YSR District Latest News
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మద్దిమడుగు బిడికి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల ఆదినారాయణ, కోర్ణ సూర్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున రాయచోటి నుంచి కడపకు రాతి స్తంభాలు వేసుకుని ఏపీ04 బీఎక్స్7660 నెంబర్ గల ట్రాక్టరులో డ్రైవర్ వెంకట చలపతి, సహాయకుడు మేకల ఆదినారాయణ వస్తుండగా మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామ సమీపంలో ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక ఎడమవైపు గల టైరు పేలి ట్రాక్టర్ అదుపు తప్పింది. ఈ ఘటనతో ట్రాక్టర్ ఒక్కసారిగా వేగం తగ్గడంతో వెనుక ఏపీ05 టీడీ 6549 నెంబరుగల కంకర లోడుతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేసుకోలేక ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకట చలపతి, టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ, ట్రాక్టర్ సహాయకుడు ఆదినారాయణను రోడ్డు పక్కకు తీసుకెళ్లి నీరు తాగిస్తుండగా కొద్దిసేపటికే ఎన్ఎల్02 బి 7879 నెంబరుగల శివాజీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు డ్రైవర్ తురక శివరామకృష్ణ కడప నుంచి రాయచోటి వైపు అతివేగంగా నడుపుకుంటూ వచ్చి టిప్పర్ డ్రైవర్ కోన సూర్యనారాయణను ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ట్రాక్టర్లోని సహాయకుడు, టిప్పర్ డ్రైవర్ను రిమ్స్కు తరలించారు. ఉదయం 7.36 గంటలకు ట్రాక్టర్ సహాయకుడు మేకల ఆదినారాయణ, ఉదయం 9.11 గంటలకు టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ తెలిపారు. -
నేటి నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు
రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి ఉత్సవాలను బుధవారం నుంచి నిర్వహించనున్నారు. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద చలువ పందిళ్లు, స్వాగతతోరణాలు, కళాకారుల కోసం కళావేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలు 29 వరకు కొనసాగనున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలి తాళ్లపాక వైపు టీటీడీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తాళ్లపాక గ్రామస్తులు అదృష్టదీపుడు, మోహనరావు, నారయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగోతు రమేష్నాయుడులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. తిరుమలలో హుండీలో వచ్చిన ఆదాయం ఒక శాతం తాళ్లపాక అభివృద్ధి కోసం వ్యయం చేయాలన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో ఈ నెల 5న తాళ్లపాకకు వస్తానని, అభివృద్ధి చేసే అంశంపై చర్చిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు. తాళ్లపాక వైపు కన్నెత్తి చూడని టీటీడీ అధికారులు చైర్మన్కు ఫిర్యాదు చేసిన తాళ్లపాక గ్రామస్తులు -
ప్రాచుర్యం శూన్యం
భక్తకన్నప్ప గ్రామం..ఽభక్తకన్నప్ప విగ్రహం ● కన్నప్ప జన్మస్థలం ఇలా.. అరవై ముగ్గురు మహాశివభక్తులలో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తంచె. కన్నప్ప ద్వాపరయుగంలో అర్జునడే. ఆ యుగంలో శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి.. పాశుపాతాస్త్రం పొందారు. కలియుగంలో తిన్నడు (కన్నప్ప)గా ఉడుమూరులో జన్మించారు. కాలక్రమంలో ఉడుమూరు ఊటుకూరుగా మారింది. కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం.. తన జన్మస్థలమైన ఊటుకూరులో ఉంది. అక్కడ శివాలయం వెలసింది. రాజంపేట: భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తెలుగు వాడు. ఆయనను మొదట్లో తిన్నడు అనే పేరుతో పిలిచే వారు. బోయ వంశస్తుడు. ఒక బోయరాజు కుమారుడు.ఒకనాడు అడవిదారి గుండా వెళ్తుండగా.. శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా సమర్పించే వాడు. ఒక సారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించ దలచి.. ఆయన పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టారు. విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి విగ్రహానికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించారు. నిన్ను దర్శించినా, చరిత్ర విన్నా.. పఠించినా సర్వపాపాలు తొలిగి.. అంత్యకాలంలో కై లాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమయ్యారు. అందువల్లనే తిన్నడికి.. కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు దేవుడికి కన్ను ఇచ్చినందుకే కన్నప్ప అయ్యారు. ఆయన భక్తిని మెచ్చిన ప్రజలు.. భక్తకన్నప్పగా పిలుస్తున్నారు. ఆ శివలింగం ఉన్న ప్రాంతంలోనే శ్రీ కాళహస్తి క్షేత్రం వెలసినట్లు చరిత్ర చెబుతోంది. కన్నప్ప పుట్టిన ఊరు ఎక్కడా.. రాజంపేట పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కడప–రేణిగుంట జాతీయ రహదరిలో భక్తకన్నప్ప జన్మస్థలం అయిన ఊటుకూరు ఉంది. హైవే రోడ్డు పక్కనే కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం ఉన్న పురాతన ఆలయం ఉంది. తిరుపతి, చైన్నెకు వెళ్లే ఏ వాహనంలో అయినా ఊటుకూరు (ఉడుమూరు)కు చేరుకోవచ్చు. వెలుగులోకి తీసుకొచ్చిన తమిళ వాసి.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో.. గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నడుంబిగించారు. భక్తకన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూపులు భక్తకన్నప్ప జన్మస్థలం అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనమతులు ఎప్పుడు వస్తాయని ఇక్కడి ప్రాంతీయులు వేచి చూస్తున్నారు. భక్తకన్నప్ప జన్మస్థలం అభివృద్ధికి సహకరించాలని గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం దృష్టికి వారు తీసుకెళ్లారు. అన్నమయ్యతో కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. ‘శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనవునిగా పుడతారు’ అని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభాస్యం చేశాడు. కలియుగ దైవం వెంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలు రచించి, పద కవితా పితామహడుపేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప.. కాళహస్తికి ఎలా వెళ్లాడుతిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖినది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారారు. తర్వాత తన రెండు కళ్లను సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఆనాటి నుంచి శ్రీకాళహస్తిలో భక్తకన్నప్పకు.. స్వామివారి కన్న ముందే పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ.. భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. భక్తకన్నప్ప జన్మస్థలికి ఇప్పటి వరకు అధికార ముద్ర పడలేదు. కూటమి ప్రభుత్వం అయినా చొరవ చూపుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భక్తకన్నప్ప సినిమా తీస్తున్న మంచువిష్ణు బృందం సందర్శించిన క్రమంలో.. ఊటుకూరు మరోసారి తెరపైకి వచ్చింది. పెరియ పురాణం ద్వారా వెలుగులోకి జన్మస్థలి పట్టించుకోని ప్రభుత్వం కన్నెత్తి చూడని శ్రీకాళహస్తి దేవస్థానం భక్తుల ఆవేదన అరణ్య రోదన భక్తకన్నప్ప నడయాడిన ప్రదేశం గామంలో కన్నప్ప పూజించిన శివాలయం ఉంది. అలాగే ఊటుకూరు పరిసరాలు కన్నప్ప నడయాడిన ప్రాంతాలు. భక్తకన్నప్పకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ అనే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. –నాగా ఫృథ్వీపతిరెడ్డి, గ్రామపెద్ద, ఊటుకూరు చారిత్రక ఆధారాలు ఉన్నాయి కన్నప్ప ఇక్కడి వాడేనని అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి అటవీ మార్గంలో చేరుకున్నారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ మా గ్రామానికి చెందిన భక్తకన్నప్పకు అంటే మాలో ఎక్కడ లేని భక్తి ఉప్పొంగి వస్తుంది. –ఆర్.శ్రీనువాసురాజు, ఎంపీటీసీ, ఊటుకూరు -
క్షయ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
రాయచోటి అర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులపై ఎవరూ వివక్ష చూపరాదని జాతీయ మానవ హక్కుల కమిషన్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వర్చువల్గా రైల్వేకోడూరు జ్యోతికాలనీలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా కుష్టువ్యాధి నివారణ కార్యక్రమం అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, డీఎంహెచ్ఓ కొండయ్య, అదనపు డీఎంహెచ్ఓ శైలజ, జిల్లా న్యూక్లిప్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ శివప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
వేంపల్లె : స్థానిక వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలోని కడప రోడ్డులో ఉన్న బెంగళూరు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. దీంతో స్వీట్లకు సంబంధించిన మెటీరియల్, మిషనరీ దగ్ధమైంది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం వృషభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య గదుల్లో బెంగళూరు బేకరీని నిర్వహిస్తున్నారు. రోజూ లాగే షాపునకు బీగాలు వేసి ఇంటికి వెళ్లారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బేకరీలో నుంచి దట్టమైన పొగలు రావడంతో సమీపంలో ఉన్న దుకాణఱదారుడు నాగ సుబ్బారావు చూసి బేకరీ యాజమాని సంతోష్ కుమార్ కు సమాచారమిచ్చారు. అలాగే అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖాధికారి శివరామిరెడ్డి సంఘటన స్థలం వద్దకు తన సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. బేకరీలోనే స్వీట్లు తయారీ చేస్తుండడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వచ్చినట్లు ఫైర్ అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. -
కేసీ కెనాల్ నీటి విడుదలకు చర్యలు
కడప సెవెన్రోడ్స్: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఏప్రిల్ 15వ తేది వరకు నీరు అవసరమని జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో కోరడంతో ఆ విషయాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని కేసీ కెనాల్ (స్పెషల్) సబ్ డివిజన్ మైదుకూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారని వెల్లడించారు. ఈనెల 22న సాక్షి దినపత్రికలో ‘ఇటు కేసీ చూడండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలో ఉన్న పంటలకు ఇప్పటివరకు నీరు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. అలాగే మైలవరం నుంచి కూడా ఆయకట్టుకు నీరందించే అంశాన్ని మైలవరం జలాశయ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదిస్తామని పేర్కొన్నారు. సేవా దృక్పథం అలవరచుకోవాలి పులివెందుల రూరల్: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవరచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. మంగళశారం కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరపున వేంపల్లెలోని అమ్మ ఆశ్రమం, లింగాల సమీపంలోని దీనబంధు మానసిక వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు కె.రమేష్ కార్యదర్శి జి.నాగశేషారెడ్డి, కోశాధికారి ఎన్.నరసింహులు, వేంపల్లె సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మార్క్ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు కడప సెవెన్రోడ్స్: ఏపీ మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో శనగ, మిను ములు కొనుగోలు కోసం ఈనెల 19 నుంచి కేంద్రాలు ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల నుంచి శనగ క్వింటాలుకు రూ. 5650, మినుములు క్వింటాలుకు రూ.7400 చొప్పున కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 11 నుంచి సీఎం యాప్లో రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇచ్చామన్నారు. రైతులు ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకుంటే వెంటనే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే శనగ, మినుములు కొనుగోలు చేస్తామన్నారు. పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, వీఎన్ పల్లె, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, పులివెందుల, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, తొండూరు, కమలాపురంలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముగిసిన వేలం పాట ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని దినసరి కూరగాయల మార్కెట్తోపాటు వాహనాల పార్కింగ్కు సంబంధించి కమిషనర్ మల్లికార్జున మంగళవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ నెల 22న నిర్వహించాల్సిన వేలం పాట వాయిదా పడటంతో మంగళవారం నిర్వహించారు. దినసరి కూరగాయల మార్కెట్, వాహనాల పార్కింగ్కు మున్సిపాలిటీ రూ.1.29 కోట్లతో వేలం పాట ప్రారంభించగా షేక్ ముత్యాలపాడు గౌస్ బాషా రూ.1,60,80,000 పాట దక్కించుకున్నారు. జీఎస్టీతో కలిపి సదరు వ్యాపారి రూ.1,92,96,000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే వేలం పాట రూ.1,33,75,415 పలికింది. అలాగే మాంసం, చేపల మార్కెట్కు సంబంధించి వేలం పాటను రూ.6,50,000 ప్రారంభించగా బి.నవీన్కుమార్ రెడ్డి రూ.6,66,000 పాటను దక్కించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వీరికి రుసుం వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూడాలి
కొండాపురం: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సీపీ డబ్ల్యూ స్కీం నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గండికోట జలాశయం నుంచి కొండాపురం మండలంలోని తొమ్మిది గ్రామాలకు వెళ్లే సీపీడబ్ల్యూ స్కీం ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీపీడబ్ల్యూ స్కీం పైపులైన్ డ్యామేజ్ కావడంతో ఆరు గ్రామాలకు తాగునీటి సౌకర్యం నిలిచిపోయిందని అధికారులు ఆమె దృష్టికి తీసికెళ్లారు. ప్రస్తుతం మండలంలోని కొండాపురం, గండ్లూరు, చౌటిపల్లె గ్రామాలకు ఈస్కీం నడుస్తున్నట్లు ఆమెకు వివరించారు. పునరావాస కేంద్రాలల్లో తాగునీటిసమస్య లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ నాగప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ మోహన్, ఏఈ ప్రసాద్, శంకర్రెడ్డి,పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వైద్య సేవలు కొనసాగాయి కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదల వైద్యానికి ఎలాంటి ఆటంకం కలగలేదని ఆ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ బాల ఆంజనేయులు తెలిపారు. కాగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్యమిత్రలు సోమవారం విధులను బహిష్కరించి తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలిపిన విషయం విదితమే. జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ -
దంపతుల మృతికి కారకుడిని ఎలా వదిలేస్తారు?
ఎర్రగుంట్ల : దంపతుల మృతికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్ను పోలీసులు వదిలి పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. కలమల్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఓమ్నీ వాహనం ఢీకొన్న సంఘటనలో వెంకటరాజారెడ్డి అనే ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం చెందగా అతని భార్య సుజాత తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే నిందితుడిని కూటమి పార్టీకి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామి వచ్చి స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు. ఇద్దరి మృతికి కారణమైన వాహన డ్రైవర్ను కలమల్ల ఎస్ఐ తిమోతి కూటమి నాయకుడి వెంట పంపించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఐను కోరితే ఆయన తమను బెదిరించాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్ఐ తీరు ముందు నుంచి వివాదాస్పదంగా ఉందని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఎస్ఐ వత్తాసు పలుకుతాడని ఆరోపించారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. నిందితుడిని ఎలా వదిలేస్తారంటూ ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దంపతుల మృతదేహాలను సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాకు న్యాయం చేయండి.. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు కుమార్తెలు తీవ్ర వేదనతో స్టేషన్ బయట బైఠాయించారు. తమకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన తమకు దిక్కు ఎవరు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానొక దశలో గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో స్టేషన్ ఆవరణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడు వెంకటరమణ, అతన్ని విడిపించుకుని వెళ్లిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని మృతుల సమీప బంధువు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. కలమల్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. ఎస్ఐ తీరును నిరసిస్తూ కలమల్ల గ్రామస్తులు స్టేషన్ బయట బైఠాయించడంతో ఎస్ఐ తిమోతి స్టేషన్లోనే ఉండిపోయారు. వెంటనే కొండాపురం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి సీఐలు మహమ్మద్ రఫీ, లింగప్ప, నరేష్బాబు, గోవిందరెడ్డి, గోపాల్రెడ్డి, దస్తగిరిలు, ఎస్ఐలు విద్యాసాగర్, ధనుంజయుడు, హృషికేశవరెడ్డి, పోలీసు సిబ్బంది స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా స్టేషన్కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితుడిని విడిపించుకుని వెళ్లిన కూటమి నాయకుడు కలమల్ల ఎస్ఐ తీరుపై గ్రామస్తుల మండిపాటు పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన గ్రామస్తులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
● ఆపై తానూ ఆత్మహత్య ● వైఎస్సార్ జిల్లాలో ఘటన వల్లూరు : మద్యం మత్తులో అనుమానంతో భర్తే భార్యను హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వల్లూరు మండల పరిధిలోని అంబవరం ఎస్సీ కాలనీలో మంగళవా రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..అంబవరం ఎస్సీ కాలనీలో యర్రగుడిపాడుకు చెందిన చెన్న కేశవ, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతోష్ కుమార్ అనే వివాహమైన కుమారుడితో బాటు వరుణ్ కుమార్ (13) అనే కుమారుడు, స్వర్ణలత (8) అనే కుమార్తె ఉంది. చెన్న కేశవ (45) తాగుడుకు బానిసగా మారి మద్యం మత్తులో భార్య సుజాత (40)ను వేధిస్తుండేవాడు. సుజాతపై చెన్నకేశవ అనుమానం పెంచుకోవడంతో ఆమె 2 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమె పెద్ద కుమారుని వివాహం జరగడంతో దాని కోసం ఆమె అంబవరం వచ్చింది. వివాహం జరిగిన తరువాత మళ్లీ తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది. కొడుకు అత్తగారి ఇంటి నుంచి కోడలికి ఉగాది సాంగ్యం తెస్తుండటంతో..తన కుమారుడు ఆమెను అంబవరానికి తీసుకువచ్చాడు. మంగళవారం మద్యం తాగిన చెన్న కేశవ ఇంటి ఆవరణలో సుజాతపై కొడవలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెన్న కేశవ కొడవలి పట్టుకుని క్రిష్ణాపురం, గంగాయపల్లె రైల్వేస్టేషన్ల మధ్య నల్లపురెడ్డిపల్లె రైల్వే గేటుకు కొద్ది దూరంలో గూడ్సు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
డ్రైవర్పై దాడి చేసి.. కారును దొంగిలించారు
కడప అర్బన్ : హైదరాబాదు నుంచి కడపకు ఇన్నోవా కారును బాడుగకు తీసుకుని వచ్చి డ్రైవర్పై దాడి చేసి.. కారును దొంగిలించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ బాలుడు ఉన్నాడు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర్ రెడ్డి, రవికుమార్లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్ హైదరాబాదుకు వెళ్లి ఈనెల 15న రాత్రి ఇన్నోవా కారును కడపకు బాడుగకు మాట్లాడుకొని వచ్చారు. ఈనెల 16వ తేదీన కడప రింగ్ రోడ్డు వద్దకు రాగానే కారు డ్రైవర్పై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు, వెండి ఉంగరాలను దోచుకుని కారుతో నిందితులు పరారయ్యారు. కారు డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కడపకు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డు మరో బాల నేరస్తునితో కలిసి డ్రైవర్ శ్రీకాంత్ను కొట్టి అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, మెడలో ఉన్న బంగారు గొలుసు, వెండి ఉంగరాలు తీసుకొని కారుతో పరారైనట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై నిఘా ఉంచారు. వాటర్ గండి రోడ్డులో కడప నకాష్కు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డును అరెస్ట్ చేశారు. మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్లు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఒకరిని రిమాండ్కు తరలించారు. మరొకరిని పరిశీలనకు పంపించారు. ఇద్దరి అరెస్టు.. నిందితుల్లో ఒకరు మైనర్ పరారీలో ఇరువురు ప్రధాన నిందితులు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు -
బ్యాడ్మింటన్ చాంపియన్లుగా నాగరాజు– నితిన్ జోడీ
కడప అర్బన్ : న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలుగా నాగరాజు – నితిన్ జోడి నిలిచింది. కడప నగరం పక్కీరుపల్లెలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు న్యాయమూర్తి రామారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కాగా టోర్నీలో రన్నరప్గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి జోడీ నిలిచింది.రన్నరప్గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి -
వెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం తగదు
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై దుష్ప్రచారం చేయడం తగదని కళాశాల కరస్పాండెంట్ అరకటవేముల హరినారాయణ తెలిపారు. ఆయన సోమవారం తమ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది ఉద్దేశ పూర్వకంగా కళాశాలకు ఉన్న మంచి పేరును చెడగొడుతూ మూడో వ్యక్తికి లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యాప్రమాణాల్లో మెరుగైన విధానాలను అవలంబిస్తున్నందుకు న్యాక్ బీ ప్లస్ గుర్తింపు వచ్చిందన్నారు. వీటి కారణంగానే ప్రభుత్వం తమ కళాశాలకు అటానమస్ హోదాను ఇచ్చిందని తెలిపారు. అడ్మిషన్లు చేసుకునే సమయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే తమ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆయన అటానమస్, న్యాక్తోపాటు ఇతర సర్టిఫికెట్లను చూపించారు. ఇటీవలి కాలంలో విద్యార్థులకు ప్లేస్మెంట్ సెల్ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు. -
ముందస్తు ప్రణాళికతో వేసవి తాపాన్ని అధిగమిద్దాం
కడప సెవెన్రోడ్స్ : ముందస్తు చర్యలు చేపట్టి అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా వచ్చే వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ వంటి సమస్యలను అధిగమించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో తాగునీటి కొరత, వేసవి వడగాడ్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలపై జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా అదనపు వైద్యాధికారి ఉమామహేశ్వర కుమార్లతో కలిసి డీఆర్వో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వేసవిలో అనవసరంగా బయటకు రాకూడదని.. అత్యవసర పనులు ఉంటే ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలను ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు వాడటం, వేడిగాలులు తగలకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు. అన్ని మండలాల్లో ఎక్కడా కూడా తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏఎన్ఎంలతో సమన్వయం చేసుకుని వడగాడ్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డ్వామా అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వడగాడ్పులపై సీడీపీఓ, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులు, పశు పక్ష్యాదులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి.. నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని.. అటవీశాఖాధికారులను ఆదేశించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వేసవి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు మొదలైన జీవాలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలతో పాటు.. అన్ని పశు ఆరోగ్య కేంద్రాల వద్ద పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు -
అరటి తోటలను పరిశీలించిన మంత్రి సవిత
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను సోమవారం రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామంలో పర్యటించి అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం పార్నపల్లె గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటలను, తమలపాకు తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్కేవ్యాలీ క్యాంపస్లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు జరిగాయి. సోమవారం ఆర్కేవ్యాలీ క్యాంపస్లోని ఆట స్థలంలో స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో టెక్నికల్ టైగర్స్ జుట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఆర్కేవీ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 78 పరుగులు చేయగా.. బ్యాటింగ్కు దిగిన టెక్నికల్ టైగర్స్ జుట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 79 పరుగులు చేసి విజయం సాధించింది. క్రీడా పోటీలలో గెలుపొందిన జట్టు సభ్యులను డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్ అభినందించారు. అలాగే గెలుపొందిన జట్టు సభ్యులకు బహుమతులు అందజేశారు. మత్తుపదార్థాలు సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా కడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి. ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం, శివారులో గంజాయి తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించేందుకు విస్తత చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని నకాష్, సాయిపేట, ఉక్కాయపల్లి, మార్కెట్యార్డ్, పాత కడప, మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న స్మశాన వాటిక, పరిసర ప్రాంతాలు, బుగ్గవంక పరివాహక ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్ పాల్గొన్నారు. -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : ద్విచక్రవాహనాల్లో అరుణాచలం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన నలుగురు యువకులు ప్రముఖ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరునామలై అరుణాచలానికి ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. తమిళనాడులోని రాణికోట పట్టణ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో గంజికుంట శేషాచలం(29) బడిగించల నాగేంద్ర(31) కిందపడ్డారు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వచ్చిన కారు వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో శేషాచలం, నాగేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గంజికుంట శేషాచలంకు వివాహమై ఒక కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం మృతదేహాలు స్వగ్రామమైన వేపరాలకు చేరాయి.వేపరాలకు చెందిన ఇద్దరి మృతి -
ఘనంగా గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం బ్రహ్మంగారిమఠంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మహిళలు అమ్మవారికి చీరె, సారెను అందించారు. ప్రత్యేక భజనలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబ సమేత ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, దత్తస్వామి, మఠాధిపతి తమ్ముడు వీరభద్రస్వామి, దేవస్థాన సిబ్బంది, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నూతన వధూవరులకు ఆశీర్వాదం
● అడుగడుగునా కన్నీటిగాథలే.. సాక్షి కడప : పచ్చని ఫలం చూస్తుండగానే నేలవాలింది.. కొండంత కష్టం నేలపాలైంది. ప్రకృతి దెబ్బకు గెలలతో కళకళలాడుతున్న అరటి అల నిలువునా ఒరిగిపోయింది. రెండు,మూడు రోజుల్లో కోత కోద్దామనుకున్న రైతుల ఆశల్ని గాలివాన తుంచేసింది. వారి కాయాకష్టాన్ని నేలపాలు చేస్తూ వారి జీవితాల్లో కోత విధించింది. రెండు రోజుల క్రితం వీచిన గాలివానకు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. నిండు కాపుతో ఉన్న చెట్లన్ని నేలపాలు కావడంతో రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం మరింత బాధ కలిగిస్తోందని రైతులు వాపోయారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్ జగన్ ధ్వజం గాలులు, వర్షాలకు లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలతోపాటు అనేక గ్రామాల రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. వారి బా ధలను ఆలకించారు. అండగా ఉంటామని ధైర్యం నింపారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిహారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రైతులలో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాద వుతోంది.. మరో మూడేళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇన్సూరెన్స్తోపాటు పూర్తిస్థాయిలో ఇన్ఫుట్ సబ్సిడీ..గతంలో ఇచ్చిన రూ.50వేల తరహా లోనే నెల రోజుల్లోనే అందిస్తామని రైతన్నల్లో భరోసా నింపారు. తోటలను పరిశీలించిన మాజీ సీఎంఅకాల వర్షాలకుతోడు పెనుగాలులతో లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో సూర్య నారాయణరెడ్డి, కేశవయ్య పొలాలతోపాటు దారి పొడవునా అరటి తోటలను పరిశీలించారు. తోటల పరిస్థితిని చూసి మాజీ సీఎం చలించిపోయారు. కూటమి సర్కారుపై కన్నెర్రలింగాల మండల పర్యటనలో రైతులు పడుతున్న బాధలను దగ్గరగా చూసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుత కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల భీమా విధానాన్ని రద్దు చేసి కొత్తగా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం దుయ్య బట్టారు. రైతులకు సంబంధించి సున్నా వడ్డీ లేదు, కనీసం రైతు భరోసా లాంటిది అందించడంలేదని ధ్వజమెత్తారు. కనీసం ఇన్ఫుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. మండు వేసవిలో ఎండలు అదరగొడుతున్నా.. మిట్ట మధ్యాహ్న సమయంలోనే రైతులతో మమేకమయ్యారు. రైతుల బాధలను పంచుకుంటూ.. పొలాల మధ్యనే రైతులతో మాట్లాడుతూ కదిలారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి బయలుదేరే సమయంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మీదుగా తాతిరెడ్డిపల్లెకు వెళుతుండగా రైతులు అడుగడుగునా ఆపి తమ పొలాలను చూపించారు. సూర్యనారాయణరెడ్డి తోట వద్దకు రాగానే ఇంద్రావతి, రాగమణి, లక్ష్మిదేవి, ఎం.లక్ష్మిదేవి, రాజేశ్వరి, వాలమ్మ తదితరులు జగన్ను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ... ‘పంటంతా పోయింది.. రేపో మన్నాడో కోస్తామనుకునేలోపే పోయింది. ఉన్నఫలంగా గాలులు దెబ్బతీశాయి. మాకు దిక్కెవరంటూ’విలపించారు. కొందరు మహిళలు ‘మాకు ఇద్దరు ఆడబిడ్డలు అని ఒకరు, మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ఎలా చదివించాలి, ఎలా బతికి బట్టకట్టాలంటూ బోరుమన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా కోసే సమయంలో ఇలా పడిపోయిందని.. చివరకు కూలీ లు దొరకడం లేదు.. ఆలస్యం కావడంతో దళారులు రేట్లు తగ్గిస్తున్నారు.. ఈ వ్యవస్థను మార్చండి.. మమ్ములను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండని’జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారితోపాటు ఉన్న కొంతమంది తాతిరెడ్డిపల్లె రైతులు కూడా తమ బాధను మాజీ సీఎంకు వివరించారు. దళారుల రాజ్యం అధికంగా ఉందని.. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని.. ఇన్ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోతే పెట్టుబడులు కూడా దక్కవని వాపోయారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఇన్సూరెన్స్కు ప్రీమియం చెల్లించలేదు.. కనీసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఉద్యాన శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను కూడా మాజీ సీఎం గట్టిగా ప్రశ్నించారు. చిన్నకుడాల క్రాస్ నుంచి లింగాల, తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల వరకు పొలాలను పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి రైతు కంట కన్నీరు కనిపించింది. ఈదురు గాలులకు నిలువునా నేలవాలిన తోటలు ప్రకృతి దెబ్బతీసినా..పట్టించుకోని ప్రభుత్వం లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్ వేంపల్లె : వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి కుమారుడికి వివాహమైన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జెడ్పీటీసీ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇటీవల శ్రీలంకలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుడైన సాయి భైరవ ప్రీతం కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహం జరిగింది. జిల్లా పర్యటనలో పులివెందులకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లింగాల మండలంలో పర్యటించి అక్కడి అరటి రైతులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల నుంచి వేంపల్లెకు విచ్చేశారు. అలాగే రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, సుఽధీర్ కుమార్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, వేంపల్లె వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునీర్బాషా, రవిశంకర్ గౌడ్, సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
9న బిషప్ పట్టాభిషేక ఉత్సవం
కడప కల్చరల్ : ఆర్సీఎం నూతన బిషప్ పట్టాభిషేక ఉత్సవాన్ని ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కడప అపోస్తలిక పాలన అధికారి బిషప్ డాక్టర్ గాలి బాలి తెలిపారు. సోమవారం స్థానిక బిషప్ హౌస్లో వికర్ జనరల్ తలారి బాలరాజు అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బిషప్ గాలి బాలి మాట్లాడుతూ కడప మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గ్రౌండ్లో నూతన బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పట్టాభిషేక ఉత్సవం నిర్వహిస్తున్నామని, ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది బిషప్లు పాల్గొంటారన్నారు, అంతేకాకుండా ఢిల్లీ నుంచి కథోలిగా ముఖ్య ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఉత్సవం నాడు ఉదయం 8 గంటలకు మరియాపురంలోని పాత చర్చి నుంచి బిషప్ ఊరేగింపు ప్రారంభమై, బిల్డప్ మీదుగా సెయింట్ జోసఫ్ హైస్కూల్ వేదిక వద్దకు చేరుతుందని వివరించారు. జిల్లాలోని ప్రతి విచారణల నుండి కథోలిక విశ్వాసులు మహోత్సవానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహోత్సవాన్ని క్రమశిక్షణ, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తామని, అందరూ భక్తి విశ్వాసాలతో పాల్గొని నూతన బిషప్ను సంపూర్ణ విశ్వాసంతో ఆహ్వానించి కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని కోరారు. -
వైద్య మిత్రల బంద్.. రోగులకు ఇబ్బందులు
కడప రూరల్ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధులను బహిష్కరించారు. స్ధానిక ఆ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వైద్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ఉచిత వైద్యం కోసం నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చిన నిరుపేద రోగులు ఇబ్బందులు పడ్డారు. ‘వైద్యమిత్ర’లు లేక రోగుల అవస్ధలు.. జిల్లా వ్యాప్తంగా ‘వైద్య సేవ’ పరిధిలో మొత్తం 108 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు ఒక రోజు దాదాపు 2 వేల మందికి పైగా వివిధ అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. ఈ ఆసుపత్రుల్లో 105 మంది వైద్య మిత్రలు, ఐదుగురు టీఎల్ (టీమ్ లీడర్లు) పనిచేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు ముందుగా వైద్య మిత్రలను సంప్రదిస్తే, వారు ఆ వ్యక్తి వివరాలను పరిగణనలోకి తీసుకొని ఉచిత వైద్య సేవ కోసం రిజిస్ట్రేషన్ చేసి వైద్యుల వద్దకు తీసుకెళతారు. అక్కడ రోగిని డాక్టర్ పరీక్షించి వ్యాధిని నిర్ధారిస్తారు. అనంతరం సర్జరీ లాంటివి అవసరమైతే ఇన్ పేషెంట్గా అడ్మిట్ చేస్తారు. అవసరం లేకపోతే ఓపీ (ఔట్ పేషెంట్) కింద మందులు రాసిస్తారు. కాగా ఇన్ పేషెంట్గా చేరిన రోగి డిశ్చార్జ్ అయ్యే వరకు వారి బాధ్యతలను వైద్య మిత్రలు పర్యవేక్షిస్తారు. ఈ సిబ్బంది విధులను బహిష్కరించడంతో వైద్య మిత్రల ‘రోల్’ను ఆసుపత్రులకే అప్పగించారు. అయితే ఆసుపత్రుల వారు కొంత వరకు అత్యవసర కేసులను మాత్రమే తీసుకున్నారు. మిగతా వారిని పరీక్షించకుండా ఈ రోజు వైద్య సేవలు లేవు. ‘రేపు రండి’ అని చెప్పి పంపించేశారు. దీంతో అనారోగ్యం నుంచి కొంచైమెనా ఉపశమనం పొందుతామనే వారికి నిరాశ ఎదురైంది. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంత మంది డాక్టర్కు ఫీజు చెల్లించి చూపించుకొని.. రాసిచ్చిన మందులు కొని వెళ్లారు. గత సోమవారం ఒక వారం క్రితం వైద్య మిత్రలు విధులను బహిష్కరించినప్పుడు కూడా పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమా త్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇప్పుడెందుకు మాకీ ఇబ్బందులు అని పేదలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సోమవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ వైద్య సేవ విభాగంలో తామంతా కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, సుబ్బరాజు, కవిత, భవిత, నాగరత్న పాల్గొన్నారు. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది విధుల బహిష్కరణ నిరుపేద రోగులకు తప్పని అవస్థలుచాలా మంది వెనక్కి వెళ్లారు.. నాకు ఇది వరకే గుండె ఆపరేషన్ జరిగింది. చెకప్కు వచ్చాను. నన్ను డాక్టర్లు చెకప్ చేశారు. ఇక్కడికి చాలా మంది వచ్చారు. బంద్ అని చెప్పడంతో వారంతా వెళ్లిపోయారు. అలాగే గతంలో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొంది డిశ్చార్జ్ కాగానే ‘ఆసరా’ పథకం కింద కొంత డబ్బును ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పథకం లేదంటున్నారు. ప్రభుత్వం ‘ఆసరా’ను ఇవ్వడంతో పాటు పేదల వైద్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలి. – వెంకటేష్, పులివెందులవైద్య సేవలు బంద్ అని చెప్పారు.. నరాల సమస్యతో బాధపడుతున్నాను. వైద్యం కోసం కడపకు వచ్చాను. ఈ రోజు వైద్య సేవలు లేవు బంద్, రేపు రమ్మని చెప్పారు వైద్య సేవలను నిలుపుదల చేస్తే మా లాంటి వారి పరిస్థితి ఏమి కావాలి. – కొండయ్య, పోరుమామిళ్ల -
సమస్యలకు పరిష్కారమేదీ ?
కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్తోపాటు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 36,468 ఫిర్యాదులు అందాయి. ఈ ఒక్కరోజులోనే కలెక్టరేట్కు 221 ఫిర్యాదులు వచ్చాయి. కానీ సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో ఏదో చిన్నపాటి సమస్యలు మినహా ఎక్కువ భాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. అర్జీదారునికి ఎండార్స్మెంట్ జారీ చేసి సమస్యను పరిష్కరించామంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో గుర్తించిన టాప్–10 ప్రభుత్వశాఖలకు సంబంధించి వస్తున్న అర్జీలను పరిశీలిస్తే ఎక్కువ భాగం రెవెన్యూ, సర్వే విభాగాలకు సంబంఽధించిన సమస్యలే ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గృహ నిర్మాణం, పాఠశాల విద్యశాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పనితీరు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వచ్చిన వాళ్లే మళ్లీమళ్లీ గ్రీవెన్స్సెల్కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సోమవారం వచ్చిన అర్జీలలో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. దారి లేక ఇక్కట్లు దళితులమైన మాకు స్మశానానికి వెళ్లే దారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మృతదేహాన్ని తీసుకు వెళ్లాలంటే మోకాళ్లలోతు దిగుబడే పంట పొలాల్లో నుంచి స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోని స్మశానానికి పంట పొలాలను దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వోల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. కొంతమంది స్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు వెబ్ల్యాండ్లో నమోదు చేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాకు దారి కల్పించడంతోపాటు చుట్టూ ప్రహారీ, షెల్టరు నిర్మించి బోరు వేయాలని కోరుతున్నాం. – లెనిన్ ప్రసాద్, తుమ్మలూరు, పెండ్లిమర్రి మండలం పెన్షన్ నిలిపివేశారు వేలిముద్రలు, ఐరిస్ నమోదు కాలేదని నాకు పెన్షన్ నిలిపివేశారు. ఎన్టీ రామారావు హయాం నుంచి పెన్షన్ పొందుతున్నాను. ప్రస్తుతం నా వయస్సు 92 సంవత్సరాలు. ఈ విషయాన్ని పలుమార్లు మండల, గ్రామ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఆసరాతో కలెక్టర్కు చెప్పుకుంటే పెన్షన్ దక్కుతుందనే ఆశతో వచ్చాను. నా గోడు ఆలకించి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాను. – మద్దిక రంగమ్మ, దత్తాపురం, కొండాపురం మండలం నా భూమిని ఇతరుల పేరిట ఆన్లైన్ చేశారు మా పెద్దవాళ్ల నుంచి గ్రామ సర్వే నెంబరు 118/1, 118/3లో 7.56 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. మా నాయనమ్మ ఆ భూమిని 1950 జూన్ 23న మల్లెపల్లె వెంకట సుబ్బమ్మ వద్ద కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమిని మేము ఎవరికీ విక్రయించలేదు. ఆ భూమిపై మాకు ఉన్న హక్కులను తెలియజేసే ఒరిజినల్ దస్తావేజులు, ఆర్హెచ్ నకలు, ఈసీలు, 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు, పన్ను రశీదులు వంటి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అయితే అందులో 68 సెంట్ల భూమిని గ్రామ సచివాలయ సర్వేయర్, వీఆర్వో కలిసి చల్లా రమాదేవి పేరిట ఆన్లైన్ చేశారు. హక్కుదారులమైన మా పేరిట ఆన్లైన్ చేయాలని తహసీల్దార్ను కోరాం. ఆయన స్పందించకపోవడంతో ఇక్కడికి వచ్చాం. – వేమిరెడ్డి సురేష్రెడ్డి, లేటపల్లె, కమలాపురం మండలం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న అర్జీలు పరిష్కారంలో అధికారుల కాకిలెక్కలు అర్జీదారులకు తప్పని అగచాట్లు -
ఆలయ భూముల ఆక్రమణదారులకు నోటీసులు
మైదుకూరు : స్థానిక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చినట్టు దేవదాయశాఖ మైదుకూరు ఈఓ ఎంఎస్ ప్రసాదరావు సోమవారం తెలిపారు. స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులో గత బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో పలు సర్వే నంబర్లలోని ఆలయ భూములను సర్వే చేసిన విషయం తెలిసిందే. దేవాలయం పేరుతో ఉన్న సర్వే నంబర్లు 1052/ఏ, 1052/బీ, 1052/సీలోని 4.46 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించినట్టు ఈఓ ప్రసాద్రావు తెలిపారు. ఈ భూములను 17 మంది ఆక్రమించినట్టు గుర్తించామని పేర్కొన్నారు. వారిలో సోమవారం సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆదేశాలతో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో 15 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మిగిలిన ఇద్దరూ అందుబాటులో లేనందున వారికి మంగళవారం అందజేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు వివిధ రకాల నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని డీఆర్వో ఛాంబర్లో ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన శ్రీనివాసులు(సెక్షన్ ఆఫీసర్), షేక్ ఖాసిం వల్లి తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 25, 27 తేదీల్లో ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు , మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో 3, చాపాడు మండల పరిధిలో 1, ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో 1 పరీక్షా కేంద్రంతో కలిపి మొత్తం 5 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైన్ అఫ్ డిపార్టుమెంట్లు(పోలీస్, మెడికల్, ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖలు) సంబందిత అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు -
నిత్యకల్యాణానికి విరాళాలు
బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు. -
రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈనెల 26వ తేది ఒంటిమిట్టలోని పారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు కె. రామమోహన్రావు, ఎస్.ఎల్ అంజనీ కుమార్, డబ్ల్యు. విజయలక్ష్మిలు హాజరై విద్యుత్ వినియోగదారుల నంంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. వినియోగదారులు తమ దీర్ఘకాలిక సమస్యలను రాతమూలకంగా తెలిపి పరిష్కారం పొందాలని కోరారు. జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం – టీడీజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి కడప రూరల్ : వైఎస్సార్ కడప జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం లేదన్నారు. అందువలన తాము జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి రెడ్డి పాల్గొన్నారు. రాములోరి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 14వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
గంజాయి కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాసాపేట దొరల గోరీల సమీపంలో ఆదివారం ఆరుగురు వ్యక్తులు గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదివారం కడపలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు టూటౌన్ సీఐ బి.నాగార్జున, ఎస్ఐలు ఎస్కేఎం హుసేన్, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అరెస్టయిన వారిలో నల్ల వినోద్, జనితి నవనీష్ కుమార్, షేక్ ఖాదర్, మూడే పవన్ కుమార్ నాయక్, షేక్ సమీర్, గోదాన సుధీర్ ఉన్నట్లు తెలిపారు. పిల్లలు చెడువ్యసనాలకు బానిసలు కావడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమన్నారు. కాగా, నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన కడప టూటౌన్ సీఐ నాగార్జున, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్కుమార్ అభినందించారు.1200 గ్రాముల గంజాయి స్వాధీనం -
చవ్వా విజయశేఖర్రెడ్డి నేత్రదానం
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని చవ్వా సుభాకర్ రెడ్డి కాలనీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చవ్వా విజయ శేఖర్ రెడ్డి ఆదివారం మరణించడంతో ఆయన నేత్రాలను దానం చేశారు. భార్య సునీత, కుమారుడు దుష్యంత్ రెడ్డి, కుమార్తె మధులిక, చెల్లెలు ప్రమీలమ్మ, బావ వైఎస్ మనోహర్ రెడ్డి, వదిన సులోచనమ్మలు నేత్రదానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి, నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారమిచ్చారు. నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్తో కలిసి మృతుని స్వగృహానికి వెళ్లి భౌతికకాయం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు. ఈ సందర్బంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలసి పోయే నేత్రాలు దానం చేయడం ద్వారా అంధత్వంతో బాధ పడుతూ ఈ లోకాన్ని చూడలేని అంధులకు చూపు ఇచ్చినవారమవుతామన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులెవరైనా మరణిస్తే నేత్రదానం కోసం 9866727534, 7093204537 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గోడ కూలి వ్యక్తి మృతి
లింగాల : లింగాల మండలం ఎగువపల్లె గ్రామంలో శనివారం రాత్రి గోడ కూలి దిబ్బెల రామచంద్రారెడ్డి(65) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. రామచంద్రారెడ్డి కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు పాత ఇంటిని తొలగించే పనులు చేపట్టాడు. జేసీబీతో పాత ఇంటిని తొలగించి వాటి రాళ్లను ట్రాక్టర్కు లోడు చేస్తుండగా రామచంద్రారెడ్డి బాత్రూం గోడ పక్కనే ఉన్నాడు. ట్రాక్టర్ రివర్స్ రావడంతో బాత్రూం గోడకు తగిలి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన గోడ రామచంద్రారెడ్డి పైన పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కడపకు తీసుకెళుతుండగా మృతి చెందినట్లు కడప వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సులోచనమ్మ, కొడుకు భాస్కర్రెడ్డి, కోడలు సునీత, కుమార్తె కుమారి ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇంటిల్లిపాది కన్నీటి పర్యంతమవుతున్నారు. అమరుల స్ఫూర్తితో పోరాడాలికడప ఎడ్యుకేషన్ : భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి అమర వీరుల స్ఫూర్తితో విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం కోటిరెడ్డి సర్కిల్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లకు నివాళిగా కాగడాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆయన హాజరై మాట్లాడుతూ త్యాగధనుల స్ఫూర్తితో సంపాదించుకున్న హక్కులను, ఆస్తులను, ప్రజాధనాన్ని బీజేపీ కార్పొరేట్ మిత్రులకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, అకిరానంద్ , తేజ, శరత్, ప్రభాకర్, వెంకటశివ, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కడప అర్బన్ : చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో భాకరాపేట (విశ్వనాథపురం)లో నివాసం ఉంటున్న గంగాధర్ (40) అనే వ్యక్తి ఓ వడ్డీవ్యాపారి వేధింపులను భరించలేక ఆదివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్ని ంచాడు. తాను ఇవ్వాల్సిన బాకీ కంటే పదిరెట్లు వడ్డీగా చెల్లించినా, ఇంకా డబ్బులను ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో ఈ చర్యకు పాల్పడ్డాడని అతని భార్య, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితుడు రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బైకును ఢీకొన్న కారు
దువ్వూరు : మండలంలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై టంగుటూరు మెట్ట వద్ద ఆదివారం కారు–బైక్ ఢీకొన్న సంఘటనలో బైక్ నడుపుతున్న తలారి దానం (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన తలారి దానం పని మీద నంద్యాల జిల్లా చాగలమర్రికి వెళుతుండగా కడప – కర్నూలు జాతీయ రహదారిపై టంగుటూరు మెట్ట వద్దకు రాగానే.. కడప నుంచి కర్నూలుకు వెళుతున్న కారు వెనుక నుంచి అతివేగంగా బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న తలారి దానంకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. మృతుడు వ్యవసాయ పనులకు కూలిగా వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో మాకెవరు దిక్కు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. రిమ్స్ మార్చురీలో మహిళ మృతదేహంకడప అర్బన్ : కడప రిమ్స్లో గుర్తు తెలియని మహిళ (45) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈనెల 22వ తేదీ వరకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమె మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. సంబంధీకులు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అఽధికారులు తెలిపారు.వ్యక్తి మృతి -
పట్టు నిలుపుకున్న మున్సిపల్ చైర్పర్సన్
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఎట్టకేలకు పట్టు సాధించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చైర్పర్సన్ వద్దకు వచ్చి చర్చించిన అనంతరం యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ముందుగా సూచించిన ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కమిషనర్తో పాటు అధికారులెవరూ రాకుండా ఆమెను అవమానించారు. కనీసం ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం కోరం ఉన్నా కమిషనర్ రాకపోవడంతో సమావేశం జరగలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారని గమనించిన చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేయడంతో పాటు తమ దీక్షను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో నిరసన దీక్ష చేస్తున్న చైర్పర్సన్ వద్దకు వచ్చారు. ఎందుకు కౌన్సిల్ సమావేశానికి రాలేదని ఆమె కమిషనర్ను ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేదని కమిషనర్ చెప్పగా, మీరు లేని పక్షంలో మీ స్థానంలో మరొక అధికారిని నియమించి కౌన్సిల్ సమావేశాన్ని యథావిధిగా నిర్వహించవచ్చనే ఆదేశాలు ఉన్నాయి కదా అని సభ్యులు అడిగారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఎలా చెబితే అలా చేస్తారా అని ప్రశ్నించారు. చైర్పర్సన్కు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సర్వాధికారాలు ఉన్నాయని వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా అన్నారు. కేవలం ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే మీరు చెప్పా పెట్టకుండా సమావేశానికి గైర్హాజరయ్యారని తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని మరోమారు ఇలా జరగకుండా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు నిరసన దీక్ష విరమించారు. ఈ సమస్యపై చైర్పర్సన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేశారు. పరిస్థితి సద్దుమణగడంతో సమస్య పరిష్కారమైంది.నేడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం -
స్పోర్ట్స్ అకాడమీకి గ్రహణం
పులివెందుల టౌన్: పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీకి చంద్ర గ్రహణం పట్టుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) నిధులతో 12.86 ఎకరాలలో 12 రకాల క్రీడాంశాలకు సంబంధించి వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. 2023 జులైలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. హాకీ, ఆర్చరీ బ్లాక్లలో క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఎంతో ఉన్నతంగా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక చొరవ తీసుకుని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కూటమి అధికారంలోకి రాగానే అకాడమీలో క్రీడలకు మంగళం పాడారు. దాదాపు రూ.30 కోట్లతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పోతోంది. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడటం లేదు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి 22 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో వారు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. జీతాలు అందకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం క్రీడా ప్రాంగణంలో క్రీడలను ప్రోత్సహించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు. రూ.26.12 కోట్లతో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే కరువు 22 నెలలుగా సిబ్బందికి అందని జీతాలు అందుబాటులో అధునాతన భవనాలు పులివెందులలో హాకీ క్రీడామైదానం క్రీడాకారులు రాణించేందుకు ఎంతో అనువుగా ఉంది. ఇక్కడ అధునాతన భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తే క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించవచ్చు. – శంకర్, హాకీ అకాడమి హెడ్ కోచ్, అనంతపురం అకాడమీని కొనసాగిస్తే ఎంతో మేలు పులివెందులలో ఉన్న హాకీ అకాడమిని కొనసాగిస్తే ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారు. హాకీ క్రీడామైదానం పులివెందులలో చాలా బాగుంది. ఇక్కడ ఆడుతుంటే బాగా క్రీడలో ప్రాక్టీస్ అవుతుంది. మా కోచ్ బాగా శిక్షణ ఇస్తున్నాడు. – షాలిని, హాకీ క్రీడాకారిణి, ఆర్డీటీ, అనంతపురం -
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
పులివెందుల: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో జిల్లా మేనేజరు, టీం లీడర్, ఆఫీస్ అసోసియేట్, ఆరోగ్యమిత్ర, సీసీడీఈఓ గత 17 ఏళ్లుగా పరిష్కారం చూపని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధులను బహిష్కరించి అన్ని జిల్లాల్లోని జిల్లా సమన్వయకర్త డీసీ ఆఫీసుల వద్ద నిరసన తెలుపుతున్నారని ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్ర యూనియన్ కమిటీ సభ్యుడు నాగార్జునరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి సంబంధించిన 17 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి కేటగిరి 1 డీపీఓ క్యాడరు అమలు, కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఉద్యోగి చనిపోయిన కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియో, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజీ కల్పించాలన్నారు. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో పని చేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారానికి విధు లను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో అటు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇటు సిబ్బంది వైద్యం అందించడం లేదు. దీంతో ఉచిత ‘వైద్య సేవ’ గాలిలో దీపంలా మారింది. ● ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది ఆందోళన ● నేడు వైద్య సేవలు బంద్ ● 27న కూడా నిరసన.. విధుల బహిష్కరణ ● అటు ‘వైద్య సేవ’ సిబ్బంది.. ఇటు ‘పేదలఉచిత వైద్యం’ను పట్టించుకోని ప్రభుత్వం -
దెబ్బతిన్న అరటి తోటలను నేడు వైఎస్ జగన్ పరిశీలన
పులివెందుల: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంలో అరటి తోటలను పరిశీలిస్తారు. తాజాగా తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడతారు. అనంతరం వేంపల్లెలో జెడ్పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ‘ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేడు గోవిందమాంబ ఆరాధన మహోత్సవం బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రభోదకర్త మద్విరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఫిట్పర్సన్ శంకర్బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేయనున్నారు. అమ్మవారికి చీరె, సారె తదితరాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నుంచి దాదాపు 200 మంది మహిళలు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. 29న తాళ్లపాకలో నాటక ప్రదర్శనలు రాజంపేట టౌన్: అన్నమయ్య 522వ వర్ధతిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో ఉచితంగా నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజంపేట అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాటకాల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూ జీకేవై పథకం ద్వారా సీ–డ్యాప్ సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు నాలుగు నెలల కాలవ్యవధిలో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో కంప్యూటర్ హార్డ్వేర్కు పదవ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు ఇంటర్ లేదా డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉత్తీర్ణత, జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్ ఇంటర్ ఉత్తీర్ణత, బ్యూటీ థెరపీకి పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు ఈ శిక్షణ కోర్సులకు అర్హులన్నారు. అదనంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9063082227, 9966448807 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఉచితం మాటున ఇసుక దోపిడీ
సాక్షి టాస్క్పోర్స్ : ప్రకృతి సంపద అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది. రూ. లక్షల్లో కాసులు కురిపిస్తుండటంతో నిబంధనలు ఇసుకలో తొక్కేస్తున్నారు. ఇసుక రీచ్లు ఏర్పాటు చేసుకొని చిత్రావతి నది నుంచి ట్రాక్టర్లతో ఇసుక పాయింట్ వద్దకు కూలీలతో తోలే విధంగా అనుమతులు ఉన్నాయి. అయితే వాటిని పక్కన పెట్టి నదిలోనే ఇటాచీలతో నేరుగా తోలుకుంటున్నారు. స్టాక్ పాయింట్లను అనువుగా మార్చుకుని దందాకు తెర తీశారు. రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొండాపురం మండలంలోని ఇసుక రీచ్లలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉచితం మాటున కొందరు టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇష్టారాజ్యంగా ఇసును ఇటాచీలతో తవ్వి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుకను తీసుకొచ్చింది. ఇదే కొందరు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. చిత్రావతి నది నుంచి ఒక టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు తీసుకొని అక్రమంగా జోరుగా ఇసుకను తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద బిల్లులు ఇచ్చే సిబ్బంది లేరు. ఇదే అదనుగా చిత్రావతి నది నుంచి అధికారుల అండతో పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు అక్రమంగా తరలిస్తున్నారు. చిత్రావతి నది నుంచి కూలీలతో తోలకుండా యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. యథేచ్ఛగా టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు -
నేటి ఆందోళనకు మద్దతు తెలపాలి
పాత కలెక్టరేట్లోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం విధుల బహిష్కరించి, శాంతియుత నిరసన తెలుపుతున్నాం. అలాగే 27న మంగళగిరిలోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి, నిరసన తెలుపుతున్నాం. మేము చేసే న్యాయ పోరాటానికి అందరూ మద్దతు తెలపాలి. – విజయ్, జిల్లా అధ్యక్షుడు, ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ -
మొబైల్ షాపు దగ్ధం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు బహుదూర్ బాషాకు చెందిన బీఆర్ మొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.15–20 లక్షలు దాకా నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్రెడ్డి పరిశీలించారు. వివరాలు ఇలా.. తిప్పలూరు గ్రామానికి చెందిన బహుదూర్ బాషా గత కొన్నేళ్లుగా సెల్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై షాపు యజమాని బహుదూర్ బాషాకు సమాచారం అందించారు. వెంటనే అతను షాపు వద్దకు చేరుకుని షెట్టర్ తెరవగా లోపల ఉన్న సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువులు కాలి బూడిదై ఉన్నాయి. ఇటీవలే సుమారు రూ.15 లక్షలు విలువ గల వివిధ వస్తువులు కొనుగోలు చేసి షాపులో ఉంచారు. మొత్తం రూ.20 లక్షలు విలువ చేసే వస్తువులు దుకాణంలో ఉన్నాయి. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలోని వస్తువులన్నీ కాలిపోయాయి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు సహకరించారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన స్థలాన్ని సీఐ నరేష్బాబు పరిశీలించి బాధితుడితో మాట్లాడారు. అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకునానరు. బాధితుడికి పార్టీ తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పెన్నా రషీద్, మహ్మద్గౌస్, మహమ్మద్ ఆలీతో పాటు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జయరామక్రిష్ణారెడ్డి. కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.సూమారు రూ.15–20 లక్షలు నష్టం -
● ఒక రోజు విధుల బహిష్కరణకే రోగులకు ఇక్కట్లు
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద వైద్య మిత్రల నిరసన (ఫైల్) పుష్పగిరి హాస్పిటల్లో వైద్య మిత్ర కౌంటర్ వద్ద వేచి ఉన్న రోగులు, వారి సహాయకులు (ఫైల్) కడప రూరల్: ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో పని చేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మచ్చుకై నా చొరవ చూపడం లేదు. దీంతో ఉద్యోగులు దశల వారీగా విధుల బహిష్కరణ..శాంతి యుత నిరసనలను తెలుపుతున్నారు. అటు వైద్య సేవలో పని చేస్తున్న ఉద్యోగులను, ఇటు వైద్య సేవలకు ఆటంకం ఏర్పడితే పేదలు ఎదుర్కొనే సమస్యలను కూటమి పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగ భద్రత కోసం... టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతోనే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరును మార్చారు. కాగా పేరు మార్పుతోపాటు పథకంలో కూడా అనూహ్యమైన మార్పులను తీసుకు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని.. రాష్ట్రంలో కూడా తీసుకు వచ్చి ఆ పథకానికి బీమాను అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. దీంతో ఏళ్ల తరబడి ఆరోగ్యశ్రీని నమ్ముకుని పని చేస్తున్న ఆరోగ్యమిత్రల్లో (నేడు వైద్య మిత్రలు) ఆందోళన మొదలైంది. ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పరిధిలోకి వెళితే.. ఆ సంస్థకు చెందిన వారు తమను తీసివేసి మరొకరిని నియమిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఈ వైద్య సేవలు బీమా పరిధిలోకి వెళితే వ్యాధుల సంఖ్యతోపాటే ప్యాకేజీ గణనీయంగా తగ్గనుంది. దీంతో ఆరోగ్యశ్రీలో ఉండే ప్రయోజనాలు, బీమా వల్ల వచ్చే ఉపయోగాలు ఏమాత్రం ఉండవన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సమస్యలు పరిష్కారం కానందున.. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్య మిత్రలు, తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరవధికంగా సమ్మెకు వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 2024 నవంబరు 13వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈఓ డాక్టర్ డి.లక్ష్మిషాతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఏమాత్రం కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా సీఈఓ లక్ష్మిషా కొన్ని రోజులు ఆగాలని చెప్పడంతో ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది ఓపిక పట్టారు. నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో.. మళ్లీ ఆందోళన బాట పట్టడానికి శ్రీకారం చుట్టారు. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’లో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు కీలకమైన విధులను నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను ‘వైద్య మిత్ర’లు తెలుసుకుంటారు. అర్హులైన వారి పేరును ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తరువాత ఆ వ్యాధిగ్రస్తుడిని వైద్య పరీక్షల కోసం వైద్యుడి వద్దకు తీసుకెళ్తారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు ఇచ్చి ఔట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారు. సర్జరీ లాంటి వైద్యం అవసరం అయితే ఇన్ పేషెంట్గా చేర్చుకుంటారు. తరువాత ఆ వ్యాధిగ్రస్తుడు డిశ్చార్జ్ అయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతలను ‘వైద్య మిత్ర’లే చూసుకుంటారు. ఈ నెల 17వ తేదీన (సోమవారం) వైద్యమిత్రలు ఒక రోజు నిధులను బహిష్కించి, నూతన కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కాగా ఈ ఒక్క రోజు వైద్య మిత్రలు విధులను బహిష్కరించినందుకే పేదలైన రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వైద్య మిత్రల రోల్ను ఆసుపత్రులకే అప్పగించింది. అయినా కూడా ఆ రోజు వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులకు ఏ మాత్రం వైద్యం అందలేదు. అత్యవసరమైన ఇన్ పేషెంట్స్ రోగులను చేర్చుకుంటామని ఆసుపత్రుల సిబ్బంది చెప్పినా అది ఆచరణ సాధ్యం కాలేదు. ఇక ఓపీ (ఔట్ పేషెంట్స్)ను అయితే కనీసం పరీక్షించలేదు. దీంతో అస్వస్థతకు గురైన వారంతా చాలా.. చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంత మందైతే ఓపీ కింద డాక్టర్కు ఫీజులు చెల్లించి చూపించుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ అధికారులతోపాటు ప్రభుత్వం సైతం ‘అంతా బాగానే ఉందని’ చెప్పుకోవడం గమనార్హం. మళ్లీ సోమవారం వైద్య మిత్రలు విధులను బహిష్కరించి, నిరసన తెలపనున్నారు. -
రామా.. సామాన్యుల బాధ కనుమా!
