YSR District News
-
చెరువు మట్టిని తరలిస్తే తీవ్రంగా నష్టపోతాం
వేముల : చెరువులో మట్టిని తరలిస్తే తీవ్రంగా నష్టపోతామని బాధిత రైతులు శుక్రవారం టిప్పర్లను అడ్డుకుని నిరసనకు దిగారు. గత నెల రోజులుగా వేములకు సమీపంలో ఉన్న చెరువులో మట్టిని రోడ్డు పనులకు తరలిస్తున్నారు. చెరువులో మట్టిని తరలించడంతో మరము బయట పడింది. దీంతో చెరువు కింద భాగంలో ఉన్న బాధిత రైతులు శుక్రవారం చెరువు వద్దకు చేరుకుని మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. నెల రోజులుగా రోడ్డు పనులకు చెరువు మట్టిని తోలడంతో మరము బయట పడిందన్నారు. చెరువుకు నీరు చేరితే మరములో నీరు ఇంకి కింద భాగంలో ఉన్న పొలాలపై నీరు ఊటలెత్తుతుందని, మట్టిని తరలించొద్దని ప్రొక్లెయిన్లను, టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఇప్పటికే చెరువులో నీరు ఉంటే కింద భాగంలో నీరు ఊటలెత్తి పొలాలపై పారడంతో పంటలు పండక నష్టపోతున్నామని వాపోతున్నారు. చెరువులో మట్టిని తోలుకునేందుకు అనుమతులు ఉంటే చూపించాలని బాధిత రైతులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని బాధిత రైతులను, రోడ్డు నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత రైతులు చెరువులో మట్టి తోలితే ఎదురయ్యే నష్టాలను, ఇబ్బందులను సీఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రవీణ్కుమార్లకు వివరించారు. ఇప్పటికే చెరువు కింద ఊటలెత్తి పంటలు పండటం లేదని, మట్టిని తోలితే పూర్తిగా భూములను వదులుకోవాల్సి వస్తుందని విజ్ఞప్తి చేశారు. దీంతో చెరువులో మట్టిని తోలుకునేందుకు అనుమతులు చూపించాలని రోడ్డు నిర్వాహకులకు సూచించారు. అలాగే ఇరిగేషన్ అధికారులతో పోలీసులు చెరువులో మట్టిని తోలుకునేందుకు ఏవైనా అనుమతులు ఇచ్చారనే విషయంపై మాట్లాడారు. దీనికి ఇరిగేషన్ అధికారులు మట్టిని తోలుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు చెరువులో మట్టిని అనుమతులు తీసుకున్న తర్వాతనే తోలుకోవాలని, అంతవరకు నిలిపివేయాలని రోడ్డు నిర్వాహకులకు సూచించారు. మరోసారి టిప్పర్లను అడ్డుకున్న బాధిత రైతులు -
రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా
ప్రొద్దుటూరు : మిర్చి రైతుల సమస్యలపై ప్రశ్నించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసులు పెట్టడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శిపవ్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. జగన్తోపాటు మిర్చి యార్డుకు వెళ్లిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సంఘటన స్థలంలోలేని మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సూపర్ 6 అమలు చేయలేదని, మెగా డీఎస్సీ అమలు కాలేదని, రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం సిగ్గుపడాల్సిందిపోయి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడం తగునా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ప్రకటించని 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, తద్వారా రూ.65వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, ఇంటి గ్రేటెడ్ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా పరీక్షలు చేయడం, ఉచిత పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, ఈ క్రాప్ విధానం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇచ్చేవారన్నారు. ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్దేనన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వీటన్నింటిని గాలికి వదిలేసిందన్నారు. చంద్రబాబు రైతులకు పెట్టుడి సాయం కింద రూ.20వేలు ఇస్తానని చెప్పి ఇంత వరకు 20 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటాలు మిర్చి ధర రూ.24వేలు ఉండగా, ప్రస్తుతం రూ.10వేలకు పడిపోయిందన్నారు. ప్రతి ఎకరానికి మిర్చి రైతు రూ.లక్ష నష్టపోయారని తెలిపారు. ఈ కారణంగానే జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారని చెప్పారు. మా నాయకుడు కేసులకు భయపడడు తమ అధినాయకుడు జగన్ కేసులకు భయడపడుతాడు అనుకోవడం టీడీపీ నాయకుల అవివేకమని రాచమల్లు అన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలసి రావాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జేష్టాది శారద, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం లావణ్య, పాతకోట మునివంశీధర్రెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుద్దేటి రాజారాంరెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ దేసు రామ్మోహన్రెడ్డి, చేనేత విభాగం కన్వీనర్ చౌడం రవిచంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
సోషల్ మీడియా అకౌంట్లపై కేసు నమోదు
కడప అర్బన్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై జనసేన పార్టీ ఎన్నికల ప్రోగ్రాం కమిటీ రా యలసీమ కో–కన్వీనర్ పండ్రా రంజిత్కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చే శారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫోటోల ను మార్ఫింగ్ చేసి ఆయన కుటుంబసభ్యులను అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు సమాజంలో విద్వేషాలు కలిగించేలా రాజకీయపార్టీల మధ్య ఘర్షణకు దారి తీసి శాంతికి భంగం కలిగించేలా వున్నాయనీ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే వైఎస్సార్ జిల్లా కడప తాలూకా ఎస్ఐ తాహీర్ హుసేన్ కేసు నమోదు చేశారు. -
