోయిన్గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఫిడల్ చిత్రంతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రభువింటే మక్కళ్, కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, పొరింజు మరియమ్ జోస్, చతురం, వాసంతి వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత సీరియల్స్లోనూ ఎంట్రీ ఇచ్చింది. పలు రియాలిటీ షోలలోనూ మెరిసింది. చివరగా లబ్బర్ పందు సినిమాతో అలరించింది. సూపర్ హిట్గా లబ్బర్ పందులబ్బర్ పందు సినిమా విషయానికి వస్తే.. రూ.5 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉంది. హరీశ్ కల్యాణ్, దినేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Prem Jacob (@premtheactor) View this post on Instagram A post shared by Swaswika (@swasikavj) చదవండి: మీ తెలుగోడు నా జీవితాన్నే మార్చేశాడు.. డైరెక్టర్తో బాబీ డియోల్ -
ఘనంగా ఇంజమామ్ -ఉల్- హక్ కుమారుడి పెళ్లి (ఫొటోలు)
-
సింగర్ను పెళ్లాడిన ర్యాపర్.. వెడ్డింగ్ లుక్ అదిరింది (ఫోటోలు)
-
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
ప్రేమ వివాహం చేసుకున్న స్టార్ డైరెక్టర్.. ఆశీర్వదించిన విక్రమ్ (ఫొటోలు)
-
Neeraj Chopra Marriage : పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
-
బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న సింగర్ దర్శన్ (ఫోటోలు)
-
భార్య మెడలో తాళి కట్టి.. కాళ్లు మొక్కిన మలయాళ నటుడు (ఫోటోలు)
-
పెళ్లి బంధంలో అడుగుపెట్టిన మహీశ్ తీక్షణ.. అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన చదరంగ రారాజు.. ఫొటోలు చూశారా? (ఫోటోలు)
-
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
పెళ్లి ఖర్చులు - పన్ను భారం
ఈ రోజుల్లో అబ్బాయి పెళ్లైనా, అమ్మాయి పెళ్లైనా.. ఖర్చులకు అంతు లేకుండా పోతోంది. వాడుక అని, వేడుక అని ఒకర్ని చూసి ఒకరు ఎక్కువ ఖర్చుపెడ్తున్నారు. ఆటలు, పాటలు, హల్దీ, మెహందీ, బ్యాచిలర్ పార్టీలు, సంగీత్, ప్రీ-వెడ్డింగ్ షూట్.. పెళ్ళిలో వందలాది వంటకాలు, బట్టలు, రిటర్న్ గిఫ్ట్లు, అలంకరణ, బ్యాండు, కచేరీలు, బంగారం.. ఆ తర్వాత కార్యక్రమాలకు హోటళ్లు.. అటు మీదట హనీమూన్. ఇవన్నీ పెళ్లి ఖర్చులు కిందే వస్తాయి. ఖర్చు పెడితే ఆదాయం రాదుగా.. ఇక పన్ను భారం ఏమిటండీ అంటారేమో.. ఓపిగ్గా చదవండి. పూర్తిగా చదవండి.చట్టప్రకారం వరకట్నం నిషేధం. దాని జోలికి పోకండి. ఇవ్వకండి. ఏదైనా కారణాలవల్ల ఇవ్వాల్సి వస్తే ‘నగదు’ రూపంలో లావాదేవీలు నిర్వహించకండి. బ్యాంకుల ద్వారానే చేయండి. గిఫ్ట్ రూపంలో చేయండి. ఆ మేరకు డాక్యుమెంట్లు తయారు చేసుకోండి. మీ అమ్మాయి తరఫున ఇవ్వదలచినట్లయితే.. ‘స్త్రీధనం’ పేరున అమ్మాయి పేరుతోనే వ్య వహారం చేయండి.