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇక్కడ ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకఘట్టం ఏప్రిల్ 11న జరిగే దాశరథి కల్యాణం. కల్యాణం కనులారా తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దరిచేరేలా ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుందనేది వేచిచూడాల్సిందే. వీవీఐపీ, వీఐపీలకే పెద్దపీట వేసే క్రమంలో.. కల్యాణ వీక్షణకు వీవీఐపీ, వీఐపీలకు పెద్దపీట వేసే క్రమంలో సామాన్య భక్తులను దూరం చేస్తోందన్న అపవాదును టీటీడీ మూటకట్టుకోవాల్సి వస్తుంది. సామాన్య భక్తులు కూడా కనులారా వీక్షించే సౌకర్యం కల్పించాలని వినతులు వస్తున్నాయి. కనీసం కల్యాణం తర్వాత ఉత్సవమూర్తులను దగ్గ్గరగా దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ● సామాన్య భక్తుల గ్యాలరీలు ఉన్నప్పటికీ, అవి కల్యాణ వేదికకు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ఎల్ఈడీ స్క్రీన్లో మాత్రమే చూడాల్సి వస్తోంది. కేవలం కల్యాణ వేదికలో ఉన్నామన్న భావనతో ఉండాల్సి వస్తోంది. ఈ సారి 60 గ్యాలరీలు ఏర్పాటు చేయాలనే భావనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. భక్తులు మధ్యాహ్నం 2 నుంచి గ్యాలరీకి చేరుకుంటారు. ఈ ఏడాది భానుడి ప్రతాపం అధికంగా ఉంటోంది. కాబట్టి సౌకర్యాల కల్పనలో ఎలాంటి తప్పిదాలు తలెత్తినా.. టీటీడీ మరోసారి నిందలు మోయాల్సి వస్తుంది. ప్రసాదాల కోసం పడరాని పాట్లు రాములోరి కల్యాణం వీక్షించేందుకు వచ్చే సామాన్య భక్తులకు టీటీడీ అందజేసే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాల విషయంలో ఎప్పుడూ తోపులాటలు జరుగుతున్నాయి. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు.. టీటీడీ గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూలు రెండు (25 గ్రాములు) ఇచ్చేందుకు టీటీడీ యోచిస్తున్నట్లు తెలిసింది. పంపిణీ కౌంటర్ల విషయంలో గందరగోళం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. గతంలో కన్నా అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ నిమగ్నం కావాలి. అలా చేస్తే.. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ●సర్వాంగ సుందరంగా.. వచ్చే నెల 11న రాములోరి కల్యాణం సామాన్య భక్తులకు కనిపించని భాగ్యం టీటీడీకి సవాల్గా మారనున్న పరిస్థితి కల్యాణ వేదికను పుష్పాలు, ఫలాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యానవన విభాగానికి ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. అందుకు సంబంధించి సన్నద్ధం కావాలని టీటీడీ ఆదేశించినట్లు సమాచారం. కడప–రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన ఖాళీ స్థలంలో రూ.40 లక్షలతో ప్రధాన కల్యాణ వేదిక నిర్మించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి శాశ్వత పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రూ.45 కోట్లతో కలశం ఆకృతితో నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. తొలివిడతలో రూ.17 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కల్యాణవేదిక రహదారి, ముఖద్వారాలు, జాంబవంతుని విగ్రహం, పలు సౌకర్యాలకు రూ.28 కోట్లకు పైగా వ్యయం చేశారు. -
కారు ఉంది.. టైర్లు మాయం
జమ్మలమడుగు : ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంటే చాలు రాత్రికి రాత్రే వాహనాలకు సంబంధించిన ఏ విడి భాగాలు మాయం అయిపోతాయో అన్న భయం ప్రజల్లో మొదలైంది. పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న సాయిబాబా దేవాలయం వద్ద అజీజ్ అనే ఉపాధ్యాయుడు షిఫ్టు డిజైర్ వాహనాన్ని పార్కింగ్ చేసి ఉంచాడు. ఆదివారం తెల్లవారుజామున వాహనానికి సంబంధించిన నాలుగు టైర్లు డిస్కులతో సహా ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరిగిపోతున్న దొంగతనాలు.. పట్టణంలోని ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న కెనరా బ్యాంక్లో పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి సావిత్రి అనే మహిళ నాలుగు తులాల బంగారం దొంగలు దొంగిలించారు. అలాగే టెక్కాయ చేనువీధిలో పట్టపగలే ఇంటిముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఎత్తుకుని పోయారు. మండల పరిధిలోని పర్యాటక కేంద్రంలో పర్యాటకులకు చెందిన వస్తువులు దొంగిలించారు. అంబవరం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు, మోటార్లు, ఇంటి వాకిళ్లు, కిటికీలు, గేట్లు ఎత్తుకుపోతున్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుంటున్నారే తప్ప వాటిని రికవరీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. -
మైదుకూరు జాతరలో అపశ్రుతి
మైదుకూరు : మైదుకూరులో ఆదివారం జరిగిన జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పెద్దమ్మతల్లిని ఊరేగింపుగా గద్దె వద్దకు తీసుకు వస్తున్న సమయంలో బాణసంచా పేలి చరణ్ తేజ అనే 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాణసంచా పేలడంతో బాలుడి పొట్టపైన, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు భయంతో పరుగెత్తి డ్రైనేజీలో పడి గాయపడ్డారు. గాయపడిన బాలుడు చరణ్ తేజకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి కడపకు తరలించారు. ఆదివారం రాత్రి కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడికి శస్త్ర చికిత్స జరిగింది. జాతరలో బాణసంచా పేల్చేందుకు నిపుణులను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ సంఘటన జరిగిందని పలువురు అంటున్నారు. జాతరలో పెద్ద ఎత్తున శబ్దం వచ్చే బాణసంచా పేల్చడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం కడప అర్బన్ : నిత్యం పని ఒత్తిడిలో ఉండే న్యాయశాఖ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే న్యాయశాఖ ఉద్యోగులకు ఇలాంటి ఆటల పోటీలు ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించేందుకు ఆస్కారం లభిస్తుందన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబాఫకృద్దీన్, అదనపు న్యాయమూర్తి రామారావు, ప్రభుత్వ న్యాయవాది శివ శంకర్ రెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎస్. జిలానిబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.బాణసంచా పేలి బాలుడికి తీవ్ర గాయాలుజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి -
‘శుభకార్యం’పై విచారణ
సాక్షి టాస్క్ఫోర్స్: ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే వచ్చిన అతిథులకు పది కాలాల పాటు గుర్తుండి పోయేలా కార్యక్రమాలను చేపట్టడం సాధారణ విషయమే. అలాగే శుభకార్యమంటే ఊరికనే జరిగిపోదు. ఏర్పాట్లు ఘనంగా ఉండాలంటే.. అందుకు సరిపడా బడ్జెడ్ కావాలి. కాగా ఆయన ప్రధాన విభాగానికి చెందిన కీలక అధికారి. తన ఇంట్లో జరిగే కార్యక్రమానికి సిబ్బందికి నిధుల సేకరణతోపాటు విధులను కేటాయించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు అందిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘డ్యూటీ చార్టు’ సిద్ధం చేసి.. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలకమైన విభాగాలు ఉన్నాయి. అందులో అదొక విభాగానికి చెందిన జిల్లా కార్యాలయం. ఆ విభాగానికి చెందిన అధికారి ఇటీవల ఒక శుభకార్యం(వివాహ వేడుక) నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు. స్థాయికి తగ్గట్టే శుభకార్యక్రమాన్ని బాగా నిర్వహించారని హాజరైన అతిథులంతా మెచ్చుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. ఈ శుభకార్యక్రమం నిర్వహణపై ఇప్పుడొక సమస్య వచ్చింది. ఈ కార్యక్రమం నిర్వహణ తీరుపై ఎవరో సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం)కు ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారంటే.. ఈ కార్యక్రమం నిర్వహణకు ఆ అధికారే స్వయంగా ఒక జాబితాను తయారు చేశారు. ఫంక్షన్ హాల్, కేటరింగ్, ఇతర పనుల ఖర్చుల బాధ్యతను ఒక్కొక్కరికి కేటాయించారు. అలాగే కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఆహ్వానం పలకడంతోపాటు ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కూడా తన కింద పని చేసే సిబ్బందికి బాధ్యతలు (డ్యూటీ) అప్పగించారు. అలా నిధులు.. విధులను చేపట్టే వారి జాబితాను ఆ అధికారి ‘డ్యూటీ చార్ట్’లా తయారు చేసి సంతకం కూడా పెట్టినట్లుగా సమాచారం. ఈ అంశాలను ఎవరో సీఎంఓకు ఫిర్యాదు చేశారు. దీంతో గడిచిన శనివారం నుంచి సీఎంఓ నుంచి ఇక్కడి కార్యాలయంలో పని చేసే సిబ్బందికి ఫోన్లు చేసి, వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఆ శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. నిధులు.. విధుల కేటాయింపులు ఓ విభాగం వైద్యాధికారి నిర్వాకం సీఎంఓ నుంచి వివరాల సేకరణ -
పది పరీక్షకు 4326 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కంపోసిట్ కోర్సు), ఏఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1(సంస్కృతం, అరబిక్, పర్శియస్) పరీక్షలు జిల్లావ్యాప్తంగా 99 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. 4346 మంది విద్యార్థులకుగాను 4326 మంది హాజరుకాగా 20 మంది గైర్హాజరయినట్లు డీఈఓ షంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 6 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 33 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా తాను మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశానని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని డీఈఓ తెలిపారు. నేడు కడపలో షేర్ మార్కెట్పై ఉచిత సదస్సు కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగరం హరిత హోటల్లో ఆదివారం ఉదయం 11, మధ్యాహ్నం 3, రాత్రి 7 గంటలకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వయిజర్ కె.కృష్ణకై లాస్ ఒక ప్రకటనలో తెలిపారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ ఎలా చేస్తే లాభాలు పొందవచ్చు? అనే అంశాలపై ఆర్థిక రంగంలోని నిపుణుల ద్వారా తెలుసుకుని న్యాయపరంగా ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చనే అంశాలను చర్చిస్తామని పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత నివారణకు కృషి చేద్దాం బద్వేలు అర్బన్: మహిళల్లో రక్తహీనత నివారణకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా గణాంక అధి కారి డాక్టర్ ఎ.రమేష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కొంగలవీడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. జిల్లా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అరుణకుమారి, డీపీఎంఓ నారాయణ, వైద్య సిబ్బంది రాజశేఖర్, జాకోబ్, వెంగయ్య, చంద్రావతి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
●రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్గిరి
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్ చైర్మన్ సీటు మరోసారి వైఎస్సార్సీపీ సొంతం కానుందా... అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పూర్తి సంఖ్యా బలంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా.. బలం లేక టీడీపీ వెనకంజలో ఉంది. కాగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఆదివారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 27న చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రక్రియను కొనసాగించనున్నారు. గురువారం ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1గంటలకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం ఎన్నిక ప్రక్రియను కొనసాగించనున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ సభ్యులు.. జిల్లాలో 50 మంది జెడ్పీటీసీల్లో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జడ్పీ చైర్మన్గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోపవరం జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి మాత్రమే టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా 49 మంది జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికై న వారే. వారిలో రెండు స్థానాలు ఖాళీలతోపాటు, 5మంది పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్ సీపీకి పూర్తి సంఖ్యా బలం వైఎస్సార్సీపీ 42 మంది జెడ్పీటీసీ సభ్యుల బలంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. పార్టీ ఫిరాయించిన 5మంది జెడ్పీటీసీలకు సైతం విప్ జారీ చేయనున్న నేపధ్యంలో వారు కూడా వైఎస్సార్సీపీని బలపర్చేందుకు సన్నద్ధులైనట్లు సమాచారం. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఎన్నికపై వెనుకంజ వేయనున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలా కాకుండా పోటీకి సిద్ధమైతే అభాసుపాలైతామనే భావన కూడా ఆ పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో బలం లేకపోగా, అధికారం ప్రయోగించి చేజిక్కించుకున్న పరిస్థితి కారణంగా ప్రజలల్లో టీడీపీ అభాసుపాలయ్యింది. ఈ పరిస్థితులల్లో కడపలో అలాంటి ప్రయోగం చేయరాదనే దిశ గా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ల మధ్య ఉన్న ఐక్యత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమన్వయం నేపధ్యంలో వైఎస్సార్సీపీ సునాయసంగా చైర్మన్గిరిని కై వసం చేసుకోనున్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. పూర్తి సంఖ్యా బలంతో ఆత్మవిశ్వాసంలో వైఎస్సార్సీపీ నేడే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ! 27న ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కలెక్టర్ సన్నాహాలు అదే రోజు నామినేషన్ స్వీకరణ, చైర్మన్ ఎన్నిక బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్గిరి దక్కనున్నుట్లు వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు. రెండు పర్యాయాలుగా అక్కడి నుంచి జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదివరకే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఆ మేరకు గురు, శుక్రవారాల్లో ఆ పార్టీ నేతలు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జెడ్పీటీసీ సభ్యులతో సైతం సమాలోచనలు చేశారు. చైర్మన్గిరిని కై వసం చేసుకునేందుకు, కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్మన్గిరి స్థానాన్ని పార్టీకి పదిలంగా ఉంచుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
● కవర్లు తొడగడం వల్ల లాభాలు
కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు తీగలు ఉంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా పండు ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా మచ్చ తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి శీలింధ్రనాసినులు సోకకుండా సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడిగిన మామిడికాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. ● మామిడి కాయలకు కవర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది, దీంతోపాటు పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగుమందుల్లో అవశేషాలు పండులో ఉండవు. దీంతో పండు తిన్నవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ● కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించవచ్చు. కాయ పెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై కొనతో ఏర్పడే మచ్చలను నివారించవచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. -
కవర్ చుట్టు.. లాభాలు పట్టు
కడప అగ్రికల్చర్: మామిడి రైతులు కొత్త పంథా ఎన్నుకున్నారు. మంచి దిగుబడి కోసం వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. వీరికి ఉద్యానశాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. జిల్లాలో 9642.43 ఎకరాల్లో మామిడపంట సాగులో ఉంది. మామిడి రైతులు సరైన యాజమాన్య చర్యలు చేపట్టినా పంట సమయంలో పురుగులు తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువసార్లు అధిక డోస్ కలిగిన పురుగుమందులు పిచికారి చేయడం వల్ల పురుగుమందుల అవశేషాలు పండ్లల్లో ఉండి వాటిని తిన్నవారికి క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుగుమందుల వాడకం తగ్గించి నాణ్యమైన పంట చేతికి రావడానికి అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. కవర్లపై గుర్తులు వేసుకోవాలి... మామిడికాయలు అన్ని ఒకే దశలో రావు. కాయలకు కవర్లు తొడిగేటప్పుడు మనం తొడిగిన తేదీలు లేదా నెంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగాం తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయ్యిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవచ్చు. పేపర్తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు.. బయట గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉంది కాయ నాణ్యంగా ఉంటుంది. కవర్ల ఏవిధంగా తొడగాలంటే... కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తోడగాలి. కవర్లు తొడిగేటప్పుడు పురుగులు తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్లు తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి. ఆదాయ వివరాలు ఎకరాకు... ఎకరానికి కవర్లు వాడకుండా నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. ధర టన్నుకు రూ. 25,000 ఉంటుంది. ఇలా రూ. లక్ష ఆదాయం వస్తుంది. కవర్లు తొడిగితే దిగుబడి పెరగడంతోపాటు కాయ నాణ్యత పెరిగి ధర ఎక్కువగా వస్తుంది, దీంతో అదే ఎకరానికి 4.25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్నుకు ధర రూ. 50,000 ఉంటుంది. ఇలా ఎకరాకు సాధారణ ఆదాయంతోపాటు 2,12,500 అధిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. అందుబాటులో సబ్సిడీతో కవర్లు మామిడి పండ్లకు కవర్ల తొడగడం వల్ల నాణ్యమైన కాయలు వస్తాయి. ఈ కవర్ల ధర సాదారణంగా రూ. 2 అయితే 50 శాతం రాయితీతో ఒక కవర్ రూ.1తో అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు. – సుబాషిణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి. వైఎస్సార్జిల్లా. కవర్లు ఎప్పుడు తొడగాలి.. ఎలా తొడగాలి... కవర్లు ఏ దశలో తొడగాలి అనే అంశం చాలా ము ఖ్యం. మరీ లేత దశ అంటే పిందే దశ లేదా గోలీకా య సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండటం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరిగిపోతుంది. ఒకవేళ మరి ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రా ము లు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల త ర్వాత తొడగాలి. అంటే కోడిగుడ్డు లేదా నిమ్మ కా య సైజులో ఉన్నప్పుడు తొడగాలి. కవర్లు తొడిగిన 65–75 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పు డు కవర్లను తొలగించి కాయలను కోసుకోవాలి. రూపాయి ఖర్చుతో ఫల రాజసం మామిడిలో కాయతొలుచు,పండుఈగ పురుగుకు కవర్లతో చెక్ 50 శాతం సబ్సిడీతో అందుబాటులో కవర్లు ప్రతి రైతుకు ఐదెకరాల వరకు అందించనున్న ఉద్యానశాఖ జిల్లాలో 100 హెక్టార్లకు టార్గెట్ ప్రకటించిన ప్రభుత్వం -
కడప ముంగిట!
అరబిక్ వంట.. రంజాన్లో అత్తర్ల గుబాళింపులే కాదు రకరకాల వంటలూ ఘుమఘుమలాడిస్తున్నాయి. పసందైన రుచులతో నోరూరిస్తున్నాయి. అల్ ఫహమ్... అల్ మంది..షవర్మ.. హలీం.. ఇలా ఒకటా రెండా అనేక అరబిక్ వంట లు.. కడప ముంగిట వాలిపోయాయి. రుచుల పంటను ఆస్వాదించమని ఆహారప్రియులను ఆహ్వానిస్తున్నాయి. అసలే రంజాన్.. ఆపై కొత్త వంటకాలు తొంగిచూసిన నేపథ్యంలో సాక్షి సండే స్పెషల్. ఇటీవలి కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వంటకం అల్ ఫహమ్. బొగ్గులపై కాల్చిన కోడి మాంసం కావడంతో రుచి బాగుంటుంది. పైగా నూనెలు.. మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికీ మంచిదన్న కారణంతో ఇప్పుడందరూ ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. కాగా కడప నగరానికి చెందిన జమాల్ వలీ దశాబ్దం పైగా అరబ్ దేశాల్లో వంటమాస్టర్గా పని చేశారు. ఆ అనుభవంతో కడప వాసులకు తొలిసారిగా 2006లో ఫహమ్ను పరిచ యం చేశారు. ప్రస్తుతం ‘మాషా అల్లాహ్’ ఫహం నడుపుతూ 8 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ● రంజాన్ సీజనంతా...రంజైన రుచుల పంట! ● ఆస్వాదిస్తున్న ఆహారప్రియులు కడప కల్చరల్: రంజాన్... మనిషిని మానవత్వంగల పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను అందించే పండుగ. శారీరకంగా, మానసికంగా మనిషిని ఉన్నతుడినిచేసే ఆధ్యాత్మిక వేడుక. ఈ సందర్భంగా మార్కెట్లు, వీధులలో సెంట్లు, అత్తర్ల గుబాళింపులు మనసులను దోచేస్తాయి. ఒక్క సెంట్లు.. అత్తర్లే కాదు.. రంజాన్ అనగానే హలీం.. తదితర పౌష్టికాహారం వంటకాలూ గుర్తుకొస్తాయి. కొన్నేళ్లుగా పలు రకాల అరబిక్ వంటలు కడప ముంగిట వాలిపోయాయి. దాదాపు రెండేళ్లకో సారి ప్రత్యేకమైన అరేబియన్ వంటకం పరిచయం అవుతుండడం విశేషం. అల్ ఫహమ్... -
పెళ్లికి పిలవడానికి వచ్చి చోరీ
ఎర్రగుంట్ల : పట్టణంలోని 12వ వార్డులో నివాసం ఉండే మహుబూబీని పెళ్లికి పిలవడానికి వచ్చి ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు కొత్తపల్లి ఖాసీంపీరాను అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. శనివారం కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఖాజీపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఖాసీంపీరా చెడు వ్యసానాలకు లోనై అప్పులు చేశాడు. ఇతను చాలా ఏళ్లుగా మట్కా బెట్టింగ్, అప్పులు అధికంగా చేశాడు. ఎలాగైన తెచ్చిన అప్పులు కట్టడం కోసం అడ్డ దారిలో డబ్బు కోసం ముసలి వారిని టార్గెట్ చేసుకున్నాడు. వారితో పరిచయం చేసుకుంటూ మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కుని పారిపోతుంటాడని చెప్పారు. ఇలా ఖాసీంపీరాపై పలు కేసులు ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఈ నెల 9వ తేదీన కడప పాత బస్టాండ్ దగ్గర నుంచి ఆటో తీసుకుని వల్లూరు, కమాలపురం, ఎర్రగుంట్లకు వచ్చాడు. యర్రగుంట్ల పట్టణంలోని పోలీస్స్టేషన్ వెనుక ఉన్న మహుబూబీ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి నిద్రలేపాడు. నేను మీ కోడలి బంధువు అని నమ్మించాడు. మా పాపాకు పెళ్లి చేస్తున్నాం.. అందరూ పెళ్లికి రావాలన్నాడు. పెళ్లికి కూతురికి మీ చేతికి ఉన్న ఉంగరంను అదే సైజులో చేయించాలి. మీ ఉంగరం ఇస్తే బయట ఆటోలు కూర్చోని ఉన్న వారికి చూపించి వస్తాను అని చెప్పాడు. దీంతో మహుబూబీ నమ్మి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీసి ఇచ్చింది. ఆ ఉంగరం తీసుకొని ఖాసీంపీరా అక్కడ నుంచి ఊడాయించాడు. దీంతో బాధితురాలు మహూబూబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఖాసీంపీరాను ఎర్రగుంట్లలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
జాతీయ డ్రైవర్ల కమిషన్ ఏర్పాటు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : డ్రైవర్లు వారి కుటుంబాల రక్షణ, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ డ్రైవర్ల కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆలిండియా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్బాష, కడప ఇన్చార్జి అయ్యప్ప కోరారు. అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రహదారులపై డ్రైవర్లకు రోజురోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారుల వేధింపులు అధికమవుతున్నాయన్నారు. అనుకోని రీతిలో అకాల ప్రమాదాల బారిన పడితే తమ కుటుంబాలను ఆదుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 30 కోట్ల మంది డ్రైవర్లుగా పనిచేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తులుగా ఉన్నారని పేర్కొన్నారు. విలువైన సేవలు అందిస్తున్న తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా జాతీయ డ్రైవర్ల కమిషన్ను ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎస్.మహమ్మద్బాష, లింగమూర్తి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్పై చర్యలు చేపట్టాలి – ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరయ్యపై సత్వరమే చర్యలు చేపట్టాలని వేంపల్లె టీడీపీ నాయకుడు శేషయ్యతో పాటు కార్యాలయ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, శశిధర్రెడ్డి, శేషారెడ్డి, వెంకటేశ్, రాజశేఖర్రెడ్డి, నాగేష్రెడ్డి, గంగయ్య, వాసుదేవారెడ్డి తదితరులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కడపలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ డీఐజీ వీఎస్ఆర్ ప్రసాద్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థన మేరకు వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకునేందుకు డీఐజీ హామీ ఇవ్వడంపై ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఇతనిపై గతంలో కూడా ఫిర్యాదు చేయగా, విచారణలు సైతం జరిగాయన్నారు. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్పై డీఐజీ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. -
ఇష్టానుసారంగా తవ్వకాలు
నాకు 2.5 ఎకరాల పొలం చెరువు దగ్గర ఉంది. వరి సాగుచేస్తున్నాను. చెరువులో మట్టిని ఇష్టం వచ్చినట్లు తోడేస్తున్నారు. 15 అడుగుల లోతు మట్టిని తీసుస్తున్నారు. చెరువు ధ్వంసం అవుతోంది. చెరువుకు నీరు వచ్చినా నిల్వ ఉండదు. బోర్లకు నీరు రాదు. రైతులకు తీరని నష్టం కలుగుతుంది. – బుక్కే హేమలా నాయక్, నాగసానిపల్లె ఎస్టీకాలనీ చెరువులో మట్టిపోతే నీరు కష్టం నాకు చెరువు కింద ఎకరా పొలం ఉంది. వరి సాగుచేస్తున్నాను. ఇంత లోతుగా మట్టిని తీస్తే తూముకు నీరు చేరెదేప్పుడు.. కాలువకు నీరు వచ్చేదెప్పుడు?. బోరునుంచి నీరు వచ్చేలా కనిపించడం లేదు. మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలి. – బాబా నాయక్, నాగసానిపల్లె ఎస్టీకాలనీ చెరువు దెబ్బతింటే రైతులేంకావాలి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని చెరువు నుంచి తోడేస్తున్నారు.. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. చెరువు మా గ్రామానికి అవసరం. రోడ్డు కోసం మట్టి కావాలంటే కొండల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి తీసుకోవచ్చు.. చెరువు దెబ్బతింటే రైతులంతా ఎంకావాలి.. మట్టిని తరలిస్తే ఓప్పుకునేది లేదు. – బలరామ్ నాయక్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్టీకాలనీ అనుమతులు తీసుకున్నాం నాగసానిపల్లి చెరువు నుంచి జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాం.. రెండు లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టిని తీసుకెళ్లవచ్చు. జాతీయ రహదారి నిర్మాణం కోసమే మట్టిని వాడుతున్నాం, ఇతర అవసరాలకు కాదు. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా మట్టిని తీసుకెళుతున్నాం. – జయప్రకాష్, కాంట్రాక్ట్ నిర్వహణ అధికారి -
జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో జిల్లాలోని పలు సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. కడప– రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులకు రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ ఇంతవరకూ ఆ పనులు ప్రారంభించలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు లేవని పనులు ఇంకా ప్రారంభించలేదన్నారు. అలాగే కడప నగరంలో ఉన్న సీపీ బ్రౌన్ లైబ్రరీకి సంబంధించి గత ప్రభుత్వంలో అదనపు గదుల నిర్మాణం కోసం 6.80 కోట్లు మంజూరైందని, ఆ పనులు ఇంకా ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టను టూరిజం కేంద్రంగా మార్చి అక్కడున్న చెరువులో బోట్లను నడపాలని సూచించారు. కడప నగర సుందరీకరణలో భాగంగా బుగ్గవంక చుట్టూ 8 కీ.మీల మేర అప్రోచ్ రోడ్లు వేయాల్సి ఉండగా, ఇప్పటికీ 3 కీ.మీల రోడ్డు మాత్రమే పూర్తయ్యిందని, మిగిలిన రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. కమలాపురం–కడప రహదారిలో పాపాగ్ని నదిపై నిర్మించిన కొత్త వంతెన నిర్మాణం కొంత భాగంగా ఇంకా పెండింగ్లోనే ఉందని, దాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, 9నెలల కాలం గడుస్తున్నా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 12వ పీఆర్సీపై కమిటీ వేసిందని, ఆ కమిటీ రద్దయ్యిందని, కొత్త కమిటీ వేసి 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు, పోలీసులకు ఇవ్వాల్సిన డీఏ, ఐఆర్, జీపీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా ప్రస్తావించానని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒంటిమిట్టను టూరిజం కేంద్రంగా మార్చాలి కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు బుగ్గవంక అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ -
చెరువు మట్టి.. చెరబట్టి
