breaking news
YSR District News
-
బాధితురాలికి ఐఫోన్ అప్పగింత
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బయనబోయిన కిరణ్ కుమారి ఈ నెల 28న బట్టలు కొనుగోలు చేయుటకు ఇంటి నుంచి షాపింగ్ మాల్ వెళుతుండగా, బ్రహ్మయ్య షెడ్ వద్ద తనకు చెందిన సుమారు రూ.80,000 విలువ గల ఐఫోన్ మొబైల్ పోగొట్టుకున్నది. ఈ విషయాన్ని ఆమె వెంటనే చిన్నచౌక్ పోలీస్స్టేషన్లో తెలియజేసినది. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీకి చెందిన ముత్యాలపాడు శ్రీరాములుకు బ్రహ్మయ్య షెడ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకగా, దానిని బాధ్యతతో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డికి అప్పగించాడు. అధికారుల సమక్షంలో ఐఫోన్ను కిరణ్ కుమారికి అప్పగించారు. తనకు దొరికిన మొబైల్ ఫోన్ను నిజాయితీతో స్టేషన్కు అందజేసిన శ్రీరాములును చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి అభినందించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన రమణ(60) తనకు పరిచయస్తుడైన మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన నరసింహులుతో కలిసి చౌడసముద్రం నుంచి పాపిరెడ్డిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని చెట్లవారిపల్లె వద్ద ట్రాక్టర్ పక్క నుంచి ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● నిమ్మనపల్లె మండలం ఎగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్, అతడి భార్య రాజమ్మ(45) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో సోమలకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కందూరు సమీపంలో మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో రాజమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● కడప జిల్లా ఖాజీపేటకు చెందిన శంకరనాయక్ (24), కామాక్షయ్య(35) అరటికాయలు అన్లోడ్ చేసేందుకు కూలీ పనుల్లో భాగంగా పులివెందుల నుంచి బొలేరో వాహనంలో పలమనేరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో బొలేరో ముందు చక్రం పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో పైన ఉన్న ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జింక అడ్డు రావడంతో.. మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ములకలచెరువు మండలంలో జరిగింది. కందుకూరు వెటర్నరీ కేంద్రంలో ఎల్ఎస్ఏగా పని చేస్తున్న నాగేంద్రప్రసాద్(47) సోమవారం సమావేశం నిమిత్తం కందుకూరు నుంచి బురకాయలకోటకు వెళుతుండగా, మార్గమధ్యంలోని దూలంవారిపల్లె సమీపంలో రోడ్డుకు అడ్డంగా జింక రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. డిప్యూటీ ఎండీవోకు.. పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి సచివాలయంలో పని చేసే డిప్యూటీ ఎండీవో క్రిష్ణప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 27న ఆయన విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంలో సత్యసాయి జిల్లా పెనుగొండకు వెళుతుండగా సోమందేపల్లి వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు మండల పరిషత్ సిబ్బంది సోమవారం తెలిపారు. విషయం తెలుసుకున్న బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి కర్నూల్లోని అదే ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్గా పని చేస్తున్న తన బావమరిదికి ఫోన్ చేసి అధికారి క్రిష్ణప్రసాద్ ఆరోగ్యం కుదుట పడేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.గాయపడిన వెటర్నరీ ఉద్యోగి నాగేంద్రప్రసాద్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రిష్ణప్రసాద్ -
కోర్టు తీర్పు కూటమి సర్కార్కుచెంపపెట్టు
గత ఎన్నికల సమయంలో రాజంపేట పార్టమెంట్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక కూటమి సర్కార్ మద్యం అక్రమ కేసు పెట్టింది. అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇప్పటికై నా కూటమి పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలి. – ఆర్ రమేష్కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
కేజీబీవీ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి
– కేజీబీవీల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కేజీబీవీల రాష్ట్ర డిప్యూటి డైరెక్టర్ దేవరాజులు సూచించారు. కడపలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం వంట మనుషులకు, వాచ్ ఉమెన్లకు, ఏఎన్ఎంలకు, అటెండర్లకు, స్వీపర్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దేవరాజులు మాట్లాడుతూ కేజీబీవీ పిల్లలకు వడ్డించే ఆహారం నాణ్యతలో ఎక్కడా తేడా రాకూడదన్నారు. వంటమనుషులు అన్ని జాగ్రత్తలు పాటించి భోజనాలను వండాలన్నారు. అలాగే అటెండర్లు, స్వీపర్లు ఎప్పటికప్పుడు శుభ్రతను పాటించాలన్నారు. సమగ్రశిక్ష అడిషన్ కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు మాట్లాడారు. జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ కేజీబీవీల సిబ్బంది విధి విధానాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయుడు దేవదత్తం డెమో చేసి వివరించారు. సెక్టోరియల్ అధికారలు సంజీవరెడ్డి, ఆఫీసు సిబ్బంది మాధవి, అనూష, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు కడప కార్పొరేషన్ : జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 30వ తేది సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు. హుండీ ఆదాయం లెక్కింపు సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం లెక్కించగా రూ.60,785 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్ధన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను గ్రామస్తుల సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది చంద్ర, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు మదనపల్లె సిటీ : ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును అక్టోబర్ 31వతేదీ వరకు పెంచినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పఠాన్ మహమ్మద్ఖాన్ తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో అవకాశం కల్పించారన్నారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు పదోతరగతిలో, అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ లో ప్రవేశం పొందొచ్చన్నారు. వివరాలకు 8121 852786 నంబర్లో సంప్రదించాలన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ కోసం యాత్ర
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సోమవారం కడపకు చేరుకుంది. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమై అంబేడ్కర్ విగ్రహం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కలిసి ఉన్న దళితులను విభజించి పరిపాలించడం తగదన్నారు. వర్గీకరణ అనేది చెల్లదని, అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. దళిత వర్గాలను మాల మాదిగలుగా విభజించిన కారణంగా మాదిగలు తెలంగాణను కోరుకున్నారన్నారు. బ్రిటీషర్ల మాదిరిగా చంద్రబాబు దళితులను విభజించి పాలించాలనుకుంటున్నాడని, అది ఎప్పటికీ జరగదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మోదీ, బాబు పాలనపై ధ్వజం కడప రూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తీవ్ర స్ధాయిలో ధ్వజ మెత్తారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.కేంద్ర మాజీ ఎంపీ చింతామోహన్ -
అంతిమ విజయం న్యాయానిదే
రాజకీయంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎదుర్కోలేక కుట్రపూరితంగానే కూటమి సర్కార్ అక్రమ మద్యం కేసు పెట్టింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం మంచి పరిణామం. వైఎస్సార్సీపీ శ్రేణులపై పెడుతున్న అక్రమ కేసులు ఎన్నో రోజులు నిలవవు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధిచెబుతారు. ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విన్నపాలు వినవలె !
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫలితంగా బాధితులు పదేపదే వస్తున్నారు. కాగా సోమవారం జేసీ అదితిసింగ్ అర్జీదారుల సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల్లో కొన్ని..– కడప సెవెన్రోడ్స్ మా మామ పాలెం సుబ్బనరసింహులు పేరిట సర్వే నెంబరు 6/2బిలో 5.35 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తనకు విక్రయించాలంటూ రెండేళ్లుగా మా గ్రామానికి చెందిన అధికార టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని సాగు చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని మా భూమి మాకు దక్కేలా చర్యలు తీసుకోవాలి. –నరసింహారావు, దవంతరంపల్లె, ఒంటిమిట్ట మండలం నేను బయనబోయిన నాగమల్లేశ్వరి నుంచి రెండు సెంట్ల 566 చదరపు లింకుల గునాదిగల స్థలా న్ని రూ. 8 లక్షలకు కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఎ.వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి బుల్డోజర్తో గునాది ధ్వంసం చేశాడు. ఈ విషయాన్ని నేను నాగమల్లేశ్వరి దృష్టికి తీసుకెళ్లినా ఆమె సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై సీకే దిన్నె పోలీసులు తహసీల్దార్ నివేదికను కోరారు. తహసీల్దార్ స్పందించడం లేదు. నాకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చాను. – షేక్ కలీమున్నీసా, సీకే దిన్నెకర్నూలు జిల్లా మాదిరే అధిక వర్షాలకు నష్టపోయిన జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం ప్రక టించిన రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు ఈ జిల్లా రైతులకు ఈ సాయం అందదని అంటున్నారు. దీనిపై స్పందించి రైతులకు వివరణ ఇవ్వాలి. దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు బీమా, ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం.– ఆదినారాయణరెడ్డి,మల్లారెడ్డి, జనార్దన్రెడ్డి, బీకేఎస్ నాయకులు మా తోటలోని వంద చీనీ చెట్లను మా గ్రామానికి చెందిన అన్నవరం గోపాల్రెడ్డి అనే వ్యక్తి నరికి వేశారు. గ్రామ సర్వే నెంబరు 220/2బీ1, 2బీ2లలో మా అబ్బ కొండప్ప పేరిట 5.48 ఎకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించి ఈసీ, ఆర్ఎస్ఆర్, పాసుపుస్తకాలన్నీ ఉన్నాయి. మా భూమి పక్కనున్న గోపాల్రెడ్డి మా భూమిని కాజేయాలన్న కుట్రతో చీనీ చెట్లు నరికించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. – రాము, గురిజాల గ్రామం, సింహాద్రిపురం -
వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నిరసనను జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం పిలుపు మేరకు ఈనెల 30వ తేది నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న దళితులు జయప్రదం చేయాలని ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అమరావతిలోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, పార్కును ప్రైవేటుకు అప్పగించడం వంటి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల అధికంగా నష్టపోయేది దళితులేనన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పాల్గొంటారని పేర్కొన్నారు.ఉదయం 9.30 గంటలకల్లా పార్టీ నాయ కులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, మా జీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మెన్ పులి సునీల్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శులు బాబు, త్యాగరాజు, సుబ్బరాయు డు, నేతలు వినోద్ కుమార్, కంచుపాటి బాబు, జాషువా, పి. సంపత్ కుమార్ పాల్గొన్నారు. -
కూటమిని నమ్మి మోసపోయాం !
కడప సెవెన్రోడ్స్ : కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటూ సచివాలయ ఉద్యోగులు ఆవే దన వ్యక్తం చేశారు. జోరు వర్షంలో తడుస్తూ నిరసన గళం విప్పారు. సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఆలస్యంగానైనా కూటమి ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును ఎండగట్టారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సిద్దేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉండేవారని తెలిపారు. ఒక సచివాలయంలో 25 క్లస్టర్లు ఉంటాయన్నారు. వలంటీర్లు చేసి పని ఇప్పుడు తమపై పడుతోందన్నారు. డ్యూయల్ బాసిజం తమపై ఎక్కువైందని తెలిపారు. అన్నిరకాల పనులు సచివాలయ సిబ్బందితో చేయిస్తుండడం దారుణమన్నారు. అలాగే పదోన్నతులు కల్పించేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హీరామియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.మస్తాన్ తదితరులు మాట్లాడుతూ ప్రతిసారి సర్వేల పేరుతో ఇంటింటికి తిరిగి విధులు నిర్వర్తించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతున్నామన్నారు. విద్యార్హత ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులను అప్పగించాలన్నారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇవ్వాలని.. జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
న్యాయం గెలిచింది
● ఎంపీ మిథున్కు బెయిల్పై సంబరాలు ● కూటమి అక్రమ అరెస్ట్లకు భయపడమంటూ నినాదాలు మదనపల్లె : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 19న కూటమి ప్రభుత్వం మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసింది. 72 రోజులపాటు నిర్బంధించింది. బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేసింది. బెయిల్ కోసం న్యాయస్థానం ముందు పిటిషన్ వేస్తే.. అడ్డుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత సిట్ కస్టడి కోరడం, దాని వెనక ఉద్దేశం ఇట్టే అర్థమవుతుంది. అక్రమ అరెస్ట్ నుంచి.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యా యమే గెలిచింది. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ నేతను అక్రమ కేసులో నిర్బంధించి, వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు వార్త బయటకు రాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు, అనుచరులు, వైఎస్సార్సీపీప నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మిథున్ రెడ్డి బ్యానర్లు చేతబట్టి.. జై జగన్, జై మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి, కక్షగట్టి వేధిస్తున్న చంద్రబాబుకు అధికార పతనం తప్పదు అంటూ హెచ్చరించారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 149 ఫిర్యాదులు (పీజీఆర్ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచిఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్పీ పేర్కొన్న ముఖ్య అంశాలు ● పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. ● ప్రజల నుంచి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం. ● ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన)కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
‘క్వారీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం’
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి పక్కనే కంకరకు సంబంధించిన మైన్లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా చాల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కరించాలని గోవిందంపల్లె గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ యామినిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందంపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ చాల సంవత్సరాలుగా గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలో పెద్ద ఎత్తున పనులు నిర్వహిస్తుండటంతో.. మైన్లో భారీ పేలుళ్ల వల్ల వెలువడుతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అనేక మంది రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో పనులు నిర్వహిస్తున్నరని, కాలుష్య నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతే కాకుండా జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, దీంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని రైతులు ఆన్లైన్కు సంబంధించి భూముల సమస్యలపై తహసీల్దార్కు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర్రావు, ఆర్ఐ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటో బోల్తా.. యువకుడి మృతిమదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని వాల్మీకి వీధికి చెందిన నరసయ్య, రెడ్డెమ్మ దంపతుల రెండో కుమారుడు కృష్ణభగవాన్ (27) టైల్స్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండే వాడు. ఆయన స్నేహితులైన బాబు, విజయ్తో కలిసి ఆటోలో బైపాస్రోడ్డు మీదుగా పట్టణంలోకి వస్తుండగా, అరేబియా హోటల్ సమీపంలో వేగాన్ని అదుపుచేయలేక ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణభగవాన్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు. -
వైఎస్ఆర్సీపీ హయాంలోనే బుగ్గవంక బ్రిడ్జిలకు నిధులు
కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే బుగ్గవంకపై షామీరియా మసీదు, లా కాలేజీల వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎస్ఎండీ షీఫీ, అజ్మతుల్లా అన్నారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో డివిజన్ ఇన్చార్జులు ఐస్క్రీం రవి, సుబ్బరాయుడు, శ్రీరంజన్రెడ్డి, డిష్ జిలాన్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2001లో బుగ్గవంకకు వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆ ఘటనకు చలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాను 2004లో అధికారంలోకి రాగానే రూ.70 కోట్లతో బుగ్గవంక రక్షణగోడ, సుందరీకరణ పనులు చేపట్టారన్నారు. వైఎస్ హయాంలోనే 80 శాతానికిపైగా పనులు అయిపోయాయని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పెండింగ్ పనుల గురించి పట్టించుకోలేదన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.72 కోట్లు మంజూరు చేసి బుగ్గవంక రక్షణ గోడ పూర్తి చేయడంతోపాటు గోడ వెంట అప్రోచ్ రోడ్లు, కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని, 2023లో లాకాలేజీ, షామీరియా మసీదు వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు. కాంట్రాక్టర్ తండ్రి చనిపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయని, ఈలోపు ఎన్నికలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి అవే నిధులకు జీవోలు మార్చి తీసుకొచ్చారని, తాము మంజూరు చేయించిన రూ.20 కోట్ల కంటే ఒక్క రూపాయి అదనంగా తేలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్లోనే వైఎస్ఆర్సీపీ హయాంలో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాధవి 16 నెలల తర్వాత మళ్లీ పనులు ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన నిధులను మేమే తెచ్చామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి చెప్పుకొంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తమ శిలాఫలకాలను తొలగించి మీ పేర్లతో కొత్తవి వేసుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. దమ్ముంటే ప్రభుత్వంతో నగరాభివృద్ధికి నిధులు తెచ్చి శిలాఫలకాలు వేసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు. తమ ప్రభుత్వంలో పనులు రద్దు చేశారని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. అసత్యాలతో ప్రజలను ఎంతో కాలం మభ్యపెట్టలేరన్నారు. బుగ్గవంకపై బ్రిడ్జిలకు నిధులు సాధించిన ఘనత కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలకే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు శిలాఫలకాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరని హెచ్చరించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.20 కోట్లు మంజూరు కాంట్రాక్టర్ తండ్రి చనిపోవడంతో పనులు ఆలస్యం టీడీపీ జీవోలు మార్చి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటు మీడియాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు -
పాత పనులకు కూటమి నేతల శంకుస్థాపన
కడప నగరానికి అనుసంధానంగా వంతెనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, అప్పటి డిప్యూటీ ిసీఎం అంజాద్బాషా, నగర మేయర్ శంకు స్థాపన చేశారు. షహమీరియా–రవీంద్రనగర్, లా కాలేజీ–నాగరాజుపేట మధ్యలో వంతెల నిర్మాణ పనులను రూ.20కోట్లతో ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆదివారం శంకుస్థాపన చేసేందుకు రాగా స్థానికులు రాకపోవడంతో ఎస్హెచ్జీ గ్రూపులు, బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రారంభించారు. స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
భవానీ.. భాగ్యప్రదాయిని
శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఆదివారం జిల్లాల్లోని పలు ఆలయాలు సందడిగా మారాయి. అమ్మవారు వివిధరూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి, భారీ శ్రీచక్రం, దేవతామూర్తుల ప్రతిమలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. –సాక్షి నెట్వర్క్ -
గంగమ్మా..కాపాడవమ్మా
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ భక్తులు అమ్మవార్లను వేడుకున్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతపురం గంగమ్మను లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య, మాజీ ఎంపీపీ రెడ్డయ్య, వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివారెడ్డి దర్శించుకున్నారు.ఆలయ అధికారులు వారిని సత్కరించారు.పూజల్లో ఉప మండల అధ్యక్షులు సమరసింహారెడ్డి, సుబ్బరాయుడు, సర్పంచ్లు వెంకటనారాయణ రెడ్డి, గడ్డం కళ్యాణి ప్రభాకర్ రెడ్డి, రమణయ్య, జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ నారాయణ, శంకర్ నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్లు సంజీవరెడ్డి, రాజబాబు, మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, పాల్గొన్నారు. -
ఇదేమి నీతి శ్రీనివాస..!
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బుసలుకొడుతున్నాయి. అందులోనూ కడప నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు రోజుకొకరు తమ అసహనాన్ని మాటలు, చేతల రూపంలో చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ‘నిజమైన తెలుగుదేశం పార్టీ గ్రూపులో హల్చల్ అవుతోంది’. ఇటీవల కడప నగర మేయర్గా ముంతాజ్బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన 4వ డివిజన్ నాయకులు పుత్తా శరత్కుమార్రెడ్డి, 40వ డివిజన్కు చెందిన సుజన్ ముంతాజ్బేగం బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన బ్యానర్లో వీరిద్దరి ఫోటోలు ఉండడం సంచలనంగా మారింది. ఈ అంశంపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుత్తా శరత్కుమార్రెడ్డి, సుజన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు. శరత్కుమార్రెడ్డి 44వ డివిజన్ కార్పొరేటర్గా, సుజన్ 42వ డివిజన్లో నివాసముంటే 40వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అండదండలు ఉన్నాయని కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే వారిద్దరు టీడీపీలో ఉంటూనే కడప మేయర్గా ముంతాజ్బేగం బాధ్యతలు స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లో పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నియమాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ క్రమశిక్షణ పేరుతో అసలైన కార్యకర్తలను సస్పెండ్ చే శారు. ఇప్పుడు వీరిద్దరు వేరే పార్టీకి చెందిన బ్యానర్లో తమ ఫొటో వేయించుకోవడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి రాదా? అని ప్రశ్నిస్తున్నారు. మేము ఏ తప్పు చేయకపోయినా క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావు...నీ అనుచర వర్గం తప్పు చేసినా కూడా ఏ శిక్షను వేయకుండా రక్షణ కల్పించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశం ఆ గ్రూపు వేదికగా చర్చ సాగడం గమనార్హం. తప్పు చేయకపోయినా శిక్ష మాకు తప్పు చేసిన వారికి రక్షణగా మీరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసుపై తమ్ముళ్ల ఆగ్రహం -
రిజిస్ట్రేషన్లకు నేడే ఆఖరు
కడప ఎడ్యుకేషన్: వైవీయూ (యోగి వేమన యూనివర్శిటీ)లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో చేరేందుకు రెండో విడత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 29 తేదీ చివరి రోజు అని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మి ప్రసాద్ వెల్లడించారు. విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వెబ్ ఆప్షన్స్ 29వ తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఉంటాయన్నారు. అందులో ప్రధాన ఆప్షన్గా వైవీయూను నమోదు చేయాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా ఇన్చార్జి ఉప రవాణాశాఖ కమిషనర్ వీర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 4 నాటికి వాహన్ పోర్టల్ ద్వారా వివిధ పనుల కోసం దరఖాస్తు చేసుకుని 10 నెలలు అంత కంటే ఎక్కువ రోజులు అయిన దరఖాస్తులు 279 ఉండేవని, అందులో అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నవి 83 ఉన్నాయని, వాటిని అప్రూవ్ చేశామన్నారు. మిగిలిన 196కు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయామని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డిస్ప్లే చేశామని, ఆయా వాహన యజమానులు పూర్తి డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ ను అక్టోబరు 7లోపల అందించాలని కోరారు. అప్పటికీ డాక్యుమెంట్స్ రాని దరఖాస్తులను రద్దు చేస్తామని తెలిపారు. బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సందర్శకులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ఉన్నా సందర్శకుల తాకిడి తగ్గింది. అయితే ఆదివారం రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీనితో గాలిబండ, వ్యూపాయింట్లు నుంచి సందర్శకులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాలను తిలకించారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రజలు 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. -
పేదరికం, అస్పృశ్యతలే నా గురువులన్న జాషువా
కడప ఎడ్యుకేషన్ : పేదరికం, అస్పృశ్యతే తన గురువులని గుర్రం జాషువా చాటి చెప్పారని బిజేపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో’ జాషువా సయంతి సందర్భంగా కవి కోకిల గుర్రం జాషువా పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదట జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం విషాదం చిమ్మినపుడు ఎవరికై నా జాషువా గుర్తుకొస్తారన్నారు. వైఎస్సార్ కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆధునిక కవుల్లో జాషువా తర్వాతే ఎవరైనా ఎన్నదగినవారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీరంరెడ్డి సుబ్బారెడ్డి, ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి, డాక్టర్ జీవీ.సాయిప్రసాద్, డాక్టర్ అనుగూరు చంద్రశేఖర్రెడ్డి, డాక్టర్ తవ్వా వెంకటయ్య, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ పొదిలి నాగరాజు, సాహిత్య మిత్రులు, కొత్తపల్లి లక్ష్మినారాయణరెడ్డి, బొమ్మన విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సత్వర పరిష్కరానికి తగిన చర్యలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఔట్సోర్సింగ్ఉద్యోగుల సంఘ రాష్ట్ర చైర్మన్ దూసి భానుజీరావు కోరారు. ఆదివారం గుంటూరు ఉద్యాన శాఖ మిని మీటింగ్ హాలులో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం నిర్వహించి 11 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎనుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ భానుజీరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ సిబ్బంది చిత్తశుద్ధితో, క్రమశిక్షణగా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని, వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర చైర్మన్గా దూసి భానుజీ రావు, ప్రధాన కార్యదర్శిగా పి.గురునాథ్ , వైస్ చైర్మన్గా కేవై దివాకర్ బాబు, వైస్ చైర్మన్–2గా రంగా భాస్కర్, కోశాధికారిగా యు.అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ కె.రవికుమార్, జాయింట్ సెక్రటరీ –2గా బి.వరపుత్రతోపాటు సభ్యులుగా సింహాచలం, సుబ్బారాయుడు, ఐవీ కృష్ణారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం
జమ్మలమడుగు: ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరుతో గండికోట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఒకరేమో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు, మరొకరు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాస్కి నిధుల కింద గండికోట అభివృద్ధి కోసం దాదాపు 78 కోట్ల రూపాయలు కేటాయించారు. టెండర్ను రిత్విక్ కంపెనీ లెస్కు దక్కించుకుంది. దీంతో మొదటి విడతగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని సంప్రదించకుండా పనులు చేపట్టడంతో స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. సబ్కాంట్రాక్ట్ కింద ఇతర జిల్లాలకు చెందిన వారికి పనులు ఇచ్చారంటూ గండికోట వాసులు, స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అడ్డంకులే... సాస్కి పథకం కింద గండికోటలో రహదారులు, బోటు షికారు, వసతుల కల్పన తదితర పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి రిత్విక్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. అయినా రెండో సారి పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ పంచాయితి కలెక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ కూడా స్థానికులకే పనులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని సీఎం రమేష్నాయుడు, సురేష్నాయుడు వ్యతిరేకించారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు ప్రాంత వాసులతో చేయించుకుంటారా అని బీజేపీ, టీడీపీ నాయకులు కంపెనీ కార్యాలయంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీ జరిగిన దాడి తర్వాత గండికోటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక గండికోటలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. పర్యాటకులకు కనీసం తాగు నీరు కూడ కోటలో దొరకని పరిస్థితి ఉంది. పనులు ఆగిపోవడంతో గండికోటలో అభివృద్ధి జరుగుతుందా.. లేక ఆదిపత్యం పోరులో ఆగిపోతుందా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన రూ.50 కోట్ల పనులు -
ఆశా వర్కర్లకు వేతనాలు మంజూరుచేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆశాలకు మెరుగైన వేతనాలిచ్చి.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి గౌరవాధ్యక్షుడు గుంటివేణుగోపాల్ డిమాండ్ చేశారు. నగరంలోని ఏఐటియూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయమంటున్నారని, ఆశాలకు ముఖహాజరు పెట్టారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న లెప్రసీ, కరోనా, టిబీ అలవెను్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ 7న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లకు వినతిపత్రం ఇస్తామని, ఆర్డీవో కార్యాలయాల్లో వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాగసుబ్బారెడ్డి, కెసీ.బాదుల్లా, మరియమ్మ, బాలకుళ్లాయమ్మ, అనసూయ, వరలక్ష్మి, అమ్ములు, బాలగంగమ్మ, లక్ష్మీనరసమ్మ, వహీదా, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు
కడప రూరల్ : ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు చేపడతామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా ఎన్జీఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు లెక్కలకొండారెడ్డి అన్నారు. సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేని ఉద్యోగులను గుర్తించామని, స్థలాల కేటాయింపునకు భూములు పరిశీలించామని తెలిపారు. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి.. త్వరలో ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ డైరెక్టర్లు టి.శ్రీనివాసులు, వెంకటరెడ్డి,చి న్నయ్య, బాలమురళి, రాఘవరెడ్డి, తిమ్మారెడ్డి, బాలపుల్లయ్య, పోలిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కేజీబీవీ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో కెజీబీవీ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి కోరారు. కడప సీపీఐ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 మంది మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్కు 11 నెలల వేతనం ఇవ్వకపోవడంతో అర్ధకాలితో అలమటిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి కేంద్రీకరించి వేతనాల విడుదలకు కృషిచేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వేతనాల విడుదలకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అజిత, మౌనిక, నాగమణి, కృష్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు -
దసరా నేపథ్యంలో నిరంతర నిఘా
ప్రొద్దుటూరు క్రైం: దసరా సందర్భంగా సీసీ కెమెరాలతో ప్రొద్దుటూరులో నిరంతర నిఘా ఉంచినట్లు డీఎస్పీ భావన తెలిపారు. ఆదివారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ఆలయాలు, ఎగ్జిబిషన్ పరిసరాల్లో నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆకతాయిల చేష్టల కట్టడికి శక్తి టీంల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని తెలిపారు. అమ్మవారిశాల, శివాలయం, ఎగ్జిబిషన్ వద్ద సందర్శకుల రద్దీ క్రమబద్ధీకరణకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా క్యూ లైన్ల పర్యవేక్షణ చేస్తామన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రథమ చికిత్స, సీపీఆర్ చేసేందుకు అందుబాటులో హెల్త్ టీంలు సిద్ధంగా ఉంచామని డీఎస్పీ వివరించారు. శమీ దర్శనం రోజున అదనపు బందోబస్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. అమ్మవారి తొట్టి మెరవణికి 150 మంది అదనపు పోలీస్ సిబ్బందితో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు భక్తుల సందడి మరింత ఎక్కువ కానుందున ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. అత్యవసర సమయాల్లో 100, 102, 112, 912100702 (ప్రొద్దుటూరు కమాండ్ అండ్ కంట్రోల్) నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. -
పాలిటెక్నిక్ కళాశాల భవనాలను ఎందుకు కట్టించలేదు
మైదుకూరు : మైదుకూరులోని పాలిటెక్నిక్ కళాశాల కళాశాలకు సొంత భవనాలను ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ ఇపుడు ఎందుకు కట్టించలేదని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లెరఘురామిరెడ్డి ప్రశ్నించారు. మైదుకూరులో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ రాయలసీమలో కూడలిగా ఉన్న మైదుకూరుకు పాలిటెక్నిక్ కళాశాల అవసరమని తాను కోరగా అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి మంజూరు చేయించారని తెలిపారు. సర్వే నంబర్ 1588లో కళాశాల భవనాల కోసం 2023లో ఐదెకరాల స్థలాన్ని ఇప్పించి, భవనాల నిర్మాణానికి రూ.34.97 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరైన నిధులతో కళాశాల భవనాలను ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. మైదుకూరులో ప్రత్యేక గర్ల్స్ హైస్కూల్ మంజూరు చేయించి నాడు–నేడు నిధులతో 70 శాతం పనులు చేయించామని, ఇంకా రూ.15 లక్షలు నిధులున్నా కూటమి ప్రభుత్వం 30 పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పాఠశాలల రూపురేఖలను మార్చినా.. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇప్పించామని 2.50 లక్షల వలంటీర్లతో పింఛన్ ఇప్పించామని తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేస్తే, ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవకాశం వస్తే చేతులకు చిక్కకుండా ప్రజలే తరిమేస్తారని అన్నారు. అనంతరం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ భవనాలను వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రఘురామిరెడ్డి పరిశీలించారు.మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి -
రాష్ట్రంలో బీహార్ తరహా ఆటవిక పాలన
● డిజిటల్ బుక్తో ఈ ప్రభుత్వ పాపాల చిట్టా రాస్తున్నాం ● డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లు ఆవిష్కరణలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకడప కార్పొరేషన్ : రాష్ట్రంలో బీహార్, ఉత్తర ప్రదేశ్ తరహా ఆటవిక పాలన నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి మేయర్ ముంతాజ్ బేగంతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై లెక్కలేనన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కక్షసాధించేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఒక కంటెంట్ను షేర్ చేసినందుకు నిన్ననే వన్టౌన్ పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేశారన్నారు. వీళ్ల అరాచకానికి బలైన కార్యకర్తలు, నాయకులకు భరోసా కల్పించడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ డిజిటల్ బుక్ను తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వంలోని నాయకులు, అధికారుల వల్ల అన్యాయానికి, వేధింపులకు, హింసకు గురైన బాధితులు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని తమకు జరిగిన అన్యాయాన్ని, అన్యాయం చేసిన వారి పేర్లను నమోదు చేయాలన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేయొచ్చన్నారు. సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చన్నారు. యాప్లో నమోదు చేయలేనివారు 040–49171718 నంబర్కు కాల్చేసి వారికి జరిగిన అన్యాయాన్ని తెలిపి నమోదు చేయించుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి న్యాయం చేస్తామని, అక్రమ కేసులన్నీ కొట్టివేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జోన్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, ఐస్క్రీం రవి, నాగమల్లారెడ్డి, పి. రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఎస్. వెంకటేశ్వర్లు, శ్రీరంజన్రెడ్డి, టీపీ వెంకట సుబ్బమ్మ, షఫీ, దాసరి శివ, బాలస్వామిరెడ్డి, ఏ1 నాగరాజు, మునిశేఖర్రెడ్డి, బండి దీప్తి, బి. మరియలు, షఫీవుల్లా, కంచుపాటి బాబు, సింధేరవి, రాయల్బాబు, జమీల్, పాల్గొన్నారు. -
‘హృదయాన్ని అద్దంలా..!