స్త్రీధనం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎంతైనా ఇవ్వొచ్చు. అయితే, ఇచ్చిన బ్యాంకు బ్యాలెన్సుకి, ఇంటికి, స్థిరాస్తికి, పొలానికి, తోటకి, బంగారానికి, ఆభరణాలకు డాక్యుమెంట్లు ముఖ్యం. ఇవన్నీ మీకు ఎలా వచ్చాయో మీరు చెప్పాల్సి రావచ్చు. ఎవరికి? పెళ్లివారికి కాదు.. ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారికి. అడిగినప్పుడు వివరణ ఇవ్వాలి. ‘సోర్స్’ చెప్పాలి.ఇక పెళ్లి ఖర్చులపై ఎటువంటి ఆంక్షలు లేవు. ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ఖర్చులు విన్నాం. అలా ఎన్నో పెళ్ళిళ్లు. మన కంటికి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఆ జోరు, హోరు, హుషారు, షికారు చూసి బంధువులు మెచ్చుకోవచ్చు. పెళ్లివారు సంతోషపడొచ్చు. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి కంట్లో పడితే.. వారి దృష్టికి వెళితే, ఎవరైనా వారికి మీ ఖర్చుల మీద కంప్లైంట్ ఇస్తే.. ఖర్చుల విషయం ఆరా తీయడం చాలా తేలిక పని. అధికారుల వద్ద ఎన్నో పరికరాలు, పద్ధతులు ఉంటాయి. మిమ్మల్ని వాచ్ చేస్తారు. పెళ్లి పందిళ్లలో మమేకం అయిపోతూ, ఒక గెస్టులాగా మీతో మాట్లాడుతూ భోగట్టా చేస్తారు. కూపీ లాగుతారు. ఎంక్వైరీ చేస్తారు. మనం కూడా ఎంతో సంతోషంగా, సంబరంగా, గర్వంగా, గొప్పగా చెప్పేస్తాం. షేర్ చేసుకుంటాం.ఇది కాకుండా పందిళ్లలో ఆ నోటా.. ఈ నోటా .. కొన్ని మాటలు వింటాం. వెండర్లు.. అంటే సర్వీస్ ప్రొవైడర్లు.. కొటేషన్లు ఇస్తున్నారు. అందులో జీఎస్టీ వసూలు చేస్తున్నారు. విజిటింగ్ కార్డులు పంచుతున్నారు. సోషల్ మీడియాలో టామ్టామ్ చేసుకుంటున్నారు. గూగుల్, పేటీఎంకు చెల్లింపులు చెయ్యమంటున్నారు. కాగితాలు, రుజువులు.. ఫొటోల సాక్షిగా దొరుకుతున్నాయి. ఒక విధంగా అంతా బట్టబయలే. పారదర్శకమైనదిగా కంటికి కనిపించేదిగానే ఉంటోంది. ఊహకు అందని విషయమేమీ కాదు. శ్రేయోభిలాషి ‘శభాష్’ అన్నా.. అధికారులు మనల్ని ‘బేహోష్’ చేయొచ్చు.హాల్ బుకింగ్కి అడ్వాన్స్ ఇస్తే నోటీసులు వచ్చాయి. వెండార్స్ నుండి సమాచారం సంగ్రహించి, నోటీసులు ఇచ్చారు. మొత్తం ఖర్చు ఎంత అని అడిగితే.. మీరు ఏదో ఒక జవాబు ఇవ్వచ్చు. కానీ వాళ్ల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. కాస్సేపు ఇద్దరి లెక్కలు ఒకటే అనుకోండి. అయినప్పటికీ ఆ ఖర్చులకు ‘సోర్స్’ చెప్పాలి. సరైన, సంతృప్తికరమైన జవాబులు రాకపోతే, ఖర్చు మొత్తాన్నీ ‘ఆదాయం’గా భావించి పన్నులను చెల్లించమంటారు.‘సోర్స్’ మీ సేవింగ్స్ కావచ్చు, మీరు అప్పు చేసి ఉండవచ్చు, మీ అబ్బాయి అమెరికా నుంచి పంపి ఉండవచ్చు.. ఎల్ఐసీ మెచ్యూరిటీ అయి ఉండవచ్చు.. ఎన్ఎస్సీలను ఎన్క్యాష్ చేసి ఉండొచ్చు.. ఏదైనా సరే.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ‘సోర్స్’ ఉన్నంతవరకే ఖర్చు పెట్టండి. -
రెండో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు సాయికిరణ్ (ఫోటోలు)
-
ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..!