ఖాజీపేట : కొత్త చెరువులు నిర్మించక పోయినా పర్వాలేదు కానీ.. ఉన్న చెరువులకు నష్టం కల్గకుండా అధికారులు చర్యలు తీసుకుంటే చాలని రైతన్నలు అంటున్నారు. పూర్వం నిర్మించిన చెరువులను రోడ్డు నిర్మాణం కోసం అనుమతులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు కాంట్రాక్టర్లు చెరువును తవ్వేస్తూ ధ్వంసం చేస్తున్నారు.. ఫలితంగా మా చెరువును కాపాడండి మహాప్రభో అంటూ నాగసానిపల్లె రైతులు ఆందోళన చేశారు. అధికారులు పట్టించుకోలేదు. తాజాగా శనివారం ఎస్టీకాలనీ వాసులు చెరువు మట్టిని తరలించకుండా అడ్డుకున్నారు. వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఒండ్రు మట్టిపై కాంట్రాక్టర్ల కన్ను ఖాజీపేట మండలం నాగసానిపల్లె చెరువు పూర్తిగా మంచి ఒండ్రు మట్టితో నిండి ఉంది. ఆ మట్టిపై కొందరు క్రాంట్రాక్టర్లు కన్నెశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్న సాగుచూపి పెద్ద ఎత్తున జేసీబీలు, టిప్పర్ల పెట్టి తవ్వకాలు మొదలు పెట్టారు.. తెల్లవారుజాము నుంచి రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఇలా నాలుగు నెలల నుంచి చెరువు నుంచి మట్టిని తన్నుకుపోతున్నారు. చెరువులో నీరు నిల్వ కష్టమే.. కన్నెలవాగు చెరువులోకి నీరు పూర్తిగా వర్షపాతం వల్ల వస్తుంది. కొండల్లో వర్షం పడితే నీరు చేరుతుంది.. లేక పోతే నీరు వచ్చే అవకాశం లేదు. ప్రతి మూడు లేక నాలుగు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే వర్షం వల్ల చెరువు నిండుతుందని స్థానికులు అంటున్నారు.. చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులుకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే చెరువులో మట్టిని కనిష్ట స్థాయికి తవ్వేస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న చెరువు నుంచి సుమారు 15 అడుగుల లోతు మట్టిని తవ్వేస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తూము మద్ద కంటే చాలా దిగువకు మట్టిని తీస్తున్నారు. చెరువు దిగువన గలుగు రాయి వచ్చే స్థాయికి మట్టిని తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల చెరువులో నీరు నిల్వ ఉండటం కష్టమే అని రైతులు అంటున్నారు. ఒక వేళ నీరు చేరినా తూము పైభాగం వరకు నీరు చేరేది కష్టమే అని రైతులు అంటున్నారు. పైన ఉన్న సారవంతమైన మట్టిని పూర్తిగా తొలగించడం వల్ల నీరు నిల్వ ఉండే అవకాశం లేదంటున్నారు. ఫలితంగా వచ్చిన నీరంతా భూగర్భంలోకి త్వరగా ఇంకిపోతుందని అంటున్నారు.. దీనివల్ల చెరువులో నీరులేక, భూగర్భ జలాలు ఇంకిపోయి రైతుల బోర్లకు నీరు అందని పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. నిబంధనలకు పాతర జాతీయ రహదారి నిర్మిణం కోసం చెరువులో మట్టిని తవ్వుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే నిబంధనలకు పాతర వేశారు. 10 అడుగుల కంటే మించకూడదని, తూము కంటే దిగువకు మట్టిని తియ్యరాదని అంటున్నారు. కానీ 15 అడుగుల లోతు తీసున్నారు. 2లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే అంతకు మించి తవ్వుతున్నారని రైతులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ అవసరాలకు అయితే ఒక క్యూబిక్ మీటరుకు రూ. 50 నుంచి రూ. 60 చెల్లించాలి.. అదే కమర్శియల్ అవసరాలకు అయితే రూ.135 నుంచి 140 చెల్లించాలి.. కానీ ఎంత రాయల్టీ చెల్లించారు.. ఎంత మట్టిని తరలించారు..అనుమతులకు మించి ఎమైనా మట్టిని తవ్వుతున్నారా.. ఎంత వరకు అనుమతులు ఉన్నాయి అని రైతులు అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు కాంట్రాక్టర్లు మాత్రం రాయల్తీ చెల్లించామని, అన్ని అనుముతులు ఉన్నాయని స్థానికులకు చెప్పడం విశేషం. ఐదు రోజులుగా నిరసనలు చెరువులోని మట్టిని తరలించవద్దు అంటూ నాగసానిపల్లెలోని ఎస్టీకాలనీ వాసులు ఐదు రోజుల నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. చెరువు నుంచి మట్టిని తరలించుకు పోయే ప్రధాన రహదారికి అడ్డుగా మట్టి కుప్పలు వేసి అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వచ్చి బెదిరించినా భయపడకుండా మా చెరువు నుంచి మట్టిని తీసుకు పోనివ్వం అని తెగేసి చెబుతున్నారు. పోలీసులతో బెదిరింజులు మట్టిని తరలించుకునేందుకు అవకాశం కల్పించక పోతే మీపై కేసులు పెడతామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అయితే మీకు మట్టి కావాలంటే ఎక్కడ నుంచైనా తీసుకోవచ్చు.. మా భూములకు నీరు కావాలంటే ఎలా వస్తుందని రైతులు కాంట్రాక్టర్లను గ్రామస్తులు ప్రశ్నంచారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను పంపించారు. మీపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. దారి వదలక పోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. కేసులకు భయపడేది లేదని భూములు పోతే మా బతుకు పోతుందని నిరసన కొనసాగిస్తునామన్నారు. పంటలు దెబ్బతింటున్నాయి చెరువు నుంచి మట్టిని రోజు తరలించడం వల్ల వచ్చే దుమ్ము వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. నష్టం భరించలేక రైతులు కోపంతో వాహనాలను ఆపి గతంలో రెండు సార్లు ధర్నలు చేశారు. అయితే పంట నష్టం పరిహారం ఇస్తామని చెప్పి నిరసన ఆపించారు. అయితే రైతులకు పరిహారం పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ స్వర్థం కోసం రైతులు నష్టపోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపాటు స్థానిక అవసరాల కోసం రైతులు ఎదైనా మట్టిని తరలిస్తే అధికారులు ఆఘమేఘాలపై స్పందిస్తారు.. వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ ఫెనాల్టీలు వేసి రైతులను ఇబ్బందికి గురిచేస్తారు. అయితే మట్టిని కాంట్రాక్టర్లు తవ్వుకుంటూపోతున్న.. తెలిసి పట్టించుకోక పోవడంపై రైతులు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మట్టిని తరలిస్తున్న విషయం స్థానికులు తహసీల్దార్, పోలీసులు, చిన్ననీటి పారుదల శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించక పోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. నాగసానిపల్లె చెరువులో ఇష్టారాజ్యంగా త్వకాలు నాలుగు నెలలుగా ఇదే తంతు నిబంధనలకు మించి తవ్వకాలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మట్టి తవ్వాకాలను అడ్డుకున్న ఎస్టీకాలనీ వాసులు -
కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : కడప బెంగుళూరు రైల్వే పనులను 20 సంవత్సరాల క్రితం మెదలు పెట్టినప్పటికీ అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు సిఆర్వి ప్రసాద్ అన్నారు. శనివారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ ఆధ్వర్యంలో పబ్బపురం వద్ద కడప బెంగళూరు రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప– బెంగళూరు రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ పూర్తి చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి సాకుగా చూపించి రాష్ట్ర బడ్జెట్ అంత అమరావతి కేటాయించాలని చేడటం దారుణం అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గాని కేంద్రీకరణ చేయాలనుకోవడం సిగ్గు చేటని వారు దుయ్యబట్టారు. కడప బెంగళూరు రైల్వే లైను పూర్తయితే కడప జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండించుకునే ధాన్యాలను కూరగాయలను బెంగళూరు వంటి ప్రాంతాలకు సులువుగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కడప బెంగళూరు రైల్వే పనులను పూర్తిచేయాలని ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రస్తావన చేయకపోవడం దారుణం అన్నారు. రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై న ప్రజాప్రతినిధులు రైల్వే పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుర్రప్ప,అంజి, సుబ్బరాయుడు, జయవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి -
ఆరోగ్య శాఖలో పదోన్నతులు కల్పించండి
కడప కార్పొరేషన్ : వైద్య ఆరోగ్య శాఖలో అన్ని కేడర్లలో ఉన్న ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే. అహరోను కోరారు. శనివారం వైద్య,ఆరోగ్య సంచాలకులు డా. బి.రామ గిడ్డయ్యకు వారు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జోన్లోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, పదోన్నతుల్లో జాప్యాన్ని నివారించాలని కోరారు. అన్ని కేడర్ల సీనియారిటీ జాబితాలను వెంటనే విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఈ మేరకు ముందస్తుగా జాబితాలను విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బాలక్రిష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహులు, సంపత్ కుమార్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు షేక్ బాబా సాహెబ్, కడప జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసుల రెడ్డి, బాషా, వీరేంద్ర రామసుబ్బారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ -
చింతకుంటలో పిడుగు
ముద్దనూరు : మండలంలోని చింతకుంటలో శనివారం ఓ టెంకాయ చెట్టుపై పిడుగు పడింది. సాయంత్రం కురిసిన అకాలవర్షంలో చెట్టుపై పిడుగుపడి పాక్షికంగా దెబ్బతినింది. జనావాసాలకి కొంచెం దగ్గరలోనే ఈ పిడుగు పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే చెట్టుపై పిడుగుపడడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల స్వైర విహారం – ఆరుగురిని కాటేసిన శునకాలు కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలి, ఎల్లారెడ్డిపల్లె గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఆరుగురిని గాయపరిచాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పెద్దచెప్పలితో పాటు ఎల్లారెడ్డిపల్లెలో ఉన్న కుక్కలు మనుషులపై దాడి చేశాయి. ఎల్లారెడ్డిపల్లెకు చెందిన వెంకట లక్షుమ్మ ఇంటి ముందు కసువు ఊడ్చుతుండగా కుక్క వచ్చి కాలు పట్టుకొని కాటేసింది. అలాగే పెద్దచెప్పలిలో ఆడుకుంటున్న చిన్నారులు రెహమాన్, కావేరిపై కుక్కలు దాడి చేశాయి. వారితో పాటు మరో ముగ్గురికి కూడా కుక్కులు కరిచి గాయాలు చేశాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారంతా కమలాపురం సీహెచ్సీకు చేరుకుని వైద్య సేవలు పొందారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువయ్యాయని, వాటిని తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కాగా పెద్దచెప్పలి, ఎల్లారెడ్డిపల్లెకు చెందిన ఆరు మందికి వైద్య సేవలు అందించినట్లు కమలాపురం సీహెచ్సీ వైద్యులు తెలిపారు. -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ తరపున పోలీసు, విజిలెన్స్, ఫైర్, ఇతర విభాగాలలో పనిచేస్తు న్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ‘ఉగాది’ పుర స్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను ఈ ఏడా ది నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున అందుకోనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన వారు ‘ఉగాది పురస్కారాల’ అవా ర్డులకు ప్రకటితమైన వారి వివరాలిలా వున్నాయి. హోంశాఖ పరిధిలోని అన్ని విభాగాల వారిగా అవార్డులు వైఎస్ఆర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి పురస్కారాలు -
మాతా శిశు సంరక్షణే ధ్యేయం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం మాతా శిశు సంరక్షణ కోసం దోహదపడుతోంది. పేద, మధ్యతరగతికి చెందిన గర్భిణులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ పథకాన్ని మొదట 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్వై) పథకంగా ప్రారంభించింది. అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక 2016లో ఈ పథకాన్ని ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా మార్చారు. ఈ పథకం మరింత మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మరిన్ని మార్పులు చేసిన తర్వాత అమలులోకి తీసుకొచ్చారు. పీఎంఎంవీవై ద్వారా అందించే నగదు ప్రోత్సాహాకాల ద్వారా గర్భిణులు, బాలింతల్లో మెరుగైన ఆరోగ్య కల్పనకు, నవజాతా శిశు సంరక్షణకు, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. నమోదు ప్రక్రియను నిరంతరం: జిల్లాలో 13,256 మంది గర్భిణులను నమోదు చేశారు. వీరి అందిరికీ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గర్భిణులకు వర్తింపజేసే విధంగా నమోదు ప్రక్రియను ఆరోగ్య సిబ్బంది నిరంతరం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణుల గుర్తించి వైద్యశాఖ రికార్డుల్లో పొందుపరుస్తున్నారు. దీంతోపాటు గత మూడేళ్లుగా నమోదు చేసుకుని చిన్నారుల తల్లులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పీఎంఎంవీవై పథకానికి అర్హతలు : ● గర్భం దాల్చిన మూడు నెలల్లోపు పీఎంఎంవీవై పథకం కోసం వార్డు, గ్రామ సచివాలయంలోని వెల్నెస్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలి. ● గర్భిణులు తప్పనిసరిగా మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ (ఎంసీపీ) కార్డు కలిగి ఉండాలి. ● 19 సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ● పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రతినెల 9వ తేదీన నిర్వహిస్తున్న పీఎంఎంవీవై శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలి. నగదు చెల్లింపు ఇలా.. ● గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం పూర్తయ్యేలోపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా మూడు విడతల్లో రూ. 5 వేలు చెల్లిస్తుంది. ● మొదటి విడతగా అంగన్వాడీ కేంద్రం లేదా గ్రామ సచివాలయంలో గర్భిణీగా నమోదైన వెంటనే రూ. 1000 లబ్ధిదారునికి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ● ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణ తీసుకున్న గర్భిణికి రెండవ విడతగా రూ. 2 వేలు అందజేస్తారు. ● ప్రసవం అయిన తర్వాత మూడవ విడతగా రూ. 2 వేలు చెల్లిస్తారు. పీఎంఎంవీవై కింద రూ. 5 వేల సాయం గర్భిణులకు మూడు విడతలుగా చెల్లింపు రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టినా పథకం వర్తింపు జిల్లా వ్యాప్తంగా 13256 మంది గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవజాతా శిశువు తల్లుల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన పీఎంఎంవీవై పథకాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినెలా అర్బన్ హెల్త్ సెంటర్లలో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్ణీత సమయంలో వివరాలు నమోదు చేసుకుని పథకం లబ్ధిని పొందాలి. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలకు అవగాహన కల్పిస్తున్నాం. – దేవిరెడ్డి శ్రీలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, కడప విస్తృత ప్రచారం చేస్తున్నాం పీఎంఎంవీవై పథకం ఆవశ్యకత గురించి, గర్భిణులకు కలిగే ప్రయోజనాలపై విరివిగా అవగాహన కల్పిస్తున్నాం. అర్హులందరికీ ఈ పథకం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. గర్భిణులను నమోదు చేసి ప్రతి ఒక్కరికీ ఎంసీపీ కార్డును అందజేస్తున్నాం. – సుజాత, ఏఎన్ఎం, కడప -
విజేతలకు బహుమతులు పంపిణీ
ఒంటిమిట్ట: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంటిమిట్ట ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరం, అటవీ చట్టాల పాత్ర తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ అడవులు వాతావరణ సమతుల్యతను కాపాడతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామ తులసీ, ఎఫ్ఎస్ఓ బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
బెంగళూరులో ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్పై దాడి
కడప కోటిరెడ్డిసర్కిల్ /బనశంకరి : కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరు రాంగ్ రూట్లో వచ్చి ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని ఉప్పారపేటె పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కెంపేగౌడ బస్టాండు టెర్మినల్ –3లో గురువారం రాత్రి 10.30 సమయంలో మైసూరు రోడ్డు డిపో–6 కు చెందిన కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరు హనుమంతు చలవాది బస్ను డిపోలోకి రాంగ్రూట్లో తీసుకెళ్లాడు. డిపోలో పార్కింగ్ స్థలంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రొద్దుటూరు డిపో బస్ ఉండటంతో పక్కకు తీయమని తెలిపారు. ఆ సమయంలో కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, ప్రొద్దుటూరు డిపో డ్రైవరు నరాల రవిశంకర్రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, నరాల రవిశంకర్రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తక్షణం మల్లిగె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉప్పారపేటె పోలీస్ స్టేషన్లో డ్రైవరు నరాల రవిశంకర్రెడ్డి కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాదిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు కేఎస్ఆర్టీసీ డ్రైవరు కమ్ కండక్టర్ హనుమంతు చలవాదిని సస్పెండ్ చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే శుక్రవారం ఆర్టీసీ రీజనల్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పూల నాగరాజు దాడికి గురైన డ్రైవరు నరాల రవిశంకర్రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆస్పత్రి వైద్యం ఖర్చులను ఏపీఎస్ఆర్టీసీ భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత డ్రైవర్ను అన్ని విధాల ఆదుకుంటాం బెంగుళూరు బస్టాండు పాయింట్లో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ ఎన్ఆర్ఎస్ రెడ్డిని అన్ని విధాల ఆదుకుంటామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మీడియాకు వివరించారు. బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ను అలెర్ట్ చేసి బాధిత డ్రైవర్కు అండగా నిలబడాలని సూచించామన్నారు. ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ బెంగుళూరుకు వెళ్లి సమగ్రంగా విషయాలు తెలుసుకున్నారన్నారు. బాధిత డ్రైవర్కు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కడప ఈడీకి సూచించినట్లు వివరించారు. అంతేకాకుండా బాధిత డ్రైవర్ వైద్యానికి సంబంధించి మొత్తం ఖర్చును ఆర్టీసీ సంస్థ భరిస్తుందని ఆర్ఎం తెలియజేశారు. కర్ణాటక డ్రైవర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రాలు వేరైరా అందరూ సోదరభావంతో మెలగాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు. -
మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్ : ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరంగా ఈ దాడులను కొనసాగిస్తున్నారు. కడప నగరంలోని జనతా మెడికల్ స్టోర్ లో విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాధవి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ పర్యవేక్షణలోనే, వారి ప్రిస్కిప్షన్ల మేరకు మాత్రమే నార్కోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందని, అయితే కొంతమంది యువత డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు ట్యాబ్లెట్లు తీసుకొని మత్తులో జోగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. మెడికల్ దుకాణాల్లో మత్తుమందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులను యువత కొనుగోలు చేసి సేవిస్తున్నారన్నారు.. వివిధ కాంబినేషన్లోని మందులు మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు, కొన్ని రకాల జబ్బులు నయమయ్యేమందుకు మాత్రమే వీటిని వినియోగించాల్సి ఉంటుందన్నారు. కొందరు యువత డాక్టర్ అనుమతి లేకుండానే మత్తు టాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. వీటిని సేవించడం వల్ల యువత నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కడపలో జనత మెడికల్ స్టోర్లో తనిఖీలు నిర్వహించామని అయితే ఇక్కడ మందులు కొనుగోలు విక్రయాలు స్టాకు వివరాలపై వ్యత్యాసం ఉందన్నారు. మెడికల్ స్టోర్స్ నిర్వాహకులకు, మెడికల్ రెప్స్కు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ శంకర్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారి బాలగంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. -
● ముచ్చుమర్రి లిఫ్ట్, మైలవరం నుంచి నీరివ్వాలని డిమాండ్
మైదుకూరు, చాపాడు ఛానల్స్కు తెలుగుగంగలో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. వెలుగోడులో 4.4 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ అర టీఎంసీ నీటిని మళ్లిస్తే సరిపోతుందని రైతులు అంటున్నారు. శ్రీశైలం వెనుక జలాల్లో ఏర్పాటు చేసినా ముచ్చు మర్రి లిఫ్ట్ నుంచి 750 క్యూసెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నా సరిపోతుందంటున్నారు. అయితే ముచ్చుమర్రి నుంచి లిఫ్ట్ ద్వారా ఇస్తున్న నీరు నంద్యాల జిల్లా చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి ప్రాంతాలకే సరిపోతుందని అధికారులు అంటున్నా రు. పైగా కుందూ నీటిని మోటార్ల ద్వారా ఎగువ ప్రా ంతరైతులు మళ్లించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారుల అభిప్రాయం. ఇకపోతే కడప, చెన్నూరు ఆయకట్టుకు మైలవరం నీటిని ఆదినిమ్మాయపల్లె ఆ నకట్ట ద్వారా అందించాలని రైతులు కోరుతున్నారు. -
సమర్థవంతమైన పౌరసేవలే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం
– జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు కడప సెవెన్రోడ్స్ : భారతీయ నైతికతలో సమర్థవంతమైన పౌర సేవను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులు ఓర్పు, నేర్పుతో ఉద్యోగ విధులు నిర్వహించే లక్ష్యంతో ‘మిషన్ కర్మయోగి’ ఆన్లైన్ అభ్యాస వేదికను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభాభవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కర్మయోగి పోర్టల్’ నిర్వహణపై అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్వో విశ్వేశ్వర నాయుడు తోపాటు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి హజరతయ్య హాజరై పోర్టల్ నిర్వహణపై పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. మిషన్ కర్మయోగి – నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్పీసీఎస్సీబీ) సివిల్ సర్వీస్ అధికారులకు కర్మయోగి భారత్ పోర్టల్ను భారత ప్రభుత్వం అందిస్తుందన్నారు. మిషన్ కర్మయోగి న్యూ ఇండియా దార్శనికతకు అనుగుణంగా సరైన వైఖరి, నైపుణ్యాలు మరియు జ్ఞానంతో కూడిన భవిష్యత్తు నిర్మాణం కోసం పౌర సేవను నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయన్నారు. అధికారుల భవిష్యత్తును పటిష్టం చేసి దిశగా.. నిరంతరం ఎప్పుడైనా–ఎక్కడైనా నేర్చుకునేలా బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పౌర సేవల సామర్థ్య నిర్మానాత్మక వ్యూహంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కర్మయోగి భారత్ దార్శనికత, భారత పౌర సేవల సామర్థ్య నిర్మాణ దృశ్యాన్ని మార్చడం, తద్వారా అధికారులు భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి, ఎప్పుడైనా–ఎక్కడైనా నిరంతర అభ్యాసాన్ని అనుమతించే బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.కర్మయోగి పోర్టల్ను ప్రతి ఉద్యోగి, అధికారి సీఎఫ్ఎంఎస్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేసుకోవాలన్నారు. మిషన్ కర్మయోగి ప్రభుత్వం–పౌరుల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం, అధికారులు పౌరులకు మరియు వ్యాపారానికి సహాయకులుగా మారడం, ప్రవర్తనా–కార్యాచరణ–డొమైన్ సామర్థ్యాల అభివృద్ధి ద్వారా జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యానికి దారితీస్తుంది. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరనాథ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు!
మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది రాయచోటి: కలెక్టర్ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తున్నట్లు దుండగుల నుంచి ఫోన్ సమాచారం అందింది. వెంటనే విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియపరిచారు. సమాచారం అందగానే జిల్లా బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్లు కలెక్టర్ కార్యాలయంలో అణువణువు గాలింపు చేశాయి. కార్యాలయ సిబ్బంది అంతా ఒక్క మారుగా ఉలికిపాటుకు గురయ్యారు. తీరా ఇదంతా జిల్లా పోలీస్ యంత్రాంగం మాక్ డ్రిల్లో భాగమని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయానికి వస్తే శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వచ్చినపుడు ఎలా స్పందించాలనే దానిపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉద్యోగుల అప్రమత్తత కోసం..... ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడమే మాక్ డ్రిల్ ఉద్దేశమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో రాయచోటి పట్టణ సీఐ చలపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వీజే రామకృష్ణ, సీఐలు, ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
జిల్లా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ
కడప సెవెన్రోడ్స్: జిల్లా పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెంబరు 99 విడుదల చేశారు. ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) యాక్ట్–1974 ఆర్/డబ్ల్యు రూల్–4 ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) రూల్స్–1984 మేరకు ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ద్వారా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్ను జిల్లా గెజిట్లో ప్రచురించి ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానించాలని ఆదేశించారు. 30 రోజుల్లో అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి పంపాలని సూచించారు. వైఎస్ఆర్ సేవలకు గుర్తింపుగా... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేశారు. కడప రిమ్స్, డెంటల్ కళాశాల, యోగి వేమన విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ స్కూలు, ఐటీ కార్ల్, ట్రిపుల్ ఐటీ తదితర ఎన్నో విద్య,వైద్యాలయాలు స్థాపించారు. 2009 సెప్టెంబరు 2వ తేదిన ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నాటి ప్రభుత్వం 2009 అక్టోబరు 5వ తేదిన కడపజిల్లా పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాగా మార్పుచేస్తూ జీఓ విడుదల చేసి అభిప్రాయాలు, అభ్యంతరాలను కోరింది. ఆ తర్వాత 2010 జులై 7వ తేది వైఎస్సార్ జిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెం. 613 జారీ చేసింది. అప్పటి నుంచి వైఎస్సార్జిల్లాగా పిలుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పేరును తొలగించి వైఎస్సార్కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ జారీ చేసింది. -
వైఎస్ జగన్ పర్యటన రద్దు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరులో ఈనెల 23వ తేదీన జరగాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు.నెలరోజులకు రూ.4,55,140 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రశాంతంగా పది పరీక్ష కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 161 సెంటర్స్లో రెగ్యులర్కు సంబంధించి 27924 మంది విద్యార్థులకుగాను 27786 మంది హాజరుకాగా 138 మంది గైర్హాజయ్యారు. అలాగే ప్రైవేటు విద్యార్థులకు 13 మందికిగాను 10 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హారయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా 13 మంది ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 90 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఏకగ్రీవ ఎన్నికరాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పచ్చా హనుమంతునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సీఈవో సురేష్కుమార్, సహాయ ఎన్నికల అధికారి గోవర్ధన్రెడ్డి శుక్రవారం ధ్రు వీకరణపత్రాన్ని అందచేశారు. బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా జాఫర్బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్కుమార్రాజు, న్యాయవాదులు నాసరుద్దీన్, గడికోట రామచంద్రయ్య, రామచంద్రరాజు, నలికిరిరెడ్డయ్య పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయాన్ని అందరి సహకారంతో అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆచార్య ఆల్లం శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు విక్రం సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయన వైవీయూ ఇన్ఛార్జీ వీసీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులతో భేటీ అయ్యారు. డ్రైవర్లతోనే సంస్థ పురోభివృద్ధి కడప కోటిరెడ్డిసర్కిల్: డ్రైవర్ల కారణంగానే ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధిలో పయనించగలదని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డీపీటీఓ కార్యాలయంలో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత ఓం శాంతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన అక్కయ్యలు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం ప్రక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్రెడ్డి మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీకి ప్రమాద రహిత సంస్థగా గుర్తింపు ఉందన్నారు. ఆ గుర్తింపును అలాగే కొనసాగించేందుకు డ్రైవర్లు ప్రధానపాత్ర పోషించాలన్నారు. ప్రయాణీకులను క్షేమకరంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. అనంతరం కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్ పై సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ స్పాట్ పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా నర్సరీలలోనూ, రైతుల పొలాలలోనూ అటవీజాతి మొక్కలను పెంచి సంపదను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్కుమార్ అన్నారు. కడపలోని డీఎఫ్ఓ కార్యాలయంలో శుక్రవారం (మార్చి21)ను నేషనల్ ఫారెస్ట్ డే సందర్భంగా వినీత్ కుమార్ మాట్లాడారు. మొక్కలను నాటడమే కాదు, వాటిని నాటిన తర్వాత ఎదుగుదల గమనించడం ముఖ్యమన్నారు. అడవులను కాపాడడానికి అందరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని నగరవనాలు, ఎకో పార్కుల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఆయన వివరించారు. కడప నగరవనాన్ని రూ. 2 కోట్ల వ్యయంతో.. ప్రొద్దుటూరులో ఎకోపార్క్ను రూ. 84 లక్షలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గండికోట– మైలవరం మధ్యలో వున్న పొన్నతోటలో నగరవనం ఏర్పాటు చేయనున్నామన్నారు. బద్వేల్ పరిధిలో సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలో మరో నగరవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు ‘కడప నేటివ్ ఫారెస్ట్ రెస్టోరేషన్ ప్రాజెక్ట్’పోస్టర్‘ ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్ఓ దివాకర్, బద్వేల్ సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, కడప ఎఫ్ఆర్ఓ ప్రసాద్, పోరుమామిళ్ల ఎఫ్ఆర్ఓ రఘునాథ రెడ్డి , ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. ఆదేశాలు రాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదని ఓ ప్రశ్నకు డీఎఫ్ఓ సమాధానమిచ్చారు. కాశినాయన క్షేత్రం పరిధిలో రిజర్వ్ఫారెస్ట్కు సంబంధించి నిబంధనలను అమలుచేసేందుకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్, కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకే జిల్లా అటవీశాఖ తరఫున చర్యలను మొదలుపెట్టామన్నారు. బస్సులను నిలిపివేయడం, పలుమార్లు కాశినాయన క్షేత్ర ప్రతినిధులు, సిబ్బందితో సంప్రదించామన్నారు. ఇటీవల భవనాల కూల్చివేత తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పునరుద్ధరణకు సంబంధించిన లిఖిత పూర్వకమైన ఆదేశాలు తమ శాఖకు అందలేదని వివరించారు. జిల్లాలో నగరవనం, ఎకో పార్క్ల అభివృద్ధికి కృషి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదు విలేకరుల సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి వినీత్కుమార్ -
పంటలు కాపాడండి సారూ!