కారు ఢీకొన్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం ఉటుకూరు సర్కిల్ సమీ పంలో బైకును వెనుక నుంచి ఫార్చునర్ కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ఎర్రమరెడ్డి వెంకటేశ్వరరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. వివరాలిలా.. మృతుడు ఎర్రమరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఈనెల 20వ తేదీన సాయంత్రం ఉటుకూరు వద్ద వున్న గోపాల్ పొల్యూషన్ షాపు వద్ద తన మోటార్ సైకిల్పై వెళుతుండగా కడప వైపు నుంచి వస్తున్న ఫార్చునర్ కారు మోటార్ సైకిల్ను ఢీ కొంది. ప్రమాదంలో వెంకటేశ్వురరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కడప రిమ్స్కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 13 మంది జూదరుల అరెస్టు – రూ.3.45లక్షల నగదు స్వాధీనం పులివెందుల రూరల్ : నియోజవర్గంలోని తొండూరు మండలం మల్లేల అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3.45లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్స్టేషన్లో రూరల్ సీఐ మాట్లాడుతూ నియోజకవర్గం మండలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో మొదటిసారిగా తొండూరు మండలం మల్లేల గ్రామంలో అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఓం ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు. నియోజకవర్గ మండలంలో ఎక్కడైనా జూదమాడాతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని రింగురోడ్డు పైన జయరాజ్ గార్డెన్స్ వద్ద జరిగిన రోడ్డ ప్రమాదంలో కొండపల్లి సుమంత్ మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివ శంకరనాయక్ తెలిపారు. వివరాలిలా.. మతుడు నంద్యాల టౌన్, పొన్నాపురం నివాసి. అతని స్నేహితులు శివ, సురేంద్ర లతో కలసి ముగ్గురు బుల్లెట్ వాహనంపై శుక్రవారం తెల్లవారుజామున తిరుమలకు దైవ దర్శనానికి బయలుదేరారు. చింతకొమ్మదిన్నె పరిధిలోని రింగరోడ్డులో జయరాజ్ గార్డెన్స్ వద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించక వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. గాయపడిన సుమంత్, శివను చికిత్స కోసం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అప్పటికే సుమంత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరికి గాయాలు వల్లూరు : మండల పరిఽధిలోని గోటూరు సమీపంలోని వంతెన వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు అందించిన వివరాల మేరకు చైన్నె నుంచి ముంబైకి స్క్రాప్ లోడుతో వస్తున్న కంటెయినర్ లారీ గోటూరు సమీపంలోని వంతెన వద్ద అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. దీంతో మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ శివానంద్ లోనీ, క్లీనర్ సంతోష్ గాయపడ్డారు. దీంతో 108 వాహనంలో వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
దాల్మియా నిర్వాకంతో రైతులకు తీవ్ర నష్టం
జమ్మలమడుగు/మైలవరం : నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలంలో ఏర్పాటైన దాల్మియా సిమెంట్ కర్మాగారం నిర్వాకంతో పరిసర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన దాల్మియా సిమెంట్ కర్మాగారం కారణంగా నష్టపోతున్న నవాబుపేట, చిన్న కొమెర్ల, దుగ్గన పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చి సహకరించిన రైతుల పట్ల దాల్మియా యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దాల్మియా యాజమాన్యం వంకలు,వాగులు ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల వర్షాకాలంలో వరదలు వచ్చిన ప్రతి సారి పంట పొలాలు నీట మునుగుతున్నాయని అన్నారు. దీనిపై నవాబుపేట, దుగ్గనపల్లి ఎస్సీకాలనీ ప్రజలతోపాటు చిన కొమెర్ల గ్రామానికి సంబంధించిన రైతులు అనేక సార్లు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిగా వంకలను పూర్తిగా ఆక్రమించి కట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని యాజమాన్యానికి వివరించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో మూడు గ్రామాలకు చెందిన రైతులు లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. గతంలో అధికారులు దాల్మియా యాజమాన్యం ప్రలోభాలకు లొంగి తప్పుడు రిపోర్టు ఇచ్చారన్నారు. ఇటీవల లోకాయుక్త కమిటీ ఈ ప్రాంతాన్ని పర్యటించి నివేదిక ఇచ్చింది. పంటపొలాలతో పాటు బ్లాస్టింగ్ వద్ద దెబ్బతిన్న నవాబు పేట గ్రామ ప్రజల ఇండ్లకు పరిష్కారం, దుగ్గనపల్లి గ్రామంలోని రైతుల పంట పొలాలకు పరిహారం ఇవ్వడంతోపాటు వారి గ్రామాన్ని వేరే చోటుకు తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని లోకాయుక్త యాజమాన్యానికి సూచించింది. అయితే యాజమాన్యం ఇవేమి పట్టించుకోకుండా ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వ్యతిరేకం కాదు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధుమ్ము, ధూళి వల్ల కేవలం 200 మీటర్లదూరంలో ఉన్న దుగ్గన పల్లి గ్రామస్తులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారన్నారు. వాటికి పరిష్కారం చూపకుండా రెండో ప్లాంట్ విస్తరణకు వెళితే రైతుల కోపాన్ని యాజమాన్యం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దాల్మియా విస్తరణకు సహకరించం : తమ సమస్యలకు పరిష్కారం చూపని దాల్మియా విస్తరణ కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని మూడు గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. ఈనెల 27వతేదిన జరిగే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే రెండో ప్లాంట్ నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో తాము సహకరింబోమని మైలవరం మండలం నవాబుపేట, దుగ్గనపల్లి, కొమెర్ల గ్రామాలకు చెందిన రైతులు తెగేసి చెబుతున్నారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివ గుర్విరెడ్డి,నవాబుపేట భాస్కర్రెడ్డి ,మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డితదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
‘చదువుకు పేదరికం అడ్డుకాదు’
చాపాడు : చదువుకు వృత్తి, పేదరికం అడ్డుకాదని.. పుట్టింది సాధారణ పేదింటి కుటుంబమైనా రైతు బిడ్డగా కష్టపడి చదివి డాక్టర్ పట్టా సాధించి తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులను ఆనందపరిచాడు మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన విద్యార్థి పోలు అంకిరెడ్డి. కేతవరం గ్రామానికి చెందిన పోలు ఆశోక్రెడ్డి, విజయలక్ష్మీ దంపతుల కుమారుడు పోలు అంకిరెడ్డి కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నాడు. రైతు కుటుంబానికి చెందిన అంకిరెడ్డి తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా ప్రొద్దుటూరు – మైదుకూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ సమీపంలో టీ షాప్ నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న అంకిరెడ్డి ఎంఎస్ జనరల్ పూర్తి చేసి పేద ప్రజలకు వైద్యం అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపాడు. -
గ్రూప్–2లో రోస్టర్ విధానం సవరించాలి