చూసుకో పదిలంగా..కడప రూరల్ : మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్పులతోనే 35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి.యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.నేడు ప్రపంచ గుండె దినోత్సవంగుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి ప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎన్.శ్రావణ్కుమార్రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప -
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం
బ్రహ్మంగారిమఠం : విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఉద్యమిస్తామని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. బ్రహ్మంగారిమఠంలోని విరాట్ విశ్వకర్మ భవన్లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ అడిషనల్ పోలీస్ కమిషనర్ కె.కిరణ్కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగితే రాజ్యాధికారంలో వాటా సాధ్యమని తెలిపారు. ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం లీగల్సెల్ చైర్మన్ పేరుసోముల గురుప్రసాద్ ఆచారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాకుగానీ, కొత్తగా బద్వేలు జిల్లా ఏర్పడితే దానికి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు జవ్వాది కూర్మాచార్యులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రతి ఎన్నికల్లో ఎంపీ, రెండు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి మాట్లాడుతూ తిరుమలలో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, వసతిగృహం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని టీటీడీ కోరింది. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి మాట్లాడుతూ మంగళ సూత్రం తయారీ హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దార్ల పాపయ్య, విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు అంగలకుదిటి సుశీల, తాళభద్ర వాసవి, నాగార్జున, తుంపాల వెంకటేశ్వర్లు, లక్కోజు సుజాత, వినుకొండ సుబ్బారావు, శ్రీనివాస ఆచారి, దశరథ ఆచారి, రంగాచారి, అప్పలస్వామి, శేషగిరి రావు, శేష బ్రహ్మ ఆచారి, చిలకపాటి మధుబాబు, మోడపల్లె నాగు, రామకృష్ణ ఆచారి, పద్మావతి, సాయి, శివ, ఫణీంద్రకుమార్, వీరాచారి, పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు -
తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ
కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టీకా వేయించుకుంటే రేబిస్ బారినుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. 28న రేబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కడప అగ్రికల్చర్: కడప ప్రభుత్వ ఆస్పత్రికి కుక్క కాటు కేసులో ఏటా పెరుగుతున్నాయి. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు 10,104 మంది కుక్క కాటుకు గురై చికిత్స తీసుకున్నారు. ఏటా సెప్టెంబర్ 28న రేబిస్ వ్యాధి నివారణ దినం నిర్వహిస్తూ.. ప్రభుత్వం కుక్క కాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీధి కుక్కల బెడద ఇటీవల పెరగడంతో పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రాథమిక ఆస్పత్రుల్లో సకాలంలో మందులు లేకపోవడంతో వేల రూపాయలు బయట ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు. వీధి కుక్కలను తరలించడంలో మున్సిపాల్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఏటా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి ఎలా వస్తుంది గబ్బిలాలు, పిల్లులు, నక్కలు, కోతి లాలాజలంలో రేబిస్ ఉంటుంది. అవి కరచినా, వాటి లాలాజలం శరీరభాగాల్లోని ద్రవాల్లోనూ, గాయాల పైనా పడినా ప్రాణాంతకరమైన రేబిస్ వ్యాధికి దారి తీస్తుంది. రేబిస్ వైరస్ సోకిన కుక్క కరిస్తే తొలుత కండరాలకు, అనంతరం శ్వాసకోశ నాళాలకు వైరస్ సోకుతుంది.. చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం, ఒంటరిగా ఉండిపోవడం, నోటి నుంచి సొంగ కారడం, నీటికి దూరంగా ఉండడం, గుండ్రంగా తిరుగుతూ ఉండడం వంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేయరాదు. కరిస్తే కనిపించే లక్షణాలు కుక్క కరచిన మనిషికి ఆకలి తగ్గడం, తల తిరగడం, జ్వరం రావడం, నీరు చూసినా భయపడడం వంటి లక్షణాలుంటాయని తెలిపారు. కుక్కలకు సోకే రేబీస్ వైరస్ శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. కుక్క ప్రాణాలు కోల్పోయేలోపు ఎంతమందిని కరిస్తే అంతమందికీ రేబీస్ వైరస్ సోకుతుంది. కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొరికినప్పుడు పన్ను లోపలకు దిగి రక్తం కారితే ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాధి బాగా ముదిరితే మనిషి కుక్కలా ప్రవర్తిస్తారు. కోమాలోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఏది కరిచినా.. కుక్క కరిచినప్పుడు, ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్ ఎగా, కొరికినప్పుడు పంటిగాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్ బిగా, పంటిగాటుతోపాటు రక్తస్రావమైతే గ్రేడ్ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు రేబిక్యూర్ వ్యాక్సిన్తో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ టీకా ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా, అది వీధికుక్క అయినా, పెంపుడు కుక్క అయినా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణంగా చాలామంది వీధిలో రోజూ కనిపించే కుక్క, దానికేం కాలేదు కాబట్టి మాక్కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా కరచిన వెంటనే తప్పనిసరిగా వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి. పెంపుడు కుక్కల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకుతాయి కాబట్టి వాటికి తప్పనిసరిగా యాంటీ రేబీస్సతో పాటు లెప్టోస్పైరోసిస్ లాంటి ఇతరత్రా వ్యాధుల టీకాలు వేయించాలి. డోసులు ఇలా.. పెంపుడు కుక్క : యాంటీ రేబీస్ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు మూడు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, ఏడవ రోజు 21 రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. వీధి కుక్క : ఈ కుక్క కరిచినప్పుడు ఐదు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 90వ రోజున బూస్టర్ డోసు తీసుకోవాలి. నేడు రేబిస్ వ్యాధి నివారణ దినం కుక్క కరిచిన వెంటనే ఆ భాగంలో కుళాయి నీటితో పది నిమిషాలపాటు శుభ్రంగా కడగాలి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. వైద్యులు లేకుంటే మెడికల్ స్టోర్స్లో లభించే అయోడిన్, సేవ్లాన్ వంటి యాంటిసెప్టిక్ లోషన్లు రాయాలి. గాయం అయితే వైద్యుడిని సంప్రదించి రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ టీకా వేయించుకోవాలి. బయట ఇంజెక్షన్ కొనాలంటే రూ.3వేలు అవుతుందని, ప్రభుత్వఆస్పత్రిలో ఉచితంగా వేస్తారు. – డాక్టర్ రాంబాబు, పశు వైద్యాధికారి, వెటర్నరీ పాలిక్లీనిక్, కడప -
● ప్రధాన డిమాండ్లు ఇవీ...
కడప రూరల్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య రంగానికి మహర్దశ పట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక కేంద్రానికి ఇద్దరు చొప్పున వైదులతో పాటు సరిపడా మిగతా వైద్య సిబ్బందిని నియమించారు. అలాగే ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ కాన్సెప్ట్ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పల్లె వైద్యానికి కష్టకాలం వచ్చింది. ● కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే జీఓ నంబర్– 85 జారీ చేసింది. ఈ జీఓ రాకతో పీహెచ్సీల్లో పనిచేసే వైద్యుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు పనిచేసే వైద్యులకు.. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసే వైద్యులకు పీజీ చేసేందుకు 30 శాతం కోటాను కేటాయించేవారు. జీఓ – 85 కారణంగా ప్రభుత్వం 30 శాతం ఉన్న కోటాను ఏకంగా 15 శాతానికి తగ్గించింది.దీంతో వైద్యులు తమ భవిష్యత్తును ప్రభుత్వం దారుణంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జీఓ –85, 99గా మారింది. అలాగే మిగతా సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీ నుంచి దశల వారీగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోషియేషన్ (ఏపీ పీహెచ్సీ డీఏ) ఆధ్వర్యంలో సమ్మెను ప్రారంభించారు. 2024 సెప్టెంబర్లో కూడా వైద్యులు సమ్మె చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించి, సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. ఏడాది దాటినా హామీలు అమలుకాకపోవడంతో మరో మారు వైద్యులు ఆందోళన బాట పట్టారు. పీహెచ్సీలు: 51 ఒక ఆసుపత్రిలో ఉండే వైద్యులు: 02 మొత్తం పనిచేస్తున్న వైద్యులు: 110 లభించే మందుల రకాలు: 175 వైద్య పరీక్షల రకాలు: 63 ఒక రోజుకు వచ్చే పేషెంట్స్: 45 మందికి పైగా ● ఇన్–సర్వీస్ కోటాను పునరుద్ధరించాలి ● టైమ్–బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలి ● గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50% ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలి. ● నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి.. ● చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు రూ 5 వేల అలవెన్స్ మంజూరు చేయాలి ● నేటివిటీ – అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను పరిష్కరించాలి. తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు.... ● వైద్యులకు కచ్చితమైన పని గంటలు, స్థిరమైన వారాంతపు సెలవు మంజూరు చేయాలి. ● వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలి ● అనధికారిక వ్యక్తులు ( ఉదాహరణకు నాన్ మెడికల్ శాఖ కు సంబంధం లేనివారు) విచ్చలవిడిగా తనిఖీలు నిర్వహించకుండా స్పష్టమైన మార్గదర్శకాలు చేయాలి. 28న వాట్సప్ గ్రూప్ బహిష్కరణ 29న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు మినహా అన్ని ఓపీ సేవలు బంద్ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు 3 నుంచి విజయవాడలో వైద్యాధికారుల నిరసనలు, నాయకుల నిరవధిక నిరాహార దీక్షలు -
టీడీపీ నేతల కుట్రలతోనే మేయర్పై అనర్హత
● దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదు ● మేయర్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో లేదు ● వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం కడప కార్పొరేషన్ : టీడీపీ నేతల కుట్రలతోనే మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు పడింతే తప్పా హైకోర్టు తొలగించలేదని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మల్లికార్జున, కె.బాబు, ఎస్ఏ షంషీర్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడుతూ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలన్నారు. మేయర్గా సురేష్బాబు అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో ఎక్కడా లేదని, ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి రాసిన తన లేఖలోనూ ఆ విషయం చెప్పలేదన్నారు. మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేయకూడదన్న ఒకే ఒక్క కారణం చూపి ఆయనపై అనర్హత వేటు వేశారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది కార్పొరేటర్లలో నలుగురు వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించారని, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా వారికి అగ్రపీఠం వేశారని గుర్తుచేశారు. టీడీపీలో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బజారున పడుతున్నారేగానీ, ఇందులో వైఎస్సార్సీపీ పాత్ర ఏమీ లేదన్నారు. మాజీ మేయర్ సురేష్ బాబును విమర్శించే స్థాయి, అర్హత సుబ్బారెడ్డికి లేదన్నారు. ఎమ్మెల్యే మాధవిని టీడీపీలోని ఓ మహిళ ఏడాదిన్నర క్రితం దూషించి వీడియో పెట్టారని, ఆమెను నిన్న, మొన్న అరెస్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న శివకొండారెడ్డి అప్పుట్లోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఎమ్మెల్యే మనుషులు నడిరోడ్డుపై శివకొండారెడ్డిపై దాడిచేసి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. మేయర్ సురేష్బాబు వేసింది చెత్త కాదని, హాస్పిటల్ వేస్ట్ అయిన నీడిల్స్, చీము, నెత్తురుతో ఉన్న దూది, కత్తిరించిన వేళ్లు వేశారన్నారు. కుర్చీ వేయకుండా మహిళా ఎమ్మెల్యేను అవమానించారని మొత్తుకుంటున్న వీళ్లకు..సురేష్ బాబు సతీమణి మహిళ అన్న సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. డీఎంఎఫ్ నిధులు, కుడా నిధులు ఈ ప్రాంత ప్రజలు కట్టిన పన్నుల నుంచే వచ్చే వాటా తప్పా ప్రభుత్వం ఇచ్చేవి కావన్నారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ సుబ్బారెడ్డి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ భిక్షతో పదవులు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దన్నారు. సుబ్బారెడ్డిని వైఎస్సార్సీపీ నాయకులంతా సమష్టిగా కృషి చేసి ఏకగ్రీవం చేయించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లో కడపకు రూపాయి మంజూరు చేయలేదని, కుడా నుంచి వచ్చే నిధులు, లేఔట్ల నుంచి వచ్చిన ఆదాయంతోనే పాలన సాగిందన్నారు. కె.బాబు, శివకోటిరెడ్డి, షంషీర్, రామలక్ష్మణ్రెడ్డి, చంద్రహాసరెడ్డి, షఫీ, అజ్మతుల్లా, గౌస్, అక్బర్, త్యాగరాజు, కిరణ్, నాగమల్లారెడ్డి, సుబ్బరాయుడు, శంకరాపురం సింధు, శ్రీరంజన్రెడిడ, డిష్ జిలాన్, రెడ్డి ప్రసాద్, బండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ.. అధోగతి
● అంగన్వాడీ కేంద్రాల పట్ల కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ● 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగానే నేటికీ బిల్లుల చెల్లింపు ● అప్పటి నుంచి మూడురెట్లు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ● కేంద్రాల నిర్వహణకష్టసాధ్యమంటున్న కార్యకర్తలు ● కేంద్రాల నిర్వీర్యం దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు కడప కోటిరెడ్డిసర్కిల్: కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలకు వచ్చే చిన్నారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. అయితే ప్రస్తుత ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ పెంచకపోవడం బాధాకరం. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, ఖర్చులు భారీగా పెరగడంతో కార్యకర్తలకు భారంగా మారింది. అసలే వారి జీతాలు అంతంత మాత్రంగా ఉంటే, దీనికితోడు పాత ధరల ఆధారంగా బిల్లులు చెల్లిస్తుండడంతో వంట ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ● అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన ప్రీ స్కూలు పిల్లల ఆహారం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పసుపు, చింతపండు, కారంపొడి తదితర సామాగ్రి ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. అయితే వీటి కొనుగోలుకు ఒక చిన్నారికి నెలకు రూ. 50 ప్రభుత్వం చెల్లిస్తోందని చెబుతున్నారు. అయితే ఇది ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. రోజుకు ఒకరికి కూరగాయలు, పోపులకు రూ.1.50, గ్యాస్ నెలకు రూ. 450 చొప్పున ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 950లకు కొనుగోలు చేస్తున్నామని, పెరిగిన ధరల కారణంగా మెను ప్రకారం వండి పెట్టాలంటే అదనపు భారం తప్పడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెను ప్రకారం బిల్లులు 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగా ప్రస్తుతం బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మూడు రెట్లు పెరగడంతోపాటు గ్యాస్ ధర కూడా బిల్లు చెల్లించిన దానికంటే అదనంగా రూ. 500 పెరిగింది. మెనుప్రకారం వండి పెట్టాలంటే తమకు భారంగా ఉందని, ప్రస్తుత ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం కొత్త ధరల ప్రకారం బిల్లులు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే కొత్త బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతాం. – రమాదేవి, ఐసీడీఎస్ పీడీ, కడప -
అన్నను తిడుతున్నా పవన్ నోరువిప్పలేదెందుకు?
– మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా కడప కార్పొరేషన్ : అన్న మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా బాలక్రిష్ణ వాడు, వీడు అంటుంటే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ప్రశ్నించారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ గౌరవ శాసన సభలో బాలకృష్ణ తలపై కళ్లద్దాలు, జేబులో చేతులు పెట్టుకొని తూగుతూ మాట్లాడటాన్ని ఎవరూ హర్షించడం లేదన్నారు. డాక్టర్లు ఽధ్రువీకరించిన మానసిక రోగి బాలకృష్ణ అన్నారు. సినీ పెద్దలను జగన్మోహన్రెడ్డి అవమానించారని ఎన్నికల్లో పవన్కళ్యాణ్ దుష్ప్రచారం చేశారన్నారు. నేడు చిరంజీవి స్పందించి ఆనాడు జరిగిన వాస్తవాలను బయటపెట్టారన్నారు. వైఎస్.జగన్ తమను ఎంత సాదరంగా ఆహ్వానించి, మర్యాద చేశారో అందులో చెప్పుకొచ్చారన్నారు. ఇప్పటికై నా చిరంజీవి స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన అన్నను అసెంబ్లీలో తూలనాడుతుంటే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్గానీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలుగానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మెంటల్ ఉందని డాక్టర్లు సర్టిఫై చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఽఎద్దేవా చేశారు. బాలక్రిష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు తనకు ఫోన్ చేశారని, వైఎస్సార్ను కలిసేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిని పంపాలని చెప్పానన్నారు. వైఎస్సార్ కుటుంబానికి బాలక్రిష్ణ ఎల్లప్పుడూ రుణపడి ఉండాలన్నారు. తాను హైదరాబాద్ వెళ్లేసరికి వారిద్దరూ రాలేదని, తానే వెళ్లి ఉద్దేశ్యపూర్వకంగా కాల్చలేదని వైఎస్సార్ను బ్రతిమాలానన్నారు. ఆయన స్పందించి అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఆనాడు వారి బంధువులెవరూ ఆయన వెంట రాలేదని, చంద్రబాబైతే నాలుగు రోజుల తర్వాత వచ్చారన్నారు. బాలక్రిష్ణ స్థలం రోడ్డు విస్తరణలో పోతుంటే రోడ్డును డైవర్ట్ చేసి స్థలాన్ని కాపాడారన్నారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి టీడీపీ హయాం నుంచి బిల్లులు పెండింగ్లో ఉంటే వైఎస్.జగన్మోహన్రెడ్డి విడుదల చేసి పెద్ద మనసు చాటారన్నారు. చేసిన మేలు మర్చిపోయి అసెంబ్లీలో తాగి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ నాయకులకు డిజిటల్ బుక్ శ్రీరామరక్ష
● ప్రభుత్వం ఏర్పడగానే అందరికీ న్యాయం చేస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలకు డిజిటల్ బుక్ శ్రీరామ రక్షలా ఉపయోగపడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మాజీ మేయర్ సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఇన్చార్జి మేయర్ ముంతాజ్ బేగంలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. కోర్టులు పదే పదే హెచ్చరిస్తున్నా పోలీసులు లెక్క చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను తెలుపుతూ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేయొచ్చన్నారు. యాప్లో నమోదు చేయలేనివారు 040–49171718 నంబర్కు కాల్చేసి నమోదు చేయించుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి న్యాయం చేస్తామన్నారు. దుర్మార్గాలకు పాల్పడిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని వైఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు ఎస్.యానాదయ్య, పులిసునీల్కుమార్, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.రామ్మోహన్రెడ్డి, షఫీ, దాసరిశివ, సింధేరవి, షేక్ షఫీ, ఫయాజ్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అండతోనే అసాంఘిక కార్యకలాపాలు
● పోలీసులను బ్లాక్మెయిల్ చేయడం ఎమ్మెల్యేకు అలవాటు ● వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు క్రైం : ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి అండతోనే ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్, ఇతర జూదాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆరోపించారు. దొరసానిపల్లెలోని తన నివాసంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అసత్యాలు మాట్లాడారన్నారు. లంచాలు తీసుకొని అసాంఘిక శక్తులకు కొందరు సహకరిస్తున్నారని మాట్లాడడం తగదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత కాలం తన అండతో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమన్నారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట జరగడానికి పోలీసులు కారణం కాదని అన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే జూదమాడేవారిని గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఆహ్వానించే వారు కాదని, ఎన్నికలప్పుడు వారితో పెద్ద ఎత్తున చందాలు తీసుకొని, ఇపుడు వారికి ఆదాయ వనరులు సమకూర్చేందుకు ఎర్ర తివాచీ పరచారన్నారు. ఎమ్మెల్యే అండతో మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం నిర్వహించేదెవరో, వాళ్లందరికీ ఎవరు వడ్డీకి డబ్బులిస్తున్నారో, రేషన్ బియ్యం నల్లబజారులకు తరలిస్తున్నదెవరో, భూ ఆక్రమణ దారులెవరో తనకు తెలుసునని రాచమల్లు అన్నారు. ఎమ్మెల్యేకు ప్రొద్దుటూరు డీఎస్పీ సరిపోదనే కోపంతో ఆమెను అవినీతి పరురాలిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాను చెప్పినట్లు వినే డీఎస్పీని తెచ్చుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించాలనే కారణంతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మెయిల్ అనేది వరదరాజులరెడ్డికి కొత్తేంకాదని 25 ఏళ్లుగా ఆయన ఇదే పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో బ్యాచ్కు 40–50 మందిని గోవా క్యాషినోకు తీసుకెళ్లి జూదాలు ఆడించే కౌన్సిలర్లు ఎవరో పోలీసులకు తెలుసునని రాచమల్లు అన్నారు. కుమారుడిని అదుపులో పెడితే చాలు తన కుమారుడు నంద్యాల కొండారెడ్డిని ఎమ్మెల్యే వరద అదుపులో పెట్టుకుంటే ప్రొద్దుటూరులో జూదం ఉండదని రాచమల్లు అన్నారు. పోలీసులు జూదరులను పట్టుకుంటే సీఐలు, ఎస్ఐలకు ఫోన్ చేసి కొండారెడ్డి వదలిపెట్టమని హుకుం జారీ చేస్తున్నాడని, వదలకుంటే అధికారుల పట్ల దుబారాగా మాట్లాడుతున్నాడని అన్నారు. ముందు టీడీపీలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలిస్తే వారం రోజుల్లో మొత్తం కంట్రోల్ చేస్తారన్నారు. సమావేశంలో ఎంపీపీ శేఖర్యాదవ్, పార్టీ ప్రొద్దుటూరు, మార్తల ఓబుళరెడ్డి, బాణా కొండారెడ్డి, గజ్జలకళావతి, పిట్టాభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కడప జిల్లా కళలకు కాణాచి
కడప ఎడ్యుకేషన్: కడపజిల్లా కళలకు కాణాచి అని సంస్కృతి, సంప్రదాయాలకు, ఆత్మీయతకు పెట్టింది పేరని జిల్లా విద్యాశాఖా ధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సభాభవనంలో రచయిత, ఉపాధ్యాయుడు గజ్జల వెంకటేశ్వర రెడ్డి రచించిన మన కడప–ఘన గడప పాటకు సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలోని ఆధ్యాత్మిక స్థలాలు, దర్శనీయస్థలాలు, నదులు, ఖనిజ సంపద, కవులు,ఆటలు తదితల అంశాను కూర్చి అద్భుతమైన పాటను రచించి,గానం చేసి వీడియోగా చిత్రీకరించిన వెంకటేశ్వర రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డీకే చదువులబాబు, ఏఎంఓ. వీరేంద్ర, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణంరాజు, లెక్కలవారి పల్లె ప్రధానోపాధ్యాయుడు నరసింహులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, మహేష్ బాబు, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు సజ్జల రమణారెడ్డి, ఆర్జేయూపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సైన్స్ ఉపాధ్యాయులు వేపరాల ఎబినేజర్, సైన్స్ మ్యూ జియం క్యూరేటర్ రెహ్మాన్ , కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ మోహన్ రెడ్డి, సైన్స్ కో ఆర్డినేటర్ సుుబ్బానాయుడు పాల్గొన్నారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ -
తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’పై నెల రోజుల పాటు నిర్వహించాల్సిన సెలబ్రేషన్స్, సీజనల్ కండీషన్స్, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, జిల్లా సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి జి. సుమతి, కేఎంసీ కమిషనర్ మనోజ్రెడ్డి, మెప్మా పీడీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వల్ల సేవింగ్స్పై ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు. జీఎస్టీపై పోస్టర్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు నాలుగు వారాలకు సంబంధించి చేయపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూలును తెలియజేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. నూతన జీఎస్టీ ద్వారా ఆదా అయ్యే అమౌంట్ గూర్చి ప్రజలకు తెలియజేయాలని, ఈ తగ్గిన జీఎస్టీ ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత మేర డబ్బులు ఆదా అవుతాయన్నారు. నాలుగు శ్లాబులు నుంచి రెండు శ్లాబులుగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీపై ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, స్వయం సహాయక సంఘాలు గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అట్టహాసంగా ఇన్చార్జి మేయర్ బాధ్యతల స్వీకరణ
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్గా ముంతాజ్ బేగం బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.27 గంటలకు కమిషనర్ మనోజ్రెడ్డి ఆమెతో సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు ముంతాజ్బేగం స్వగృహం ఉన్న రవీంద్రనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, అపూర్వ కల్యాణ మండపంలో మాజీ మేయర్ సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి మేయర్గా ఎంపికై న ముంతాజ్ బేగంను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ మేయర్ సురేష్బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముంతాజ్ బేగం మాట్లాడుతూ మాజీ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేయడం బాధాకరమన్నారు. కడప నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్పొరేషన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమైర్ తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జమాల్వలీ, డాక్టర్ మురాద్, కార్పొరేటర్లు మగ్బూల్బాషా, షంషీర్, మల్లికార్జున, బాలస్వామిరెడ్డి, కె.బాబు, డివిజన్ ఇన్చార్జులు రెడ్డి ప్రసాద్, బసవరాజు, రామచంద్రయ్య, సుబ్బరాయుడు, డిష్జిలాన్, కో ఆప్షన్సభ్యురాలు పత్తిరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు పి.రవీంద్రనాథ్రెడ్డి, సురేష్బాబు, అంజద్బాషా -
అగ్రిసెట్లో 25వ ర్యాంకు
కడప ఎడ్యుకేషన్: తాజా గా విడుదలైన అగ్రికల్చర్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులో (అగ్రిసెట్) జిల్లా విద్యార్థిని చిట్టిబోయిన సుహాసిని రాష్ట్ర స్థాయిలో 25వ ర్యాంకు సాధించింది. ఖాజీపేట మండలం భూమాయపల్లెలోని రైతు చిట్టిబోయిన వెంకటరమణ, మహేశ్వరి కుమార్తె సుహాసిని. సుహాసిని రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పోతుల శివారెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (కేంద్ర కార్యాలయం)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోతుల శివారెడ్డి చెన్నూరు మండలం ఓబులంపల్లెకు చెందిన నాయకుడు. గతంలో ఆయన ఐటీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు. రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సుదర్శన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన జల్లా సుదర్శన్రెడ్డిని రాష్ట్ర లీగల్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అడ్మిషన్ పొందడానికి రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియెట్లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఇంటర్ను ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఇంటర్నెట్, మీసేవా, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం www.apo penschool. ap.gov.in వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో కానీ డీఈఓ కార్యాలయంలో గానీ సంప్రదించాలని వివరించారు. బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలోని శ్రీ విరాట్ విశ్వకర్మ భవన్లో ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణుల సమస్యలు, డిమాండ్లపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీశైలంలోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే అన్ని దేవస్థానాల్లోని విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నిర్వహణపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం మఠాధిపతి ఎంపికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ మధుసూధనాచారి, తెలంగాణ ఏసీపీ కిరణ్కుమార్, హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి, ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ తదితరులు విచ్చేస్తారన్నారు. కావున విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
దేదీప్యం.. దేవీ వైభవం
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ’ కోసం అమ్మవారు అనేక అవతారాలు ధరించారు. వాటిలో కొన్నింటికి విశేష చరిత్ర ఉంది. జగన్మాత రూపాలను దేవీ శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన శుక్రవారం లోకమాత ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాల వెలుగుతో ఆలయాలు శోభాయామానంగా మారాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దేవీ వైభవం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శక్తి స్వరూపిణిని భక్తులు కనులారా దర్శించుకుని పులకించిపోయారు. ‘జగజ్జనని.. లోకపావని’ అంటూ శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. – సాక్షి, నెట్వర్క్ ప్రొద్దుటూరు చెన్నకేశవస్వామి ఆలయంలో మోహిని వనవిహారిణిగా అమ్మవారుప్రొద్దుటూరు అమ్మవారిశాలలో శ్రీదేవి వనవిహారిణి ప్రొద్దుటూరు వాసవీమాతను దర్శించుకుంటున్న భక్తులు కడప సత్యదేవుని ఆలయంలో మహిళా భక్తుల కోలాటం -
చిన్నయ్యా.. మార్పు ఏదయ్యా!