"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్ సెట్ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు. ఎందుకిలా అంటే..పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్ స్థితి చూస్తే బాగుండు. కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. Salary expectations of groom during wedding matches is insane … <1L / month are not even being considered if person is in IT Mindset of parents requires RESET. How can 28 year old earn 1-2L, have own car and a house ??Your generation had all these for retirement#Life— Vineeth K (@DealsDhamaka) January 6, 2025 (చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!) -
గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్
పాపులర్ సూఫీ సింగర్ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్ అయిన బిస్మిల్, షిఫాఖాన్తో జీవితాన్ని పంచుకున్నాడు. డిజైనర్ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్ లుక్లో ఫ్యాన్స్ను మురిపించారు. వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్ ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్లో, బిస్మిల్ షిఫా ఖాన్ (ఇపుడు భార్య)తో కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు. అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకున్నాడు స్టన్నింగ్ బ్రైడల్ లుక్ వధువు షిఫా ఖాన్ డార్క్ రెడ్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో పెళ్లికూతురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్, విలాసవంతమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఎలిగెంట్ లుక్ నిచ్చాయి. లెహెంగాకు మ్యాచింగ్, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది. ఇంకా డైమండ్స్, పచ్చలు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు, ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్తో కూడిన గాజులతో అద్భుతంగా కనిపించింది. నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్ లుక్క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్, వైట్ షేడ్స్లో మెరిసే రాళ్లతో రూపొందించిన బంగారు బ్రూచ్తో అందంగా మెరిశాడు బిస్మిల్. వజ్రాలు పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్ వాచ్మరింత విలాసాన్నిచ్చింది. అందమైన ఫోటోలుస్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం, నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు, వేలిముద్రలు ఫోటోలను కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Bismil (@bismil.live) -
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
అందమైన కుందనాల బొమ్మలా సింధు.. సంతోషకర క్షణాలు (ఫొటోలు)
-
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
అదిరే.. అదిరే..
కాలం మారింది. అందుకు తగ్గట్లుగా పద్ధతులూ మారిపోయాయి. కొత్తకొత్త సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరి మనసులను కలిపి ఒక్కటి చేసే వివాహమనే ఘట్టంలోనూ నూతన ఒరవడి ఒకటి పురుడుపోసుకుంది. అదే ప్రీ వెడ్డింగ్ షూట్. రూ. లక్షలు ఖర్చవుతున్నా యువత ఎక్కడా తగ్గడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రీ వెడ్డింగ్ షూట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాలకూ ఈ సంస్కృతి వ్యాపించింది. ఒకప్పుడు పెళ్లికి నాలుగు లక్షల రూపాయలైందంటేనే అంతా ఆశ్చర్యపోయేయారు. కానీ, నేడు ప్రీ వెడ్డింగ్ షూట్కే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి ముందు ఏకంగా నాలుగైదు రోజుల పాటు పర్యాటక ప్రాంతాల్లోనే గడుతుపున్నారు. సంప్ర దాయాలు అడ్డొస్తున్నా పిల్లల ఇష్టాయిష్టాలను కాదనలేక తల్లిదండ్రులు ఓకే చెబుతున్నారు. నిశ్చితార్థం నుంచే.. గతంలో పెళ్లయ్యాక హనీమూన్కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన రోజు నుంచే ప్రీవెడ్డింగ్ షూట్కు అనువైన ప్రాంతాలను వెతుకుతుండటం గమ నార్హం. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు బెంగ ళూరుకు దగ్గరగా ఉండటంతో కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలనూ ఇంటర్నెట్లో చూస్తున్నారు. గండికోటకు క్యూ.. ఎక్కువ జంటలు చారిత్రక కట్టడాలను ప్రీవెడ్డింగ్ షూట్కు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి నచ్చుతున్న వేదికల్లో గండికోట మొదటి వరుసలో ఉంటోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రాజసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల ఆ ప్రాంతానికి ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్తున్న జంటలు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలోని నందిహిల్స్, కూర్గ్, మైసూరు, గోవాతో పాటు బాగా డబ్బున్న వారైతే జైపూర్కు వెళుతున్నారు. రెండు నుంచి మూడు లక్షలు.. ఒకేరోజులో అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యేది కాదు. 