కడప సెవెన్రోడ్స్ : ఈనెల 23వ తేదీన నిర్వహించే గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల్లో రోస్టర్ విధానాన్ని సరిచేయాలని కోరుతూ అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత గ్రూప్–2లో 899 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉండడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షల కోసం 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అయితే రోస్టర్లో తప్పుల వల్ల పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న అనుమానం అభ్యర్థుల్లో గందరగోళానికి తావిస్తోందన్నారు. రోస్టర్పాయింట్లో చోటుచేసుకున్న తప్పులను సవరిస్తే తప్ప అభ్యర్థులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. రోస్టర్ విధానంలో తప్పుల వల్ల గతంలో కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గ్రూప్–2 అభ్యర్థులు గుర్తు చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ రద్దుచేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉంచిందన్నారు. కార్యక్రమంలో ఏపీపీఎస్సీ అభ్యర్థులు సుమన్, ఆర్సీ రెడ్డి, శ్రీనాథరెడ్డి, పూర్ణచంద్ర, చక్రి, రసూల్బాష, డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. కలెక్టరేట్ ఎదుట అభ్యర్థుల ప్రదర్శన -
టీడీపీ నేతల ఒత్తిడితో ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్ తొలగింపు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని జంగంరాజుపల్లె పంచాయతీ బాలాజీనగర్కు చెందిన ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్ నాగిపోగు అపర్ణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమరావతి, వెంకటసుబ్బయ్య , యాదవ సామాజిక వర్గం నాయకుల తప్పడు ఆరోపణలు చేసి ఆమెను విధుల నుంచి తొలగించాలని ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు బుధవారం అపర్ణను విధుల నుంచి తొలగించారు. ఈ విషయయై శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ భర్త సంజీవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన చురుగ్గా పాల్గొన్నట్లు నాపై ఎమ్మెల్యే పుట్టాసుధాకర్యాదవ్కు చేశారన్నారు. ఎన్నికల్లో నేనుగాని, నా కుటుంబ సభ్యులు పాల్గొనలేదని అతడు పేర్కొన్నాడు. 2022 నుంచి తన భార్య పంచాయతీలో ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్గా పనిచేస్తోందన్నారు.ఎక్కడా ఎలాంటి రిమార్కులేదన్నారు. కేవలం రాజకీయ కక్షతో, నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు ఆరోగ్యం సరిగాలేదని రాజీనామా చేస్తున్నట్లు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలాజీనగర్ టీడీపీ నాయకుడు అమరావతి వెంకటసుబ్బయ్య కోడుకు 2006 నుంచి 2010 వరుకు ఉపాధి ఫీల్డ్అసిస్టెంట్గా ఉన్నపుడు దాదాపు ర. 13లక్షలు దొంగ జాబ్ కార్డులతో పోస్టల్ ద్వారా నిధులు మల్లించాడన్నారు. అప్పటిలో సామాజిక తనిఖీలో కూడా ఈ విషయం తేలిందన్నారు. అతనిని అధికారులు తొలగించారు. అటువంటి అవినీతి పరులు మాపై తప్పుడు ఆరోపణలు చేయగానే దళితులమైన మా కడుపు కొడతారా అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
చరిత్ర విస్మరించిన యోధుడు ఉయ్యాలవాడ
కడప సెవెన్రోడ్స్ : నేటికి సరిగ్గా 178 సంవత్సరాల క్రితం నాటి కడప జిల్లా తాలూకా కేంద్రమైన కోవెలకుంట్లలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఉయ్యా లవాడ నరసింహారెడ్డిని ఉరి తీసింది. కడప కలెక్టర్ జేహెచ్ కాక్రేన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు వేల పైబడి జనం చూస్తుండగా బహిరంగంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. తమను ఎదిరించే ఎవరికై నా ఇదే గతి పడుతుందని ప్రజలను హెచ్చరిస్తూ 30 ఏళ్లపాటు ఆయన తలను అలాగే ఉంచారు. మూడు నెలలపాటు తమను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటును ఎట్టకేలకు అణిచి వేశామని బ్రిటీషర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ పదేళ్ల తర్వాత అది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా రూపుదాలుస్తుందని, సరిగ్గా వందేళ్లకు తాము ఈ దేశాన్నే వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుందని ఊహించలేకపోయారు. చరిత్రకారుల చిన్నచూపు నరసింహారెడ్డి తిరుగుబాటకు సంబంధించిన బ్రిటీషు రికార్డులు ఎన్నో ఉన్నాయి. జానపదుల కోలాటపు పాటలు, పిచ్చిగుంట్ల వారు ఆలపించే పాటలు, ఇతర జానపద సారస్వతం తక్కువేమి లేదు. కానీ, ఆంధ్ర చరిత్రకారులకు ఇవి పట్టినట్టు లేదు. ఈ తిరుగుబాటు పట్ల చులకన ధోరణి ప్రదర్శించారు. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, చీరాల–పేరాల ఉద్యమం వంటివి చరిత్ర పుస్తకాలకెక్కాయి. కానీ నరసింహారెడ్డి సాగించిన వీరోచిత తిరుగుబాటు చరిత్రపుటల్లో చోటు చేసుకోకపోవడం బాధాకరం. ఇది రాయలసీమపై జరుగుతున్న వివక్షలో భాగమేనని ఇక్కడి మేధావులు అంటున్నారు. ప్రముఖ బెంగాలీ చరిత్రకారుడు ఎస్బీ చౌదురి 1955లో రాసిన ‘సివిల్ డిస్ట్రబెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ (1765–1857 అనే గ్రంథంలో నరసింహారెడ్డి తిరుగుబాటుకు ఒక సముచిత స్థానం కల్పించడం విశేషం. ఆ తర్వాత కాలాల్లో ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు పరిశోధన చేసి రూపొందించిన రేనాటి సూర్యచంద్రులు గ్రంథం, ప్రముఖ చరిత్రకారుడు బండి గోపాల్రెడ్డి రాసిన ‘బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు–కడప జాబుల సంకలనం’, కల్వటాల జయరామారావు రాసిన రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పాణ్యం నరసరామయ్య రాసిన స్వాతంత్య్ర వీరుడు అనే పద్యకావ్యం వంటివి లేకపోతే నరసింహారెడ్డి తిరుగుబాటుకు సంబంధించిన వివరాలు చరిత్ర కాలగర్బంలో కలిసిపోయి ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రాకపోయి ఉంటే రాయలసీమ జిల్లాల్లో కూడా నేటి తరానికి ఆయన పేరు తెలిసేది కాదు. తొలి స్వాతంత్య్ర యోధుడు ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కాదని కొందరు వితండవాదన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ సంస్థానాన్ని లాక్కున్న బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సమరం చేసిన ఝాన్సీలక్ష్మిభాయి స్వాతంత్య్ర సమరయోధురాలైనపుడు, సిపాయిల పితూరి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామమైనపుడు అంతకు పదేళ్ల ముందే గొప్ప తిరుగుబాటు చేసి ఉరికొయ్యను ముద్దాడిన ఉయ్యాలవాడ ఎందుకు స్వాతంత్య్ర సమరయోధుడు కాకుండా పోయారని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి తిరుగుబాటు వెనుక