సాక్షి ప్రతినిధి, కడప: అధికార పార్టీ సిఫార్సులకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా.. రేషన్షాపు డీలర్లపై చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ విధానాలను అనుసరించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా... రెవెన్యూ అధికారులు నీళ్లు నమిలి క్షమాపణ చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి మార్కు విధానాలనే అనుసరిస్తున్నారు. తాజాగా భద్రంపల్లె రేషన్షాపు డీలర్ సుభాషిణి సస్పెన్షన్ విషయంలో ఆర్డీవో చిన్నయ్య మళ్లీ అవే తప్పులు కొనసాగించారు.విచారణ లేకుండా.. నోటీసు సైతం ఇవ్వకుండా..పులివెందుల ఆర్డీవో చిన్నయ్య రేషన్షాపు డీలర్లను సస్పెండ్ చేయగా.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కనీస విచారణ లేకుండా.. నోటీసు కూడా ఇవ్వకుండా డీలర్షిప్లను రద్దు చేయడాన్ని హైకోర్టు అడ్వకేట్ నరహరి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన హైకోర్టు వ్యక్తిగతంగా ఆర్డీవో తన ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులిచ్చింది. కోర్టులో హాజరైన ఆర్డీవో చిన్నయ్యను రెవెన్యూ నిబంధనలను అనుసరించకపోవడంపై న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన నీళ్లు నమిలారు. చివరకు హైకోర్టుకు ఆర్డీవో చిన్నయ్య క్షమాపణ చెప్పారు. ఇదంతా గత వారంలో చోటుచేసుకుంది. తాజాగా సదరు ఆర్డీవో చిన్నయ్య అవే తప్పులు చేయడం గమనార్హం. ఈనెల 9న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో భద్రంపల్లె రేషన్ డీలర్ సుభాషిణి వద్ద నిర్ణీత పరిణామం కంటే 68 కిలోల బియ్యం, 45 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్టు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో డీలర్పై చర్యలకు తొండూరు తహసీల్దార్ పులివెందుల ఆర్డీవోకు సిఫార్సు చేశారు. వెంటనే పులివెందుల ఆర్డీవో ఈనెల 17న భద్రంపల్లె రేషన్ డీలర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్ తర్వాత షోకాజ్ నోటీసువిజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, మండల రెవెన్యూ అధికారి సిఫార్సుల నేపథ్యంలో డీలర్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కోరుతూ ఆర్డీవో షోకాజ్ నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం అధికారి విచక్షణాధికారంతో చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, భద్రంపల్లె డీలర్ను సస్పెండ్ చేస్తూ ఈనెల 17న ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 18వ తేదీ వేసి 24వ తేదీన సాయంత్రం షోకాజ్ నోటీసు అందజేశారు. పైగా షోకాజ్ నోటీసులో 24వ తేదీ సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంటే రేషన్ డీలర్ వివరణ ఇచ్చే అవకాశమే లేకుండా రెవెన్యూ యంత్రాంగం కుయుక్తులు పన్నినట్టు అవగతమవుతోంది. ఇదివరకే ఆర్డీవోకు హైకోర్టు చీవాట్లు పెట్టినా.. ప్రొసీజర్స్ ఫాలో కావాలని స్పష్టంగా ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం తమకు నచ్చినట్టు ఉత్తర్వులు ఇస్తామని రెవెన్యూ యంత్రాంగం తీరు స్పష్టం చేస్తోంది. గత వారంలో హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఆర్డీవో మళ్లీ అవే తప్పులు చేయడం వెనుక.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు పలువురు చెబుతున్నారు. -
జీవిత ఖైదీకి గోల్డ్ మెడల్
కడప అర్బన్ : జీవిత ఖైదు అనుభవిస్తున్న గునుకుల యుగంధర్ డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించారు. కడప కేంద్ర కారాగారం అధికారులు, యుగంధర్ తల్లి చెంగమ్మ, చెల్లెలు మేఘన వివరాల మేరకు.. కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న యుగంధర్ ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లి నివాసి. 2011 జూలై, 18న హత్య కేసులో జీవిత ఖైదు విధించబడి కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పటినుంచి ఓల్డ్ పాటర్న్లో రెండు బీఏ డిగ్రీలు, న్యూ పాటర్న్లో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబిఎస్సి )లో రెండు బీఏ డిగ్రీలు, మూడు ఎంఏ డిగ్రీలు, కంప్యూటర్, కార్పెంటరీ, నాక్ స్కిల్స్లో సర్టిఫికెట్లు పొందాడు. ఇటీవల డిగ్రీలో 8.02 జీపీలోతో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మంచి ర్యాంకు సాధించడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ దక్కాయి. ఈ నెల 30న హైదరాబాద్లో మెడల్ అందుకోనున్నారు. ఇతడు పారా లీగల్ వలంటీర్గా పనిచేశారని అధికారులు తెలిపారు.నా బిడ్డకు క్షమాభిక్ష పెట్టండిహత్య కేసులో 20 ఏళ్లుగా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడు యుగంధర్కు క్షమాభిక్ష పెట్టాలని అతడి తల్లి చెంగమ్మ, సోదరి మేఘన కోరారు. గోల్డ్ మెడల్ సాధించి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని.. ప్రభుత్వం గుర్తించి తన బిడ్డను విడుదల చేయాలని కోరారు. -
ఏఎఫ్యూలో తాత్కాలిక ఫ్యాకల్టీ నియామకం
కడప ఎడ్యుకేషన్ : డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(కడప)లో తాత్కాలిక విజిటింగ్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.విశ్వనాథకుమార్ తెలిపారు. ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించి బి.ఆర్క్లో కనీసం 60 శాతంమార్కులు, మూడేళ్ల వృత్తి అనుభవం, బి.ఆర్క్తోపాటు మాస్టర్స్ డిగ్రీ(సంబంధిత సబ్జెక్ట్)లో కనీసం 60 శాతం మార్కులు, మూడేళ్ల అనుభవం కలిగి ఉండేవాళ్లు అర్హులని తెలిపారు. అలాగే ఇంటీరియర్ డిజైన్ విభాగానికి సంబంధించి బి.ఆర్క్.లో కనీసం 60 శాతం మార్కులు, సంబంధిత పీజీ అర్హతతోపాటు కనీసం మూడేళ్ల డిజైన్ అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఆర్కిటెక్చర్/ప్లానింగ్/జాగ్రఫీ/ఎకనామిక్స్/సోషియాలజీ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ ప్లానింగ్లో ఫస్ట్ క్లాస్ ఉండాలని తెలిపారు. ఈ పోస్టులకు ఈ నెల 26వ తేదీ ఉదయం పది గంటలకు చెన్నూరు మండలం రాయలపంతులపల్లిలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇంటర్వూలు ఉంటాయని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమకు సంబంధించిరి రెజ్యూమ్తోపాటు ఒరిజినల్ సర్టిఫిపకెట్లతోపాటు సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని నేరుగా వాక్– ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదా డెమో క్లాస్ ఇవ్వాల్సి ఉంటుందని వీసీ విశ్వనాథకుమార్ తెలిపారు. -
లోకపావనీ.. జగజ్జననీ!
ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కడప..శ్రీ గజలక్ష్మిదేవిగాశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ప్రొద్దుటూరులోని చెన్నకేశవస్వామి ఆలయంలో గజలక్ష్మీదేవిగా..అన్నపూర్ణగా అనుగ్రహించినా.. లక్ష్మీదేవిగా కటాక్షించినా.. గజలక్ష్మీగా వరమిచ్చినా... అన్ని రూపాలూ ఆమెవే.. కరుణించేది ఆ లోకపావనే.. ఈ జగమంతా జగజ్జననిదే.. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులను కరుణించారు. విద్యుత్ దీప కాంతుల్లో సువర్ణ ఆభరణాలతో మెరిసిపోతున్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించి భక్తులు మైమరిచిపోతున్నారు. తమ పిల్లాపాపలను చల్లాగా చూడాలని అమ్మవారిని మనసారా మొక్కుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. – నెట్వర్క్ -
ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటాం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపులివెందుల : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక భాకరాపురంలోని తన స్వగృహంవద్ద ఆయన మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంతృత్వ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. పవన్కళ్యాన్ ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని ప్రజలపై ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్లు హైదరాబాద్ టు విజయవాడ తిరిగేందుకు వేలకోట్లు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమకేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ నాయకులు కానీ.. ఏఒక్క కార్యకర్తగానీ భయపడే పరిస్థితి ఉండదన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు తమ పార్టీ వారిని ఆక్రమంగా వేధించిన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు, అధికారులు.. పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. -
డిపోల అభివృద్ధిపై దృష్టి పెట్టాం !
● బస్టాండ్లలో మౌలిక వసతులను మెరుగుపరుస్తాం ● పీటీడీ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మైదుకూరు/కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని పీటీడీ( ఆర్టీసీ) డిపోలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మైదుకూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో డిపోలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గుడివాడ డిపోలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుత్తి డిపో అభివృద్ధిని కూడా చేపట్టామని తెలిపారు. పీటీడీ స్వయంగా చేయడం లేదా పీపీపీ ద్వారా చేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. ఆగస్టు 15న ప్రారంభించిన సీ్త్ర శక్తి పథకం రాష్ట్రంలో సజావుగా విజయవంతంగా సాగుతోందని తెలిపారు. బస్సుల్లో కొన్ని స్వల్ప సంఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పీటీడీ బస్టాండ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎండీ వెల్లడించారు. వర్షం వస్తే మోకాళ్ల లోతు నీటితో ఉండే బస్టాండ్లు ఉన్నాయని అలాంటి వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మూడు నెలల్లో పీటీడీకి 1,050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్టు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మైదుకూరు డిపో మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇష్టంతో పనిచేయాలి ప్రతి ఒక్కరూ ఇష్టంతో పనిచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఎండీ కడప ఆర్టీసీ గ్యారేజీని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్రెడ్డి (ఇంజనీరింగ్)తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనల చేశారు. కడప బస్టాండును ఆధునికీకరించేందుకు రూ.1.30 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించి నాలుగు నెలల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం పొలిమేర గోపాల్రెడ్డి, డిప్యూటీ సీటీఎం డిల్లీశ్వరరావు, ఆర్టీసీ వీఅండ్ఎస్ఓ ధర్మతేజ, ఈఈ శ్రీనివాసులు, డీఈ పోతురాజు, యూనియన్ నాయకులు పురుషోత్తం, ఏఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్లో కలపాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో 8వ వేల మంది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వారిని ఆప్కాస్లో కలపాలని ఆయా ఉద్యోగులు ఎండీ ద్వారక తిరుమలరావును విన్నవించారు. -
సామాజిక రుగ్మతలు తొలగించడమే లక్ష్యం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతోపాటు త్వరితగతిన పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భూ సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని, భవిష్యత్తులో అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నేరాలను తగ్గించేలా, అట్రాసిటీ చర్యలకు పాల్పడితే పడే శిక్ష, కేసులు, సెక్షన్ల అంశాలను వివరించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దష్టి సారించాలని, పోక్సో, బాల్య వివాహాల చట్టాలపై అందరికీ అవగామన కల్పించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, డీఎస్పీలు వెంకటేశ్వర్లు(కడప), భావన (ప్రొద్దుటూరు), మురళి(పులివెందుల), రాజేశ్వర్రెడ్డి (మైదుకూరు), తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అమ్మేసేందుకే కూటమి వచ్చింది
● 17 నెలల్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డికడప కార్పొరేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేసేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకూ దోచుకోవడం, దాచుకోవడం నిత్యకృత్యమైందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే లక్షల టన్నుల ఇసుక డంప్ చేసి అమ్మేసుకున్నారని, మట్టి, మైన్స్, సిలికా.... ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారన్నారు. మద్యం విచ్చలవిడిగా ఏరులై పారిస్తున్నారని, బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి సొమ్ముచేసుకుంటున్నారన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి మద్యం అక్రమరవాణా అవుతోందని, దొంగసారా కూడా టీడీపీ నేతలే కాస్తున్నారన్నారు. ప్రజారోగ్యం పట్ల కాస్తయినా శ్రద్ధ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్కా కంపెనీలు, పేకాట క్లబ్బులు విపరీతంగా పుట్టుకొస్తున్నాయని, ఐదారు వేలకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పెద్ద స్కాం అని, టెండర్లు వేసిన వారు జైలుకు పోక తప్పదని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల టెండర్ కండీషన్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మల్టిపుల్ టెండర్లు రాకపోతే వాటిని రద్దు చేయాల్సి ఉండగా, సింగిల్ టెండర్ వచ్చినా ఆమోదిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు అఽధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను పప్పులు, బెల్లాలకు ప్రైవేటుకు అమ్మేస్తారని, ఇప్పుడూ అదే జరుగుతోందన్నారు. చంద్రబాబు హయాంలోనే షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, ఆల్విన్ ఫ్యాక్టరీ మూతబడ్డాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు భగ్గుమంటున్నాయని, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతోందన్నారు. దేవ స్థానాలు, హాస్పిటల్స్లో పారిశుద్ధ్య టెండర్లు కేంద్రీకృతం చేసి కమీషన్లు దండుకుంటున్నాయని ఆరోపించారు. యూరియా లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. 17 నెలల్లో రూ.2.10లక్షల కోట్లు అప్పు చేసిన ఏకై క సర్కార్ ఇదేనన్నారు. అమరావతి రాజధాని పేరుతో రూ.57వేలకోట్ల పనులకు టెండర్లు పిలిచి, 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి...తిరిగి ఆ నిధులను తమ ఖాతాల్లో వేసుకున్నారన్నారు. ఇప్పటి వరకూ అమరావతిలో కంపచెట్లు తొలగించడానికి, నీళ్లు తోడటానికే సరిపోయిందని, ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. పిల్లి పాలుతాగుతూ ఎవరూ చూడలేదులే అనుకుంటుందని, టీడీపీ నేతల తీరు కూడా అదేవిధంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంటికో విమానం ఇస్తామని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ యాక్టుకు కాలం చెల్లింది జీహెచ్ఎంసీ యాక్టుకు కాలం చెల్లిందని, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 15ఏళ్లు కావొస్తున్నా ఇంకా జీహెచ్ఎంసీ యాక్టును పట్టుకొని వేలాడటం సరైందని కాదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఉండకూడదనే కసితో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ప్రక్కన బెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పదవులు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాధవి భర్త శ్రీనివాసులరెడ్డి కాంట్రాక్టర్ కాదా.. అని ప్రశ్నించారు. కాలం చెల్లిన చట్టంతో పదవి తీసేయడం దుర్మార్గమని, కక్ష సాధింపులతో పదవులు ఊడగొట్టి రాక్షసానందం పొందుతున్నారన్నారు. సురేష్ బాబు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి రాలేదు.. అప్పుడు ఆయన పదవి కోల్పో వాలి కదా.. వైఎస్ జగన్ పదవి రద్దు చేస్తామని ఇపుడు బెదిరించడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, యువజన విభా గం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వలంటీర్ల విభాగం అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’పై ప్రజల్లో అవగాహన, వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా అవగాహన సమావేశాలు, పాఠశాలలు, కళాశాలల వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా జాయింట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ జి.సుమతి కొత్త జిఎస్టీ ప్రకారం వివిధ రంగాల వారీగా జిఎస్టీ వర్తింపు ఎలా జరుగుతుందనే వివరాలను క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పాల్గొన్నారు. గ్రామాల్లో సుస్థిర ఆదాయ మార్గాలు పెరగాలి స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని గ్రామా ల్లో సుస్థిర ఆదాయ మార్గాలు పెరగాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డ్వామా, ఉద్యాన, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీఎన్ఆర్ఈజీఎఎస్ పథకం ద్వారా నీటి భద్రత – గ్రామీణాభివృద్ధ్ఙి అనే అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం డ్వామా, ఉద్యాన, మండల అభివృద్ధి అధికారులు, అనుబంధ శాఖల అధికారులతో ఎన్ఆర్ఈజీఎస్ – జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న, చేపట్టాల్సిన వివిధ రకాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఒక్క లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తేవాలని, అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి కనీసం 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డ్వామా పీడీ అదిశేషారెడ్డి, భూగర్భ గనుల శాఖ డీడీ మురళీధర్, ఇరిగేషన్ అధికారులు, అన్ని మండలాల ఎంపీడీఓలు, డ్వామా ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు. పర్యావరణ సహిత జిల్లా మనందరి బాధ్యతకడప సెవెన్రోడ్స్ : జిల్లాను పర్యావరణ సహితంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్’పై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ఆసుపత్రులు, ఫ్యాక్టరీల సంఖ్య.. అవి ఉత్పత్తి చేసే వ్యర్థాలు, వాటి నిర్వహణ పనితీరు ఎలా జరుగుతుంది..? అన్న అంశాలపై సంబందిత అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు కడప విమానాశ్రయ అభివృద్ధికి అన్నిరకాల చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ సచికేత్ విశ్వనాథ్తో కలిసి ఎయిర్పోర్టు అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించారు.సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన పలు విష యాలను సంబంధిత అధికారులతో చర్చించారు. విమానాశ్రయం డైరెక్టర్, కమిటీ కన్వీనర్ సుజిత్ కుమార్ పొద్దర్,కమీషనర్ మనోజ్ రెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్వీన్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిప్యూటీ మేయర్తో మాజీ డిప్యూటీ సీఎం చర్చలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, ఆమె భర్త మాజీ కార్పొరేటర్ జమాల్వలితో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసి డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగానికి ఇన్చార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె బాధ్యతల స్వీకరణ, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అజ్మతుల్లా, వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, డిష్ జిలాన్, రెడ్డి ప్రసాద్, రమేష్ రెడ్డి, గయాజ్, అతావుల్లా, డా. మురాద్, మున్నా, మహబూబ్ పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీని కలిసిన ఎస్పీకడప అర్బన్ : రాష్ట్ర పూర్వ డీజీపి, ప్రస్తుత ఏపీఎస్ఆర్టిసీ ఎండీ సిహెచ్.ద్వారకాతిరుమల రావు కడపలో గురువారం పర్యటించారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయనను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆత్మీయంగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. -
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
ప్రొద్దుటూరు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ వెంకటజనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక శ్రీరాములపేట ఒంటేరు ఉపాధ్యాయ సేవా కేంద్రంలో కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చాక మనస్ఫూర్తిగా పండగ చేసుకుందామని భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తే ఒక ద్రవ్య భత్యం కానీ, మధ్యంతర భృతి కానీ ఇవ్వలేదన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయకపోవడంతోపాటు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రూ.30 వేల కోట్ల డీఏ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధి బోగాగంగాధర్ మాట్లాడుతూ.. డీఈఓ పూల్లో మిగులు పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి పెద్ద మనసు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. 2003 డీఎస్పీ ఫోరం కన్వీనర్లు రిజ్వాన్ అలీ, బాలజోజప్ప, పుల్లయ్య మాట్లాడుతూ.. మెమో నెంబరు 57ను వెంటనే అమలు చేయాలని కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. వాటిని ఎలా పొందాలో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు నాగచంద్రుడు, అబ్బాస్, చింతంరెడ్డి మాధవరెడ్డి, సుబ్బారెడ్డి, మూలె బ్రహ్మనందరెడ్డి, నాగరాజు, నాగేంద్ర పాల్గొన్నారు. -
అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. నిరూపించలేని పక్షంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని మాజీ మేయర్ కె.సురేష్ బాబు సవాల్’ విసిరారు. స్థానిక అపూర్వ ఫంక్షన్ హాల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కడపను బ్రష్టుపట్టించి దోచేశారని 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 కోట్ల బిల్లులు చేసుకుని అక్రమాలకు పాల్పడింది నీవు కాదా అని ప్రశ్నించారు. మహానాడుకు ముందు బుగ్గవంకలో కంపచెట్లు తొలగించి రూ.30 లక్షల పనికి రూ.3 కోట్లు దోచేశావంటూ ఆరోపించారు. 17 ఏళ్లుగా కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలుగా భావించి అందరినీ కలుపుకొని పోయి పనిచేశానన్నారు. 20ఏళ్లు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను ప్రక్కనబెట్టి నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోలేని శ్రీనివాసులురెడ్డి ఒక మనిషేనా అని మండిపడ్డారు. నీరు చెట్టు నిధులు నొక్కేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది.. కడప నగరాభివృద్ధికి రూపాయి నిధులు తెచ్చా రా.. ఒక్క రోడ్డు, కాలువ నిర్మించారా అని సూటిగా ప్రశ్నించారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు, కార్పొరేషన్ సాదారణ నిధులతో జరిగే పనులకు టెంకాయలు కొట్టడానికి సిగ్గుండాలన్నా రు. నీరు–చెట్టు నిధులను పందికొక్కుల్లా మేసిన మీరా మమ్మల్ని విమర్శించేది అంటూ నిలదీశారు. ప్రధాన రహదారుల విస్తరణ, కూడళ్లు అందంగా తయారయ్యాయంటే దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్వల్లేనని గుర్తు చేశారు. బుగ్గవంగ సుందరీకరణకు వైఎస్సార్ రూ.70 కోట్లు ఇస్తే, వైఎస్.జగన్మోహన్రెడ్డి రూ.72కోట్లు ఇచ్చారని, వాటితోనే రక్షణ గోడ పూర్తయి అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నారన్నారు. టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కడపను అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. తీర్మానాలను అడ్డుకుది మీరు కాదా....? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 జనరల్ బాడీ మీటింగులు జరిగితే ఒక్కటి కూడా సజావుగా జరక్కుండా ఎమ్మెల్యే మాధవి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జూలై 4న జరిగిన మొదటి సమావేశంలో సొంత పార్టీ కార్పొరేటర్నే తిట్టిపోశారని, కార్పొరేటర్ల భర్తలకు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని చెప్పి, తన భర్తను మాత్రం అధికారిక సమావేశాలకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. 2024 డిసెంబర్, 23న తీర్మాణాలకు ఆమోదం తెలుపకుండా ఎజెండా పేపర్లు చించేసింది ఎవరో తెలీదా...2025 జూన్, 20న తాము చేసిన తీర్మానాలు అమలు కాకుండా కోర్టుకు వెళ్లింది మీరు కాదా.. అని ప్రశ్నించారు. పూటకో పార్టీ మారే మీరా తనను విమర్శించేది అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా మేయర్తో సమానంగా ఎక్స్అఫిషియో సభ్యులకు కుర్చీలు వేయరని, రాష్ట్ర మంత్రులైనా కార్పొరేటర్లతో సమానంగా కూర్చొవాల్సిందేనన్నారు. పదవులు తనకు కొత్త కాదని, సర్పంచ్గా, జెడ్పీ ఛైర్మెన్గా, రెండు సార్లు మేయర్గా చాలా ఏళ్లు ప్రతిపక్షంలోనే కొనసాగి అన్ని పార్టీల మన్ననలు పొందానని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్లకు కప్పం కట్టలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా బెంగళూరు, హైదరాబాద్లలో వెంచర్లు వేస్తున్నారని, 16 నెలల్లో కడపలో ఒక్క వెంచర్గానీ, ఒక్క అపార్ట్మెంట్గానీ నిర్మించబడలేదన్నారు. మేము ఇలాగే కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎమ్మెల్యే మాధవి, శ్రీనివాసులురెడ్డిలాగా కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే టీడీపీ కార్యకర్తలు మిగిలి ఉండేవారా అని సురేష్బాబు ప్రశ్నించారు. వాళ్లలాగా తాము ఎవరినీ పీడించ లేదన్నారు. పదవులు శాశ్వతం కాదని, దేవుడు అనుగ్రహిస్తే ఇంతకంటే మంచి పదవులు వస్తాయన్నారు. తనను మేయర్ పదవి నుంచి దించేసి ఆ కుర్చీలో కూర్చొవాలని చూస్తున్నారని, కుర్చీపై ఉన్న వ్యామోహంతో ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కుర్చీ పిచ్చి ఎంత ముదిరిందంటే...ఆగష్టు 15న వేదికపై కుర్చీ కావాలని ఐఏఎస్ అధికారులనే దూషించేస్థాయికి వెళ్లిందన్నారు. ఇంత చేసిన ఆమెను కుర్చీలో కూర్చొనిచ్చే ప్రసక్తే లేదని, తమ కార్పొరేటర్లు సైనికుల్లా మారి అడ్డుకుంటారని హెచ్చరించారు. టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ మొదలుకొని కమిషనర్ వరకూ తెలుగుదేశం పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని సురేష్బాబు మండిపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటలకు తనపై అనర్హత వేటు వేసినట్లు మీడియాలో వచ్చిందని, వాస్తవానికి ఆ ఉత్తర్వులు ఈ రోజు అందాయన్నారు. ఈ లోపే గెజిట్ ప్రకటించి, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారన్నారు. తనను పదవి నుంచి దించేయడానికి ఆఘమేఘాలపై శరవేగంగా పనిచేస్తున్న అఽధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంతే వేగం చూపితే ప్రజలు హర్షిస్తారని చురకంటించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు షఫీ, అరీఫుల్లా బాషా, షంషీర్ బాషా, బాలస్వామిరెడ్డి, చెన్నయ్య, కో ఆప్షన్ సభ్యులు బి. మరియలు, జహీర్, పత్తిరాజేశ్వరి, డివిజన్ ఇన్చార్జులు మల్లికార్జున కిరణ్, డిష్జిలాన్, బసవరాజు, అక్బర్, గౌస్, సుబ్బరాయుడు, రామక్రిష్ణారెడ్డి, దాసరి శివప్రసాద్ పాల్గొన్నారు. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతావా? తీర్మానం చేయకుండా అజెండా పేపర్లు చించేసింది ఎమ్మెల్యే కాదా? 16 నెలల్లో కడప అభివృద్ధికి రూపాయి నిధులు తెచ్చారా? నన్ను పదవి నుంచి దించి కుర్చీలో కూర్చొవాలని చూస్తున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిపై విరుచుకుపడిన మాజీ మేయర్ సురేష్ బాబు -
కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన
కడప సెవెన్రోడ్స్ : వాహనమిత్ర గడువు పొడిగించడంతోపాటు అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి షరతులు లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ కేసీ.బాదుల్లా, ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్కు వాహనమిత్ర ద్వారా రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు 50 శాతం రాయితీతో విద్య, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. జీఓ నెంబరు 21, 31లను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు నారాయణ, పుల్లయ్య, రెడ్డెయ్య, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు పదోన్నతులు ఇవ్వాలి
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ఉద్యోగుల పదోన్నతికి సంబంధించి అటెండర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు పదోన్నతులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అడహక్ కమిటి మెంబర్స్ శ్రీనివాసులు, సురేష్, చంద్రశేఖర్లతోపాటు సభ్యులు కోరారు. ఈ విషయమై గురువారం ఇంటర్ ఆర్జేడీ సురేష్బాబుకు తమ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సిబ్బంది పదోన్నతులకు సంబంధించి రోస్టర్ పాయింట్ డిస్ప్లే చేసిన తర్వాతే అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇన్చార్జి మేయర్గా ముంతాజ్ బేగం కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్గా ముంతాజ్ బేగంను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో కొత్త మేయర్ ఎన్నికయ్యే వరకూ డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. విశ్లేషణాత్మక ఆలోచన ముఖ్యం – ఆర్కేవ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా వేంపల్లె : విద్యార్థులు ఆవిష్కరణాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనతో పాటు ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. గురువారం స్మార్ట్ ఇండియా హ్యకథాన్–2025 లో భాగంగా విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లు ప్రదర్శించారు. దాదాపు 106 టీమ్లు ప్రదర్శనలు చేయగా.. ఇందులో 50 ఎంపిక చేశారు. ఎంపికై న టీమ్ సభ్యులను జాతీయ స్థాయికి పంపనున్నారు. అకాడమిక్ డీన్ రమేష్ కై లాస్, ఎస్పిఓసీ కోఆర్డినేటర్ ఉదయశ్రీ పాల్గొన్నారు. నెలాఖరు వరకు గడువు కడప సిటీ : మహాత్మాగాందీ ఉపాధి హామీ పథకం కింద పండ్ల మొక్కల పెంపకానికి 100 శాతం సబ్సిడీతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఉందని, ఆసక్తి, అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ బి.ఆదిశేషారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1250 మంది రైతులు 2742 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 1030మంది రైతులకు సంబంధించి 2200 ఎకరాల్లో గుంతలు తీయడం జరిగిందన్నారు. 920 మంది రైతులకుగాను 2058 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. 103 మంది రైతులకుగాను 134 ఎకరాలకు సంబంధించి గుంతలు తీసి మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు వరకు గడువు ఉందని, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ఈ అవకాశం ఉందని ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు ప్లాంటేషన్ మేనేజర్ ప్రతాప్ 90008 90293 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మండలాల్లో సంబంధిత ఏపీఓలను కలవొచ్చని తెలిపారు. ఎరువుల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలి – జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా త్వరలో రబీ సీజన్ ప్రారంభమవుతుందని ఎరువుల పంపిణీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఏడీలతోపాటు మండల వ్యవసాయ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలను నిర్వహించాలని సూచించారు. అలాగే రబీ సీజన్లో విత్తనాల పంపిణీలో ఎక్కుడ అవకతకవలకు జరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యవసాయ కార్యాలయ ఏడీఏ మాధవితోపాటు అన్ని డివిజన్ల ఏడీలు, అన్ని మండలాల ఏఓలు పాల్గొన్నారు. -
లీగల్ ఎయిడ్ క్లినిక్ సందర్శన
పులివెందుల టౌన్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎస్.బాబా ఫకృద్దీన్ పులివెందుల సబ్ జైలులో లీగల్ ఎయిడ్ క్లినిక్ను గురువారం సందర్శించారు. రిజిష్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం గురించి వివరించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలు, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జైలు పరిసరాలు, రిజిష్టర్లను పరిశీలించి సూచనలు చేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు, ఖైదీలు పాల్గొన్నారు. నకిలీ ఉత్పత్తుల స్వాధీనంకడప కార్పొరేషన్ : కడప నగరంలో నకిలీ జేఎస్డబ్ల్యూ సిల్వర్ పూత కలిగిన షట్టర్ 18 షట్టర్ భాగాలు, ముద్రణ అచ్చులు కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జేఎస్డబ్ల్యూ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ బ్రాండెడ్ ఉత్పత్తుల నకలు తయారు చేసి అసలైనవిగా మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కస్టమర్లు, బ్రాండ్ సమగ్రతను రక్షించడానికి జెఎస్డబ్ల్యూ స్టీల్ నిరంతరం పనిచేస్తుందన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిర్దిష్ట సమాచారం ఉందన్నారు. దీంతో తమ స్టీల్ కోటెడ్ బృందం షట్టర్ ఉత్పత్తులు, దాని ట్రేడ్మార్క్ సిల్వర్ గుర్తు దుర్వినియోగాన్ని ఽధృవీకరించేందుకు దర్యాప్తు నిర్వహించిందన్నారు. ఈ నేపథ్యంలోనే కడప ఎస్డీఎస్ సన్స్ భాగోతం బయట పడిందని, సమాచారం పోలీసులకు అందించామని తెలిపారు. ఫైనాన్షియర్ హత్య కేసులో టీడీపీ నేతప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేపిన పైనాన్షియర్ వేణుగోపాల్రెడ్డి హత్య కేసులో టీడీపీ నేత ఎడమకంటి వెంకట సుబ్బారెడ్డిని ఏ2గా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో అదే పట్టణానికి చెందిన బిల్డర్ వెన్నపూసలక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకట సుబ్బారెడ్డితోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బోయినినగేష్, లైని అజయ్ కుమార్, చింతలచెరువు ప్రణయ్ కుమార్, కొత్త శివప్రసాద్ నిందితులుగా ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బాకరాపేట వీధికి చెందిన ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి అనుచరుడిగా ఉంటూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. టీడీపీ నేతల అండ చూసుకునే అయన ఈ హత్యలో పాల్గొని ఉంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
●పేకాట క్లబ్లపై కట్టడి ఏదీ?