2,3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఓ కెమెరా మెన్ లేదా ఒక ఫొటోగ్రాఫర్ను వెంట తీసుకెళ్లాలి. ఈ క్రమంలో కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లకే రూ.1.50 లక్షల వరకూ ముట్టజెబుతున్నారు. బస, ఆహారం, దుస్తుల కొనుగోలు తదితర వాటికి మరో లక్ష పైనే ఖర్చవుతోంది. ఈ మూడు రోజుల ప్రక్రియను ఎడిట్ చేసి పెళ్లినాడు ప్రదర్శిస్తున్నారు. ఒకరినొకరు తెలుసుకోవచ్చు.. ఒకరి మనసు మరొకరు తెలుసుకునేందుకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతో ఉపయోగపడుతుంది. మా స్నేహితులు, బంధు వులు ఎంతో ఆడంబరంగా ఈ వేడుక జరుపుకున్నారు. సమయాభావం వల్ల మేం మిస్ అయ్యాం. – పాండ్రే వైష్ణవి, బ్యాంకు ఉద్యోగి -
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్
తారక్ మెహతా కా ఊల్టా చష్మా షో నటి జీల్ మెహతా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు ఆదిత్య దూబేను పెళ్లి చేసుకుంది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.అయితే జీల్ మెహతా వివాహ వేడుక డిసెంబర్ 28న జరిగింది. కాస్తా ఆలస్యంగా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ పంచుకుంది. కాగా.. జీల్ మెహతా తారక్ మెహతా కా ఊల్టా చష్మా సిట్కాట్తో పాటు చల్దీ దా నామ్ గడ్డి సీరియల్లోనూ నటించింది.కాగా.. గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న జీల్ మెహతా, ఆదిత్య దూబే ఏడాది చివర్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సోను పాత్రలో అభిమానులను మెప్పించింది. జీల్ మెహతా 2008 నుంచి 2012 వరకు ఈ సిట్కామ్ షోలో కనిపించింది. మరో సీరియల్ చల్దీ దా నామ్ గడ్డిలో ప్రియాంక పాత్రలో అలరించింది. ఈ సిరీయల్ 2007 నుంచి 2008 వరకు కొనసాగింది. View this post on Instagram A post shared by Priya Parikh | Wedding Content Creation (@sociallydreaming) -
వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది..!
భారతీయ వివాహాలు అంటేనే లగ్జరీగా ఉంటాయి. ఖర్చులు, వేస్ట్ రెండూ అధికంగానే ఉంటాయి. పెళ్లి అనంగానే డెకరేషన్ దగ్గర నుంచి భోజనంలో పెట్టే యూజ్ అండ్ త్రో ప్లేట్లు,గ్లాస్లు, వడ్డించే భోజనం వరకు ఎంత చెత్త వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేవిధంగా వృధా కూడా చేస్తుంటాం. అవన్నీ పర్యావరణానికి నష్టమే. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్ల పేరుతో ఇచ్చే బహుమతులు.. ప్యాకే చేసే పాలిథిన్ కవర్లు వంటి చెత్త ఎంతో వస్తుంది. ఇలా వాటన్నింటికీ చెక్పెట్టేలా పర్యావరణమే పరవశించి దీవించేలా వివాహం చేసుకుంది ఓ జంట. వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది కదా..! అని అంతా అనుకునేలా పర్యావరణ స్ప్రుహ కలిగించేలా పెళ్లి చేసుకుంది. మర్చంట్ నేవీలో చీఫ్ ఆఫీసర్ అశ్విన్ మాల్వాడే అతని భార్య, మార్కెటింగ్ ప్రొఫెషనల్ నుపుర్ అగర్వాల్ జీరో వేస్ట్ వెడ్డింగ్తో ఒక్కటయ్యారు. అందరిలో పర్యావరణం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే ఆలోచనకు నాందిపలికేలా సరికొత్త విధంగా వివాహం చేసుకున్నారు. ముంబైలోని వెర్సోవా బీచ్లో బీచ్ క్లీనప్ డ్రైవ్ కారణంగా.. ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా తొలిసారిగా కలుసుకున్న ఈ ఇద్దరు తమ అభిరుచులు కూడా ఒక్కటే కావడంతో వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. తమ అభిరుచికి అనుగుణంగా తమ వివాహం పర్యావరణహితంగా ఉండేలా ప్లాన్ చేశారు. అలానే తమ వెడ్డింగ్ డెకరేషన్లో మొత్తం పూలు, ఆకుపచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఊరేగింపులకు కర్బన ఉద్గారాలు తగ్గించేలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే భోజనాల్లో మిగిలిపోయిన ఆహారం పేదలకు పంపిణీ చేశారు. దీంతోపాటు వారి పెళ్లిలో వచ్చిన వ్యర్థాలను కంపోస్ట్ చేయడమే గాక ప్రతిగా సుమారు 300కు పైగా చెట్లను నాటారు. పర్యావరణ స్ప్రుహతో ఈ జంట చేసుకున్న వివాహం అందిరికీ స్ఫూర్తిగా నిలిచింది. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఈ ఏడాది తిరుగులేదు అనేలా సంతోషభరితంగా సాగిపోవాలంటే..!) -
నా ప్రేమ, సంతోషం.. అన్సీన్ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు (ఫోటోలు)
-
పెళ్లి కొడుక్కి పరీక్ష పెట్టిన నటి.. మండపంలో ఎమోషనల్.. (ఫోటోలు)
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫోటోలు)
-
పులివెందుల : కొత్త జంటకు వైఎస్ జగన్ దంపతుల ఆశీర్వాదం (ఫొటోలు)
-
పరుచూరి రామకోటేశ్వరరావు- కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లిలో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
తాళికట్టి.. తలంబ్రాలు పోసి.. భార్యను ముద్దాడి (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేసిన ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ ఫోటోలు వైరల్!