ఆర్థిక, రాజకీయ కారణాలు ఉంటాయి. భారతీయుల ఉమ్మడి శత్రువైన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా దాన్ని స్వాతంత్రోద్యమ స్రవంతిలో విడదీయరాని భాగంగానే చూడాలి. ‘సీమ’ రైతాంగ తిరుగుబాటునరసింహారెడ్డి పెన్షన్ కోసం చేసిన తిరుగుబాటు అని కొందరు అర్థరహితమైన వాదనలు చేస్తున్నారు. ఆయన పెన్షన్ కోసమే అయితే తొమ్మిది వేల మంది ప్రజలు ప్రాణాలు తెగించి తిరుగుబాటులో ఎందుకు పాల్గొన్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. భూమి శిస్తు చెల్లించలేని రైతులు, ఇనాములు కోల్పొయిన కట్టుబడులు, ఇంకా అనేక కారణాల వల్ల దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఈ తిరుగుబాటులో పాల్గొన్నట్లు నాటి ప్రభుత్వం నియమించిన స్పెషల్ కమిషనర్ డబ్ల్యుఏడీ ఇంగ్లీస్ 1847 జనవరి 19న జ్యుడిషియల్ డిపార్టుమెంటు సెక్రటరీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఇది రాయలసీమ రైతులు జరిపిన తొలి తిరుగుబాటుగా చూడాలి. ప్రభుత్వాల వివక్ష ఎంతోమంది మహానుభావుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నప్పటికీ నరసింహారెడ్డి జయంతి ఇంతవరకు నిర్వహించకపోవడం ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్షను ఎత్తిచూపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉయ్యాలవాడ ప్రధాన అనుచరుల్లో ఒకరైన వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం ఆహ్వానించదగింది. అయితే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉయ్యాలవాడను మాత్రం విస్మరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉయ్యాలవాడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యాంశాల్లో ఆయన చరిత్రను చేర్చాలని, ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నేడు 178వ వర్ధంతి సభనేడు వర్ధంతి సభరేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు కడప ప్రెస్క్లబ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు. కడప మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, నంద్యాలకు చెందిన ప్రముఖ జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్రెడ్డి, ఉయ్యాలవాడ వంశీయులైన రూపనగుడి గ్రామానికి చెందిన కర్ణాటి ప్రభాకర్రెడ్డి, ఇతర పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొననున్నారు. -
ప్రతి సోమవారం నిత్యపూజకోనకు రెగ్యులర్ సర్వీసు
కడప కోటిరెడ్డిసర్కిల్: కిలోమీటరుకు రూ.1.88 ప్రకారంగా నిత్యపూజకోనకు రూ. 90 టిక్కెట్ ధరగా నిర్ణయించామని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కడప డిపోనుంచి నిత్యపూజకోనకు రెగ్యులర్ సర్వీసులు నడపనున్నామన్నారు. ఇప్పటికే దేవదాయశాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ మహాశివరాత్రికి స్పెషల్ బస్సుల్లో ఎటువంటి ఆర్టీసీ పాసులు, ఆధార్కార్డు డిస్కౌంట్లు చెల్లుబాటు కావన్నారు. మహా శివరాత్రి సందరగా కడప–నిత్యపూజకోనకు రెండు స్టేజీలను ఏర్పాటు చేశామన్నారు. భాకరాపేట, సిద్దవటంలలో స్టాపింగ్ ఉంటుందన్నారు. భాకరాపేట నుంచి నిత్యపూజకోనకురూ. 60, సిద్దవటం నుంచి రూ.40ఛార్జి ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాళపత్ర గ్రంథ లిపి నిపుణులు నాగదాసరి మునికుమార్, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కన్యాకుమారి, సూపర్వైజర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో ఈనెల 22వ తేదీ డీఈఓ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి జిల్లాలో ఉన్న ప్రతి ఉపాద్యాయ సంఘం నుంచి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి తప్పకుండా హాజరుకావాలని కోరారు. 24న గండిలో టెండర్లు చక్రాయపేట: జిల్లాలోని గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈనెల 24న తలనీలాలు,ఒక భాగం కొబ్బరి చిప్పలు సేకరించే హక్కు కల్పించడానికి ఇ–టెండర్, షీల్డ్ టెండర్, బహిరంగ వేలంపాటను 3వ పర్యాయం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు. గతం లో రెండు మార్లు టెండర్లు నిర్వహించినా సరైన ధర రానందున టెండర్లు రద్దు చేశామన్నారు. సోమవారం జరిగే టెండర్లలో పాల్గొనేవారు తలనీలాలకు రు.25లక్షలు,కొబ్బరి చిప్పలకు రు.3లక్షలు డిపాజిట్ చెల్లించాలని తెలిపారు.పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. రైతు బజార్లో టమాటా విక్రయాలకు అనుమతి కడప అగ్రికల్చర్: జిల్లాలో టమాటా రైతులకు పంట ఉండి ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా రైతు బజార్లో సరుకులు అమ్మకాలు చేయడానికి ప్రభుత్వం అనుమతి కల్పించిందని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కూరగాయల పంట సీజన్ అయినందున ఎక్కవ సంఖ్యలో సరుకు దిగుబడి రావడంతో గ్రామాల్లో తగినంత ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అయితే వ్యవసాయ మార్కెటింగ్శాఖ వారు రైతులు తమ సరుకును నేరుగా తీసుకుని తమ పరిధిలోని రైతు బజార్లలో అమ్మకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ విషయలో సందేహాలు ఉంటే జిల్లా సహాయ కేంద్రం 87126 44814,08562–246344, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ 8074723702 నంబర్లలో సంప్రదించాలని జేసీ తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ ఆల యంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శివయ్య ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 4,29, 680 వచ్చినట్లు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నగదును ఆలయ ఖాతాకు జమచేస్తామని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మార్చి 6న ‘చలో విజయవాడ’కడప వైఎస్ఆర్ సర్కిల్: మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 6న తల పెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కెసీ బాదుల్లా పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆప్కాస్ను రద్దుపరిస్తే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మళ్లీ ప్రైవేటు బడా కంపెనీలకు,ఏజెన్సీలకు అప్పచెబుదామన్న మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి పోరాటానికి కార్మికుల సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పర్మినెంట్ కార్మికులకు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్క్యాస్మెంట్, మూడు డీఏలు సత్వరం విడుదల చేయాలన్నారు. ఈ నెల 24న కడప నగరపాలక సంస్థ కార్యాలయం, మార్చి 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన, ధర్నాలు చేపడతామన్నారు.