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా పోలీసుశాఖ పనితీరుకు కూటమి నేతల మాటలు నిలువెత్తు అద్దంపడుతున్నాయి. వారి ఆరోపణల్లో వాస్తవాలు లేకపోలేదు. ప్రజాసమస్యల కంటే వ్యక్తిగత అజెండాకు కొంతమంది పోలీసు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటిగా మారింది. అసాంఘిక శక్తులపై ఖాకీల కరుకుతనం తగ్గిపోయింది. సివిల్ పంచాయతీలు, భూ తగాదా సెటిల్మెంట్లపై వారి మనసు మళ్లింది. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు క్రికెట్ బెట్టింగ్, జూదం వ్యవహారాలపై నామ్కేవాస్తే తనిఖీలు నిర్వహించే పోలీసులు.. ప్రశ్నించే వారిపై ఎదురుదాడికి దిగుతూ చట్ట ప్రయోగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్ కేసులు చేధించడంలో కూడా విఫలం చెందుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గండికోటలో మైనర్ బాలిక హత్య కేసే. తొలుత హడావుడి.. ఆపై లేదు పురోగతి... పర్యాటక ప్రాంతమైన గండికోటలో ఈ ఏడాది జూలై 14న బాలిక హత్య జరిగింది. స్నేహితుడి మోటార్ బైక్పై వెళ్లిన బాలిక తిరుగు ప్రయాణంలో లేదు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బాలిక హత్య జరిగి 70రోజులు అవుతోన్నా ఇప్పటికీ కేసు తేల్చలేదు. ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. క్లూస్ టీమ్ పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ పర్యటించింది. టవర్ లోకేషన్ తీశారు. ఫోన్ కాల్స్ టెక్నికల్ విశ్లేషణ చేశారు. ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10మంది ఎస్ఐలు దృష్టి పెట్టారు. అయిన్పటికీ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. హత్యలో స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని, నిందితుల్ని సాయంత్రంలోగా అదుపులోకి తీసుకొని ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని స్వయానా డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా ఎదుట ప్రకటించారు. రెండు నెలలు దాటినా సదరు హత్య కేసు కొలిక్కి రాలేదు. పోలీసుల వ్యవస్థకు సవాల్గా నిలిచిన ఈకేసులో పురోగతి లేకపోగా, అధికారుల పనితీరుపై సందేహాలు కలుగుతున్నాయి. ఏకపక్ష చర్యలతో అభాసుపాలు జిల్లాలో ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. అందుకు పులివెందుల పోలీసుల ఏకపక్ష చర్యలను పరిశీలకులు ఉదాహరిస్తున్నారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ కూడళ్లకు టీడీపీ మహానాడు సందర్భంగా ఆ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. ఇది మంచి పద్ధతి కాదు, వైఎస్ విగ్రహాలకు ఉన్న టీడీపీ తోరణాలు తొలగించాలంటూ మున్సిపల్ కమిషనర్కు, పులివెందుల డీఎస్పీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఆయా సర్కిళ్లలో టీడీపీ జెండాలు తొలగించాలి. అలా చేయకపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొంతమంది వైఎస్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు మాత్రమే తొలగించారు. అదే అదునుగా భావించి టీడీపీ నేత విజయ్కుమార్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. పులివెందులలో క్రియాశీలకంగా ఉన్న వైఎస్సార్సీపీ నేతల్ని కేసులో చేర్చారు. అంతటితో ఆగకుండా ముగ్గురు మైనర్లను కూడా కేసులో చేర్చారు. ఇదే విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా జెండాలు తొలగిస్తే హత్యాయత్నం కేసు ఎలా అవుతుందని హైకోర్టు సైతం ప్రశ్నించింది. అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యే వరద ఆరోపణలు జూదం, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో అధికారుల పాత్ర ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ నాడు ఎంపీ రమేష్, నేడు ఎమ్మెల్యే వరద నోట జూదం మాట పోలీసుశాఖలో అవినీతి అధికారులు కొనసాగుతున్నారు. డైరెక్టుగా డీఎస్పీలయినోళ్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. సమస్యలపై వారికి చెప్పినా నిరుపయోగమే అవుతోంది. ప్రొద్దుటూరులో గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నత అధికారి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కిందిస్థాయి అధికారులను కొంతమంది కాపాడుతున్నారు. – ఈ నెల 25వ తేదీ.. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జమ్మలమడుగు కేంద్రంగా విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారు. దేవగుడికి చెందిన వ్యక్తులు లక్షల్లో జూదం ఆడిస్తున్నారు. కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. జూదం క్లబ్లను కట్టడి చేయండి. వైఎస్సార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్కు అభ్యర్థన. – ఇటీవల బీజేపీ ఎంపీ రమేష్నాయుడు బహిరంగ లేఖ. జిల్లాలో ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్, మట్కా ఉన్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీ వేదికగా గళం విప్పారు. ఒక్క ప్రొద్దుటూరే కాదు జమ్మలమడుగు, పులివెందుల, కడప సబ్ డివిజన్లలోనూ అదే తంతు నడుస్తోంది. జమ్మలమడుగులో మరింత విస్తృతమైంది. కూటమి నేతల ప్రమేయంతో జూదంతోపాటు, మట్కా సైతం ఆడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక స్టేషన్ పరిధిలో ప్రధాన బుకీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తర్వాత వారిని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేశారు. ఈ కేసులో పోలీసులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాట అనధికారికంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో నాలుగు క్లబ్లు ఉంటే యఽథేచ్ఛగా ఒక్క క్లబ్లో నిరంతరాయంగా పేకాట ఆడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. గండికోటలో పేకాట ఆడుతున్న వారిని జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు తెలిసే పేకాట కొనసాగుతున్నట్ల్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో కొంతమంది డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ అధికారులు చట్టం, న్యాయం, ధర్మం పక్కకు తోసేసి ఖద్దరు నేతల మెప్పు కోసమే తాపత్రయం చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితులను కట్టడి చేసి సరైన మార్గంలో వ్యవస్థను నడిపించాలని ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ను ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. -
రైతన్న గోడును పట్టించుకోని ప్రభుత్వం
పులివెందుల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతన్నల గోడు పట్టించుకునే పరిస్థితిలో లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోరని ధ్వజమెత్తారు. ఆయన ఆలోచనంతా ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద పీట వేయడం గురించే ఉంటుందని ఆరోపించారు. తన అనుచరుల కు దోచిపెట్టేందుకే ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆ తీర్మాణానికి ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని లక్ష కోట్ల మెడికల్ కళాశాలల ఆస్తిని చంద్రబాబు ప్రైవేట్పరం చేయడానికి పూనుకున్నాడన్నాని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అంటూ డబ్బా కొట్టుకుని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. మరోవైపు రైతన్నల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. మరోవైపు రైతులకు పండించుకోవడానికి ఎరువులు, యూరియాను సైతం ఈ ప్రభుత్వం అందజేయడంలేదన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఎల్లో మీడియా ద్వారా ఏదో సాధించినట్లుగా దుష్ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. -
కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపేనా !
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రీవెన్స్ సెల్ ‘స్పందన’ పేరు తొలగించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)గా మార్పు చేసింది. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ అర్జీల పరిష్కారంపై మాత్రం కనిపించడం లేదు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 88 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 37,829 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3996 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఫిర్యాదుల్లో అత్యధికభాగం రెవెన్యూ, పోలీసు, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, పాఠశాల విద్య, ఎస్పీడీసీఎల్, హౌసింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రూరల్ డెవలప్మెంట్, పౌరసరఫరాలు, ఆర్అండ్బీ వంటి శాఖల నుంచి వస్తున్నాయి.రెవెన్యూలో అత్యధికంపీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో రెవెన్యూశాఖ నుంచే అత్యధికంగా ఉన్నాయని, అందులో ఆర్వో ఆర్కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదుల పరిష్కారంలో ఆడిట్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ దాని ఫలితాలు ఎక్కడా కనిపించలేదు. రెవెన్యూశాఖను పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుస్తామని ప్రకటనలు గుప్పించడం మినహా ఆచరణలో చేస్తున్నది మాత్రం శూన్యం. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కారమే ఇందుకు నిదర్శనం. రెవెన్యూశాఖలో ఇప్పటివరకు మొత్తం 14,289 అర్జీలు వచ్చాయి. ఇందులో 2,196 పరిష్కారానికి నోచుకోలేదు. అలాగే సర్వే సెటిల్మెంట్ అండ్ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 7170 అర్జీలు వచ్చాయి. పోలీసుశాఖకు సంబంధించి 7718 ఫిర్యాదులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 2210 అర్జీలు వచ్చాయి. ఇలా ఆయా శాఖల్లో పలు అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రీ ఓపెన్ అవుతున్నవి కూడా అధికమే. కూటమి ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.కడప అగ్రికల్చర్ : కూటమి ప్రభుత్వానికి రైతులంటే గిట్టదని.. వ్యవసాయమంటే చిన్నచూపని మరోసారి రుజువైంది. ఇప్పటికే పంటకు మద్దతు ధర దక్కక.. సాగుకు యూరిక దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అవన్నీ దిగమింగుకుని రబీకి సిద్ధమవుతున్న రైతన్నకు ..ప్రభుత్వం నుంచి మద్దతు కరువైంది. సాగు వివరాలు.. ఎరువుల కేటాయింపు వంటి ప్రణాళిక సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరో ఆరు రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభంకానుంది. వ్యవసాయశాఖ ఇంత వరకు రబీ సీజన్కు సంబంధించిన సాగు ప్లానింగ్ సిద్ధం చేయలేదు. విత్తనాలను కేటాయించినా వాటి సబ్సిడీ, విత్తనాల ధరలను ఇంతవరకు పేర్కొనలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో కురుస్తున్న వర్షాలు...జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే రబీ సీజన్కు సంబంధించి కొంతమంది రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆరుతడి పంటలసాగుకు ముందు చాలా మంది రైతులు సత్తువ పంట వేస్తారు. కానీ జిల్లాలో ఎరువులు సరిగా దొరకడం లేదని రైతన్నలు వాపోతున్నారు. ముఖ్యంగా రబీలో అధిక విస్తీర్ణంలో జిల్లాలో శనగపంట సాగవుతుంది. దీంతోపాటు వేరుశనగ, మినుము, పెసర, నువ్వు వంటి పంటలను కూడా అధిక విస్తీర్ణంలోనే సాగు చేస్తారు. ముఖ్యంగా రబీ సీజన్ ప్రారంభంలో జిల్లా రైతులు శనగ సాగు చేస్తారు. ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనాలకు సంబంధించిన ధరలను కానీ, ఎంత శాతం మేర సబ్సిడీ అనే విషయాలను కేటాయించలేదు. మరి విత్తనాల కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అధికారులు విత్తనాలను ఎప్పుడు రైతు సేవా కేంద్రాలకు పంపిస్తారని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా విత్తనాల పంపిణీ చేపడితే ఆ విత్తనాలు ఎలాగుంటాయోనని రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది చాలా మేర శనగ విత్తనాలు సరిగా లేవని రైతులు పెదవి విరిచారు.212.3 మి.మీ వర్షపాతం...రబీ సాగుకు అక్టోబర్ కీలకం. రబీ మూడు నెలలకాలంలో 212.3 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అందులో అక్టోబర్ నెలలో అత్యధికంగా 132.1 మిల్లీమీటర్లు కురవాలి. ఇక నవంబర్ నెలలో 61.6 మి.మీ, డిసెంబర్ నెలలో 18.6 మి.మీ కురవాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగపంట సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్టోబర్ తొలి వారంలోనే ముందస్తుగా శనగపంటను విత్తుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ సారి ఖరీఫ్సాగు చేయలేని రైతులు రబీలో శనగ సాగు చేయనున్నారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అక్టోబర్లోనే అధి క విస్తీర్ణంలో పంటలు సాగయ్యేవి. ఆ నెల తొలి వారంలోనే 40 శాతం సబ్సిడీతో శనగవిత్తనాలు అందే విష యాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. విత్తనాల పంపిణీని త్వరితగతిన ప్రారంభించేందుకు సన్నాహాలు చేయా లని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.రోడ్డున పడ్డాం ఆదుకోండి శనగ విత్తనాలను ఎప్పుడిస్తారో... ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ పదునుకు మేమంతా ఎరువులను విత్తుకుంటాం. అక్టోబర్ 2 లేదా మూడవ వారం నుంచి శనగ పంటను సాగుచేస్తాం. నేను కూడా 12 ఎకరాల్లో శనగపంటను సాగు చేయనున్నా. ప్రభుత్వం ఇంతవరకు సబ్సిడీ, విత్తనాలను గురించే మా ట్లాడటం లేదు. మరి సబ్సిడీ శనగ విత్తనాలను ఎప్పుడి నుంచి ఇస్తారో. – శెట్టిపల్లి పవన్కుమార్రెడ్డి, పెద్దపసుపుల, పెద్దముడియం మండలం.నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే విత్తనాలను నాణ్యతతో కూడిన వి ఇవ్వాలి. గతేడాది రైతులకు ఇచ్చిన శనగ విత్తనాల్లో అక్కడక్కడ నాణ్యత సరిగా లేదు. దీంతో చాలా మంది రైతులు బయట నుంచి కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఈ ఏడాది అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – ఇరగంరెడ్డి చిన్న గంగిరెడ్డి, సోమపురం, రాజుపాలెం మండలంరైతులకు ఆందోళన అవసరం లేదుజిల్లాకు సబ్సిడీకి సంబంధించి శనగ, వేరుశనగ, ను వ్వులు, మినుములు, పెస ల విత్తనాలైతే వచ్చాయి. కానీ వాటి ధరలుకానీ, ఎంత సబ్సిడీ అనే విషయాలపై స్పష్టత లేదు. దీంతోపాటు రబీ సాగు ప్లానింగ్, ఎరువులు కూడా రాలేదు. త్వరలో అవికూడా వస్తాయి. రైతులు ఎవరు ఆందోళన చెందనవరం లేదు.– చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారిగత ప్రభుత్వంలో విశేష ‘స్పందన’కూటమి ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది తప్ప క్షేత్ర స్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. పారదర్శకంగా విచారణ జరిపి సంతృప్తకర స్థాయిలో పరిష్కారాలు లభించలేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తూ అర్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పందన పేరుతో అర్జీల స్వీకరణ, పరిష్కారం కూడా జరిగేది. ఈ కార్యక్రమానికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు సమర్పించే అర్జీలు మరింత నాణ్యంగా, వేగంగా పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించిందంటే అర్జీల పరిష్కారానికి గత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో అర్థమవుతుంది. -
జగన్మాతా.. నమోస్తుతే!
దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణలు కళకళలాడుతున్నాయి. బుధవారం ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల ఆలయంలో జగన్మాత శారదాదేవిగా దర్శనమిచ్చారు. జిల్లాలోని మిగతా ఆలయాల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులను కరుణించారు. – ప్రొద్దుటూరుకల్చరల్ -
రేషన్కార్డుదారులకు జీఎస్టీని మినహాయించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ కొన్ని వస్తువులకే అమలవుతోందని అందువల్ల రేషన్కార్డు ఉన్నపేదలకు జీఎస్టీని మినహాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. బుధవారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్ఠపోతున్నారన్నారు. వారిని ఆదుకోవడానికి ఆటో డ్రైవర్లకు రోజుకు 5 లీటర్ల ఇంధనాన్ని 50 శాతం సబ్సిడీతో అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానియల్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శులు బాల లక్షుమయ్యమాదిగ, కర్ణమాదిగ, డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు శివమణి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ పోస్టుల అక్రమాల సూత్రధారి ఆర్జేడీ శామ్యూల్
కడప సెవెన్రోడ్స్ : ఆర్సీఎం ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల్లో జరిగిన భారీ అక్రమాలకు ప్రధాన సూత్రధారి ఆర్జేడీ శామ్యూల్ను ప్రభుత్వం వెంటనే సరెండర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన ప్రజా సంఘాల జేఏసీ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. జేఏసీ చైర్మన్ ఆర్ఎన్ రాజ, వైస్ చైర్మన్ అంకన్న తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. మూసివేసిన పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయ పోస్టులు సృష్టించారని ఆరోపించారు. డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి తన రాజకీయ బలంతో విధులకు హాజరు కాకుండా ఆర్సీఎం యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్నారు. జాయినింగ్ ఆర్డర్స్ తారుమారు చేసిన జాన్సన్ చెట్టురిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జయవర్దన్, సుబ్బరాయుడు, శివకుమార్, డీఎం ఓబులేశు యాదవ్, కత్తి ఓబులేశు, సగిలి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి కృతజ్ఞతలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, కార్మికులకు రూ.18,600 వేతనం చెల్లించే విషయంలో స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, బద్వేలు, కడప, జీజీహెచ్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కొత్త అగ్రిమెంట్ ప్రకారం రూ.18600 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 11 వేల నుంచి రూ. 12వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీకి విన్నవించామన్నారు. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కాంట్రాక్టర్లో చలనం వచ్చిందన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు పవన్, సీఐటీయూ నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జరిమానా విధిస్తారా? మాఫీ చేస్తారా!
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే భారీగా కొండను తవ్వి గ్రావెల్ను తరలించారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో రావడంతో మైనింగ్శాఖ అధికారుల్లో కాస్త చలనం వచ్చింది. ఈనెల 10 వతేదీ జమ్మలమడుగు–ముద్దనూరు రహదారి అంబవరం పంచాయతీ పరిధిలో అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్ను ఎత్తుకు వెళ్లిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అనంతరం అక్రమంగా ఎంత మైనింగ్ చేశారో కొలతలు తీసుకున్నారు. వచ్చిన అధికారులు అక్రమ మైనింగ్పై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆ తర్వాత వారు చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు విధిస్తారని చెప్పి వెళ్లిపోయారు. 22 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం.. నంద్యాల–జమ్మలమడుగు 167వ జాతీయ రహదారి నిర్మాణం కోసం టెండర్ 80 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. అందులో జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో 22 కిలోమీటర్ల మేర పనులు చేయడంతోపాటు, పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనులను దక్కించుకున్న ఎస్ఆర్సీ కంపెనీ గత మూడు నెలలుగా పనులు ప్రారంభించింది. రోడ్డు పనుల కోసం కావలసిన గ్రావెల్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇప్పటికే దాదాపు సగానికి పైగా పనులు పూర్తి చేశారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. రహదారి నిర్మాణం కోసం కావలసిన గ్రావెల్ను కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం కొండను తవ్వి రహదారి నిర్మాణం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజుకు రెండు వందల టిప్పర్ల వంతున అక్రమంగా గ్రావెల్ను తీసుకు వెళ్లారు. ఇదంతా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు తొంగి చూడని పరిస్థితి ఉంది. అధికారులు దాడులు చేసి అక్రమంగా తవ్విన గ్రావెల్ కొలతలు తీసుకుపోయిన మరుసటిరోజు నుంచే తిరిగి యథావిధిగా అక్రమ మైనింగ్ చేసి టిప్పర్లలో గ్రావెల్ను తరలిస్తున్నారు. చర్యలు తీసుకుంటారా.. ఉసూరు మంటారా! ఎస్ఆర్సీ కంపెనీ అక్రమంగా గ్రావెల్ తవ్విన ప్రాంతాల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆపై ఎంత మైనింగ్ ద్వారా గ్రావెల్ తరలించారో కొలతలు తీసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు ఎవ్వరూ సహకరించకపోయినా వారే కొలతలు వేసుకుని పోయారు. ప్రస్తుతం 15 రోజులకు పైగా అవుతున్న ఎస్ఆర్సీ కంపెనీపై ఎలాంటి చర్యలకు సిఫారసుగాని, అక్రమ మైనింగ్ చేసి గ్రావెల్ను తరలించినందుకు జరిమానాలు కానీ విధించలేదు. భారీ స్థాయిలో అక్రమంగా గ్రావెల్ను తరలించినా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించకపోవడం కేవలం వచ్చాము.. పోయాము అన్న చందంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఆర్సీ అక్రమ తవ్వకాలపై మీనమేషాలు లెక్కిస్తున్న మైనింగ్శాఖ -
ఆస్తులు అటాచ్మెంట్ చేసినందుకే వేణుగోపాల్రెడ్డి హత్య
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఐదు రోజుల క్రితం జరిగిన ఫైనాన్షియర్ వేణుగోపాల్రెడ్డి హత్య కేసులో నింతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు తమ ఆస్తులను కోర్టులో అటాచ్మెంట్ చేశాడనే కోపంతో ఈ హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురితో పాటు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఎస్డీపీఓ కార్యాలయంలో డీఎస్పీ భావనతో కలసి జిల్లా ఎస్పీ అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న కొండా వేణుగోపాల్రెడ్డి ఈ నెల 19న రాత్రి కిడ్నాప్నకు గురయ్యాడనే సమాచారం రావడంతో రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ అరుణ్రెడ్డి వేగంగా స్పందించారు. కిడ్నాప్ అయిన వ్యక్తిని ప్రాణాలతో కాపాడాలనే ఉద్దేశంతో డీఎస్పీ భావన ఆధ్వర్యంలో ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేసీ రాజు, రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులోని అనుమానితులను గుర్తించి వారి ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టెక్ అవుట్స్ ద్వారా నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న చాపాడు సమీపంలోని కుందూ వంతెన వద్ద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్తుల అటాచ్మెంట్ ఆర్డర్ పొందడంతోనే.. మృతుడు వేణుగోపాల్రెడ్డి 30 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసేవాడు. ప్రొద్దుటూరులో చాలా మందికి వడ్డీకి అప్పులిచ్చాడు. సకాలంలో చెల్లించని వారిపై కోర్టులో సివిల్ దావాలు వేసి వసూలు చేసుకునేవాడు. డబ్బులు కట్టలేని వారి ఆస్తులు అటాచ్మెంట్ కోరేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన వెన్నెపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డిలు కూడా వేణుగోపాల్రెడ్డి వద్ద పెద్ద మొత్తంలో వడ్డీకి తీసుకున్నారు. డబ్బు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో అతను వారిద్దరి ఇళ్లపై అటాచ్మెంట్ ఆర్డర్ను కోర్టు ద్వారా పొందాడు. దీంతో కోపంతో రగిలిపోయిన వాళ్లిద్దరూ వేణుగోపాల్రెడ్డిపై కక్ష పెంచుకొని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా 2016లో బాకీ డబ్బు విషయమై జరిగిన గొడవలో కొండా వేణుగోపాల్రెడ్డిపై లక్ష్మిరెడ్డి కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో లక్ష్మిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్లో హత్యకు వ్యూహ రచన.. వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డిలు రియల్ ఎస్టేట్ చేస్తూ హైదరాబాద్లోని పఠాన్ చెరువు ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. వారి వద్ద అసిస్టెంట్గా పని చేస్తున్న బోయిని నగేష్తో వేణుగోపాల్రెడ్డి హత్య గురించి చర్చించారు. అతను హత్య చేయడానికి అంగీకరించడంతో ఖర్చుల కోసం అతనికి పలు దఫాలుగా రూ. 70 వేలు ఇవ్వడంతో పాటు జీవనోపాధికోసం ఏదైనా వ్యాపారం పెట్టిస్తామని చెప్పారు. దీంతో నగేష్ తన మిత్రుల ద్వారా ఫైనాన్షియర్ను హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను హైదరాబాద్ నుంచి లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు నాలుగు సార్లు ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి వేణుగోపాల్రెడ్డిని చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఈ నెల 19న వేణుగోపాల్రెడ్డిని చంపేసి మృతదేహాన్ని కామనూరు బ్రిడ్జిపై నుంచి కుందు నదిలో పడేశారు. దర్యాప్తులో భాగంగా కేసులోని నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డి, తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన బోయిని నాగేష్ అలియాస్ హర్ష, లైని అజయ్కుమార్, హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతలచెరువు ప్రణయ్ కుమార్, మియాపూర్కు చెందిన కొత్త శివప్రసాద్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారుతి వేగనార్ కారు, హోండా యాక్టివా స్కూటీ, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని నిందితుడు బోయిని నగేష్పై 2022లో మెదక్ జిల్లా అల్లదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదైంది. రూరల్ పోలీస్ బృందానికి ఎస్పీ ప్రశంస వేణుగోపాల్రెడ్డి హత్య కేసును త్వరిత గతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు డీఎస్పీ, ప్రొద్దుటూరు రూరల్ పోలీసు బృందాన్ని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. బృందంలోని రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐలు అరుణ్రెడ్డి, కేసీ రాజు, రాజుపాళెం ఎస్ఐ కె వెంకటరమణ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా అధిక వడ్డీలకు డబ్బులిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫైనాన్షియర్ హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి సహా.. నలుగురు తెలంగాణా రాష్ట్రానికి చెందిన కిరాయి హంతకులు అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
కారు ఢీ కొని బాలిక మృతి
చాపాడు : మండల పరిధిలోని చిన్నగురువళూరు గ్రామంలోని దళితవాడ వద్ద రోడ్డుపైకి ఆడుకునేందుకు వచ్చిన బాలిక గొల్లపల్లె దర్శిని(6)ని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలికను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లెకు చెందిన రాజు తన భార్య, కూతురుతో కలసి మండలంలోని చిన్నగురువళూరులోని తన బంధువుల ఇంట్లో బుధవారం జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బాలిక దర్శిని రోడ్డుపైన ఆడుకుంటుండగా దీనిని గమనించని డ్రైవర్ కారును రివర్స్ చేసుకుంటుండగా ప్రమాదశాత్తు బాలికను ఢీ కొంది. ఆరేళ్ల చిన్నారి కారు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిపేటలో నివాసముంటున్న పఠాన్ నసీం ఖాన్ (42) మానసిక ఆవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతురాలికి గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు వివాహం కూడా చేసింది. గత 8 సంవత్సరాల క్రితం ఆరిఫుల్లా ఖాన్ తో రెండవ వివాహం జరిగింది. అప్పటినుంచి ఆరిఫుల్లాఖాన్ కువైట్కు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మృతురాలికి డబ్బులు పంపకపోవడం, అనుమానంగా ప్రవర్తించడంతో మానసిక వేదనకు గురైంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించినప్పటికి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ పేర్కొన్నారు. అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఏఓ విజయ్కుమార్కు డీవైఎఫ్ఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల టీచర్లు దసరా సెలవుల్లో స్కూలుకు రాకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపుపై సమీక్షకడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో బుధవారం న్యాయసేవా సదన్లో ‘హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డివిజన్ అడిషనల్ ఎస్పీ, కడప డీఎస్పీ, కడప, రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. కమ్యూనిటీ సైన్సు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ‘కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్‘ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేవీకే కో ఆర్డినేటర్ అంకయ్యకుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి తెలిపారు. ఠీఠీఠీ. ్చుఽజట్చఠ. ్చఛి. జీుఽ వెబ్సైట్లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 30 వరకు గడువు ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
బోధనలో కృత్రిమ మేధను ఉపయోగించాలి
కడప ఎడ్యుకేషన్ : కృత్తిమ మేధను బోధన, పరిశోధనలో వినియోగిస్తే విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు సృషి్ాట్స్తరని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ఉషా విభాగం ఆధ్వర్యంలో ‘క్రియాశీల బోధన కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాలు, సాంకేతిక పద్ధతులు‘ అనే అంశంపై జాతీయ స్థాయి ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ సాంకేతిక విధానాలు విద్యార్థులు, అధ్యాపకులకు జ్ఞానం పెంపొందించడానికి సహాయపడతాయన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పుత్తా పద్మ మాట్లాడుతూ కోవిడ్–19 మహమ్మారి కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అలవాటు అయ్యాయన్నారు. వైవీయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జి.వి. రమేశ్ బాబు, పీఎం ఉష ప్రాజెక్ట్ సమన్వయకర్త డాక్టర్ టి. చంద్రశేఖర్ మాట్లాడారు. డాక్టర్ ఎస్. సునీత, డాక్టర్ కె. లలిత, డాక్టర్ పి. సరిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతకు ’విజిబుల్ పోలీసింగ్’
కడప అర్బన్ : జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ’విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ● అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ● ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ● రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ● సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ● విజిబుల్ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజల మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
మైదుకూరు : నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్ హెచ్చరించారు. బుధవారం ఆయన మైదుకూరులోని సిండికేట్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ఎరువులను కొనుగోలు చేశాక తప్పనిసరిగా వారికి బిల్లులు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ బాల గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని శివపురం, డయాంఖాన్ పల్లె గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి బాల గంగాధర్ రెడ్డి రైతులు సాగు చేసిన ప్రతి పంటను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏఓ సూచించారు. ఈనెల 30వ తేదీ లోపు పంట నమోదు చేసుకోవచ్చన్నారు.జిల్లా వ్యవసాయాధికారి చంద్ర నాయక్ -
మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహనం కోల్పోయి మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. మంత్రి లోకేష్ తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటికరణ విషయంలోనూ బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ చేసిన వ్యాఖ్యలు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె. శివ యాదవ్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ఎస్. బాదుల్లా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి నరసయ్య, వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి క్రిష్ణ, సుబ్బరాయుడు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామ్ -
మృత్యువులా దూసుకొచ్చిన లారీ
● ఒకరి మృతి, మరొకరికి గాయాలు ● గువ్వలచెరువు ఘాట్లో దుర్ఘటనచింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ జాతీయ రహదారిపై రాయచోటి వైపు నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవహనాన్ని ఢీకొనడంతో కొప్పల లక్షుమయ్య (60) మృతి చెందాడు. కొప్పల. ఈశ్వరయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి ఎలక్ట్రికల్ పరికరాలతో కూడిన గూడ్స్ లారీ వేగంగా రావడంతో నాలుగో మలుపు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద లారీని డ్రైవర్ అదుపుచేయలేక లారీ డ్రైవర్ కిందికి దూకేశాడు. ఆ సమయంలో రోడ్డుకు అవతలవైపున ఎదురుగా గువ్వలచెరువు వెపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఈశ్వరయ్య గమనించి ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న కొప్పల లక్షుమయ్యను లోయవైపు ఈడ్చుకుపోగా కుడి కాలు, కుడి చేయి తెగి పడి, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్రవాహనంలోని మరో వ్యక్తి కొప్పల ఈశ్వరయ్యకు గాయలయ్యాయి. లారీ డ్రైవర్ లారీ లోయ వైపు దూసుకెళ్లే క్రమంలో లారీ నుండి ముందే దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడినవారిని పోలీసులు 108 వాహనాల ద్వారా కడప రిమ్స్కు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన లక్షమయ్య, గాయపడిన ఈశ్వరయ్య సమీప బంధువులే. వీరిది లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లె రామాపురం గ్రామం. కడపలో ఉన్న తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. మృతుని బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని తీవ్రంగా విలపించారు. సంఘటన స్థలాన్ని చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, సిబ్బంది పరిశీలించారు. -
ఐకార్ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
పులివెందుల : జాతీయ స్థాయిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) నిర్వహించిన పీజీ (ఏఐఈఈఏ) పరీక్షలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవ తెలిపారు. పట్టణంలోని డీన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఐకార్ ఫలితాల్లో కళాశాలకు చెందిన ప్రియాంక దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో సాయిదీప్తి 22, షర్మిల 42, ఎస్సీ కేటగిరీలో షకీనా 43, హర్షవర్ధన్ 81, ఎస్టీ కేటగిరీలో నితిన్ 24వ ర్యాంకులు సాధించారన్నారు. రాబోయే సంవత్సరంలో ఈ పోటీ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ ఏడాది నుంచి పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఈనెల 30వతేదీలోగా ఇవ్వాలన్నారు. -
సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వకుండా వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. డీఈఓ షంషుద్దీన్ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచింగ్ స్కిల్, వర్క్షాప్, డెవలప్మెంట్ పేరుతో నారాయణ, చైతన్య, జీఎంఆర్ విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవుల్లో స్కూల్కు రావాలని, లేకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ్, పెద్దన్న పాల్గొన్నారు. -
ఫైనాన్సియర్ను చంపితే బిజినెస్ పెట్టిస్తా
● కిరాయి హంతకులకు ఆఫర్ ఇచ్చిన సూత్రధారులు ● వారితోనే వేణుగోపాల్రెడ్డిని హత్య చేయించిన దుండగులు ప్రొద్దుటూరు క్రైం : సుపారీ కల్చర్ ప్రొద్దుటూరుకు ప్రాకింది. తెలంగాణా రాష్ట్రం నుంచి కిరాయి హంతకులను పిలిపించి ఫైనాన్షియర్ను హత్య చేయించారు. ఇటీవల జరిగిన ఫైనాన్స్ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి హత్య పట్టణంలో సంచలనం కలిగించింది. హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకులు ఈ హత్య చేశారని తెలియడంతో ప్రొద్దుటూరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముంబై, డిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాలకు పరిమితమన సుపారీ కల్చర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రాకడంతో పసిడిపురిలో అలజడి మొదలైంది. ఈ నెల 19న రాత్రి వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే హత్యకు ప్రణాళిక.. వేణుగోపాల్రెడ్డి హతమార్చిన ఘటనలో ఇరువురు బాకీ దారులే ప్రధాన సూత్రదారులు. ఇరువురు వడ్డీ వ్యాపారిని హత్య చేయడానికి మూడు నెలల క్రితమే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక వ్యక్తి గతంలో పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో చిల్లర దుకాణం నిర్వహించాడు. దుకాణాన్ని ఎత్తేసిన అతను కొన్ని నెలల నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్కు వెళ్లినప్పుడు ఆ ప్లాట్లోనే ఉండేవాడు. హైదరాబాద్లో ఉన్న మరో యువకుడిని అతడు సహాయకుడిగా పెట్టుకున్నాడు. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు వెళ్లిన ప్రతిసారీ సహాయకుడే పికప్ చేసుకొని ప్లాట్కు తీసుకెళ్లేవాడు. సహాయకుడికి డబ్బు అవసరం ఉండటంతో రూ.80 వేల వరకూ ఇచ్చాడు. నెల రోజుల క్రితం తనకు ఒక పని చేసి పెట్టాలని బాకీ దారు తన సహాయకుడిని అడిగాడు. శ్రీఒక వ్యక్తిని చంపాలి.. ఈ పని చేసి పెడితే నీ లైఫ్ సెటిల్ చేస్తా.. లేదంటే బిజినెస్ పెట్టిస్తాశ్రీ అన్నాడు. అతని ఆఫర్కు హైదరాబాదీ అంగీకరించాడు. తొలిసారి వినాయకచవితి పండగ సమయంలో హైదరాబాద్ నుంచి తన సహాయకుడ్ని తీసుకొని ప్రొద్దుటూరుకు వచ్చాడు. జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం ప్లాట్ వద్దకు వెళ్లి ఫైనాన్షియర్ ఇల్లు చూపించాడు. స్కూటీలో ఇంటికి వచ్చి పోయే సమయంలో పలుమార్లు వేణుగోపాల్రెడ్డిని చూపించి గుర్తు పెట్టుకోమని చెప్పాడు. దీంతో అతడి సహాయకుడు హైదరాబాద్కు వెళ్లి తనకు తెలిసిన మరో ముగ్గురిని వెంట పెట్టుకొని ఈ నెల 19న కారులో ప్రొద్దుటూరుకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సూత్రదారులు ఇద్దరు కిరాయి హంతకులకు ఖర్చుల కోసం రూ. 23 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే రోజు రాత్రి వేణుగోపాల్రెడ్డి స్కూటీలో ఇంటికి వెళ్లే సమయంలో అడ్డగించి, కళ్లలో కారం చల్లి హైదరాబాద్కు చెందిన హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేయడానికి కిరాయి హంతకులు పెద్ద మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్గా లేదా ఏక మొత్తంలో డబ్బు తీసుకొని పనిముగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం సూత్రధారులు హైదరాబాదీ కిరాయి హంతకులకు బిజినెస్ పెట్టిస్తాననే ఆశ చూపి వేణుగోపాల్రెడ్డిని చంపించారు. ఇద్దరు బాకీదారులు ఫైనాన్షియార్ను హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇతర బాకీదారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 23పిడిటిఆర్53– -
అటవీ శాఖ గార్డు.. టీచర్ అయ్యాడు
కడప సిటీ : అటవీ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తూనే.. కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కఠోర సాధన చేసి డీఎస్సీలో 11వ ర్యాకు సాధించి భళా అనిపించాడు. పెండ్లిమర్రి మండలం యల్లటూరు గ్రామానికి చెందిన గుర్రంపాటి రాజశేఖర్రెడ్డి కడప రాజేశ్వరీ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. నిరుద్యోగం వెంటాడుతుందనే భయంతో అటవీ శాఖలో గార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఎంపికయ్యాడు. 17 ఏళ్లుగా వేంపల్లె అటవీ రేంజ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అనంతరం గార్డు ఉద్యోగం చేస్తూనే 2014, 2019లో డీఎస్సీ రాశాడు. 2019లో 14వ ర్యాంకు వచ్చినా ఆరు పోస్టులు ఉండడంతో ఎంపికకాలేదు. అనంతరం తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో గార్డు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్ష రాశాడు. 11వ ర్యాంకు సాధించడంతో ఓసీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా ఎంపికయ్యాడు. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధించానని రాజశేఖర్రెడ్డి సాక్షికి తెలిపారు. 2019 డీఎస్సీకి ముందు 42 ఏళ్ల వయోపరిమితిని 2019లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచిందని, దీంతో వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడిందని అతడు తెలిపారు. 11వ ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం -
పండితుల పదోన్నతులపై ఆరేళ్లుగా ఊరించి.. ఇపుడు అట్టకెక్కించారు. భాషోపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా ఏడాదికోమారు భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీలు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరానికి జిల్లాలు మార్చి బదిల
● పదోన్నతుల కోసం పదేళ్లుగా పండితుల పాట్లు ● ఏడాదికోమారు మారుమూల ప్రాంతాలకు బదిలీ ● సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం.. పండితులకు శాపం బద్వేల్ : రాష్ట్ర వ్యాప్తంగా 2019లో భాషోపాధ్యాయుల(తెలుగు,హిందీ,ఉర్దూ,సంస్కతం,కన్నడ) పదోన్నతులు జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది మిగిలి పోగా వైఎస్సార్ కడప జిల్లాలో 114 మంది డీఈఓ పూల్లో ఉన్నారు. వీరిలో తెలుగు పండితులు 68, హిందీలో 33, ఉర్దూలో 13 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిది విద్యా శాఖలో ఏ విభాగమో అర్థంకాకుండా పోయింది. ఫలితంగా ఏడాదికో మారు జిల్లా నుంచి జిల్లాకు, కనీస వసతులు లేని మారుమూల గ్రామాలకు బదిలీ చేసి బలితీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుకానివైనం ఆరేళ్లుగా ఏడాదికోమారు బదిలీలతో విసిగి వేసారిన భాషాపండితులు ఏదో చోట ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది బాషోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వారి బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి మన్మధరావు వెంటనే పదోన్నతులు కల్పించాలని, సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 20 డిసెంబర్, 2024లో తీర్పు ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీచేసి తొమ్మిది నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. పదోన్నతుల అమలులో తాత్సారం చేయడంతో భాషోపాధ్యాయులు నష్టపోతగున్నారు. తమకు పదోన్నతులు కావాలని సెకండ్గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం భాషా పండితులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2న స్టేటస్ కో ఎత్తివేసింది. ఉసూరుమనిపించిన ప్రభుత్వం: హైకోర్టు ధర్మాసనం స్టేటస్కో ఎత్తివేసిన వెంటనే భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించి సెప్టెంబర్ 4న (ఈ నెల) అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందనే ఆశతో బాషోపాధ్యాయులంతా డీఈవో కార్యాలయాల్లో డిక్లరేషన్ రాసిచ్చారు. తమకు పదోన్నతి ఉత్తర్వులు వస్తాయని ఆశపడే సమయంలో కూటమి ప్రభుత్వం మరల మెలికపెట్టి ఆ ప్రక్రియను ఆపేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు ఉన్న వారికి పదవీ విరమణ చేసేలోగా రెండు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. బాషా పండితుల విషయంలో దశాబ్ద కాలంగా ఇది అమలు చేయడంలేదు. ఇరవై ఏళ్ల కిందట చేరినవారు కూడా పదోన్నతి లేకుండానే పదవీవిరమణ పొందారు. -
అసభ్యకర పోస్టులు పెడితే కేసులు
కడప అర్బన్ : సామాజిక మాధ్యమాలు వేదికగా ఇతరులను రెచ్చగొట్టేలా, అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెడితే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికలు, అధికారులపై పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టినా, కులాలు, వర్గాలు, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా ఉంచి పర్యవేక్షిస్తామన్నారు. యువత సామాజిక మాధ్యమాలకు మంచికోసమే వినియోగించాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా బాధితులు ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన kadapasocialmedia@gmail. com, లేదా సెల్ నెంబర్ 9121100686కు నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. యవచ్చనీ ఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, ఎస్బీ డీఎస్పీ ఎన్.సుధాకర్, దారెడ్డి భాస్కర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
విద్యుత్ సరఫరాలో నష్టాలను తగ్గించాలి
కడప కార్పొరేషన్ : విద్యుత్ సరఫరాలో నష్టాలను పూర్తిగా తగ్గించాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్(టెక్నికల్) కె.గురవయ్య సూచించారు. కడప డివిజన్ కార్యాలయంలో కడప, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయి కేవలం 59.53% మాత్రమే ఉండడం ఆందోళనకరమన్నారు. వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పొందే అవకాశాన్ని ఆయన వివరించారు. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయని, రూ.98,000 వరకు సబ్సిడీ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లో వోల్టేజ్ సమస్యల నివారణకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయాలని, విద్యుత్ అంతరాయాలను అరికట్టి, నిరంతర సేవలు అందించాలన్నారు. అనంతరం బాలాజీనగర్ సబ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఎస్ఈ యస్.రమణ, హరిసేవ్యానాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు. -
తిరస్కరించిన వారినే.. తీసుకొచ్చారు
● టీడీపీ కడప నగర నూతన కమిటీ నియామకం ● పార్టీకి పనిచేసేన వారిని పక్కన పడేశారని అసంతృప్తి ● తమ్ముళ్ల తిరుగుబాటు వేళ నిర్ణయంపై ఆగ్రహం కడప రూరల్ : కడప నగరం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పాతకడప కృష్ణారెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కమలాపురానికి వెళ్లి తమకు న్యాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని శరణు కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అనంతరం పార్టీని ఫిరాయించిన కార్పొరేటర్లు కూడా పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడప నగర నూతన కమిటీని నియమించారు. నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి గౌతమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముక్కా సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బోనం వెంకటేశ్, గండ్లూరి బాబా ఫకృద్దీన్, ఇప్పిరాల పూర్ణచంద్రరావు, కార్యదర్శులుగా కోనేటి వెంకటేశ్ ఆచారి, గోగుల శ్రీనివాసులు, జి.నరేష్, కోశాధికారిగా మలిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలను నియమించారు. దీంతో తమ్ముళ్ల వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైౖంది. ఇదివరకే నగర కమిటీ వ్యవహారంపై పార్టీ అఽధిష్ఠానం కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. చాలా మంది అభ్యర్ధుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కమిటీని అధిష్టానం ‘రిజక్ట్’ చేసిందనే ప్రచారం జరిగింది. తీరా చూస్తే వారినే కొత్త కమిటీలో చేర్చడంతో తమ్ముళ్ల అసంతృప్తి సెగలు ఎగసిపడ్డాయి. పార్టీ ఫిరాయించిన వారితోపాటు టీడీపీలో గుర్తింపు లేని వారికి చోటు కల్పించడం దారుణమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాము తిరస్కరించినా, తమ పంతం, ఆధిపత్యం కోసం కమిటీ నియమించారని తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన కార్యకర్తలను పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు. తప్పు చేయొద్దంటే...తిరుగుబాటు చేస్తావా – పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడిన కార్పొరేటర్లు పాత కడప కృష్ణారెడ్డి చేయని అక్రమాలంటూ లేవు.. టీడీపీలో ఉంటూ ఆయన ఒక్కడే లబ్ధి పొందాడు.. ఇపుడు తప్పు చేయవద్దంటే తిరుగుబాటు చేస్తున్నాడు అని పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు సూర్యనారాయణ, సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి సొసైటీ డైరెక్టర్గా పదవి అనుభవిస్తూ పార్టీపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కాజేసిన నైజం కృష్ణారెడ్డిదని దుయ్యబట్టారు. డీలర్లను కూడా వదలిపెట్టలేదన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి తాము టీడీపీలో చేరామని, ఇపుడు అభివృద్ధిచూసి ఓర్వలేక కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వద్ద ఉంటూ పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వారు ఆరోపించారు. కడపలో ఏదో జరుగుతోందని కృష్ణారెడ్డి తన అనుచరులను వెంటేసుకుని పెద్దాయన పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లారన్నారు. ఆయనకు కడపలో జరుగుతున్న అంశాలపై పెద్దగా తెలియదన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యం అక్రమాలకు పాల్పడే నువ్వు మమ్మల్నే బెదిరిస్తావా....రా చూసుకుందాం అంటూ కృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో జఫ్రుల్లా, చల్లా రాజశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. దసరా ఉత్సవం
జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. విశేష అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ప్రత్యేక సెట్టింగులతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం నుంచి ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలలో తీర్చిదిద్దుతున్నారు. – సాక్షి నెట్వర్క్, కడప ప్రొద్దుటూరు కల్చరల్ : రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో భవాని దేవి దేవుని కడపలో శేష వాహనంపై కడప రాయుడు -
నేడు రౌండ్టేబుల్ సమావేశం
కడప రూరల్: ప్రజా సంఘాలు, మేధావుల ఆధ్వర్యంలో బుధవారం కడప వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పంతుల సంపత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో ప్రజా సంఘాల నేతలు, వైద్యులు, ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కమలాపురం: కమలాపురం పెద్దదర్గాగా వెలుగొందుతున్న దర్గా–ఏ–గఫారియాలో బుధవారం రాత్రి దస్తగిరి షా ఖాద్రి బర్సీ నిర్వహిస్తున్నట్లు దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారికి పూల చాదర్లు సమర్పించి, అనంతరం గంధం ఎక్కిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. రాత్రి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు విరివిగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ అన్నారు. మంగళవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, వ్యవసాయ, డ్వామా అధికారులకు నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.ఓ లక్ష్యాల సాధనకు అందరూ నడుం బిగించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఇండికేటర్స్లో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ద్యం విషయంలో ఇప్పటికీ అత్యధికంగా వెనుకబడి ఉండడం బాధాకరమని వివరించారు. ఇప్పటికై నా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డీపీఓ రాజ్యలక్ష్మి, డీడీఓ మైథిలి తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ( ఏపీఓఎస్ఎస్ )లో ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్లకు అపరాధ రుసుముతో గడువు పొడగించినట్లు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ చెప్పలి రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరంలో రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకోవచ్చన్నారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపు లకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కోర్సులో చేరదలచిన విద్యార్థులు రిమ్స్ రోడ్డులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశా లను సందర్మించి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ కోర్సులలో చేరేవారికి 16 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని, పదవ తరగతి మార్కు ల జాబితా, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు బు క్కు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఫోటో తీసుకొని నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. వివరాలకు 91820 99672 సంప్రదించాలని కో ఆర్డినేటర్ రాజారావు తెలిపారు. -
వంతెన.. ప్రమాదం అంచున
రాజంపేట: గుత్తి–రేణిగుంట డబ్లింగ్లో ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం మృకుందాశ్రమం వద్ద ఉన్న రైల్వేవంతెన ప్రమాదకరంగా మారింది. ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం.. ఉమ్మడి కడప జిల్లా మీదుగా వెళుతోంది. ఈ మార్గంలో ఒంటిమిట్ట–భాకరాపేట రైల్వేస్టేషన్ల మధ్య మృకుందాశ్రమానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి డేంజర్గా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జి కడప ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. నిత్యం రైళ్ల రద్దీ భారం ఈ బ్రిడ్జిపై నిత్యం రైళ్ల రద్దీభారం పడుతోంది. ఉమ్మడి కడప జిల్లా మీదుగా నిత్యం 30 రైళ్లకుపైగా రాకపోకలు సాగిస్తుంటాయి. గూడ్స్రైళ్లు 40కి పైగా వెళ్తుంటాయి. మృకుందాశ్రమం సమీపంలో ఉన్న బ్రిడ్జి స్థితిగతిని పరిశీలిస్తే.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. వంతెన పైన, ట్రాక్ కింది భాగంలో నెర్రెలు ఏర్పడ్డాయి. వంతెన పొడవు ఇదే స్థితి కనిపిస్తోంది. అక్కడ మొక్కలు సైతం మొలవడంతో మరింత దెబ్బతింటోంది. అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం ఈ వంతెనను పునర్నిర్మాణం చేపట్టకపోతే.. పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాల సీజన్లో నీటి ఊట ఏర్పడి బ్రిడ్జిని మరింతగా దెబ్బతీస్తోంది. ఫలితంగా బ్రిడ్జి స్లాబ్, గోడలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా ఉంది. ఇప్పటికై నా రైల్వే ఇంజినీరింగ్ శాఖ ఈ బ్రిడ్జిని బాగు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
యూసీఐఎల్ సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: యూసీఐఎల్లో సమస్యలను పరిష్కరించి, పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ, ఇతర సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలని పులివెందుల ఆర్డీఓను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని పునరావాసం కోరుతున్న కే కే కొట్టాల గ్రామాల ప్రజలు, రైతులతో మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. గతంలో ప్రాజెక్టు కోసం మంజూరైన భూములను త్వరతిగతిన వారికి అప్పజెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. యురేనియం గనుల వల్ల పరిసర గ్రామాలు ప్రభావితం కాకుండా చూడాలన్నారు. యురేనియం ప్రాజెక్టు (టైలింగ్) వ్యర్థపదార్థాల నిల్వలు, స్టోరేజ్ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ నవీన్ రెడ్డి , పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య , ఆర్ అండ్ బి డీఈ మాధవి, రెవెన్యూ అధికారులు, పర్యావరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్లను సిద్ధం చేయాలి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్లను మండలాల్లో కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ జేసీ అదితిసింగ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా, తాజాగా విద్యార్థులకు అందించే దిశగా ప్రతి మండలంలో ఒక ప్రధాన పాఠశాలలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి, అన్ని పరికరాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 2 నాటికి పూర్తి చేసి కిచెన్ షెడ్లను నిర్వహణలోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్ హాలులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు, ఇఫ్కో(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్) ప్రతినిధులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద వేముల, వేంపల్లి, ఒంటిమిట్ట మండలాలలో ఇప్పటికే అరటిపంటల్లో ఆధునిక, సాంకేతిక పద్ధతులను అవలంబిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో దాదాపు 500 మంది రైతులు ఈ విధానాన్ని పాటిస్తూ మంచి క్వాలిటీ పంటను ఉత్పత్తి చేసి తమ ఉత్పత్తులను ఆ గ్రామంలోనే విక్రయించేలాగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోవు కాలంలో వీటిని జిల్లా అంతటా విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, ఏపీ ఎంఐపీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హామీ ఇచ్చారు.. అమలు మరిచారు
● ఫీజు రియింబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ● 16 నెలలుగా కరుణ చూపని కూటమి ప్రభుత్వంకూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. సకాలంలో ఫీజులు చెల్లించకుండా ఏడిపిస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయిబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.అమలు మరిచారని డిగ్రీ చదివే విద్యార్థులు ఫీజుల కోసం రోడ్డెక్కి ఆందోళన బాటపడ్డారు. కడప రూరల్/ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా 76 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. ఇప్పటికే చివరి సంవత్సరం విద్యార్థులు వేలాది మంది టీసీలు తీసుకుని బయటికి వెళ్లారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా వీరికి కేవలం ఒక టర్మ్మాత్రమే అంటే రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు మాత్రమే చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మిగతా సొమ్మును ఇంతవరకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. ప్రధానంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు టీసీలు తీసుకునే సమయంలో ఫీజులు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఫీజుల కోసం ఆందోళన డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు సకాలంలో చెల్లించాలని ఇదివరకే ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఫీజులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం ర్యాలీలు, ఆందోళనకు దిగాయి. -
పొలం యజమానిపై హత్యాయత్నం
మైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. వాహనదారులకు నాణ్యమైన సేవలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్దారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని జిల్లా ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్ ఎం వీర్రాజు తెలిపారు. సోమవారం జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి సంబంధించి వాహన్ పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేస్తామన్నారు. ఈకైవెసీ కోసం చేసుకున్న దరఖాస్తులు 375 పెండింగ్లో ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వాహన యాజమానులు తమ పనులకు సంబంధించి వాహన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పనులు పూర్తి కావట్లేదని భావించిన వారు బుధ, గురు వారాలలో ఉదయం 10 నుండి 1 గంట వరకు తనను నేరుగా కలవచ్చని తెలిపారు. విద్యుత్షాక్తో లైన్మెన్కు తీవ్ర గాయాలుబద్వేలు అర్బన్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల మోర్ సూపర్ మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు సోమవారం మరమ్మత్తులు చేస్తూ ఓ లైన్మెన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నివసిస్తున్న కె.నాగసుబ్బారెడ్డి 17 ఏళ్లుగా విద్యుత్శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. మోర్ సూపర్మార్కెట్ వద్ద ఉన్న ట్రాన్స్పార్మర్ మరమ్మత్తులకు గురైందన్న ఫిర్యాదు అందుకున్న ఆయన పరిశీలించేందుకు వెళ్లాడు. ఎల్సీ తీసుకుని మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయనతో పాటు ఉన్న జూనియర్ లైన్మెన్లు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజంపేట రీజినల్ మేనేర్ సుశాంత్ కుమార్ స్వరూప్, కడప ఆర్ఎం శ్రీనివాస ప్రసాద్, ఎల్డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్డీర్లో నర్సిరెడ్డి, శివకుమార్లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, బ్రాంచ్ మేనేజర్లు సురేష్కుమార్, ఎం.కళ్యాణి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్కుమార్, వెంకటసాయి ఎంటర్ప్రైజస్ సంస్థ ఎండీ వెంకట్, జాన్డీర్ సేల్స్ మేనేజర్ దుర్గా మునికుమార్ పాల్గొన్నారు. -
కాశినాయనవాసికి అరుదైన గుర్తింపు
కాశినాయన : అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన ప్రతిభావంతులైన టాప్ 2025 శాస్త్రవేత్తల జాబితాలో వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన కడియాల చంద్రబాబునాయుడు వరుసగా 6 సారి చోటు దక్కించుకున్నారు. వ్యవసాయకుటుంబంలో పుట్టిన ఈయన బెంగళూరు గీతండీమ్డ్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పలు పరిశోధనరంగాల్లో వివిధ శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనా పత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగి వారి పరిశోధన పత్రాలను అనుసరిస్తూ సూచికలు వాడటం వల్ల ఈ గుర్తింపును పొందారు. -
గోవిందా.. కాపాడు..!
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుపై ఆ పార్టీ తమ్ముళ్లు విసిగిపోయారు. న్యాయం కోసం తిరుగుబావుటా ఎగురవేశారు. పాతకడప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కార్యకర్తలు బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ మేరకు సోమవారం స్థానిక దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పాదాల చెంత తమను కాపాడాలంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగడాలను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డిల రాజ్యాంగం నడుస్తోందన్నారు. నాడు ఎమ్మెల్యేగా మాధవీరెడ్డికి టిక్కెట్ ఇచ్చినపుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వద్దనుంచే ప్రచారం చేశామని, ఆమె గెలుపుకోసం కృషి చేశామన్నారు. నేడు ఈ పుణ్యస్థలం నుంచే ఆమె ఆగడాలు భరించలేక తిరుగుబాటు చేస్తున్నామని తెలిపారు. గెలుపుకోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను బయటపడేశారని అన్నారు. పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు. చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి, మాధవీరెడ్డి ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచిన తర్వాత తమ స్వరూపాన్ని బయటపెట్టారన్నారు. వారి దౌర్జన్యాల నుంచి పార్టీ కార్యకర్తలను కాపాడాలన్నారు. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుబ్బలక్షుమ్మ, చిప్పగిరి మీనాక్షి మాట్లాడుతూ పార్టీలో తమకు ఏనాడూ న్యాయం జరగలేదని వాపోయారు. అనంతరం వారు మాకు పెద్ద దిక్కుగా పుత్తా నరసింహారెడ్డి వ్యవహరించాలని కోరుతూ 20కి పైగా వాహనాల్లో కమలాపురం వెళ్లారు.సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతా – పుత్తా నరసింహారెడ్డితమను కలవడానికి వచ్చిన కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయనను కలిసిన కార్యకర్తలు కడప నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ఏకరువు పెట్టారు. తమకు పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపించాలని అభ్యర్థించారు. మాకు మీ వల్ల తప్పితే మరెవరి వల్ల న్యాయం జరగదని కోరారు. ఈ సందర్బంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ వేరొకరి నియోజకవర్గంలో జోక్యం చేసుకోలేనని, అయితే పార్టీ కార్యకర్తగా కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో వీరయ్య, శివరాం, కొండా సుబ్బయ్య, స్వర్ణమ్మ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. 119 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని నిర్ణీణ గడువులోపు పరిష్కరించాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పీజీఆర్ఎస్కు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీసీజీ డీఎస్పీ అబ్దుల్ కరీం, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్, విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అయినా జేఏసీ నేతలందరూ సంయమనం పాటించి ఎవరు చేసినా ఉద్యోగ కార్మిక సమక్షం కోసమే..ఎవరూ వ్యక్తిగత వాదనలకు పోకూడదని మైకులో చెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు. గ్యాస్ బిల్లుల స్కాంపై విచారణ జరిపించాలి రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఏ అధ్యక్షుడు కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్రాజేంద్రన్కు ఏఐఎస్ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : వివిధ కారణాలతో చనిపోతున్న న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉదయం కోర్టు పనిగంటల్లో సంతాపాన్ని తెలిపే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయ డాన్ని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులుఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్కుట్టి, సీనియర్ సివిల్ జడ్జి ప్రసూన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుయోధనతో కలిసి విధు లు బహిష్కరించడానికి గల కారణాలను తెలియజేసిన అనంతరం కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డిబాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజున ఉదయం. 10.30 గంటలకు సంతాపాన్ని తెలియజేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిందని అన్నారు. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాల ని భారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య, కడప జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఖాదర్బాషా డిమాండ్ చేశారు. రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆది వర్సెస్ సీఎం రమేష్
● రిత్విక్ కంపెనీ మేనేజర్పై ఆదివర్గం దాడి ● కార్యాలయం ధ్వంసం ● ఆదిపత్యపోరుతో గండికోట అభివృద్ధికి ఆటంకంసాక్షి టాస్క్ఫోర్స్ : ఇది నా అడ్డా. ఇక్కడ నేను తప్ప ఎవరూ పనులు చేయకూడదు. కాదని చేస్తే దాడులు తప్పవనే సంకేతాలను ఆది వర్గం సీఎం రమేష్ నాయుడుకు పంపుతోంది. ఇప్పటికే టి.కోడూరు వద్ద అదాని గ్రూప్ కంపెనీకి చెందిన పవర్ప్లాంట్ పనులు సబ్ కాంట్రాక్టర్ కింద సీఎం రమేష్ నాయుడు కంపెనీ చేజిక్కించుకోగా ఎమ్మెల్యే ఆది వర్గం కంపెనీకి చెందిన ప్రతినిధులు, అధికారులపై దాడులు చేసి భయంభ్రాతులకు గురి చేశారు. గండికోట టూరిజం అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను రూ.78 కోట్లతో రిత్విక్ కంపెనీ చేజిక్కించుకుంది. దీంతో ఆదినారాయణరెడ్డి, ఆయన వర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను శాసన సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో మరొకరు వచ్చి కోట్లాది రూపాయలు పను లు చేయడం ఏమిటని మదన పడుతున్నారు. ఎలాగైనా రిత్విక్ కంపెనీ ప్రతినిధులను తమ అదుపులోకి తెచ్చుకునే విధంగా గత కొంత కాలంగా గండికోటలో జరుగుతున్న పనులకు స్థానిక నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీంతో గండికోట గ్రా మంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ఆరు వాహనాల్లో వచ్చారు.. దాడి చేశారు ఆది వర్గానికి చెందిన వారు ఆరు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీపై దాడులు చేశారు. సోమ వారం మధ్యాహ్నం ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోలీసుల సమక్షంలోనే దాడులు చేసినట్లు సమాచారం.పోలీసులు ముందుకు రాకండి, ఫొటోలు, వీడియోలు కూడా తీయవద్దు. అంటూ రిత్విక్ కంపెనీపై రాళ్లదాడి చేసి మేనేజర్ను సైతం కొట్టారు. మరో ప్రాంతంలో ఉన్న జేసీబీని పగుల గొట్టారు. స్థానికంగా ఉన్న పోలీసులు మేము ఏమి చేయగలం, తమ ప్రాణాలు చిన్నవి అంటూ సెలవిస్తున్నారు. దాడి అనంతరం అర్బన్ సీఐ నరేష్బాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
దసరాకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డి సర్కిల్ : దసరా పండుగను పురస్కరించుకుని వంద ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీ, వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ నుంచి 30బస్సులు, బెంగుళూరు నుంచి 30 బస్సులు, చైన్నె నగరం నుంచి 10 బస్సులు, 27, 28వ తేదీల్లో విజయవాడ నుంచి 30బస్సులను నడపనున్నామని తెలిపారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలకు కడప రీజియన్ నుంచి 40ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఆర్ఎం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 25న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు – డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025కు ఎంపికై న వారికి ఈనెల 25వ తేదీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేయనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ నెల 19వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైఎస్సార్జిల్లాలో నియాయక పరీక్ష రాసిన అభ్యర్థులు తమకు అందజేసి ఐడెంటిటీ కార్డులతో ఈనెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు కడప ఆర్ట్స్ కళాశాలలో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. మరిన్ని సూచనలు డీఎస్సీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపులో పంపిస్తామని డీఈఓ వివరించారు. -
అర్జీగీ పెట్టినా.. ఫలితం సున్నా !