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని కేసీ కెనాల్ కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరిచ్చి కాపాడాలని జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా కోరారు. శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ జేష్ఠాది శారద అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల వరకు కేసీ కెనాల్ కింద రైతులు వివిధ పంటలు సాగు చేశారని తెలిపారు. వచ్చేనెల 15వ తేది వరకు సాగు నీరు అందితే తప్ప పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. కొండపేట కాలువ పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఇందుకు కేసీ కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చిన్న పుల్లయ్య బదులిస్తూ కుందూనదిలో నీరున్నంత వరకు కేసీ కెనాల్కు సాగునీరు అందిస్తామన్నారు. వెలుగోడు రిజర్వాయర్లో ప్రస్తుతం 4.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మైలవరం నుంచి నీరు విడుదల చేసే అంశం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరును సంప్రదించాలని సూచించారు. ● వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి మాట్లా డుతూ తమ మండలంలో వివిధ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. బోర్ల డీపెనింగ్, ఫ్లషింగ్, అవసరమైనచోట తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఇంతకుముందు తాగునీటి రవాణాకు సంబంధించిన బిల్లులను ఇంతవరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం గతంలో టెండరు పిలిచారని తెలిపారు. ఫలానా స్థలంలో బస్టాండు నిర్మించాలని కూడా అధికారులు సూచించారన్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి అధికారులు చూపిన స్థలంలో రెండున్నర లక్షలు ఖర్చు చేసి గ్రావెల్ తోలాడని చెప్పారు. తీరా ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు నిర్మించాల్సిన స్థలం అది కాదని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబరు నుంచి దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తామంటోందని, అంతకుమునుపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, పలు మండలాల జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లోసభ్యుల వినతి -
ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలి
ప్రాజెక్టు కమిటీ హామీ మేరకే కేసీ ఆయకట్టు రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలు కాపాడటం కోసం ఏప్రిల్ 15 వరకు నీరివ్వాల్సిన అవసరం ఉంది. కుందూలో నీటి ప్రవాహం ఉంటేనే తాము ఇవ్వగలమంటూ ప్రభుత్వ అధికారులు చెప్పడం తగదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ముచ్చుమర్రి లిఫ్ట్ లేదా వెలుగోడు నుంచి నీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – అచ్చుకట్ల కరీముల్లా, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు, ఖాజీపేట మైలవరం నుంచి నీరివ్వాలి కడప–చెన్నూరు ప్రాంత కేసీ కెనాల్ ఆయకట్టులో సాగు చేసిన పంటలను రక్షించేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మైలవరం రిజర్వాయర్లో అవసరమైన నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి పెన్నా ద్వారా నీటిని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు తీసుకొచ్చి కేసీ ఆయకట్టుకు ఇవ్వాలి. ఈ విషయాన్ని తాము కేసీ కెనాల్ అధికారులను కోరగా, మైలవరం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరు పరిధిలో వస్తుందంటున్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కడప చీఫ్ ఇంజనీరుతో మాట్లాడి మైలవరం నుంచి నీరు విడుదల చేయాలి. – ఎన్.రవిశంకర్రెడ్డి, కార్యదర్శి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, కడప -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
కలసపాడు : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైనదని భారతీ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్లు శ్రీకాంత్రెడ్డి, నాగేంద్ర, సేల్స్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. స్థానిక సీఎంఆర్ కల్యాణ మండపంలో గురువారం బిల్డర్లు, మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతోందన్నారు. అల్ట్రా ఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందని, ఇతర కంపెనీల సిమెంట్కు ఐదు గంటలు పడితే భారతి సిమెంట్ అల్ట్రా ఫాస్ట్ రెండు గంటల్లోనే గట్టి పడుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం వంద మంది మేసీ్త్రలకు రూ.లక్ష విలువ గల ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ వెంకటసుబ్బయ్య, మేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బంగారు కేసులో నిందితుడి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: బంగారు బిస్కెట్ను అతి తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి నకిలీ బంగారాన్ని అంటకట్టిన కేసులో వన్ టౌన్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన గురువారం రాత్రి వన్ టౌన్ పోలీస్స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డుకు చెందిన చిట్టిబోయిన కీర్తి జనరల్ స్టోర్ నిర్వహించేవారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దంపతులమని చెప్పి వారు ఉంటున్న వీధిలో చేరారు. ఈ క్రమంలో వారు కీర్తితో పరిచయం పెంచుకున్నారు. తాము బెంగళూరులో బిల్టిండ్ పని చేస్తున్న సమయంలో బంగారు బిస్కెట్లు దొరికాయని, అందులో ఒక బిస్కెట్ను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కీర్తి తన భర్త రామకృష్ణకు తెలిపింది. బంగారు బిస్కెట్ మార్కెట్లో రూ. 25 లక్షలు వరకు అవుతుందని, అయితే మీకు మాత్రం రూ.5.20 లక్షలకే విక్రయిస్తామని నమ్మబలికారు. అనుమానం ఉంటే బిస్కెట్ నాణ్యతను పరీక్షించుకోజచ్చని ఒక బంగారు బిస్కెట్ ముక్కను ఇచ్చారు. దాన్ని కీర్తి దంపతులు మార్కెట్లో పరీక్షించగా నాణ్యత బాగున్నట్లు తేలింది. దీంతో కీర్తి దంపతులు బంగారు బిస్కెట్ కొనేందుకు ఆసక్తి చూపారు. మరుసటి రోజే రూ. 5.20 లక్షలు వారికి ఇచ్చి బిస్కెట్ను కొనుక్కున్నారు. గత నెల 23న నగలను తయారు చేయించుకునేందుకు వారు బంగారు దుకాణానికి వెళ్లారు. అయితే దాన్ని పరీక్షించిన స్వర్ణకారుడు నకిలీ బిస్కెట్ అని చెప్పాడు. మోసపోయామని భావించి కీర్తి దంపతులు 24న వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడైన పల్నాడు జిల్లా, ముప్పాల మండలం, మాదాల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావు పట్టణంలోని కళామందిర్ వద్ద అనుమానంతో తిరుగుతుండగా వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా మోసం చేసినట్లు అతను అంగీకరించాడు. ఇంకా ఈ కేసులో నిందితుడి భార్య బండారు ఏడుకొండలు, తుమ్మిశెట్టి రాము, తుమ్మిశెట్టి భవానీల ప్రమేయం ఉందని డీఎస్పీ తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డిపాల్గొన్నారు. -
ఏనుగు దాడిలో మృతుల కుటుంబాలకు సాయం
ఓబులవారిపల్లె : శివరాత్రి సందర్భంగా తల కోన కు కాలినడకన వెళ్తూ వై.కోట సమీపంలో ఏనుగల దాడిలో మృతిచెందిన కుటుంబాలకు ము క్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ముక్కా వరలక్ష్మీ గురువారం ఆర్థికసాయం అందజేశారు. రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన మృతురాలు తుపాకుల మణెమ్మ, తిరుపతి చెంగల్ రాయుడు, ఉర్లగడ్డపోడు వంకాయల దినేష్ కుమార్ కుటుంబీకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను ము క్కా వరలక్ష్మీ అందజేశారు. ముక్కా వరలక్ష్మీ మా ట్లాడుతూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలు గా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డివైడర్పైకి దూసుకెళ్లిన లారీ రాజంపేట టౌన్ : పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ లారీ గురువారం డివైడర్పైకి దూసుకెళ్లింది. అదుపుతప్పి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప–తిరుపతి మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బైపాస్ రోడ్డు కావడంతో వేగంగా వెళ్తుంటాయి. లారీ కింద పడి ఉంటే వెనుకవైపు వచ్చే వాహనాలు ఢీకొని పెనుప్రమాదం జరిగేదని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. డివైడర్ ఎత్తు పెంచాలని వాహనదారులు కోరారు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వీరబల్లి : మండలంలోని పెద్దవీటి పంచాయతీ ఎలకచెట్టుపల్లి వంతెన, రాగిమాను దిన్నెపల్లి వద్ద మాండవ్య నదిలో ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక రవాణా ట్రాక్టర్లను నదిలోకి వెళ్లనీయకుండా రాగిమానుపల్లి గ్రామస్తులు గురువారం నిలిపివేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు నాయకుల సహకారంతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి తాగడానికి నీరు దొరకకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు వెంకటేష్కు ఫోన్ ద్వారా తెలుపగా ఇసుక రవాణాను నిలిపవేయాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూమి కబ్జా చిన్నమండెం : మండలంలో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. చిన్నర్సుపల్లె కొండ కింద కింద ఉన్న అటవీ భూమిని జేసీబీతో చదును చేయిస్తున్నా.. స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. వివరాల్లోకి వెళితే.. చిన్నమండెం మండలం చాకిబండ చెరువు వద్ద చిన్నర్సుపల్లె కొండ కింద అటవీ భూమి ఉంది. మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం రోజులుగా యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతున్నా అటవీ అధికారులు స్పందించడం లేదు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. హద్దులు దాటిన.. డ్యాన్స్ కురబలకోట : ముదివేడు అమ్మవారి తిరునాలలో డ్యాన్స్ హద్దులు దాటింది. భక్తి భావం ఉప్పొంగాల్సిన చోట అసభ్యకర నృత్యంతో హోరెత్తించారు. కురబలకోట మండలం ముదివేడు దండుమారెమ్మ రాత్రి తిరునాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. మండలంలోని నడింపల్లె, గోల్లపల్లె గ్రామాల్లో బుధవారం రాత్రి హద్దులు దాటి యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విషయం తెలుసుకుని చాందినీబండి నిర్వాహకుడు నడింపల్లె అశోక్పై వివిధ సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్కుమార్ గురువారం తెలిపారు. వారు ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టమ్, ఇతర వాహనాలను సీజ్ చేసి కందూరుకు చెందిన కార్తీక్, డిజే వెహికల్ డ్రైవర్ గురునాథ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ● ముదివేడు తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు ● ముగ్గిరిపై కేసు నమోదు...వాహనాలు సీజ్ -
జూన్లో గండి ఆలయ కుంభాభిషేకం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి జూన్లో కుంభాభిషేకం చేయాలని, భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించాలని దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్తో కలిసి గురువారం ఆయన గండి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నాలుగేళ్లు కావస్తున్నా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని, పత్రికల్లో వార్తలు, భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ప్రారంభం నుంచి భక్తులకు అలవాటయ్యేలా పద్ధతి మార్చాలని, మూల విరాట్ వద్ద దర్శనం తీర్థం, సెటారి ఉండాలని సూచించారు. స్వామిని ప్యాకెట్ పాలతో కాకుండా, గోశాలలోని ఆవుపాలతో అభిషేకించాలన్నారు. భక్తులచే ఉత్సవ విగ్రహం వద్ద చేయించాలని అర్చకులకు సూచించారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు ఆయచే పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ఆజాద్ -
ఉత్తమ ఫ్యాకల్టీతో డీటీసీలో శిక్షణ
ఇ–క్లాస్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ కడప అర్బన్ : ఉత్తమ ఫ్యాకల్టీతో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం(డీటీసీ)లో నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ అన్నారు. కడప నగర శివారులోని డీటీసీలో అత్యాధునిక ప్రొజెక్టర్, పరికరాలు, ఏసీ గదులతో ఏర్పాటు చేసిన ఇ–క్లాస్ రూమ్ను ఎస్పీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ వివిధ అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన మెటీరియల్ శిక్షణ కాలంలో అందిస్తారన్నారు. వేసవి నేపథ్యంలో సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇ–క్లాస్ రూమ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన డీటీసీ డీఎస్పీ అబ్దుల్కరీంను ఆయన అభినందించారు. అనంతరం భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను నిపుణులు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్.వినయ్కుమార్రెడ్డి, టి.రెడ్డెప్ప, దారెడ్డి భాస్కర్రెడ్డి, సీతారామిరెడ్డి, శివరాముడు, మహమ్మద్బాబా, మధుమల్లేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
వేంపల్లె : వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె సమీపంలోని ఓ ఇంట్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు రూ.7.5 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. గ్రామ మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి, ఆయన సతీమణి మౌనిక వేంపల్లె–పులివెందుల రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వేంపల్లెలో దుకాణానికి వచ్చి.. రాత్రి తిరిగి ఇంటికి వెళ్తారు. పిల్లలు కూడా వేంపల్లె పాఠశాలలోనే చదువుతున్నారు. గురువారం యథా ప్రకారం దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెళ్లి చూడగా బీరువా తెరచి దుస్తులు చిందరవందరగా ఉండడం గమనించారు. రూ.7.50 లక్షల విలువచేసే 65 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాల చోరీ జరిగినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన తలుపును పగలగొట్టి ఇంటి వెనకవైపు నుండి పారిపోయి ఉంటారని బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి తనిఖీలు నిర్వహించారు. వేలి ముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వేంపల్లె సీఐ సురేష్రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో క్లూస్ టీం తనిఖీలు -
యువ పరిశోధకులకు విస్తృత అవకాశాలు
కడప ఎడ్యుకేషన్ : యువ పరిశోధకులకు శాస్త్ర పరిశోధనలో విస్తృత అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎఫ్ఎన్ఎ ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆచార్య ఏఎస్.రాఘవేంద్ర స్పష్టం చేశారు. వైవీయూలోని తాళ్లపాక అన్నమాచార్య సమావేశ మందిరంలో ‘జీవశాస్త్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు’ అంశంపై గురువారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర మాట్లాడుతూ సైంటిఫిక్ లెక్చర్స్పై స్కాలర్లు దష్టి సారిస్తే సైన్స్ అకాడమీలు సహకారం అందిస్తాయన్నారు. ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వివిధ జాతుల మధ్య పర్యావరణ సమతుల్యత నిర్వహించడంలో కమ్యూనికేషన్ సహాయ పడుతుందన్నారు. ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 కింద ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారని, వ్యాధుల నిర్ధారణ, చికిత్స, ఔషధం అభివద్ధి, వ్యవసాయం, పర్యావరణ స్థిరత్వం అంశాలలో సహాయపడతారని తెలిపారు. అనంతరం అతిథులు పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్.రాజగోపాల్, ఆచార్య ఎస్.నరేష్బాబు, ఆచార్య డాక్టర్ దయానంద్, ప్రొఫెసర్ రియాజున్నీసా, ప్రొఫెసర్ మాదక్క, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లగేజ్ మూటలు పడి వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఓ ట్రాన్స్పోర్ట్ లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా ప్రమాదవశాత్తూ మీద పడి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కడప రామకృష్ణ నగర్కు చెందిన ఎం. విజయ భాస్కర్(40) ట్రాన్స్పోర్ట్ గోదాములో పనిచేస్తున్నారు. గురువారం లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా మూటలన్నీ అతడిపై పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు వ్యక్తి అదృశ్యం – కేసునమోదు ముద్దనూరు : మండల కేంద్రంలోని డీయన్.పల్లె రహదారిలో నివసిస్తున్న వెంకటాద్రి(47) అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. గత ఫిబ్రవరి 25న ఉదయం పది గంటల సమయంలో వెంకటాద్రి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. మార్చి 1వ తేదీన సెల్ఫోన్లో మాట్లాడిన అతడు అనంతరం ఫోన్ ఎత్తడం లేదని తెలిపారు. వెంకటాద్రి భార్య మంజులాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి మార్చురీలో గుర్తుతెలియని మృతదేహం ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సుధాకర్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. అనారోగ్య కారణాలతో ఈ నెల 15న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇతడి పేరు డి.సుధాకర్ అని ఐపీ రిజిస్టర్లో రాసి ఉంది. అతను మృతి చెందగా, కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో మృత దేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. వ్యక్తి బంధువులు ఆస్పత్రిలో సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్షన్కు ఆరు నెలలు మదనపల్లె : కుమారుడి చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుంటే.. తప్పుల సవరణ పేరుతో ఆరు నెలలుగా పత్రం ఇవ్వకుండా నిలిపివేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు హబీబ్ సాహెబ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన బి.హబీబ్ సాహెబ్ షేక్(బీసీ–ఈ) కులానికి చెందిన వ్యక్తి. ఇతడికి బి.ఫహీమ్, బి.ఫాజిల్లా, బి.ఫరీద్ సాహెబ్ ముగ్గురు పిల్లలు. ఫరీద్ సాహెబ్ ఐదో తరగతి చదువు తున్నారు. నవోదయ విద్యాలయలో చేర్పించేందుకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమవడంతో దరఖాస్తు చేసుకుని కావాల్సిన ధృవపత్రాలు జతపరిచాడు. నిమ్మనపల్లె రెవెన్యూ సిబ్బంది బీసీ–ఇకు బదులుగా ఇండియన్ ముస్లిం(ఓసీ)గా పేర్కొంటూ జారీ చేశారు. దీంతో హబీబ్, తాము షేక్(బీసీ–ఈ)కు చెందిన వారమని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. మిగిలిన తన ఇద్దరు కుమారుల క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫరీద్ అహ్మద్ స్కూల్ టీసీ చూపినా బీసీ–ఈ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ పంపి, క్యాస్ట్ సర్టిఫికెట్ సరిచేసేందుకు మూడు నెలలుగా నిమ్మనపల్లె తహసీల్దారు కార్యాలయం, మదనపల్లె సబ్ కలెక్టరేట్ చుట్టూ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు మరోసారి ఫైల్ తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదానికి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
దుకాణాల దగ్ధంపై పోలీసులు విచారించాలి
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొండారెడ్డి, సుధాకర్ దుకాణాల దగ్ధంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. ఇటీవల దగ్ధమైన రెండు షాపులను గురువారం ఆయన పరిశీలించి బాధితులను పరామర్శించారు. రాచమల్లు మాట్లాడుతూ విద్యుత్తు మీటర్కు సంబంధించిన బాక్స్ యథాస్థితిలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందని అన్నారు. గత పదేళ్లుగా కొండారెడ్డి, సుధాకర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వెంట నడుస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తన జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ షాపులకు నిప్పు అంటించారనే అనుమానంపై పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తన శ్వాస ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానన్నారు. అనంతరం దుకాణాలు కాలిపోయి నష్టపోయిన కొండా రెడ్డికి రూ.2లక్షలు, సుధాకర్కు రూ.30వేల సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, సత్యం, రాగుల శాంతి, డీలర్ అంజి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
● నాయకుల పాపం.. పశువులకు శాపం
కష్టం వచ్చినా ఏమని చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియని మూగ జీవులు అవి. నిత్యం తమకు ఆహారం అందిస్తూ వసతి కల్పించిన జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో ఇప్పటివరకూ క్షేమంగా ఉన్నాయి. నాయకులు చేసిన పాపమో ఏమో మరి.. అటవీ అధికారులు సత్రాల కూల్చివేయడంతో వాటికి ఆదరణ కరవైంది. కొన్ని చెట్టు కింద సేద తీరుతుండగా.. మరిన్ని ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. వైస్సార్ కడప–ప్రకాశం జిల్లా సరిహద్దు మండలంలోని జ్యోతి క్షేత్రంలో కాశినాయన నిత్యాన్నదాన సతంరంతోపాటు అతి పెద్ద గోశాలలు ఉన్నాయి. వేయి నుంచి 1500 గోవులు ఇక్కడ సేదతీరుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ క్షేత్రంలో కూల్చివేతలు మొదలయ్యాయి. మొదట గోశాల, గోవుల పశుదాన సత్రంతో మొదలై గత మూడు నెలల్లో నాలుగు సత్రాలు కూలాయి. వేసవిలో సత్రం నీడన ఉండాల్సిన మూగ జీవులు ఎండ వేడిమికి అల్లాడుతున్నాయి. దాతల సహకారంతో ఇప్పటి వరకూ సాగిన సత్రాలకు ఇపుడు కష్టాలు తప్పడంలేదు. కొన్ని చెట్టు నీడన సేదతీరగా.. మరిన్ని మండుటెండలో బిక్క మొహంతో చూస్తున్నాయి. అక్కడికి వచ్చిన భక్తులు ఇది చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, కడప -
నకిలీ పత్రాలతో అటానమస్ గుర్తింపు
కడప ఎడ్యుకేషన్ : ప్రొద్దుటూరు వేంకటేశ్వర డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు అటనామస్ గుర్తింపునకు నకిలీ పత్రాలు చూపి అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు జగన్, నరసింహ, జగదీష్ ఓబులేసు, జయరాజు, ప్రతాపరెడ్డి, బయన్న ఆరోపించారు. వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మను గురువారం వారు తమ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. వారు మాట్లాడుతూ కళాశాల కరస్పాండెంట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా పాలకులు, అధికారులను మోసం చేస్తూ తప్పుడు ధ్రువ పత్రాలతో అక్రమ మార్గంలో గుర్తింపు పొందారని ఆరోపించారు. ఒక ఫీజు చెప్పి.. మరోలా ఫీజు రాబడు తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నా రు. యూనివర్సిటీ అధికారులు విచారణ జరిపి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బయన్న, దాసు, తదితరులు పాల్గొన్నారు. వైవీయూ రిజిస్ట్రార్కు విద్యార్థి యువజన నాయకుల ఫిర్యాదు -
శుభాల రేయి ఘడియలు షురూ!
కడప కల్చరల్: పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మాసాన్ని మూడు భాగాలు విభజిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే...రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాహ్ను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. పుణ్యాల కోసం..రంజాన్మాస చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ కూడా ఉంటుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్ రాత్గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని భక్తుల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నేటి నుంచి పవిత్ర తాఖ్ రాత్రులు పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కడప నగరంలోని పలు మసీదులలో నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, గురువులు తాఖ్ రాత్లలో అల్లాహ్ సందేశాన్ని అందజేసేందుకు రానున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి మొదటి తాఖ్ రాత్ను ఆచరించనున్నారు. ఆ తర్వాత రోజు విడిచి అంటే ఈనెల 23, 25, 27, 29 తేదీలలో తాఖ్రాత్లను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు తరావీ నమాజు అనంతరం పవిత్ర ఖురాన్ పఠనంతోపాటు సామూహికంగా జిక్ర్ను చేయించనున్నారు. అలాగే తహజూద్ ప్రార్థనలకు విశేష ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఐదు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టే వారికి సెహరి సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు శుక్రవారం నాటి ముస్లిం భక్తులు మసీదులలో ఎత్తేకాఫ్ (తపోనిష్ట) దీక్షలు పాటించడం జరుగుతుంది. వీరు రోజంతా పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. రంజాన్ పండుగ నిర్వహణకు సూచనగా నెలవంక కనిపించిన తర్వాతనే వారు దీక్ష విరమిస్తారు. నేటి నుంచి తాఖ్ రాత్రులు ప్రత్యేక ఏర్పాట్లలో మసీదు నిర్వాహకులు బగ్దాదియా మసీదులో తాఖ్రాత్ ప్రార్థనలు నగరంలోని షాహీపేటలోగల బగ్దాదియా మసీదులో తాఖ్ రాత్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని హజరత్ మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి తాఖ్ రాత్ అయిన ఈనెల 21న పామిడికి చెందిన హజరత్ ఫజులర్ రెహ్మాన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, అబ్దుల్ రహీం బగ్దాది సాహెబ్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేయనున్నారు. 22న నగరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హజరత్ మహమ్మద్ బగ్దాది సాహెబ్, అక్మల్పీరాన్ సాహెబ్, అమీనుద్దీన్ సాహెబ్లు దైవ సందేశం అందజేయనున్నారు. 25న అబ్దుర్ రెహ్మాన్ బగ్దాది సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, 27న మహమ్మద్ వలీవుల్లా సాహెబ్, బిలాల్ అహ్మద్ సాహెబ్, మోహసిన్బేగ్ సాహెబ్, 29న మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్, మహమ్మద్ అహ్మద్ అష్రఫీ సాహెబ్, అబ్దుల్ ఖదీర్ జిలానీ సాహెబ్లు పాల్గొని పవిత్ర రంజాన్ విశిష్ఠత, మహమ్మద్ ప్రవక్త సూచనలు తెలియజేయనున్నారు. -
24న గోవిందమాంబ ఆరాధన
బ్రహ్మంగారిమఠం: భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన ఈనెల 24న నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 8గంటలకు అభిషేకం, 10గంటలకు సహస్ర నామార్చన, 1గంటకు ద్వారపూజ, రాత్రికి గ్రామోత్సవం ఉంటుందన్నారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు ప్రొద్దుటూరులో జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై 18–45 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి రూ. 12–25 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందని వివరించారు. ప్రొద్దుటూరు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హుండీల ఆదాయం లెక్కింపు బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న కానుకలను గురువారం లెక్కించారు. ఇందులోరూ.20,15,750 నగదు, 1గ్రాము బంగారం, 90గ్రాములు వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం పిట్పర్సన్ శంకర్బాలాజీ , పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రిస్వామి, ఎండోమెంట్ అధికారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సంగమేశ్వరుడి ఆదాయం రూ.5లక్షలు వీరపునాయునిపల్లె: మండలంలోని మొగమూరు, పాపాఘ్ని నదుల సంగమం వద్ద వెలసిన సంగమేశ్వరుని ఆలయంలో గురువారం ఆలయ మాజీ చైర్మెన్ మురళీ మోహన్రెడ్డి, ఈఓ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. లెక్కింపు అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మార్చి నుంచి నేటి వరకు 5లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు తెలియజేశారు. అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ ఈఓ మారుతీ ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, వాసుదేవరెడ్డి, ప్రసాదురెడ్డి భక్తులు పాల్గొన్నారు. శిల్పారామానికి నూతన ఏఓ కడప కల్చరల్: కడప శిల్పరామానికి నూతన పాలనాధికారి (ఏఓ) వచ్చారు. ఇప్పటివరకు ఏఓగా పనిచేస్తున్న పి.శివప్రసాద్రెడ్డి అనంతపురం శిల్పారామానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనంతపురం శిల్పారామం ఏఓ కృష్ణ ప్రసాద్ గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప శిల్పారామంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పులివెందులలో ఇంతవరకు ఏఓగా ఉండిన సుధాకర్ను తిరుపతి శిల్పారామానికి బదిలీ చేయగా, అక్కడి ఏఓ ఖాదర్వలీని పుట్టపర్తి శిల్పారామానికి బదిలీ చేశారు. విశాఖ ఏఓగా ఉండిన విశ్వనాథ్ను పులివెందుల శిల్పారామానికి బదిలీ చేశారు. -
● పశు యజమానులకు కష్టకాలం
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్సీపీ సర్కార్ వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేసింది.ఎక్కడికక్కడ పశువులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది.సమున్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. అప్పట్లోనే ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా పశువులకు సేవలు అందిస్తూ వచ్చిన సంచార వైద్యానికి గ్రహణం పట్టుకుంది. ప్రస్తుత కూటమి సర్కార్ సంచార పశు వైద్య వాహనాల గురించి పట్టించుకోకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇవి మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు వాటిని నిలిపివేశారు. కాంట్రాక్టు గడువు ముగిసినా.. ఉన్నతాశయంతో వైఎస్ జగన్ సర్కార్ పశు సంచార వాహనాలకు శ్రీకారం చుడితే గడువుముగియడంతో పక్కన పెట్టేశారు. అయితే కూటమి సర్కార్ కాంట్రాక్టు ముగిసినా పట్టించుకోకుండా ముందుకు వెళు తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఏది ఏమైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలువురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. అయితే సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే...జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 6, వైఎస్సార్ జిల్లాలో 7 వాహనాలు తిరగడకపోవడంతో రెండోదశలో వచ్చిన వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. దీంతో పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ఎందుకంటే కొన్ని వాహనాలు పక్కన పెట్టడంతో మిగిలినవి పరిమిత సంఖ్యలోనే వైద్యం అందిస్తాయి. దీంతో పాడి రైతులకు సమస్యలు తప్పడం లేదు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని పశువుల సమాచారం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అన్నమయ్య జిల్లాలో పశుసంవర్దకశాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు మీరడంతో పక్కన పెట్టారు. అయితే రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు యజమానులకు ఇబ్బందులు లేకుండా చూస్తు న్నాం. ఎప్పటికప్పుడు పాడి రైతులతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. –గుణశేఖర్పిళ్లై, పశు సంవర్ధకశాఖాధికారి, అన్నమయ్య జిల్లా వాహనాలను పనురుద్ధరించాలి గత ప్రభుత్వ హయాంలో సంచార వైద్యశాలలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటివద్దనే వైద్యం అందేది. నేడు ఆ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యంగా దెబ్బతింటే ఆటోల ద్వారా సమీప పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా ఇబ్బంది. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పనురుద్ధరించాలి. –సుబ్బరాయుడు,రైతు పాళెంగడ్డ,సంబేపల్లె మండలం వైఎస్సార్ జిల్లా అన్నమయ్య జిల్లా గేదెలు 3,99,854 100588 కోళ్లు 31,82,190 30,82,260 ఎద్దులు, ఆవులు 44,000 276417 గొర్రెలు 9,20,614 18,24,325 మేకలు 3,80,099 3,53,370 జిల్లాలో పాడి రైతులు 1.80 లక్షలు 2 లక్షలు మొదటి విడతలో వచ్చిన సంచార పశు వైద్య వాహనాలు నిలుపుదల మూగజీవాలకు కష్టకాలం -
ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్ను చెరపలేరు
కడప కార్పొరేషన్: జిల్లా పేరు మార్చవచ్చేమోగానీ, ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్ను చెరపలేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 680 మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎవరు చనిపోయినా కూడా ఇంతమంది మరణించలేదన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు మాత్రమే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైఎస్సార్ పాలన ఒక చరిత్ర అన్నారు. ఎన్నికల్లో చెప్పినవేగాక, చెప్పనివి ఎన్నో ఆయన అమలు చేసి చూపారన్నారు. వైఎస్సార్ పేరు చెప్పగానే చరిత్రాత్మకంగా గుర్తుండిపోయే ఎన్నో పథకాలు స్ఫురణకు వస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, జలయజ్ఞం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఆయన ప్రవేశపెట్టినవేనన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వాలని లక్ష కోట్లతో జలయజ్ఞం మొదలు పెట్టారని, మనం కాకపోయినా వేరెవరైనా వాటిని పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించారన్నారు. పోలవరం, గాలేరునగరి సుజల స్రవంతి, హెచ్ఎన్ఎస్స్, వెలిగొండ, సోమశిలతోపాటు తెలంగాణలో కూడా 45 శాతం ప్రాజెక్టులు చేపట్టారన్నారు. నేడు ఇంతమంది చదివారు అంటే వైఎస్సార్ ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్మెంటే కారణమన్నారు. ఈ పథకం ద్వారా వేలాదిమంది డాక్టర్లు, ఇంజినీర్లుగా తయారయ్యారని తెలిపారు. వైద్యానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదన్నారు. స్వతహాగా వైద్యుడైనందునే వైఎస్సార్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఏపీలో చూసి ప్రతి రాష్ట్రంలో దాన్ని అమలు చేశారన్నారు. పేదలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం చేయించారన్నారు. ప్రజల బాగు కోసం నిరంతరం పరితపించిన ట్రెండ్ సెట్టర్ వైఎస్సార్ అన్నారు. ఆయన చనిపోయాక 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాకు వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డో, అభిమానులో పెట్టింది కాదన్నారు. ఆ పేరును కూటమి ప్రభుత్వం మార్చడం దురదృష్టకరమని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా పాలించలేదని, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ల పేర్లు జిల్లాలకు పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేర్లన్నీ తీసేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వాళ్లు పేరు పెట్టుకుంటే ఆది కూడా తీసేశారన్నారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారగానే తీసేశారన్నారు. పేరు తొలగించినంత మాత్రాన వారిపై ప్రజలకున్న గౌరవం తొలగించలేరన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందేమీ లేదుగానీ, ఇలా దోపిడీ, దుర్మార్గాలను చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసి ఆస్తులను నష్ట పరుస్తున్నారన్నారు.దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే, ఏపీలో మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని తూర్పారబట్టారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఆశతో ప్రజలు ఓట్లు వేశారని, ఇచ్చిన అఽధికారాన్ని సద్వినియోగపరచుకుని ప్రజల మనసులు గెలవాలని రవీంద్రనాథ్రెడ్డి హితవు పలికారు. అంతే తప్ప ప్రకృతి వనరులను ధ్వంసం చేసి మట్టి, ఇసుకను దోచుకోవడం, లోకల్ ట్యాక్స్ వసూలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల హామీలు అమలు పరచకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాల ద్వారా మెడలు వంచి చేయిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, బీహెచ్ ఇలియాస్, ఎస్ఏ కరిముల్లా, ఎస్ఎండీ షఫీ, కిరణ్ పాల్గొన్నారు. పేరును చెరపగలరేమోగానీ...ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని కాదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం లేదు. టీటీడీ చొరవతో అయినా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ బాగుపడుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భద్రాచలం అధికారిక రామాలయంగా భాసిల్లింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రా భద్రాచలంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అధికారిక రామాలయంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. రెండవ అయోధ్యగా..ఏకశిలానగరంగా పిలవబడుతున్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్కు భక్తులు చేరుకునేందుకు రైలే లేదు. ఉన్న ఏ రైలూ ఆగదు. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయేడాది ఏప్రిల్ 5 నుంచి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. కానీ సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతు బాధ్యతగా ఒంటిమిట్టకు భక్తులు చేరుకునేందుకు కల్పించిన రైలు సౌకర్యం శీతకన్ను పెట్టిందనే విమర్శలున్నాయి. ఒంటిమిట్ట రామయ్య చెంతకు చేరుకునేందుకు భక్తులకు వీలులేని పరిస్థితులు దాపురించాయి. భద్రాచలం తరహాలో స్టేషన్ అభివృద్ధి ఏదీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే శీతకన్ను చూపుతోందనే అపవాదును మూటకట్టుకుంది. ముంబాయి–చైన్నె కారిడార్ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి డెమో ఒక్క రైలు మాత్రం ఉదయం, సాయంత్రం ఆగుతుంది. కోవిడ్ ముందు నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాదిగా గుర్తించి, అభివృద్ధి చేస్తుంటే రైల్వేశాఖ తన వంతు పాత్రను పోషించడం లేదు. పల్లె స్టేషన్లాగే రైల్వేశాఖ భావిస్తోంది. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణనలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణ మధ్య రైల్వేలోనే ఉండేది. భద్రాచలం స్టేషన్కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడం లేదంటే వివక్షను ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. రైలు సౌకర్యంపై దృష్టి పెట్టని టీటీడీ .. ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైంది. అయితే ఎంతసేపు రామాలయం అభివృద్ధి వరకు దృష్టి కేంద్రీకరించింది. అయితే రామయ్య క్షేత్రానికి భక్తులు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్టకు భక్తులు వచ్చేలా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని టీటీడీ రైల్వేబోర్డును కోరితే తప్పకుండా స్పందిస్తుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఈవో భక్తులకు రైలు సౌకర్యం కల్పించే విషయంసౌ దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కోరుతున్నారు. కొత్తజోన్లో అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఎస్సీ రైల్వేలో ఏపీకి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైంది. విశాఖజోన్కే తలమానికం ఒంటిమిట్ట రామాలయం. అధికారికంగా గుర్తించిన రామాలయం ఇదే. అటువంటప్పుడు కొత్త జోన్ వల్ల రామాలయం ఉన్న ఒంటిమిట్ట స్టేషన్కు గుర్తింపు వస్తుందన్న ఆశలున్నాయి. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. దూర ప్రాంత భక్తులు రైలుమార్గంలో రామయ్య చెంతకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్పేరుకు మాత్రమే ఉంది. నవమి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం రోజున లక్ష లాది మంది భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి రైలుమార్గంలో వచ్చేదెలా..? భద్రాచలం తరహాలోస్టేషన్ అభివృద్ధి ఏదీ? మొన్నటి వరకు ఒంటిమిట్ట, భద్రాచలం రెండు ఎస్సీ రైల్వేలోనే .. విశాఖ జోన్కే తలమానికంఒంటిమిట్ట రామాలయం ఒంటిమిట్టపై రైల్వేశాఖ వివక్ష భక్తులకు రైలు సౌకర్యంపై దృష్టిపెట్టని టీటీడీ రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. మరి ఎందుకు రైల్వేశాఖ వివక్ష చూపుతోంది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి ద్వారా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి అంశాలను రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం. తెలంగాణాలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు ఆంధ్రా భద్రాచలం రైల్వేశాఖకు కనిపించలేదా. భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. – తల్లెం భరత్రెడ్డి, డీఆర్యుసీసీ సభ్యుడు భక్తుల రాకకు రైలు మార్గమే అనుకూలం దూరప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. భక్తులకు ఏ విధంగా భద్రాచలం రైల్వేస్టేషన్ సౌకర్యంగా ఉందో, అలాగే ఒంటిమిట్టను మార్చాలి. ఏపీకి అధికారిక రామాలయంగా గుర్తించారు. అదే రీతిలో రైల్వేపరంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేయాలి. కనీసం కళ్యాణం రోజైనా స్టాపింగ్ కల్పించాలి. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాఽథ్రెడ్డిల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళతాం. –తంబెళ్ల వేణుగోపాల్రెడ్డి, డీఆర్యుసీసీ సభ్యుడు -
దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
డైరెక్టర్ ఆచార్య కృష్ణారెడ్డి వెల్లడి కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. బుధవా రం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ పి.పద్మ తో కలిసి మాట్లాడారు. యోగి వేమన విశ్వవిద్యాలయం గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వా రికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతే చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ (బీఎఫ్ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. ఈ కోర్సులన్నీ డిస్టెన్స్, ఆన్లైన్ లర్నింగ్ విధానంలో ఉంటాయన్నారు. వివరాలకు https://code.yvu.edu.inను సంప్రదించాలని సూచించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడి
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి నిర్వహించాలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మొద లైన ఒంటిపూట బడి సమయ వేళలు ఏప్రిల్ 31వ తేది వరకు అమల్లో ఉంటాయని పేర్కొ న్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నడపాలని సూచించారు. 23న దేవుని కడప పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగుల సభ కడప అర్బన్: దేవుని కడప పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగుల పరస్పర సహకార గృహ నిర్మాణ సంఘం సంవత్సరపు మహాజన సభ ఈనెల 23 వతేదీన ఉదయం 10 గంటలకు కడపలోని వైఎస్ఆర్ పోలీసు కాలనీలో నిర్వహించనున్నట్లు దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కె. ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘంలో ఇళ్ల స్థలాలు పొందిన సభ్యులు గృహ నిర్మాణం చేసుకునే విషయాలతోపాటు, ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని 17 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6,11 తరగతులలో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా మార్చి 22 నుంచి మే 11వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు తెలిపారు. అలాగే కేజీబీవీల్లో 7,8,9 తరగతులలో మిగిలిన సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు... కడప ఎడ్యుకేషన్: కడపలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలుర)లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పేతకంశెట్టి సోమ సత్యశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ బాలురతోపాటు ఎస్సీ, ఎస్టీ బాలురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా https://aprs. apcffss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. వివరాలకు 7780179446, 90595 00173 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఉప సర్పంచుల ఎన్నికకు నోటిఫికేషన్ కడప సెవెన్రోడ్స్: జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న తొమ్మిది ఉప సర్పంచుల స్థానా లను భర్తీ చేసేందుకు ఈనెల 27వ తేది ఉదయం 10 గంటలకు ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి బుధవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు, సీకే దిన్నె మండలం బుసిరెడ్డిపల్లె, కమలాపురం మండలం కోగటం, బ్రహ్మంగారిమఠం మండలం గొడ్లవీడు, ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె, చిర్రాజుపల్లె, దువ్వూరు మండలం ఇడమడక, చెన్నూరు మండలం ముండ్లపల్లె పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నికలు జరగనున్నా యి. ఇందుకోసం అధికారులను నియమించా రు. ఏదైనా కారణాల రీత్యా ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు నిర్వహించాల్సి ఉంటుంది. జూడాల సంఘం నూతన కమిటీ ఏర్పాటు కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి ప్రిన్సిపల్కు వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ల్యాండ్ మాఫియాను అరికట్టాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడుతున్న ల్యాండ్, శాండ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణ యాలను సమూలంగా మార్పులు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా నడుస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ వంకా, వాగు, చెరువు, రాస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈ నామ్, వక్ఫ్, అటవీ, స్మశాన భూముల ఆక్రమణ యదేచ్చగా సాగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ అనుమతులు లేని మట్టి క్వారీలు ఏర్పా టు చేసుకొని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మండిపోతున్న ఎండల ప్రభావం భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోయి చేను ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పీపీ యూనిట్ వైద్యురాలిపై సస్పెన్షన్ వేటు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని పీపీ యూనిట్ వైద్యురాలు ఇలియారాణిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి కొన్ని రోజుల క్రితం చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇలియారాణిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి నుంచి డీఎంహెచ్ఏ నాగరాజుకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఆందాయి. తన భార్యకు అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని రెండు రోజుల క్రితం విశ్వనాథ్రెడ్డి కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పీపీ యూనిట్ ఇన్చార్జి బాధ్యతలను డాక్టర్ నజీర్బాషాకు అప్పగించారు. -
● 2024లో నాసిరకం అద్దాలకు అడ్డుకట్ట..
