breaking news
YSR District Latest News
-
బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు.ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరోధించి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబుకు తొలి నుంచి రైతులపై ప్రేమ లేని కారణంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారన్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై గతంలో లాఠీ చార్జి చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో కొరత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు సమస్యలు లేవని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందించడంతోపాటు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు కూడా ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్నారు. సరైన ప్రోత్సాహం లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలులో వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తోందన్నారు. ఎంత మందిని ఎంత కాలం జైళ్లలో పెడతారని రాచమల్లు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, లావణ్య, జయంతి, రాగుల శాంతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చింపిరి అనిల్ కుమార్, రైతు నాయకులు టంగుటూరు విశ్వనాథరెడ్డి, శంకరాపురం మల్లికార్జునరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మల్లికార్జున ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం
కడప ఎడ్యుకేషన్ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్ ఫెలోషిప్, డాడ్ ఫెలోషిప్ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో సెవెన్ స్పోక్ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్ క్వాలిటీ అసూరెన్స్ సెల్ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్ టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర, సభ్యులు డాక్టర్ దాక్షాయని, డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్ పి. సరిత, డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు.సురేష్ బాబు పాల్గొన్నారు. వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు -
‘సంపూర్ణత అభియాన్’ సారథులకు సత్కారం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేసిన అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలు సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ కడప మాధవి కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా ఆకాంక్ష జిల్లా, బ్లాకుల లక్ష్య సాధనకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఏడీపీ భాగస్వామ్య శాఖల అధికా రులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప ఆకాంక్ష జిల్లాలో ఎంపికై న చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాక్లలో నీతి ఆయోగ్ గుర్తించిన 6 అంశాల్లో ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమాన్ని సంబంధిత శాఖలైన వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మొదలైన శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభు త్వం గుర్తించిన ఆరు ముఖ్యమైన సూచికల్లో (జీవన ప్రమాణాలు మెరుగు పరచుటలో) సంబంధించి సంతృప్తికర స్థాయిని పొందడమే సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి ఆకాంక్ష జిల్లా, బ్లాకుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ప్రెగ్నన్ట్ ఉమెన్ సమస్యలు, ఐసీడీఎస్లో బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్య శాఖలో మౌలిక సదుపాయలు, వ్యవసాయంలో సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, గ్రామీణాభివృద్ధి రంగాలు, ఏఏ గ్రూపులకు బ్యాంకు రుణాలు అందజేయడం.. వంటి ఆరు అంశాల్లో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుని వచ్చి సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్యాన్ని వంద శాతం సంతృప్తికర స్థాయిలో సాధించినందుకు గాను నీతి ఆయోగ్ మన జిల్లాకు మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగిందన్నారు. ఆరు ప్రామాణికాల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. 2018 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి హజరతయ్య, డీఎహెచ్ఓ శ్రీ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఈవో షంషుద్దీన్, డీఏవో చంద్రా నాయక్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎల్డిఎం జనార్దనం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి సూపర్ సెవెన్ క్రికెట్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 4వ సూపర్ సెవెన్ అండర్–23 యూత్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 11 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ప్రారంభించిన సీమాంధ్ర బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం క్రీడా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మార్తల సుధాకర్రెడ్డి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి, రాష్ట్ర సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర, నంద్యాల జిల్లా సెక్రటరీ కిరణ్, అన్నమయ్య జిల్లా సెక్రటరీ మురళీ, పలు జిల్లాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కృషి’కి దక్కిన ఫలితం
● ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని వరించిన పురస్కారాలు ● జోనల్ స్థాయిలో మూడు ప్రథమ, ఒకటి తృతీయ స్థానం ● హర్షం వ్యక్తం చేస్తున్న కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్తలు కడప అగ్రికల్చర్ : తమిళనాడులోని రాయవేలూరు వేదికగా ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన జోనల్ స్థాయి(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి,తెలంగాణ రాష్ట్రాలు) కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక కార్యాచరణ కార్యశాలలో కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రానికి జోనల్ స్థాయిలో నాలుగు పురస్కారాలు లభించాయి. ఇందులో ● షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు పరిచినందుకు ప్రథమ స్థానం. ● అపరాలు ఆదర్శ గ్రామం పథకాన్ని విజయవంతంగా నడిపిస్తునందుకు మూడవ స్థానం. ● జిల్లాలో మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విస్తరించినందుకు ప్రథమ స్థానం. ● అత్యుత్తమ ఫొటో విఽభాగంలో ప్రథమ స్థానం. ఈ పురస్కారాలను వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ(ఆలారీ)జోన్ –10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్. వీరా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్, జి. శివనారాయణ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ ఈ పురస్కారాలు రావడానికి కృషి చేసిన, తోడ్పాటు అందించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మికి, విస్తరణ సంచాలకులు డా. జి శివనారాయణ, సహాయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా. సుమతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ పురస్కారాలు సాధించడానికి విశేష కృషి చేసిన పూర్వపు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక, కార్యక్రమ సిబ్బందికి సహకరించిన వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల రైతులకు, వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
ఉల్లి ధర పతనంపై ఆందోళన
కడప సెవెన్రోడ్స్: ఉల్లి ధరలు భారీగా పడిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కడపలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఉల్లిగడ్డలు మార్కెట్లో క్వింటా వెయ్యి రూపాయలకు కూడా కొనడం లేదన్నారు. ప్రభుత్వం రూ.1200 ప్రకటించి కొనుగోలు చేస్తామంటోందని, ఈ రేటుకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి రూ. 80 వేల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగదారుల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించేందుకు, చీకటి మార్కెట్ల నివారణకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుత్నుప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, ఎన్.వెంకట శివ, కేసీ బాదుల్లా, సురేష్, జి.మద్దిలేటి, వెంకట్ రాముడు, శంకర్ నాయక్, భవాని శంకర్, నాగేశ్వరరావు, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, మునయ్య, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు రేటు రూ.3 వేలుకల్పించాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద ఉల్లిగడ్డలు తగలబెట్టిరైతు సంఘం నిరసన -
పిల్లల రక్షణ చట్టాల అమలుపై సమీక్ష
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్లో శ్రీబాలల న్యాయం, పిల్లల రక్షణ చట్టాల అమలులో సమస్యలు, సవాళ్ల్ఙు మొదలగు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని మాట్లాడుతూ శ్రీబాలల న్యాయం, జేజేబీ చట్టం 2015, పోక్సో చట్టం 2012, పీసీఎంఏ 2006, బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం 1986, పీసీ మరియు పీఎన్డీటీ చట్టం 1994, ఆర్టీఈ 2009, హెచ్ఏఎంఏ చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వికాస చట్టం 1977, ఎంటీపీ చట్టం 2021, అంగీకారాలు ఉన్న వ్యక్తుల హక్కుల చట్టం 2016 మొదలగు చట్టాల అమలులో సమస్యలు, సవాళ్లు మొదలు అంశాలపై వివరించారు. శాఖల వారీగా సమస్యలు, సవాళ్లు అంశాలను ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బాల్య వివాహాలు, గర్భధారణ, పిల్లల ఆరోగ్యం, విద్య, పునరావాసం, ప్రభుత్వ పథకాలు, దూరప్రాంతాల పిల్లల సదుపాయాలు అనే అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగ జన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కడప కం జ్యువెనల్స్ బోర్డ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కె. భార్గవి, జిల్లాలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : కడప నగరంలోని ఆరోగ్యమాత ఉత్సవాల్లో భాగంగా శనివారం 9వ రోజున నవదిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండ డాన్బాస్కో ప్రిన్సిపాల్ తాళ్ల విల్సన్ సందేశాన్ని అందజేశారు. తొలుత అలంకరించిన పల్లకీపై మరియమాత స్వరూపాన్ని ఉంచి చర్చి ప్రాంగణంలో విశ్వాసులు స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు ఆరోగ్యమాత సందేశాన్ని వినింపించారు. భక్తులు స్తుతి గీతాలు ఆలపించారు. తేరు, దివ్య బలిపీఠాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఎండీ ప్రసాద్రావు, ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి ఆనందరావు, డేవిడ్, ఆంథోని, జార్జి, రాజేంద్ర, మణి, జయరాజుతోపాటు పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. -
అన్నదాత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. ఎన్నికల వేళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు పంటల భీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు దాన్ని నిరూపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖామంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు బఫే భోజనం కోసం నిల్చున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేయడం దుర్మార్గమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. యూరియా అందుబాటులో ఉందని చెబుతూనే, యూరియా వల్ల కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. వరి రైతులను నిరుత్సాహపరిచేలా, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మార్క్ఫెడ్ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం, ఆర్బీకేలను నిర్వీర్యం చేసిందన్నారు. కడపలోని ఆలంఖాన్పల్లె సొసైటీకి 50 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి సొసైటీకి ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. యూరియాపై కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన దాన్ని రూ.600లకు విక్రయిస్తున్న పరిస్థితి ఉందన్నారు. యూరియా సరఫరాలో రూ.300 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధి ఏదీ? రాష్ట్రంలో గతం కంటే తక్కువ సాగు విస్తీర్ణం నమోదైనప్పటికీ.. సక్రమంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో పుట్టి వడ్లు రూ.16 వేలు ఉండగా, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఉందన్నారు. చీనీ టన్ను గతంలో లక్ష రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.15 వేలే ఉందన్నారు. ఉల్లికి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ఇవ్వడం దారుణమన్నారు. కనీసం క్వింటా రూ.3 వేలతో కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ నిధే ఏర్పాటు చేయలేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘రైతు పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రైతు పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు యానాదయ్య, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, దేవిరెడ్డి ఆదిత్య, సీహెచ్ వినోద్ కుమార్, షంషీర్, చెన్నయ్య, ఆర్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. పంటలకు దక్కని గిట్టుబాటు ధర యూరియా సరఫరాలో విఫలం 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
వేముల : మైనర్ బాలిక అత్యాచారం కేసులో కుంచపు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రవీణ్కుమార్లు తెలిపారు. వేముల పోలీస్ స్టేషన్లో శనివారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేముల గ్రామానికి చెందిన కుంచపు వెంకటరమణ 2021లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేవాడు. మధ్యలో చదువు ఆపేసి అప్పటి నుండి బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో గత నాలుగు నెలల నుండి వేముల గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ బాలికను బలవంతంగా మోటార్ సైకిల్పై ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కుంచపు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు. -
హెచ్ఐవీపై యువతకు అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు కడప రూరల్ : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి పట్ల నేటి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26లో భాగంగా శనివారం 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహించారు. కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు కొనసాగిన ఈ మారథాన్ యూ టర్న్ తీసుకుని తిరిగి మహావీర్ సర్కిల్కు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ అంటు వ్యాధి కాదని తెలుసుకోవాలన్నారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షను విడనాడాలన్నారు. ఇదే క్రమంలో యువత హెచ్ఐవీ బారిన పడి బంగారు భవిష్యత్తులను చేజేతులా కోల్పోవద్దని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్–టీబీ ఽఅధికారి డాక్టర్ యస్.రవి బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ /ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ వేంపల్లె మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ కి చికిత్స ఉందన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు . ఈ 5కే రెడ్ రన్ మారథాన్లో అబ్బాయిల విభాగంలో మొదటి బహుమతి ఎ. సింహాచలం (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప), రెండవ బహుమతి ఈ. సికిందర్ (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప) గెలుచుకున్నారు. అలాగే యువతుల విభాగంలో మొదటి బహుమతి శ్రీశ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ విమెన్ కాలేజీ, కడప), రెండవ బహుమతి కీర్తి (గంగాభవాని కాలేజీ) గెలుపొందారు. ట్రాన్స్ జెండర్స్ విభాగంలో మొదటి బహుమతి పింకి (యస్బీఆర్టీఎం కాలేజ్, కడప), రెండవ బహుమతి ఇ. మహేష్ (ఎస్వీ డీసీ కాలేజీ, కడప) గెలుపొందారు. జిల్లా క్రీడల అధికారి జగన్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురవయ్య, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, స్టాటిస్టికల్ ఆఫీసర్ రమేష్రెడ్డి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, కోచ్లు అమృత్రాజ్, కల్యాణ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పంటల సాగులో రైతులకు తోడ్పాటునందించాలి
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అధికారులు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ఊటుకూరు పరిశోధన కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా జేడీఏ, జిల్లా ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాగుచేస్తున్న పంటల వృద్ధి దశలు, వాటిలో ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్టు ప్రభాకర్రెడ్డి -
టపాసులు పేలి గాయపడిన వ్యక్తి మృతి
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకలకుంట పంచాయతీ బాగాదుపల్లెలో గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు కడప రిమ్స్కు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా గత వారం రోజులు గా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి భార్య పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మతిస్థిమితం లేని మహిళ భర్తకు అప్పగింత కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామంలో గురువారం రాత్రి మతిస్థిమితం లేని మహిళ తిరుగుతుండగా స్థానికులు గుర్తించి 112కు సమాచారమిచ్చారు. దీంతో నైట్డ్యూటీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు ఉప్పరపురమాదేవి అని, చాపాడు మండలం ఎన్.ఓబాయపల్లె గ్రామానికి చెందినదిగా పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు ఆమె భర్త యేసోబుకు సమాచారం అందించి స్టేషన్కు పిలిపించి రమాదేవిని ఆమె భర్తకు అప్పగించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్, పోలీసులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాయచోటి టౌన్ : రోడ్డు ప్రమాదంలో మురికినాటి రాజారెడ్డి (75) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్ఐ కుళాయప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం చెన్నముక్కపల్లె నుంచి తన పొలానికి స్కూటీపై రాజారెడ్డి వెళ్తుండగా కడప వైపు నుంచి మదనపల్లె రోడ్డు వైపు వస్తున్న ఏపీ39 యుఎస్ 9908 నంబర్ గల కారు ఢీకొంది. రాజారెడ్డి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
ఒంటిమిట్టలో మందుబాబుల వీరంగం
● చిల్లర దుకాణంపై పెట్రోల్తో దాడి ● చిల్లర బాకీ అడిగినందుకు ఘాతుకానికి దిగిన మందుబాబులు ఒంటిమిట్ట : బాకీ అడిగాడని చిల్లర దుకాణంపై మందుబాబులు పెట్రోల్ పోసి దాడి చేశారు. బాధితుల వివరాల మేరకు..చిన్న కొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఒంటిమిట్టలోని కల్యాణ్ రామ్ టౌన్ షిప్ వద్ద ఉన్న పట్నం పెంచలయ్య చిల్లర దుకాణంలో చిల్లర బాకీ చేసి ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కట్టా మల్లికార్జున పెంచలయ్య చిల్లర దుకాణానికి వచ్చాడు. మల్లికార్జున రావడంతో దుకాణాదారుడు పెంచలయ్య తనకు బాకీ ఉన్న చిల్లర తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఎంత ఉందని మల్లికార్జున పెంచలయ్యను ప్రశ్నించాడు. రూ. 170 బాకీ ఉందడని చెప్పగా నువ్వు రూ. 100 అబద్ధం చెబుతున్నావు. నేను బాకీ రూ.70 మాత్రమే ఉన్నానని దుకాణాదారుడు పెంచలయ్యపై మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున దాడి చేశాడు. దీంతో దెబ్బలు తిన్న దుకాణాదారుడు స్థానిక పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున ఆగ్రహావేశంతో కట్టా బాలకృష్ణా అనే వ్యక్తితో కలిసి సాయంత్రం 4:50 గంటలకు వచ్చి, పెట్రోల్ పోసిన ప్యాకెట్లను పెంచలయ్య దుకాణంపై విసిరి, దుకాణానికి నిప్పుపెట్టి పారిపోయారు. వెంటనే స్పందించిన దుకాణాదారులు, స్థానికులు మంటల్లో కాలిపోతున్న దుకాణంపై నీరు పోసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బాధితుడు పెంచలయ్య దుకాణంలో రూ. 45 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తనకున్న బాకీ అడిగినందుకు తనకున్న జీవనాదారమైన దుకాణంపై దాడిచేయడం ఆమానుశమని, ఇంతటి దౌర్జన్యం, రౌడియిజం ఎన్నడు లేదని దుకాణదారుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మందుబాబులను కఠినంగా శిక్షించాలని బాధిత దుకాణాదారుడు పోలీసులను ఆశ్రయించి, పిర్యాదు చేశానన్నా డు. ఒంటిమిట్ట పోలీసులు దాడికి గురైన దుకాణం వ ద్దకు చేరుకుని, దాడి జరిగిన ప్రదేశాన్ని, సీసీ కెమరా లో దాడికి సంబంధించి విడియోను పరిశీలించారు. -
పెన్నానదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య
● విస్తృతంగా జాలర్లు గాలింపు ● మాచుపల్లి సమీపాన మృతదేహాలు లభ్యం సిద్దవటం : పెన్నా నదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య (84), నాంచారమ్మ (80) దంపతులు బుధవారం తమ ఒంటిపై ఉన్న నగలు, నగదు ఇంటిదగ్గర పెట్టి కనబడకుండా పోవడంతో వారి పెద్ద కుమారుడు మహేష్ చెన్నూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమాంబ అమ్మవారిని దర్శించుకొని కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని పెన్నా నదిలో మొదట నాంచారమ్మ దూకగా కేసుపు అటూ ఇటూ ఇతరుగుతూ తడబడి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి కూడా పెన్నాదిలో దిగాడు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఒడ్డున నాంచారమ్మ పాదరక్షలు ఉండటంతో బంధువులు గుర్తించారు. మృతి చెందిన వృద్ధ దంపతుల చిన్న కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఐదుగురు జాలర్ల సహాయంతో పెన్నా నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మాచుపల్లి గ్రామ సమీప ప్రాంతాలలోని ముళ్లపొదల్లో మృతదేహాలు ఉన్నట్లు జాలర్లు గుర్తించి పెన్నా నదిఒడ్డున చేర్చారు. మృతి చెందిన వృద్ధులుగతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ అవస్థలు పడేవారు. పలుమార్లు వైద్యశాలలో చికిత్స కూడా చేయించామని వారి బంధువులు తెలిపారు. ఎస్ఐ మహమ్మద్ రపీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం మాచుపల్లి పెన్నా నది ఒడ్డున రిమ్స్ వైద్యుడు శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతులు వెంకటసుబ్బయ్య, నాంచారమ్మ (ఫైల్), పెన్నానది నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న దృశ్యం -
కవనీయం.. శ్రీరంగనాథుని కల్యాణం
రంగనాథస్వామిని దర్శించుకుంటున్న వైఎస్ మనోహర్రెడ్డి, కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు పులివెందుల టౌన్ : పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లె కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో భక్తులు చల్లా వంశీయుల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ భక్త జనసందోహంతో వేద మంత్రోచ్ఛారణలతో కమనీయంగా స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అంకాలమ్మ దేవస్థాన చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, పెద్దిరాజు, తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణ అనంతరం చల్లా వంశీయుల సౌజన్యంతో వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరంగనాథస్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో శ్రీరంగనాథస్వామి నూలుపూజ పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వి.రమణ, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, శ్రీరంగనాథ ట్రస్ట్ సీఈఓ అల్లం రంగనాయకులు, వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు సాయి భరద్వాజ శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు కాంభోజి మల్లికార్జున, దశరథ రామిరెడ్డి, మాధవాచారి, మేడం దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది,భక్తులు,తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శ్రీరంగనాథస్వామి నూలు పూజ పవిత్రోత్సవాలు -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రార్థనల్లో భాగంగా తొలుత జపమాల, పాటలను ఆలపించారు. ఆరోగ్యమాత స్వరూపాన్ని అలంకరించి పల్లకీలో ఊరేగించారు. గుంటూరుకు చెందిన రెవరెండ్ పాదర్ దేవ దివ్య సత్ప్రసాద ఆరాధన, ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు ఎస్జీజేకు చెందిన రెవరెండ్ ఫాదర్ ఆకుల ధర్మరాజు దివ్యబలిపూజ నిర్వహించి భక్తుల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గురువులు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ మరియమాత జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు. ఆ తల్లి ప్రేమ తరిగిపోనిదన్నారు. రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ గురువులు, కన్యసీ్త్రలు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కర్నూలులోనే కృష్ణా నది బోర్డు ఉండాలి
– పీసీసీ డెలిగేట్ శ్రీనివాసులరెడ్డి పులివెందుల టౌన్ : కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది జలాలు తెలంగాణ రాష్ట్రం తర్వాత కర్నూలు జిల్లాలోకి చేరుకుంటాయని, తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, వెలుగోడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కడప జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న గండికోట ప్రాజెక్టు, తదితర ప్రాజెక్ట్లకు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత గల శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు హైకోర్టు, రాజధాని రెండూ అమరావతిలోనే ఏర్పాటు చేసి రాయలసీమకు అన్యాయం చేశాయన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కమలాపురం : కమలాపురం–ఖాజీపేట ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామనూరు శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గంగవరం సమీపంలోని కుందూ నది వద్ద ఉన్న కాశీనాయన దేవాలయం సమీపంలో అరుగుపై కూర్చుని ఉన్న శ్రీరాములును సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అతడిని చితకబాదారు. మద్యం దుకాణంలో చోరీ ఖాజీపేట : మండలంలోని ఎస్వీబీ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బును దొంగలు దోచుకుపోయారు. ఖాజీపేట బ్రిడ్జి అవతల ఉన్న మద్యం దుకాణంకు చెందిన యజమానులు శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనుక భాగంలోని తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే దుకాణంలోనీ సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి ముఖానికి మాస్కు ధరించిన దొంగ తలుపు పగులకొట్టి లోనకు ప్రవేశించాడు. దుకాణంలోని నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యలను పరిశీలించిన తరువాత ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
నెల్లూరు జట్టు ఘన విజయం
ఆదిల్ హుస్సేన్, కడప (58 పరుగులు)అఖిల్, నెల్లూరు (3 వికెట్లు) శివ కేశవ, కడప (66 పరుగులు) నారాయణ, నెల్లూరు (3 వికెట్లు) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ మ్యాచ్లు శుక్రవారం మూడవ రోజు అనంతపురం జట్టుపై నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భార్గవ్ రాజు 45 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 44 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 3 వికెట్లు, అఖిల్ 3 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 160 అధిక్యంతో విజయం సాధించింది. కాగా నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 187 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్ : వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 80 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ 66 పరుగులు, ఆదిల్ హుస్సేన్ 58 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 4 ఓవర్లకు 40 పరుగులు చేసింది. దీంతో కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 297 పరుగులు చేసింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యంతో ఉండటంతో 03 పాయింట్లు లభించాయి. -
బోధనలో ఒరవడి సృష్టిస్తున్న ఖాసీంవలి
కాశినాయన : పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు సైతం విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఆ ఉపాధ్యాయుడి తపన. అతడి పేరు ఖాసీంవలి. మండలంలోని బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి ఖాసీం సాబ్ రిక్షా తొక్కుతూ అతనికి వచ్చిన సంపాదనలో కుమారుడు కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని చదివించాడు. తండ్రి ఆశయం కోసం అతడు ఎంతో కష్టపడి చదివి 2011లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టాడు. రాజంపేట మండలంలోని చెంచురాజుపల్లెలో 2011లో ఉపాధ్యాయుడిగా చేరి 2021 వరకు దశాబ్దకాలం పనిచేసి అటు విద్యార్థులు, ఇటు గ్రామ ప్రజల మన్ననలను పొందారు. పేదరికం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిగా ఖాసీంవలి పేద విద్యార్థులను చేరదీసి వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించి తనదైన శైలిలో చక్కగా పాఠాలు బోధించారు. చెంచురాజుపల్లె నుంచి నలుగురు విద్యార్థులను నవోదయ పాఠశాల ప్రవేశానికి శిక్షణ ఇచ్చి నలుగురు విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికకావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బోధన సామగ్రిని పంపిణీ చేయించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2021లో బదిలీపై మండలంలోని పిట్టికుంట ఎంపీపీ పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించుకోవడానికి డబ్బులు లేని విద్యార్థులకు ఖాసీం వలి తన సొంత డబ్బుతో యూనిఫాం కుట్టించి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బాలాయపల్లె పాఠశాలకు వెళ్లారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాఠశాల ఆవరణలో మొక్కలను నాటించి గ్రామస్తులు, మండల విద్యాశాఖ అధికారుల మన్ననలను పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో నిర్వహించిన సభలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఖాసీంవలి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఖాసీం వలి మాట్లాడుతూ పేదరికం కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడి ఉపాధ్యాయుడినయ్యానని తెలిపారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ప్రతి పేద విద్యార్థి చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై న ఖాసీంవలికి జనవిజ్ఞాన వేదిక జిల్లా, రాష్ట్ర నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి
● అడ్డుతగిలాడనే అక్కసుతో రమేష్ నాయక్పై సజీవదహన యత్నం ● ఆరుగురు నిందితులు అరెస్ట్, కారు స్వాధీనం మదనపల్లె రూరల్ : అన్నదమ్ముల ఆస్తివివాదాల నేపథ్యంలోనే బీకే.పల్లె వైఎస్సార్ కాలనీలోని షేక్ సలీంబాషా ఇంటిపైకి రాయచోటికి చెందిన వ్యక్తులు దాడిచేశారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. దాడి చేసే క్రమంలో సలీంబాషా ఇంటి కింది భాగంలో దుకాణం నిర్వహిస్తున్న రమేష్నాయక్ అడ్డుపడటంతో ఆగ్రహించి, పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించారన్నారు. సజీవ దహనానికి ప్రయత్నించిన కేసులో రాయచోటికి చెందిన ఆరుగురు నిందితులను శుక్రవారం పట్టణంలోని రామారావుకాలనీ ఆటోస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి, నేరం చేసేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మహేంద్ర కేసుకు సంబంధించి తెలిపిన వివరాలిలా.. పట్టణ శివారుప్రాంతం బీకే.పల్లె వైఎస్సార్ కాలనీలోని షేక్ సలీంబాషా తండ్రి షేక్ మహబూబ్బాషా, రాయచోటికి చెందిన ఖాసింసాబ్ అన్నదమ్ములు. వీరి రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంగా మనస్పర్థలు ఉన్నాయి. ఏడాది క్రితం షేక్ మహబూబ్బాషా రాయచోటిలో చనిపోయాడు. ఈ విషయంగా షేక్ మహబూబ్బాషా కుటుంబ సభ్యులకు అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణాంతరం ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున రాయచోటికి చెందిన ఖాసింసాబ్ కుమారులు షేక్జావేద్ హుస్సేన్(25), షేక్ షామీర్ హుస్సేన్(29)లు తమకు పరిచయస్థులైన షేక్ ఇలాహి అలియాస్ ఫాజిల్(32), కలికిరి మండలం దూదేకులపల్లెకు చెందిన వేంపల్లె మస్తాన్(38), కే.వి.పల్లె మండలం తిమ్మాపురం కొత్త ఇండ్లుకు చెందిన షేక్ అమీర్సాహెబ్(28), కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన కారు డ్రైవర్ కొమ్మిరిశెట్టి విశ్వనాథ్బాబుతో కలిసి మదనపల్లెలోని వైఎస్సార్ కాలనీకి చేరుకున్నారు. పథకం ప్రకారం మార్గమధ్యంలో ఓ పెట్రోల్బంకు వద్ద కారుకు డీజిల్ పట్టించి, బాటిల్స్లో పెట్రోల్ నింపుకున్నారు. సలీంబాషా ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్స్తో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. గేటును రాడ్లతో పగలగొడుతూ, ఇంటిపై రాళ్లు రువ్వుతూ, సలీంబాషాపై దాడిచేసేందుకు యత్నించారు. సలీంబాషా ఇంట్లో అద్దెకు ఉంటున్న రమేష్నాయక్ శబ్దాలు విని గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన జావీద్హుస్సేన్, షామీర్హుస్సేన్లు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ అతడిపై పోసి నిప్పంటించారు. ఈ విషయం గమనించిన సలీంబాషా, టూటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబసభ్యులు, బాధితుడ్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. నిందితులపై దాడి, హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభచూపిన సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. నిందితులు మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరులు రాయచోటి నుంచి వచ్చి మదనపల్లెలో రౌడీయిజాన్ని ప్రదర్శించి, ఎస్టీ కులానికి చెందిన రమేష్నాయక్పై సజీవదహనానికి యత్నించిన కేసులో నిందితులు జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఇదే వ్యక్తులు మదనపల్లెలో మంత్రి పేరు చెప్పి ఓ భూదందా సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. మంత్రి అండ ఉంది కనుకే.. రాయచోటి రౌడీమూకలు బరితెగించి మదనపల్లెలో దౌర్జన్యానికి పాల్పడ్డారని పలువురు మాట్లాడుకుంటున్నారు. -
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక
కడప సెవెన్రోడ్స్: భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, అందరూ మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) అడుగ జాడల్లో నడవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు. మహా ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ పేరుతో నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, కడప నియోజకవర్గ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ)ను అల్లాహ్ చివరి ప్రవక్తగా పంపారని పేర్కొన్నారు. ఆయన్ను ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపారని తెలిపారు. నగరంలో భారీ ర్యాలీ: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని కడప నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మర్కజీ మిలాద్ జులూస్ ఆధ్వర్యంలో అగాడిలోని ఇనాయత్ఖాన్ తాలిం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అల్మాస్పేట, వన్టౌన్, పొట్టిశ్రీరాములు సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండు మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సలావుద్దీన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు హజరత్ మహమ్మద్ అలీబొగ్దాది, హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అబ్దుల్ రెహ్మాన్ బొగ్దాది, హజరత్ అబ్దుల్ రహీం, హమీద్ హుసేన్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్బాబు, ఆరీఫుల్లా, నజీర్ అహ్మద్, అలీఖాన్, సుబాన్బాషా, షఫీవుల్లా, మహమ్మద్ అలీతోపాటు పెద్దఎత్తున ముస్లిం యువకులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మతపెద్దలు, నగర ముస్లిం ప్రముఖులు, నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు మహా ప్రవక్త అడుగుజాడల్లో నడవాలి మిలాదున్నబీ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చతుష్ఠార్చన, ద్వారతోరణ, అనంత కళాపూజ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిత్య హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, ఇతర అర్చకులతోపాటు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కడప రూరల్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈవీఎంలపై వ్యతిరేక జాతీయ ఉద్యమ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ కన్వీనర్ సంగటి మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశ ముఖ ద్వారమైన హైదరాబాదులో మధ్యాహ్నం 2 గంటలకు ఈవీఎంలకు వ్యతిరేకంగా చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల నేతలు అవ్వారు మల్లికార్జున, కై పు రామాంజనేయులు, దేవర శ్రీకష్ణ, గుర్రప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో యూనివర్సిటీ పాడ్ కాస్ట్ను ప్రారంభించారు. శుక్రవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కో ఆర్డినేటర్ నందిగం సత్యానంద రాం ఆధ్వర్యంలో నిజమైన చర్చలు, నిజమైన నైపుణ్యాలు, వాస్తవ ప్రపంచం అనే పేరుతో యూనివర్సిటీ పోడ్ కాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో యూఎస్ఏ నుంచి సీనియర్ మైక్రో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న మధుసూదన్రెడ్డి విద్యార్థులకు ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న అవకాశాలు, విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై సూచనలు అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, పరిపాలనాధికారి పి.రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
చాపాడు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా రైతు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగాన్ని విస్మరిస్తోందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించడం వల్ల ఈనెల 9న మైదుకూరులో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అత్యధికంగా మైదుకూరు నియోజకర్గంలో 92 వేల ఎకరాల్లో ప్రతి ఏటా వరితోపాటు వివిధ రకాలైన పంటలు సాగుతాయన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో యూరియా కొరత రైతులను వేధిస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి మైదుకూరు నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాల్లో యూరియా విక్రయించడం లేదన్నారు. దీంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ఎరువుల దుకాణాల్లో బస్తా రూ.400తో వ్యాపారులు గోప్యంగా విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరో వైపు ఉల్లి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఏమో క్వింటాల్ రూ.2 వేలకు కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ కనీసం రూ.800కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ క్రమంలో మైదుకూరులో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ నెల 9న మైదుకూరులోధర్నా, నిరసన ర్యాలీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి -
ఉపాధ్యాయులు.. సమాజ నిర్మాతలు
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ సభాభవన్లో మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి ఽరాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెలీ రాంగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వారంతా జ్యోతి వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైయిందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది రాజకీయ నాయకులు, అధికారులు కాదని గురువులేనని తెలిపారు. పిల్లలకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలన్నారు. ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపైన పడుతుందన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ తాను 15 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చానన్నారు. ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నాన్న కూడా ఉపాధ్యాయుడేనని, ఆయన మార్గదర్శకంలో నడిచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 64 మందికి అవార్డులు అందజేశారు. వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ కాగిత శ్యాముల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ డీఆర్ఓ విశేశ్వరనాయుడు, ఎస్ఎస్ఏ ఏపీసీ నిత్యానందరాజు, డిప్యూటీ ఈవోలు రాజగోపాల్రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్, జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటన్ సాంబశివారెడ్డి, సైన్సు మ్యూజియం క్యూరేటర్ రెహమాన్, పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు 64 మంది టీచర్లకు అవార్డులు ప్రదానం -
రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తా మని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టిందని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, చీని, మినుము, మిర్చి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు కావా ల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం, ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రైతులకు యూరియాను అందుబాటులో ఉంచలేక, యూరియా ఎక్కువ వాడితే కేన్సర్ వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ సమస్యలన్నింటిపై ప్రత్యక్ష పోరాటం చేయా లని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు జయప్రదం చేయాలని కోరారు. జయచంద్రారెడ్డి, బీహెచ్ ఇలియాస్, బంగారు నాగయ్య, బసవరాజు, అరీఫుల్లా బాషా, కె. బాబు పాల్గొన్నారు. ● ఈనెల 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ● మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కొండను తవ్వేశారు..!
● రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ తరలింపు ● అనుమతులు లేకుండానే తవ్వకాలు ● చర్యలు చేపడుతామంటున్న మైనింగ్ అధికారులు జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏకంగా కొండను తవ్వేసింది. పైసా ఖర్చు లేకుండా.. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా.. ఏకంగా 22 కిలోమీటర్ల దూరం రోడ్డ నిర్మాణం కోసం గ్రావెల్ వాడుకుంది. మండల పరిధి అంబవరం పంచాయతీలోని కొత్త గుంటపల్లె సమీపంలో ఎస్ఆర్సీ కంపెనీ ప్రకృతి వనరులైన కొండలను నాశనం చేసింది. దాదాపు 30 నుంచి 40 ఎకరాల్లో ఉన్న కొండ ప్రాంతాన్ని 30 అడుగుల మేర ఇటాచీలతో తవ్వి కొల్లగొట్టారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో శ్రీకొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టిశ్రీ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ ప్రాంతాన్ని మైనింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించబోతున్నారు. చర్యలు ఉంటాయా.. లేదా? జాతీయ రహదారి నిర్మాణం కోసం వాడే గ్రావెల్కు క్యూబిక్ మీటర్కు 700 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు తమకు పది వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం ఉందంటూ, దానికి అనుమతులు ఇవ్వాలంటూ తహసీల్దార్కు లెటర్ ఇచ్చారు. అయితే అనుమతులు లేకండానే ఏకంగా పది వేల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా గ్రావెల్ను రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగించినట్లు రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు. పైగా వార్త రావడంతో ఏమి చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. జాతీయ రహదారి అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల కంటె ఎక్కువగా గ్రావెల్కు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. ఈ డబ్బు అంతా కాంట్రాక్టర్ మిగిలించుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్పై తమకు ఫిర్యాదు అందిందని జిల్లా మైనింగ్ అధికారి రాధా తెలిపారు. దీనిపై విచారణ కోసం మైనింగ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు లేఖ పంపించామని పేర్కొన్నారు. మరి మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకుని, దానికి సంబంధించిన పరిహారం వసూలు చేస్తారో.. మరి కాంట్రాక్టర్, కంపెనీ, అధికార పార్టీకి దాసోహం అని తూతూ మంత్రంగా చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచికలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. పకడ్బందీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్కు సంబంధించి ఈ నెల 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష మధ్యాహ్నం 3.00 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు. ● పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు 08562– 246344 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
టీడీపీకి అండగా ఉన్న బలిజలకే మోసం
● పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే ● టీడీపీపై బలిజ సంక్షేమ సంఘం నేతల ఆగ్రహం కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బలిజ వర్గీయులను అవమానపరచడం తగదని బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం స్థానిక హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 27 శాతం మంది బలిజ వర్గీయులు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తామంతా అండగా నిలిచామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడానికి బలిజలు కృషి చేశారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక బలిజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జిల్లాలో పార్టీ కోసం పని చేసిన హరిప్రసాద్కు నామమాత్రంగా డైరెక్టర్ పదవిని ఇచ్చి బలిజలను అవమానపరిచారని తెలిపారు. బలిజలకు టీడీపీ ఎందుకు గుర్తింపు ఇవ్వలేదో అధిష్టానానికే ఎరుక అని పేర్కొన్నారు. రాయలసీమ బలిజ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పెత్తనమంతా ఒక సామాజిక వర్గానిదే సాగుతోందన్నారు. బలిజలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బలిజ భవన్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. టీడీపీ సిద్ధాంతం కోసం మా వాళ్లంతా కష్టపడితే, ఆ పార్టీ అధిష్టానం తమకు ఏ మాత్రం న్యాయం చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
పవన్కుమార్, 83 పరుగులు(నెల్లూరు) ఇకాక్షర్, 5 వికెట్లు(నెల్లూరు) కనిష్, 4 వికెట్లు (కర్నూలు) విజయ్రామిరెడ్డి, 80 పరుగులు(కడప) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 304 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 88.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 80, భరత్రెడ్డి 37 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 4, అక్షిత్రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయిసూర్యతేజరెడ్డి 58, అక్షిత్రెడ్డి 47, సాయి ప్రణవ్ 51 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3, ఎస్ఎండీ ఆయూబ్ 2 వికెట్లు తీశారు. కర్నూలు జట్టు 113 పరుగుల వెనుకంజలో ఉంది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 196 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 43.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వెంకట్ లోకేష్ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని ఇకాక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. నారాయణ 3, మాధవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లకు 350 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ జట్టులోని రోషన్ పవన్కుమార్ 83 పరుగులు, సూతేజ్రెడ్డి 81 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ 3 వికెట్లు, టీవీ సాయి ప్రతాప్రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 3 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: రాష్ట్రంలోని రైతన్నలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ వరి ఎక్కువగా పండించవద్దని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందించకుండా వరి పంట పండించవద్దని, యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్కు దారి తీస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పక్కదారి పడుతున్న యూరియాను అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా 12లక్షల టన్నుల ఎరువులను రైతులకు అందజేశామని వివరించారు. ఉల్లి ధరలు కూడా పతమైనప్పుడు తమ ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద దాదాపు 9వేల టన్నులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వాసుపత్రిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం గురువారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల లోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు పద్మనాభరెడ్డి సోదరుడు నాగేశ్వరరెడ్డిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యురాలితో నాగేశ్వరరెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యురాలితో సిటి స్కాన్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ప్రశ్నించగా సిటి స్కాన్ ఉన్నప్పటికి సిబ్బందిలేరని బదులి చ్చారు. దీనికి స్పందించిన ఎంపీ ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కూడా కక్ష సాధిస్తోందని, పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరైన 50 మెడికల్ సీట్లను తిరస్కరించడం అందుకు నిదర్శనమన్నారు. -
లోకేష్ వ్యాఖ్యలు నీచరాజకీయాలకు పరాకాష్ట
కడప కార్పొరేషన్ : రాష్ట్ర విద్య, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు నీచరాజయాలకు పరాకాష్ట అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు తన తల్లి విజయమ్మను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలకరించలేదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించడం విష ప్రచారానికి పరాకాష్ట అన్నారు. విషం చిమ్మడంలో లోకేష్ గోబెల్స్నే మించిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ వర్ధంతి రోజు తాను విజయమ్మ పక్కనే ఉన్నానని, వైఎస్ విజయమ్మను జగన్ అప్యాయంగా పలకరించడం అందరూ చూశారని, ఆ దృశ్యాలు అన్ని టీవీల్లోనూ ప్రసారం అయ్యాయన్నారు. కళ్లుండి లోకేష్ చూడలేకపోవడం దురదృష్టకరమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నామని టీడీపీ ఓటర్లు చెప్పడం ఎంత అబద్ధమో, వైఎస్ జగన్ను కలిసేందుకు పాసులు ఇచ్చారని లోకేష్ విషం చిమ్మడం కూడా అంతే అబద్ధమన్నారు. మీ చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో లోకేష్ సమాధానం చెప్పాలని రెడ్యం సవాల్ విసిరారు. నాడు వ్యవసాయం దండగ అన్న నారా చంద్రబాబు నాయుడు నేడు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వరి ఎక్కువ పండిస్తే కొనే వారే ఉండరని చెప్పడం రైతు వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు లేని వాటిని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వై.నిరంజన్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బి. సుబ్బరాయుడు యాదవ్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకటసుబ్బారెడ్డి -
ముంచుకొస్తున్న సోమశిల ముంపు జలాలు
● సగిలేరు లోలెవల్ వంతెనపైకి వచ్చే ప్రమాదం ● నిలిచిపోనున్న ఆరు పంచాయతీల రాకపోకలు ● ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజలు అట్లూరు : పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. సోమశిల జలాశయంలో రోజు రోజుకు నీరు పెరుగుతోంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేమలూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెనపైకి సోమశిల వెనుక జలాలు నేడో రేపో చేరనున్నాయి. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. శుక్రవారానికి 66 టీఎంసీలకు చేరుకున్నాయి. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సోమశిల జలాశయంలోకి రోజూ 23.500 కూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 10 వేల పైచిలుకు క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. దీంతో రోజుకు ఒక టీఎంసీ నీరు నిల్వ చేరుతుంది. ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగి అధికారులు ఇలాగే నీటిని నిల్వ చేస్తే.. మరో వారం రోజుల లోపే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. శుక్రవారానికి లోలెవల్ వంతెన లెవల్కు నీరు చేరింది. ఒక టీఎంసీకి అడుగు మేర నీరు వస్తుంది. ఇలాగే కొనసాగితే రెండు లేదా మూడు రోజులకు వేమలూరు వద్ద ఉన్న లోలెవల్ వంతెనపై రాక పోకలు పూర్తిగా నిలిచి పోతాయి. మండల కేంద్రానికి 40 కిలో మీటర్లు తిరిగి వెళ్లాలి అట్లూరు మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సగిలేరు నదికి తూర్పున ఆరు, పడమర ఆరు పంచాయతీలు ఉన్నాయి. లోలెవల్ వంతెనపై నీరు రెండు లేదా మూడు అడుగుల మేర చేరితే వాహన రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి. రాకపోకలు నిలిచిపోతే అట్లూరులో ఉన్న తహసీల్దారు, ఎంపీడీఓ, వెలుగు తదితర మండల కార్యాలయాలతోపాటు పోలీస్స్టేషన్, బ్యాంకులకు వెళ్లాలంటే బద్వేలు మీదుగా 40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఆరు కిలోమీటర్ల దూరం వెళ్తే సరిపోతుంది. ఈ పరిస్థితి సగిలేరు నదికి తూర్పు భాగాన ఉన్న ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మణ్యవారిపల్లి, కమలకూరు గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు నెలకొంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వంతెన పైకి నీరు చేరడంతో ప్రమాదం అంచున వెళుతున్న ప్రజలు(ఫైల్) సగిలేరు నది లోలెవల్ వంతెన లెవల్కు చేరిన సోమశిల ముంపు జలాలు -
రేపు 5కే రెడ్ రన్ మారథాన్
కడప రూరల్: కడప నగరంలో ఈ నెల 6న 5కే రెడ్ రన్ మారథాన్ను నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం ఉదయం 5.30 గంటలకు స్ధానిక మహవీర్ సర్కిల్ నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు అక్కడి నుంచి మహవీర్ సర్కిల్ వరకు మారథాన్ ఉంటుందన్నారు. వివరాలకు సెల్ నంబరు 9866094531, 9052038569 ను సంప్రదించాలని సూచించారు. ప్రొద్దుటూరు కల్చరల్: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఉమ్మడి కడప (వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల) జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.కృష్ణమూర్తి, కార్యదర్శి జి.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94901 81104, 7036907303 నంబర్లకు సంప్రదించాలని కోరారు. చింతకొమ్మదిన్నె: జిల్లా పరిషత్ సీఈఓ సి.ఓబులమ్మ స్థానిక చింతకొమ్మదిన్నె ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. జెడ్పీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన పనులకు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ సూచించారు. కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యా యి. నాలుగు రోజులపాటు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం, విశ్వక్సేన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు మయూ రం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణతరుణ్ ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యతను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ యస్.రమణ అన్నారు. గురువారం విద్యుత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడు వులోగా పరిష్కరించాలని, సమస్య మూలకారణాన్ని గుర్తించి సమగ్ర పరిష్కారం అందించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్ మంజూష, జిల్లాలోని ఏఈలు, జేఈలు పాల్గొన్నారు. -
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో గురువారం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో రెండవ మాసం కల్యాణం మఠం ఆస్థాన ప్రధాన అర్చకుడు ఇడమటికంటి జనార్ధనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారి శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి తన్మయులయ్యారు. ప్రతి నెల శుద్ధ ద్వాదశి నాడు దాతల సహకారంతో స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, పూజారులు, దాతలు పాల్గొన్నారు. -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా 2వ తేదీ దివంగత మహానేత వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించా రు. మంగళవారం మద్ధతు ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతుల కష్టాలను స్వయంగా రైతుల పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. అలాగే అంబకపల్లె గంగమ్మ కుంట చెరువులో జలహారతి ఇచ్చారు. దారిలోని నల్లపురెడ్డిపల్లెలో స్థానికులతో మాట్లాడారు. సోమ, మంగళవారాలలో భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలు, పార్టీ కేడర్లో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారాలను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచిస్తూ ప్రజలు, కార్యకర్తలలో మనో ధైర్యం నింపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మూడు రోజుల పర్యటన విజయవంతం -
కలిసిరాని కాలం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై అటు వ్యవసాయ అధికారులు ఇటు రైతులు కేసీ కెనాల్పైనే ఆశలు పెట్టుకున్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు జిల్లాలో 92 వేల ఎకరాలకుపైగానే ఉంది. కేసీ కాలువకు నీరు వస్తుండటంతో చాలామంది రైతులు వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు వస్తున్న నేపథ్యంలో కేసీ పరిధిలో భూగర్భజలాలు కొంత మేర అభివృద్ధి చెంది బోర్ల కింద కూడా సాగు విస్తీర్ణం పెరగనుంది. కడప అగ్రికల్చర్: ఈ సారి ఖరీఫ్ కూడా రైతులకు కలిసిరాలేదు. సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు పలకరించినా.. ఆపై వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో చాలా మంది రైతులు పంటలసాగు చేయలేకపోయా రు. మరో 25 రోజుల్లో సీజన్ కూడా ముగియనుంది. ఇప్పటికే ఖరీఫ్ లక్ష్యానికి ఆమడదూరంగా సాగు నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా 77,551 హెక్టార్ల సాధారణసాగు కాగా ఇప్పటివరకు కేవలం 21,179.8 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. అంటే సాగు కేవలం 27.31 శాతానికే పరిమితమైంది. మిగతా 70 శాతంపైగా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. ఇక అక్కడక్కడ అరకొరగా సాగు చేసినా పంటలకు అవసరమైన యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద యూరి యా కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రైతుల తమ పనులను సైతం వదులుకుని బస్తా యూరియా కోసం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించడంపై అన్నదాతలు అందోళన చెందుతున్నారు. మరో 25 రోజుల్లో ముగియనున్న ఖరీఫ్ ఇప్పటికే లక్ష్యానికి దూరంగా సాగు అరకొర సాగుకే యూరియా దొరక్క రైతుల అవస్థలు జిల్లావ్యాప్తంగా 27.31 శాతానికేసాగు పరిమితం -
యూరియా కోసం పడిగాపులు
నేను ఆరు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాను. యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సచివాలయానికి అరకొర వస్తోంది. అది వస్తే క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి అనుభవించలేదు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరఫరా యూరియాను సరఫరా చేయాలి. – నాగేశ్వర్ రెడ్డి, రైతు, రావులపల్లి, ఖాజీపేట మండలం కేసీ కెనాల్ పరిధిలో... ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందే వర్షాలు బాగా కురవడంతో సాగు పెరుగుతుందని ఆశపడ్డాం. కానీ సజన్ ప్రారంభం తరువాత వరణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. దీంతో సాగు అనుకున్న మేర కాలేదు. ఇటీవల కురిసిన వర్షానికి ఆరుతడి పంటలసాగు పెరిగే అవకాశం ఉంది. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం
కడప కార్పొరేషన్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, అంజద్బాషా, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేదని, ఉల్లి, చీనీ, మినుము పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా బ్లాక్మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 9న రైతు సమస్యలపై నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, నిరసనలు చేయాలన్నారు. ఈ ర్యాలీలు, నిరసనల్లో రైతులు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, నూర్బాష్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఓ. రసూల్, శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్ కమిటీ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
పెరిగిన నీటి ప్రవాహం
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల మైలవరం మండలం వేపరాల సమీపంలో యువకుడు గల్లంతు కావడం.. ఆతని ఆచూకి లభ్యం కాకపోవడంతో నీటినినిలుపుదల చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. తాజాగా మైలవరం జలాశయం నుంచి అధికారులు పెన్నాలోనికి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 4.5టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట జలా శయం నుంచి మూడు గేట్ల ద్వార పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మైలవరం ఇరిగేషన్ అధికారులు నీటిని 11వేల క్యూసెక్కుల మేర పెన్నానదిలోనికి విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పెన్నా పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
డాక్టర్ వైఎస్సార్ సంకల్పం... వైఎస్ జగన్ సాకారం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధించాలని తద్వారా ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పిస్తే... తండ్రి సంకల్పాల్ని సాకారం చేయడానికి గత ప్రభుత్వంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. మౌళికవసతులు సమకూర్చి పారిశ్రామిక ప్రగతికి అనువైన ప్రాంతంగా కొప్పర్తి పారిశ్రామికవాడను తీర్చిదిద్దారు. ఫలితంగా చైన్నె–విశాఖ పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తిలో రూ.2,147కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాటి స్ఫూర్తితోనే నేటి కొప్పర్తిలో ఫలాలందుతున్నాయనే జగమెరిగన సత్యాన్ని మంత్రి నారా లోకేష్ మరిచిపోయారు. అంతేనా..జిల్లాలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలించే కుటిల యత్నం చేసిన కూటమి సర్కార్ వైనాన్ని కప్పిపెట్టారు. కేవలం ప్రారంభోత్సవాలు చేసి తామే చేశామని గొప్పలు చెప్పుకోవడంపై జిల్లా వాసులు నవ్వుకుంటున్నారు.● వైఎస్సార్ జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా తీర్చిదిద్దాలని కడపకు కూతవేటు దూరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు 6వేల ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పారిశ్రామికవాడకు మౌళిక సదుపాయాలు కల్పించారు. పైగా అందులో డాక్టర్ వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ కూడా నెలకొల్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు ఆహ్వా నం పలుకుతూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందడుగు వేశారు.పెట్టుబడుల వెల్లువ..వైఎస్సార్ ఈఎంసీలో రూ.10వేల కోట్లు పెట్టుబడులు, దాదాపు లక్ష మందికి ఉద్యోగాలకు ప్రణాళికలు వేశారు. ఇదివరకే నాలుగు షెడ్లలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి ఉద్యోగాలు లభించాయి. 1.5లక్షల చదరపు అడుగుల సామర్థ్యం ఉన్న మరో మూడు షెడ్లను డిక్సన్ కంపెనీ తీసుకుంది. రెండో ప్లాంట్ విస్తరించేందుకు సిద్ధమైంది. డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ, సెల్కాన్ రిజుల్యూట్, చంద్రహాస్ ఎంటర్ ప్రైజెస్, యూటీఎస్పీఎల్ సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా 7500 ఉద్యోగాలు లభించనున్నాయి. అప్పట్లో వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా 6400 ఉద్యోగాలు లభించనున్నాయి. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటి అనే మరోరెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. టీవీలు, ల్యాప్టాప్లు, ఐఏటీ డివైజ్లు, ట్యాబ్ తయారీ తదితర వస్తువులు ఇక్కడే తయారుకానున్నాయి. వీవీడీఎన్సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమిత్తం ఆయా సంస్థలు సిద్ధమవడం విశేషం.వైఎస్ జగన్ కృషితోనే... సీఎం చంద్రబాబుకు .. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొప్పర్తి పారిశ్రామికవాడలో 2014– 19లో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని జిల్లా వాసులు నిలదీస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్లో ఇండస్ట్రీయల్ మెగా హబ్గా ప్రతిపాదనలు చేశారు. 2023లో మెగా ఇండస్ట్రీయల్ హబ్ను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఫలితంగా పరిశ్రమలు స్థాపనకు మార్గం సుగమమైంది. కాగా ఇక్కడికి మంజూరైన ఎంఎస్ఎంఈ టె క్నాలజీ సెంటర్ను సైతం అమరావతికి తరలించే యత్నాన్ని కూటమి సర్కార్ చేసింది. పెద్ద ఎత్తు న నిరసన తలెత్తడంతో వెనక్కి తగ్గింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా టీడీపీ పెద్దలు అబద్ధా లు చెబుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
నేటి నుంచి ఉల్లి కొనుగోలు
కడప సెవెన్రోడ్స్: మార్క్ఫెడ్ ద్వారా గురువారం నుంచి జిల్లాలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి ఒక క్వింటాలు రూ. 1200 ధరతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ, మైదుకూరు వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తాము పండించిన ఉల్లి పంటను ఇంటివద్దే శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని ఆమె కోరారు. పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం శ్రీరంగనాథుడు అశ్వవాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు. శుక్రవారం శ్రీరంగనాథుని కల్యాణాన్ని కల్యాణదుర్గం చల్లా వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా ఇన్ చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్గా (డీటీసీ) వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నగర శివార్లలోని ఊటుకూరు ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా డీటీసీగా విధులు నిర్వహిస్తున్న ఈయన్ను ఇన్చార్జ్ జిల్లా డీటీసీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ సమస్యలపై కార్యాలయంలో నేరుగా సంప్రదించాలన్నారు. -
బైక్ అదుపుతప్పి డీఎల్డీఓ సూపరింటెండెంట్ మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం(డీఎల్డీఓ)లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న తిప్పాబత్తిని గురుస్వామి (57) బుధవారం సాయంత్రం బైకు అదుపు తప్పి కిందపడిన ఘటనలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి బైక్లో బయలుదేరారు. మార్గమధ్యంలో సలివెందుల గ్రామం సుంకాలమ్మ దేవాలయం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. వెనుక వైపు నుంచి వస్తున్న వాహనదారులు గమనించి కిందపడిన గురుస్వామిని లేపి కూర్చోబెట్టారు. గురుస్వామి తన ఫోన్ ఇచ్చి సమాచారాన్ని తన కుమారుడు మురళికి తెలపాలని సూచించడంతో వారు ఫోన్ చేశారు. అనంతరం 108 సహాయంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడు మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి కేవీపల్లె : వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మండలంలోని నూతనకాల్వ పంచాయతీ కామిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కామిరెడ్డిగారిపల్లెకు చెందిన అబ్బవరం సత్యంరెడ్డికి చెందిన భూమిలో ఉన్న రాతి కూసాలను బుధవారం అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి, ఆనందరెడ్డి, దేవేందర్రెడ్డి, సందీప్రెడ్డి విరగ్గొట్టారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీకి చెందిన సత్యంరెడ్డి తోపాటు కంభం కొండారెడ్డి (61), కామిరెడ్డి వెంకటరమణారెడ్డి (42)లపై కొడవలి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ముగ్గురిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు సత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. గణేష్ ఊరేగింపులో యువకుడి హల్చల్ పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పీలేరులో జరిగిన గణేష్ ఊరేగింపులో రివాల్వర్తో ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పీలేరు పట్టణంలో గణేష్ విగ్రహాల సామూహిక ఊరేగింపు, నిమజ్జనం జరిగింది. ఊరేగింపు సందర్భంగా చెన్నారెడ్డికి చెందిన గణేష్ విగ్రహం వద్ద ఓ యువకుడు రివాల్వర్తో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ విచారణ జరిపి యువకుడు అధికార పార్టీకి చెందిన గుండ్లూరు వెంకటరత్నంగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రివాల్వర్ ఆకారంలో ఉన్న లైటర్గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. లైటర్ను స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ శివకుమార్ ఎదుట బైండోవర్ చేసి విడుదల చేశారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: ప్రజలు సమర్పించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించా రు. బుధవారం కలెక్టరేట్ సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై జేసీ అదితి సింగ్తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలపై ఎక్కువగా ఫిర్యా దులు అందుతున్నాయని.. వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు కూడా అందడం లేదన్నారు. సంబంధిత మండల తహసీ ల్దార్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులపై విచారణ జరపాలన్నారు. అర్జీదారుడు అందించే ఫిర్యా దుకు.. సరైన,సూటి సమాధానం ఇవ్వాలన్నా రు. తద్వారా అర్జీదారునికి సంతృప్త స్థాయిలో పరిష్కారం అందే దిశగా అధికారులు పని చేయాలన్నారు. ఈ విషయంలో జిల్లా శాఖాధిపతులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం.. ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్ పై సమీక్షించి పూర్ పర్ఫార్మెన్న్స్ రికార్డు నమోదైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ రీ అడ్రసల్ సిస్టమ్లో భాగంగా శాఖల వారీగా చేపట్టల్సిన కార్యక్రమాల ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. -
యూరియా స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన జేసీ
రాయచోటి : రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో ఉన్న యూరియా స్టాక్ పాయింట్లను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మిక తనిఖీ చేశారు. బధవారం రాయచోటి పరిధిలోని చెన్నముక్కపల్లి–2 లోని రైతు సేవాకేంద్రం, పట్టణంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులను బుధవారం పరిశీలించారు. యూరియా స్టాక్ను పరిశీలించి వ్యవసాయ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్తో కలిసి రాయచోటిలోని జాఫర్ సాబ్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి ఆ షాపు యాజమాన్యం నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. స్వామిత్ర సర్వే పరిశీలన... రూరల్ మండలం, దిగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న స్వామిత్ర సర్వే కార్యక్రమాన్ని జేసీ పరిశీలించారు. మండల సర్వేయర్, పంచాయతీ సెక్రటరీలకు తగు సూచనలు చేశారు. -
ఇది ప్రజలను ముంచే ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను ముంచే ప్రభుత్వమని గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్పలతారెడ్డి విమర్శించారు. బుధవారం కడపలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కూటమి నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, దాన్ని పీ4కు అప్పగించామని చెప్పడం దారుణమన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించడం దురదృష్టకరమన్నారు. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయారన్నారు. ఉద్యోగులకు ఇంకా పీఆర్సీ ప్రకటించలేదని, ఐఆర్, డీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించపోవడం దారుణమన్నారు. పాఠశాలల్లో నాడు – నేడు పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు కింద 80 శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చాలాచోట్ల అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద పాఠాలు వినాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లు పాడైపోయాయని, ఆర్ఓ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. ఈ సమావేశంలో 46వ డివిజన్ కార్పొరేటర్ ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
శివ కేశవ, కడప (43 పరుగులు) నాగ చాతుర్య, కడప (53 పరుగులు) ప్రశాంత్, అనంతపురం (90 పరుగులు)ప్రమోద్ కుమార్, అనంతపురం (5 వికెట్లు) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ చాతుర్య 53 పరుగులు, విజయ్ రామిరెడ్డి 62 పరుగులు, శివ కేశవ 43 పరుగులు, అయూబ్ 36 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో... కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 44.4 ఓవర్లకు 239 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 50 పరుగులు, మాధవ్ 56 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు, ప్రవీణ్కుమార్ సాయి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రశాంత్ 90 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 52 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 2 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
కొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టి.!
● గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ● చోద్యం చూస్తున అధికారులు రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన గ్రావెల్ లారీల ద్వారా తరలిస్తున్న గ్రావెల్ జమ్మలమడుగు : ప్రకృతి వరప్రసాదమైన కొండలను రోడ్ల నిర్మాణం పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇటాచీలతో కొండలను కొల్లగొట్టి అందులో ఉన్న గ్రావెల్స్ను భారీ లారీలతో తరలిస్తున్నారు. అధికారులు సైతం ఏమీ తెలియనట్లు, పైగా అది తమకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 167వ జాతీయ రహదారి పనుల కోసం .. నంద్యాల నుంచి జమ్మలమడుగు మండల పరిధిలోని మూడు రోడ్ల క్రాస్ వరకు 167వ జాతీయ రహదారుల పనులు చేపడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 22 కిలో మీటర్ల పనులు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తోంది. అయితే ఎస్ఆర్సీ కంపెనీ మాత్రం తమకు పదివేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కావాలని దానికి సంబంధించిన అనుమతులు కోరుతూ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారులు గ్రావెల్ తవ్వుకునేందుకు ఎక్కడ అనుమతులు ఇచ్చారో తెలియదు గాని తమకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో ఇటాచీలతో కంపెనీ మొత్తం కొండను తవ్వేస్తున్నారు. 30 నుంచి 50 ఎకరాల్లో... మండల పరిధిలోని కొత్తగుంటపల్లె సమీపంలో 30 నుంచి 50 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎస్ఆర్సీ కంపెనీ యాజమాన్యం తవ్వకాలు చేపట్టింది. భారీ వాహనాల ద్వారా ఈ ప్రాంతంలో గ్రావెల్ను బయటికి తీసి లారీల ద్వారా రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న జమ్మలమడుగు పట్టణంలో నుంచి భారీ లారీల ద్వారా గ్రావెల్ను తీసుకెళుతున్నా ఎందుకు, ఎక్కడికి తీసుకెళుతున్నారని ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు సైతం ప్రశ్నించడం లేదు. దీంతో భారీగా గ్రావెల్ తవ్వుకుని రోడ్డు నిర్మాణానికి ఉపయోగించుకుంటున్నారు. తమకు సంబంధం లేదంటున్న ఆర్డీఓ... మండల పరిధిలోని కొత్తగుంటపల్లె ప్రాంత సమీపంలో నుంచి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో గ్రావెల్ అక్రమంగా తీసుకెళుతున్నారని ఆర్డీఓ సాయిశ్రీని ప్రశ్నించగా గ్రావెల్ తీసుకెళ్లేందుకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వాలి కానీ, అది తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. మేము అనుమతి ఇవ్వలేదు.. జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్ఆర్సీ కంపెనీకి సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంది. వారికి మైనింగ్కు సంబంధించిన అనుమతులు తాము ఇవ్వలేదని జిల్లా మైనింగ్ అధికారి వెంకటసాయి పేర్కొన్నారు. -
వినాయక నిమజ్జనం వీడియో వైరల్పై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో ఇటీవల వినాయక నిమజ్జనం ఉరేగింపు వీడియో వైరల్ అయిన సంఘటనపై గ్రామంలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెద్దనపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి విగ్రహం వెనుక రప్పారప్పా అని రాసిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో గ్రామ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోను చూసి అంకాల్రెడ్డి, అంకిరెడ్డి, అశోక్రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. కాగా మరి కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 14 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో 14 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో 15 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటికి డ్రా తీశామన్నారు. మిగిలిన 14 బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఈనెల 14వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రవికుమార్ , సీఐ కృష్ణ కుమార్ పాల్గొన్నారు. ఈనెల 8న అప్రెంటీస్ మేళా కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి ఈనెల 8వ తేదీ కడపలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్స్ పుస్తకం, పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికై న వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ. 7700 నుంచి రూ. 10 వేలు స్టైఫండ్ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ముగ్గురికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో ప్రొద్దుటూరు మండలం లింగారెడ్డి నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న షేక్ జవహర్ మునీర్, కాశినాయన మండలం రెడ్డికొట్టాల ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఎస్జీటీ పరిమళ జ్యోతి, పెండ్లిమర్రి మండలం ఎగువపల్లి జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడు ఎఫ్ఎంఎస్ ఖాదర్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ లబ్బిపేటలోని ఏ– కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందుకోనున్నారు. షేక్ జవహర్ మునీర్, పరిమళ జ్యోతి, ఎఫ్ఎంఎస్ ఖాదర్ -
లింగ నిర్ధారణ పరీక్షలపై విచారణ
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఓ నర్సు సిఫార్సుతో కర్నూల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఘటనపై జమ్మలమడుగు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. బద్వేల్కు చెందిన ఒక గర్భిణీ లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అక్కడే పని చేస్తున్న లత అనే నర్సును ఆశ్రయించింది. ఆమె సూచన మేరకు సదరు గర్భిణీ ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న ఒక హాస్పిటల్లో పని చేస్తున్న రూతు అనే స్టాఫ్నర్సు వద్దకు వెళ్లింది. స్టాఫ్ నర్సు కర్నూల్లోని ప్రసాద్ అనే ఏజెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్లమని గర్భిణీకి తెలిపింది. ఆమె కర్నూల్లో బస్సు దిగగానే అక్కడి ఏజెంట్ గర్భిణీని ఒక స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. అయితే ఆమెకు ఏడు నెలల గర్భం కావడంతో స్కానింగ్లో స్పష్టంగా కనిపించలేదని, నెల రోజులు గడచిన తర్వాత వస్తే మళ్లీ పరీక్షలు చేస్తామని చెప్పి పంపించాడు. అంతేగాక గర్భిణీ వద్ద రూ. 10 వేలు డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే కర్నూలుకు వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే ఆమెకు అబార్షన్ అయింది. లింగనిర్ధారణ పరీక్షలు చేయనప్పుడు తమ డబ్బు ఇప్పించాలని బద్వేల్కు చెందిన మహిళ ప్రొద్దుటూరులోని నర్సును నిలదీసింది. ఈ విషయం బయటికి పొక్కడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీతా బుధవారం హాస్పిటల్కు వెళ్లి నర్సును విచారించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశామని, కర్నూల్లో స్కానింగ్ జరగడంతో అక్కడి వ్యక్తులు, స్కానింగ్ సెంటర్ వివరాలను కర్నూలు డీఎంహెచ్ఓకు తెలిపామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రొద్దుటూరులోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని అయితే తగు ఆధారాలుంటే తప్పకుండా స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామన్నారు. -
కేసుల రాజీకి కృషి చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని సూచనల మేరకు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో బుధవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత పోలీసు స్టేషన్ల వారీగా కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తుగా సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ హెగ్డే, కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు, రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం ఆర్.కృష్ణమోహన్, మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి.రాజేంద్రప్రసాద్, ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పి.భావన, కడప కోర్టు మానిటరింగ్ సెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ -
మహానేతకు ఘన నివాళి
వైఎస్సార్... భౌతికంగా మనిషి దూరమై పదహారేళ్లు గడిచాయి.. ఓ నాయకుడిగా ఆయన చేసిన మంచి ఇప్పటికీ ఉంది.. ఎప్పటికీ నిలిచే ఉంటుంది.. పేదల గుండె గడపల్లో ఆ నామం నిత్యం ధ్వనిస్తూనే ఉంది. ఆయన రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంది. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆ సత్యం నిరూపితమైంది. జోహార్..వైఎస్సార్ అనే నినాదం ఊరూరా మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. పల్లె..పట్టణం తేడా లేకుండా అభిమానులు అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు, పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కమలాపురంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న నరేన్ రామాంజులరెడ్డి పులివెందులలో రక్తదానం చేస్తున్న వైఎస్సార్ అభిమానులు పేదలకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పులివెందుల పట్టణంలోని భాకరాపురం వైఎస్సార్ ఆడిటోరియంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున యువతీ, యువకులు ఇందులో రక్తదానం చేశారు. పులివెందుల బైపాస్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలను అందంగా అలంకరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కడప కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళి అర్పించారు. కడప నగరంలోని హెడ్పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. యర్రగుంట్ల పట్టణంలో బస్టాండు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కమలాపురం వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కమలాపురం నియోజవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనాథ బాలుర క్షాత్రాలయంలో మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో మైదుకూరు రోడ్డులో అన్వర్ హాలు వద్ద, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మెన్ బి. లక్ష్మిదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారుమునిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నాగేంద్రారెడ్డి, ఆప్కాబ్ మాజీ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బద్వేల్ పట్టణంలోని గుంతపల్లె క్రాస్ రోడ్డు, బైపాస్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సేవలను స్మరించుకున్న నేతలు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు -
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
తాడిపత్రి రూరల్ : నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచారని రైతులు వాపోయారు. పట్టణంలో వైఎస్సార్ సర్కిల్లోని మధుసాయి ట్రేడర్స్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారిపల్లికి కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి వెళ్లాడు. తాను తాడిపత్రిలోని మధుసాయి ట్రేడర్స్కు చెందిన ఉద్యోగి అని అక్కడి రైతులకు చెప్పాడు. తమ వద్ద సోహా 007 రకం మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయని చెప్పాడు. కేవలం 110 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని ఆశ చూపాడు. దాదాపు 30 మంది రైతులకు ఆ విత్తనాలు కట్టబెట్టాడు. అతని మాటలు నమ్మిన రైతులు విత్తనాలను కొనుగోలు చేసి ఎకరాకు రూ.40 వేల నుంచి 45 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. అయితే, 90 రోజులు కావస్తున్నా పంట సరిగా రాకపోవడం.. మొక్కజొన్న కంకులు కూడా నాసిరకంగా ఉండడంతో తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన రైతులు ఇటీవల తాడిపత్రికి వచ్చి సాయిమధు ట్రేడర్స్ యజమానికి పరిస్థితిని వివరించారు. విషయాన్ని విత్తన కంపెనీ దృష్టికి తీసుకెళతానని చెప్పిన ఆయన మళ్లీ పట్టించుకోలేదు. దీంతో బాధిత రైతులు సోమవారం తాడిపత్రికి వచ్చి దుకాణం వద్ద నాసిరకంగా ఉన్న కంకులతో ఆందోళన చేశారు. తమ గ్రామానికి వచ్చిన వ్యక్తి షాపులో ఉండడం గుర్తించి అతడిని నిలదీశారు. తాను కంపెనీ ప్రతినిధిని కాదని, షాపులో పనిచేస్తున్న గుమస్తా అని చెప్పడంతో రైతులు మరింత మండిపడ్డారు. తమకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఏడీఏ రవి.. పెద్దపప్పూరు ఏఓ మహితా కిరణ్ను దుకాణం వద్దకు పంపించారు. షాపులోని మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. విచారణ తరువాత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని ఏడీఏ రవి తెలిపారు. -
మరణించినా నేత్రాలు వృథా కారాదు
జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మాధవి ప్రొద్దుటూరు క్రైం : మరణించినా వారి నేత్రాలు వృథా కారాదని జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మాధవి తెలిపారు. 40వ నేత్రదాన పకోత్సవాల సందర్భంగా పట్టణంలోని శ్రీనివాసనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఆప్తాల్మిక్ అధికారి కేజే రఘరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ వయస్సు భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చన్నారు. దెబ్బలు తగిలినప్పుడు, ఆపరేషన్ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, అంటు వ్యాధుల ద్వారా నల్లగుడ్డు దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. అలాగే ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారు, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు,హెపటైటిస్ బీ, సీ ఉన్నవారు నేత్రదానం చేయరాదన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 4 నుంచి 6 గంటల లోపల వారి నేత్రాలను సేకరించాలని చెప్పారు. డిప్యూటీ డీహెంహెచ్ఓ డాక్టర్ గీత మాట్లాడుతూ మనం మరణించిన తర్వాత మన కళ్లు వృథా కాకుండా నేత్రదానం చేస్తే ఇరువురు అంధులకు చూపును ప్రసాదించినవారం అవుతామని తెలిపారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్కాంత్, మధుకుమార్, రవికుమార్, డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, శోభ, ఆప్తాల్మిక్ ఆఫీసర్ తేజ, సీఓలు ఎంవీ సుబ్బారెడ్డి, నాగజ్యోతి, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో ఆటోమ్యాట్ యాప్ ఆవిష్కరణ
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆర్ – 21 బ్యాచ్కు చెందిన విద్యార్థులు రూపొందించిన ఆటోమ్యాట్ యాప్ను ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా ఆవిష్కరించారు. మంగళవారం వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఆటోమ్యాట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరించడానికి ఈ యాప్ ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ఈ ఆటో యాప్ ద్వారా షెడ్యూల్ ప్రకారం ఆటోలు అందుబాటులోకి వస్తాయని, నిజమైన, పారదర్శకమైన ధరల విధానంతోపాటు విద్యార్థుల భద్రత కోసం కంప్లైంట్ ఆప్షన్ ఉంటుందన్నారు. అలాగే తప్పు ప్రవర్తన, అధిక చార్జీలు, మొదలగు సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నారు. యాప్ను ఆటో డ్రైవర్లకు చెందిన మొబైల్స్లో ఇన్స్టాల్ చేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆటో యాప్ను రూపొందించిన విద్యార్థులు శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్లను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి పెనుగొండ రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాష్, సీఎస్సీహెచ్ఓడీ రత్నకుమారి, సెక్యూరిటీ ఆఫీసర్ శరవణ కుమార్, అసోసియేట్ డీన్న్ వీరరాఘవ రెడ్డి, అడ్మిన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైవీయూ భవనాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం అకడమిక్ బిల్డింగ్, ఆడిటోరియం, వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్ నిర్మాణాల శంకుస్థాపన శిలాఫలకాన్ని మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) కింద రూ.10.5 కోట్లతో యోగివేమన విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ కిచెన్ సెంటర్ ప్రారంభం చింతకొమ్మదిన్నె : రాష్ట్ర విద్య, మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ చింతకొమ్మదిన్నెలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ సెంటర్ను, ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. సాయంత్రం కొలుములపల్లి సమీపంలో కమలాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రారంభం పెండ్లిమర్రి : మండల కేంద్రం సమీపంలో నూతనంగా రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆ అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను, పరిపాలనా భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాపరంగా నాణ్యత పెంచడానికి సూచనలు అడిగారు. ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం ప్రారంభం కడప కార్పొరేషన్ : కొప్పర్తి పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని రాష్ట్ర విద్య, ఐటి, సాంకేతిక, ఆర్టీజీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రూ.31.50 కోట్లతో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం టెక్నోడోమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్ను సందర్శించి అక్కడ లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్ యూనిట్, డార్క్ రూమ్, ఈఎస్డీ ప్రొటెక్టెడ్ యూనిట్లను పరిశీలించారు. ఆ తర్వాత టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి యూనిట్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్ పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
కడప అర్బన్ : కడప– రాజంపేట రహదారిలో కడప నగర శివార్లలో రాజరాజేశ్వరి కళ్యాణమండపం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఉన్నట్టుండి ఎడమ వైపు నుంచి ఓ టిప్పర్ దూసుకురావడంతో రాజంపేటకు వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అదుపు చేసుకోలేక టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పాక్షికంగా దెబ్బతినింది. ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై కడప ట్రాఫిక్ పోలీసులు విచారిస్తున్నారు. -
బాలుడిని గదిలో ఉంచి.. తాళం వేసిన అంగన్వాడీ టీచర్
● స్పృహ తప్పిపడిపోయిన వైనం ● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం బ్రహ్మంగారిమఠం : పిల్లలందరూ ఇంటికి వెళ్లారని భావించి ఓ బాలుడు లోపల ఉండగానే అంగన్వాడీ టీచర్ బడికి తాళం వేసుకుని వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుతో బడి తాళాలు పగులగొట్టి చూడగా బాలుడు లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఈ సంఘటన బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీ పీసీపల్లె అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. బాలుడి తండ్రి వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. వీరి కుమారుడు బత్తల హరికృష్ణ(5)ను రోజులాగే మంగళవారం కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. ఉదయం 11 గంటలకు అంగన్వాడీ కేంద్రం టీచర్ చంద్రకళ, ఆయాలు పిల్లలను ఇళ్లకు పంపించి కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పెద్ద కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెతికారు. అనుమానంతో అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే తాము 11 గంటలకే అందరినీ ఇళ్లకు పంపించి వేశామని, తమకు తెలియదని చెప్పారు. కేంద్రం తాళాలు ఇవ్వండి లోపల ఏమైనా ఉన్నాడేమో చూస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా బాలుడు ఏడ్చి ఏడ్చి భయంతో అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే వారు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అంగన్వాడీ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోపోండి.. మీపైనే కేసు పెడతాం అంటూ వారు బెదిరిస్తున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో మహిళల రక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడపలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పైగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది బెల్టుషాపులు ఏర్పాటు చేశారని.. మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతిరోజూ మహిళలపై 70 అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ప్రతి గంటకు 4 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. పోలీసులను ప్రజల రక్షణకు ఉపయోగించకుండా.. రెడ్బుక్ రాజ్యాంగం అమలుకు, ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు వాడుతున్నారని ధ్వజమెత్తారు. పీఆర్సీ, డీఏల సంగతేంటి? ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు వారిని పట్టించుకోవట్లేదని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి విమర్శించారు. పీఆర్సీ వేయలేదని, ఐఆర్ ఇవ్వలేదని, పెండింగ్లో ఉన్న 4 డీఏలు విడుదల చేయలేదని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ హామీని సైతం నెరవేర్చలేదని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు విజయ మనోహరి, ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు. -
గేట్, ఇంజినీరింగ్ సర్వీస్ పరీక్షలపై అవగాహన సదస్సు
వేంపల్లె : ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు అత్యంత ప్రసిద్ధి చెందిన పరీక్షలలో గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్షలు ఎంతో ముఖ్యమైనవని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమార్ స్వామి గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ ఉన్నత విద్య, పోటీ పరీక్షల విభాగపు అధికారి డాక్టర్ డి.కోనప్ప ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–6 సహకారంతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎస్ ఇంజినీరింగ్ అకాడమీ వారిచే విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కెరీర్ లక్ష్యాల పైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు ముఖ్య వక్తగా వచ్చిన ఎస్.ఇంజినీరింగ్ అకాడమీ విద్యావేత్త మణిమోహన్ త్రినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు గేట్ పరీక్ష, ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పరీక్షలు రాసే విద్యార్థులకు సిలబస్ నిర్మాణం, ప్రశ్నపత్ర విధానం, తయారీ వ్యూహాలు, మాక్ పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన అభ్యాసం, సమయపాలన, చిట్కాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ రమేష్ కై లాస్, పరిపాలన అధికారి రవికుమార్, ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
కార్పెంటర్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య పరిస్థితుల కారణంగా మనస్తాపం చెంది ఉరి వేసుకుని కార్పెంటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని కోటవీధికి చెందిన నాగేంద్ర, శ్రీలత దంపతుల కుమారుడు టి.నాగరాజు(41) కార్పెంటర్గా పనిచేసేవాడు. అతనికి రామారావుకాలనీకి చెందిన వనితతో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్య వనిత 17 సంవత్సరాల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పట్టణంలో కార్పెంటర్ పనులు చేస్తూ జీవిస్తున్న నాగరాజు ఏడాది క్రితం పనులు చేస్తుండగా ఉలి తగిలి కాలికి గాయమైంది. సరైన చికిత్స తీసుకోకపోవడం, పైగా షుగర్ వ్యాధి సమస్య ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకి గాయం పుండుగా మారింది. ఈ క్రమంలో రెండు నెలలుగా తిరుపతిలో చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో అక్కడి డాక్టర్లు కాలు తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చిన నాగరాజు మనస్తాపం చెంది ఐదురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం మండలంలోని కొత్తపల్లె పంచాయతీ వడ్డిపల్లె సమీపంలోని ఎలుకకుంట వద్ద అల్లనేరేడు చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఉరి నుంచి కిందకు దించి అతని పక్కనే ఉన్న బ్యాగును పరిశీలించగా, అందులోని ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
మొన్న కాలువ తీయించారు.. నిన్న పూడ్పించారు !
● రైతులతో అధికారుల చెలగాటం ● సాగునీటి సౌకర్యం కల్పించపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు ● గ్రీన్ఫీల్డుకు భూములిచ్చినా సాగునీరు లేకుండా చేస్తారా అని ఆవేదన గత నెల 22న రెవెన్యూ ఆధికారుల ఆదేశాలతో పోలీసుల సమక్షంలో తీయించిన పంట కాలువ మంగళవారం రోడ్డు నిర్మాణ అధికారులు పోలీసుల సమక్షంలో జేసీబీతో పంట కాలువ పైపులు తొలగిస్తున్న వైనం చాపాడు : మండలంలోని సోమాపురం గ్రామం వద్ద గ్రీన్ఫీల్డు హైవే నిర్మాణంలో వెళ్లిన పంట కాలువ పైపులను మంగళవారం మధ్యాహ్నం రోడ్డు నిర్మాణ అధికారులు తీయించారు. సాగునీటిని అందించే పైపులు తొ లగిస్తే నాటుకున్న వరి పైర్లు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీ సులు రైతులను అడ్డుకున్నారు. బాధిత రైతులు తెలిపి న వివరాల మేరకు.. బెంగుళూరు – విజయవాడ గ్రీన్ఫీల్డు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో మండలంలోని సోమాపురం వద్ద గల సర్వే నెంబరు 28–4బి2లో 8 ఎకరాల వ్యవసాయ సాగు భూమికి పంట లేకుండా పోయింది. అయితే రైతుల అవసరం మేరకు రోడ్డు నిర్మాణంలో పంట కాలువ కోసం పైపులు నిర్మించినప్పటికీ ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో పంట కాలువ సమస్యగా మారింది. ఈ క్రమంలో బాధిత రైతులైన అంకిరెడ్డిపల్లె రామచంద్రారెడ్డి, పెద్ద కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, భాస్కర్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డిలతో పాటు మరి కొంత మంది మహిళా రైతులకు చెందిన 8 ఎకరాల సాగుభూమికి సాగునీరు అందేలా పంట కాలువ ఏర్పాటు చేయాలని అధికారు లకు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో జమ్మలమడుగు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో గత నెల 19న రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా 22న రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పంట కాలువ తీయించారు. ఇదే పంట కాలువ విషయమైన 20న ఇరువర్గా ల వారు ఘర్షణ పడ్డారు. అయితే అప్పటి నుంచి అధికారులు తీయించిన పంట కాలువ ద్వారా బాధిత రై తులు వరి సాగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2న రోడ్డు నిర్మాణ అధికారులు పంట కాలువకు ఉండే పైపులను తొలగించారు. వీటిని తొలగిస్తే సాగునీరు ఎలా వస్తుందని, పంటలు ఎండిపోతాయని బాధిత రైతులు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భూములకు సాగు నీరు అందించే పంట కాలువ లేకుండా చేయడం ఏమిటని, దీనికి పోలీసులు సహకరిస్తే తాము పంటలు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు వాపోయారు. వారం రోజుల క్రితం పంట కాలువ తీయించిన అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా పంట కాలువ తీయించాలని కోరుతున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు వాపోయారు. -
కొడుకు తప్పు చేశాడు.. తండ్రి సరిచేశాడు!