మార్చి 6న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్ల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈశ్వరయ్య, జాన్, వెంకటాద్రి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రికి 317 ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప రీజియన్ వ్యాప్తంగా వివిధ శైవ క్షేత్రాలకు 317 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో డిప్యూటీ సీఎంఈ, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లతో మహాశివరాత్రి ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లు గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ పొలతలకు 78 బస్సులు, నిత్యపూజకోన 40, శ్రీశైలం 2, రాయచోటి నుంచి పొలతలకు 40, పులివెందుల నుంచి పొలతలకు 27, భానుకోటకు 3, బద్వేలు నుంచి లంకమలకు 25, బి.మఠానికి 5, మల్లెంకొండకు 12, పోరుమామిళ్ల నుంచి ఎన్ఎస్ మఠానికి 3, మైదుకూరు నుంచి లంకమలకు 15, జ్యోతి (సావిశెట్టిపల్లె)కి 2, పోరుమామిళ్ల జ్యోతికి 6, బి.మఠానికి 15, ప్రొద్దుటూరు నుంచి పొలతలకు 15, ఎర్రగుంట్ల సంగమేశ్వర దేవళాలు 4, అల్లాడుపల్లె దేవళాలు 10, కన్యతీర్థం 6, జమ్మలమడుగు నుంచి అగస్తశ్వరకోనకు 5, కన్యతీర్థంకు 2, శ్రీశైలానికి 2 బస్సులు చొప్పున మొత్తం 317 బస్సులను నడపనున్నామన్నారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. గంగమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు మార్చి 1న లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ జాతరకు కడప నుంచి 25 బస్సులు, పులివెందుల నుంచి 25 బస్సులు నడుపుతున్నామన్నారు. అలాగే మార్చి 14న పౌర్ణమి నాడు తిరుమన్నామలై అరణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, మైదుకూరు డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయని ఆర్ఎం తెలిపారు. -
రైతుల గోడు వినిపించుకోండి
● చంద్రబాబు, కరువు కవలపిల్లలు ● వ్యవసాయంపై సీఎం, మంత్రులు చిన్న సమీక్ష చేయకపోవడం దారుణం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్: రాష్ట్రంలో రైతుల గోడు కూటమి ప్రభుత్వం వినిపించుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువును వెంట తీసుకుని వస్తారని, కరువు, ఆయన కవలపిల్లలని ఎద్దేవా చేశారు.ఆయన పాలనలో సకాలంలో పంటలు పండవని, మద్దతు ధర లభించక రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడినందున బాబు రికార్డ్ బ్రేక్ చేశారన్నారు. మేనిఫెస్టోలో రైతులకు పెట్టుబడి నిధి కింద ఎకరాకు రూ.20వేలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఈ క్రాపింగ్ విధానం, ఆర్బీకేలను నిర్వీర్యం చేశారన్నారు. ఆర్బీకేల వ్యవస్థను ప్రపంచ దేశాలు, మిగతా రాష్ట్రాలు మెచ్చుకుంటుంటే ఈ రాష్ట్రంలో మాత్రం రేషనలైజేషన్ పేరుతో ఆర్బీకేలను, ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక లాభాలు కలిగేవన్నారు. టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే సైంటిస్టులు సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు. రైతులకు సున్నావడ్డీకే రుణాలు లభించేవన్నారు. గతంలో వీఎన్పల్లెలో ఉల్లి పంటకు నష్టం వస్తే 21 రోజుల్లోనే పంట నష్ట పరిహారం అందించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుందని, మద్దతు ధర ప్రకటించని పసుపు, మిర్చి, అరటి వంటి 24 రకాల పంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ధర ప్రకటించారన్నారు. రైతుల పండించిన పంటలో ప్రభుత్వం 50 శాతం కొంటే, మిగిలిన పంటను వారు ఎలాగైనా అమ్ముకుంటారన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఉండేవని, భూసార పరీక్షలు, నీటి పరీక్షలు వంటివి అందులో చేసేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేస్తోందని విమర్శించారు. రోమ్ నగరం తలగబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు...రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై చంద్రబాబుగానీ, మంత్రులుగానీ చిన్న సమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మిర్చి పంటకు సంబంధించి 25 శాతం పంటను రూ.3528కోట్లు ఖర్చుచేసి కొంటే రైతులకు ఉప యోగమని అధికారులు లెక్కలు వేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళితే....అప్పుడు ఆదరా బాదరాగా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారన్నారు. మిర్చిని గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పరిస్థితి లేదన్నారు. అయినా చంద్రబాబు నాఫెడ్కు లెటర్ రాయడం విచిత్రంగా ఉందన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని వైఎస్ జగన్ చెబితే, మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్వింటాల్ మిర్చి ధర రూ.20వేలకు పైగా ఉండేదని, ఇప్పుడు రూ.6వేలు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.30లక్షల కోట్లు అప్పులు చేశారని, కానీ ఆ నిధులను ఎక్కడ వినియోగించారో చెప్పలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పులు చేసినా దానిని సంక్షేమానికి వినియోగించారన్నారు. మిర్చి యార్డుకు వెళ్లినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. అందులో పాల్గొనని వారిపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. తమకు కేసులు కొత్తకాదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, నాగేంద్రా రెడ్డి, షఫీ, శ్రీరంజన్ రెడ్డి, హరిచందన్, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
సోషల్ మీడియా అకౌంట్లపై కేసు నమోదు
కడప అర్బన్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలు సోషల్ మీడియా అకౌంట్లపై జనసేన పార్టీ ఎన్నికల ప్రోగ్రాం కమిటీ రా యలసీమ కో–కన్వీనర్ పండ్రా రంజిత్కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చే శారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫోటోల ను మార్ఫింగ్ చేసి ఆయన కుటుంబసభ్యులను అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు సమాజంలో విద్వేషాలు కలిగించేలా రాజకీయపార్టీల మధ్య ఘర్షణకు దారి తీసి శాంతికి భంగం కలిగించేలా వున్నాయనీ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే వైఎస్సార్ జిల్లా కడప తాలూకా ఎస్ఐ తాహీర్ హుసేన్ కేసు నమోదు చేశారు. -