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన పీవీ సింధు.. క్యూట్ కపుల్ (ఫొటోలు)
-
హైదరాబాద్ వచ్చిన పీవీ సింధు..నేడు వివాహ రిసెప్షన్ (ఫొటోలు)
-
PV Sindhu Wedding : అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటోలు వైరల్
-
Soniya Akula: సోనియా పెళ్లికి పెద్దోడు డుమ్మా! ఎందుకబ్బా? (ఫోటోలు)
-
భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో డిసెంబర్ 14న డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా కొత్త జీవితం ప్రారంభించాడు. పెళ్లి ఫొటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీ సింహా స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్)'ఇప్పటికి ఆరేళ్లయింది. ఎప్పటికీ ఇలానే' అని రాసిపెట్టడంతో పాటు 'రాసిపెట్టుంది' అని య్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాడు. దీనిబట్టి చూస్తుంటే గత ఆరేళ్లుగా రాగ మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీ సింహా.. కొన్నాళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించాడు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. ఈ నెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్లో పెళ్లి జరిగింది. ఇందులో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.మురళీ మోహన్కు కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో బిజినెస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్) View this post on Instagram A post shared by Sri Simha Marakathamani (@simhakoduri) -
రాయల్గా రాజస్తానీ టచ్తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్లోని ఉదయపూర్లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్లో రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్లో అతి పెద్ద స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్ను నిర్వహించింది. డేటా సైన్స్లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించిన ఆపరే షన్స్ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
సోనియా పెళ్లిలో బిగ్బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
-
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
ఈసారి బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. యష్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరగ్గా.. శనివారం వేకువజామున 3 గంటలకు అలా పెళ్లి జరిగింది. బిగ్బాస్ ఫ్రెండ్స్ పలువురు రిసెప్షన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బిగ్బాస్లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన వాళ్లలో జెస్సీ, అమర్ దీప్-తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత తదితరులు ఉన్నాయి. బిగ్బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మరి కావాలనే రాలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల మిస్సయ్యాడో!(ఇదీ చదవండి: ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
జీవితంలో పెళ్లే చేసుకోనన్న హీరోయిన్.. కీర్తి సురేశ్ గురించి ఏమందంటే? (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
కర్నూల్లో జగన్ కోసం జన కోలాహలం (ఫొటోలు)
-
పదేళ్ల ప్రణయం తర్వాత పెళ్లి పీటలెక్కిన లవ్బర్డ్స్
-
పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్
'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్ అమృత అయ్యర్కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బచ్చలమల్లి' ప్రమోషన్స్లో భాగంగా అమృత అయ్యర్కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్) -
క్రిస్టియన్ సంప్రదాయంలోనూ కీర్తి సురేశ్ పెళ్లి (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. దుబాయ్లో గ్రాండ్ వెడ్డింగ్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దుబాయ్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో వీరిద్దరు టాలీవుడ్ నటుడు మురళిమోహన్ మనవరాలు రాగా మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ వేడుక్లలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్ చేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. శ్రీసింహ విషయానికి వస్తే.. ఇతడు 'యమదొంగ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
‘వివాహ ఆహ్వానం’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్లోని ఉదయపూర్లో సింధు వివాహం జరగనుంది. -
గ్రాండ్గా మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి వేడుక (ఫోటోలు)