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. వారాలు.. నెలలు కాదు.. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు.. అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టినా అధికారుల మనస్సు కరగడం లేదు. కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని నలు చెరుగుల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు ఆమె ఎదుట మొరపెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినా మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మచ్చుకు కొన్ని... విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు తగలబడి సర్వం కోల్పోయాం. బేల్దారి పనికి వెళుతూ భార్యా పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. అసలే అరకొర ఆర్థిక పరిస్థితులతో అల్లాడుతున్న మాకు విద్యుత్ షార్ట్ సర్యూట్ మరింత అగాథంలోకి నెట్టింది. ఇంటి సామాగ్రితోపాటు సర్టిఫి కెట్లు, రూ. 50 వేల నగదు కూడాఅగ్నికి ఆహుతయ్యాయి. రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లింది. రోడ్డున పడిన మా కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నా. – భార్గవరెడ్డి, సీకేదిన్నె మండలం మా గ్రామ పొలంలో సర్వే నెంబరు 178లో 1.83 ఎకరాల విస్తీర్ణంలో స్మశాన స్థలం ఉంది. కొంతమంది స్మశానికి వినియోగిస్తున్న స్థలంలో మామిడి చెట్లు నాటారు. ఈ విషయంపై మేము తహసీల్దార్, ఇతర అఽధికారులకు ఫిర్యాదు చేశాం. అధికారులు విచారణ చేసి అది స్మశాన స్థలంగా తేల్చారు. అందులో బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదు. స్మశాన స్థలాన్ని సంరక్షించాలి. – జ్యోతి రామసుబ్బారెడ్డి, పొన్నోలు కొత్తపల్లె, సిద్దవటం మండలం నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేశాను. మూడు సెంట్ల స్థలంలో నాకున్న ఇంటిని మాయమాటలు చెప్పి రాయించుకున్నారు. నేను వృద్ధుడిని. కాలు, చేయి సరిగా పనిచేయడం లేదు. కేవలం పింఛన్తో జీవిస్తున్నాను. అల్లుళ్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. మోసంతో కాజేసిన ఇంటిని తిరిగి నాకు ఇప్పిస్తే ఈ మలి వయస్సులో ఎవరైనా యోగక్షేమాలు చూస్తారు. – రామాంజనేయులు, బొజ్జావారిపల్లె, ప్రొద్దుటూరు మేము ప్రొద్దుటూరులో ఔట్సోర్సింగ్ కింద గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసేవాళ్లం. అక్కడి ఏఈ బల్క్గా ఇసుకను కాంట్రాక్టర్కు ఇచ్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇది కాంట్రాక్టర్, ఏఈకి మాత్రమే సంబంధించిన విషయం. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. కానీ ఉన్నతాధికారులు ఏఈని రక్షించుకోవడం కోసం మమ్మల్ని అన్యాయంగా గత సెప్టెంబరు 29న తొలగించారు. ఎలాంటి విచారణ లేకుండా తొలగించడం అన్యాయమంటూ గ్రీవెన్స్సెల్లో పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. – దూదేకుల పెద్ద గుర్రప్ప, ఎస్.కుమారి, ప్రొద్దుటూరు -
మైలవరం కరకట్టకు మరమ్మతులు
జమ్మలమడుగు : మైలవరం జలాశయం ఆనకట్టకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సోమవారం ‘ప్రమాదంలో మైలవరం జలాశయం’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం కరకట్ట వద్ద డీఈ మూర్తి ఆధ్వర్యంలో లష్కర్లు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ కరకట్ట వద్ద రాళ్లు కుంగిపోవడంతో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన ట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టుకు క్షమాపణ చెప్పిన పులివెందుల ఆర్డీఓ కడప సెవెన్రోడ్స్ : సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామానికి చెందిన యు.హరిత చౌక దుకాణ డీలర్షిప్ను ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా రద్దు చేసిన పులివెందుల ఆర్డీఓ పి.చిన్నయ్య రాష్ట్ర హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. సరైన కారణం చూపకుండా, చట్ట నిబంధనలు గాలికి వదిలి ఆమైపె చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎఫ్పీ షాపు డీలర్ హరిత హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆర్డీఓను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు సంధించిన ప్రశ్నలకు ఆర్డీఓ సరైన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆయన కోర్టుకు క్షమాపణ చెప్పారు. రిపబ్లిక్ డే ప్రి పరేడ్ శిబిరాల ఎంపికలు కడప ఎడ్యుకేషన్ : వెస్ట్ జోన్ ప్రీ–రిపబ్లిక్ డే క్యాంపులో పాల్గొనేందుకు వైవీయూ–ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వలంటీర్ల ఎంపిక నిర్వహించారు. ఈ జోన్ నుంచి విజయవంతమైన అభ్యర్థులు న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ప్రాతినిధ్యం వహి స్తారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఎంపికలకు అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లా నుంచి వంద మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. వారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిలో ముగ్గురిని ప్రీ రిపబ్లిక్ డే క్యాంపునకు ఎంపిక చేశారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయ యువజన అధికారి డాక్టర్ సయ్యద్, వైవీయూఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కే శ్రీనివాసరావు, డాక్టర్ కె. లలిత, డా. ఎస్పీ వెంకటరమణ మార్గదర్శకత్వం వహించారు. జిల్లాకు చేరిన యూరియా కడప అగ్రికల్చర్ : ఉమ్మడికడపజిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 1011 మెట్రిక్ టన్నులు వైఎస్సార్జిల్లాకు కేటాయించగా ఇందులో 534 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించగా మరో 176 మెట్రిక్ టన్నులు మనగ్రోమోర్ సెంటర్లకు మిగిలిన 301 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లుకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 324 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు. -
దసరా సంబరం.. ఆరంభం
● వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు ● ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హర్యాణా అఘోరాల భంభంభోలే, భోపాల్ శివశక్తి డ్రమ్స్ ప్రొద్దుటూరు కల్చరల్ : పుత్తడిపురం ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలతో గ్రామో త్సవం నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలలో నింపిన నవగంగ తీర్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపుగా బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీకన్యకాపరమేశ్వరిదేవి పురాణాన్ని తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో హర్యాణా కళాకారుల అఘోరాల భంభంభోలే, భోపాల్ శివశక్తి డ్రమ్స్, శ్రీ కోదండరామ కోలాటబృందం వారి కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా బందోబస్తు నిర్వహించారు. ● శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి ఆలయ దసరా ఉత్సవ కమిటీ వారు ఊరేగింపుగా పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేసి కలశాన్ని తీసుకెళ్లారు. కోలాట నృత్యం, బ్యాండుమేళం ఆకట్టుకుంది. ● స్థానిక శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్ సర్కిల్లోని శివాలయంలో పూజలు చేశారు. ● రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 250 మందిపైగా సుహాసినులు అగస్త్యేశ్వరాలయానికి చేరుకుని గంగాజలంతో నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. ● శాసీ్త్రనగర్లోని రాజరాజేశ్వరిదేవి ఆలయం, చౌడేశ్వరీదేవి, పెద్దమ్మతల్లి ఆలయం, ముక్తిరామలింగేశ్వరాలయం తదితర ఆలయాల నిర్వాహకులు కలశపూజను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ప్రదర్శనలు, డప్పువాయిద్యాల ప్రదర్శనలు అలరించాయి. ● కడప అమ్మవారిశాలతో పాటు విజయదుర్గా ఆలయంలోనూ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.కడప విజయదుర్గాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు కడప అమ్మవారిశాలలో దీక్షాబంధన దేవీ అలంకారం -
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో బోల్తా కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు. ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్ను స్థానికులు బయటకు తీసారు. -
ఫైనాన్షియర్ దారుణ హత్య
ప్రొద్దుటూరు క్రైం : అవసరానికి అప్పులివ్వడమే ఆయన చేసిన నేరమా. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించమని అడిగిన పాపానికి రుణదాతనే దుండగులు హతమార్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ కొండా వేణుగోపాల్ రెడ్డి (54) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా హతమార్చి చాపాడు సమీపంలోని కుందూ నదిలో పడేశారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు ఊహించినట్టే ప్రముఖ వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి బాకీ దారుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. పోరుమామిళ్ల మండలం రెడ్డికోట గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి స్ధిరపడ్డారు. కొన్నేళ్ల వరకూ వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే వారు. జమ్మలమడుగు రోడ్డులోని మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్రెడ్డికి భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వేణుగోపాల్రెడ్డి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ గడువు ముగిసిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. ఇలా పట్టణంలో పెద్ద మొత్తంలో అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి సమీపంలోనే కాపు కాచి.. వేణుగోపాల్రెడ్డి ఇల్లు జమ్మలమడుగు రోడ్డు పక్కన బొల్లవరం ప్లాట్లో ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఆయన ఇల్లుంది. శుక్రవారం సాయంత్రం 6.30 సమయంలో ఇంటి నుంచి స్కూటీలో అతను బయటికి వెళ్లాడు. రోజూ రాత్రి 8–15, 8–30 గంటల్లోగా ఇంటికి వచ్చేవాడు. అయితే శుక్రవారం రాత్రి 8.50 దాటినా వేణుగోపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న ఫోన్ చేసింది. అతని ఫోన్ నంబర్లు పని చేయలేదు. రోడ్డుపై ఉన్నాడేమో చూసి రమ్మని వాచ్మెన్ను పంపించారు. అతను బయటికి వెళ్లగానే ఇంటి సమీపంలో వేణుగోపాల్రెడ్డి స్కూటీ పడిపోయి ఉంది. పక్కనే అతని చెప్పులతోపాటు కారం పొడి ఉండడంతో ఫైనాన్షియర్ కిడ్నాప్నకు గురయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల తర్వాత వేణుగోపాల్రెడ్డి ఇంటికి వస్తాడని భావించిన దుండగులు ప్రధాన రహదారిలోని ఆర్చీ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. స్కూటీలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్చీ దాటగానే దుండగులు అడ్డగించి, కళ్లలో కారం పొడి చల్లి ఘటనా స్థలంలోనే హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్ చేసి అతన్ని ఎత్తుకెళ్లాలని ముందుగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్రెడ్డి ఘటనా స్థలంలోనే మృత్యువాతపడడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కుందూలో పడేసినట్లు సమాచారం. కుటుంబసభ్యుల అనుమానమే నిజమైంది.. బాకీ తీసుకున్న వారు గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో కొందరిపై వేణుగోపాల్రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కేసు తుది విచారణకు వచ్చినట్లు వేణుగోపాల్రెడ్డి భార్య ప్రమీలాదేవి మీడియాతో వెల్లడించారు. కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన బాకీ దారులు తన భర్తను కిడ్నాప్ చేసి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ప్రమీలాదేవి అనుమానమే నిజమైంది. బాకీ దారుల్లో కొందరు ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో వేణుగోపాల్రెడ్డి బంధువు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుందూలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిడ్నాప్నకు గురయ్యాడని తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణ, రూరల్ ఎస్ఐ రాజుతో కలిసి నాలుగు టీంలుగా ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఫైనాన్షియర్ను తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా కారు వెళ్లిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని కుందు బ్రిడ్జి వద్ద నదిలో ఆదివారం వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక రెస్క్యూ టీంతో కలిసి అరుణ్రెడ్డి నదిలోని మృతదేహాన్ని వెలికి తీశారు. కుందూ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మృతదేహాన్ని వెలికి తీయడం అతి కష్టంగా మారింది. ఎట్టకేలకు శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. అతని మృతదేహాన్ని చూపి భార్య ప్రమీలాదేవి, కుమార్తె స్వప్న బోరునా విలపించసాగారు. కేసులో అనుమానం ఉన్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలను తమదైన పద్దతిలో వారి నుంచి రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
వ్యక్తి అదృశ్యం
ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్ నగర్లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఇంటి సామగ్రి దగ్ధంచింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు. పోక్సో కేసులో యువకుడి అరెస్టు కడప కోటిరెడ్డి సర్కిల్ : బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడిపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ రెడ్డప్ప తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నూరు మండలానికి చెందిన దావూద్ ఓ బాలికను ప్రేమ పేరుతో ఈ నెల 29న తీసుకు వెళ్లినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దావూద్ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. -
ఆసుపత్రిలో పాము కలకలం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లెల్లో జోరుగా పేకాటసాక్షి టాస్క్పోర్స్ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ మృతి
పోరుమామిళ్ల : స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి మోటార్ బైక్ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో షేక్ నాయబ్రసూల్(45) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్నగర్కుకు చెందిన రసూల్ కుమార్తె కోసం వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. రసూల్ తీవ్రంగా గాయపడి కింద పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రసూల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. రసూల్ భార్య రెహానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతన్నా.. జర జాగ్రత్తన్నా..!
● పురుగుమందు పిచికారీలో అప్రమత్తత అవసరం ● అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పువర్షాలు విస్తారంగా కురవడంతో వరి, ఆరుతడి పంటలకు తెగుళ్లు విజృంభించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పురుగుమందు పిచికారీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన మందుల వాడకం తగ్గించాలని, పిచికారీ చేసేటపుడు కనీస జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా వరి 18 వేల హెక్టార్లు, జొన్న, సజ్జ, మినుము, వేరుశనగ, పత్తి తదితర పంటలు మరో 5వేల హెక్టార్లలోనూ రైతులు సాగు చేశారు. ఇపుడు వర్షాలు కురవడంతో మరింతమంది రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు ప్రాజెక్టులు, కేసీ కెనాల్, బోర్ల కింద వరి సాగు విస్తారంగా సాగుతోంది. ముందస్తుగా సాగు చేసిన పంటలకు ప్రస్తుతం తెగుళ్లు సోకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పంటలను ఆశించే చీడపీడల నివారణ కోసం విస్తృతంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. అప్రతమత్తంగా ఉండాల్సిందే రైతులు పురుగు మందులు వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మందు డబ్బాలపై వజ్రాకారంలో పురుగు మందుల స్థాయిని తెలిపే రంగులను గుర్తించాలి. అత్యంత విషపూరితమైతే నీలం, తక్కువ విషపూరితమైతే ఆకుపచ్చ రంగలు ఉంటాయి. పురుగు మందులు అవసరానికి మించి కొనుగోలు చేయరాదు. పురుగు మందులు ముందుగా కొని ఇల్లు, పొలాల వద్ద నిల్వ చేయరాదు. పిచికారీలో జాగ్రత్త.. రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో భోజనం చేయడం, నీరు తాగడం, సిగిరెట్, బీడీ కాల్చడం వంటి పనులు చేయరాదు. మందులు కలిపేటప్పుడు కర్రలతో కలపడం శ్రేయస్కరం. ఇళ్లలో పిల్లలకు అందకుండా మందు డబ్బాలు జాగ్రత్తగా ఉంచాలి. మందు డబ్బాలపై కరపత్రాన్ని చదవాలి. రంగులు గుర్తించి ద్రావణం జాగ్రత్తగా పిచికారీ చేయాలి. నాజిల్స్ను నోటితో గాలి ఊది శుభ్రం చేయడం అత్యంత ప్రమాదకరం. ఖాళీ డబ్బాలను గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. పిచికారీ అయిన వెంటనే స్నానం చేసి దుస్తులను శుభ్రపరచుకోవాలి. మందు ప్రభావానికి గురైతే వైద్యులను సంప్రదించాలి. పై జాగ్రత్తలు పాటించకపోతే గుండె జబ్జు, కళ్లు తిరగడం, వాంతులు, క్యాన్సర్, నరాల బలహీనత వంటి సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం మేలు ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని అనుసరిస్తే రైతులతోపాటు నేల ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ ెపెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యకర పంట ఉత్పత్తులు పొందడమేగాక, పెట్టుబడి వ్యయం సగానికిపైగా తగ్గుతుంది. పశువుల పేడ, వేపాకు కషాయం, పచ్చిరొట్ట ఎరువులు, వర్మికంపోస్టు వినియోగిస్తే భూసారం పెరుగుతుంది, విచక్షణా రహి తంగా పురుగు మందులు వినియోగిస్తే పంటకు నష్టం వాటిల్లుతుంది. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించాలి పంట పొలాల్లో చీడ, పీడల నివారణకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోవాలి. నాణ్యమైన పురుగు మందులను మాత్రమే వాడుకోవాలి. మందు పిచికారీ చేసేటప్పుడు రక్షణ దుస్తులు, గ్లౌజులు ధరించాలి. జాగ్రత్తగా పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి. – చంద్రా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
పనుల్లో నాణ్యత డొల్ల
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. నంద్యాల–జమ్మలమడుగు 167 నెంబర్ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అప్పడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే అధికారులు నామామాత్రంగా తనిఖీలు చేసి పోతున్నారనే విమర్శలున్నాయి. కీలకంగా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారేగానీ నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. కనీసం 16 ఎంఎం కడ్డీలను ఉపయోగించితేనే పిల్లర్లు పటిష్టంగా ఉంటాయి. కానీ కంపెనీ 10 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం కడ్డీలు రెండు, మూడు కడ్డీలు 16ఎంఎం ఉపయోగించడం జరుగుతోంది. దీంతో ఈ పిల్లర్లు ఎంత వరకు నిలబడుతాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజైన్ ప్రకారమే పిల్లర్ల నిర్మాణం పెన్నానదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కో రకంగా ఉంటాయి. – సురేందర్రెడ్డి, ఏఈ, జమ్మలమడుగు -
ఆర్టీసీ బస్సు బోల్తా
మైదుకూరు : విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరదాయపల్లె సమీపంలో శనివారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి వస్తున్న బస్సులో జీవీసత్రం ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు బయలుదేరారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారిపై వరదాయపల్లెకు సమీపంలో ఆపాలని కండక్టర్ను విద్యార్థులు కోరారు. ఆ మేరకు డ్రైవర్ కొన్ని మీటర్ల మేరకు బైపాస్పై ఉన్న బస్సును రివర్స్ చేసేందుకు యత్నించాడు. దాంతో బస్సు అదుపుతప్పి బోలాం్త పడింది. డ్రైవర్తోపాటు బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప డిపో అధికారుల సమాచారంతో గ్యారేజీ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును యథాస్థితికి తెచ్చారు. -
పితృదేవతలకు సామూహిక పిండ ప్రదానం
వల్లూరు : పుష్పగిరి కొండపై వెలసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో రుద్రపాదం వద్ద ఆదివారం పితృదేవతలకు సామూహిక పిండ ప్రదాన కార్యక్రమం భక్తి శద్ధలతో నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినవారు తమ పితృ దేవతలు, బంధువులకు పిండ ప్రదానం చేశారు. రుద్రపాదం వద్ద పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడంతో వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో పేర్కొనబడిందని వివరించారు. దేవస్థానం అధికారులు భక్తులకు పిండ ప్రదాన సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం నదిలో స్నానాలు చేసిన భక్తులు రుద్రపాదానికి పూజలు జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఈవో శ్రీనివాసులు, అఖిల్, సుమంత్ పాల్గొన్నారు. -
ముస్లిం యువకులపై అక్రమ కేసులు దారుణం
కడప కార్పొరేషన్: ఉత్తర ప్రదేశ్లో ముస్లిం యువకులపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని ముస్లిం మత పెద్దలు ఆక్షేపించారు. కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో వారు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐ లవ్ మహమ్మద్ బ్యానర్తో నిర్వహించిన ఈ నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్–ఉన్–నబీ వేడుకల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఐ లవ్ మహమ్మద్ బ్యానర్లను ప్రదర్శించడంతో యోగి ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రవక్త పేరు ప్రదర్శించినందుకే కేసులు నమోదు చేస్తే 40 కోట్ల మంది ముస్లింలు ఒప్పుకోరన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్బాబు, ముస్లింలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో మైలవరం జలాశయం!
జమ్మలమడుగు: మైలవరం జలాశయం ప్రమాదంలో పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు మైలవరం జలాశయం చుట్టూ ఉన్న కరకట్టకు పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మైలవరం జలాశయానికి గండికోట ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం ఐదు టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటి విడుదల అధికారులు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో నీరు నీల్వ ఉండటంతో ఇప్పటికే భూమిలో నుంచి నెమ్ము ద్వారా నీరు బయటికి వస్తోంది.మైలవరం కరకట్టకు ఏకంగా ఐదు చోట్ల రంధ్రాలు పడటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. భద్రత ఏదీ! ప్రస్తుతం మైలవరం జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో ఉండటంతో పర్యాటకుల తాకిడిపెరిగింది. జలాశయం చూటానికి వెల్లే రహదారికి ఇరువైపు ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండ గేట్ల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో మైలవరం జలాశయం పైన పర్యాటకులకు భద్రత కరువైపోయింది. గతంలో కోట్ల రూపా యలు ఖర్చుపెట్టి మరమ్మతు పనులు చేసిన అవి నిష్ఫలంగానే మారిపోతున్నాయి. గుంతలు పడ్డాయి... మైలవరం జలాశయం కరకట్ట మీద గుంతలు పడిన మాట వాస్తవమే . అధికారులు సైతం వచ్చి పరిశీలించారు. దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం. –సుబ్బారావు, ఇరిగేషన్ ఏఈ మైలవరం -
బాబు బినామీల కోసమే ప్రైవేటీకరణ
● ఐక్య పోరాటాలతో ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం ● రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతలు కడప రూరల్: వైద్య విద్యను పరిరక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారారని నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బినామీల కోసమే వైద్య విద్యను కార్పొరేట్ సంస్ధలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికోసం’ అనే అంశంపై మేధావులు, అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధా నాలను అవలంబిస్తూ ప్రజల్లో అలజడి సృష్టించా రని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవే ట్ పరం చేస్తూ నిర్ణయించడం దారుణమని పేర్కొ న్నారు. బాబు తన బినామీలకోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధ ప్రజా ఆరోగ్యంపై లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానం వలన ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శివ యా దవ్ , న్యాయవాది సంపత్కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెలిపారు. సీఐటీయూ నాయకులు కామనూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన సీట్లను కూటమి ప్రభుత్వం తిరస్కరించిన రోజే పెద్ద ఎత్తున వ్యతిరేకించి, ఉద్యమాలు చేపట్టిఉంటే, నేడు ప్రైవేటీకరణ ఉండేది కాదన్నారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఏ రంగన్నైనా సరే ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదన్నారు. జన చైతన్య సమగ్రాభి సంస్ధ అధ్యక్షులు గోపాల్, పౌర హక్కుల సంఘం నేత వెంకటేష్ , బీసీ, ఎస్సీ సంఘాల నేతలు అవ్వారు మల్లిఖార్జున, జేవీ రమణ, సంగటి మనోహర్ మాట్లాడుతూ ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీనివాసులు, శ్రీక్రిష్ణ, భాస్కర్ పాల్గొన్నారు. -
● ఆలయ చరిత్ర
ఎందరో మహనీయుల సమిష్టి కృషికి ఈ ఆలయం చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడి సమీపంలోని పర్లపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి చిన్న కొండయ్య అనే వ్యాపారికి కలలో కనిపించిన శ్రీ కన్యకా పరమేశ్వరి ‘‘పెనుగొండ వాసినైన నేను కడప జిల్లా పినాకిని నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రొద్దుటూరు పట్టణంలో కొలువు తీరనున్నాను’అని చెప్పడం జరిగింది. తనకు ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మింప చేయాలని చెప్పడంతో 128 సంవత్సరాల క్రితం వ్యాపారి కామిశెట్టి చిన్న కొండయ్య ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు. ఎందరో మహానుభావులు, జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకులు, పదవిలో ఉన్నవారు ఆలయాన్ని దర్శించుకున్నారు. 1929లో జాతిపిత మహాత్మ గాంధీ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి ఆలయంలో 40 రోజుల పాటు బస చేసి యజ్ఞయాగాదులు నిర్వహించారు. అమ్మవారి శాల గర్భగుడి లోపల గ్రానైట్ రాతితో, మార్బుల్ రాళ్లతో మనోహరంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి వెండి తొడుగులను అమర్చారు. ఆలయంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర దేవి జన్మ వృత్తాంతం తెలిపే చిత్రపటాలు దర్శనమిస్తాయి. ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల ఆలయ గోపురం -
కడప గడపలో టీఢీపీ!