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం 2024లో కూడా జరిగింది. అప్పుడు టెండర్లను ఆహ్వానించినప్పుడు పంపిణీదారులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అప్పట్లో ప్రకాశం జిల్లాకు చెందిన పంపిణీదారుడు టెండరులో పాల్గొన్నారు. రూ.180కే నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తానని టెండర్ వేశారు. కడప నగరానికి చెందిన ఇదే వ్యక్తి నాడు రూ.168కే పంపిణీ చేస్తానని టెండర్ దక్కించుకున్నారు. ఈ పంపిణీదారుడు అప్పుడు కూడా నమూనాగా నాణ్యమైన కళ్ల జోళ్లను చూపి నాసిరకం అద్దాలను పంపిణీ చేసేందుకు యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అడ్డుతగిలారు. కడప నగరానికి చెందిన పంపిణీదారుడు నాసిరకం అద్దాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కడప పంపిణీదారుడు గత్యంతరం లేక నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
కడప సెవెన్రోడ్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు–కరువు కవల పిల్లల్లాంటి వారని ఎద్దేవా చేశారు. కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో పంటలు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో సగం పంటలు చేతికి వచ్చాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రైతులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల ఆత్మహత్యలు చేసుకో వాల్సిన దుర్గతి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట తాను రూ. 20 వేలు ఇస్తానంటూ ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఈ సంవత్సరం దాని ఊసే మరిచిపోయారని విమర్శించారు. జిల్లాలో శనగ, మినుములు, కంది, వరి, చెరుకు లాంటి ఏ పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ యేడాది శనగ ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ–క్రాప్ చేసుకోవాలని ఇంకా పలు నిబంధనలు విధించడం వల్ల రైతులు అదే ధరకు బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అరటి, ఎర్రగడ్డలకు సైతం మద్దతు కల్పించామన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యాన పంటలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. జిల్లాలో 42 డిగ్రీల ఎండ తీవ్రత ఉండడంతో మామిడి పూత, పిందె రాలిపోతోందని, ఈ పరిస్థితుల్లో మామిడి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటల మద్దతు ధర కోసం బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేశారని, అవి కూడా ఏమేరకు విడుదల చేస్తారో తెలియడం లేదన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దిచెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరిలో క్వింటాలు బుడ్డశనగ ధర రూ. 5100 నుంచి రూ. 5250 వరకు ఉండేదన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించుకున్నారని, ప్రస్తుతం ఐదు శాతం శనగలు కూడా రైతుల వద్ద లేవన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలయ్య, ఆ పార్టీ నాయకులు పులి సునీల్కుమార్, ఇలియాస్, మునిశేఖర్రెడ్డి, నాగేంద్ర, నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
రైతన్న ఉసురు తీసిన అప్పులు
ఖాజీపేట : సాగుచేసిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, సరైన దిగుబడి రాక పోవడంతో ఏటా సాగు వ్యయం పెరిగింది. చేసిన అప్పులు తీరడం లేదు. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనో వ్యథతో ఓ యువ రైతు తన పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీలోని బక్కాయపల్లె గ్రామానికి చెందిన పత్తి రామచంద్రారెడ్డి (42) చురుకై న వ్యవసాయ యువ రైతు. తనకు 2.50 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంతో పాటు అదనంగా 10 ఎకరాలను గుత్తకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో పంటలు సాగు చేసేవాడు. ముఖ్యంగా వరి, వేరుశనగతోపాటు పలురకాల పంటలు సాగు చేసేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి వస్తే మార్కెట్లో సరైన గిట్టుబాటుధర లేక పోవడం, ఇలాగే మార్కెట్లో ధర ఉన్నప్పుడు సరైన దిగుబడి రాక పోవడం జరిగేది. దీంతో పండించిన పంటలపై సరైన ఆదాయం లేదు. పొలం గుత్త చెల్లించలేక ఏటా నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. పంట సాగు కోసం ఏటా అప్పులు తీసుకురావడం.. ఆ అప్పులు తీరక ముందే పంట సాగు చేసే ప్రయత్నంలో తిరిగి అప్పు లు చేయడం మామూలైంది. ఫలితంగా అప్పులు అధికమై తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. పొలంలోనే ఆత్మహత్య.. ఏటా తాను సాగుచేసే పంటలకు అప్పులు తీసుకు రావడం వల్ల సుమారు రూ.15లక్షల మేరకు అప్పులు అయ్యాయి. వచ్చే సీజన్లో పంటలు సాగుచేస్తే ఆదాయం వస్తుందన్న నమ్మకాన్ని రైతు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ మంగళవారం రాత్రి పొలంలో పంటకు నీరు పట్టి వస్తానని ఇంటిలో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోనే పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. పొలంలో పడిపోయి ఉన్న రైతును చూసి మరో రైతు పిలిచాడు. ఎంతకూ పలకక పోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా చనిపోయినట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని పత్తి రామచంద్రారెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కేసు నమోదు మృతి చెందిన రైతు భార్య పత్తి శిరీషా ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. కడప రిమ్స్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం బంధువులు అంత్యక్రియలు నిర్వహంచారు. పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య -
రైతులను ఆదుకోని ప్రభుత్వం
ఖాజీపేట : కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం.. రైతులను మోసగించిన దగా ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామంలో యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి పొలంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన రైతుకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి గల కారణాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన రైతు మంచి రైతుగా గ్రామంలో పేరు ఉందన్నారు. తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడంతో ఏటా సాగుకు అప్పులు తీసుకు వచ్చి సాగు చేసేవాడన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేక పోవడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ఆయన అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన రైతు భరోసా ఎక్కడని ప్రశ్నంచారు. తమ ప్రభుత్వంలో రైతులు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించేవారు కాదన్నారు. ప్రభుత్వమే రైతుల తరపున ఇచ్చేదని తెలిపారు. ఒక్క ఖాజీపేట మండలానికే పంట నష్ట పరిహారం రూ.27 కోట్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుల పంటకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టు బాటు ధర కల్పించి కొనుగోలు చేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజైనా కొనుగోలు చేసిందా అని ప్రశ్నంచారు. రైతు అత్మహత్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. చనిపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ వ్యవసాయ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మైదుకూరు రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతుకు దిక్కులేకుండా పోయింది కడప కార్పొరేషన్ : అన్నం పెట్టే రైతుకు కూటమి ప్రభుత్వంలో దిక్కులేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్కాయపల్లె గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న యువ రైతుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. పెద్ద కుమార్తె పదో తరగతి పరీక్షలు రాస్తుండగా, చిన్న కుమార్తె 7వ తరగతి చదువుతోందన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసిందని, ఫలితంగా అప్పులు ఎక్కువై వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రెండు నెలల క్రితం మైలవరంలో మిర్చి రైతు, ఇప్పుడు వరి రైతు ఉసురు తీసుకున్నాడన్నారు.మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి -
మైదుకూరులో ఆలయ భూముల సర్వే
మైదుకూరు : మైదుకూరులో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను బుధవారం దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించారు. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఇటీవల కొందరు నిర్మించిన కాంప్లెక్స్ దేవాలయ భూముల్లో నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ భూమును పోలీసు బందోబస్తుతో సర్వే చేసి కొలతలు వేశారు. భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్లు 1052/ఏ లో 1.98 ఎకరాలు, 1052/బీలో 1.83 ఎకరాలు, 1052/సీలో 0.65 ఎకరాలు, 1845లో 10.20 ఎకరాలు, 1031లో 6.22 ఎకరాలు, 1054లో 1.56 ఎకరాలు, 1054/బీలో 1.34 ఎకరాలు, 1087/ఏలో 2.10 ఎకరాలు ఉన్నాయని ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ విలేకరులకు తెలిపారు. కాగా బుధవారం కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సమీపంలో కేసీ కెనాల్కు ఉత్తరం వైపున ఉన్న సర్వే నంబర్ 1052/ఏలోని 1.98 ఎకరాలను, 1052/సీలోని 0.65 ఎకరాలను సర్వే చేయించి గుర్తింపు రాళ్లను పాతించారు. 1052/బీలోని 1.83 ఎకరాలకు సంబంధించిన భూముల్లో నిర్మాణాలు చేసిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడం, వాటిపై కోర్టుకు వెళ్లినట్టు తెలియడంతో ఆ సర్వే నంబర్లోని భూములను దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించలేదు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపట్టడంపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో భూములను గుర్తించేందుకు సర్వే చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ రెడ్డి, మైదుకూరు ఈఓ ప్రసాద్ రావు, కడప ఇన్స్పెక్టర్ శివయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
కళ్లద్దాలకు..అవినీతి మసక !
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అనే సంగతిని మరిచారు. పాపం.. దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల కళ్లద్దాలపై అవినీతి కన్ను పడింది. నాసిరకం కళ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థలో వెలుగు చూసిన అక్రమాలు విస్మయం కలిగిస్తున్నాయి. సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు కళ్ల జోళ్ల పంపిణీ కోసం 2025 జనవరి 4వ తేదీన టెండర్లు పిలిచారు. ఇందులో జిల్లాలోని పాఠశాల విద్యార్ధులకు కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా దృష్టి లోపంతో బాధపడుతున్న 5,200 మందికి ఉచితంగా కళ్ల జోళ్లను పంపిణీ చేయాలి. సకాలంలో మంచి నాణ్యత గల కళ్ల జోళ్లు అందించగల సంస్ధల నుంచి టెండర్లను ఆహ్వానించారు. టీఆర్–90/పాలీకార్బొనేట్ ఫుల్ ఫ్రేమ్ (బాలురు, బాలికలకు వివిధ రకాల రంగుల్లో) లెన్స్:సీఆర్–39 (ప్లాస్టిక్ లెన్స్) నాణ్యత కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన సరఫరాదారులు తమ కనిష్ట ధరను సీల్డ్ కవర్లో ఉంచి నమూనా ఫ్రేముతో పాటుగా 6 నుంచి 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు జిల్లా అంధత్వ నివారణ సంస్థ (జిల్లా ప్రోగ్రాం మేనేజర్)కు అందజేయాలని సూచించారు. కాగా టెండరు ప్రకటనలో వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని సంస్థల (ఆప్టికల్ షాపుల యాజమాన్యాలు) వారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని షరతు విధించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రమే జిల్లాలో ఉన్న వారికి మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అనుమానాలు తలెత్తాయి. ఇలా ఆదిలోనే అక్రమాలకు బీజం పడినట్లయింది. అనుకూలమైన వారికి వచ్చేలా చక్రం తిప్పారు.. ఈ టెండర్లలో జిల్లాకు చెందిన వారు మొత్తం నలుగురు పాల్గొన్నారు. అందులో కడప నగరానికి చెందిన ఆప్టికల్ షాపు యజమాని రూ.270 విలువైన నాణ్యమైన కళ్లద్దాలు, బాక్స్ను పంపిణీ చేస్తానని టెండర్లో పొందుపరిచారు. మిగతా ముగ్గురు అంతకంటే తక్కువ ధరను కోట్ చేశారు. వాస్తవానికి టెండర్ తక్కువ ధరకు వేసిన వారికే రావాలి. అయితే ఇక్కడ కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి టెండర్ దక్కాలని మిగతా ముగ్గురు టెండర్దారులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఒప్పందం కుదిర్చారు. దీంతో సిండికేట్గా మారారు. అందుకు గాను ఒకరికి రూ 1.70 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.70 వేలు చొప్పున డబ్బును ముట్టజెప్పినట్లు తెలిసింది. ఫలితంగా టెండర్ల నుంచి ముగ్గురు తప్పుకోవడంతో కడప నగరానికి చెందిన పంపిణీదారుడి టెండర్ సీల్డ్ కవర్ను బాక్స్లో వేశారు. ఆ బాక్సులో ఉన్న కవర్ను జాయింట్ కలెక్టర్ చాంబర్లో తెరిచారు. టెండర్ తమకు అనుకూలమైన కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి దక్కేలా చేసే విషయంలో అధికారులకు..టెండర్దారులకు మధ్య డీల్ కుదిరేలా ఒక ఆప్తాలమిక్ ఆఫీసర్ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారు..కళ్ల జోళ్ల నాణ్యతా ప్రమాణాలను ఆ విభాగంలో పనిచేసే ఆప్తోమెట్రిస్ట్ (అద్దాలను పరీక్షించేవారు), ఆప్తాలమిక్ ఆఫీసర్స్ (కంటి వైద్యాధికారులు) పరీక్షిస్తారు. అలాగే ఈ నాణ్యతా పరీక్షలను రిమ్స్ కంటి వైద్యులు నిర్వహించాలి. ఈ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన అద్దాలని తేలితేనే విద్యార్థులకు అందజేయాలి. అయితే ఈ ప్రమాణాలను పాటించిన దాఖలాలు లేవు. కాగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆప్తాలమిక్ ఆఫీసర్స్ 15 మంది పనిచేస్తున్నారు. లక్షలు నొక్కేశారు..ప్రస్తుతం రూ.270తో పంపిణీ చేసిన కళ్ల జోళ్లు ఒక ప్రముఖ కంటి వైద్యశాలలో రూ. 60–80కే లభిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. ఆ ప్రకారం ఒక జత కళ్ల జోళ్ల ధర రూ.270తో అయితే మొత్తం రూ.14.04 లక్షలు అవుతుంది. అదే రూ.80తో వేసుకుంటే మొత్తం రూ. 4.16 లక్షలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.10 లక్షల వరకు చేతులు మారాయి. ఈ అంశాలపై ఇంటా..బయటా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కడప పాత రిమ్స్లోని జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయం టెండర్ల ఆహ్వానంలోనే మతలబు 5,200 మంది విద్యార్థులకు నాసిరకం కళ్ల జోళ్లు అందజేత రూ.లక్షలు నొక్కేసిన వైనం జిల్లా అంధత్వ నివారణ సంస్థలో అక్రమాలు -
● 2024లో నాసిరకం అద్దాలకు అడ్డుకట్ట..
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం 2024లో కూడా జరిగింది. అప్పుడు టెండర్లను ఆహ్వానించినప్పుడు పంపిణీదారులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అప్పట్లో ప్రకాశం జిల్లాకు చెందిన పంపిణీదారుడు టెండరులో పాల్గొన్నారు. రూ.180కే నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తానని టెండర్ వేశారు. కడప నగరానికి చెందిన ఇదే వ్యక్తి నాడు రూ.168కే పంపిణీ చేస్తానని టెండర్ దక్కించుకున్నారు. ఈ పంపిణీదారుడు అప్పుడు కూడా నమూనాగా నాణ్యమైన కళ్ల జోళ్లను చూపి నాసిరకం అద్దాలను పంపిణీ చేసేందుకు యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అడ్డుతగిలారు. కడప నగరానికి చెందిన పంపిణీదారుడు నాసిరకం అద్దాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కడప పంపిణీదారుడు గత్యంతరం లేక నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. -
ఫ్లైయాష్ వ్యవహారంపై విచారణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై ఏపీజెన్కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్లైయాష్ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్లైయాష్ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ గౌరీపతిని ఫోన్లో వివరణ కోరగా సాధారణ విచారణలో భాగంగానే ఏపీజెన్కో నుంచి అధికారులు వచ్చి విచారణ చేపడుతున్నారని తెలిపారు. మామిడి తోటకు నిప్పు – 40 చెట్లు దగ్ధం చిన్నమండెం : ఆకతాయిలు మామిడి తోటకు నిప్పు పెట్టడంతో 40 మామిడిచెట్లు కాలిపోయినట్లు బాధిత రైతులు బయన్న, రామచంద్ర, రమణయ్య తెలిపారు. వారి కథనం మేరకు.. మండల పరిధిలోని నాగూరువాండ్లపల్లె సబ్ స్టేషన్ పక్కన గల మామిడితోట వద్ద గల కంచెకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మామిడి తోట దగ్ధం కావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు చేరుకొని మంటలను అదు చేశారు. అప్పటికే 40 చెట్లు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
చెడు వ్యసనాలకు బానిసలై.. ఏటీఎంలో చోరీకి యత్నం
ఇద్దరు నిందితుల అరెస్టుఎర్రగుంట్ల : చెడు వ్యసానాలకు బానిసలై డబ్బుల కోసం ఏకంగా ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ నరేష్బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన కొత్తమాసి సుధీకర్, గాలిపోతుల అభిషేకం స్నేహితులు. వీరిలో కొత్తమాసి సుధీకర్ 2020 సంవత్సరం నుంచి సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీ ద్వారా ఏటీఎంలకు డబ్బులను లోడ్ చేసేవాడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో ఏటీఎంలకు డబ్బులు లోడ్ చేసే క్రమంలో అప్పుడుప్పుడు డబ్బులను దొంగిలిస్తూ సుమారు రూ.36 లక్షలు తన చెడు వ్యసనాలకు వాడుకున్నాడు. సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీవారు డబ్బులు కాజేసిన విషయాన్ని తెలిసుకుని కొత్తమాసి సుధీకర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వాడుకున్న డబ్బును ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి వద్ద నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత సుధీకర్ జల్సాలకు డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఎర్రగుంట్ల పట్టణం వేంపల్లి రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మూసి ఉన్న విషయం తెలుసుకున్నాడు. గతంలో ఈ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసి ఉండటంతో సులువుగా డబ్బులు దొంగిలించవచ్చనుకున్నాడు. ఈ తరుణంలోనే ప్రొద్దుటూరులోని ఆటో నగర్లో వెల్డర్గా పనిచేస్తున్న గాలిపోతుల అభిషేకంను తోడు చేసుకుని గ్యాస్ , ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం ఏటీఎంలోకి వచ్చి షటర్ మూసి ఏటీఎం బాక్సును కట్ చేసి డబ్బులు సులువుగా దొంగిలించవచ్చనుకున్నారు. అయితే ఏటీఎం క్యాష్ బాక్స్ మెయిన్ డోర్ ఎంత సేపటికి తెరుచుకోలేదు. దీంతో ఎవరైనా వస్తారేమో అనే భయంతో అక్కడి నుంచి కారులో వస్తువులన్నీ వేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
‘కోట్లు మింగేశారు’పై విచారణ
కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అక్రమాల ఆరోపణలపై ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’ కథనంపై రాష్ట్ర స్థాయి క్షయ నియంత్రణ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం స్ధానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్ హల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ నాగరాజు, డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరకుమార్, ఇద్దరు ఆఫీస్ సూపరెండెట్లు విచారణ చేపట్టారు. క్షయ నియంత్రణ విభా గం జిల్లా కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బందిని విచారణకు పిలిపించారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు అంశాలను.. ఆసక్తికరమైన విషయాలను విచారణ అధికారుల దృష్టికి తెచ్చినట్లుగా తెలిసింది. అధికారులు చేపుడుతున్న విచారణ..అందుకు సంబంధించి ఉన్నతాధికారులకు సమర్పించే నివేదిక..తదుపరి చర్యలపై ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మత సామరస్యం కాపాడాలి
కడప అర్బన్ : ఇటీవల రాయచోటి, చెన్నూరు సంఘటనల నేపథ్యంలో జిల్లాలో మతసామరస్యం కాపాడాలని మంగళవారం అఖిలపక్ష కమిటీ, మైనార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, ఎన్ఆర్సీ జేఏసీ కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, సీపీఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య మాట్లాడుతూ జిల్లాలో మత సామరస్యం, శాంతిని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొందరి కుట్రల కారణంగా మత ఘర్షణలు చెలరేగి శాంతి భద్రతల సమస్య తలెత్తి ప్రజల్లో అనైక్యతకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల శాంతి సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూల విజయభాస్కర్, ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్, మౌలానా సిరాజ్ బుఖారి, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మగ్బూల్ బాషా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షాజహాన్, సయ్యద్ చాంద్బాషా, ఇండిపెండెన్స్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాస్టర్ విజయభాస్కర్, క్రైస్తవ పెద్దలు వారధి జోసెఫ్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మడగలం ప్రసాద్, రాయలసీమ రైతు సంఘం నాయకుడు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● రాత్రింబవళ్లు 4 జేసీబీలతో..
జగనన్న కాలనీ ఎస్టీపీ రెండో లే ఔట్ పైన నానాపల్లె, వైఎస్సార్ కాలనీ సమీపాన ఎన్జీఓ కాలనీకి చెందిన ఇద్దరు టీడీపీ బ్రదర్స్ 3 జేసీబీలతో గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. యానాది కొట్టాల వద్ద మరో జేసీబీతో తవ్వుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు ఏర్పాటు చేసి టన్నుల కొద్దీ మట్టిని మాయం చేస్తున్నారు. కాలువల పక్కనున్న పొరంబోకు స్థలాలు, వివాదాస్పద డీకేటీ స్థలాల్లో మకాం వేసి ఈ మట్టిని ఆయా ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. లీజు క్వారీల నుంచి మట్టి తోలితే ఒక టిప్పరుకు రూ.1750లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా...ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా కేవలం రూ.4000 నుంచి రూ.5000లకు టిప్పర్ మట్టిని తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. లీజు క్వారీలకు అనుమతి ఉన్నవారిని సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా బెదిరించి క్వారీలు మూయించిన అధికార పార్టీ నేతలు, తమ టిప్పర్లతో విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. వైఎస్సార్ కాలనీకి పోయే మార్గంలోనే ఇదివరకు చెక్పోస్టు ఉండేది. అది ఉన్నప్పుడు ఎంతోకొంతైనా రాయల్టీ ప్రభుత్వానికి దక్కేది. ఇప్పుడు ఆ చెక్పోస్టు కూడా ఎత్తేయడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సామాన్యులు, చిన్నా, చితకా వారి నుంచి ముక్కుపిండి రాయల్టీ వసూలు చేసే మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు.... ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టి తోలడం వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయి. పక్కనున్న జగనన్న కాలనీలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: పెరిగిన ఉష్ణోగ్రతల నేపధ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఉప కార్మిక కమిషనర్ శ్రీకాంత్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తమవంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికుల పని వేళల్లో మార్పు చేయాలని, పని ప్రాంతంలో చల్లని నీరు, నీడ వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిచే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశంలో కార్మికులు పనిచేయకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కుట్టుమిషన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ప్రొద్దుటూరు: బీసీ కార్పొరేషన్, కాపు, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22లోపు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న లబ్ధిదారులకు శిక్షణ అనంతరం 75 శాతంపైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికెట్, ఉచితంగా కుట్టుమిషన్ అందిస్తారని వివరించారు. 18–50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులని, తెల్ల రేషన్కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు ఉండాలని, కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులని తెలిపారు. మద్యం ప్రీమియం స్టోర్కు... కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రీమియం స్టోర్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రీమి యం స్టోర్ లైసెన్స్ వ్యవధి 5 ఏళ్లని, లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ. కోటి ఉంటుదని రెండవ సంవత్సరం నుంచి ఉన్న ఫీజు 10 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ప్రీమియం స్టోర్ కార్పెట్ వైశాల్యం 4 వేల చదరపు అడుగులు ఉండాలని తెలిపారు. ప్రీమియం స్టోర్ దరఖాస్తు కోసం రుసుము రూ. 15 లక్షలు డీడీ ద్వారా తీసుకురావాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈ నెల 26 సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆర్టీపీపీలో పెరిగిన బొగ్గు నిల్వలు ఎర్రగుంట్ల: డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో 1.38లక్షలు మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని ఆర్టీపీపీ సీఈ గౌరీపతి మంగళవారం తెలిపారు. ఆర్టీపీపీలోని 1,2,3,4,5,6 యూనిట్లలో గాను 1650 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి గాను ప్రస్తుతం 1420 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. అన్ని యూనిట్లులో విద్యుత్ ఉత్పత్తికి గాను సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం అవుతోందని పేర్కొన్నారు. పైడిపాళెం ఆయకట్టుకు కృష్ణా జలాలు కొండాపురం: గండికోట జలాశయంలో నుంచి గండికోట ఎత్తిపోతలపథకం వద్ద ముడు మోటర్ల ద్వారా 300 క్యూసెక్కులనీటిని పంపింగ్ చేస్తున్నట్లు జీకేఎల్ఐ ఈఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడిపాళెం జలాశయ ఆయకట్టు రైతులకు సాగు,తాగునీరు అవసరాల కోసం గండికోట ఎత్తిపోతల పథకం నుంచి గండికోట డ్యామ్ లో నిల్వ ఉన్న కృష్ణ జలాలను పంపింగ్ చేస్తున్నామన్నారు. పైడిపాళెం జలాశయం పూర్తి సామర్థ్యం 6 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో4.2 టిఎంసీలు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం గండికోట లో 23.5టిఎంసీలు ఉన్నట్లు గాలేరినగరి సృజలస్రవంతి ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. -
●ముగ్గురాయి లూటీ.. మౌనరాగమే అధికారుల డ్యూటీ!
వేంపల్లె: పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు అక్రమ మైనింగ్లతో చెలరేగుతున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు , లైసెన్స్ మాటే లేకుండా మైనింగ్ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాల్లో టీడీపీ నాయకుల దందా జోరుగా సాగుతోంది. వీరికి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అక్రమ మైనింగ్లో టీడీపీ బడా నాయకులకు వాటాలు కూడా వెళుతున్నట్లు సమాచారం. ఇటీవలే సంక్రాంతి పండుగ రోజు టిఫెన్ కంపెనీకి చెందిన దాదాపు రూ.15కోట్ల విలువైన ముగ్గురాయిని రాత్రికి రాత్రే వేముల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు తరలించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై టిఫెన్ కంపెనీ వారు పోలీసులకు, మైనింగ్ అధికారులకు సాక్ష్యా లతో సహా ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేకుండా పోయింది. మైనింగ్ పనులు చేపడుతూ వ్యక్తి మృతి.. వేంపల్లె మండలం కత్తులూరు గ్రామ సమీపంలో మైనింగ్ పనులు చేపడుతూ మంగళవారం ప్రమాదవశాత్తు చిట్టిబోయిన రామచంద్ర(55) మృతి చెందాడు. మృతుడు వేముల మండలం అమ్మయ్యగారి పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రోజులాగే ముగ్గురాయి పనులకు వెళ్లిన చిట్టిబోయిన రామచంద్రపై ఒకసారిగా మట్టి ఉళ్లి పడింది. ఆ మట్టిలో రామచంద్ర కురుకుపోయాడు. జరిగిన విషయాన్ని మృతుని బంధువులకు సమాచారమివ్వడంతో కుమారుడు రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని వెలికి తీశారు. అప్పటికే మట్టిలో కూరుకుపోయిన తండ్రి రామచంద్ర మృతి చెందాడు. వేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని వేంపల్లె సీఐ సురేష్ రెడ్డి, వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. -
జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కడప సెవెన్రోడ్స్: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం నోటీసు జారీ చేస్తారు. ఈ నోటీసు జెడ్పీ సభ్యులందరికీ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేది ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఆరోజు ఉదయం 10 గంటల ముందు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12.00 గంటల్లోపు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్హతగల నామినేషన్ల జాబితా విడుదల చేస్తారు. 1 గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏదైనా కారణాల వల్ల ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడపజిల్లాలోని ఖాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్చార్జి చైర్ పర్సన్గా జేష్ఠాది శారద వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా పరిషత్కు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుంది. -
గడ్డివాములు దగ్ధం
– స్పందించని అగ్నిమాపక సిబ్బంది సింహాద్రిపురం : ఆకతాయిలు చేసిన పనికి రైతులు వేసుకున్న గడ్డివాములతో పాటు ట్రాక్టర్ ట్రాలీ, పల్టర్ దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిదినంచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇళ్ల సమీపాన ఎవరో ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఊరి సమీపాన ఉన్న మొలకల జయరామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, మునిరెడ్డిలకు చెందిన నాలుగు గడ్డి వాములతోపాటు ఒక ట్రాక్టర్ ట్రాలీ, పల్టర్ దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.2లక్షలకుపైబడి నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఫోన్లు చేస్తున్నా అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పందించలేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. రెండు లారీలు ఢీ – డ్రైవర్ దుర్మరణం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులో మై హోం కాలనీ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో హెచ్పీ గ్యాస్ లారీ డ్రైవర్ గండ్లూరు కదిరయ్య (41) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి 1.30 గంటలకు జరిగింది. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన గండ్లూరు కదిరయ్య హెచ్పీ గ్యాస్ లారీకి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఎర్రగుంట్ల నుంచి కడప రోడ్డు మార్గాన వెళుతుండగా మైహోం కాలనీ వద్ద ముందు వెళుతున్న మరో లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హెచ్పీ గ్యాస్ లారీ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. లారీ డ్రైవర్ కదిరయ్య క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. కదిరయ్యకు కాలు తెగిపోవడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గురుశంకర్రెడ్డి తెలిపారు. రాయచోటి కేసులో 12 మందికి బెయిల్ కడప అర్బన్ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. నీటి సంపులో పడి బాలుడి మృతి మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్రెడ్డి, గీత దంపతులకు సాత్విక్రెడ్డి, చార్విక్రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. 35 గ్రాముల బంగారు గొలుసు చోరీ సుండుపల్లె : మండల పరిధిలోని పింఛాలో అమ్మణ్ణెమ్మ తన మనవడిని చూసేందుకు ఈ నెల 8వ తేదీన బెంగళూరుకు వెళ్లింది. సోమవారం తిరిగి తన స్వగ్రామానికి చేరుకుంది. ఇంటిలోకి వెళ్లగా బీరువా తాళాలు పగలగొట్టి 35 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేసినట్లు గుర్తించింది. -
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
ప్రొద్దుటూరు : స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మీటర్ రీడర్లు నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం వారు ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు సబ్ డివిజన్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, సుధాకర్, సురేష్, రమణ, శేఖర్, ప్రసాద్, పవన్కుమార్, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, రమణ, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. మండుతున్న కొండలు – వృక్ష సంపద అగ్నికి ఆహుతి పులివెందుల రూరల్ : అడవికి నిప్పు పెట్టడంతో మానవాళికి ముప్పు కలుగుతోంది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, చక్రాయపేట, వేముల, పులివెందుల మండలాల్లోని కొండలు అగ్నికి ఆహుతి కావడంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది. రేయింబవళ్లు కొండలపై మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కొండ, గుట్ట ప్రాంతా లలో కొంతమంది వ్యక్తులు కొండలకు నిప్పు పె ట్టడంతో కొండలు, గుట్ట ప్రాంతాల్లో ఉన్న వృక్ష సంపద ఎందుకు పనికిరాకుండా పోతోంది. ఆకతాయిలు కొండలకు నిప్పు పెట్టడంతో వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి అటవీ సంపదను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు 5500 ఫారం పాండ్స్ మంజూరు చక్రాయపేట : జిల్లాకు కొత్తగా 5500 ఫారం పాండ్స్ మంజూరయ్యాయని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన ఓపెన్ ఫోరం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రాయపేట మండలంలో సామాజిక తనిఖీ బృందం పరిశీలన సందర్భంగా రూ.55,227 రికవరీ చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 5500 ఫారం పాండ్స్ను మార్చి నుంచి జూన్ వరకు నెలకు 1400 చొప్పున పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. ఈనెల 22న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫారం పాండ్లకు సంబంధించి భూమి పూజ చేస్తారన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి భాస్కర్, ఏపీడీ సోమశేఖరరెడ్డి, డీవీవీఓ రామలింగేశ్వరరెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్ఆర్పీ భాస్కర్, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు -
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు పలు అంశాలను డీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దువ్వూరుకు కడప నుంచి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఓ ప్రయాణికుడు కోరారు. అలాగే కృష్ణాపురంలో స్టేజ్ ఏర్పాటు చేయాలని, ఒంగోలుకు ఎక్స్ప్రెస్ బస్సు నడపాలని, విజయవాడకు కావలి మీదుగా బస్సు ఏర్పాటు చేయాని మరికొందరు కోరారు. చిత్తూరుకు ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు తోడు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడంతోపాటు టైమింగ్ అప్డేట్ చేయాలన్నారు. శ్రీశైలంకు ఎక్స్ప్రెస్ కాకుండా సూపర్ లగ్జరీ బస్సు నడపాలన్నారు. పామూరుకు బస్సు ఏర్పాటు చేయాలని, ఎర్రగుంట్లకు సాయంత్రం 6 తరువాత బస్సు ఏర్పాటు చేయాలని, సబ్ జైలు దగ్గర బస్ షెల్టర్ ఆక్రమణలు తొలగించాలన్నారు. బస్టాండులో వివిధ వస్తువులను అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఖాజీపేట బస్సు స్టేషన్లో దెబ్బతిన్న కుర్చీలను బాగు చేయాలని, బస్సులు ఆపని సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరారు. -
ఇస్రో చూసొద్దామా !
● అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం ● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం ● మార్చి 23 వరకు ఆన్లైన్లో నమోదుకు గడువు షెడ్యూల్ ఇలా.. రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 23 వరకు ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల : ఏప్రిల్ 7 విద్యార్థులకు ఆహ్వానం : మే 18 యువికా కార్యక్రమం : మే 19వ తేదీ నుంచి 30 వరకు యువికా ముగింపు : మే 31వ తేదీ కడప ఎడ్యుకేషన్ : బాల్య దశలోనే విద్యార్థులను సైన్సు, అంతరిక్ష సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది, అంతరిక్ష వీక్షణం, ఉపగ్రహాల ప్రయోగాలు వంటి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ భావితరాల వారిని అంతరిక్ష శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) కింద 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 23 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు గడువును ప్రకటించింది. ఎంపిక ఇలా.. 8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 15 శాతం, ఆన్లైన్ ద్వారా నిర్వహించే క్విజ్లో 10 శాతం, సైన్సుఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలంపియాడ్ ఎగ్జామ్స్లో పాల్గొన్న వారికి 10 శాతం, ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరుగైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చక్కటి అవకాశం.. అంతరిక్ష రంగంపై ఆసక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. జాతీయ స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు మే 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్సు, కంప్యూటర్ సైన్సులపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్తో సంభాషించే అవకాశం కలుగుతుంది. లక్ష్యం ఇదీ.. అంతరిక్ష పరిజ్ఞానంలో మన దేశం పలు విజయాలతో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపి వారిని ఆ స్థాయిలో తీర్చిదిద్దేందుకు యూవికా ఏర్పాటు చేశారు. ఇలా భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలనుకుంటున్నారు. ప్రతిభావంతుల కోసం ఇస్రో ప్రకటన జారీ చేసింది దరఖాస్తు ఇలా..ఇస్రో ప్రధాన వెబ్ౖసైట్లో మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్టీటీపీఎస్://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఇన్/యువిక.హెచ్టీఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 9న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులకు ఆహ్వానం అందజేస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2025 నిర్వహిస్తారు. మే 31తో కార్యక్రమం ముగుస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
కురబలకోట ; కడప నగరంలోని జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నిర్వాహకుడు షేక్ జహీర్ (28) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన జహీర్ రెండేళ్లుగా కడపలో జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ పేరిట రెడీమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ట్రావెల్స్లో పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భార్య ప్రస్తుతం గర్భిణి. రంజాన్ సందర్భంగా విక్రయానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తమ్ముడు షమీర్ (26)తో కలిసి షేక్ జహీర్ కారులో బెంగళూరు బయలుదేరాడు. తనే కారు నడుపుకుంటూ వస్తుండగా కురబలకోట మండలంలోని మధ్యాహ్నంవారిపల్లె–రామిగానిపల్లె మధ్యలో మదనపల్లె–2 డిపోకు చెందిన గాలివీడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ప్రమాదవశాత్తు బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు షమీర్ కారులో వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం జహీర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడిపైనే కేసు.! ఇదిలా ఉండగా ప్రమాదానికి మృతుడు జహీర్ కారణమని కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న జహీర్ కారును నిద్రమత్తులో అదుపు చేయలేక వేగంగా బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అటు విచారణలోను ఇటు సంఘటన స్థల పరిశీలనలోను వెల్లడైందన్నారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఇదేమి.. విచిత్రం స్వామీ అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మృతుడి స్వస్థలం కడప బెంగళూరుకు వెళుతుండగా దుర్ఘటన -
ప్రాణం తీసిన ఈత సరదా
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని హనుమనగుత్తి గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయడు కుమారుడు గోటూరు మంజుగోపాల్ (9) సరదాగా ఈతకు వెళ్లి పెన్నానదిలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అదే గ్రామానికి చెందిన స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలసి మంజుగోపాల్ సమీపంలో ఉన్న పెన్నానదికి వెళ్లాడు. పెన్నానదిలో అనేక పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో సరదాగా స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అంతే గుంతలోని అడుగు భాగంలో మంజుగోపాల్ ఇరుక్కున్నాడు. పైకి రాకపోవడతో వెంటనే స్నేహితులు మంజుగోపాల్ తండ్రి సుబ్బరాయుడుకి సమాచారం అందించారు. వెంటనే స్థానికుల సాయంతో బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రలు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్ను జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ సోమవారం ప్రారంభించారు. రోలర్కు జిల్లా ఎస్పీ పూజ నిర్వహించి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. వర్షానికి గ్రౌండ్ తడవకుండా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ షీట్ను కూడా పరిశీలించారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది క్రీడల ద్వారా నూతనోత్తేజం పొందవచ్చని, స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఇతరులు కూడా స్టేడియంను అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చన్నారు. వివరాలకు 9121100641 లేదా 9000144343 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య , ఆర్.ఐ లు టైటస్, ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్)లో ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్ -
ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
బద్వేలు అర్బన్ : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని చెన్నంపల్లె ఎస్టీ కాలనీ సమీపంలో గల కాశినాయన గుడి వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో తనతో పాటు ఎస్ఐలు, సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. పట్టణంలోని రాజుగారివీధికి చెందిన దండు మనోజ్కుమార్, వల్లెరవారిపల్లె గ్రామానికి చెందిన రాజ్కుమార్లు గంజాయి విక్రయిస్తూ కనిపించారన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, అమ్మకాలు చేపట్టినా, వారికి సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో అర్బన్ ఎస్ఐలు ఎం.సత్యనారాయణ, జె.రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.1.50 కేజీల గంజాయి స్వాధీనం -
విద్యుత్ తీగలు తెగి అరటి పంట దగ్ధం
లింగాల : మండలంలోని బోనాల గ్రామంలో విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగి అరటి పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన రమేష్రెడ్డి అనే రైతు తన పొలంలోని చీనీ చెట్లను నరికివేసి పొలం గట్టుపైన వేశాడు. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు తెగి ఎండిన చీనీచెట్లపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి సుమారు ఎకరా పొలంలో ఉన్న మూడు నెలల అరటి మొక్కలు కాలిపోయి సుమారు రూ.50వేలు నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చీనీ పంటలో దిగుబడి రాక వాటిని తొలగించి అరటి పంట సాగు చేస్తే ఇలా కాలిపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్ను జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ సోమవారం ప్రారంభించారు. రోలర్కు జిల్లా ఎస్పీ పూజ నిర్వహించి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. వర్షానికి గ్రౌండ్ తడవకుండా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ షీట్ను కూడా పరిశీలించారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది క్రీడల ద్వారా నూతనోత్తేజం పొందవచ్చని, స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఇతరులు కూడా స్టేడియంను అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చన్నారు. వివరాలకు 9121100641 లేదా 9000144343 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య , ఆర్.ఐ లు టైటస్, ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
కడప ఎడ్యుకేషన్ : జమ్మలమడుగు పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల కళాశాల వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. కడపలోని వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆరు నెలల క్రితం ఇదే హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు యత్నించారన్నారు. అప్పుడే విచారణ జరిపి చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. స్థానికంగా నివాసం ఉండాల్సిన ఏఎస్డబ్ల్యూఓ గురుప్రసాద్ తన 35 ఏళ్ల సర్వీసులో ఏ ప్రాంతంలో పనిచేసినా పులివెందులలో నివాసం ఉండి విధులకు సక్రమంగా హాజరు అయ్యేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నరసింహ, గోపి, అయ్యన్న, రామ్చరణ్ పాల్గొన్నారు. -
లింగాల సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం
లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్ స్టేషన్లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్ స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అనిల్ కుమార్, రవీంద్రారెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్ స్టేషన్కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. -
● బీమా లేని బతుకులు
వారు నిరాశ్రయులు.. కన్నవారిని.. కన్న ఊరును వదిలేసి వచ్చిన వలస జీవులు. పగలంతా ఏదో ఒక పని చేసుకుని.. రాత్రయ్యే సరికి ఇదిగో ఇలా ఫుట్పాత్లపై నిద్రిస్తుంటారు. అయిన వారికి.. ఆత్మీయులకు దూరంగా ఉంటున్న వీరి బతుకులకు ఎలాంటి ధీమా లేదు.. వీరు సేద తీరుతున్న చోట గోడపైన ఉన్న జీవిత బీమా ప్రకటన చూసిన వారు ఏ బీమా వర్తించని బతుకులు వీరివే కదా అంటూ ఓ క్షణం ఆగి.. ఆలోచించి వెళ్లిపోతున్నారు. కడప నగరంలో ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో సాక్షి కంట పడిన దృశ్యమిది. – ఎస్కే మొహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప. -
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి డిమాడ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, అదేం ఖర్మో తెలియదు గానీ వర్షాలు అసలే పడవన్నారు. ఆయన పదిహేనేళ్లు అధికారంలో ఉంటే 14 ఏళ్లు కరువేనని, ఒక ఏడాది వరదలు వచ్చాయన్నారు. ఈ పదిహేనేళ్లలో రైతులు తమ పంటలు నష్టపోవడం మినహా బాగుపడింది లేదన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, రంగారెడ్డి పాలమూరు ఎత్తపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పేర్లతో అక్రమ నీటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వీటికి నీటి కేటాయింపులు లేకపోయినా ఇది అక్రమమని ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రశ్నించలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 885 అడుగులని, దానిపైన నీళ్లుంటే తప్పా రాయలసీమకు నీళ్లు రావన్నారు. 800 అడుగులుంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ఫలితంగా అవసరమున్నా.. లేకపోయినా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు కిందికిపోయేలా చేస్తున్నారన్నారు. కనిష్ట పరిమితి నిల్వ చేయకపోవడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రావడం లేదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు ఆనాడు తాకట్టు పెట్టడం వల్ల నేడు సాగునీరు కాదుకదా తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదలు వస్తే తప్పా శ్రీశైలం నిండటం లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా చంద్రబాబు నోరు మెదప లేదన్నారు. సీమలోని తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, చైన్నెకి తాగునీరు అందించాలంటే సుమారు 101 టీఎంసీలు కావాల్సి ఉందన్నారు. అందుకే దివంగత వైఎస్సార్ ఎక్కువ నీటిని తీసుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కులకు పెంచారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సామర్థ్యాన్ని 33వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. చంద్రబాబు అఽధికారంలో ఉండగా వైఎస్సార్ జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదన్నారు. అందుకే ఆయన రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారన్నారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని, దీనిపై తెలంగాణలోని టీడీపీ వారితో ఎస్జీటీకి ఫిర్యాదు చేయించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహణ చేయాల్సి ఉన్నా తెలంగాణ లెక్కచేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యా నందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బీహెచ్ ఇలి యాస్, శ్రీరంజన్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
లింగ వివక్ష చూపే వారిపై కేసులు నమోదు చేయాలి
కడప రూరల్/కడప కోటిరెడ్డి సర్కిల్: ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు కృషి చేయడంతో పాటు లింగ వివక్షతను చూపే వారిపై కేసులు నమోదు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి పి. జాన్ఇర్విన్ అన్నారు. సోమవారం స్ధానిక డివిజనల్ అధికారి కార్యాలయంలో థామస్ మన్రో మీటింగ్ హాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే బాలురతో పోలిస్తే బాలికల శాతం తక్కువగా ఉందన్నారు. అసమానతలు తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతం పెంచాలని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు చట్టపరమైన శిక్ష ఉంటుదన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నోడల్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు అబార్షన్లు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రబ్బాని, సీఐ బి. రామకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, టి.మెహన్కృష్ణ, భారతి, అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ తల్లితండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తొలిరోజు పరీక్ష కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెబుతూ కనిపించారు. మరికొందరు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కేంద్రాల్లోకి పంపారు. ఇంకొందరు దగ్గరుండి హాల్టికెట్లు నెంబర్లను చూడడంలో సాయపడ్డారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాలలో 27,800 మంది విద్యార్థులకుగాను 27,648 మంది హాజరుకాగా 152 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అబ్జర్వర్.. పదో తరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ మధుసూధన్రావు జిల్లాలోని ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్ను, మాధవరం జెడ్పీ హైస్కూల్ను, కొండమాచుపల్లి జెడ్పీ హైస్కూల్స్ను తనిఖీ చేసి ఛీప్ సూపరెండెంటెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా చర్యలు జిల్లావిద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్, పవన్ స్కూల్, వికాస్ స్కూల్, గంగాభవాని హైస్కూల్, సాయిబాబా హైస్కూల్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి రోజు 27,800 మందికిగాను 27,648 మంది హాజరు జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్, డీఈఓ -
వైద్యం బంద్ అని చెప్పారు...
నా బిడ్డ చెవి నొప్పి సమస్యతో బాధపడుతోంది. డా క్టర్కు చూపించడానికి కడప కు వచ్చాను. ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద చూడడం లేదు. అందరూ బంద్లో ఉన్నారు. రేపు రమ్మని చెప్పా రు. నా బిడ్డ చెవి నొప్పితో బాధపడుతుంటే ఎలా ఉండాలి. డాక్టర్కు ఫీజు కట్టి నా బిడ్డకు చూపించాలనుకుంటున్నాను. – రఫీక్, ఖాజీపేట నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా పేరు నమోదు కాలేదు నాలుగు రోజుల నుంచి కడపకు కంటి ఆపరేషన్కు సంబంధించి పుష్పగిరి ఐ హాస్పిటల్కు నా కుమారుడితో పాటు వస్తున్నా. కానీ ఇక్కడ ‘ఎన్టీఆర్ వైద్య సేవ’కు సంబంధించిన పేరు నమోదు చేయలేదు. ప్రతి రోజూ బస్సు ఛార్జీలు, సమయం వృథా అవుతోంది. ఈ రోజైనా నా పేరు నమోదు అవుతుందో లేదో. – ఖాజా రసూల్, చాగలమర్రి, నంద్యాల జిల్లా ఉదయం నుంచి... ఎడమకన్నుకు ఆపరేషన్ చేసుకోవాలని గతంలో డాక్టర్లు చెప్పారు. పోరుమామిళ్లనుంచి తెల్లవారుజామునే బయలుదేరి పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉదయాన్నే చేరుకున్నాను. ప్రాథమిక వైద్య పరీక్షల తరువాత ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి పేరు నమోదు చేసేందుకు వచ్చి ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా నమోదు కాలేదు.– రమీజా,పోరుమామిళ్ల -
‘వృద్ధురాలినన్న కనికరమూ లేదు..’
చేతిలో అర్జీ పట్టుకుని కుంటుకుంటూ కలెక్టరేట్కు వచ్చిన ఈమె పేరు బి. చంద్రమ్మ. వయసు ఏడు పదులు పైనే. ఏమైందవ్వా అని పలకరిస్తే.. ‘గూడు’ గురించి గోడు వెల్లబోసుకుంది. ఈమెకు వల్లూరు మండలంలోని ఎన్. ఓబాయపల్లెలోని లే అవుట్లో ఇల్లు మంజూరైంది. తన వృద్ధాప్య పెన్షన్ డబ్బుతో పాటు అల్లుడిచ్చిన కొంచెం డబ్బులతో ఇంటిని నిర్మించుకుంది. తనకు రావాల్సిన చివరివిడత డబ్బుల కోసం అధికారు లనడిగితే ‘నాలుగు ట్రిప్పుల ఇసుక, రెండు కిటికీలు మొత్తం రూ. 10,776లు విలువ చేసే సామగ్రి తీసుకు న్నావుగా.. ఇదిగో ఆన్లైన్లో కూడా చూపిస్తోంది చూడు’ అని జవాబిచ్చారు. నోరెళ్లబెట్టడం ఆమె వంతైంది. తన సంతకం లేకుండానే కమలాపురం గోడౌనుంచి తెచ్చుకున్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఆ గోడౌన్ ఎక్కడుందో కూడా తెలియదని వాపోయింది. వృద్ధురాలినన్న కనికరమూ లేకుండా పోయింది. ఇది వరకు ఓ సారి స్పందనలో ఫిర్యాదు చేస్తే.. తనకు తెలియకుండానే విచారణ చేసి ముగించారట. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి సారూ అని వేడుకుంది. -
బీఈడీ పరీక్షలు షురూ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని 15 కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. బీఈడీ పరీక్షలకు 4,463 మంది విద్యార్థులు, ఎంఈడీ పరీక్షలకు 63 మంది విద్యార్థులు హాజరయ్యారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో, విజయలక్ష్మి బీఈడీ కళాశాల పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వి కృష్ణారావు, అబ్జర్వర్లు ఆచార్య మాధవి, ఆచార్య రియాజ్ ఉన్నిసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కేఎస్వీ కష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. గండి దేవస్థాన భూములకు వేలం పాట చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వైవీయూ ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావుకడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయనను వైవీయూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు వైవీయూ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఫణతి ప్రకాష్బాబు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా నియమితులు కావడంతో ఆయనను రిలీవ్ చేశారు. ఆ స్థానంలో నూతన ఇన్చార్జి వైస్ ఛాన్సలర్గా ఆచార్య అల్లం శ్రీనివాసరావును నియమించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 25న రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రాజంపేట : రాజంపేట బార్ అసోసియేషన్కు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ సీఈఓ పి.సురేష్కుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి హనుమంతు నాయుడు నామినేషన్ను దాఖలు చేశారు. మంగళవారం కూడా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 19న నామినేషన్ల స్క్రూటిని, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, 25న పోలింగ్, అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేడు డయల్ యువర్ డీఎం కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం ఢిల్లీశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన తెలుపుతూ మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రయాణీకులు తమ సమస్యలను, సూచనలు, సలహాలను 99592 25774 అనే ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయాలన్నారు. -
స్మశాన భూమి ఆక్రమణలు తొలగించాలి
బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామ సర్వే నెంబరు 464లో ప్రభుత్వం 1976లో 10.05 ఎకరాల భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించింది. అందులో ఎనిమిది ఎకరాలు పైబడి భూమిని కొంతమంది దురాక్రమించారు. దురాక్రమణల నుంచి స్మశాన భూమిని విడిపించాలంటూ 2017లో లోకాయుక్త కలెక్టర్కు ఆదేశాలు పంపింది. కానీ, రెవెన్యూశాఖ ఏడేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. – బాలనాయుడు, కందిమల్లాయపల్లె, బి.మఠం రహదారి సౌకర్యం కల్పించాలి మాది తెలుగుగంగ పునరావాస గ్రామం. మా గ్రామంలోకి రావాలంటే కందిమల్లాయపల్లె, సోమిరెడ్డిపల్లె గ్రామ పొలాల సర్వే నెంబరు 309, 310 నుంచి రావాలి. ఇరుకు రహదారి వల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు నిర్మాణంతోపాటు దాని వెంట విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. – ఆదినారాయణరెడ్డి, బి.మఠం -
బాబు పాలనలో అందరికీ ఇబ్బంద్లే !
కడప రూరల్ : ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’(ఆరోగ్య శ్రీ)లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధుల బహిష్కరించి..నిరసన తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చిన పేదలు ఉచిత వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాధులతో నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేదలు అక్కడ ఉన్న ‘ఆరోగ్య మిత్ర’హెల్ప్ డెస్క్ను సంప్రదిస్తే రోగుల రిజిస్ట్రేషన్తో పాటు అన్ని అంశాలు వారే పర్యవేక్షిస్తారు. ఆరోగ్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ప్రభుత్వం ఆరోగ్య మిత్రల రోల్ను ఆసుపత్రులకే అప్పగించింది. వారు చాలా ఆసుపత్రుల్లో అత్యవసరమైన అంటే ఇన్ పేషెంట్స్కు మాత్రమే వైద్య సేవలు అందించారు. కొన్ని చోట్ల అది కూడా జరగలేదని సమాచారం. మిగతా వారిని ఆసుపత్రి సిబ్బంది నేడు బంద్..రేపు రండి అని చెప్పి పంపించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనతో వెనుతిరిగి వెళ్లారు. కొంతమంది వెనుతిరిగి వెళ్లలేక..అనారోగ్యం బాధను తట్టుకోలేక వైద్యుడికి ఫీజును చెల్లించి వైద్య చికిత్సను పొందారు. మొత్తం మీద వైద్య సేవ సిబ్బంది ఒక్కరోజు విధులను బహిష్కరించినందుకే దాదాపు 3,255 రకాలకు చెందిన వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. 2007–2008లో నాటి సీఎం వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకూ ఏ రోజు వైద్య సేవలు నిలిచిపోలేదు. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆరోగ్య శ్రీ ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఏకంగా వైద్య సేవలే నిలిచిపోవడం గమనార్హం. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’సిబ్బంది విధుల బహిష్కరణ ఇబ్బందులు పడిన రోగులు ‘ఆరోగ్య శ్రీ’పథకం చరిత్రలో విధులను బహిష్కరించడం ఇదే ప్రఽథమం ఇతని పేరు బాబాసాహెబ్. వయసు 35 ఏళ్లు. కడప నగరం ఆజాద్నగర్కు చెందిన ఇతను వారం రోజుల క్రితం అనారోగ్యం పరిస్థితుల్లో 108లో రిమ్స్లో చేరాడు. మొదట ఆయాసం, జలుబు, దగ్గుతో చేరాడు. చేరిన సమయంలో వైద్యసేవల అనంతరం వివిధ వైద్య పరీక్షలను చేసిన డాక్టర్లు ఇతనికి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం వల్ల తిరుపతి స్విమ్స్కు రెఫర్ చేశారు. ఈ రెఫర్కు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు కడప రిమ్స్ ఐపీ విభాగంలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బందిలో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. దాదాపు గంటకు పైగా సమయం పట్టడంతో అల్లాడిపోయాడు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్ హై టెన్షన్ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మోటారు వైర్లు చోరీ రాజంపేట రూరల్ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్ వైర్ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్ వైర్ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్ వైర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. ‘నాకు రక్షణ కల్పించండి’ సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వేనెంబర్ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. సూరప్పగారిపల్లెలో భారీ చోరీ గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొటి బీరువాలో ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప – చిత్తూరు జాతీయ రహదారిపై షెంఫోర్డ్ స్కూలు సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం అర్థరాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. జమాలపల్లె గ్రామానికి చెందిన ఆరిఫ్, షేక్ అహ్మద్, అబ్దుల్లా గౌస్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హైవే పెట్రోలింగ్ రక్షక్ సిబ్బంది గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నూతన నియామకం రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షులకు నియామకపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లాబకష్, పుంగనూరు ఇన్చార్జి మురళీయాదవ్, పీలేరు ఇన్చార్జి సోమశేఖర్రెడ్డి, రైల్వేకోడూరు ఇన్చార్జి గోశాల దేవి, పార్టీ సీనియర్ నాయకులు రామకష్ణారెడ్డి, రాయచోటి చెన్నకష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే : షేక్ ఆదిల్ (రాజంపేట పట్టణం), మహదేవయ్య (రాజంపేట రూరల్), సల్మాన్(టి.సుండుపల్లె), సుబ్బరాయుడు (ఒంటిమిట్ట), శ్రీనివాస్ (చిట్వలి), రమేష్ (పుల్లంపేట), జీవరత్నం (పెనగలూరు), హరిక్రిష్ణారెడ్డి(ఓబులవారిపల్లె)ను నియమించారు. అలాగే బాబాసర్దార్ (రాయచోటి పట్టణం), నాగార్జున (లక్కిరెడ్డిపల్లె), గణేష్ (రామాపురం), సుబ్బయ్య (సంబేపల్లె), షబ్బీర్ఖాన్ (చిన్నమండెం), పీలేరు నియోజకవర్గంలో ఫిరోజ్ (గుర్రంకొండ), సాంబశివ (వాయల్పాడు), శ్రీకాంత్( పీలేరు), మదనపల్లె నియోజకవర్గంలో సతీష్రెడ్డి (రామసముద్రం), శేఖర్ (నిమ్మనపల్లె) లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారు. -
ఏప్రిల్ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. ఆదివారం ఆర్కే నగర్లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
గోవా మద్యం బాటిళ్లు పట్టివేత
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్ సర్కిల్ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. 18న పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 18న మంగళవారం పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యాసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్స్కు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ రకంగా బతుకుతారని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒకసారి డీఏ చెల్లించాలని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, పెన్షన్దారులకు ఈఎస్ఐ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. రిమ్స్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహంకడప అర్బన్ : కడప రిమ్స్లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని పాత పీఎంఎఫ్ వద్ద నలుగురు క్రికెట్ బుకీలను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇటీవల జరిగిన ఛాంపియన్ షిప్ ట్రోఫీ సందర్భంగా క్రికెట్ పందేలు నిర్వహించి పలువురు డబ్బులు పంచుకుంటున్నారని సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఆర్.నాగేంద్ర, గాలిపోతుల ఆనంద్, ఆర్.మనోజ్, బొమ్మిశెశెట్టి శివప్రసాద్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షిక వేడుకలు
బి.కొత్తకోట : సీపీఐ శత వార్షిక వేడుకలను ఆదివారం బి.కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక జ్యోతిచౌక్ నుంచి మెయిన్రోడ్డు, దిగువబస్టాండ్, పంచాయతీ వీధి, బైపాస్రోడ్డు, రంగసముద్రంరోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించారు. నారాయణ డప్పుకొట్టి ప్రదర్శనను ప్రారంభించారు. అంతకుముందు జ్యోతిచౌక్ చేరుకున్న నారాయణ ఇక్కడి సాదిక్బాషా బిర్యానీ హోటల్ వద్దకు వచ్చి సాధారణ వ్యక్తిలా గ్లాసుతో నీళ్లు తాగారు. వెనక్కి ఇస్తూ ఏం వండారు అని నిర్వాహకున్ని ప్రశ్నించగా బిర్యాని అని చెప్పడంతో కొద్దిగా అన్నం పెట్టమని ప్లేటులో తీసుకుని రుచి చూశారు. అక్కడే ఉన్న ఓ విలేకరి చికెన్ తినరా అని ప్రశ్నించగా తింటాను ఓ ముక్క పెట్టమని చెప్పి పెట్టించుకుని తిన్నారు. ర్యాలీ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. నారాయణ ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటిలో సభ్యునిగా పనిచేస్తున్న కాలం నుంచి బి.కొత్తకోటతో అనుబంధం ఉంది. దీంతో పాతతరం సీపీఐ నాయకులను పేరుతో పలకరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర, ఉపపధాన కార్యదర్శి సలీంబాషా, ఉపాధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి సాంబశివ, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, ప్రజానాట్యమండలి కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.సంజీవరెడ్డి, రవి శేఖర్ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్, విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
దీక్షలు విరమించండి
ప్రొద్దుటూరు రూరల్ : దీక్షలు విరమించి తరగతులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్(ఏపీఎస్వీసీ) చైర్మన్ డాక్టర్ పి.వి. లక్షుమయ్య పశువైద్య విద్యార్థులకు సూచించారు. ఆదివారం మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాల ఆవరణలో పశువైద్య విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీక్షలను విరమిస్తే పశువైద్య విద్యార్థుల తరపున ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. తరగతులు కోల్పోకూడదని, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పెంచిన రూ.10,500 స్టైఫండ్ మీకు సరిపోదని తనకు తెలుసునని ఇంకొంచం పెంచేందుకు తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. అందుకు పశువైద్య విద్యార్థులు మాట్లాడుతూ జీఓ వచ్చేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. మిగిలిన పశువైద్య కళాశాలలైన గరివిడి, గన్నవరం, తిరుపతి విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.ఏపీఎస్వీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య -
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేజర్ జనరల్ అజయ్మిశ్రా అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ సైనికుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మేజర్ జనరల్ అజయ్మిశ్రా, బ్రిగేడియర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. కల్నల్ మాథ్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన తొమ్మది మంది దివంగత సైనికుల సతీమణులను ఘనంగా సత్కరించారు. వారికి చీర, మెమెంటో, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు బహూకరించారు. మాజీ రిక్రూట్ సహదేవరెడ్డికి ట్రై స్కూటర్ అందించారు. అలాగే తొమ్మిది మంది మాజీ సైనికులకు ట్రై ప్యాడ్, వాకింగ్ స్టిక్స్, ఐదుగురికి వీల్ చైర్లు అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజాక్ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కల్నల్ ఎస్కే సింగ్, జాయింట్ డైరెక్టర్ హాస్పిటల్ సర్వీసెస్ కల్నల్ ఆర్.దత్తా, కల్నల్ బి.బుధౌరి, ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి, కల్నల్ రాంప్రకాశ్, కల్నల్ కుల్దీప్మానె, కల్నల్ అశ్విన్దాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొని తమ శాఖ ద్వారా అందించిన వైద్య సేవలను పర్యవేక్షించారు.మేజర్ జనరల్ అజయ్మిశ్రా -
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కమలాపురం : కమలాపురం మండలం ఎర్రబల్లె, కొత్తపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆక్రమణకు గురైన స్థలాన్ని లబ్ధిదారులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1994లో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 100/726 లో ఎర్రబల్లె కొత్తపల్లె ఎస్సీ కాలనీ వాసులకు 2.30 ఎకరాలు కేటాయించిందన్నారు. అందులో ఒక ఎకరాలో 30 మందికి ప్లాట్లు వేసి డీకేటీ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. మిగిలిన 1.30 ఎకరాలు కమ్యూనిటీ అవసరాల కోసం అలాగే వదిలేశారన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన ప్రతాప్రెడ్డి, ఓబుల్రెడ్డిలు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి ఎస్సీలకు అప్పగించాలని, అలాగే ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890
చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలుమదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్ మౌలాలి(35) పేపర్బాయ్గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప – చిత్తూరు జాతీయ రహదారిపై షెంఫోర్డ్ స్కూలు సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం అర్థరాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. జమాలపల్లె గ్రామానికి చెందిన ఆరిఫ్, షేక్ అహ్మద్, అబ్దుల్లా గౌస్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హైవే పెట్రోలింగ్ రక్షక్ సిబ్బంది గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నూతన నియామకం రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షులకు నియామకపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లాబకష్, పుంగనూరు ఇన్చార్జి మురళీయాదవ్, పీలేరు ఇన్చార్జి సోమశేఖర్రెడ్డి, రైల్వేకోడూరు ఇన్చార్జి గోశాల దేవి, పార్టీ సీనియర్ నాయకులు రామకష్ణారెడ్డి, రాయచోటి చెన్నకష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే : షేక్ ఆదిల్ (రాజంపేట పట్టణం), మహదేవయ్య (రాజంపేట రూరల్), సల్మాన్(టి.సుండుపల్లె), సుబ్బరాయుడు (ఒంటిమిట్ట), శ్రీనివాస్ (చిట్వలి), రమేష్ (పుల్లంపేట), జీవరత్నం (పెనగలూరు), హరిక్రిష్ణారెడ్డి(ఓబులవారిపల్లె)ను నియమించారు. అలాగే బాబాసర్దార్ (రాయచోటి పట్టణం), నాగార్జున (లక్కిరెడ్డిపల్లె), గణేష్ (రామాపురం), సుబ్బయ్య (సంబేపల్లె), షబ్బీర్ఖాన్ (చిన్నమండెం), పీలేరు నియోజకవర్గంలో ఫిరోజ్ (గుర్రంకొండ), సాంబశివ (వాయల్పాడు), శ్రీకాంత్( పీలేరు), మదనపల్లె నియోజకవర్గంలో సతీష్రెడ్డి (రామసముద్రం), శేఖర్ (నిమ్మనపల్లె) లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారు. -