దాల్మియా నిర్వాకంతో రైతులకు తీవ్ర నష్టం
జమ్మలమడుగు/మైలవరం : నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలంలో ఏర్పాటైన దాల్మియా సిమెంట్ కర్మాగారం నిర్వాకంతో పరిసర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన దాల్మియా సిమెంట్ కర్మాగారం కారణంగా నష్టపోతున్న నవాబుపేట, చిన్న కొమెర్ల, దుగ్గన పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చి సహకరించిన రైతుల పట్ల దాల్మియా యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దాల్మియా యాజమాన్యం వంకలు,వాగులు ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల వర్షాకాలంలో వరదలు వచ్చిన ప్రతి సారి పంట పొలాలు నీట మునుగుతున్నాయని అన్నారు. దీనిపై నవాబుపేట, దుగ్గనపల్లి ఎస్సీకాలనీ ప్రజలతోపాటు చిన కొమెర్ల గ్రామానికి సంబంధించిన రైతులు అనేక సార్లు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిగా వంకలను పూర్తిగా ఆక్రమించి కట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని యాజమాన్యానికి వివరించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో మూడు గ్రామాలకు చెందిన రైతులు లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. గతంలో అధికారులు దాల్మియా యాజమాన్యం ప్రలోభాలకు లొంగి తప్పుడు రిపోర్టు ఇచ్చారన్నారు. ఇటీవల లోకాయుక్త కమిటీ ఈ ప్రాంతాన్ని పర్యటించి నివేదిక ఇచ్చింది. పంటపొలాలతో పాటు బ్లాస్టింగ్ వద్ద దెబ్బతిన్న నవాబు పేట గ్రామ ప్రజల ఇండ్లకు పరిష్కారం, దుగ్గనపల్లి గ్రామంలోని రైతుల పంట పొలాలకు పరిహారం ఇవ్వడంతోపాటు వారి గ్రామాన్ని వేరే చోటుకు తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని లోకాయుక్త యాజమాన్యానికి సూచించింది. అయితే యాజమాన్యం ఇవేమి పట్టించుకోకుండా ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వ్యతిరేకం కాదు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధుమ్ము, ధూళి వల్ల కేవలం 200 మీటర్లదూరంలో ఉన్న దుగ్గన పల్లి గ్రామస్తులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారన్నారు. వాటికి పరిష్కారం చూపకుండా రెండో ప్లాంట్ విస్తరణకు వెళితే రైతుల కోపాన్ని యాజమాన్యం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. దాల్మియా విస్తరణకు సహకరించం : తమ సమస్యలకు పరిష్కారం చూపని దాల్మియా విస్తరణ కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని మూడు గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. ఈనెల 27వతేదిన జరిగే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే రెండో ప్లాంట్ నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో తాము సహకరింబోమని మైలవరం మండలం నవాబుపేట, దుగ్గనపల్లి, కొమెర్ల గ్రామాలకు చెందిన రైతులు తెగేసి చెబుతున్నారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివ గుర్విరెడ్డి,నవాబుపేట భాస్కర్రెడ్డి ,మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డితదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా
బద్వేలు అర్బన్: ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సుధ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎన్జీవో కాలనీలోని మున్సిపల్ కార్యాలయ సభా భవనంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ వాకమళ్ళరాజగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆయా వార్డుల్లో పర్యటనకు వెళుతున్నప్పుడు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిని అవమానపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో ఒకలా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో మరోలా వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశ అజెండాలో తనకు, ఎమ్మెల్సీకి ఆహ్వానం పంపినట్లు పొందుపరచకపోవడం సరికాదని అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత సమావేశాల్లో సభ్యులు ఏ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, వాటిని ఏ మేరకు పరిష్కరించారు అనే దానిపై తప్పనిసరిగా సమీక్ష జరగాలని సూచించారు. అధికారులు రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలని కోరారు.మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ భావనారాయణనగర్లో వంక పోరంబోకులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎందుకు పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అలాగే ఆహ్వానం ఉండి సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్కు సూచించారు. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో సచివాలయ సిబ్బంది ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని, ఇటువంటి పద్దతులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధ మున్సిపల్ కమిషనర్ తీరుపై ఎమ్మెల్యే సీరియస్ కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ కౌన్సిలర్లు సైతం ఆగ్రహం -
సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ
కడప అర్బన్: పోలీసు సిబ్బంది, సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్కుమార్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ‘గ్రీవెన్స్డే’ నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత, స్పౌస్, చిల్డ్రన్స్ మెడికల్ సమస్యల గురించి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని తగిన పరిష్కారం చూపుతామని వారికి భరోసా కల్పించారు. సిబ్బంది ఫిర్యాదులను పరిశీలించి సత్వరం పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు. పోలీసు జాగిలం పదవీ విరమణ రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మ్యాగి అనే పోలీసు జాగిలం శుక్రవారం పదవీ విరమణ పొందింది. మ్యాగి 11 సంవత్సరాలు పాటు విశిష్ట సేవలందించి పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అభినందించారు. హత్యలు, రేప్లు, దొంగతనం చేసిన వారిని గుర్తించడంలో నేర్పరిగా పేరున్న జర్మన్ షపర్డ్ జాతికి చెందిన జాగిలం మ్యాగిని జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. -
● కౌన్సిలర్ల ఆగ్రహం