అన్నమయ్య జిల్లా: ఉద్యోగిగా కొడుకు తప్పు చేసినా తండ్రి తలవంచలేదు. పైగా విలువను చాటుకున్నాడు. బిడ్డ చేసిన తప్పిదాన్ని పేద వాడైనప్పటికీ తండ్రి పెద్ద మనసుతో సరిచేసి శభాష్ అనిపించుకున్నాడు. మనసును కదిలించే ఈ సంఘటనకు సంబంధించి వివరాలలోకి వెళితే.. కురబలకోట మండలం అంగళ్లు గ్రామం జోగివారిపల్లెకు చెందిన జె. వెంకటరమణ కుమారుడు జె. వెంకటేష్ అదే మండలంలోని తెట్టు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి కేటాయించిన రూ.4.69,500ల నగదుతో వెంకటేష్ సోమవారం పరారైన విషయం తెలిసిందే. ఇతని కోసం తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇది అతని తండ్రి వెంకటరమణను తీవ్రంగా కలచివేసింది. ఆయన మనసు విరిగిపోయింది. పింఛన్ల సొమ్ముతో ఉడాయించడం పట్ల ఎంతగానో చింతించాడు. కొడుకు చేసిన తప్పిదానికి తనే బాధ్యత వహించాడు. వెంటనే అతను తెలిసిన వారి వద్ద అప్పుచేసి కొడుకు ఎత్తుకెళ్లిన పింఛన్ సొమ్మును ఎంపీడీఓ గంగయ్యకు అందజేశారు. మంగళవారం పింఛన్దారులకు ఈ సొమ్మును కూడా పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. కొడుకు తప్పు చేసినా తండ్రి తన విలువను చాటుకున్నాడు. బిడ్డ భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్న ఆశతో తండ్రి బాధ్యత వహించి నగదు చెల్లించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే చేతులు దులుపుకోవడం సాధారణమైన ఈ రోజుల్లో తండ్రి తనానికి కొత్త అర్థం చెప్పారు. అంతేగాకుండా విలువలకు ప్రతిరూపంగా నిలిచిన వెంకటరమణ నిర్ణయం అధికార యంత్రాంగాన్ని కూడా కదిలించింది. -
చంద్రప్రభ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్ : పులివెందుల మున్సిపాలిటిలోని అతి పురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీరంగనాథుడు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నూలుపూజ పవిత్రోత్సవాలను ప్రతి ఏడాది వినాయక చవితి మరుసటి రోజు నుంచి 9రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నూలుపూజలకు భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మెన్ చింతకుంట సుధీకర్రెడ్డి, ఈఓ రమణ పర్యవేక్షించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలను స్వీకరించారు. కలెక్టర్తో పాటు జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యా దులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్పై అరవై రోజుల విస్తృత ప్రచారం కల్పించాలని పోస్టర్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎస్డీసి వెంకటపతి,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మంచిరోజులొస్తాయి
పులివెందుల : కూటమి ప్రభుత్వంలో అబద్ధాలకు, మోసాలకు అంతు లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కార్యకర్తలు, ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆయన వారికి భరోసా కల్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తన సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను ప్రజలు వివరించగా ఓపిగ్గా విన్నారు. అధినేతను కలిసినవారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసు లు, సుధీర్రెడ్డి, గంగుల భాను, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, చెవిరెడ్డి కుమారుడు హర్షిత్రెడ్డి, వైఎస్సార్సీపీ కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజనేయరెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఆప్కాస్ చైర్మన్ ఝాన్సీరాణి, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్ ఉన్నారు.పింఛన్ల తొలగించారంటూ మహిళల ఆవేదనపులివెందుల పట్టణం నగరిగుట్ట ప్రాంతానికి చెందిన రాజకుళ్లాయమ్మ అనే మహిళ తన పింఛన్ తీసేశారంటూ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పింఛన్ను తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే పులివెందుల మండలం కనంపల్లెకు చెందిన కృపావతి అనే వితంతువు కూడా తన పింఛన్ తొలగించారని వాపోయింది. దీనికి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు ప్రభు త్వం దాదాపు 4లక్షల పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. అధైర్యపడొద్దని, పింఛన్ల విషయంలో న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా కల్పించి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు.మాజీ ఎమ్మెల్యేకు పుట్టిన రోజుశుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందులలోని తన నివాసంలో కలిసిన ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్ తినిపించారు.ఆటోగ్రాఫ్... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డిని వైఎస్ జగన్ అభినందించారు. ఇటీవల కశ్మీర్ ప్రాంతంలోని లడాక్ ట్రిప్కి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి భూమికి దా దాపు 18వేల అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని చేరుకుని వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫొటోలను వైఎస్ జగన్కి చూపించగా.. ఆయన అభినందించి జెండాపై ఆటోగ్రాఫ్ చేశారు.నేడు ఇడుపులపాయలో వైఎస్సార్కు నివాళిమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. అక్క డ వైఎస్సార్కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 10.30 గంటలకు లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. అక్కడినుంచి తిరిగి 12.30గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం 2.30 గంటల నుంచి 7.25గంటలవరకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు. -
వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం పాత మార్కెట్లో కృష్ణయ్య యాదవ్ అనే వ్యక్తిపై నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణయ్య యాదవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన కృష్ణయ్య యాదవ్ పని నిమిత్తం పులివెందులకు వచ్చాడు. పులివెందుల పట్టణం నగరిగుట్టలో నివాసముంటున్న నాగరాజు అనే వ్యక్తిని గతంలో బొలెరో వాహనంతో ఢీకొట్టడంతో అప్పట్లో నాగరాజుకు కా లు విరిగింది. ఇది మనసులో పెట్టుకొని సోమ వారం మధ్యాహ్నం పాత మార్కెట్లోని కాంప్లెక్స్లో ఉన్న కృష్ణయ్య యాదవ్పై నాగరాజు దా డి చేశాడు. దీంతో కృష్ణయ్య యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. జేవీవీ నూతన కమిటీ ఎన్నిక ప్రొద్దుటూరు కల్చరల్ : జన విజ్ఞాన వేదిక కడప జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. స్థానిక నందిని క్లాత్ మార్కెట్లోని జేవీవీ కార్యాలయంలో జరిగిన మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవదత్తం ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడిగా షామీర్ బాషా, ప్రధాన కార్యదర్శిగా శివరాం, సమత కన్వీనర్గా రామసుబ్బమ్మ, ఉపాధ్యక్షులుగా బాలబయన్న, దేవదత్తం, వెంకటసుబ్బయ్య, వెంకటరామరాజు, రవూఫ్ బాషా, పి.మహేష్, కార్యదర్శులుగా రాజేష్, నరసింహారెడ్డి, ప్రసన్న కుమార్, డేవిడ్ రాజ్, ఖాసీంవలి, కిరణ్కుమార్లను ఎన్నుకున్నట్లు వివరించారు. గౌరవాధ్యక్షులుగా ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ రాజా వెంగళరెడ్డి, రఘునాథరెడ్డి, గౌరవ సలహాదారులుగా కుమారస్వామిరెడ్డి, రామచంద్రారెడ్డి, గోపినాథ్రెడ్డి, గంగాధర్రెడ్డిలతోపాటు కార్యవర్గ సభ్యులుగా పది మందిని, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, యూత్, సాహిత్యం, సాంస్కృతిక సబ్ కమిటీ కన్వీనర్, కోకన్వీనర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పోలీసులతో వాగ్వాదం.. కేసు నమోదు కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాయపల్లి వద్ద గణేశుని విగ్రహాన్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకుని వెళుతున్న క్రమంలో ఆదివారం రాత్రి మల్లికార్జున రెడ్డితో పాటు, మరో నలుగురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాకీ డబ్బు అడిగినందుకు దళిత యువకుడి హత్య
దువ్వూరు : బాకీ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించమని అడిగినందుకు దళిత యువకుడు హత్యకు గురైన సంఘటన దువ్వూరు మండలం భీమునిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. భీమునిపాడు ఎస్సీ కాలనీకి చెందిన జేష్టాది దివాకర్ (35), పక్క గ్రామం సంగటితిమ్మాయపల్లెకు చెందిన నాగ దస్తగిరి ఇరువురు స్నేహితులు. ఇద్దరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జేష్టాది దివాకర్ దగ్గర నాగదస్తగిరి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆదివారం దివాకర్ తనకు డబ్బు చాలా అవసరం ఉందని అప్పుగా ఇచ్చిన రూ.10వేలు ఇవ్వాలని నాగదస్తగిరిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో అని నాగదస్తగిరి అన్నాడు. ఈ క్రమంలో దివాకర్ అతని ఫోన్ తీసుకుని తీసుకున్న అప్పు చెల్లించి ఫోన్ తీసుకెళ్లు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న దివాకర్ ఇంటి వద్దకు నాగదస్తగిరి వెళ్లి డబ్బు ఇస్తాను రా మాట్లాడుదాం అని పిలుచుకెళ్లాడు. ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే డబ్బు ఇవ్వలేదని తన సెల్ఫోన్ తీసుకెళతావా అని దివాకర్ తలపై బండరాయితో నాగదస్తగిరి గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలతో దివాకర్ అక్కడే పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన దివాకర్ను ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో దివాకర్ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు దివాకర్కు భార్య మహాలక్షుమ్మ, కుమారుడు సుదీప్(12) ఉన్నారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, భార్యా పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై మృతుడి తల్లి జేష్టాది మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. గత నెల 26న మదిరేపల్లె గ్రామంలో బాకీ చెల్లించలేదని దళిత యువకుడు పాలగిరి చెన్నయ్యను హత్య చేసిన సంఘటన మరువక ముందే మండలంలో మరో దళిత యువకుడు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. -
కడప గడపలో కృష్ణమ్మ సవ్వడులు!
సాక్షి ప్రతినిధి కడప : ‘బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను...బంగారు పంటలే పండుతాయి. ముత్యాల మురిపాలు దొరలుతాయి’.. ఇది శంకరంబాడి సుందరాచార్యులు రాసిన గేయం. ఇది ఒకనాటికి నిజమవుతుందని జిల్లా ప్రజలెవరూ ఊహించలేదు. మెట్ట ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ఆనాడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆ మహానేత నిర్వహించ తలపెట్టిన జలయజ్ఞం ఫలితం సాకారమైంది. నీళ్లులేక నోళ్లు తెరచిన పులివెందుల నియోజకవర్గ బీడు భూములు పులకిస్తున్నాయి. ‘తండ్రి బావి తవ్విస్తే కుమారుడు పూడ్చేశాడన్నట్లుగా’ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1988లో గాలేరు–నగరి, ఆ తర్వాత హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులను ప్రకటించి శంకుస్థాపన చేశారని నాటి రాయలసీమ ఉద్యమకారులు వివరిస్తున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికారిక పగ్గాలు చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఓ మాట.. తర్వాత మరోమాట చెబుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తోంది. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం గండికోట ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆపై నిర్మాణాన్ని విస్మరించారు. మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవాలి కనుక 1999 సాధారణ ఎన్నికలకు ముందుగా 1998లో వామికొండ వద్ద మరోమారు శంకుస్థాపన చేశారు. గద్దెనెక్కిన తర్వాత మళ్లీ విస్మరించారు. కృష్ణస్వామి కమిటీ వేసి జీఎన్ఎస్ఎస్కు గండికొట్టే ప్రయత్నాలు చేశారని విశ్లేషకులు వివరిస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు ఆయన ఖర్చు చేసింది కేవలం రూ.67.50 కోట్లు మాత్రమే. అది కూడా సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే. ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం తేటతెల్లమవుతోంది. పైగా రాయలసీమ సాగు, తాగునీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచాలి. కాగా చంద్రబాబు సర్కార్ జీఓ నెంబర్ 69 జారీ చేసి శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులకు కుదించడం ద్వారా రాయలసీమ మరణశాసనాన్ని లిఖించారని పలువురు విమర్శిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్.. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో దాదాపు రూ.12వేల కోట్లు వెచ్చించారు. మొదటి దశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయసాగర్ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్ కాంప్లెక్స్ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టీఆర్ఎస్, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి ఆరోపణలు గుప్పించారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూయించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ విస్తరణ సామర్థ్యం పెంచారని చరిత్రకారులు వివరిస్తున్నారు. జీఎన్ఎస్ఎస్ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పథకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6 టీఎంసీల సామర్థ్యంతో రూ.727 కోట్లు అంచనా వ్యయంతో పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. తద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతో పాటు, పీబీసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు. వైఎస్ కుటుంబం కృషి ఫలితమే.. తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో అంతర్భాగంగా గతంలో పులివెందుల బ్రాంచ్కెనాల్ నిర్మించారు. టీబీ డ్యాంలో పూడిక పేరుకుపోవడం, ఎగువప్రాంతాల నీటి అక్రమ వినియోగం వంటి కారణాల వల్ల పులివెందుల బ్రాంచ్ కెనాల్కు ఏనాడు పూర్తి సామర్థ్యంతో సాగునీరు అందలేదు. రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయకట్టు స్థిరీకరణ కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. అయినా ఆశించిన ఫలితం కన్పించలేదు. ఈ నేపథ్యంలో సీబీఆర్కు గండికోట నుంచి 8.3 టీఎంసీల నీటిని 5 లిఫ్ట్ల ద్వారా తీసుకెళ్లే బృహత్తర పథకానికి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.1343 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో రూ.1090కోట్లు దివంగత సీఎం వైఎస్సార్ ఖర్చు చేశారు. నాటి కృషి ఫలితమే నేడు అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్పురం గ్రామం వద్ద భారీ సంప్ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబకపల్లె చెరువు వద్ద జలహారతి ఇవ్వనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన దివంగత సీఎం వైఎస్సార్ మెట్ట ప్రాంతాల్లో కృష్ణా జలాలు పారిస్తే నా జన్మ ధన్యమని నాడే స్పష్టీకరణ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ -
ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం‘(పి.జి.ఆర్.ఎస్) నిర్వహించారు. 113 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదన పు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్బాబు పాల్గొన్నారు. -
ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిల
వేంపల్లె : నేడు మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల మంగళవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. సోమవారం సాయంత్రం వీరు ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలుమైదుకూరు : కాలనీలో కొలువుదీర్చిన వినాయకుని ప్రతిమను ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేసేందుకు వెళుతూ నొస్సం సురేష్ కుమార్ ఆచారి అనే యువకుడు మృతి చెందడంతో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం రాత్రి చాపాడు మండలం అల్లాడుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. అల్లాడుపల్లె వద్ద ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఓ లారీ వెనుక వైపు నుంచి వినాయకుని విగ్రహంతో వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొంది. ట్రాక్టర్లో ముందువైపు ఇంజన్పై కూర్చుని ఉన్న సురేష్ కుమార్ ఎగిరి కిందపడ్డాడు. అతనిపై లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య మంజులత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్కుమార్ వడ్రంగి పనిలో మంచి నైపుణ్యం ఉన్న కళాకారుడని, అతని మృతి కుటుంబానికి తీరని లోటని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. యువకులకు తీవ్ర గాయాలు
అట్లూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన అట్లూరు మండలం కడప–బద్వేలు ప్రధాన రహదారిపై రెడ్డిపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు అట్లూరు మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం ఉప్పుటూరు కాలనీకి చెందిన శ్రీబాబు, గోపినాథపురం గ్రామానికి చెందిన సానపురెడ్డి నరసింహారెడ్డి ఇద్దరు పుట్టుకతోనే మూగ, చెవిటి వారు. ఇద్దరూ కడపలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. శ్రీబాబు ఓ ప్రైవేటు సీసీ కెమెరాల కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఇద్దరూ అట్లూరు వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఉన్నట్టుండి రెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద గడ్డి మోపుతో మరో ద్విచక్రవాహనం అడ్డు రావడంతో దాన్ని తప్పించ బోయి అదుపుతప్పి కిందపడ్డారు. శ్రీబాబు తలకు తీవ్ర గాయాలు కాగా నరసింహారెడ్డికి చేయి విరిగింది. 108 వాహనం ద్వారా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి వెళ్లిన కారుసిద్దవటం : సిద్దవటం మండలం, కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్కు చెందిన వెంకటరమణ, ఆయన భార్య ఈశ్వరమ్మ, కుమార్తె యామినితో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేణిగుంటకు కారులో బయలుదేరారు. కారు సిద్దవటం మండలంలోని శనేశ్వరస్వామి ఆలయం దాటుకొని వస్తుండగా ఆవు అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.తీవ్రంగా గాయపడిన శ్రీబాబు చేయి విరిగిన నరసింహారెడ్డి -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు మూడో రోజు డ్రాగా ముగిశాయి. కడప–చిత్తూరు జట్ల మధ్య కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 99 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 117.4 ఓవర్లలో 406 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నాగ చైతుర్య 339 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్తో 174 పరుగులు చేసి ఆడాడు. షేక్ ఆదిల్ హుస్సేన్ 66 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని ముకేష్ 3 వికెట్లు, రెడ్డి ప్రకాశ్ 3 వికెట్లు, బ్రహ్మ తేజ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో చిత్తూరు జట్టు ఆధిక్యం సాధించింది. భారీ ఆధిక్యం సాధించిన నెల్లూరు జట్టు వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో నెల్లూరు–కర్నూలు జట్ల మధ్య సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 34.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 51 పరుగులు, నిఖిలేశ్వర్ 30 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 63 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 81 పరుగులు, సాయి సూర్యతేజ రెడ్డి 62 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 3 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యత సాధించింది. -
స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అక్కంపేట గ్రామానికి చెందిన పాణ్యం నాగేంద్ర, గాలింకి రామచంద్రల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి రక్త గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కంపేట ఎస్సీ కాలనీలో నాగేంద్ర స్థలానికి ఆనుకుని రామచంద్రకు స్థలం ఉంది. ఈ స్థలం గురించి ఇద్దరి మధ్య గతంలోనే మనస్పర్థలున్నాయి. సోమవారం రామచంద్ర తన స్థలంతో పాటు నాగేంద్ర స్థలంలో కూడా కంప కట్టెలు వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమ స్థలంలో కట్టెలు ఎందుకు వేశావని నాగేంద్ర ప్రశ్నించడంతో ఈ స్థలం కూడా మాదేనని రామచంద్ర చెప్పడంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదానికి దిగడంతో పాటు కట్టెలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో నాగేంద్ర చేతులకు, రామచంద్ర తలకు రక్త గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన నాగేంద్ర, రామచంద్ర -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
అట్లూరు : అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైన సంఘటన అట్లూరు మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల, బాధితుల కథనం మేరకు రెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో జవ్వాజి సావిత్రి, సుబ్బరాయుడు దంపతులు ఆదివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా అర్థరాత్రి సమయంలో ఇంటిలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే విద్యుత్తు వైర్లు తొలగించి మంటలను అదుపు చేసే లోపే ఇంట్లోని వైరింగ్తో పాటు ఫ్రిజ్, వాషింగ్మిషన్, బీరువాలోని రూ.20 వేలు నగదు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్షా యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.2 కిలోల గంజాయి స్వాధీనంముద్దనూరు : ముద్దనూరు–కడప రహదారిలో ఓ డాబా వద్ద సోమవారం గణపత్ దావర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దస్తగిరి తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్వాలి గ్రామానికి చెందిన గణపత్ అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కల్పించిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కోర్సుపై పట్టును పెంచేందుకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నాం. ఎక్కువమంది ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. వారికి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం కోర్సులు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే వారికి రెండు నెలలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం. కొన్ని సబ్జెక్టులు ఫెయిలైన వారికి రెమిడియల్ క్లాసులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా యోగా, మెడిటేషన్, వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి తర్ఫీదు ఇస్తున్నాం. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం. – ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ఇడుపులపాయ -
జీవితాన్ని చదివేద్దాం.. బతికి సాధిద్దాం
● చదువులు, తరగతి గదులు, వసతి గృహాల్లో ఇమడలేకపోతున్న విద్యార్థులు ● తల్లిదండ్రులూ ముందు జాగ్రత్తలు తీసుకోండిమన తాతలు, తల్లిదండ్రులు అక్షరం ముక్క చదవకపోయినా జీవించారు. రెక్కల కష్టంతోనే ఐదుగురి నుంచి పదిమంది పిల్లలను పెంచి పోషించారు. ఇప్పుడున్న వసతులు, సాంకేతికత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పుడు లేవు. ఇప్పుడున్న యువత చదువు అర్థం కాకపోయినా, ఫెయిలైనా, తమకు నచ్చని చదువులు, వివిధ కారణాలతో ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో తల్లిదండ్రుల ఆశలను మధ్యలోనే తుంచి కన్నీళ్లు మిగులుస్తున్నారు. విద్యార్థులు జీవితాన్ని చదవాలి.. బతికి సాధించాలి. వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ కోర్సును చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై వసతి గృహాల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పీయూసీ–2 (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని క్యాంపస్లోని వసతి గృహంలో ఉన్న బాత్రూంలో తన చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణాకి పాల్పడింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శివ కిటికీ అద్దాలను పగులగొట్టి చేతులను గాయపరచుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తోటి విద్యార్థితో ప్రేమలో పడి మూడంతస్తుల పై నుంచి దూకి మృతి చెందింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఏచ్చర్ల మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన పీయూసీ–2 విద్యార్థి జి. నరసింహనాయుడు ఉరివేసుకుని మృతి చెందాడు. కళాశాలలో రాత్రి పూట చాలాసేపు మేలుకొని చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బెంగతో, హాస్టల్లో భోజనం సరిగా లేకపోవడంతో, తమకిష్టమైన చదువును చదవలేకనో, జీవితంపై విరక్తి చెంది ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పిల్లలే తమ సర్వస్వమని.. పిల్లలే తమ సర్వస్వమని.. వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సంపాదనలో అధిక భాగం విద్య కోసమే ఖర్చు పెడుతుంటారు. ఇదే సమయంలో ఇతర కుటుంబాల పిల్లలతో పోలుస్తుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. చదువు పేరుతో నిరంతరం ఒత్తిడికి గురి చేయరాదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు ఉన్నా పిల్లలతో రోజుకు గంట అయినా ఆప్యాయంగా మాట్లాడాలి. అప్పుడే వారిలో మానసిక పరిపక్వత కలుగుతుంది. నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుంటారు. సమాజంలో ఎలా జీవించాలో, నలుగురితో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తల్లిదండ్రులతో చెప్పుకునేలా అవకాశం కల్పించాలని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి భరించలేకనే.. ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీయాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ ధోరణి ఎక్కువగానే ఉంది. మంచి మార్కులు, ర్యాంకులు వస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే భావనతో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలు తరగతి గదులు, తమకిష్టమైన చదువులను చదువుకోలేక, వసతి గృహాల్లో ఇమడలేక పోతున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ సమస్యలు, చిన్న, చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతున్నారు. ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు భరోసా కల్పించాలి.. గ్రామీణ విద్యార్థులు ఎక్కువ శాతం తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఇంటర్లోకి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమం ఎంచుకుంటున్నారు. భవిష్యత్లో తెలుగులో కంటే ఇంగ్లీష్ మాధ్యమం చదివిన వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అపోహతో ఇంగ్లీషు విద్యనభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలలో ఇంగ్లీష్ మాధ్యమంతోపాటు తెలుగు మీడియంలో కూడా బోధన చేస్తుంటారు. అయితే పరీక్షలు మాత్రం ఇంగ్లీష్ మాధ్యమంలోనే రాయాలి. కంప్యూటర్ తదితర వాటిపై మంచి పట్టు ఉండాలి. ఓరియంటల్ తరగతుల్లో మాత్రం మూడు నెలలపాటు శ్రద్ధగా చదివితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని ట్రిపుల్ ఐటీ అధికారులు భరోసా కల్పించాలి. ఒకేసారి భాషాపరమైన ఒత్తిడి, పోటీని తట్టుకుని నిలబడాలనే ఉద్దేశంతో శక్తికి మించి కష్టపడుతూ కుంగుబాటుకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. మొదటిసారి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన పిల్లలను దృష్టిలో ఉంచుకుని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యాలపై ఉంది. వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి.. చదువులో వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించాలి. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఉన్నత విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించాలి. -
చదువు జీవితంలో ఒక భాగం..
చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇప్పటి ప్రపంచంలో మనం బతకడానికి ఎన్నో ఉపాయాలు, సాధనలు, అవకాశాలు ఉన్నాయి. చదువు రాకపోతే బతకలేమనేది అవాస్తవం. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దు. విద్యార్థులుగా మీరు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. అమ్మ, నాన్న, అధ్యాపకులు కూడా పిల్లలు ఏ రంగంలో రాణిస్తున్నారో గుర్తించి.. అందులో వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రస్తుత సమాజ పరిస్థితులకు అనుగుణంగా పెంచుకోవాలి. విద్యార్థుల ప్రవర్తన, కదలికలను అనుక్షణం గమనించాలి. ఇప్పుడున్న యువత క్షణికావేశానికి ఎక్కువగా లోనవుతున్నారు. వారిని ముందే గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆర్కే వ్యాలీ ప్రభుత్వాసుపత్రి, ఇడుపులపాయ -
రైలు కింద పడి బాలుడి ఆత్మహత్యాయత్నం
కమలాపురం : కమలాపురం పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన శ్రీహరి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెడ్డీస్ కాలనీకి చెందిన నరసింహరావు కుమారుడు శ్రీహరి 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో చేయి తెగిపోవడంతో పాటు తలకు బలమైన గాయమై తీవ్ర రక్త స్రావం అయింది. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో బర్రె మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లి నుంచి గోపులాపురం వెళ్లే దారిలో విద్యుత్ షాక్తో బర్రె మృతి చెందింది. బాలుపల్లి గ్రామానికి చెందిన బొమ్మేపల్లె నారాయణమ్మ పశువులను మేపుతుండగా రోడ్డు పక్కగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్రెకు, నారాయణమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. బర్రె మృతి చెందగా, నారాయణమ్మ స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని గ్రామస్తులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నారాయణమ్మను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బర్రె సుమారు లక్ష రూపాయలు పైగా విలువ చేస్తుందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు.గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంజమ్మలమడుగు : వేపరాల గ్రామానికి చెందిన చిమ్మని వెంకట రమణ(32) పెన్నానదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మైలవరం నుంచి వస్తున్న నీటిని నిలుపుదల చేసి గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహం లభ్యమైందని ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. ఆదివారం మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాకపోవడంతో పోలీసులు మే ఐహెల్ప్యు సంస్థ పట్టణ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్కు ఫోన్ చేసి వివరించారు. దీంతో ఫౌండర్ లక్ష్మణ్రావు, సభ్యులతో కలిసి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాని బంధువులు -
భారీ స్కోరు సాధించిన చిత్తూరు, నెల్లూరు జట్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లలో చిత్తూరు, నెల్లూరు జట్లు భారీ స్కోర్లు చేశాయి. ఆదివారం రెండవ రోజు కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కడప జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 346 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 137. ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 589 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని వై. తేజ రెడ్డి 162 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. నిఖిత్ గౌడ్ 63 పరుగులు చేశాడు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3 వికెట్లు, ఎస్ఎండీ అస్లమ్ 2 వికెట్లు, ధనుష్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 32.4 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 52 పరుగులు చేశాడు. దీంతో కడప జట్టు 490 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 374 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు 96.4 ఓవర్లలో 514 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 220 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 182 పరుగులు చేశాడు. భార్గవ్ 75 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 41.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 34 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని అఖిల్ 4 వికెట్లు, మాధవ్ 3 వికెట్లు, నారాయణ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 10 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది. దీంతో నెల్లూరు జట్టు 436 పరుగుల అధిక్యంలో ఉంది, దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
పోలీసు శాఖకు మీ సేవలు చిరస్మరణీయం
కడప అర్బన్ : క్రమశిక్షణ, అంకితభావంతో నాలుగు దశాబ్దాలపాటు నిర్విరామంగా పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ పొందిన ఎ.శివనాగేంద్ర కుమార్, ఎస్.ఐ, డి.సి.ఆర్.బి. కడప, ఎ.వి. రమణయ్య, ఎ.ఎస్.ఐ, కమలాపురం, బి.శ్రీనివాసులు, ఎ.ఆర్.హెచ్.సిలను ఆదివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెనన్స్ హాలులో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ లేని రోజుల్లో కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా బాధ్యత అనేది పోలీస్ శాఖలో సమస్యలను అధిగమించేలా చేస్తుందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ పిల్లలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి. బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి. కె.శ్రీనివాసరావు, ఆర్.ఐ లు వీరేష్, టైటస్, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, ఈ.సి. మెంబర్ ఏఫ్రిన్, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ -
ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలి
ప్రొద్దుటూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి.నాగదస్తగిరిరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం చేసేందుకు ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజవకర్గాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని ప్రకటించే వరకు సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలను చేపడతామన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలనేది ఎన్నో ఏళ్లుగా ప్రజల ఆకాంక్ష అన్నారు. ప్రొద్దుటూరులో జిల్లా కోర్టుతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, జిల్లాకు సంబంధించి ఆదాయంలో సింహభాగం ప్రొద్దుటూరు నుంచే ఉందన్నారు. అయినా ప్రొద్దుటూరు కనీసం రెవెన్యూ డివిజన్కు కూడా నోచుకోలేదన్నారు. ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి తక్కువ జనాభాతో మన్యం జిల్లాను, ఎక్కువ జనాభాతో నెల్లూరు జిల్లాను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రొద్దుటూరు పాలకేంద్రం పరిధిలో సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, జిల్లా కేంద్రం ప్రకటిస్తే ఇక్కడే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించవచ్చన్నారు. స్పందన సంస్థ అధ్యక్షుడు శెట్టిపల్లె రాంప్రసాద్ రెడ్డి, ఎస్ఆర్ వెంకటజనార్ధన్రెడ్డి మాట్లాడుతూ త్రేతాయుగం నుంచి ప్రొద్దుటూరుకు ప్రాశస్థ్యం ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ప్రొద్దుటూరులో పర్యటించారన్నారు. 1915లో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఏర్పడిందన్నారు. మనకన్నా చిన్నదైన రాయచోటిని జిల్లా కేంద్రం చేశారని, రాజంపేటను పార్లమెంట్ స్థానం చేశారని, త్వరలో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయబోతున్నారన్నారు. 1970లోనే పరిశ్రమల కోసం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ను ఏర్పాటు చేశారన్నారు. ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని క్యాబినెట్ సబ్ కమిటీకి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు టీడీ వరుణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటిస్తే వైద్య కళాశాల రావడంతోపాటు ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పడుతాయన్నారు. సమావేశంలో సభ్యులు భాస్కర్రావు, ఎన్జీఓ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, అయూబ్ ఖాన్, నంద్యాల వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.12 మందితో జిల్లా సాధన సమితి ఏర్పాటు -
ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాటం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిరంతర పోరాటాలు చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పెట్టుబడికి ప్రభుత్వ సాయం అందడంలేదని, విత్తనాలు రావడంలేదని, అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తుంటే యూరియా అందడంలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదన్నారు. యూరియాను టీడీపీ నాయకులు పక్కదారి పట్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. ఎరువులు వ్యాపారులకే సరఫరా చేస్తుండటంతో రైతు సేవా కేంద్రాల్లో దొరకక రైతన్నలు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు రైతులకు అందేవన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యల్లో కనీసం 10శాతం శ్రద్ధ చూపినా రాష్ట్రంలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలు బాగుపడే అవకాశం ఉంటుందన్నారు.టీడీపీ వారి ఆరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. -
శరణు కోరే వారికి అభయమిచ్చే ఆరోగ్యమాత
కడప సెవెన్రోడ్స్: తనకు జన్మనిచ్చేందుకు లోక రక్షకుడైన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని పవిత్రమైన మాతగా శరణుకోరిన వారికి అభయమిచ్చే ఆరోగ్యమాతగా భక్తులు ఆరాధిస్తున్నారని పోరుమామిళ్ల విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ అన్నారు. ఆదివారం ఆరోగ్యమాత ఉత్సవాలు మూడో రోజు సాయంత్రం ఆరోగ్యరాజ్ దివ్యబలి పూజను సమర్పించారు. దేశ దేశ, రాష్ట్ర, ప్రజల శాంతి సమాధానాల కోసం ఆయన ప్రార్థించారు. దేవమాత ద్వారా ప్రజల కోర్కెలను ప్రభువు తీర్చాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా ఆయన విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడి క్షేత్రంలో వెలిసిన దేవమాత ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని వివరించారు. మరియ తల్లి పట్ల భక్తి, విధేయత అందరూ అలవర్చుకోవాలని కోరారు. దేవుని వాక్కులు ఆలపించాలని సూచించారు. మంచి సుగుణాలను దేవుని కృపద్వారా సిద్ధించాలని, అందుకు కావాల్సిన శక్తి తల్లి ద్వారా సమకూరాలని ప్రార్థించారు. అంతకుముందు మరియ తల్లి స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో చర్చి ప్రాంగణంలో విశ్వాసులు ఊరేగించారు. పాటలు, మరియతల్లి తేరు, దివ్య బలిపీఠం అలంకరించారు. ఈ కార్యక్రమంలో మోస్ట్ సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాదరావు, రెవరెండ్ ఫాదర్ విజయరావు, జోసెఫ్రాజుతోపాటు డయాసిస్ గురువులు, కన్యసీ్త్రలు, భక్తులుపాల్గొన్నారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1.30గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి జక్కూరు ఎయిర్డ్రోంకు 1.50గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 2,.50గంటలకు పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.55గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3.గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 3 నుంచి రాత్రి 7.30 వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. 7.30కి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి 7.35కు తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఇడుపులపాయకు బయలుదేరతారు. 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. ఉదయం 7.15గంటల నుంచి 8గంటలవరకు వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్సార్కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 8గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి బయలుదేరుతారు.10.30గంటలకు అంబకపల్లెకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.30 వరకు అంబకపల్లె గ్రామంలోని గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. 11.30కి అంబకపల్లె గ్రామం నుంచి బయలుదేరి 12.30కి పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. 2.25కు తన నివాసం నుంచి బయలుదేరి 2.30కి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.30 నుంచి 7.25 వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు. 7.30కి భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఆయన బస చేయనున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 7గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరి 7.05గంటలకు అదే ప్రాంతంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 7.15కు హెలీక్టాపర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. 8.30గంటలకు యలహంకలో ఉన్న తన నివాసానికి చేరుకుంటారు. -
రూ.4,20,999 పలికిన లడ్డూ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక సాయిరాజేశ్వరి కాలనీలోని సాయిరాజేశ్వరి గణపతి ఉత్సవ కమిటీ వారు గణపతి వద్ద ఉంచి పూజ చేసిన లడ్డూ, వెండి కలశం, నోట్ల దండ, వెండి కాయిన్లకు వేలం వేశారు. శ్రీ సాయిక్రేన్స్ అధినేత వల్లపు రెడ్డి వరదకుమార్రెడ్డి వెండి ప్లేట్ కలిగిన లడ్డూను రూ.4,20,999లకు, వెండి కలశాన్ని రూ.3,36,000లకు వేలంలో దక్కించుకున్నారు. రూ.200 నోట్ల దండను సి.వెంకటగోపాల్ రెడ్డి రూ.1,27,999లకు, వెండి కాయిన్ను దొంతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి రూ.1,21,999లకు చేజిక్కించుకున్నారు. వీరిని ఉత్సవ కమిటీ వారు సత్కరించారు. -
ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో మహిళలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచినా ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. 19–59 ఏళ్లలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని 11 రకాల సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారన్నారు. 20లక్షల ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన మొదటి సంతకానికి దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని, మొదటి ఏడాది ఎగ్గొట్టారని, రెండో ఏడాది రూ.7వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు తీసేశారన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మొదటి ఏడాది ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి అమలు చేసిన తల్లికి వందనం పథకం కూడా మొదటి ఏడాది ఇవ్వలేదన్నారు. ఇలా అన్ని పథకాలకు తూట్లు పొడుస్తూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఏ మొఖం పెట్టుకొని చెప్పుకుంటారని ప్రశ్నించారు. మహిళల రక్షణ, భద్రత పూర్తిగా గాలికొదిలేశారన్నారు. మహిళలపై చేయి వేస్తే అదే చివరి రోజవుతుందని ఎన్నికల్లో చెప్పారని, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తున్నా చివరి రోజు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 80వేల బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ముగ్గరు మహిళలున్నా మహిళలపై జరిగే అఘాయిత్యాలపై వారు స్పందించిన పాపాన పోలేదన్నారు. మహిళల జోలికొస్తే తాటతీస్తా, తొక్కతీస్తా అంటూ ఊగిపోయిన పవన్కళ్యాణ్ ఇప్పుడు శాంతిభద్రతలు తన పరిధిలోకి రావంటున్నారన్నారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధిపొంది, ఆ బాలిక తల్లికి ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి సతీమణి అరుణమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవడానికి మహిళలంతా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి, జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, మహిళా నేతలు బి. మరియలు, ఏకుల రాజేశ్వరి, మూలే సరస్వతి, తులశమ్మ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి మహిళలంతా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాకంఠక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి మహిళలంతా ఏకమై బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను, మహిళల రక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రచించడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేయాలని, తద్వారా 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
● పార్వతీ తనయా.. పాహిమాం
మేళతాళాలు...డప్పు వాయిద్యాలు...బాణాసంచా పేలుళ్లు, యువత కేరింతలు, మిన్నంటిన భక్తజన కోలాహలం నడుమ ఐదవరోజైన ఆదివారం కడప నగరంతోపాటు జిల్లా అంతటా గణేష్ నిమజ్జన వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి. చతుర్థి నుంచి భక్తుల పూజా నైవేద్యాలు అందుకున్న గణపతి వచ్చే ఏడాది మళ్లీ కలుద్దామంటూ గంగ ఒడికి తరలి వెళ్లారు. నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.కడపలోని రాజీవ్మార్గ్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని, అలాంటి పర్వదినాల్లో ముఖ్యమైనది వినాయక చవితి అని ఆయన అన్నారు. నిమజ్జనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. దీంతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. –కడప సెవెన్రోడ్స్ దేవునికడప చెరువులో గంగమ్మఒడికి చేరుతున్న గణపతి వినాయక నిమజ్జన ఉత్సవంలో చిన్నారుల కోలాటం -
శ్రీరంగనాథా..నమోస్తుతే
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటిలోని అతి పురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ ప్రవిత్రోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శ్రీరంగనాథుడు శేష వాహనంపై సతీసమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నూలుపూజ పవిత్రోత్సవాలు 9రోజులు జరగనున్నాయి. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్రెడ్డి, ఈఓ రమణ ఏ ర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమం జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబబర్కు కాల్ చేయవచ్చన్నారు. -
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.మల్లిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా కడపలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ విశేషమైన సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని బిరుదు ఇచ్చిందే తప్ప వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆశాల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత ఆశాలను మర్చిపోవడం సరి కాదన్నారు. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆశాలకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్. శాంతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గంగాధర్, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరి కె.సి. బాదుల్లా, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కల్పన తదితరులు పాల్గొన్నారు.ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.మల్లిక -
క్లస్టర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ బదిలీలలో సర్ప్లస్గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గణితంతోపాటు భాషా పండితుల పోస్టుల్లో క్లస్టర్ టీచర్లుగా నియమితులైన వారికి డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా రెగ్యులర్ స్థానాలను కేటాయించాలని ఎస్.టీ.యు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్ చెన్నకేశవరెడ్డి కోరారు. ఈ విషయమై శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామకాల కంటే ముందుగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పదవీ విరమణ స్థానాలను, డీఎస్సీ 2025లో చూపించనున్న ఖాళీలలో ఈ క్లస్టర్ టీచర్లకు రెగ్యులర్ స్థానాలను కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్టీయూ నాయకులు హబీబుల్లా, మహబూబ్ బాషా, కడప నగర అధ్యక్షుడు సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఐజేయూలో ఇరువురికి చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇరువురికి చోటు లభించింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ కడపకు చెందిన జేసీఎన్ ప్రతినిధి రామాంజనేయరెడ్డి, మున్సిఫ్ టీవీ ప్రతినిధి సర్దార్కు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. ఐజేయూలో ప్రాతినిధ్యం కోసం జిల్లా కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్ర కమిటీ ఆమోదించి శనివారం అధికారికంగా ప్రకటించింది. జిల్లాకు చెందిన ఇరువురి ఎంపిక పట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.బాలకృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు రామసుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలుకడప అర్బన్ : జిల్లాలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమాలకు ఎస్పీ ఈ.జీ.అశోక్కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టారు. ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాల్లో ఎలాంటి చిన్నపాటి ఘటనలు, అపశ్రుతులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఊరేగింపు, నిమజ్జన ప్రదేశాలలో ప్రత్యేకంగా అత్యాధునిక సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. సిద్దయ్య సేవలు అభినందనీయం కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప జోన్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పీడీ సిద్దయ్య అందించిన సేవలు అభినందనీయమని డిప్యూటీ సీపీఎం గజలక్ష్మి, డిప్యూటీ సీటీఎం (ఓఅండ్సీ)ప్రశాంతి కొనియాడారు. శనివారం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సిద్దయ్యకు ఆర్టీసీ అధికారులు వీడ్కోలు సభ నిర్వహించారు. అనంతరం సిద్దయ్య, విజయలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సేవలు అందించాలన్నారు. ఆర్టీసీలో 1986లో కండక్టర్గా విధుల్లో చేరి వివిధ పదవులు పొంది డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పురుషోత్తం, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎజ్రా శాస్త్రి, కుటుంబ సభ్యులు అశ్విని, హరిప్రసాద్, పృథ్వి, మనోజ్, శృతి, సందీప్ పాల్గొన్నారు. అన్నదమ్ములపై హత్యాయత్నం మదనపల్లె రూరల్/ములకలచెరువు : ఆస్తి తగాదాల కారణంగా వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు...బురకాయలకోటకు చెందిన రామచంద్ర, హరికుమార్, భారతీయుడు అన్నదమ్ములు. వీరికి కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బంధువులు భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్కు మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. కోర్టులో హరికుమార్కు అనుకూలంగా భూమికి సంబంధించి తీర్పులు వచ్చాయి. దీంతో భూమి తమకు దక్కదని భావించిన భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్లు కక్ష పెంచుకుని మరి కొందరితో కలిసి శనివారం తెల్లవారుజామున బురకాయలకోటకు వెళ్లి నిద్రిస్తున్న అన్నదమ్ములు రామచంద్ర, హరికుమార్, భారతీయుడుపై కర్రలు, ఆయుధాలతో మూకుమ్మడిగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో బాధితులను సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ పరామర్శించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిపై కత్తితో దాడిమదనపల్లె రూరల్ : వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కాలనీగేటులో నివాసం ఉంటున్న బాబు(29) శుక్రవారం రాత్రి అదే ప్రాంతంలోని పుట్టింటిలో ఉన్న భార్య రాణి వద్దకు వెళుతుండగా, స్థానికుడైన గోవిందు, బాబును అడ్డగించి వ్యక్తిగత కక్షతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
జమ్మలమడుగు (మైలవరం) : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెంకటరమణ (33) అనే యువకుడు పెన్నా నదిలో గల్లంతయ్యాడు. శనివారం అతను పెన్నా నది నీటిలో దిగాడు. అయితే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకొని పోతుండగా సమాచారం మేరకు మైలవరం ఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి, సిబ్బంది వెంకటరమణను పట్టుకోవడానికి నీటిలో దిగారు. ప్రవాహం ఎక్కుగా ఉండటంతో వారు కూడా అతి కష్టం మీద గట్టుకు చేరారు. మైలవరం జలాశయం అధికారులతో మాట్లాడి నీటిని ఆపివేయించి గాలించినా యువకుడి ఆచూకీ దొరకలేదు. నేడు నెలనెలా సీమ సాహిత్యంకడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ కార్యక్రమంలో భాగంగా 146వ సదస్సును ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి పేర్కొన్నారు. ఈ 146వ సదస్సులో ‘శుభ్రజ్యోత్స (యెద్దల గంగయ్య) జీవితం సాహిత్యం’ అనే అంశంపై నాగిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎఫ్.ఎ.సి) గంగనపల్లె వెంకటరమణ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. డాన్స్ మాస్టర్పై దాడి మదనపల్లె రూరల్ : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రామ్లో మాస్టర్పై కొందరు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన గౌతమ్(35) డాన్స్ మాస్టర్గా ప్రోగ్రామ్లకు వెళుతుంటాడు. ఇందులో భాగంగా సీటీఎంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శుక్రవారం రాత్రి బృందంతో కలిసి డాన్సులు వేసేందుకు వెళ్లాడు. స్టేజిపై గౌతమ్ డాన్స్ చేస్తుండగా, అక్కడే ఉన్న ఓ యువతి డాన్స్ వేసేందుకు స్టేజీ ఎక్కింది. డాన్స్ చేసే క్రమంలో యువతిని గౌతమ్ తాకడాన్ని సహించలేని యువతి బంధువులు డాన్స్మాస్టర్ గౌతమ్పై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. యువతికి పాముకాటు రామసముద్రం : పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లిన యువతిని విష సర్పం కాటేసిన సంఘటన శనివారం రామసముద్రం మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చెంబకూరుకు చెందిన టి. బాబు కూతురు టి. అంజుమ్ (19) ఇంటికి సమీపంలోని పొలం వద్ద ఉన్న పాడి ఆవులకు మేత వేసేందుకు వెళ్లింది. అక్కడ గడ్డి మధ్యన ఉన్న ఓ విష సర్పం ఆమె కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో తప్పిన ప్రమాదంసంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మోటకట్ల సమీంలోని ఓ హోటల్ సమీపంలో బొలేరో పికప్ వాహనం పాత సామాన్ల లోడుతో రాయచోటి వెళుతుండగా టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలోనే కలకడ వైపు నుంచి వస్తున్న కారు ఆగి వున్న బొలేరో పికప్ వాహనాన్ని అదుపు తప్పి ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. శనివారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 90 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. ఆ జట్టులోని జెనిక్ దాస్ 197 బంతుల్లో 12 ఫోర్టు, 2 సిక్సర్లతో 109 పరుగులు, రెడ్డి రుషిల్ 142 బంతుల్లో 84 పరుగులు, తేజ రెడ్డి 64 బంతుల్లో 60 పరుగులు, బీఎం వెంకటేష్ 92 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఎస్ఎండీ అస్లామ్ 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్లో తొలి రోజు నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 82 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్. సోహన్ వర్మ 209 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 166 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. పవన్ రిత్విక్ 79 పరుగులు, మాధవ్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి 2 వికెట్లు, సాయి ప్రణవ్ చంద్ర 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
రిషికొండపై ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం
కడప కార్పొరేషన్ : విశాఖపట్నంలోని రిషికొండపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని వైఎస్సార్సీపీ వైద్య విభా గం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషికొండపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ నిర్మించారని, ఆ భవనాల నైపుణ్యంపై చంద్రబాబే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. తాజాగా ఆ భవనాల్లో సేనానితో సేన ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకొని ఆ హాల్లో ఒక ఫాల్ సీలింగ్ ఊడిపడిన దాన్ని పట్టుకొని విష ప్రచారానికి తెరతీశారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుందే తప్పా వాటర్ లీకేజీ వల్ల పాడై పడినట్లు లేదన్నారు. ఈ భవనాలు కట్టడం వల్ల రూ.400 కోట్లు వృథా అయ్యాయని చూపించబోయి బొక్కబోర్లా పడ్డారన్నారు. ఈ భవ నాలపై రూ.750 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలాగా వృథా ఖర్చులు చేయలేదన్నారు. యో గాంధ్ర పేరుతో ఈ ప్రభుత్వం రూ.400కోట్లు ఖర్చు చేసి కాళ్లు లేనివారికి, చిన్నపిల్లలకు, చనిపోయిన వారికి సైతం యోగా చేసినట్లు సర్టిఫికెట్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సుగాలి ప్రీతి వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారే తప్పా వారికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఐదు సెంట్ల స్థలం, తల్లిదండ్రులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారని గుర్తు చేశారు. వైఎస్సార్టీయూసీ నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి -
రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
కమలాపురం : ఉల్లి రైతులు కుదేలయ్యారని, పంట గిట్టు బాటు ధర లేక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం కమలాపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న రైతులకు ప్రతి దశలో సాయం చేశారని, విత్తు నుంచి విక్రయం వరకు పూర్తిగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం మద్దతు ధర లేక పోవడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు , అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేని పరిస్థితితో కూటమి ప్రభుత్వం ఉందని మండి పడ్డారు. యూరియా దొరకక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న ఆర్బీకేలను ఏర్పాటు చేసి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ నమోదు చేసుకున్న 48 గంటల్లోనే రైతు ముంగిట చేర్చేవారన్నారు. ప్రస్తుతం ఉల్లి పంట కోత దశకు వచ్చిందని, బహిరంగ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.800 కూడా పలకడం లేదని రైతులు మథన పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు క్వింటా రూ.1200 కొనుగోలు చేస్తామని చెప్పడమే గాని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయలేదన్నారు. ఉల్లి రైతులు దిగుబడులు తీసుకుని మార్కెట్ యార్డులకు వెళ్తే కనీసం ఆటో చార్జీలు కూడా రావడం లేదన్నారు. క్వింటా రూ.2వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు రైతులను పరామర్శించడానికి ఒంగోలుకు, మిర్చి రైతుల కోసం గుంటూరుకు, మామిడి రైతుల కోసం బంగారు పాళ్యంకు జగనన్న వెళితే ప్రభుత్వం దిగి వచ్చి మద్దతు ధరలు ప్రకటించిందని గుర్తు చేశారు. ఉల్లి రైతుల కోసం కూడా జగనన్న వస్తేనే కొనుగోలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మాజీ ఉద్యాన సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తక్షణం ఉల్లి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి -
సకల మానవాళికి తల్లి ఆరోగ్యమాత
కడప సెవెన్రోడ్స్: ఆరోగ్యమాత సకల మానవాళికి తల్లిలా ప్రేమ కురిపించి ఆదరిస్తుందని కడప మాసాపేట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఎ.జోసెఫ్రాజ్ అన్నారు. కడప నగరంలోని ఆరోగ్యమాత క్షేత్రంలో జరుగుతున్న ఉత్సవాల్లో రెండవ రోజైన శనివారం రాయచోటి విచారణ గురువులు రెవరెండ్ఫాదర్ ఆనంద్ దివ్యబలిపూజ సమర్పించారు. తొలుత జపమాల చెప్పుకొంటూ గుడిచుట్టూ దేవమాతను ఊరేగించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులనుద్దేశించి జోసెఫ్రాజ్ మాట్లాడారు. మానవాళిని లోకానికి పరిచయం చేసేది మన తల్లి అయితే, దీవెనలు, వరాలను అందించేది ఆరోగ్యమాత అని పేర్కొన్నారు. సంతాన ప్రదాతగా ఆమె మహిమగల తల్లి అని, ఆమెను ఆరాధించి ప్రార్థించి సకల ఐశ్వర్యం, ఆరోగ్యాలను పొందాలన్నారు. మరియమాత దేవునికే కాకుండా మానవాళికి తల్లి అని కొనియాడారు. ఆమె చూపిన అడుగుజాడల్లో నడిచి దేవుని సన్నిధికి చేరుకోవాలన్నారు. దేవుని వాక్యనుసారంగా మానవాళి నడుచుకోవాలన్నారు. అప్పుడే పరలోకంలో స్థానముంటుందని తెలిపారు. రెవరెండ్ ఫాదర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని దేశం, రాష్ట్రం కోసం ప్రార్థించారు. ఉత్సవాల్లో బాగంగా పాటలు, మరియతల్లి తేరు, దివ్య బలిపీఠం, సిస్టర్స్ ఆఫ్ క్రీస్తు జ్యోతి, మదర్ హౌస్ ప్రతినిధులు అలంకరించారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవ ఫాదర్ ఎండీ ప్రసాదరావు,గురువులు బి.జాన్నేస్, ఎం.డేవిడ్రాజు, విజయరావు, వైటీఏ విక్టర్, సెబాస్టిన్, ఆనందరావు, డేవిడ్ రాజేందర్, ఆంథోని, జార్జి, జయరాజు, అంజలిన, సుందరమ్మతోపాటు పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. -
● ఉల్లి రైతుల కంట కన్నీరు
కమలాపురం జెడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఉల్లి సాగు చేసిన రైతులు ధరలు లేక కంట తడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటను సభలో ఆమె ప్రదర్శిస్తూ కష్టాలను వివరించారు. ఎకరాకు సుమారు 80 వేల రూపాయల ఖర్చవుతోందని తెలిపారు. మార్కెట్లో వ్యాపారులు క్వింటాలు రూ. 800–900లతో కొనుగోలు చేస్తుండడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటాలు రూ. 1200 ఇస్తామని చెబుతోందని, క్వింటాలు రూ. 1800–2000లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేసి ఆదుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్య కోరారు. ● బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న ధరతో యూరియా ఎక్కడా రైతులకు అందుబాటులో లేదన్నారు. బస్తా సుమారు రూ. 500తో విక్రయిస్తున్నారన్నారు. అధిక ధరకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లంచం లేకుండా నాడు–నేడు బిల్లులు చెల్లించడం లేదన్నారు. -
స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీకి సన్నాహాలు
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న స్మార్ట్ రేషన్కార్డులు జిల్లాలో పంపిణీ చేసేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నాల్గవ విడతలో వైఎస్సార్ కడప జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. స్మార్ట్ కార్డులన్నీ ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు వస్తాయని తెలిపారు. తొలి ఐదు రోజులు స్పెషల్ కేటగిరీకి చెందిన వికలాంగులు, వయో వృద్ధుల ఇళ్లకు సచివాలయ సిబ్బంది వెళ్లి కార్డులను అందజేస్తారని తెలిపారు. ఆ తర్వాత పది రోజులపాటు ఆయా ఎఫ్పీ షాపు డీలర్ల సమక్షంలో కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు డోర్ లాక్, తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి, వివిధ కారణాలతో కార్డులు పొందలేని వారికి పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని 1239 రేషన్ షాపుల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీలర్ల వద్ద ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ పాస్యంత్రం) డివైజ్లో స్మార్ట్ కార్డుకు అవసరమైన కొత్త రీడర్ను పొందుపరుస్తామన్నారు. కొత్త స్మార్ట్ రేషన్కార్డుల ద్వారా ఎఫ్పీ షాపుల్లో అక్టోబరు నుంచి సరుకులు పొందడానికి వీలు ఉంటుందని ఆయన వివరించారు. -
● మామిడికి బీమా ఏమైంది?
చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్రెడ్డి, రామాపురం జెడ్పీ టీసీ వెంకట రమణ, మాట్లాడుతూ గాలి, వాన కారణంగా తమ మండలాల్లో మామిడి పంట రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు రూ. 45 వేలు బీమా వస్తుందని ప్రభుత్వం చెప్పడంతో రైతులంతా ప్రీమియం చెల్లించారని తెలిపారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బీమా అందలేదని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బీమా అందేలా చూడాలని కోరారు. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా మాట్లాడుతూ యూరియా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించకపోతే రైతులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియజేస్తూ ఫోన్ నంబర్లు ప్రకటించాలన్నారు. జిల్లాలో రైతులు పసుపు బాగా సాగు చేసి కడప మార్కెట్యార్డుకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారన్నారు. మార్కెట్యార్డులో జేయింట్ షెడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టాయిలెట్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. -
గణపయ్యా.. విఘ్నాలు తీర్చయ్యా..
గణపతిని వివేకం, సంపదలకు దేవుడిగా ఆరాధిస్తారు. కోరినవన్నీ ఇచ్చేవాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందారు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి అవరోధాలు. వీటినే విఘ్నాలు అంటాం. అలాంటి ఆటంకాలను పోగొడతారు కనుకనే విఘ్నేశ్వరుడు అయ్యారు. అరిషడ్వర్గాలను అరికట్టి మోక్షసాధనకు మార్గం సుగమం చేసే వాడు లంబోదరుడు. అటువంటి గణనాథుని వేడుకలను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నాడు బుధవారం వాడవాడలా విగ్రహాలు ప్రతిష్టించారు. కొన్ని ఉత్సవ కమిటీల వారు మూడో రోజైన శుక్రవారం నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఇంకా పలు ప్రాంతాల్లోని మండపాల వద్ద సందడి కొనసాగుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువు దీరిన గణనాథులను దర్శించుకునేందుకు నాలుగో రోజైన శనివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ‘గణపయ్యా.. మమ్మల్ని దీవించయ్యా.. విఘ్నాలు తీర్చయ్యా’ అంటూ వేడుకున్నారు. అత్యధిక మంది ఆదివారం నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. –ప్రొద్దుటూరు కల్చరల్ -
గరుడవాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల మున్సిపాలిటీలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలను ఆలయ చైర్మన్ సుధీకర్రెడ్డి, ఈఓ కేవీ రమణ పర్యవేక్షించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: మద్యం బార్లను లక్కీ డ్రా ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమక్షంలో కేటాయించారు. శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేసిన 27 బార్లలో 12 బార్లకు, గీత కులాలకు నోటిఫై చేసిన 2 బార్లు సక్సెస్ అప్లికెంట్స్కు కేటాయించారు. బార్ల అప్లికేషన్ ఫీజు రూపంలో రూ. 12 కోట్లు, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ. 6.10 లక్షలు, మొదటి విడత లైసెన్స్ ఫీజు రూపంలో రూ. 1.19 కోట్ల రెవెన్య లభించింది. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్శాఖ డీసీ జయరాజు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప టెలికాం ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ 1415 కడప వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు సుబ్రహ్మణ్యం, మురళి పేర్కొన్నారు. శని వారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులుగా కళ్యా సుధాకర్, ఉపాధ్యక్షులుగా ఆకుల సుబ్బారావు, కార్యదర్శిగా ఎం.సి.సుబ్బారెడ్డి, సభ్యులుగా ఎ.వెంకటేశ్వర్లు, బి.నాగరాజు, ఎం.రఘురామయ్య, వి.వెంకట రమణయ్య ఎన్నికయ్యారని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల ఇంటి స్థలాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సొసైటీ తరఫున ఉద్యోగులకు, పెన్షనర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. -
గంగమ్మ కుంట చెరువు పరిశీలన
లింగాల: మండల పరిధిలోని అంబకపల్లె గ్రామంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చిన్నపాటి గంగమ్మ కుంటకు భూసేకరణ నిర్వహించి పెద్ద చెరువుగా మార్చడం జరిగింది. అదే విధంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సుమారు రూ.2.50 కోట్ల ఎంపీ నిధులతో హిరోజ్పురం నుంచి 4.50 కి.మీ మేర చెరువుకు పైపులైన్ను ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకం నెలకొల్పి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కృష్ణా జలాలు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుకు వస్తుండటాన్ని పరిశీలించారు. అదేవిధంగా చెరువు వద్ద మాజీ సీఎం, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జల హారతులు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు సంబంధించి అధికారులతో చర్చించి అనుమతులు పొందిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ప్రకటిస్తామన్నారు. చెరువు నిర్మాణం, ఎత్తిపోతల పథకం వల్ల గ్రామంలో భూగర్భజలాలు పెంపొంది తాగు, సాగునీరు సమృద్ధిగా అందుతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, యూత్ కన్వీనర్ మనోహర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, నిరంజన్రెడ్డి, నాగేంద్రనాథరెడ్డి, విశ్వరూప జనార్థన్రెడ్డి, అంబకపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, తేజేశ్వరరెడ్డి, బండి వెంగల్రెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, నాగభూషణరెడ్డి, తదితర వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహకాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ ఏం శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నా రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డీడీఆర్ఎఫ్ అధికారులు, డీటీఓ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఏపీఎస్ పీడీసీఎల్ శాఖల అధికారులు, ఏపీఐఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు. రుణాల మంజూరు బ్యాంకర్లు చొరవ చూపండి వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో ఎల్డీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో క్రాప్ లోన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎల్డీఎం జనార్ధనం, డీఆర్డీఏ, మెప్మా పీడీలు డాక్టర్ రాజ్యలక్ష్మీ, కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు చంద్రానాయక్, రవి చంద్రబాబు, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ లక్ష్మీతులసి, నాబార్డ్ డీడీఎం విజయ విహారి, ఆర్ఎం ఎస్బీఐ కృష్ణ కిషోర్, వివిధ బ్యాంకు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా క్రైసిస్ గ్రూప్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల లోపలే కాకుండా పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని మరింత భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీఎస్ పీడీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, ఫైర్ శాఖ, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
లంబో‘ధర’ లడ్డూ
మైదుకూరు: లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి యమ డిమాండ్ ఉంది. రూ.లక్షల్లో ధర పలుకుతోంది. వినాయక చవితి ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం భారీగా వేలం పాటలు నిర్వహించారు. పలువురు భక్తులు పోటీ పడి దక్కించుకున్నారు. అలాగే పూజ సామగ్రిని పొందేందుకు అమితాసక్తి కనబరిచారు. స్వామి వారి ప్రసాదం, పూజ సామగ్రి అందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. మండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం విశేషం. ● మైదుకూరు మండలంలోని అన్నలూరు అరవింద్నగర్లో అదే గ్రామానికి చెందిన కల్లూరి రామిరెడ్డి 10 కిలోల లడ్డూను రూ.4 లక్షలకు సొంతం చేసుకున్నారు. తోట వెంకటరామిరెడ్డి 15 గ్రాముల వెండి కాయిన్ను రూ.1.20 లక్షలకు పొందారు. మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలో కొండిశెట్టి బాలుడు రూ.14 వేలకు చెరకు గడలను కై వసం చేసుకున్నారు. మైదుకూరులోని శీలం నగర్లో లడ్డూ ప్రసాదాన్ని మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, ఆయన కుమారుడు మాచనూరు సాగర్ రూ.2.16 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. ● వీరపునాయునిపల్లెలోని నడివీధి గంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూను నర్రెడ్డి అరున్కుమార్రెడ్డి 2.35 లక్షలకు దక్కించుకున్నారు. ● బద్వేలు పట్టణం తెలుగుగంగ రోడ్డులోని నారాయణ స్కూల్ దగ్గర వినాయక విగ్రహం లడ్డూను రూ.1.89 లక్షలకు మణ్యం శంకర్రెడ్డి వశం చేసుకున్నారు. -
వైభవంగా ఆరోగ్యమాత ఉత్సవాల ప్రారంభం
కడప సెవెన్రోడ్స్: కడప నగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో తిరునాల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం శాంతి కోసం పావురాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బిషప్ దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడారు. తిరునాల ఉత్సవాలు ఘనంగా, సవ్యంగా సాగాలని కోరారు. ప్రజలంతా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేవుడు ప్రజలు ప్రార్థనలు ఆలకించి వారి అభీష్టాలను నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ ఎండీ ప్రసాద్రావుతోపాటు ఫాదర్ ఎ.జోసెఫ్రాజు, డీన్ రెవరెండ్ ఫాదర్ ఎస్.సురేష్, విచారణ ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి జి.ఆనందరావు, డయాసిస్ గురువులు, ఆరోగ్యమాత, జేయంజె, క్రీస్తు జ్యోతి సిస్టర్స్, తిరునాల కమి టీ పెద్దలు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఆగ్రహం
పులివెందుల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు అమలు సాధ్యం కాని అనేక హామీలను చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ కూటమితోపాటు ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు అంటూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేశారన్నారు. ఏడాది దాటిపోయినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లలో ఒక్క సిలిండర్ కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. అమరావతి అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలు, ఆరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజలు ఆయనకు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ముగిసిన డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. కడప బాలాజీనగర్లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తోపాటు పలు రకాల ఉపాధ్యాయ పోస్టులకు మొదటిరోజు 712 మంది అభ్యర్థులకు గాను 609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండవ రోజు మిగిలిన 103 మందితోపాటు స్టేట్, జోన్కు సంబంధించి 535 మంది అభ్యర్థులు వచ్చారు. -
కూలిన మట్టి మిద్దె
– తప్పిన పెనూ ప్రమాదం ఎర్రగుంట్ల : మండల కేంద్రమైన యర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలోని వినాయకనగర్ కాలనీలో నివాసం ఉండే మరియమ్మ ఇల్లు ఇటివల కూరిసిన వర్షాలకు తడిసి దూళాలు విరిగి పోయి శుక్రవారం తెల్లవారిజామున కూలి పోయింది. ఆ సమయంలో మరియమ్మ ఇంటిలో లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా బాధితరాలు మరియమ్మ మాట్లాడుతు వినాయకనగర్ కాలనీలో మట్టి మిద్దెలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఇటివల కురిసిన వర్షాల వల్ల మిద్దె అంత తడిసి వర్షం నీటితో ఊరుస్తుండేదన్నారు. గురువారం పని మీద బయటకు వెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం వచ్చి చూడగానే మిద్దె అంతా కూలిపోయి ఉందన్నారు. ఇంటిలో సామగ్రి అంతా మట్టిపాలైందని వాపోయింది. ప్రభుత్వం ఆదుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సాయం అందించాలని బాధితరాలు వేడుకుంది. చైన్ స్నాచింగ్ కలసపాడు : మండలంలోని పోరుమామిళ్ల – కలసపాడు ప్రధాన రహదారి సిద్ధమూర్తిపల్లె వద్ద శుక్రవారం సాయంత్రం మహిళ మెడలో నుంచి బంగారు సరుడురె దుండగుడు లాక్కెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధమూర్తిపల్లెకు చెందిన పాలకొలను మల్లేశ్వరి గడ్డి మోపును ఎత్తుకుని వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్పై వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు సరుడు లాక్కెళ్లాడు. వెంటనే బాధితురాలు కలసపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోరుమామిళ్ల సీఐ డి.శ్రీనివాసులు, కలసపాడు ఎస్ఐ తిమోతి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ చేసుకోవాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల రిజిస్ట్రేషన్లను సెప్టెంబరు 30వ తేదీలోపు రెన్యూవల్ చేసుకోవాలని తిరుపతి ఆదాయపు పన్నుశాఖ అధికారి శివశంకర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీసీఈ భవనంలో తిరుపతి ఆదాయపు పన్ను అధికారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయపు పన్ను సంచాలకులు బాలకృష్ణ, అదనపు సంచాలకులు సుమిత ఆదేశాల మేరకు పన్ను చట్టంలోని మినహయింపుల నూతన సవరణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి సందేహాల నివృత్తికి 89859 71460 నెంబరులో సంప్రదించాలన్నారు. కడప ఆదాయపు పన్నుశాఖ అధికారి సత్యనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సెల్టెంట్లు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనంగా తెలుగు భాషాదినోత్సవం
కడప ఎడ్యుకేషన్ : తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వ్యావహారిక భాషకు చేసిన సేవలోని సంస్కారాన్ని అందిపుచ్చుకోవడమే అసలైన తెలుగు భాషా దినోత్సవమని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం శుక్రవారం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, వక్త ఆచార్య మేడిపల్లి రవికుమార్, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ప్రధానవక్తగా విచ్చేసిన ఆచార్య మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పట్టుదల గల మనిషని, సాధారణ ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించినప్పటికీ తనకు పరిచయం లేని సవర భాషను నేర్చుకున్నారన్నారు. అంతేగాక ఆ భాషకు వ్యాకరణాన్ని, నిఘంటువును రూపొందించారన్నారు. ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ నాగబు అనేది తొలి తెలుగు పదమని, అది అమరావతి శాసనం ఆధారంగా తెలిసిందన్నారు. . ఆచార్య మేడిపల్లి రవికుమార్ను ఆచార్య జి.పార్వతి, జానమద్ది విజయ భాస్కర్, డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, ఎన్.రమేశ్రావు, జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకట రమణ, ఎం.మౌనిక, సిబ్బంది కలసి ఘనంగా సత్కరించారు. -
మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు
కడప సెవెన్రోడ్స్ : మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో జిల్లాలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పటిష్టమైన నిఘా చర్యలు అవలంబించాలని తెలిపారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. మాదకద్రవ్యాలు విక్రయాలు జరిగే చోట గట్టి నిఘా ఉంచాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు. బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పునరావాసం కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఈగల్స్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాల నిరోధకం, వాడకం పై ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అక్రమ డ్రగ్స్ వాడకం, రవాణాపై సమాచారాన్ని తెలిపేందుకు.. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ : 1972 లకు కాల్ చేయవచ్చన్నారు. రిమ్స్ ప్రాంగణంలోని డి.అడ్డిక్షన్ సెంటర్ ను ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కడప.మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కష్టమ్స్ శాఖ, పోలీసు, ఎస్సైజ్, రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసాయ, రవాణా, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు
– సమగ్రశిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాస్ కడప ఎడ్యుకేషన్ : పాఠశాల విద్యలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది శారీరక, మానసిక, ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష రాష్ట్ర పథక సంచాలకులు(ఎస్పిడి) శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్లో నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఈ నెల 20, 21 తేదీలలో ఏపీ పాఠశాల విద్యశాఖ రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప జిల్లా విద్యాశాఖ బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా ఆయను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కడప సూపర్ కింగ్స్ కెప్టెన్ మున్నా, వైఎస్ కెప్టెన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. – ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ ప్రొద్దుటూరు : జిల్లాలో సోలార్ రూఫ్టాప్ వలన గృహ వినియోగదారులు ఉచిత విద్యుత్ను పొందవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని లక్ష్మీనగర్లోని వినియోగదారుల వద్దకు ఎస్ఈ రమణ వెళ్లి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో పెట్టుబడి వ్యయంతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్ల వలన కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు తర్వాత సబ్సిడీ ప్రయోజనం మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు 30 రోజుల్లోపు జమ అవుతుందన్నారు. ఈ సబ్సిడీ మొత్తం సుమారు రూ.98వేలు ఉంటుందన్నారు. దీని ద్వారా కొంత ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో విద్యుత్ వాహనాల ప్రాధాన్యత అధికంగా ఉంటుందని, వాటికి అవసరమైన విద్యుత్ శక్తి సోలార్ రూఫ్ టాప్ ద్వారా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ప్రొద్దుటూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణమోహన్, జూనియర్ ఇంజనీర్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణమాస ఉత్సవాలకు రూ.1.96 కోట్ల ఆదాయం వేంపల్లె : ఈ ఏడాది గండి దేవస్థానం సంబంధించి శ్రావణమాస ఉత్సవాలకు అన్ని విభాగాల నుంచి రూ.1,96,07,865ల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు. చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ స్వామి శ్రావణమాస మహోత్సవాలు ముగిసిన సందర్భంగా అధికారులు హుండీ, టికెట్ల, ఆదాయ, తదితర అన్ని విభాగాల లెక్కింపులు నిర్వహించారు. శుక్రవారం కడప దేవాదాయ శాఖ సి.శివయ్య పర్యవేక్షణలో పోలీసు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించగా నగదు రూపంలో రూ.40,71,120, బంగారు వస్తువులు 11గ్రాములు, వెండి వస్తువులు తొమ్మిది గ్రాములు, యూఏఈ అరబ్ 10 దిర్హమ్స్ ఆదాయం వచ్చింది. గత ఏడాది శ్రావణమాస మహోత్సవాలకు రూ.1.60,35,630 రాగా, ప్రస్తుతం ఈ ఏడాది రూ.1,96,07,865ల ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కావలి కృష్ణ తేజ, మాజీ చైర్మన్ కల్లూరు వెంకటస్వామి, ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, ఆర్కే వ్యాలీ పోలీసులు, నారాయణ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తపాలా సేవలపై అయోమయం..!
రాజంపేట : ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ–సేవల విస్తరణ కోసం సరికొత్త ప్రయోగాలుచేస్తున్న పోస్టల్శాఖ పాతసేవలను మాత్రం ఒకొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దుకాగా, సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్ పోస్ట్సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టట్)బాక్స్లను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్ధకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే...అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతిక టెక్నాలజికి పోస్టల్ డిపార్టుమెంట్ అప్గ్రేడ్ అవుతోంది. రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం పోస్టల్శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడనున్నది. తాజాగా బ్రిటిషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్సేవలు సెపెంబరు1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పోస్టుమాస్టర్లకు శాఖపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్న..ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్ట్కార్డు లేదా రిజిస్టర్డ్ మాత్రమే అందుబాటులో ఉండేది. సుమారు 17యేళ్లుగా.. పోస్టల్ వ్యవస్ధ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్టుమెంట్ ఇప్పుడు మరింత ఆధునికసేవలతో మందుకువస్తోంది. 1854లో అప్పటి బ్రిటిషర్ లార్డ్డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమైయ్యాయి. అంతకముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171యేళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్నోటీసులు,అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలివారికి చేరినట్లు రసీదు(డెలవరీ ఫ్రూప్) పొందడం ఒక ప్రత్యేకత, చట్టపరంగాను ఎంతో విలువైంది. ఇది కాస్తా మరో రెండువారాల్లో కనుమరుగు కానున్నది. స్పీడ్పోస్ట్లో విలీనం రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్పోస్ట్ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలాశాఖ ప్రకటించింది.తపాలాశాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవలు క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్ధను బలోపేతం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్పోస్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ను విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్పోస్టు అంటే వేగవంతమైన డెలవరీ, ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్పోస్ట్లో కలపడంతోడెలవరీలుమరింత వేగవంతం కానుంది. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది రిజిస్టర్డ్ పోస్ట్లేదు. ఒక సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవతుందని అధికారులు పేర్గొంటున్నారు. తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికతవాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీమెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. ఐదేళ్ల జరిగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్ పరిశీలిస్తే 25శాతం పడిపోయింది. స్పీడ్పోస్టు, ఇతర కొరియర్సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్ట్కు డిమాండ్ తగ్గింది. అయితే తాజాగా స్పీడ్పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్ధితి కనిపిస్తోంది.రిజిస్టర్డ్ పోస్ట్ కనీసం చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం భరించకతప్పదు. రెడ్పోస్టు బాక్స్పై ఊహగానమే..రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చ రిత్ర కలిగిన రెడ్పోస్టుబాక్స్లు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో పోస్టల్ అభిమానులు కలత చెందుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వ్యక్తమౌవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవంలేదని , అది ఒక ఊహాగానమేనని మాత్రమే అని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్శాఖ ద్వారా ఎరుపు పోస్ట్బాక్స్లను ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్టల్ సేవల నిలిపివేత నిర్ణయం తాజాగా లెటర్రెడ్(పోస్ట్)బాక్స్ ఎత్తివేత ప్రచారం అవి ఊహాగానాలే అంటున్న తపాలా వర్గాలు ఈ–సేవ విస్తరణలో పోస్టల్శాఖ నిమగ్నంపోస్టుబాక్స్లు ఉండవనే సామాజిక మాధ్యమాల లో జరుగుతున్న ప్రచారంపై కడప పోస్టల్ ఎస్పీ రాజేష్ని ‘సాక్షి’ వివరణ కోరింది. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలిగింపునకు సంబంధించి ఎ లాంటి ఆదేశాలు రాలేదని ఎస్పీ స్పష్టం చేశారు. -
అన్నమయ్య జిల్లా వద్దు.. బ్రహ్మంగారి జిల్లా ముద్దు
బద్వేలు : రాజంపేటను జిల్లాగా చేసి అందులో బద్వేలు నియోజకవర్గాన్ని కలుపుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అదే రోజు నుంచి బద్వేలు నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులు కున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక సంఘం బద్వేలును కడప జిల్లాలోనే ఉంచాలని రాజంపేట వద్దని నిరసన రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బద్వేలును జిల్లా చేయాలని అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి బద్వేలు పట్టణ ప్రజలే కాకుండా గ్రామాలని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.ఉంటే వైఎస్ఆర్ కడప జిల్లా.. లేకుంటే బ్రహ్మంగారి పేరున జిల్లానాలుగు రోడ్ల కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ బద్వేలు నియోజకవర్గ అదనపు కార్యదర్శి నల్లేరు విశ్వనాధరెడ్డి తన సంఘీభావాన్ని తెలియజేశారు.ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాతో దశాబ్దాల కాలం నుంచి బద్వేలు నియోజక వర్గానికి విడదీయరాని బంధం ఉందని, దానిని కాదని నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజంపేట జిల్లాలో బద్వేలు నియోజక వర్గాన్ని కలుపుతామనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు కూటమి ప్రభుత్వం మాను కోవాలని హితవు పలికారు. ఒకవేళ తప్పదని బద్వేలును వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి విడదీయాలని అనుకుంటే బ్రహ్మంగారి మఠం లో కొలువైన వీరబ్రంహ్మేస్వామి పేరుతో బద్వేలు నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నారు. అందుకు బద్వేలు పట్టణానికి అన్ని రకాల బౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయులు, పెన్షనర్ల విభాగం మేధావులు, బీసీ సాధన సమితి, దళిత సాధన సమితి, విద్యార్థి విభాగం నాయకులు వివిద పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆటో చోరీకి పాల్పడిన 24 గంటల్లోనే దొంగ అరెస్ట్
కడప అర్బన్ : ఆటో చోరీకి పాల్పడిన కడప నగరం ఎన్జీవో కాలనీ చెందిన తుమ్మలూరు అనిల్ కుమార్ను 24 గంటల్లోపే అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఆటో స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ జి. ఓబులేసు తెలిపారు. నిందితుడిపై గతంలో 7 క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయినట్లు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ వివరాలను తెలియజేశారు. చిన్నచౌక్ , రైల్వేకోడూరు, తిరుపతి వెస్ట్ ,తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో ఆటో దొంగతనాలుకు పాల్పడగా కేసులు నమోదు చేశారన్నారు. చెన్నూరు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అతడు పలు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వరరెడ్డి రవికుమార్ సిబ్బందితో కలసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించామన్నారు. శుక్రవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని చలమారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును విజయవంతంగా 24 గంటల్లోపే ఛేదించిన సీఐ, ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాధర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డిలను కడప డిఎస్పీ అభినందించారన్నారు. రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
వినూత్న ఆలోచనలతోనే ఉన్నత స్థాయి
కడప ఎడ్యుకేషన్ : క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమస్యకు పరిష్కారం చూపే వినూత్న ఆలోచనలు మిమ్మలను ఉన్నత స్థాయిలో నిలుపుతాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ‘మోటివేషనల్ టాక్ ఆన్ కిరీర్పై అవగాహన సదస్సు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని అన్నమాచార్య సేన హాల్లో శుక్రవారం నిర్వహించారు. డాక్టర్ వి బ్రహ్మారెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. నేటితరం యువత సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తూ కెరీర్లో సక్సెస్ కావాలంటే మాట్లాడడం నేర్చుకోవాలన్నారు ముఖ్యంగా పుస్తకాలు చదవడం అలవాటుగా మారితే ఒక కొత్త లోకం చూసినట్లు ఉంటుందన్నారు. మంచి సినిమాలు చూడాలని, అందులోని విలువైన విషయాన్ని జీవితానికి ఉపయోగపడే వాటిని తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి శాసీ్త్రయ దృక్ఫథంతో ఆలోచించాలని, ఉద్వేగాలు, ఉద్రేకాలకు దూరంగా ఉండాలన్నారు. అతిగా ఆలోచించడం మానివేయాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా జీవించడం అలవర్చుకోవాలని తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి పద్మ మాట్లాడుతూ నైపుణ్యాలు పొందడంలో గత కాలానికి నేటికీ అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని సమయపాలన పాటిస్తూ వాటిని సాకారం చేసుకోవాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని తీసుకువచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విశ్వవిద్యాలయ సమన్వయకర్త ఎన్ వెంకట్రామిరెడ్డి , పీఓలు డాక్టర్ లలిత, ఎం. అనిత, డాక్టర్ శ్రీ నివాసరావు, అధ్యాపకులు డాక్టర్ ఎస్. రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ టి. సురేష్ బాబు, సుధీర్, డాక్టర్ మరియదాస్, మనస్విత, వెంకటరమణ పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి -
కారు ఢీకొని మహిళ మృతి
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి(70) మృతి చెందారు. ఎస్ఐ హైమావతి వివరాల మేరకు.. మోరగుడి గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి బుధవారం రాత్రి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. రచ్చబండ సమీపానికి చేరగానే జమ్మలమడుగు నుంచి మైలవరం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి మహిళను ఢీకొంది. ఈ సంఘటనలో ఆమె తీవ్ర గాయాలవగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిక్షీంచి అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గొర్రెల చోరీ ముద్దనూరు : మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఐదో గొర్రెలు దుండగులు చోరీ చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. తిమ్మాపురం గ్రామానికి చెందిన జయరాముడు సుమారు 130 జీవాలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వేళల్లో వాటిని రహదారి ప్రక్కనే వున్న దొడ్డిలో వాటిని ఉంచేవాడు. మంగళవారం రాత్రి అందులోని ఐదు గొర్రెలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ రూ.30వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు కలసపాడు : మండలంలోని గిద్దలూరు ప్రధాన రహదారిలో గంగాయపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్ర మాదంలో వ్యక్తికి తీ వ్రగాయాలయ్యా యి. పోలీసుల వివరాల మేరకు.. గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్కుమార్ కలసపాడు నుండి తన స్వగ్రామానికి బుధవారం ద్విచక్రవాహనంలో బయలుదేరారు. గిద్దలూరు నుంచి మైదుకూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం గంగాయపల్లె వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్కుమార్ తీవ్రంగా గాయపడగా, గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న వారు హాజరుకావాలి కడప అర్బన్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం ఆగస్టు 30, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. ఈ నెల 30న రిజిష్టర్ నెంబర్ 4001160 నుంచి 4155879 వరకూ, సెప్టెంబర్ 1న 4156636 నుండి 4299199 వరకు సివిల్ అభ్యర్థులు, 2న 4299250 నుంచి 4504602 వరకు ఏపీఎస్పీవారైతే 4002777 నుండి 4468576 రిజిష్టర్ నెంబర్ల వరకు హాజరు కావాలని సూచించారు. -
బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి
బద్వేలు అర్బన్ : బద్వేల్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుని కడప జిల్లాలోనే కొనసాగించాలని బద్వేలు నియోజకవర్గ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చీపాటి రాజేశ్వరరావు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు బి.నారాయణరెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయ సభా భవనంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం వారు మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత వెనుక బడిన, ఎంతో చరిత్ర కలిగిన బద్వేల్ నియోజకవర్గాన్ని ఇక్కడి ప్రజల మనోభావాలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అన్నమయ్య జిల్లాలోకి మార్చాలనుకోవడం సరికాదన్నారు. నియోజకవర్గంలోని కలసపాడు, కాశినాయన మండలాల నుండి రాజంపేటకు వెళ్లాలంటే వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మారెడ్డి, చంద్రఓబుల్రెడ్డి, సీనియర్ దళిత నాయకులు పిచ్చయ్య, కేశవయ్య, నారాయణ, సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు, ఏపీ వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశం పాల్గొన్నారు. -
సాహసవీరుడికి సత్కారం