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వ్యాల్యుయేషన్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ప్రారంభం కానుంది. ప్రధాన ద్వారంతోపాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. నాలుగు విడతల్లో మూల్యాంకనం.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 2,05,000 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,85,253 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,75,393 కు కోడింగ్ను కూడా పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం నాలుగు విడతల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో మూల్యాంకనం జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, 2వ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనం కోసం 450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 100 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 100 మంది స్క్రూటినైజర్లు, 25 మంది ఏసీఓలను నియమించినట్లు ఆర్ఐఓ తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి.. మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినటర్ల నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది.పేపర్ వ్యాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్గా ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య వ్యవహరిస్తారు. జనరల్–1 కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యారావు, జనరల్–2 గా కడప ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఉర్దూ లెక్చరర్ హబీబుల్లా, సీసీఓ–1గా ప్రొద్దుటూరు ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ రమణారెడ్డి, సీసీఓ–2గా కమలాపురం ఎయిడెడ్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీఓలు, సబ్జెక్టు ఎక్స్పర్ట్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. అధ్యాపకులను రిలీవ్ చేయకపోతే కళాశాలలకు జరిమానా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సివిక్స్, గణితం సబ్జెక్టులో చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లు తప్పని సరిగా రిలీవ్ చేయాలని స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. కళాశాలల్లో రిలీవ్ అయిన అధ్యాపకులు 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంపునకు హాజరుకావాలన్నారు. వ్యాల్యూయేషన్ డ్యూటికి నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేయని కళాశాలలకు బోర్డు ద్వారా జరిమానా విధిస్తామన్నారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ఏర్పాట్లు 2,05,000 పేపర్లకు మూల్యాంకనం నాలుగు విడతల్లో జరగనున్న స్పాట్ ప్రక్రియమూల్యాంకన విధులకు తప్పకుండా హాజరు కావాలి.. జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక హాజరుకావాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్ను అనుమతించడం జరగదు. కేంద్రంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. – బండి వెంకటసుబ్బయ్య, ఆర్ఐఓ, ఇంటర్ స్పాట్ క్యాంపు ఆఫీసర్ -
రూటే..సప‘రేటు’పై కలెక్టర్ స్పందన
● డీఎంహెచ్ఓ ఏఓను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేస్తూ ఆదేశం కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఈ నెల 7న సాక్షిలో ప్రచురితమైన రూటే..సప‘రేటు’అనే కథనంపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించారు. అధికారులను పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఏఓ శ్రీదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేశారు. అలాగే ఇందుకు సంబంధించి లోతుగా విచారించాలని ఒక అధికారిని నియమించారు. కాగా ఈ వ్యవహరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కోట్ల స్వాహాపై విచారణ కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అవినీతిపై ఈ నెల 16న సాక్షిలో ప్ర చురితమై ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’కథనం ఆ శాఖలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు సైతం స్పందించారు. విచారణకు ఆదేశించారు.ఈ నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఈ నెల 18న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగే మీటింగ్కు క్షయ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంబంధిత రికార్డులతో రావాలని ఆదేశించారు. అలాగే 2023–2025 నుంచి జరిపిన బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీయనున్నారు. ఘనంగా ఉరుసు సిద్దవటం: పరకోటలో వెలసిన హజరత్ సయ్య ద్ షా బిస్మిల్లాషా ఖాద్రీ దర్గాలో ఆదివారం ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి గంధోత్సవం సందర్భంగా ఫాతెహాను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గంధం అర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. కడప–ఒంటిమిట్ట మార్గంలోని ఉప్పరపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశం, కల్యాణ వేదిక, సాలాబాద్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రవేశం, టీటీడీ గెస్ట్ హౌస్, వీవీఐపీ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కల్యాణ వేదిక సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న జేసీలు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ లాంఛనాలతో వారికి స్వాగతం పలికి ప్రదక్షణ గావించి గర్భాలయంలోని మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ రంగమండపంలో సేదతీరిన వారికి అర్చకులు సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఒంటిమిట్ట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.డీఎస్పీ, సీఐలకు సూచనలు చేస్తున్న ఎస్పీ అశోక్ కుమార్ -
అమరజీవి త్యాగం ఆదర్శనీయం
కడప సెవెన్రోడ్స్: ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జాతికోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన అత్యున్నత విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కడప అర్బన్: దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికి గర్వకారణమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీఅశోక్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదనపు ఎస్పీ కె ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఆర్ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్వో విశ్వేశ్వరనాయుడు -
తప్పని పరిస్థితుల్లోనే నిరసన
ఉద్యోగ భద్రత..వేతనాల పెంపు ఇతర సమస్యల పరిష్కారానికి చాలా నెలల నుంచి ఆందోళన చేపడుతున్నాం. మా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాం. సమస్యలు పరిష్కారం కాలేదు. తప్పని పరిస్థితుల్లో ఈ నెల 17న కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్నాం. అలాగే 24న జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద, 27న మంగళగిరిలోఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద విధులను బహిష్కరించి శాంతియుత నిరసన తెలపాలని రాష్ట్ర కమి టీ నిర్ణయించింది. – విజయ్, అధ్యక్షులు, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ వైద్య మిత్రల యూనియన్ -
ప్రొద్దుటూరులో ఆగని చోరీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో దొంగతనాలు ఆగడం లేదు. చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నెల ఏడో తారీఖున మైదుకూరు రోడ్డులోని లక్ష్మీనగర్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. వస్త్రవ్యాపారి వల్లంకొండు రఘువంశీకి చెందిన 850 గ్రాముల బంగారు. 670 గ్రాముల వెండి, రూ. 7.70 లక్షలు నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే హౌసింగ్బోర్డులో మళ్లీ చోరీ జరిగింది. ఇక్కడి గోపిరెడ్డి శివశంకర్రెడ్డి ఇంట్లో సుమారు 25 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకొని వెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజుపాళెం మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన శివశంకర్రెడ్డి వ్యవసాయదారుడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్యారెడ్డి చదువుల కోసం ప్రొద్దుటూరులోని హౌసింగ్బోర్డు కాలనీలో డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. పొలం పనులు ఉన్నప్పుడు గ్రామానికి వెళ్లొస్తుంటారు. శివశంకర్రెడ్డి, భార్య కవిత, కుమార్తె ముగ్గురు ప్రతి రోజు మొదటి అంతస్తులోని బెడ్రూంలో పడుకొనేవారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచిన వారు బెడ్ రూం డోర్ తీయడానికి ప్రయత్నించగా రాలేదు. బయట గడియ పెట్టి ఉన్నారు. దీంతో శివశంకర్రెడ్డి పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్లు ఇంట్లోకి వెళ్లడానికి రాగా వంట గది వైపు ఉన్న డోర్ లాక్ తొలగించి ఉంది. ఈ విషయాన్ని అతను శివశంకర్రెడ్డికి తెలిపాడు. చోరీ జరిగిందని భావించిన అతను వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు. టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ ధనుంజయ వచ్చిన తర్వాత వారున్న బెడ్రూం గడియ తీశారు. తర్వాత లబోదిబో మంటూ వారంతా బయటికి వచ్చారు. 25 తులాల బంగారు చోరీ కవిత గాబరాగా ఎదురుగా ఉన్న మరో బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరచి.. అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాకర్ను పరిశీలిస్తే అందులోని బంగారు నగలన్నీ కనిపించలేదు. అందులో సుమారు 25 తులాల మేర వివిధ రకాల బంగారు నగలు ఉన్నాయి. బీరువా పక్కనే ఉన్న డ్రస్సింగ్ టేబుల్లో తాళాలు పెట్టామని, వాటిని తీసుకొని దొంగలు బీరువా తెరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా వేకువ జామున 3.30 గంటల సమయంలో కింద ఏదో శబ్ధం వినిపించినట్లు కవిత చెబుతున్నారు. ఎదురుగా ప్రధాన ద్వారంతో పాటు ఎడమ వైపున వంట గది పక్కన మరో ద్వారం కూడా ఇంటికి ఉన్నాయి. దొంగలు వంటగది పక్కన ఉన్న డోర్ లాక్ను తొలగించి సులభంగా ఇంటిపైకి ప్రవేశించారు. ముందు జాగ్రత్తగా శివశంకర్రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న బెడ్రూంకు గడియ పెట్టి ఎదురుగా ఉన్న మరో బెడ్రూంలోకి దొంగలు ప్రవేశించారు. డ్రస్సింగ్ టేబుల్లో బీరువా తాళాలు ఉండటంతో దొంగల పని సులభతరమైంది. ఖరీదైన వడ్డానం, ఇతర ఖరీదైన బంగారు హారాలను బ్యాంక్ లాకర్లో పెట్టామని లేదంటే భారీ నష్టం జరిగేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు పరిశీలించారు. శివశంకర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. ● హౌసింగ్ బోర్డు కాలనీలో 25 తులాల బంగారు దోచుకెళ్లిన దొంగలు ● కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నా బంగారు కొట్టేసిన అగంతకులు -
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది..ఇటీవల రాయచోటి ఘటనలో దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.. అని పలు పార్టీలు, సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నూర్జహాన్ కల్యాణ మండపంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మతసామరస్యం–ప్రాధాన్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, కేరళ, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడేందుకు ప్రయోగాలు చేస్తున్నదని తెలిపారు. ఐక్యతకు నిలయమైన రాయలసీమ ప్రాంతంలో మతచిచ్చు పెడుతున్నారని, బీజేపీ దాని అనుబంధ సంస్థలు పనిగట్టుకుని దాడులకు పూనుకుంటున్నాయన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి శోభాయాత్ర పేరిట ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్న ప్రార్థనా మందిరం వైపు వెళ్లి మతాచారాలకు విరుద్ధంగా వ్యవహరించి ముస్లింలపై దాడి చేసి వారే తమపై దాడి చేశారని కేసులు పెట్టి అమాయలను జైల్లో వేశారని చెప్పారు. రాయచోటిలో వీరభద్రస్వామి యాత్ర మధ్యాహ్నం మూడు గంటలకు మసీదు దాటుకోవాలని పోలీసులు చెప్పినప్పటికీ, వారు ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం 6:15 గంటలకు మసీదు వద్దకు తెచ్చారన్నారు. మసీదు ఎదుట డీజీలు, బాణసంచా కాలుస్తూ, డప్పులు, నినాదాలు చేస్తూ గొడవలు సృష్టించారని, మసీదులో ప్రార్థన చేసుకుంటున్న ముస్లిం పెద్దలపై పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. ఒకప్పుడు దేశ ప్రజలందరూ కలిసి బ్రిటీష్ వారిని ఎదిరించిన గడ్డలో ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి విడదీసే ప్రయత్నాలకు బీజేపీ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. బీజేపీ చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు విసిగిపోయారని, వారు తిరగబడే రోజు అత్యంత దగ్గరలోనే ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, నగర ముస్లిం ప్రముఖులు జిలాన్, అమీర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, గౌస్పీర్, సీఎస్ఐ టౌన్ చర్చి పాస్టర్ మోహన్ బాబు, మల్లెల భాస్కర్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఓబయ్య, ఎన్ఆర్సీ,సీఏఏ వ్యతిరేక కమిటీ కన్వీనర్ బాబు భాయ్, సీహెచ్ శివారెడ్డి, జాకీర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి తస్లీమా, గౌస్పీర్, ఎస్బీఐ తాహిర్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. రాయచోటి ఘటనకు బాధ్యులను శిక్షించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
మహిళపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : కమలాపురం పట్టణం గిడ్డంగివీధిలో ఈ నెల 13వ తేదీన లక్ష్మీదేవి అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడు ఆకుల రెడ్డి నవీన్ను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు నవీన్ ఇంటర్ వరకు చదువుకుని ఏడాది పాటు ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో పని చేసి మానేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగు, ఆన్లైన్ బెట్టింగ్లతో పాటు మద్యం తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తీర్చలేని స్థితికి చేరుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న కరంగుడి లక్ష్మీదేవి వద్ద తన మొబైల్ను కుదువ పెట్టి రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. సెల్ఫోన్ కూడా విడిపించుకోలేక లక్ష్మిదేవిని చంపేసి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్తో పాటు ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడులను బలవంతంగా లాక్కుని వెళ్లి వాటిని అమ్ముకుని అప్పు తీర్చాలనుకున్నాడు. దీంతో ఈ నెల 13వ తేదీ ఉదయం ఇంట్లో లక్ష్మీదేవి ఒంటిరిగా ఉన్న విషయం తెలుసుకుని, ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో పొడిచి మెడలో ఉన్న బంగారు నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడు బలవంతంగా లాక్కొని పారిపోయాడు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీఐ ఎస్కే రోషన్, సీసీఎస్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ ప్రతాప్రెడ్డి, సిబ్బంది తో కలసి దర్యాప్తు చేపట్టి శనివారం వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లె వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి బంగారు తాళిబొట్టు సరుడు, నల్లపూసల దండతో పాటు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. కాగా కేవలం రెండు రోజుల్లోనే దాడి కేసులో నిందితుడుని పట్టుకుని అరెస్ట్ చేసిన సీఐ రోషన్, ఎస్ఐ ప్రతాప్రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వారికి రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు సీజ్
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివారులోని చిన్నచౌక్ గ్రామ సర్వే నెంబర్ 919లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తుండగా సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కేసులతో వేధించడం సరికాదు కడప అర్బన్ : ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితులను శనివారం ఆయన కడప కేంద్ర కారాగారానికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఇలాంటి ఘటనలపై స్పదించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. ఎర్రగుంట్లలో చోరీ ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో అబ్దుల్ సత్తార్ ఇంటిలో చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్కుమార్ శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం వచ్చి సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. బాధితుతు తెలిపిన వివరాలకు మేరకు ...అబ్దుల్ సత్తార్ రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు జతల కమ్మలు, వెండి పట్టీలు, గజ్జెలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. -
‘కాశినాయన’పై దాడికి సీమపై వివక్షే కారణమా ?
కడప కల్చరల్ : కాశినాయన ఆశ్రమంపై దాడి చేసి అటవీ అధికారులు అక్కడి కొన్ని ముఖ్యమైన భవనాలను కూల్చివేయడానికి అధికారులు, రాజకీయ నాయకుల్లో రాయలసీమపైగల వివక్షే కారణమా అని రాయలసీమ ఆకాంక్షల పౌర వేదిక కోఆర్డినేటర్ అలవలపాటి రఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నబిడ్డలు అన్నం పెట్టకపోయినా ఆశ్రమంలో ఎప్పటికీ అన్నం లభిస్తుందని కాశినాయన ఆశ్రమానికి రోజూ వందలాది మంది అనాథలు చేరుకుంటారన్నారు. కుల మత గోత్రాలను పట్టించుకోకుండా అన్నార్తులను ఆదుకుంటున్న ఇలాంటి ఆశ్రమాలకు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఈ కూల్చివేతకు అటవీ నిబంధనలు ప్రధాన కారణం కాదన్నారు. కూల్చివేత సమయంలో ఉండిన స్థితిని పునరుద్ధరించాలని, అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. ఏపీజీబీ విషయంలో కూడా.. కాశినాయన ఆశ్రమం విషయంలో స్పందించినట్లే ఏపీజీబీ విషయంలో కూడా రాష్ట్ర మంత్రి లోకేష్ సరైన రీతిలో స్పందించి ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వేదిక కో ఆర్డినేటర్ రఘునాథ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 4 గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత పెద్ద బ్యాంక్ అయిన ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఉన్న కడపలోనే రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కొనసాగాలని ఈ ప్రాంతంలో రాజకీయ అనుబంధాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్ అక్రమాలపై విచారణ జరపాలి కడప సెవెన్రోడ్స్ : ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్ సాంబశివారెడ్డి అవినీతిపై విచారణ జరపాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్ కోరారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్ కె.శ్యామూల్కు వినతిపత్రం సమర్పించారు. సాంబశివారెడ్డికి అర్హత లేకపోయినా ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్గా అప్పటి డీఈఓ అనూరాధ నియమించారన్నారు. సుమారు ఆరు వేల మంది ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాశారని, ఒక్కొక్కరి వద్ద రూ. 5–8 వేలు సాంబశివారెడ్డి వసూలు చేశారని ఆరోపించారు. ఇలా రూ. 6 కోట్లు అక్రమంగా వసూలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు నాగమల్లయ్య, అశోక్, సూర్యవంశీ, నాగార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్ నిక్షేపాల సర్వే లింగాల : లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. రైతులకు తెలియకుండా వారి పొలాల్లో బోర్లు వేయబోమని కాంట్రాక్టర్లు మాధవరెడ్డి, సురేష్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన అక్షయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లేబర్ కాంట్రాక్టు పొంది ఈ అన్వేషణలో భాగంగా లింగాల, తొండూరు మండలాల్లో బోరుబావుల తవ్వకం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఆ గ్రామాల వీఆర్ఓలకు, సర్పంచ్లకు తెలియజేసి దండోరా వేయించి రైతులకు తెలియపరుస్తామన్నారు. అయితే రైతుల బోరుబావుల సమీపంలో బోర్లు వేయడం జరగదని, బోరుకు బోరుకు మధ్య దూరాన్ని పాటించి రైతులకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటామని వీఆర్ఓ బాబు తెలిపారు. గడ్డివామి దగ్ధం బ్రహ్మంగారిమఠం : బి.మఠం –బద్వేలు రోడ్డులో నరసింహస్వామి ఆశ్రమం దగ్గర ఉన్న గోశాలలో శనివారం తెల్లవారు జామున గడ్డి వామికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అంతకు ముందు రోజు గోశాలకు సమీపంలో ఉన్న నివాసముంటున్న వారికి గోశాల నిర్వాహకులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. గడ్డి వామి దగ్ధంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు. ఏఆర్ ఎస్ఐ సస్పెన్షన్ కడప అర్బన్ : కడపలోని పోలీస్ శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఐవీ రమణారెడ్డి (1824)ని సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది నిరుద్యోగ యువత వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసుకున్నారు. దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. వారి ప్రాథమిక నివేదిక మేరకు కర్నూలు డీఐజీ ఆదేశించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.4.89 లక్షలు కాజేశారు బి.కొత్తకోట : గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్కు వచ్చిన మేసేజ్ ఓపెన్ చేయగానే రూ.4.89 లక్షలు కాజేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మండలంలోని నాయనబావికి చెందిన దాదం లోకనాథరెడ్డి మొబైల్కు గతనెల 14న ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన లోకనాథరెడ్డి క్లిక్ చేసి తెరిచాడు. గట్టు కెనరా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.4,89,858 నగదు వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది. -
క్షయ నియంత్రణ పేరుతో.. కోట్లు మింగేశారు !
కడప రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ నియంత్రణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నాయి. అయితే ఈ నిధులు కొంతమంది అవినీతి పరులైన ఉద్యోగుల వలన పక్కదారి పడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ఒకటి. ఈ కార్యాలయం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉంది. అవినీతి జరిగింది ఇలా... క్షయ వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా క్షయ నియంత్రణ విభాగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.కోట్ల నిధులను కేటాయిస్తాయి. ఈ నిధులను క్షయ నియంత్రణకు సంబంధించిన అంశాలకు ఖర్చు చేయాలి. అయితే 2019 నుంచి 2025 ఏడాదిలో ఇప్పటి వరకు ఆ విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు నిధులను పక్కదారి పట్టించారు. ● ఎన్పీవై (నిక్షయ్ పోషణ యోజన) స్కీం కింద టీబీ పేషెంట్ల పౌష్టికాహారానికి సంబంధించి ప్రభుత్వం ఒకరికి ఒక నెలకు రూ.500 చొప్పున 6 నెలల కాలానికి రూ.3 వేలు అందజేస్తుంది. అలాగే క్షేత్ర స్థాయిలో పేషెంట్ ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలను ‘ట్రీట్మెంట్ సపోర్టర్స్’గా ఆశాలు నిర్వహిస్తారు. ఈ ఆశాలకు కూడా ఒక పేషెంట్కు ఆరు నెలల కాలానికి రూ.3 వేలు వారి ఖాతాలకు జమ చేస్తారు. వ్యాధిగ్రస్తులకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) ద్వారా రూ.3 వేలు అందిస్తారు. ఈ నిధులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు అకౌంట్ నంబర్లను మార్చి తమకు అనుకూలమైన అకౌంట్లకు నిధులను జమ చేశారు. ట్రీట్మెంట్ సపోర్టర్స్కు ఇవ్వవలసిన డబ్బులను పీఎఫ్ఎంఎస్లో అకౌంట్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్స్ను మార్పు చేసి అక్కడ పనిచేసే ఉద్యోగి తనకు సంబంధించిన వారి అనధికారిక ఖాతాలకు దాదాపు రూ.12 లక్షలు దారి మళ్లించారు. ఇందుకు సంబంధించి నోట్ ఫైల్, పీఎఫ్ఎంఎస్ నుంచి పంపిన అకౌంట్స్ వివరాలు, ట్రీట్మెంట్ సపోర్టర్స్ వివరాలను పరిశీలించాలి. ● జిల్లాలో 40 మంది టీబీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. వారందరికీ పీఓఎల్ (పెట్రోల్ బిల్లులు) చెల్లించాలి. ఒకరికి ఒక నెలకు రూ.3500 వరకు వస్తుంది. ఈ బిల్లులను 5–6 నెలలకు ఒక సారి చెల్లిస్తారు. అందుకు గాను ఒకరి నుంచి రూ.2 వేలు వసూలు చేస్తారు. ఎందుకని అడిగితే జిల్లా అధికారులకు ఇవ్వాలని సమాధానం ఇస్తారు. అలాగే ఫీల్డ్ స్టాఫ్ మాత్రమే ఉపయోగించాల్సిన టూ వీలర్స్ను అక్కడ పనిచేసే ఉద్యోగి తన వాళ్లకు ఇచ్చారు. కొన్ని టూ వీలర్స్ను నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనిచేసే ఉద్యోగే ఉపయోగిస్తున్నారు. ● ఈ పెట్రోల్ బిల్లులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు తమకు అనుకూలమైన ఎస్టీఎస్ (సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్), టీబీహెచ్ఎస్ (ఫీల్డ్ స్టాఫ్) ఎంపీహెచ్ఎస్లకు అధిక మొత్తంలో బిల్లులను మంజూరు చేస్తారు. అందుకు సంబంధించిన డబ్బును ఆ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తారు. ఆ విధంగా వచ్చిన డబ్బును తమ ఖాతాల్లో వేసుకోకుండా అనుకూలమైన అక్కడే పనిచేసే ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఖాతాలను పరిశీలిస్తే ఆ వివరాలు తెలుస్తాయి. ● టీబీ డ్రగ్స్కు సంబంధించి తప్పుడు బిల్లులను పొందుపరిచారు. ఈ డ్రగ్స్కు సంబంధించిన నోట్ ఫైల్తో పాటు డ్రగ్ బిల్స్, పీఎఫ్ఎంఎస్ నుంచి ఆ నగదును ఏ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్స్కు బదిలీ చేశారో పరిశీలించాలి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు.. ఆ శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై ఈ నెల 12వ తేదీన ఓ వ్యక్తి రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు .రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, విజయవాడ అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర టీబీ నియంత్రణ అధికారితో పాలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్బాబును ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరూకురి విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం. విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి..ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖలో ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చజరుగుతోంది. అవినీతి సొమ్ముతో ఉద్యోగులు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారని అనుకుంటున్నారు. అక్రమ సంపాదనలో ఏ అధికారికి ఎంత వాటా ఉంది. దీని వెనుక ఏ అధికారి ప్రమేయం..హస్తం ఉంది అనే అంశాలు వెలుగు చూడాల్సి ఉంది. కాగా ఫిర్యాదుదారుడు చాలా వరకు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అంశాలపై నిజాయితీగా లోతైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే వచ్చిన ఆరోపణలు వాస్తవమా..అవాస్తవమా అనేది తేలుతుందని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ నిధులకు కన్నం ఉద్యోగుల చేతి వాటం ఉన్నతాధికారుల దృష్టికి అవినీతి బాగోతం విచారణకు డీఎంహెచ్ఓను ఆదేశించాం... క్షయ నియంత్రణ విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజును ఆదేశించాం. విచారణ చేపట్టిన తరువాత అందుకు సంబంధించిన నివేదికను తెప్పించుకొని పరిశీలించి, చర్యలు చేపడతాం. – డాక్టర్ రమేష్బాబు, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి, జాయింట్ డైరెక్టర్ -
రాజకీయ కక్షతోనే నిప్పంటించారు
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అయిన కొండారెడ్డి, సుధాకర్ షాపులు దగ్ధం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం రాజకీయ కక్ష సాధింపే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యర్తలు కొండారెడ్డి, సుధాకర్ పాతబస్టాండ్లో షాపులు నిర్వహిస్తున్నారు. కొండారెడ్డి కూల్ డ్రింక్ షాపు, సుధాకర్ ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఊహించని రీతిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఇరువురి దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి కొండారెడ్డి కార్యకర్తలతో కలసి వాహనాల్లో కడపకు వెళ్లారు. ఈ కారణంగానే వీరి షాపులకు నిప్పు అంటించారని తెలుస్తోంది. శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్రెడ్డి పాల్గొన్నారు. పాత బస్టాండ్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల షాపులు దగ్ధం -
పర్యవేక్షణ లోపమే విద్యార్థిని ఆత్మహత్యకు కారణం
జమ్మలమడుగు : హాస్టల్ వార్డన్ ప్రభావతి, అక్కడ వంట మనిషిగా పని చేస్తున్న ప్రసన్నల వికృత చేష్టలే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత (18) మరణానికి ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. దీంతో వార్డన్ ప్రభావతిని సస్పెండ్ చేయగా వంట మనిషిగా ఉన్న ప్రసన్నను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థినులు.. గత ఏడాది నవంబర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో అధికారులు వారి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలకు యత్నించినట్లు తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే తిరిగి ఇలాంటి సంఘటన జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ వార్డన్, వంట మనిషి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులను తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంట మనిషి ఆడపిల్లలను అర్థరాత్రి పూట బయటకు పంపిస్తోందని స్థానికులు చెప్పినా వార్డన్ పట్టించుకోలేదనే విమర్శలు వినవస్తున్నాయి. అక్షిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆత్మహత్య చేసుకున్న అక్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తప్పుడు నివేదిక ఇచ్చిన ఏఎస్డబ్ల్యూఓ గురుప్రసాద్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు -
పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
కడప అర్బన్: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యత అని, పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంగా ఉంటూ దైనందిన విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న స్టేడియం పరిసరాలను ఎస్పీ పాల్గొని పారలు, గునపం చేతబట్టి స్వయంగా శుభ్రపరిచారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికి స్పూర్తి కలిగిస్తుందనీ, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్. డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆనంద్, టైటస్, శివరాముడు, శ్రీశైలరెడ్డి, వీరేష్, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ -
ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎవరైనా తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందులో ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ బాబానాయక్ (9441683500), జయసూర్య (7358302380) లను నియమించినట్లు తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే వీరి నంబర్లకు కాల్ చేసి తెలియ చేయవచ్చని ఆర్జేడీ తెలియ చేశారు. రేపు ‘స్పర్ష్ అవుట్ రీబ్’ ప్రోగ్రాం కడప రూరల్: కడపలోని జిల్లా సైనిక సంక్షేమ భవనం దగ్గర ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్పర్ష్ అవుట్ రీబ్’పోగ్రాంను జిల్లాలోని మాజీ సేనికులు వారి కుటుంబ సభ్యలు సద్వినియోగం చేసుకోవాలని లీగ్ జిల్లా అధ్యక్షులు జడ్ ఫిలిప్స్ తెలిపారు. ఈ సందర్భంగా స్పర్ష్, ఈసీహెచ్ఎస్, కేఎస్పీ, డిజేబులిజీ పెన్షన్తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రేపు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది విధుల బహిష్కరణ కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కడపలోని జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి..నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా యూనియన్ అధ్యక్షుడు సి. విజయ్, జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 24వ తేదీన కడపలోని జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట, 27వ తేదీన మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన..విధుల బహిష్కరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. సిబ్బంది ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. వైభవం.. పుష్పయాగం గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉద యం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కడప సెవెన్రోడ్స్: ఈ నెల 16, 17 తేదీల్లో జరగనున్న ఏపీపీఎస్సీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 మధ్యాహ్నం 12.00 గంటల వరకు , తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా చూడాలన్నారు. లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెంట్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలోని సీకే దిన్నె మండల పరిధిలో నాలుగు, చాపాడులో ఒకటి, ప్రొద్దుటూరులో ఒక కేంద్రం కలిపి మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలు ఉంటాయని, ప్రతి కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులు ఎండీ బాబర్, ఎ.శివనారాయణరెడ్డి, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
కడప కార్పొరేషన్: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరుచుకోవాలని ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ అన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కడప నగర శివార్లలోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉన్న పాస్టర్స్ సెంటర్ ఆడిటోరియంలో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ కో–ఆర్డినేటర్ మద్దెల సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల అవగాహనకు ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుడు కొనే ప్రతి వస్తువు పైన కొన్ని హక్కులు ఉంటాయని, ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన న్యాయమైన, స్థిరమైన జీవితం వైపు ముందడుగు వేయాలన్నారు. మోసపూరిత చర్యలు లేకుండా ముందుకు సాగాలని, సైబర్ క్రైమ్ కు దూరంగా ఉండాలని వివరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల అప్రమత్తం కావాలన్నారు. సైబర్ క్రైమ్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏపీ స్టేట్ చైర్మన్ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కొనే ప్రతి వస్తువుపై బిల్లు తీసుకోవాలని వినియోగదారుల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా దీని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ని సంప్రదిస్తే తమ వంతు సహాయం చేస్తామన్నారు. స్టేట్ వైస్ చైర్మన్ మత్సు విశ్వనాథం, డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ మెరుగు రాధాక్రిష్ణ గౌడ్, అనకాపల్లి జిల్లా చైర్మన్ హేమంత్ చరపాక, కడప జిల్లా చైర్మన్ కిషోర్, చైర్మన్ అడ్మిన్ చైతన్య, కడప జిల్లా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ సాయి రమేష్