తమకు మున్సిపల్ కమిషనర్ కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లో పర్యటించే సమయంలో, వార్డుల్లో ఏవైనా పనులు చేపట్టే విషయంలో తమకు సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోయారు. ఇదే అధికారపార్టీకి చెందిన వార్డుల్లో, మరికొన్ని వార్డుల్లో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను, నాయకులను తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తనపై కక్ష పూరితంగా నాలా యాక్ట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బద్వేలు పట్టణంలో ఇప్పటి వరకు ఎంత మంది నాలా యాక్ట్ నిబంధనలు పాటించారో సమాధానం చెప్పాలని వైస్ చైర్మన్ గోపాలస్వామి పట్టుబట్టారు. అజెండాకు సంబంధం లేని విషయాలపై సమావేశంలో చర్చించనని కమిషనర్ తెలపడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను పిలిచి బయటికి పంపిస్తానని కమిషనర్ సమావేశ హాలులోకి పోలీసులను పిలిపించడంతో మిగిలిన వైఎస్సార్సీపీ సభ్యులు కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్నామా, పోలీసులను పిలిచి వైస్ చైర్మన్ను బయటికి పంపించాలని చూస్తే మేము కూడా బయటికి వెళ్లిపోతామని మూకుమ్మడిగా లేచి నిలబడటంతో చేసేదేమీ లేక కమిషనర్ మిన్నకుండిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి చాలా మంది లబ్ధిదారులు రూ.25 వేల ప్రకారం డబ్బు చెల్లించారని, వారికి న్యాయం చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్.వి.సాయిక్రిష్ణ సమావేశం దృష్టికి తీసుకురాగా దీనిపై సంబంధిత శాఖ అధికారులకు లేఖ రాశామని, వీలైనంత త్వరగా లబ్ధిదారులకు డబ్బు జమ అయ్యేలా చూస్తామని కమిషనర్ సమాధానమిచ్చారు. అలాగే తమకు 25 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న దుకాణాన్ని అధికార పార్టీ నాయకుల మాటలు విని తొలగించారని 27వ వార్డు కౌన్సిలర్ శీలిరమాదేవి కమిషనర్ను ప్రశ్నించారు. ఇదే విషయమై కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కమిషనర్ను నిలదీశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించామని కమిషనర్ సమాధానమివ్వగా ... పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న ఎన్ని దుకాణాలను తొలగించారని ప్రశ్నించారు. వాటికి కూడా కమిషనర్ ఆదేశాలు తీసుకువస్తే తొలగిస్తామని సమాధానమిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. 22వ వార్డు పరిధిలోని ఎన్జీవో కాలనీలో విద్యుత్ స్తంభాలు రోడ్డు మధ్యలోనే ఉన్నాయని గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్ ప్రపుల్లారెడ్డి సమావేశం దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో అజెండాపై చర్చించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాయం చేయబోయి మృత్యు ఒడిలోకి
ఖాజీపేట : రోడ్డుకు అడ్డుగా ఉన్న కారును తొలగించి అందులోని వారికి సాయం చేయబోయి నరహరి నాయుడు (36) మృత్యువాత పడ్డాడు. వివరాలిలా.. దువ్వూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన లగుడపాటి నరహరి నాయుడు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో తాత్కలికంగా ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఆటో నడుపుతుండే వాడు. ఆటోలో రాజంపేటకు బాడుగకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఇన్నోవా వాహనం టైర్ పగిలి రోడ్డుకు అడ్డుగా పడింది. అందులో ఉన్న వ్యక్తులు అటుగా వస్తున్న ఆటోలోని నరహరి నాయుడు సహాయం కోరారు. వారి విజ్ఙప్తి మేరకు కారును రోడ్డుకు అడ్డుగా లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తుంగా వేగంగా లారీ వచ్చి ఢీకొంది. దీంతో అక్కడికక్కడే నరహరి నాయుడు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఖాజీపేట సీఐ మోహన్ తెలిపారు. పోస్టుమాస్టర్ అరెస్టు కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని బ్రాంచ్ పోస్టుమాస్టర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపాల్నాయక్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. వివరాలిలా.. పోస్టుమాస్టర్ గత 14 సంవత్సరాలుగా నరసాపురంలో పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నారు. ఈ పోస్టుఫీసు పరిధిలో 7 గ్రామాల ప్రజలతో పరిచయాలు బాగా పెంచుకుని పోస్టుఫీసులో ఖాతాదారులుగా చేర్చారు. ఖాతాదారులు తమ డబ్బును పోస్టాఫీసులో జమ చేసుకుంటూ వస్తున్నారు. అయితే పోస్టుమాస్టర్ ఖాతాదారుల నగదును పోస్టాఫీసులో జమ చేయకుండా సొంత ఖర్చులకు వాడుకుంటూ ఉండేవాడు. నరసాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి 2024 సెప్టెంబర్లో తన ఖాతాలోని డబ్బులు వాడుకున్నారని పోలీసుస్టేషన్లో పోస్టుమాస్టర్పై ఫిర్యాదు చేసింది. సుకన్య సమృద్ధి యోజక కింద రూ.2.90 లక్షల నగదు ఆమెకు రావాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతో ఆ నగదును వాడుకున్నాడు. అప్పటి నుంచి పోస్టాఫీసుకు రావడం లేదు. దీనిపై జిల్లా పోస్టల్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుపాల్నాయక్ సుమారుగా రూ.22.67 లక్షలు ఖాతాదారుల నగదును వాడుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తుండగా శుక్రవారం ఓబుళాపురం వద్ద తిరుపాల్నాయక్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి బద్వేలు అర్బన్ : అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైన కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బాబురావు, వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణను అప్పగించడంతో పాటు అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జాన్, బాబు, పార్థసారధి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
●వైఎస్ జగన్ హయాంలో మెరుగైన వైద్య సేవలు