పోరుమామిళ్ల : పాకిస్తాన్ చెర నుంచి ఏడుగురు జాలర్లను కాపాడటంలో వీరోచిత పోరాటం చేసిన నౌకాదళ కోస్ట్ గార్డు పాలకొలను రమణారెడ్డి అభినందనీయుడని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి, కాశినాయన మండల ఎంఈఓ మహమ్మద్షఫీ, రిటైర్డు వైద్యాధికారి మార్కారెడ్డి అన్నారు. స్థానిక ఎస్టీయూ భవన్లో గురువారం సాయంత్రం కోస్ట్గార్డు రమణారెడ్డికి జ్ఞాపిక అందచేసి, పూలమాల, శాలువతో సన్మానించారు. అత్యంత సాహసం చేసిన రమణారెడ్డిని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మెడల్ అందచేయడం జిల్లాకు గర్వకారణమన్నారు. దేశ రక్షణకు అందరూ సిద్ధగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు సుబ్రమణ్యం, చంద్రహాసరెడ్డి, బాలరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలసపాడు : కోస్ట్ గార్డు రమణారెడ్డికి సీజీసీ మెడల్ దక్కడంతో పీఆర్ అండ్ అర్డీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు నాగార్జునరెడ్డి, కొండపేట గ్రామస్థులు బుధవారం రమణారెడ్డి, ఆయన తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేద రైతు కుటుంబంలో జన్మించిన రమణారెడ్డి తన ప్రాణాలను లెక్క చేయకుండా జాలర్లను విడిపించేందుకు పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్.నారాయణరెడ్డి, రోశిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాల్వలో పడిన గేదెలు.. కాపాడిన ఫైర్ సిబ్బంది
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని సుజుకి షోరూమ్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తూ రెండు గేదెలు మురుగు కాలువలో పడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అరగంట పాటు శ్రమించి గేదెలను బయటకు తీశారు. కొండారెడ్డివీధిలో నివసిస్తున్న పెంచల్ రెడ్డికి చెందిన మూడు గేదెలను మేతకు తీసుకెళుతుండగా నెల్లూరు రోడ్డులోని సుజుకి సమీపంలోని డ్రైనేజీ కాలువలో పడ్డాయి. గేదెల యజమాని వాటిని బయటికి తీసేందుకు స్థానికుల సహకారంతో గంటసేపు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో లీడింగ్ ఫైర్మెన్ హరిక్రిష్ణ, ఫైర్మెన్లు పాములేటి నాయక్, మాబురెడ్డి, స్థానికులతో కలిసి అతికష్టం మీద గేదెలను బయటికి తీశారు. అయితే సంబంధిత డ్రైనేజీపై ఉన్న కల్వర్టును ఇటీవల తొలగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. -
క్వాంటం టెక్నాలజీతో నైపుణ్యాభివృద్ధి
వేంపల్లె : క్వాంటం టెక్నాలజీతో మరింత నైపుణ్యాభివృద్ధి సాధించవచ్చునని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ – 2025 హ్యక్థాన్లో భాగంగా ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో బుధవారం ఏర్పాటుచేసిన ఇంటర్నల్ హ్యాక్థాన్కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో సాధ్యంకాని సమస్యలను క్వాంటం టెక్నాలజీతో సాధించవచ్చునన్నారు. అమరావతిలో 156 క్యూ–బిట్లతో ఐబీఎంతో కంపెనీ వారు క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు ఈ ఇంటర్నల్ హ్యాక్ థాన్లో పాల్గొని సమాజానికి అవసరమైన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు అమరావతి క్వాంటం వ్యాలీలో సెప్టెంబర్ నెలలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, రమేష్ కై లాస్, కొండారెడ్డి, రత్నకుమారి, వెంకటేష్, అరుణ్ కుమార్, రమేష్, సుధాకర్రెడ్డి, భాస్కరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
భాషా సాహితీ రంగాల్లో జిల్లాపై వివక్ష
నేడు తెలుగు భాషా దినోత్సవంకడప సెవెన్రోడ్స్ : తొలి తెలుగు శాసనం లభించిన జిల్లా కడప. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, తొలి తెలుగు కవయిత్రి మొల్ల, తాళ్లపాక తిమ్మక్కలకు జన్మనిచ్చిన జిల్లా. నన్నయ్య కన్న ఎంతో ముందువాడైన నన్నెచోడుడు ఈ జిల్లా వాసి. సంఘ సంస్కర్తలు వేమన, బ్రహ్మంగారు నడయాడిన జిల్లా. సీపీ బ్రౌన్ మహాశయుడు తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణ మహాయజ్ఞాన్ని సాగించింది ఇక్కడే. ఆధునిక మహకావ్యంగా పండితులు అభివర్ణించే శివతాండవం సృష్టికర్త పుట్టపర్తి తిరుగాడిన జిల్లా కడప. మిగతా రంగాలతోపాటు భాషా సాహితీ అంశాలలో సైతం పాలకులు జిల్లా పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ఓమారు ఈ అంశాలను సింహావలోకనం చేసుకుంటే... నన్నెచోడుడికి దక్కని ఆది కవి హోదా కడప జిల్లా పొత్తపినాడుకు చెందిన కవి. కుమారసంభవం అనే కావ్యాన్ని రాశారు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకుని రాశారు. తెలుగు సాహిత్య రంగంలో నన్నయ్య కన్నా ముందువాడైన నన్నెచోడుడు 925–40 మధ్యకాలం వారని తెలుస్తోంది. నన్నెచోడుడు రాసిన కుమారసంభవం కావ్యాన్ని కనుగొని పరిష్కరించి వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత సుప్రసిద్ధ సాహితీ పరిశోధకుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు, బహుభాషా కోవిదుడైన మానవల్లి రామకృష్ణ కవికి దక్కుతుంది. అప్పటి వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడు అనే కవి ఉన్నారనే విషయమే ఎవరికీ తెలియదు. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్న కుమారసంభవం తాళపత్ర గ్రంథాన్ని రామకృష్ణ కవి కనుగొన్నారు. దాన్ని పరిష్కరించి 1909లో ప్రకటించారు. నన్నెచోడుడు నన్నయ్య కంటే ముందువాడని శాసనాధారాలతో ప్రకటించారు. రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రతిపాదనపై చర్చోపచర్చలు, వాదోపవాదాలు వాడిగా వేడిగా జరిగాయి. చిలుకూరి వీరభద్రరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, పింగళి లక్ష్మికాంతం, నిడదవోలు వెంకటరావు, ఆరుద్ర మొదలైన వారు దీన్ని వ్యతిరేకించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణచార్యులు వంటివారు మానవల్లి ప్రకటనను సమర్థించారు. మల్లంపల్లె సోమశేఖరశర్మ సరసర చెప్పుకోదగ్గ ప్రముఖ శాసన పరిశోధకులు, హైదరాబాదుకు చెందిన బీఎన్ శాస్త్రి కుమార సంభవంపై పరిశోధన చేసి నన్నయ్య కన్నా నన్నెచోడుడే ముందు వాడని శాసన ఆధారంగా నిరూపించారు. కందుకూరి వీరేశలింగం రాసిన ఆంధ్ర కవుల చరిత్రలో ఈ విషయానికి సంబంధించిన శాసనం ఉందంటూ పేర్కొనడం విశేషం. నన్నెయ్యకే ఆదికవి హోదా దక్కాలనే కోస్తా ప్రాంతానికి చెందిన సాహితీవేత్తల అభిప్రాయానికే ప్రభుత్వాలు విలువనిచ్చాయి. నన్నెచోడుడికి ఆది కవి హోదా లభించక కడపజిల్లాకు తీరని అన్యాయం జరిగింది. తెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సీపీ.బ్రౌన్. తాళపత్ర గ్రంథాలు, కావ్యాలు, శతకాలు, వేమన పద్యాలను స్వంత ఖర్చులతో సేకరించారు. పండితులకు స్వంతంగా జీతాలు ఇచ్చి శుద్ధప్రతులను కాగితాలపై రాయించారు. కొన్నింటికి వ్యాఖ్యానాలు రాయించి ముద్రించారు. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు వ్యాకరణం, నిఘంటువులు, నిత్యం పరిపాలన వ్యవహారాల్లో ఉపయోగించే రెవెన్యూ జ్యుడిషియల్ పదజాలాన్ని సేకరించి నిఘంటువు తయారు చేశారు. ఆయన కృషి లేకపోతే నేడు తెలుగు భాషా సాహిత్యాలు ఈ స్థితిలో ఉండేవి కావు. అలాంటి మహానుభావుడి గురించి పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం విచారకరం. సీపీ బ్రౌన్ పేరిట కనీసం పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈ ప్రాంత సాహితీవేత్తలు కోరుతున్నారు. పుట్టపర్తికి దక్కని జ్ఞానపీఠం శ్రీకృష్ణ దేవరాయల రాజగురువు తాతాచార్యుల వంశానికి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యులు కడప నగరానికి చెందిన వారు. ఆధునిక మహాకావ్యంగా పండితులు అభివర్ణించే శివతాండవం సృష్టికర్త. జనప్రియ రామాయణం, మేఘదూతం వంటి గేయ కావ్యాలు రాశారు. అనేక భాషలు తెలిసిన వ్యక్తిగా పీవీ.నరసింహారావు పేరు మారుమోగుతోంది గానీ పుట్టపర్తి పేరు అంతగా వినిపించదు. తుళు, ఫ్రెంచ్, పర్షియన్, అవఽధీ, బ్రజ్, కన్నడ, మళయాళ, మరాఠి, సంస్కృతం, ఇంగ్లీషు వంటి 14 బాషల్లో పాండిత్యం సాధించిన దిట్ట పుట్టపర్తి. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం ఆయనకు డీలిట్ ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. నిజానికి ఆయన జ్ఞానపీఠ అవార్డుకు అర్హులు. పుట్టపర్తి ఏ కోస్తా జిల్లాలోనో జన్మించి ఉంటే ఆయన్ను ఏనాడో జ్ఞానపీఠం వరించేదని పలువురు సాహితీవేత్తల అభిప్రాయం. పురస్కారాల్లోనూ వివక్షే తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులైన గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా పాటిస్తోంది. భాషా సాహిత్యాలకు విశేష కృషి చేసిన పలువురికీ ఈ సందర్భంగా పురస్కారాలు అందించి గౌరవించడం చాలా కాలంగా వస్తోంది. గతేడాది నిర్వహించిన పురస్కారాల్లో జిల్లా విషయంలో ఆ మాటకొస్తే రాయలసీమ పట్ల వివక్షే ప్రదర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో పురాస్కరాలు పొందిన ఇద్దరికి పురస్కారాలు అందించి చేతులు దులుపుకొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రాంతీయ సమతుల్యత పాటించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని, ప్రాంతాల మధ్య విబేధాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని ఇక్కడి సాహితీవేత్తలు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఓట్ల రాజకీయాలకు పెద్దపీట వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికై నా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని పలువురు కోరుతున్నారు. మాతృభాష తెలుగును ఆంగ్ల బారి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్య వ్యాపారంగా మారిన పరిస్థితుల్లో తెలుగుభాష చీకటి కోణాల్లోకి వెళ్లిపోతోంది.పాఠశాల స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు ప్రతిచోట నిర్లక్ష్య ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నన్నయ్య నుంచి నేటి వరకు తెలుగుభాష పలు మార్పులకు లోనై గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమంతో తెలుగు పండిత భాష నుంచి ప్రజల భాషకు చేరింది. భాషను మనం బ్రతికించుకోకపోతే మన సంస్కృతికి మనమే దూరమవుతున్నట్లు లెక్క. – డాక్టర్ పొదిలి నాగరాజు, తెలుగు అధ్యాపకులు, కడప నన్నెచోడుడు నన్నయ్య కన్నా ముందువాడనే వాదనపై ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ నియమించి నిగ్గుతేల్చాలి. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని కేంద్ర స్థానంగా చేసుకోవాలి. అన్నమయ్యలోని సంఘ సంస్కరణ భావాలు, ఆయన పద ప్రయోగాలు, తిరుగాడిన స్థలాలు పరిశోధించడానికి ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటుచేయాలి. నాచన సోముని వంటి అనేక మంది రాయలసీమ కవులకు గుర్తింపు లేకుండాపోయింది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం ప్రాచీన కాలంలో సంఘ సంస్కరణ కవులు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో వీరి సాహిత్యం మీద పరిశోధనలను ప్రోత్సహించాలి. కట్టమంచి, పుట్టపర్తి లాంటి వారికి ఏమాత్రం గుర్తింపులేకుండా పోయింది. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని రాయలసీమలోనే గొప్ప పరిశోధన కేంద్రంగా అభివృద్ది చేయాలి. భాషా పరిశోధకులు, నిఘంటువు నిర్మాతలు, కావ్య పరిష్కర్తలు, వ్యాఖ్యాతలకు సీపీ బ్రౌన్ పేరిట పురస్కారాలు అందించాలి. తొలి తెలుగు కవయిత్రి మొల్ల, తాళ్లపాక తిమ్మక్క, తరిగొండ వెంబమాంబలకు గుర్తింపు వచ్చేటట్లు పరిశోధనలు ప్రోత్సహించాలి. – రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, అధికారభాషా సంఘం మాజీ సభ్యులు -
వెల్లివిరిసిన సేవాభావం
పులివెందులలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు కడప జెడ్పీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానాలు, పేదలకు దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కడపలో జరిగిన వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. – కడప కార్పొరేషన్/ పులివెందుల -
సెప్టెంబరు 11, 12వ తేదీల్లో కళా ఉత్సవ్
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్ – 2025 పోటీలు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహించ నున్నట్లు అన్నమయ్య, కడప జిల్లాల విద్యాశాఖాధికారులు సుబ్రహ్మణ్యం, షంషుద్దీన్ తెలిపారు. గురువా రం కడప డీఈవో కార్యాలయంలో కళా ఉత్సవ్ – 2025 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సాంప్రదాయ కథ చెప్పడం వంటి 6 విభాగాలలో 12 అంశాల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు విద్యార్థులకు వేదికను అందించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులని వివరించారు. వివరా ల కోసం కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి నరసింహారెడ్డి 9440246825ని సంప్రదించాలని సూచించారు. -
ప్రశాంతంగా సర్టిఫికెట్ల పరిశీలన
సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్సీ స్టేట్ అబ్జర్వర్ సర్టిఫికెట్ల పరిశీలకు వచ్చిన ఎంపికై న అభ్యర్థులు కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నిర్వహించారు. కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ 17 టీమ్స్తోపాటు 30 మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా డీఎస్సీ లాగిన్ ఐడీ ద్వారా కాల్ లెటర్స్ అందుకున్న 609 మంది అభ్యర్థులు పరిశీలన కేంద్రానికి చేరుకున్నారు. పత్రాల పరిశీలన ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆన్లైన్లో అభ్యర్థుల కుల ధ్రువీకరణ, టెట్ మార్కులకు సంబంధించి లాగిన్లో కనిపించకపోవడంతో సర్టిఫికెట్ల పరిశీలన ఆలస్యమైంది. దీంతో పత్రాల పరిశీలన బాగా పొద్దుపోయేదాకా జరిగింది. రాత్రి పూట పరిశీలన కేంద్రంలో సరైన లైటింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. పరిశీలన కేంద్రాన్ని పరిశీలించిన డీఈఓ, స్టేట్ అబ్జర్వర్లు.. డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని డీఈఓ షేక్ షంషుద్దీన్తో కలిసి డీఎస్సీ స్టేట్ అబ్జర్వర్ మధుసూదన్రావు పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన ఎలా జరగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీనల కోసం కడప కేంద్రంలో 17 టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. జోనల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఏ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ జిల్లాలోనే ధ్రువ పత్రాలను పరిశీలించుకోవచ్చన్నారు. మెడికల్ గ్రౌండ్స్ ఉన్న అభ్యర్థులు కూడా సర్టిఫికెట్లు పరిశీలించుకోవచ్చని వివరించారు. -
మండపాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
కడప కార్పొరేషన్: వర్షాలు పడుతున్న నేపథ్యంలో వినాయక మండపాల వద్ద విద్యుత్పై తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ మండపాల వద్ద లైటింగ్ అలంకరణ నిర్మాణాలకు, సౌండ్ సిస్టంకు, విద్యుత్ ఉపకరణాలకు ఉపయోగించే వైర్లు నాణ్యమైనవిగా ఉండాలన్నారు. వర్షాలకు భూమిపై తేమ ఉండడం వల్ల చిన్నపాటి అతుకులు ద్వారా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అతుకు లు లేని నాణ్యమైన వైర్లు ఉపయోగించి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని సూచించారు. భారీ, ఎత్తైన విగ్రహాల ఊరేగింపుల సమయాలు, ఊరేగింపు మార్గాన్ని స్థానిక విద్యుత్ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఉత్స వ కమిటీ సభ్యులు దీనిపై చొరవ చూపాలని కోరారు. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు వినాయక చవితి పండుగ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగడానికి ఆస్కారమున్నా, ప్రమాదాలు జరిగినా తక్షణం స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కడప విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్– 9440817440కు ఫోన్ చేయాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ వాట్సాప్ నెంబరునకు 9440814264 మెసేజ్ పెట్టాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1912 నకు కూడా తెలియజేయవచ్చని తెలిపారు. వర్షాల్లో అతుకులు పడ్డ వైర్లు మరింత ప్రమాదకరం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.రమణ -
భక్తుల పాలిట కొంగుబంగారం ఆరోగ్యమాత
కడప సెవెన్రోడ్స్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలో వెలిసిన ఆరోగ్యమాత భక్తుల పాలిట కొంగుబంగారంగా అలరారుతోంది. నగరంలోని ప్రముఖ క్రైస్తవ మందిరాలలో ఇదొకటి. బ్రిటీషు పాలనలో నిర్మించిన ఈ చర్చి కాలక్రమంలో పెద్ద చర్చిగా వెలిసింది. ఇటీవల ఆ ప్రాంగణంలో అధునాతనంగా మరో పెద్ద చర్చిని నిర్మించారు. అర్ద చంద్రాకారంలో రెండు అంతస్థులుగా రూపుదిద్దుకున్న ఈ చర్చిలో ఒక్కొక్క అంతస్తులో 1200 మందికి చొప్పున ఒకేసారి ప్రార్థనలు చేసుకునే వీలుంది. భక్తులు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాన్ని కడప వేలాంగిణిగా భావిస్తారు. ఏటా ఆరోగ్యమాత తిరునాల మహోత్సవాన్ని పది రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి ఉత్సవాలు ఆరోగ్యమాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.00 గంటలకు పతాకావిష్కరణ, నవదిన ప్రారంభ వేడుకలు, దివ్య బలిపూజ నిర్వహించనున్నారు. కడప పీఠాఽధిపతి సగినాల పాల్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే సెప్టెంబరు 7, 8 తేదీల్లో తిరునాల మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. 8వ తేది ఉదయం 8.30 గంటలకు విశాఖపట్టణం అగ్రపీఠం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ఆధ్వర్యంలో మహోత్సవ సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు చెందిన మత పెద్దలు దైవ సందేశాన్ని అందజేయనున్నారు. నేటి నుంచి తిరుణాల -
బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య
దువ్వూరు : బాకీ చెల్లించలేదని దళిత యువకుడిని హత్య చేసిన ఘటన దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మదిరేపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పాలగిరి చెన్నయ్య (29) అదే గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తి వద్ద పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అవసర నిమిత్తమై డబ్బు అప్పుగా తీసుకుని చెల్లించేవాడు. మూడు నెలల క్రితం సంజీవరెడ్డి నుంచి చెన్నయ్య రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల క్రితం తనకు అవసరం ఉందని డబ్బు ఇవ్వాలని సంజీవరెడ్డి అడుగగా తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని చెప్పడంతో చెన్నయ్య, సంజీవరెడ్డి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఈనెల 24న సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నయ్య ఇంటి దగ్గరికి సంజీవరెడ్డి వచ్చి గుడిపాడు గ్రామంలో పని ఉంది పోయి వద్దాం రా అని పిలుచుకుని వెళ్లాడు. అదే రోజు రాత్రి చిన్నసింగనపల్లె – మనేరాంపల్లె మధ్యలో నారుపల్లె మోహన్రెడ్డి తోట వద్ద చెన్నయ్యపై సంజీవరెడ్డి విచక్షణా రహితంగా దాడిచేసి మోటార్ బైక్తో తొక్కించాడు. రాత్రి 9 గంటల సమయంలో చెన్నయ్య చిన్నాన్న కొడుకు పాలగిరి యోనాకు సంజీవరెడ్డి ఫోన్ చేసి మీ వాన్ని కొట్టిపడేసినా.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. చెన్నయ్య బంధువులు సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చెన్నయ్య పడి ఉన్నాడు. వెంటనే వారు ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి తీసుకెళ్లారు. రిమ్స్ నుంచి కర్నూలు తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించండంతో తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో చెన్నయ్య పలకకపోవడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి చెన్నయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమార్తెలు మహిమరాణి, మేఘన ఉన్నారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చెన్నయ్య మృతదేహాన్ని పరిశీలించి, మండలంలోని మదిరేపల్లె గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులను విచారించారు. ఈ సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేశామని, నిందితుడు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో చెన్నయ్య తల్లిదండ్రులు, భార్యా, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వారు కోరారు. -
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో రాణించిన సునంద
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు తాడేపల్లి గూడెం సరస్వతి విద్యాలయం ప్రత్తిపాడులో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్లోని ట్రెడిషనల్ ఆసనాల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. అలాగే ట్విస్టింగ్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. కాగా సెప్టెంబర్ నెలలో ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సునందను పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు. -
బ్రహ్మంసాగర్లో పడి మహిళ మృతి
బ్రహ్మంగారిమఠం: మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లి గ్రామానికి చెందిన మడక లక్ష్మిదేవి(39) అనే మహిళ మంగళవారం బ్రహ్మంసాగర్లో గల్లంతై మృతి చెందింది. బాధితులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల లక్ష్మీదేవి కూతురు అకస్మాత్తుగా మృతి చెందింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న లక్ష్మిదేవి తన కుమారుడు స్వరూప్ను వెంటబెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున బ్రహ్మంగారి దర్శనం కోసం ఊరి నుంచి వెళ్లింది. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం సమీపంలోని బ్రహ్మంసాగర్లో స్నానం చేస్తుండగా గల్లంతైంది. తన కుమారుడి ద్వారా ఈ విషయం విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మీదేవి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలి భర్త మడక రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
బైకు అదుపు తప్పి ఒకరి మృతి
సిద్దవటం : మండలంలోని కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బద్వేల్కు చెందిన షేక్ నాయబ్రసూల్(22), పి.హర్షవర్ధన్ అనే యువకులు కడప నుంచి మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో బద్వేల్కు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణిస్తూ కంట్రోల్ చేసుకోలేక సిద్ధవటం మండలం కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని రోడ్డు పక్క చెట్లలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన షేక్ నాయబ్రసూల్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన పి.హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని వైద్యం కోసం పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, నాయబ్రసూల్ మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు.మరొకరికి గాయాలు -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● భూ వివాదంపై టీడీపీ మండల అధ్యక్షుడిపై దాడి ● పోలీసు స్టేషన పక్కనే పరస్పరం రాళ్లు రువుకున్న టీడీపీ నాయకులు ● ప్రేక్షక ప్రాత వహించిన పోలీసులుపెండ్లిమర్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వాటాల కోసం.. భూ ఆక్రమణల కోసం నిత్యం కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ల మధ్యే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా పెండ్లిమర్రి మండంలో వాటాల కోసం పోలీసుల ముందే ఇరువర్గాలు గొడవలకు దిగన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండల టీడీపీలో మంగళవారం వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడని టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిపై అదే పార్టీకి చెందిన టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, శివారెడ్డి దాడి చేశారు. దాడిలో గంగిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పెండ్లిమర్రి గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డికి కోరవాండ్లపల్లె బీసీ కాలనికి చెందిన యాదవులకు గత కొంత కాలం నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ వివాదంలో టీడీపీ మండల అధ్యక్షుడు జోక్యం చేసుకుటున్నాడని అతనిపై దాడికి దిగారు. కొద్దిసేపటికి ఇరువర్గాల వారు అనుచరులను పిలుపించుకొని పోలీసు స్టేషన్ పక్కనే రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మిన్నకుండిపోయారు. గొడవ పూర్తిగా ముగిసిన తర్వాత పోలీసు బలగాలను పిలిపించి మమ అనిపించారు. -
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్తుత్యమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగం పోటీల్లో ఆ విద్యార్థిని పాల్గొంటుందన్నారు. భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్, హెచ్ఆర్ గోపాల్రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. -
ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు
కడప అర్బన్ : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 383 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప రవీంద్ర నగర్కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, కడప నగరం బాచరావు వీధికి చెందిన షేక్ ఇబ్రహీం ఖలీలుల్లా గతంలో సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. చోరీలకు పాల్పడిన నాలుగు ఘటనల్లో నిందితులు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో ఒక ఇంటిలో ఇద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడగా, సయ్యద్ ఇర్ఫాన్ రవీంద్రనగర్, మురాదియానగర్ ప్రాంతాల్లోని రెండు ఇళ్లలో బంగారు, వెండి వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 43 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు, 340 గ్రాముల బరువు గల వెండి వస్తువులు, రూ. 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని నానాపల్లి క్రాస్ రోడ్డులో సయ్యద్ ఇర్ఫాన్, షేక్ ఇబ్రహీమ్ ఖలీలుల్లాను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వరరెడ్డి, రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాదర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, ఓబులేసు, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డి, రంతుబాషాలకు రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నామని తెలిపారు.383 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు సమీపంలో సాయిబాబాగుడి దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు(24), శివకుమార్ (27) దుర్మరణం చెందారు. వీరు బైకుపై వస్తుండగా స్కార్పియో వాహనం ఢీ కొన్నట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్లో నాలుగురోజుల నుంచి అక్కడ పని చేసి తిరిగి కొండాపురానికి బైకుపై వస్తుండగా లావనూరు వద్ద స్కార్పియో వాహనం ఢీ కొంది. రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందినవారని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. -
కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్ : కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా బీఎఫ్ఏ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఇందులో భాగంగా 70 శాతం విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరై వీసీ డాక్టర్ జి.విశ్వనాఽథ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులు సీట్ అలాట్మెంట్ పొందారు. సెప్టెంబర్ 3న రెండవ దశ కౌన్సెలింగ్ డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్యూలో సెప్టెంబర్ 3న బీఎఫ్ఎ/బి డిజైన్ కోర్సులకు 2వ దశ కౌన్సెలింగ్ ఉంటుందని వీసీ తెలిపారు. మరింత సమాచారం కోసం www.yrrafuac.in వైబ్సెటును సందర్శించాలని ఆయన తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రాధాన్యతకడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయా ఫిర్యా దు లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరి ష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 120 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాము ఖి మాట్లాడారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.డీసీసీ బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలి– ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కడప అగ్రికల్చర్ : డీసీసీ బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం కడపలోని డీసీసీ బ్యాంకును బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు స్థితిగతుల గురించి అరా తీశారు. అనంతరం చైర్మన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా రైతాంగానికి డీసీసీ బ్యాంకు అండగా నిలవాలని అందుకు ఎన్ని కోట్ల రుణాలు కావాలన్నా కడపకు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీసీసీ బ్యాంకు సీఈఓ రాజామణి, డీజీఎం ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.28న డీఎస్సీ అభ్యర్థులసర్టిఫికెట్ల పరిశీలనకడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025 అభ్యర్థులకు ఈనెల 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన కడప బాలాజీనగర్లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరిశీలన నిమిత్తం తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. గణపతి ఆకృతిలో విద్యార్థులు కలసపాడు : వైఎస్సార్ కడప జిల్లాలోని కలసపాడులో సెయింట్ ఆంటోని ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థులు గణపతి ఆకృతిలో ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సర్వ మతాలకు అతీతంగా పండుగల సందర్భంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు. -
కబోది..ప్రభుత్వమిది
రెండు కాళ్లు చచ్చుబడి వీల్చైర్పై ఒకరు.. రెండు కర్రల సాయంతో కష్టంగా మరొకరు.. కళ్లు కనబడక ఇంకొకరు... మాట వినబడక మరొకరు.. భారాన్ని.. దూరాన్ని లెక్కజేయకుండా కలెక్టరేట్కు వచ్చారు. వారు నడుస్తుంటే గస బుసలుకొడుతోంది.. అయినా అడుగాపకుండా కలెక్టరేట్ వైపు అడుగులేస్తున్నారు.. ‘ఏంటవ్వా’ అని పలకరిస్తే.. ‘ఏమైంది పెద్దాయనా’ అని మాట కలిపితే.. ‘మా పింఛనీ తీసేసినారంటయ్యా’ అని దీనంగా చెప్పారు. ఆ క్షణంలో తెలియకుండానే వారి కళ్లల్లోంచి కన్నీళ్లు రాలిపడ్డాయి.. నాకు 45 శాతం వైకల్యం ఉన్నప్పుడు 2010 ఆగస్టు 16వ తేది రిమ్స్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ పేరుతో 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసులు జారీ చేసి పింఛన్ తొలగించడం అన్యాయం. – బత్తుల చిన్నవెంకటేశు, కొండూరు బీసీ కాలనీ, అట్లూరు మండలం నేను రూ. 200 ఉన్నప్పటినుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. అప్పట్లో 90 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో 70 శాతమే వైకల్యం ఉందంటూ సర్టిఫికెట్జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా పెన్షన్ మొత్తాన్ని తగ్గించేందుకు చేస్తున్న కార్యక్రమం. – చిన్నగుర్రప్ప, మైలవరం నాకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు 2007లో సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 64 శాతం ఉన్నట్లు పేర్కొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఫొటోకు బ దులుగా వేరే మహిళ ఫోటో జతపరిచి సర్టిఫికెట్ ఇచ్చారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలి. – డి.అఫ్జల్, శ్రీనివాసనగర్, ప్రొద్దుటూరు ఈ చిత్రంలో వీల్చైర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు షరీప్. పులివెందుల నియోజకవర్గం వేల్పుల. ఐదేళ్ల్ల క్రితం పక్షవాతంతో మంచంలో పడ్డాడు. రెండు కాళ్లు, చేతులు పనిచేయక పోవడంతో దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. పెన్షన్తో పూట గడవడం ఇబ్బందిగా మారడంతో భార్య ఫకృన్నిసా వ్యవసాయం కూలిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు కలిగిన వీరికి కూటమి ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. రీవెరిఫికేషన్ పేరుతో సదరం సర్టిఫికెట్ తెచ్చుకోమని అధికారులు కడప జీజీహెచ్కు రిఫర్ చేశారు. రెండో సారి నెల ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికీ పంపించారు. ప్రయాస పడి అక్కడ కూడా రీ వెరిఫికేషన్ కు హాజరయ్యా రు. చివరికి ఈ నెలలో మీకు పెన్షన్ రాదూ అని చెప్పడంతో పాపం షరీఫ్ కుటుంబ సభ్యులు భార్య, పిల్లలతో కలెక్టరేట్కుకు వచ్చారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకు తాము పడిన బాధలు తెలియజేశారు. ఎన్నో వ్యయ ప్రయాస పడి వేల్పుల నుంచి ఆటోలో 1500 రూపాయిలు బాడుగా చెల్లించుకొని వచ్చామని.. దయ చూపి తన భర్తకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ చేయండి సార్ అంటూ తన చిన్నారులకు చూపిస్తూ షరీఫ్ భార్య ఫకృన్నీసా కంటనీరు పెట్టింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ సహిత మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేలా.. రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి వారు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కలెక్టర్కు మట్టి వినాయకుడి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మట్టివిగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెంచేలా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (ిపీఓపీ) విగ్రహాలను వాడడం వల్ల చెరువులు, నదులు, ఇతర జల వనరులు కాలుష్యం అవుతున్నాయన్నారు. జిల్లా పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. శారద, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కడప టీడీపీలో అసమ్మతి మంటలు !