పార్టీ జెండా మోసినోళ్లకే అండ దొరకడం లేదా..! పార్టీ గెలుపు కోసం పని చేస్తే .. అట్నుంచి కనీస పిలుపు కూడా దక్కడం లేదా! ... అంటే అవుననే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. పశ్చా‘త్తాపం’తో రగిలిపోతున్న పచ్చ నేతలు అసమ్మతి స్వరం పెంచారు. కడప ఎమ్మెల్యే తీరుపై తిరుగుబావుటా ఎగురువేశారు. ఏకంగా పశ్చాత్తాప యాత్రకు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాల రగులుతోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీనియర్లను విస్మరించి వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీని యర్లలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవుని కడపలో సీనియర్ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకున్ని చూపాలంటూ స్వామికి విన్నవించనున్నారు. ● కడప నియోజకవర్గంలో టీడీపీ విజయబావుటా కోసం పార్టీ నేతలు అనేక మంది శక్తికి మించి కృషి చేశారు. ఎన్నికల తర్వాత వారంతా పల్లకి మోసే బోయీలుగా మిగిలారు. మాధవిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేపట్టకముందు ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, ఎస్ గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అమీర్బాబు టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. ఏ క్షణం మాధవిరెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి క్రమేపీ సీనియర్లు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాద్రెడ్డిలు కడపలో మాధవి రెడ్డి పరిచయ కార్యక్రమం, బలపర్చడం వెనుక కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో మాధవిరెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ క్రియాశీలక నేతల ప్రాధాన్యత, పరపతి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాదు టీడీపీలో చేరిన 8మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయంలో వలస నేతలే కీలకమయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయంలోనే ప్రత్యక్షంగా పరస్పర దాడులకు తెగబడ్డారు. నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, అమీర్బాబు లాంటి వారంతా తెరమరుగు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా దేవుని కడపలో పశ్చాత్తాప యాత్ర చేపట్టే స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఏకపక్ష చర్యలపై పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దేవునికడప, పాతకడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలతో సోమవారం పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. కడప ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి విజయం కోసం కృషి చేసినందుకు పశ్చాత్తాపం పడుతున్నాం.. అంటూ యాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆపై నగరంలో టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకుడి కోసం శ్రీవేంకటేశ్వరస్వామిని అభ్యర్థించనున్నారు. అనంతరం మూకుమ్మడిగా వెళ్లి కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అండగా రక్షణగా నిలవాలంటూనే టీడీపీ సీనియర్లను కాపాడుకునేందుకు కడపపై దృష్టి పెట్టాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నగర టీడీపీ కమిటీ నియామకంపై అనేక మంది గరంగరంగా ఉన్నప్పటికీ బాహాటంగా వ్యాఖ్యనించడం లేదు. కొండా సుబ్బయ్య లాంటి వారు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కమారుగా సెగలు కక్కుతూ తెరపైకి రావడం విశేషం. ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నేతల తిరుగుబాటు ఎమ్మెల్యే మాధవి ఎంపికపై నేడు నేతల పశ్చాత్తాప యాత్ర పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహణ కలిసి అడుగులు వేస్తున్నటీడీపీ సీనియర్ కార్యకర్తలు -
ప్రొద్దుటూరులో లేఖ కలకలం
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తూ జేబులు నింపుకొంటున్నారని పట్టణ ప్రముఖులపై ఏకే.రామాంజనేయులు రాసిన లేఖ శనివారం కలకలం సృష్టించింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కిందట అగస్త్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణ వివాదంలోనూ, మిట్టా పాపయ్య సత్రం, నందినీ క్లాత్ మార్కెట్ విషయంలోనూ వివాదాలను ఆసరాగా తీసుకుని గోసంగి వెంకటసుబ్బారెడ్డి, గొర్రె శ్రీనివాసులు బ్లాక్ మెయిల్కు పాల్పడగా వారికి బుశెట్టి రాంమోహన్రావు సహకరించారని ఆరోపించారు. ధారా అపార్ట్మెంట్ నిర్మాణంపై లెక్కలేనని పిటీషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. డీఏడబ్ల్యూ కళాశాల వివాదంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేపైనా డీఎల్.రవీంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించి రూ.50 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. గోపీ రైస్మిల్లుపై వందల కొద్దీ పిటీషన్లు, ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టి రూ.8కోట్లు అక్రమంగా సంపాదించారని, బొల్లవరంలో పల్లేటి సుహాసినిని మఽభ్యపెట్టి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఇందులో టీడీపీ నాయకుడు ఉక్కు ప్రవీణ్ అనుచరుడు వాటర్ప్లాంట్ రాము, నీలకంఠారెడ్డి ఉన్నారన్నారు. చౌటపల్లె నికల్సన్ దొరకు చెందినదిగా చెప్పబడుతున్న మూడు ఎకరాల స్థలాన్ని దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేయాలని యత్నించినట్లు పేర్కొన్నారు. నిమ్మకాయల సుధాకర్రెడ్డి, మరికొందరు వేసిన వెంచర్లపై ఆర్టీఐ యాక్ట్ పెట్టి బెదిరించారన్నారు. 2023లో రాజా ఫౌండేషన్పై వారి కళ్లు పడ్డాయని, చిన్నజీయర్స్వామిని పరిచయం చేసుకుని కమిటీలో తమ పేర్లను ఎక్కించుకున్నారని, తమకు రూ.75 కోట్ల విలువైన భూములను అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు గొర్రె శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ అక్రమంగా రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తులు రాజకీయాలకు ముగింపు పలకాలని కోరారు. శివాలయం సెంటర్ వద్ద బహిరంగ చర్చా వేదికకు తాము సిద్ధమన్నారు. కౌన్సిలర్ మురళీధర్రెడ్డి మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేయించారని, దందాలు ఎవరు చేశారో ప్రజలకు తెలుసునన్నారు. గోసంగి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16న హెడ్ పోస్టాపీసులో లేఖ పోస్టు చేశారని, ఎక్కడి నుంచి లేఖ వచ్చింది అడ్రెస్ లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేశారన్నారు. అనంతరం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి తమపై ఆరోపణలు చేసిన వారిఫై విచారించాలని కోరారు.బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలుచేస్తున్నారని ఆరోపణ -
పరిశుభ్రతే ప్రగతికి సోపానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మొక్క నాటారు. అనంతరం తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. మొక్కలతో ఆహ్లాద వాతావరణం ఉంటే ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ ఎన్.సుధాకర్, ఎ.శివరాముడు, శ్రీశైలరెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
ముగ్గురిపై చీటింగ్ కేసు
కడప అర్బన్ : కడప నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్కుమార్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్నగర్కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిత్య పద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు, లెటర్ ప్యాడ్లను నమ్మకంగా ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. చివరకు ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన ఈఎంఐలను తన చేతనే కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ల అరెస్టువేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో జరిగిన చోరీ కేసులో బంగారు రికవరీ చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన జగనన్న కాలనీలో వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించి కడప–పులివెందుల బైపాస్ రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఎస్ఐ తిరుపాల్నాయక్, సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 66.90 0గ్రాముల బంగారు అభరణాలు, 118 గ్రాముల వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పులివెందుల లయోలా కళాశాల అధ్యాపకుడి ప్రతిభపులివెందుల టౌన్ : అంతర్జాతీయ సదస్సులో పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఉదయ్కుమార్ ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రేవా యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో 9 దేశాల శాస్త్రవేత్తలు పాల్గొని 200 ప్రదర్శన పత్రాలు సమర్పించారు. లయోలా కళాశాల అసిస్టెంట్ అధ్యాపకుడు ఉదయ్ కుమార్ లైఫ్ సైన్స్ విభాగంలో సమర్పించిన ఉపాధ్యాయ కేటగిరీ పత్రం ద్వితీయ బహుమతికి ఎంపికై ంది. అతిథుల నుంచి ఆయన బహుమతి అందుకున్నారు. ప్రిన్సిపల్ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వనచిన్నప్ప ఉదయ్ను అభినందించారు. -
వదలనంటోన్న వాన
● జిల్లాలో నాలుగు రోజుల నుంచి వర్షాలు ● జోరుగా ప్రవహిస్తున్న పెన్నా, కుందూనదులు ● 942 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు ● నీటి నిల్వలు, దోమలతో అల్లాడుతున్న జనంకడప అగ్రికల్చర్/వేముల/పెనగలూరు : కడప జిల్లా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వద్దన్నా వర్షం కురుస్తూ రైతులను బెంబేలెత్తిస్తోంది. చాలా ప్రాంతాల్లో కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేంపల్లిలో అత్యధికంగా శుక్రవారం రాత్రి 96.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎర్రగుంట్లలో 84, పెద్దముడియంలో 85, జమ్మలమడుగులో 80.4, వీఎన్పల్లిలో 73.4, వేములలో 72.4, చక్రాయపేటలో 67.2, ప్రొద్దుటూరులో 57.8చ, పులివెందులలో 36, ముద్దనూరులో 35.4, తొండూరులో 32.2, ఒంటిమిట్టలో 29, మైలవరంలో 28.6, సికెదిన్నెలో 22.3, కడపలో 17.2, లింగాలలో 15.2, వల్లూరులో 14.4, సింహాద్రిపురంలో 13.2, రాజుపాలెంలో 12.2, పెండ్లిమర్రిలో 9.2, కమలాపురంలో 8.8, చాపాడులో 8.4, కొండాపురంలో 8.2, ఖాజీపేటలో 7.4, సిద్దవటంలో 7.2, చెన్నూరులో 2.2, దువ్వూరులో 2.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ● ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వలసపల్లి, చిలంకూరు, మాలపాడు వంకలు శుక్రవారం ఉద్ధృతంగా ప్రవహించాయి, కోడూరు వంకకు వరద నీరు చేరడంతో వేంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుంట్లలోని 33 కేవీ, 320 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లతోపాటు డీఈఈ కార్యాలయంలోకి నీరు చేరింది. ● రాజుపాలెం మండలం పర్లపాడు ఎస్సీ కాలనీలో జలమయమైయింది. రాజుపాలెం, వెంగలాయపల్లి గ్రామాల మధ్య మడవంకకి వర్షపునీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ● గత నాలుగేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన చెరువు ఒంటిమిట్ట చెరువుకు వరదనీరు వచ్చి చేరుతోంది. ● పెన్నా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నీరు అధికంగా చేరడంతో సిద్దవటం వద్ద లో లెవల్ బ్రిడ్జిపై నీరు పొంగి ప్రవహించింది. తోటలలో కుళ్లిపోతున్న ఉల్లిగడ్డలు జిల్లాలోని పెద్దముడియం, ప్రొద్దుటూరు, కమలాపురం, వల్లూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి మండలాలలోని 32 గ్రామాల పరిధిలో 1101 మంది రైతులకు సంబంధించిన 942.38 హెక్టార్లలో వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్, మినుము, పత్తి పంటలకు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా తయారు చేశారు. ఇందులో భాగంగా 662.2 హెక్టార్లలో వరి, 10 హెక్లార్లలో జొన్న, 10 హెక్టార్లలో మొక్కజొన్న, 137.68 హెక్టార్లలో వేరుశనగ, 11.6 హెక్టార్లలో సోయాబీన్, 28.2 హెక్టార్లలో మినుము, 4.5 హెక్టార్లలో పత్తిపంటలు దెబ్బతిన్నాయి. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ఉల్లి, పూలు పంటలు దెబ్బతిన్నట్లు పలువుర ఉద్యాన రైతులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో 3660 ఎకరాలలో ఉల్లి పంట సాగైంది. ఈ ఏడాది జూన్ మొదటివారంలో పంటలు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు భావించారు. వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపకపోగా, ప్రభుత్వం మొండిచేయి చూపింది. రైతులు వేచి చూశారు. ఇంతలోనే వర్షాలు కురవడంతో తోటల్లోనే ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. 1500 ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతిందని ఉద్యాన అధికారులు తేల్చారు. పెద్దజూటూరులో చెన్నకేశవరెడ్డి 3.50ఎకరాలలో సాగు చేసిన అరటి పంట వర్షాలకు నేల రాలింది. సోమశిల జలాలతో మునిగిన పొలాలు పెనగలూరు: సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎర్రగుంట్ల 33 కేవీ సబ్స్టేషన్కు చేరిన వర్షం నీరుఎర్రగుంట్లలో వర్షపు నీటికి దెబ్బతిన్న పత్తి పంటఉల్లి గడ్డలు కుళ్లిపోతున్నాయి నేను రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. రూ.1.50 లక్షల మేర పెట్టుబడి పెట్టాను. పంటకాలం పూర్తికావడంతో ఉల్లిగడ్డలు పీకివేశా. వర్షాలకు తడిచి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాను. – చలమారెడ్డి, ఉల్లి రైతు, చింతలజూటూరుధర లేక అమ్మలేదు ఉల్లి సాగు చేసి పంట కాలం పూర్తయింది. నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రూ.3 లక్షలకు పైనే పెట్టుబడులు పెట్టాను. ధరల కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలోనే వర్షాలు కురవడంతో గడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇలాగే వర్షాలు కురిస్తే పంట వదులుకోవాల్సిందే. – ద్వారకనాథ్రెడ్డి, ఉల్లిరైతు, వేల్పుల ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి తుపాన్ వర్షాలతో ఉల్లి తోటలు దెబ్బతింటున్నాయి. తోటలలో పీకి వేసిన ఉల్లి గడ్డలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పీకి వేయని ఉల్లిగడ్డలు కూడా భూమిలో కుళ్లిపోతున్నాయి. వర్షాలతో ఉల్లి రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. 1500ఎకరాలలో పంట దెబ్బతింది. – రాఘవేంద్రారెడ్డి, ఉద్యాన శాఖాధికారి, పులివెందుల -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు రివార్డులను అందజేశారు.10 మోటార్ బైక్లు స్వాధీనం -
విద్యుత్ లైన్మెన్ సస్పెన్షన్
కడప కార్పొరేషన్: కడప డివిజన్ పరిధిలోని వెస్ట్ సెక్షన్ రామరాజుపల్లె 33/11 కేవీ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న బి. నూతన్ ప్రసాద్ బాబును సస్పెండ్ చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని గవర్నమెంట్, మున్సిపల్, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవును ప్రకటిస్తున్నట్లు డీఈఓ షంషుద్దీన్ తెలిపా రు. సెలవు రోజుల్లో ఎటువంటి ప్రైవేటు క్లాసులుకానీ, తరగతులుగానీ నిర్వహించ కూడదని తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు ఉల్లంఘించిన యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్: ప్రొద్దుటూరులోని వైవీయూ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్, సెకండ్, థర్డ్ బీటెక్ కోర్సులకు సంబంధించి సెమిస్టర్ ఫలితాలను శనివారం వైవీయూలో వీసీ అల్లం శ్రీనివాసరావు తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ ఏడాది మే నెలలో బి.టెక్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఫలితాలను విశ్వవిద్యాలయ వైబ్సెట్ https:www.yvuexams.in /results.aspx సందర్శించి తెలుసుకోవచ్చన్నారు.పరీక్షల విభాగాన్ని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ ప్రశంసించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ పి.పద్మ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్. వైవీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. జయరామి రెడ్డి, ఇంజినీరింగ్ ఫ్యా కల్టీ. డీన్, ప్రొఫెసర్ జి. జయ చంద్ర రెడ్డి , వైవియు పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ, జనసేన దళిత వ్యతిరేక పార్టీలు
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, సమావేశానికి హాజరైన నాయకులు , పార్టీ శ్రేణులుకడప కార్పొరేషన్: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని.. టీడీపీ, జనసేన సిద్ధాంతం, భావజాలంతో దళితులకు నష్టమని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. విజయవాడలోని 125 అడుగుల డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట లక్ష మంది దళితులతో ప్రదర్శన చేయనున్నామని ఆయన వెల్లడించారు. శనివారం పాతరిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్లో జరిగిన వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 35 మంది సభ్యులతో జిల్లా కమిటీతో పాటు ఏడు నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీల్లో, 36 మండలాల్లో, పంచాయతీల్లో కమిటీలు పూర్తి చేయాలన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా...అని తన మనసులో దళితులపై ఉన్న వివక్షను చంద్రబాబు బయటపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా పవన్ మాట్లాడకుండా దళితులపై వ్యతిరేకతను చాటుకున్నారన్నారు. వైఎస్సార్సీపీతోనే దళితులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రాజకీయంగా దళితులకు నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 38 సంక్షేమ పథకాల ద్వారా దళితులకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. చంద్రబాబు దళిత ద్రోహి వైఎస్ కుటుంబానికి దళితులంతా బంధువులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముద్దుబిడ్డలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి అన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయన టక్కుటమారాలను దళితులు గమనించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ● కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు ఆత్మ గౌరవంతో బతకడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు అన్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లతోపాటు 15 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్లను చేసిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. ● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ, భద్రత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. కూటమి పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని, దళితులపై దాడులు ఎక్కవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ● దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు గౌరవం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ఆ గౌరవం కరువైందన్నారు. ● 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిపాలవడంతో దళితుల బతుకులు దుర్భరమయ్యాయని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా పరిశీలకులు కె. చెంగయ్య అన్నారు. దళితుల జీవితాలు బాగుపడాలంటే ఓటు అనే ఆయుధంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితుల సత్తా చూపాలని పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం వైఎస్సార్, జగన్ హయాంలోనే... దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిల పాలనలోనే దళితుల సంక్షేమం, అభివృద్ధి జరిగిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు వంటి పథకాల వల్ల దళితులకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. ● వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, దళిత నాయకులు సీహెచ్ వినోద్ కుమార్, ఎం.సుబ్బరాయుడు, కె. శరత్బాబు, డేనియల్ ప్రదీప్, బి. మరియలు, కె. బాబు, బండి ప్రసాద్, త్యాగరాజు, ఆర్. చెన్నయ్య తదితరులు మాట్లాడారు. అంతకుముందు వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఎస్. యానాదయ్య, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి, గల్ఫ్కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు బి. వేణుగోపాల్ నాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, పుల్లయ్య(బద్వేల్), చిట్టిబాబు(జమ్మలమడుగు), భాస్కర్(పులివెందుల) తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భావజాలానికి అనుగుణంగా జగన్ పాలన దళితులంతా సంఘటితంగా ఉండి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ అన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అఽధికారంలోకి వచ్చిందని, వైఎస్సార్సీపీపై బురదజల్లడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు. విద్య ఒక్కటే మన జీవితాల్లో మార్పు తెస్తుందని అంబేడ్కర్ చెప్పారని, వైఎస్ జగన్ కూడా విద్య, వైద్యాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి పునాది రాళ్లుగా ఉపయోగించారన్నారు. కూటమి రాకతో ఆ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా నష్టం వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు -
దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
ప్రొద్దుటూరు కల్చరల్: శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో 136వ దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని..ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ రావు తెలిపారు. ఆలయంలో శనివారం ఉత్సవ వివరాలను కమిటీ సలహాసభ్యులు బుశెట్టి రాజశేఖర్, ఎన్వీ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రుల సందర్భంగా రోజూ అమ్మవారి అలంకారాలు నిత్యనూతనంగా భక్తులకు కనువిందు చేస్తాయన్నారు. సోమవారం దసరా ప్రారంభం సందర్భంగా ఉదయం వాసవీకన్యకా పురాణాన్ని తెచ్చే వేడుకలో హర్యాణా భంభంభోలే అఘోరాలు, భోపాల్ శివశక్తి డ్రమ్స్, కోదండరామ కోలాటం ఉంటుందన్నారు. 29న బిందె సేవ రోజున చిక్మంగుళూరుకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, అక్టోబరు 2న విజయ దశమి సందర్భంగా శమీదర్శనం, తొట్టి మెరవణి వేడుకలో పాలకొల్లు బ్యాండ్, కోలాటం, డూప్స్, హర్యాణా కళాకారుల వేషధారణలు, కేరళ సింగారిమేళం, కాంతార కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు అలరిస్తాయన్నా రు. అలాగే లోకకళ్యాణార్థం రోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాకార్యక్రమాలు, వేద పఠనం, జపహోమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది దసరా 11 రోజులు రావడంతో 9వ రోజున అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తున్నామన్నారు. 4 రోజులు సినీ డైరెక్టర్ గోపి అమ్మవారికి ప్రత్యేక సెట్టింగ్లు వేస్తున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు దేవీ శరన్నవ రాత్రి వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, మల్లెంకొండు ప్రతాప్, కోశాధికారి జాలాధి పరమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆరోగ్య జిల్లా అందరి బాధ్యత
కడప సెవెన్రోడ్స్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ‘స్వచ్ఛ దివస్‘ కార్యక్రమాన్ని పురస్కరించుకునిఅధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని బ్లాకుల వద్ద ఆయా శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛ దివస్ నిర్వహించారు. డీఆర్వో , ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
కడప రూరల్ : వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ..లాభ–నష్టాలు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలందించడం ద్వారా వైద్య రంగంలో మెలకువలు తెలుసుకునేందుకు పేద విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పీపీపీ విదానాన్ని ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యతిరేకించారని తెలిపారు. రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలుండగా, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తగదన్నారు. 66 ఏళ్లకు కోట్ల రూపాయల ఆస్తులను రూ.5వేలకు లీజుకు ఇవ్వడం శోచనీయమని తెలిపారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటుపరం చేయడం ద్వారా సీట్లను అమ్ముకుని వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో వ్యతిరేకిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సామేల్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతి ముసుగు ఉంది. వైద్యులతోపాటు కీలకమైన పారా మెడికల్ స్టాఫ్ను పెంచాలి. కడపలో కేన్సర్ ఆస్పత్రి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు అక్కడ సిబ్బంది, సౌకర్యాలను కల్పించకపోవడం శోచనీయం. – డాక్టర్ రాంగోపాల్వర్మ, కడప ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. వైద్య విద్య కాలేజీల ప్రైవేటుపరం చేయడంతో సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఉండవు. అలాగే అక్కడికి వచ్చే రోగుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బాలిరెడ్డి, కడప రోగులకు సేవలందించే కీలకమైన వైద్య విధానంలో రాజకీయాలు తగవు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటపుడు వైద్యులు, ఇతర విద్యార్థులు, తదితర సంస్థలకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ రామచంద్రయ్య, కడప పులివెందులలో అన్ని హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. ప్రైవేటీకరణతో విద్యాబోధన సక్రమంగా ఉండదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎస్.గౌస్పీర్, కడప -
తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
కడప కోటిరెడ్డి సర్కిల్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, టాటా ట్రస్ట్ డాక్టర్ వీరభద్రుడు, అమరావతి, వరలక్ష్మి తెలిపారు. కడప నగరంలోని మానస ఇన్ హోటల్లో జిల్లా స్థాయి సీడీపీఓ, సూపర్వైజర్లకు కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్మాల్ న్యూట్రీషియన్పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. వారు మాట్లాడుతూ 0–5 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి ఆరోగ్య చికిత్స అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎత్తు, బరువు తీసి తీవ్ర లోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ పిల్లలను గుర్తించాలన్నారు. వారికి అదనంగా బాలామృతం 2.5 కేజీలు ఇవ్వాలన్నారు. తల్లులకు బిడ్డ స్థితి గురించి తెలియజేసి పర్యవేక్షించాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు, చాపాడు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ముద్దనూరు ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లు హాజరయ్యారు. -
హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
బద్వేలు అర్బన్ : ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్.ప్రసాద్ అన్నారు. యూటీఎఫ్ రణభేరి రాష్ట్రవ్యాప్త ప్రచార జాత శుక్రవారం బద్వేల్కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక భాకరాపేట నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా జెడ్పీ హైస్కూల్ వరకు సీఐటీయూ, డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. విలీనం పేరుతో వేలాది పాఠశాలలను మూసివేసి, ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని హామీలు గుప్పించి 15 నెలల కాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ, భారీ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదనవిజయకుమార్, పాలెంమహేష్బాబు, శ్రీనివాసులు, చిన్ని, నాగార్జునరెడ్డి, సుజాతరాణి, సివి.రమణ, శివప్రసాద్, ఎజాస్అహ్మద్, రవీంద్రుడు, మురళీకృష్ణ, సుబ్బారావు పాల్గొన్నారు. -
కస్తూర్బాగాంధీ విద్యాలయం తనిఖీ
వల్లూరు : వల్లూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానందరాజు శుక్రవారం తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థనా సమయానికి విద్యాలయానికి చేరుకున్న ఆయన ప్రార్థన అనంతరం మెనూ పరిశీలించారు. సరకుల నిల్వలు, స్టాకు నమోదు, రోజువారీ వినియోగం అంశాలను పరిశీలించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న హాస్టల్ నిర్వహణపై ప్రిన్సిపల్, అకౌంటెంట్కు సూచనలు చేశారు. రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జీసీడీవో రూత ఆరోగ్యమేరీ అన్నారు. అనంతరం హాస్టల్ మానిటర్ యాప్ టీమ్ సభ్యులు శివనాగేంద్రప్రసాద్ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నసీమున్నీసా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యక్రమాలకు కొండారెడ్డి ఎలా హాజరవుతారు?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజులరెడ్డి ఉన్నారా.. లేక ఆయన కుమారుడు కొండారెడ్డి అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నారా అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. తన స్వగృహంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొండారెడ్డిని ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించారా అని ప్రశ్నించారు. అధికార పూర్వకంగా వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాల్సి ఉండగా, రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ వరద కుమారుడు కొండారెడ్డి కార్యక్రమాలు నిర్వహించడం చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడం, రిబ్బన్ కట్ చేయడం, రికార్డులను పరిశీలించడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తాను హైదరాబాద్కు వెళ్లి వ్యాపారం చేసుకుంటానని చెప్పిన కొండారెడ్డి ఇపుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొండారెడ్డిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన వరదరాజులరెడ్డి దూరంగా ఉన్నారని, ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆరోపించారు. ప్రజా సామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులను గుర్తుపెట్టుకునేందుకు తాను బ్యాడ్ మెమోరీస్ రాస్తున్నానని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులను వదిలిబెట్టబోనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రూపాందన్ ఆహ్వానం మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరైన కొండారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారన్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు జాయింట్ సెక్రటరీ కిరణ్గోపాల్ వాస్కోకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ సందర్శించడం... కమిషనర్తోపాటు అధికారులంతా వెళ్లడం చూస్తే ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధి కానీ కొండారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎలా పంపిణీ చేశారన్నారు. పోలీసు అధికారులు సైతం కొండారెడ్డికి సెల్యూట్ చేసి పుష్పగుచ్ఛాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేసిన ఉక్క ప్రవీణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని రాచమల్లు ప్రశ్నించారు. వరదరాజులరెడ్డితోపాటు కొండారెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, భార్గవరెడ్డి దోచుకో.. దాచుకో అన్నట్లుగా తయారయ్యారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మార్తల ఓబుళరెడ్డి, జంగమయ్య, రాగుల శాంతి, లావణ్య, సత్యం, అనిల్, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, ఆంజనేయులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం
– జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు క్రైం : దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. డీఎస్పీ భావనతో కలిసి సబ్డివిజన్లోని సీఐలు, ఎస్ఐలతో సమావేశమై స్టేషన్ల వారీగా పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కాలను రూపుమాపుతామని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణకు అ న్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ తర్వాత ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారని, లక్షలాది భక్తులు వస్తున్నందున భద్రతాపరమైన చర్యల గురించి డీఎస్పీ, సీఐలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆలయకమిటీ నిర్వాహకులు, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ తదితర శాఖలను సమన్వయం చేసుకొని ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దసరా ఉత్సవకమిటీ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్రావు దసరా ఉత్సవాల తీరును ఎస్పీకి వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ భావన, సీఐలు తిమ్మారెడ్డి, సదాశివయ్య, వేణుగోపాల్, నాగభూషణం, రాజగోపాల్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను నిరోధించాలి బద్వేలు అర్బన్ : దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాలో జరిగే అక్రమాలను నిరోధించాలని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు నిర్వహిస్తున్న ఓట్ చోర్ – గద్దీ చోడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ.విజయజ్యోతి కోరారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా లక్ష సంతకాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలంతా చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సమావేశంలో అచ్యుతరాజు, చిన్నరామిరెడ్డి, నరసింహ, సుధాకర్రెడ్డి, పుల్లూరు బాషా, ఖాజావలి, సాంబయ్య, గురప్ప, బాలసుబ్బయ్య, శేఖర్రెడ్డి, నాయబ్రసూల్ తదితరులు పాల్గొన్నారు. వైవీయూ పీజీ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ రెండో సెమిస్టర్, లేటరల్ ఎంట్రీ థర్డ్ సెమిస్టర్, ఫైన్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిప్లమా కోర్సుల పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంఏ, ఎంఎస్సీ కోర్సుల్లో ఎక్కువ బ్రాంచ్ లు వంద శాతం ఫలితాలు సొంతం చేసుకున్నాయన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఉల్లి మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి – కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ జేసీ అదితి సింగ్తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత రైతుల పరిస్థితి దృష్ట్యా ఉల్లి కొనుగోలుపై వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించ రాదని జిల్లాలోని ఉల్లి ట్రెడర్లకు సూచించారు. రైతులు, వ్యాపారస్తులు.. ప్రభుత్వంతో సమన్వయంగా మార్కెటింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఉల్లి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో రైతులు పండించిన ఉల్లి పంటను మార్కెటింగ్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఎలాంటి చర్యలను అవలంబిస్తే అనుకూలంగా ఉంటుంది? అనే అంశంపై చర్చించడం జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ఉల్లి పంట కోతకు సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట దిగుబడిని ఎలా సంరక్షించుకోవాలి? ఒక్కసారిగా అధిక పంట యార్డులకు చేరితే దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే అంశాలను రైతులు, ట్రేడర్లతో చర్చించి.. ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన అవసరం
కడప ఎడ్యుకేషన్ : ప్రతి విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు. వైవీయూలోని న్యూ అడ్మినిస్ట్రేషన్ భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో 75 సంవత్సరాల భారత రాజ్యాంగంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం బాధాకరమన్నారు. సాంకేతిక పదజాలాన్ని సమకూర్చి సదస్సుల ద్వారా చైతన్యం చేస్తున్న కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ(సి.ఎస్ టి.టీ) సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రొఫెసర్ నవేద్ జమాల్ విద్యార్థుల ముంగిటకు విస్తృతంగా భారత రాజ్యాంగాన్ని తీసుకు వెళ్లాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. సిఎస్టీటీ ఏడీలు జెఎస్.రావత్, షాజాద్ అహ్మద్అన్సారీ మాట్లాడుతూ అంశాలు సమాచారయుతంగా, ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ డి.రవీంద్రసతీష్బాబు, ప్రొఫెసర్ ఏజీ దాము, ప్రొఫెసర్ వై.సుబ్బరాయుడు, డాక్టర్ కె.సీతామాలక్ష్మి, డాక్టర్ వీఎం.రాజశేఖర్ వివిధ అంశాలపై ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు వీసీ ఆచార్య శ్రీనివాసరావు, అతిథులు సర్టిఫికెట్లను అందజేశారు. వైవీయూ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు -
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరుసగా నాలుగు రోజులుగా పడిన ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ఒక రకంగా ముప్పే. ముఖ్యంగా ఉల్లి, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర పంటలు, పూల తోటలపై ప్రభావం చూపిస్తాయి. ఇంతటితో తగ్గుముఖం పడితే అంతగా నష్టం కలగదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పూల తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యాన పంటలైన మామిడి, సపోట, జామ, నిమ్మ, పెద్దనిమ్మ తదితరాలకు ఒక రకంగా మేలు జరగనుంది. మిగతా వ్యవసాయ, ఉద్యాన పంటలకు మాత్రం కొంతమేర ముప్పే. మూడో రోజూ కురిసిన వాన అత్యధికంగా వేములలో 40 మి.మీ -
కలెక్టర్ను కలిసిన ఎస్పీ
కడప అర్బన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ను నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సారిగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక జార్జ్కారొనేషన్ క్లబ్లో శుక్రవారం అండర్ –14, 17 జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ఐ రైఫిల్ షూటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 60 మంది క్రీడాకారులు పాల్గొని, తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఓపన్ సైట్, పీప్ సైట్, పిస్టల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, జార్జ్కారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, వైస్ప్రెసిడెంట్ బాలగంగిరెడ్డి, కో ఆర్డినేటర్లు ప్రవీణ్ కిరణ్, రాఘవేంద్ర, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పర్యవేక్షించారు. ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో శుక్రవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎంసెట్ ద్వారా వెటర్నరీ విశ్వవిద్యాలయం నిర్వహించిన మొదటి కౌన్సెలింగ్లో ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి, కళాశాల అడ్మిషన్ బృందం వారిని అడ్మిట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ 19, 20, 21 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 22 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందిర, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్రావణి ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్కు వెళ్లి పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగంలో సాధించిన సాంకేతిక అభివృద్ధి ముఖ్యంగా భారత్ ఈ రంగాల్లో సాధించిన ప్రగతిపై చర్చించేందుకు బీఐఎస్ సంస్థ ఈ అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసింది. -
సీమపై వివక్ష.. ఉద్యమమే రక్ష
కడప సెవెన్రోడ్స్: రాయలసీమపై కూటమి ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. తమ హక్కులు సాధించుకునేందుకు ఈ ప్రాంత వాసులకు పోరాటమే శరణ్యమని ఉద్యమ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు శనివారం ఉదయం 10.00 గంటలకు కోవెలకుంట్లలోని పేరా ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. కుందూ పోరాట సమితి నాయకులు కామని వేణుగోపాల్రెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా కుందూ పరిరక్షణ సమితి, కుందూ పోరాట సమితి, కోవెలకుంట్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక సంయుక్తాధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నేత కరీంబాషా తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ శాశ్వత కరువు నివారణకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టులను విస్మరిస్తోంది. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించకపోవడంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించి శ్రీశైలంలో.. ఆ మేరకు ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోవెలకుంట్ల సమీపంలోని జొలదరాశి, పెద్దముడియం మండలంలోని రాజోలు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. 17 ఏళ్లు గడిచినా ఇంతవరకు నిర్మాణం ఊసే లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో భూ సేకరణ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది గానీ ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. దీంతో భూములను అమ్ముకోవడానికి కూడా తమకు హక్కు లేకుండా పోయిందని కుందూ పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ఎత్తిపోతల పథక నిర్మాణ పనులు కూడా జరిగాయి. చంద్రబాబు అండ్కో కుతంత్రాలతో ఆ పథకం అర్ధాంతరంగా ఆగింది. గాలేరు–నగరి వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంపు చేసే పనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని పెట్నికోట వద్ద 20 టీఎంసీలు, కడప జిల్లా ముద్దనూరు మండలం దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కృష్ణానది వరద సమయాల్లో వీలైన మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దేనేపల్లె రిజర్వాయర్ నుంచి చక్రాయపేట మండలంలోని కాలేటివాగుకు నీరు తీసుకు రావాలని భావించారు. కాలేటివాగు నిర్మాణ పనులు కూడా దాదాపు 80 శాతం వైఎస్సార్సీపీ సర్కారు హయాంలోనే జరిగాయి. అక్కడి నుంచి కృష్ణా జలాలు వెలిగల్లు రిజర్వాయర్కు తరలించి హంద్రీ–నీవాతో అనుసంధానం చేసి మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనేది ఆ పథక ఉద్దేశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నిర్వీర్యంగా మార్చారు. బనకచర్ల నుంచి గాలేరు–నగరి వరద నీటి కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. వైఎస్ఆర్ హయాంలో పూర్తయిన వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్ ఆయకట్టు కింద సాగునీటిని అందించేందుకు డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్స్ పనులు కూడా.. చేపట్టకపోవడంతో ప్రాజెక్టుల భవిష్యత్తు అయోమయంగా మారింది. విద్య, వైద్య సౌకర్యాలు దూరం ఇకపోతే కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల పులివెందుల మెడికల్ కళాశాల 50 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇలా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందువల్ల ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత విద్యార్థులతోపాటు ప్రజలు విద్య, వైద్య సౌకర్యాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తరలించడం ద్వారా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను ఇటీవల మంత్రి లోకేష్ ప్రారంభించి.. అవి తానే ఏర్పాటు చేయించుకున్నట్లుగా చెప్పుకోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ద్వారా ఒత్తిడి తెస్తే తప్ప రాయలసీమకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు శనివారం కోవెలకుంట్లలో నిర్వహిస్తున్న సమావేశానికి పాత, కొత్త తరానికి చెందిన ఉద్యమ నాయకులు తరలి రావాలని కరీంబాషా కోరారు. రాయలసీమపై కూటమి శీతకన్ను సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పరిశ్రమలు, వైద్య రంగంపై నిర్లక్ష్యం ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం నేడు కోవెలకుంట్లలో నేతల సమావేశం -
జగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే..
సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరగని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – శ్రీకాంత్, వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని, అవన్ని ప్రభుత్వం నిర్వహించేటప్పుడు వీటిని ఎందుకు నిర్వహించలేమన్నారు. – సాయిదత్త, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
తోటల వద్దే కొనుగోలు చేయాలి
తోటల వద్దే ఉల్లి దిగుబడులు కొనుగోలు చేయాలి. మార్క్ఫెడ్ అధికారులు రైతులను దిగుబడులు అక్కడికి తీసుకురమ్మంటున్నారు. తీసుకెళ్లిన తర్వాత గ్రేడింగ్ చేసి ఖచ్చితమైన ధర రావచ్చు.. రాకపోవచ్చు అంటూ చెబుతున్నారు. దీంతో మార్కెట్కు రావాలంటే భయం వేస్తోంది. కర్నూల్ మార్కెట్లో రైతుకు క్వింటా రూ.500 నుంచి రూ.350 వరకు ధర ఇవ్వడంతో ఉల్లిగడ్డలను రోడ్డుపై పారబోశారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద కొనుగోలు చేయాలి. – మల్లికార్జునరెడ్డి, ఉల్లి రైతు, అహోబిలం -
వ్యక్తి అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన రసూల్(50) అదృశ్యమైనట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 16న ఇంట్లో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈనెల 17న తెల్లవారుజామున నుంచి అతను కనిపించకుండా పోవడంతో భార్య రషీద కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల గాలించింది. అతని ఆచూకీ లభించకపోవడంతో గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆణాబంకు వీధిలోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఇంద్రకంటి విజయలక్ష్మి (53) అదృశ్యమయ్యారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగిరాలేదు. ఆమె పట్టణంలో పలు చోట్ల అప్పులు చేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోటకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తమ్మిశెట్టి రామాంజ నేయులుకు కడప కోర్టు జడ్జి డాక్టర్ సి.యామిని పదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధించినట్లు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. వివరాలలోకి వెళితే.. వేంపల్లె గ్రామంలోని పుల్లయ్యతోట వీధికి చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులు వృత్తి రీత్యా పెయిటింగ్ పనిచేస్తున్నాడు. 2019 ఆగస్టు, 26న అదే వీధికి చెందిన మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విచారించిన జడ్జి నిందితుడికి పదేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు. జూదరుల అరెస్టు ఖాజీపేట : జూదమాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు. నాగసానిపల్లె పొలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని, వారి నుంచి రూ.78,470 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఏడు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కడప సెవెన్రోడ్స్ : లాటరీ ద్వారా జిల్లాలో ఏడు బార్లను గురువారం కేటాయించారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులకు బార్లను కేటాయించారు. కడపలో నాలుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్లలో ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవికుమార్, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ
● ప్రకటనలే పరిమితమైన ఉల్లి కొనుగోలు కేంద్రాలు ● స్వయంగా జేసీ ప్రకటన చేసినా స్పందన కరవు ● కొనుగోలు కేంద్రాలు తెరవని మార్కెటింగ్ అధికారులు ● రెండు రోజుల వర్షంతో రైతుకు కొలుకోలేని దెబ్బ జిల్లాలోని మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డులలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్కెఫెడ్ ద్వారా క్వింటాల్ రూ.1200కు కొనుగోలు చేస్తామని ఈ నెల 4న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం 15 రోజులు గడచినా అతీగతీ లేకపోవడంతోపాటు జేసీ ప్రకటన పేపర్కే పరిమితమైందా అంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) మీన్పల్లి 4089.63 మైదుకూరు 1778.60 వేముల 1004.89 పెండ్లిమర్రి 825.22 దువ్వూరు 904,78 తొండూరు 693.95 వేంపల్లి 391.52 ఎర్రగుంట్ల 311.83 ముద్దనూరు 314.88 కాశినాయన 156.97 కడప అగ్రికల్చర్/సింహాద్రిపురం: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 11347.67 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. 92,300 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చే అవకాశముందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లి కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసాయి. దీంతో భూమిలోనే ఉల్లి కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింహాద్రిపురం మండలం అహోబిలం రైతు అంకాల్ రెడ్డి ఎకరాకు రూ.70 వేలు వెచ్చించి మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. దిగుబడులకు గిట్టుబాటు లేకుండాపోయింది. కొనుగోలు చేస్తామన్న అధికారులు చేతులెత్తేయడం, వ్యాపారి ముందుకు రాకపోవడంతో రైతు ఉల్లి దిగుబడులను ఉచితంగా గ్రామ ప్రజలను తీసుకెళ్లమని చెప్పాల్సి వచ్చింది. ఈయనే కాదు.. మా ఘోష వినేవాళ్లే లేరా అని కన్నీళ్లు దిగమింగుతున్న రైతులు ఎందరో ఉన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు ఉల్లి పంటకు మద్ధతు ధర క్వింటా రూ.1200లకు కనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాయింట్ కలెక్టర్ కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పినా అనంతరం స్పందన లేకపోయింది. దీంతో ఒక పక్క మద్దతు ధర లేక.. మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేయక అల్లాడిపోతున్న ఉల్లి రైతుకు గోరుచుట్టుపై రొకటిపోటు అన్నట్లు ఆల్పపీడనంతో కురిసిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. కనీసం సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్వింటా రూ.500లు పలికితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని, చేసిన అప్పులు తీరవని రైతులు వాపోయారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనీసం కూలి డబ్బు రాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతన్నలు మేలు జరుగుతుందని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు తమ దిగుబడులను ఆయా మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో విక్రయించుకోవచ్చు. వారు దిగుబడులు తీసుకువచ్చి అక్కడే ఎవరికై నా విక్రయించవచ్చు. రైతులు ఏ విధమైన గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదు. నేరుగా మార్కెట్ యార్డులు, రైతు బజార్లకు వెళ్లి కిలో రూ.12 ప్రకారం విక్రయించుకునే అవకాశం కల్పించాం. ఉల్లి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కలెక్టర్, వైఎస్సార్ కడప జిల్లా -
ఆర్భాటం.. హంగామా.. అంతలో వెనక్కు
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరినీ విజయవాడకు పిలిపించి ఏదో హంగామా చేయాలని భావించారు.. వారికి ఆర్భాటంగా నియామక పత్రాలను అందిస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆఘమేఘాలపై పరుగున వచ్చారు. దీరా అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినందున నిలిపివేశామనడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులు, వారికి తోడుగా వచ్చే బందువులను విజయవాడకు తరలించేందుకు కడప డీఈఓ కార్యాలయం వద్ద బస్సులను(జిల్లా నుంచి 40 బస్సులు) సిద్ధం చేశారు. నలుమూలల నుంచి చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేకువగానే కడప డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టిఫిన్ చేసి బయలు దేరేందుకు బస్సులు కూడా ఎక్కారు. ఇంతలోనే కార్యాక్రమం రద్దు చేశారని మేసేజ్ వచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు నిరుత్సాహ పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ వెనక్కు వెళ్లారు. డీఈఓ షేక్ షంషుద్దీన్తో మాట్లాడగా అధిక వర్షంతో విజయవాడలో కార్యక్రమం రద్దు అయిందని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలో మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులకు తెలియచేస్తామని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నిరుత్సాహం -
జగనన్న కాలనీలో చోరీ
వేంపల్లె : స్థానిక గండి రోడ్డులోని జగనన్న కాలనీలో చోరీ జరిగింది. బాధితురాలు వాణి వివరాల మేరకు.. స్థానిక జగనన్న కాలనీలో నివాసముంటున్న వాణి లిటిల్ ప్లవర్ పాఠశాలలోనూ, ఆమె భర్త నాగేంద్ర యూసీఐఎల్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఇంటికి తాళాలు వేసి ఇరువురు విధులకు వెళ్లగా.. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. బీరువాలో రూ.50 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు అభరణాలను దొంగలించినట్లు తెలిపారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ మోటార్ల దొంగ అరెస్టు బద్వేలు అర్బన్ : పగలు పాత సామాన్లు కొంటామని వచ్చి రాత్రి పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగను బద్వేలు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకరులకు మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్.ఆర్.పల్లిలోని ముస్లీం వీధికి చెందిన పాశంరాజేష్ వివిధ ప్రాంతాల్లో పాత సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట విద్యుత్తు మోటార్లను చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గోపవరం మండలం సండ్రపల్లెలో, ఈ నెల 10న బద్వేల్ మండలం వనంపులలోని పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసినట్లు రైతులు ఫిర్యాదు చేయడంతో విచారించిన పోలీసులు నిందితుడిని గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మూడు విద్యుత్ మోటార్లతో పాటు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య, ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహణపై విచారణ కడప అర్బన్ : కడప నగరంలోని కేంద్ర కారాగారంలో 2023 నవంబర్, 28న మెడికల్ క్యాంపు నిర్వహణపై కర్నూలు ఎస్పీ విక్రాంత్పాటిల్, కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు, విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ గురువారం విచారించారు. కమిటీ అధికారుల ఎదుట క్యాంపు నిర్వహించిన డాక్టర్లు, అప్పటి కారాగార అధికారులు హాజరయ్యారు. విచారణలో వీరి స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారు. పోలీసుల అదుపులో ఎర్రచందనం కూలీలు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె వద్ద గురువారం రాత్రి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు ఎర్రచందనం కూలీలను కడప ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు రెండు వాహనాల్లో వెళ్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్దశెట్టిపల్లె వద్ద కాపుకాచారు. ఈ క్రమంలో వారు అక్కడికి రాగానే పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని కడపకు తరలించారు. ప్రధాన స్మగ్లర్ కోసం పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. కూలీల వెనుక ఉన్నది జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్లా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనేది తెలియాల్సి ఉంది. -
జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట
– రూ.8లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం బద్వేలు అర్బన్ : జల్సాలకు అలవాటుపడి సులువుగా చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.8 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని మరాఠి వీధికి చెందిన నారాయణ దిలీప్కుమార్, భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్నాయబ్రసూల్ స్నేహితులు. కడప నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం అలవాటు చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట సొంత అన్న ఇంట్లోనే ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 10న బద్వేల్కు వచ్చిన ఇరువురు వెంకటయ్యనగర్లో శ్రీనివాసులు ఇంటికి తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు విచారించిన పోలీసులు బద్వేల్–మైదుకూరు రహదారిలో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 118.04 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల నాలుగు వెండి బిళ్లలు లభించాయన్నారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐలు సత్యనారాయణ, జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడప నగరంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగానికిగానీ, పోలీస్ వ్యవస్థకుగానీ ఇసుమంతైనా చలనం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు తమను తాము పెద్ద రాజుల స్థాయిలో ఊహించుకుంటూ ఓ చేత్తో రెవెన్యూ, మరో చేత్తో పోలీసులను పెట్టుకొని ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇక శాంతిభద్రతలు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం కదా...వాటిని నియంత్రించ లేనిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యులకు పాలనాపగ్గాలు అప్పగించామా...అని ప్రజలు చింతిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పి. జయచంద్రారెడ్డి, జమాల్వలీ, షఫీ, సుభాన్బాషా, త్యాగరాజు, షంషీర్, గౌస్, అక్బర్ పాల్గొన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కడప ఆలంఖాన్పల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అన్నారు. జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందు రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ప్రజలు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ప్రార్థనల్లో ఎంపీ మిలాద్ ఉన్ నబీ మాసోత్సవం సందర్భంగా కడప లోని శ్రీక్రిష్ణ దేవరాయ సర్కిల్ సమీపంలో వైఎస్సార్సీపీ నేత ఎస్ఎండీ ఆజమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అంజద్బాషా ప్రజా దర్బార్లో నాయకులతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ ఇంత జరుగుతున్నా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగంలో చలనం లేదు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ప్రతి రైతుకు యూరియా అందిస్తాం
దువ్వూరు: మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని చింతకుంట గ్రామంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దువ్వూరు మండలానికి 13,560 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు కాగా, ఇంత వరకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని కలెక్టర్ అడిగిన ఓ ప్రశ్నకు జేడీఏ చంద్రానాయక్ సమాధానమిచ్చారు. ఇంత స్థాయిలో యూరియా వచ్చినా రైతులకు యూరియా అందలేన్న సమస్య ఎందుకు వస్తోందని కలెక్టర్ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. అనంతరం సచివాలయంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కొంత మంది రైతులకే యూరియా అందుతోందని, యూరియా కోసం క్యూలో ఉన్నా అందడం లేదని పలువురు వాపోయారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, పూర్తి స్థాయిలో యూరియా అందిస్తామని తెలిపారు. ఉల్లి రైతులకు న్యాయం చేస్తాంఖాజీపేట: ఉల్లి పంటకు సరైన పరిహారం అందించి.. రైతులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ శ్రీధర్ భరోసా ఇచ్చారు. ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె లో ఉల్లి రైతులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. పొలంలోని పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర దక్కడం లేదని పలువురు రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తహసీల్దార్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
వాన వెల్లువాయె!
మేఘం గర్జించింది.. చిమ్మ చీకటి వేళ.. కమ్ముకొచ్చి కుండపోతగా కురిసింది..అంతే తెల్లారేకల్లా వాగు ఉప్పొంగింది. నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది.. ఇల్లంతా నీరు... ఊరంతా ఏరయింది. ఇక పంటంతా నీటిలో మునిగింది.. రైతు కంట కన్నీరొలికింది. గురువారం తెల్లారుజామున కురిసిన వర్షం.. పలు మండలాల్లో బీభత్సమే సృష్టించింది. వల్లూరు: కోట్లూరు పొలాల్లో నేలకొరిగిన వరిప్రొద్దుటూరులో రోడ్డుపై వర్షపు నీరుకడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున కుండపోత వాన కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో కంది, మినుము, ఉల్లి, జొన్నలతోపాటు పలు ఆరుతడి పంటల్లో వర్షపు నీరంతా నిలి చింది. పంట పొలాల్లో నిలిచిన వర్షపునీరు వంకలను తలపించాయి. జిల్లాలో ఎర్రగంట్ల మండలంలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురవడంతో పొట్లదుర్తిలోని ఎన్టీఆర్కాలనీ, ఎర్రగుంట్లలోని సుందరయ్యకాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎర్రగుంట్ల్ల ప్రొద్దుటూరు మద్య ప్రధా న రహదారిలోని కుంది నదీ ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పులూరులో మసీదు ప్రహారీ కూలిపోయింది. పాగేరు వంక ఉధృతంగా ప్రహించడంతో కమలాపురం– ఖాజీపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే పెద్దముడియం మండలం పాలూరులోని నోస్సం వంక ఉధృతంగా ప్రవహించింది. కన్నెలూరులోని నివా సం ఉన్న ఓ కుటుంబం బైక్లో నొస్సం వంక దాటుతుండగా అదుపుతప్పి కొట్టుకపోతుండటంతో పాలూరుకు చెందిన కొంతమంది యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. అలాగే ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో రాజుపాలెం వెంగలాయపల్లి గ్రామాల మధ్యలో మడువంకపై వర్షపు నీరు ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దముడియంలో పంటపొ లాల్లో నీరు నిలిచి చెరువులను తరలించాయి. ఈ వర్షంతో విత్తిన మినుమంతా భూమిలోనే కుల్లిపోతుందని రైతులు వాపోయారు. ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కడప నగరంలోని ఫాతిమా కాలేజ్ వద్ద.. పలు కాలనీలు జలమయం పలుచోట్ల రాకపోకలు బంద్ ఉద్యానపంటలతోపాటువ్యవసాయ పంటలకు నష్టం -
20న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం
కడప కార్పొరేషన్: కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ భవన్లో ఈనెల 20వ తేది ఉదయం 9 గంటలకు వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బరాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటిపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు బండి ప్రసాద్, రవి, అజయ్, శ్యామ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ● రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాక ● జయప్రదం చేయాలని జిల్లాఅధ్యఽక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు పిలుపు -
22 నుంచి దసరా ఉత్సవాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక పాత మార్కెట్లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. దేవీ శరన్నవ రాత్రులకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా రోజూ అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. లోకకల్యాణార్థం లక్ష్మీగణపతిహోమం, సుదర్శన, పవమాన, అరుణ, సరస్వతి, రుద్ర, దుర్గా, చండీ హోమాలు, వేదపారాయణం యంత్ర ఆరాధన, జప పారాయణం నిర్వహిస్తామన్నారు. రతనాల వేంకటేశ్వరస్వామికి, స్వామివారి చెల్లెలు లలితాదేవి మూలవిరాట్లను పూలు, గాజులు, నగదు, కూరగాయలు, ముత్యాలకవచం, వత్తిపత్తితో అలంకరిస్తున్నామన్నారు. అసౌకర్యం కలుగకుండా బారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రణభేరి ప్రచార జాత గురువారం సాయంత్రం కడపకు చేరుకుంది. యూటీఎఫ్ నాయకులు సాదర స్వాగతం పలుకుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా బాలాజీ నగర్ యూటీఎఫ్ భవన్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆరు నెలలలోగా ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, జయచంద్రారెడ్డి, నాయకులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్, ఎస్.జాబీర్, సమీర్బాషా, నరసింహారావు, వై.రవికుమార్ డి.సుజాతరాణి, సివి.రమణ, ఎస్.ఎజాస్ అహమ్మద్, డి.క్రిష్ణారెడ్డి, సి.సుదర్శన్, ఎద్దు రాహుల్, వీరపోగురవి, తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి డిగ్రీ విద్యాసంస్థల బంద్ కడప ఎడ్యుకేషన్ : డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి డిగ్రీ విద్యా సంస్థల నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేటు మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటశీను తెలిపారు. యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మనురాయన గురువారం కలిసి బంద్ నోటీసులు అందజేశారు. వెంకట శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6400 కోట్ల బకాయిలు ఉన్నాయని, అనేకమార్లు అధికారులకు వినతిపత్రం అందించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, ఫీజులు వసూలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నుంచి హుకుం జారీ చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు నిర్వహించలేక బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. సంజీవరెడ్డి, రవిశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మధ్దతు ధర ప్రకటించాలి...
ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలో ఆరెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. త్వరలో పంట దిగుబడి వస్తుంది. ధర చూస్తే రూ.1000 ఉంది. గత నెలలో క్వింటా ఉల్లి గడ్డలు రూ.1500 నుండి రూ.1800ల వరకు పలికాయి. ప్రస్తుతం క్వింటా ఉల్లి ధర రూ.500లు పలికితే పూర్తిగా నష్టపోతారు. ఈ ధర ఏమాత్రం గిట్టుకోదు. ప్రభుత్వం ఉల్లికి రూ.3 వేల మద్ధతు ధర ప్రకటించాలి. పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దళారీల ప్రమేయం ఎక్కువగా ఉండడంతో రైతు నష్టపోవాల్సి వస్తోంది. – గంగా సురేష్, ఉల్లి రైతు, దండుపల్లి, యర్రగుంట్ల మండలం -
ఎర్రగుంట్లలో అత్యధికంగా..
అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలలో ఎర్రగుంట్లలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే ప్రొద్దుటూరులో 120.2, సికెదిన్నెలో 110.4 , పెండ్లిమర్రిలో 89.4 , రాజుపాలెంలో 83.2 , పెద్దముడియంలో 80.8 , వల్లూరులో 76.8, చెన్నూరులో 78.6 , పులివెందుల్లో 77 , కమలాపురంలో 76.2 , వేంపల్లిలో 68.2 , ఖాజీపేట 66 , వీఎన్పల్లిలో 60.2 కడపలో 54.8 , చక్రాయపేటలో 53.2 , సిద్దవటంలో 48.2 , ముద్దనూరులో 43.2 , దువ్వూరు 34.6 , ఒంటిమిట్టలో 32.2 , జమ్మలమడుగులో 30.2 , లింగాల 25.2 , అట్లూరు 26.2 , సింహాద్రిపురం 19.6 , మైదుకూరు 16.2 , వేముల 15 , తొండూరు 12.4 , బద్వేల్ 12.2 , చాపాలు 8.6 , మైలవరం 7.4 , పోరుమామిళ్ల 6.2 , బిమఠం 5.8 , బి కోడూరు 3.8 , కాశినాయన 2 , గోపవరం 1.6 మి.మీ వర్షం కురిసింది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయిచినట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. వైఎస్సార్ స్మారక ప్రెస్క్లబ్లో అఖిలపక్ష యువజన సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మంజూరు చేయించి, అందులో 8 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు సొంతజిల్లా అయిన చిత్తూరులోని మదనపల్లెలో 98 ఎకరాల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కాలేజీ నిర్మిస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వద్దని లేఖ ఇచ్చిన దద్దమ్మ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను రద్దు చేసేవరకూ పోరాటం ఆపేది లేదని, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతోపాటు, ఛలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రవి, చంద్ర, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఏఐవైఎఫ్ నాయకులు ప్రభాకర్, ఏఐఎస్బి నాయకులు రాజేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
పులివెందుల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగనన్న పేదల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని అందుకు తగిన కార్యాచరణతో నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే దాదాపు పూర్తయిన మెడికల్ కళాశాలలను పూర్తి కాలేదంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్పరం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు.ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, అలాగే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతుందన్నారు. పులివెందులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వచ్చి పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని భావించి 50మెడికల్ సీట్లను మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. అయితే పులివెందులపై ఉన్న వివక్షతతో మంజూరైన మెడికల్ సీట్లను కుంటి సాకులు చెప్పి వెనక్కి వెళ్లేలా చేసిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఎంపీ అన్నారు. రాష్ట్రంలోని 17మెడికల్ కళాశాలలకు సంబంధించిన లక్ష కోట్ల ఆస్తిని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం శోచనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్సార్సీపీలోకి 12 కుటుంబాలు మండల కేంద్రమైన వేముల ఎస్సీ కాలనీలోని టీడీపీకి చెందిన 12 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిల ఆధ్వర్యంలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాగలేటి ప్రతాప్, అలవలపాటి గంగాధర, దారతోటి గుంటెన్న, రాచూరు రాఘవ, కొండూరు శ్రీనివాసులు, ఉలిమెల్ల గంగాధర్, గొందిపల్లె గంగాధర్, గొందిపల్లె కరుణాకర్, చాగలేటి పుల్లయ్య, గొందిపల్లె సుమంత్, కొట్టం శ్రీరాములు, గొందిపల్లె రామాంజులతోపాటు మరికొంతమంది ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తుండటంతో విసుగు చెందామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చలపతి, నాగప్ప, గంగాధర తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన వేముల మండల టీడీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఆర్భాటం.. హంగామా?
డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ: 19వ తేదీ ఉమ్మడి కడప జిల్లాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు: 628 మంది కడప ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామా తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ● ఉమ్మడి కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాలు రాని పలువురు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లటం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ● కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు జిల్లా స్థాయిలోనే జరిగేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో పలు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. ● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 400 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. ప్రభుత్వం నిర్ణయంతో పలువురు మండిపడుతున్నారు. వైఎస్సార్జిల్లా నుంచి 1600 మంది 40 బస్సుల్లో వెళ్లనున్నారు. జిల్లాలోనే నియామకపత్రాలు అందచేయాలి డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులకు జిల్లాస్థాయిలోనే నియమాకపత్రాలు అందచేయాలి. విజయవాడకు రమ్మని చెప్పడం సరికాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా చేయడం అన్యాయం. అధికారులు పునరాలోచించాలి. – సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా! మండిపడుతున్న అభ్యర్థులు -
సమ్మెకు.. నోటీసులు
కడప కార్పొరేషన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందే అక్టోబర్ 1 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమపై ప్రభుత్వం మోపుతున్న పనిభారం తగ్గించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి అధికారులకు సమ్మె నోటీసులు ఇప్పటికే అందజేశారు. ఈనెల 22వ తేదీ నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టి అక్టోబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో 889 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా, వాటిలో సుమారు 7600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. వలంటీర్ల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకే... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, కార్యక్రమాలను వలంటీర్లు అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల జీతమిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2024లో అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు జీతాలు పెంచకపోగా వలంటీర్ల వ్యవస్థనే ఎత్తేసింది. కూటమి పాలనలో వలంటీర్లు లేకపోవడంతో ఆ పనులన్నీ చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపైన పడింది. దీంతో సహజంగానే సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్, బయోమెట్రిక్ వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణలతో భారం అధికమైంది. ఆందోళనకు కార్యాచరణ ప్రణాళిక తమ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సమ్మె నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 30వ తేదిలోపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. ● ప్రతిసారీ సర్వేల పేరుతో ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతూ, ఆత్మ గౌరవం కోల్పోతున్నాం. వీటి నుంచి విముక్తి కల్పించాలి. ● విద్యార్హతల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు అప్పగించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి. ● సమయపాలన లేని, ఒత్తిడితో కూడుకున్న విధుల నుంచి విముక్తి కల్పించాలి. ● సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించడం ఆపాలి. ● ఆరేళ్లు ఒకే క్యాడర్లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషనరీ సమయంలో రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్టైమ్ నిర్ణయించాలి. ● పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లోని ఖాళీలకు 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● సర్వేలను ఆయాశాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి. అత్మగౌరవం దెబ్బతింటోంది సచివాలయ ఉద్యోగులు ఏ విధులు నిర్వహించాలో వాటినే ప్రభుత్వం అప్పగించాలి. అసలు ప్రజల ఇళ్ల వద్దకు సర్వేలు చేయడం, తమకు సంబంధం లేని ఎరువుల విక్రయాల వద్ద విధులను అప్పగించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. తమ విధులేమిటో ప్రభుత్వం నిర్ణయించి జాబ్చార్జ్ను ప్రకటించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళతాం. – హీరామియ్యా, జిల్లా అధ్యక్షుడు. గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్వలంటీర్లు చేసే పనంతా మాపై పడింది ఇదివరకు 50 ఇళ్లకు ఒక వలంటీరు ఉండేవారు. ఒక సచివాలయంలో 25 క్లస్లర్టు ఉంటాయి. వలంటీర్లు చేసే పనంతా మాపైనే పడుతోంది. డ్యూయల్ బాసిజం మాపై ఎక్కువైంది. అన్ని రకాల పనులు మాతోనే చేయిస్తున్నారు. ఇది చాలా దారుణం. అలాగే పదోన్నతులు కల్పించడానికి తగిన విధి విధానాలు రూపొందించాలి. – పి. సిద్దేశ్వర్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘంచిన్నచూపు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీ ర్యం చేస్తున్నారు. ఒక్క సమస్యకు పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన మేము ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తక్షణమే జాబ్చార్జ్ను ప్రకటించాలి. – ఎం. మస్తాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 22 నుంచి సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట డిమాండ్లు తీర్చాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ జిల్లాలో 889 సచివాలయాలు, సుమారు 7600 మంది ఉద్యోగులు -
ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్: విమాన ప్రయాణీకుల మన్ననలు పొందేలా సేవలు అందిస్తున్నామని కడప ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పొదార్ తెలిపారు. బుధవారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కడప ఎయిర్పోర్టులో యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. తొలుత వివిధ ప్రాంతాల నుంచి కడపకుచేరుకున్న యాత్రికులకు డైరెక్టర్తోపాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు.అలాగే రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్చందంగాపాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అతిథులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితోపాటు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు, రామకృష్ణ మిషన్ సభ్యులు, ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్వకర్మకు ఘన నివాళి
కడప సెవెన్రోడ్స్: శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బుధవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డీఆర్వో మాట్లాడుతూ కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘విశ్వకర్మ జయంతి’’ గా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖఅధికారులు, పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, పాల్గొన్నారు.