సాక్షి ప్రతినిధి, కడప : కడప టీడీపీలో అసమ్మతి మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్పు చేయాల్సిందిగా త్రిసభ్య కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం హరితా హోట ల్ పార్లమెంటు స్థాయి త్రిసభ్య కమిటీ సమావేశం అందుకు వేదికై ంది. ప్రభుత్వంలోకి వచ్చి 14నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదని, కార్యకర్తలు న్యాయం చేయలేకున్నామని ఆవేదన వ్యక్తమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రా, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం త్రిసభ్య కమిటీ టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కడపలో ఏడు స్థానాలను కై వసం చేసుకున్నామని,సమీకరణలో జరిగిన లోపాల కారణంగా బద్వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు లభించినా కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు దక్కలేదని వివరించారు. వైఎస్సార్సీపీ పాలనలో కమలాపురం నియోజకవర్గంలో 25 మందికి పదవులను ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఎలాంటి పదవులు రాలేదని వివరించారు. జమ్మలమడుగు ఇన్చార్జ్ భూపేష్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పదువులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపా రు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడు తూ వైఎస్సార్సీపీ తమపై దుష్ప్రచారం చేస్తోందని... ఇది అంతర్గత సమావేశం పార్టీకి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాఖ్యానించాలని చెప్పుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదుల పరంపర... త్రిసభ్య కమిటీ దృష్టికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ అప్పుడే పార్టీకి ప్రయోజనమని పలువురు వివరించినట్లు సమాచారం. ఆమేరకు కొందరు పుత్తా నరసింహారెడ్డికి జిల్లా అధ్యక్షపదవి అప్పగించాల్సిందిగా సూచించిగా, పార్టీని నమ్ముకొని ఉన్న గోవర్ధన్రెడ్డికి కట్టబెట్టాలని మరికొందరు అభ్యర్థించినట్లు సమాచారం. తద్వారా పార్టీ కార్యకర్తలకు మంచి మేసేజ్ ఇచ్చినట్లు కూడా అవుతోందని వివరించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది హరిప్రసాద్ పేరు సూచించి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించినట్లు సమాచారం. అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటు స్థాయి సమావేశంలో బహిర్గతం 14 నెలలు అవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏదీ? ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా, జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ జిల్లా అధ్యక్షుడు వాసును మార్చాల్సిందిగా ఫిర్యాదులు అధ్యక్ష రేసులో పలువురు సీనియర్లు -
పరిష్కారం అభూతకల్పనే!
● రెవెన్యూలో పేరుకుపోతున్న ఫిర్యాదులు ● గడువులోపు పరిష్కారం వట్టిమాటే! ● రెవెన్యూ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. పరిష్కారానికి నోచుకక మూలనపడుతున్నాయి. వస్తున్న అర్జీల్లో సగంపైన రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్, అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ భూముల సమస్య, సర్వే, ఆక్రమణలు, రీ సర్వేలో భూమి విస్తీర్ణం తగ్గడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి సమస్యలు అధికంగా వస్తున్నా యి. కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించామంటూ అధికారుల నుంచి ఆదేశాలు వెళుతున్నా క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ గ్రీవెన్స్సెల్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో కొన్ని.... దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నవంబరు నుంచి మార్చి వరకు వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. వంకకు అడ్డంగా ఫ్యాక్టరీ గోడ నిర్మించడం వల్ల వర్షాకాలంలో మా పొలాల్లో నీరంతా నిలుస్తోంది. సర్వే నెంబరు 352లోని 9.15 ఎకరాలు ముంపునకు గురవుతోంది. – విజయభాస్కర్రెడ్డి, నవాబుపేట, మైలవరంప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే తర్వాత మా భూములకు 1బీ, పాసుపుస్తకాలు రావడం లేదు. ఇందువల్ల అనేక ప్రభుత్వ సౌకర్యాలు కోల్పోవాల్సి వస్తోంది. ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కరిస్తామంటూ చెప్పడమే తప్ప ఇంతవరకు మాకు న్యాయం జరగడం లేదు. – దొడ్డా సంజీవరాయుడు, మైలవరం మండలం2006లో దాల్మియా సిమెంటు కర్మాగారం కోసం 15 ఎకరాల భూమి కోల్పోయాం. అప్పట్లో ఎకరా రూ. 2 లక్షలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఇస్తారన్న ఆశతో మా తండ్రి రామసుబ్బారెడ్డి భూములు అప్పగించారు. మా తండ్రికి ఉద్యోగం ఇవ్వలేదు. నాకు తగిన అర్హత వయస్సు వచ్చాక ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఇంతవరకు లేదు. ఫ్యాక్టరీ రెండవదశ విస్తరణపై మార్చి 27వ తేది నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వచ్చినపుడు ఆయన దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. – ఎర్రబోను నాగార్జునరెడ్డి, నవాబుపేట, మైలవరం మండలం సర్వే నెంబరు 138/సీ1 లో 1.84 ఎకరాలు నా పేరిట ప ట్టా ఉంది. ఎమ్మెల్యే పుట్టా సు ధాకర్ యాదవ్ ప్రోదల్బంతో తహసీల్దార్ వచ్చి కంచె వేసి బోర్డు పాతారు. ఆ స్థలాన్ని అగ్రవర్ణాలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. – వెంకటయ్య,టి.కొత్తపల్లె, మైదుకూరు భూతమాపురం–తలమంచిపట్నం మధ్య రహదారిని ఆక్రమించి దాల్మియా యాజమాన్యం బ్లాస్టింగ్ చేస్తోంది. దీంతో వంక ద్వారా వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఓపెన్ బ్లాస్టింగ్ వల్ల సమస్యలు వస్తున్నాయి. – శివశంకర్రెడ్డి, రైతు, దుగ్గనపల్లె -
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
కడప సెవెన్రోడ్స్ : తాము అధికారంలోకి వస్తే పెన్ష న్లు పెంచుతామని హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పెన్షన్ల తొలగింపు వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వంద శాతం వైకల్యం ఉన్న వారికి కూడా 40 శాతానికి తగ్గిస్తూ పెన్షన్ ఎగ్గొట్టే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల విభా గం జిల్లా అధ్యక్షుడు అహ్మద్బాష సచివాలయ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేసి సెప్టెంబరు నెల నుంచి పెన్షన్ తొలగిస్తున్నట్లు తెలుపడం దారుణమని విమర్శించారు. తొలగించిన పెన్షన్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్చేశారు. తాను ప్రశ్నించే వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారని నిలదీశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, పాకా సురేష్, అక్బర్ అలీ, అజ్మతుల్లాఖాన్, పార్టీ నాయకులు శ్రీరంజన్రెడ్డి, యానాదయ్య, గౌస్బాషా, పులి సునీల్కుమార్, సీహెచ్ వినోద్కుమార్, బూసిపాటి కిశోర్కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేసుల బాదుల్లా, మహిళా విభాగం నాయకులు టీపీ వెంకట సుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి, వైఎస్ సాయిబాబా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు సునీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం -
ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)
కడప రూరల్ : పులివెందుల ఎస్ఐ నారాయణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పులివెందులలోని ఇస్లాంపురం వీధికి చెందిన సులోచన తెలిపారు. సోమవారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక నెల క్రితం ఎవరో ఏదో చెప్పారని ఎస్ఐ నారాయణతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చారని అన్నారు. తనకు సంబంధం లేని అంశాలను అడగడంతో తెలియదని చెప్పానని తెలిపారు. ఆ ఎస్ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొట్టారని పేర్కొన్నారు. ఆయన బీరువా బీగాలు అడిగాడని, లేవని చెప్పడంతో బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న రూ 1.39 లక్షలు తీసుకెళ్లారని ఆరోపించారు. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేనందున, బంగారం కుదువ పెట్టి డబ్బు తెచ్చామన్నారు. అమ్మ వైద్యం కోసం తెచ్చిన డబ్బును ఆ ఎస్ఐ తీసుకెళ్లారని ఆరోపించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం కడపలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు ఆ ఎస్ఐ నుంచి రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వేడుకున్నారు. జై హిందుస్ధాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరిశీలనకు మొత్తం 352 మంది అభ్యర్థులకు గాను 190 మంది సివిల్, ఏపీఎస్పీ అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న అభ్యర్థులకే ఉద్యోగం వస్తుందని, తప్పుడు పత్రాలు ఉన్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (ఎ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు వీరేష్, టైటస్, శివరాముడు, ఏఓ కె.వెంకటరమణ, సూపరింటెండెంట్లు ఎస్.గౌస్ పీర్, సురేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదు కడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్కుమార్కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు. రిమ్స్ మార్చురీలో రెండు మృతదేహాలుకడప అర్బన్ : కడప రిమ్స్ మార్చురీలో రెండు గుర్తు తెలియని మృతదేహాలున్నాయి. ఎవరైనా సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. -
ఏమిటీ అన్యాయం?
మైలవరం : ఆమె జన్మతః అంధురాలు. రెండు కళ్లు బొత్తిగా కనిపించవు. బాల్యం నుంచి వికలాంగుల పెన్షన్ అందుకుంటున్న ఆమెకు ప్రస్తుతం 49 సంవత్సరాల వయసు. పుట్టుకతోనే అంధురాలు కావడంతో ఆమెకు వివాహం కాలేదు. నేటికి ఒంటరి మహిళగానే బతుకు బండిని నెట్టుకు వస్తూ జీవన పోరాటం చేస్తోంది. ఆమె పెన్షన్ అందుకుంటున్న మూడు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. ఏ ఒక్కరూ ఆమె పెన్షన్పై కత్తి కట్టలేదు. అలాంటిది చంద్రబాబు సర్కార్ ఏమంటూ వచ్చిందో గాని పుట్టు అంధురాలైన ఆమె పెన్షన్ను ఉన్నపళంగా నిలిపి వేసింది. వందశాతం అంధత్వం ఉన్న ఆ అంధురాలి పింఛన్ నిలిపివేయటానికి అధికారులకు చేతులు ఎలా వచ్చాయో అని ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. పాపం దస్తగిరమ్మ..! మైలవరం మండలం చిన్న వెంతుర్ల గ్రామానికి చెందిన దస్తగిరమ్మకు పుట్టుకతోనే చూపు లేదు. వందశాతం అంధత్వం ఉన్నట్లు ఎప్పుడో వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత పలుమార్లు జరిపిన వైద్యపరీక్షల్లో కూడా వంద శాతం అంధత్వం ఉన్నట్లే ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ వచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఆమె పెన్షన్ అందుకుంటూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత బోగస్ పెన్షన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులందరికి తాజాగా వైద్య పరీక్షలు చేయించారు. దస్తగిరమ్మకు ఈ ఏడాది మార్చి నెలలో వైద్య పరీక్షలు చేసి పంపించారు. అంతా సవ్యంగా జరిగిందన్న తరుణంలో నాలుగు రోజుల క్రితం దస్తగిరమ్మకు పెన్షన్ నిలిపి వేస్తున్నట్లు నోటీసులు అందాయి. విషయం ఏమిటని ఆరాతీస్తే తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించిన ఆ వైద్య మహానుభావుడు ఆమెకు కేవలం 20 శాతం మాత్రమే అంధత్వం ఉన్నట్లు ధ్రువీకరించాడట. ఆ సర్టిఫికెట్ ఆధారంగా రెండు కళ్లులేని ఆమెకు సంబంధింత అధికారులు సైతం కళ్లు మూసుకుని పెన్షన్ పెరికేశారు. ఆమె గోడు ఎవరికి చెప్పుకోవాలి? పుట్టుకతో అంధురాలైన దస్తగిరమ్మకు బాల్యంలోనే తల్లి చనిపోయింది. వృద్ధుడైన తండ్రి దస్తగిరి చెంతనే ఆమె జీవనం సాగిస్తోంది. అవివాహితురాలైన ఆమెకు పింఛన్ ఒక్కటే ఆధారం. పింఛన్ వస్తుండటంతో ఆమెకు ఏ ప్రభుత్వ పథకం వర్తించదు. రెండు కన్నులు కనిపించకపోవడంతో పొలం పనులకు సైతం ఆమె వెళ్లలేని పరిస్థితి తండ్రికి భారం కాకుండా ఇంట్లోనే ఉంటూ తన పని తానే చేసుకుంటుంది. అంతటి దయనీయ జీవితం గడుపుతున్న ఆమెకు పింఛన్ నిలిపివేసి ప్రభుత్వం సాఽధించింది ఏమిటి. వైద్యులు తిరిగి పరీక్షలు నిర్వహించి ఆమె పింఛన్ పునరుద్ధరించాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం తర్వాత దరఖాస్తు చేసుకుంటే తిరిగి పింఛన్ అర్హత ఉంటే పింఛన్ పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ తతంగం జరిగే సరికి రెండు మూడు నెలల కాలం గడిచిపోతుంది. ఆ మధ్యలో ఆమెకు పింఛన్ ఎవరిస్తారు? ఒకటో తేదీన పరిస్థితి ఏమిటి. ఆమెకు కాదు వైద్యులకే అంధత్వం పుట్టుకతో వచ్చినట్లు ఉంది. ఆమెకు చంద్రబాబు నాయుడు సర్కార్ పుణ్యమా అంటూ పింఛన్ తొలగించడం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. చివరకు అధికారులు సైతం నివ్వెర పోతున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడికి ఈమె అంధత్వం కనిపించలేదా. లేదా పరీక్షలు చేయకుండానే ఏసీ రూముల్లో కూర్చొని గుడ్డిగా సర్టిఫికెట్ మంజూరు చేశారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా దివ్యాంగుల జీవితంతో చెలగాటమాడటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు కళ్లులేని పుట్టు అంధురాలికి పెన్షన్ నిలిపివేత ఐదు నెలలక్రితం వైద్య పరీక్షలు.. తాజాగా నోటీసులు దివ్యాంగులపై కక్షగట్టిన సర్కార్ దురాగతానికి ఇదో తార్కాణం -
స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు
● స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు● ఇద్దరు యువకుల దుర్మరణంకడప అర్బన్ : కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం సమీపంలో ఈనెల 24వ తేదీన రాత్రి సమయంలో కడప వైపు నుంచి స్కూటీలో వెళుతున్న ఇద్దరు యువకులను, తిరుపతి వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మోదుగుల నవీన్కుమార్ (22), అతని స్నేహితుడు అంచల చరణ్ (20)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లోనూ, స్నేహితులను విషాదంలో నింపింది. మరణించిన ఇద్దరిలో నవీన్కుమార్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి శ్రీహరి, తల్లి సుజితలు. శ్రీహరి ఐరన్ మార్ట్ల వద్ద ఆటో బాడుగకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నవీన్కుమార్ కంటే ముందు ఓ కుమారుడు ఉండేవాడు. ఆ పిల్లాడు చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరు శంకరాపురంలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రవి, విజయల కుమారుడు అంచల చరణ్ కొత్త బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చరణ్కు డిగ్రీ చదువుతున్న షాలిని అనే చెల్లెలు ఉంది. రెండు కుటుంబాల్లోనూ ఒక్కొక్కరే కుమారులు. వీరిద్దరు ఈనెల 24వ తేదీన రాత్రి సైనిక్ నగర్లో ఉంటున్న నవీన్కుమార్ బంధువుల ఇంటికి పనిమీద బయలు దేరారు. కడప కేంద్ర కారాగారం సమీపంలోకి వెళ్లగానే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొనడంతో స్కూటీలో నుంచి ఎగిరిపడి ముందు భాగాన చరణ్ తల తగలగానే తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్కుమార్ కూడా తీవ్రంగా గాయపడి ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే మార్గంలో వెళుతున్న నవీన్కుమార్ తండ్రి శ్రీహరి స్నేహితుడు ప్రమాదం గురించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మరణించడంతో తీవ్రంగా విలపించారు. తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన కడుపుకోతనే మిగిల్చింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తరువాత మృతదేహాలను వెంటనే రిమ్స్కు తరలించారు. సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్ సీఐ జావేద్ తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కడప సెవెన్రోడ్స్ : సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాల వారు ధర్నాలు చేపట్టడంతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎమ్మార్పీఎస్ (దండు వీరయ్య మాదిగ) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ సంఘం నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, నాగభూషణం మాట్లాడుతూ దివ్యాంగుల జనాభా దామాషా మేరకు ఆరుశాతం పైబడి ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సహదేవుడు, నరసింహులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లకు న్యాయం చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఈపీఎస్–95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈపీఎస్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు డీఏతో కలిపి చెల్లించాలన్నారు. 8వ పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్పీఎస్, యూపీఎస్, సీపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తినాయుడు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎ.రఘునాథ్రెడ్డితోపాటు ఇతర నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్ రవి డిమాండ్ చేశారు. సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, రాజశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోహన్, జెర్మియా, చారి, నగర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
దువ్వూరు/ఖాజీపేట/జమ్మలమడుగు : ఎరువుల దుకాణాల యజమానులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ జె.శ్రీనివాసరావు హెచ్చరించారు. దువ్వూరు, ఖాజీపేట మండలాల్లోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గోడౌన్లలో స్టాక్ను తనిఖీ చేశారు. దువ్వూరులోని కాశినాయన ట్రేడర్స్, వెంకటేశ్వర ట్రేడర్స్, జువారి జై కిసాన్ ట్రేడర్స్లలో, చింతకుంట, కానగూడూరు, గుడిపాడుల్లోని రైతు సేవా కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని, మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్న, మైదుకూరు వ్యవసాయశాఖ ఏడీఏ కృష్ణమూర్తి, మండల వ్యవసాయాధికారి అమరనాథరెడ్డి, ఏఎస్ఐ భూషణం, వ్యవసాయశాఖ, పోలీసు సిబ్బందిఖాజీపేట ఏఓలు సుమంత్ కుమార్రెడ్డి, నాగార్చన, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఏడీ అనిత, ఏఓ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ జె. శ్రీనివాసరావు -
పింఛన్ల తొలగింపుపై దివ్యాంగుల ధర్నా
పులివెందుల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించినందుకు నిరసనగా దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన అర్హులైన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. కాళ్లు, చేతులు, కళ్లు కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న దివ్యాంగుల పొట్టగొట్టి, సూపర్ సిక్స్ అంటూ ఇతర వర్గాలకు సొమ్ములను ధారపోయడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు శీలం సునీల్ కుమార్, రామకృష్ణ, చాగలేటి శివప్రసాద్, చాగలేటి ఉమాదేవి, రామససుబ్బయ్య, రామాంజనేయులు, ఈశ్వరయ్య, రవి, అశ్విని, స్వర్ణలత, తులసి, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినా ఎమ్మెల్యేపై చర్యల్లేవు
ప్రొద్దుటూరు : జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై ప్రభుత్వం ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆక్షేపించారు. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడులకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోయినా భరించగలిగామని, సీ్త్రలకు స్వేచ్ఛ, గౌరవం, భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పాలకులే కీచకులయ్యారని విమర్శించారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని విమర్శించినప్పుడు తాను ఖండించానన్నారు. తల్లి ఎవరికై నా తల్లేనన్నారు. ఎన్టీఆర్ తల్లి పాదాలను ఎమ్మెల్యే కన్నీటితో కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడానికి, ప్రెస్మీట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్పై అసూయతోనే చంద్రబాబు, లోకేష్ ఇలా చేస్తున్నారని, జూనియర్ ఎన్టీఆరే ఎన్టీఆర్కు అసలైన వారసుడన్నారు. ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా, ఉద్యోగులపై దాడి చేసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు నిలదీశారు. ఇప్పటికై నా స్థాయిని చూడకుండా తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా అధికార పార్టీకి గుమస్తాలుగా, బానిసలుగా పని చేస్తుండటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, కౌన్సిలర్లు ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, రాగుల శాంతి, లావణ్య, నాయకుడు బీఎన్ఆర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
జమ్మలమడుగు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం ఆయన పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఈనెల 12వ తేదీన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కడపకు తీసుకెళుతున్న సమయంలో సుధీర్రెడ్డి అడ్డు తగిలినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేను 16వతేదీన హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్యం కారణంగా రాలేనంటూ న్యాయవాదుల చేత నోటీసులు పంపించి 20వ తేదీ హాజరవుతానని తెలిపారు. 20వతేదీ పోలీసు స్టేషన్కు వెళ్లగా ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో తిరిగి 25వ తేదీ హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈమేరకు ఆయన సోమవారం విచారణకు హాజరు కాగా సీఐ విశ్వనాథ్ విచారించి స్టేషన్ బెయిల్తో సుధీర్రెడ్డిని పంపించారు.