కడప అగ్రికల్చర్: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. దీంతో జిల్లాలో 1962 హెల్ప్లైన్ మూగబోనుంది. మారుమూల గ్రామాల్లోని పశు వైద్యానికి గ్రహణం పట్టనుంది. పశువులకు సైతం అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది, ఉన్నఫళంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ఉద్యోగులను వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మొదటి విడుదతలో వచ్చిన నియోజకవర్గానికి ఒకటి చొప్పున వచ్చిన 7 సంచార పశు వైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్–1లో వాహనాలు తిరిగి ఆయా పశు వైద్యశాఖ ఏడీ కార్యాలయాల్లో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాటిలో పనిచేసే పైలట్, డాక్టర్లను విధులకు హాజరుకావద్దని వాట్సాప్ మేసేజ్ ద్వారా సూచించారు. ● ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించిన ఏడు సంచార పశు వైద్య అంబులెన్స్లను ఆపేశారు. ఇందులో కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజక వర్గాలకు సంబంధించిన వాహనాలను ఆయా ఏడీ కార్యాలయాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా బద్వేల్, పులివెందుల, పొద్దుటూరు, మైదుకూరు నియోజక వర్గాలకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు. త్వరలో రెండో విడతకు సంబంధించి మరో 6 సంచార పశు వైద్యవాహనాల సేవలను కూడా ఆపేయనున్నట్లు తెలిసింది. ఇవి కూడా ఆగిపోతే గ్రామాల్లో సంచార పశు వైద్య సేవలు అగిపోనున్నాయి. దీంతో మూగ జీవాలు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నాయి. పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజక వర్గానికి రెండు చొప్పన అంబులెన్సులను మంజూరు చేశా రు. ఇందులో భాగంగా వైఎస్సార్జిల్లాకు 2022 మే నెలలో మొదటి విడతతో 7 సంచార పశువుల అంబులెన్స్ను, 2023 ఏప్రిల్ నెలలో మరో ఆరింటిని మంజూరు చేశారు. వీటి ద్వారా సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబర్ సైతం ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. ఫోన్ చేస్తే చాలు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు సంచార అంబులెన్స్కు సంబంధించిన 1962 టో ఫ్రీ నంబర్కు కాల్ చేసి పశువు ఆరోగ్య సమస్యను వివరిస్తే చాలు నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ రైతు ముంగిటకు వచ్చేది. మెరుగైన వైద్య సేవలు అందించాల్సి వస్తే సమీపంలోని ఏరియా పశు వైద్యశాల, వెటర్నీరీ పాలీక్లినిక్కు తరలించి చికిత్స అందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి చేర్చేవారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లలో వేల సంఖ్యలో పశువులకు వైద్య సేవలందించి అందరి మన్ననలు పొందారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా ఆపేయడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ప్రభత్వు ఉత్తర్వుల మేరకు.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొదటి విడతలో భాగంగా కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలకు సంబంధించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. మిగతా నాలుగింటిని కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటాం. – డాక్టర్ శారదమ్మ, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్ధకశాఖ 1962 అంబులెన్స్లపై కూటమి కక్ష జిల్లాలో మొదటి విడత మొబైల్ అంబులెన్స్ సేవలు నిలిపివేత కూటమి ప్రభుత్వం తీరుపై పాడి రైతుల ఆగ్రహం -
● ఆందోళనలో ఉద్యోగులు
సంచార పశువైద్య వాహనాల్లో పనిచేసే పైలట్, పారావిరట్, డాక్టర్, ఇలా మొత్తం 21 మంది పనిచేస్తున్నారు. వీరందరిని వెళ్లమని చెప్పడంతో వారి కుటుంబాలు అందోళన చెందుతున్నాయి. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా..ఇంతటితో ఆగిపోవాలా అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 మే 19న జిల్లాలో మొదటి విడత అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. అప్పట్లో నియోజక వర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించారు. ప్రతి వాహనంలో వాహనాన్ని నడిపే పైలట్, పారావిట్, డాక్టర్ పనిచేసే వారు. వారంతా దాదాపు మూడేళ్ల దాకా పనిచేశారు. ఇప్పుడు ఉన్నట్లుండి రాత్రికి రాత్రే వారి సేవలు అపేయడంతో వారు అందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు తొలగించడంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోతున్నారు. వేతనాలు పెరుగుతాయని భావిస్తే.. తమకు చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో కొనసాగించాలని వినతి వైఎస్సార్జిల్లా పశు సంవర్ధకశాఖలో గత మూడు సంవత్సరాలుగా 42 మంది పశు సంచార వైద్య వాహనాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఈఎంఆర్ఐ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నామని, తమను ఉద్యోగంలో కొనసాగించాలని మైబెల్ అంబులెన్స్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వారు జిల్లా పశు సంవర్ధకశాఖ జేడీ శారదమ్మకు వినతిపత్రాన్ని సమర్పించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా డి. భాగ్యమ్మ, రాష్ట్ర కార్యదర్శిగా కె. ఉమామహేశ్వరి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వై. లక్ష్మి ప్రసన్న, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా బి. వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పి. వెంకట సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ఎం. వీర భాస్కర్రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎస్. బసవరాజు, రాష్ట్ర కార్యదర్శిగా కొప్పల శివ వరప్రసాద్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా చింతకుంట బ్రహ్మయ్య, ఏ. వెంకట శివయ్య యాదవ్, స్టేట్ బూత్ కమిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఈవై యెద్దారెడ్డి, స్టేట్ బూత్ కమిటీ కార్యదర్శిగా ఎస్బి అబ్దుల్ జబ్బార్, స్టేట్ బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీగా డి. చంద్ర మౌళి, స్టేట్ పంచాయితీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పి. నాగార్జునరెడ్డి, స్టేట్ పంచాయితీరాజ్ వింగ్ కార్యదర్శిగా ఎస్. శివనాగిరెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఎం. రాజారెడ్డిలను నియమించారు. -
వన్యప్రాణులు విలవిల!
● ఎండ తీవ్రతతో అల్లాడుతున్న వన్యప్రాణులు ● దాహార్తితో అలమటిస్తున్న పరిస్ధితులు.. ● అడవిదాటుతున్న నేపథ్యంలో..ప్రాణాలకు ముప్పు ● ప్రత్యామ్నాయం చేపట్టని సర్కారు రాజంపేట: వేసవి ముంసుకోస్తోంది.. ఫిబ్రవరి మాసం నుంచే వన్యప్రాణులు దాహార్తితో అలమటిస్తున్నాయి.అడవిని దాటుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు అవసరమయ్యే నిధులను ఇప్పటి ప్రభుత్వం సరిపెట్టలేకపోతోందన్న అపవాదును మూటకట్టుకుంది. కంపానిధులు, బయోసాట్ పథఽకాల కింద నిధులు విడుదల కాలేదు. దీంతో నీటి ట్యాంకర్లతో నీటిని నింపేందుకు అటవీశాఖ ఆపసోపాలు పడుతోంది. వేసవిలో వన్యప్రాణులు సంరక్షణపై నీలినీడలు అలుముకున్నాయి. రేంజ్లిలా.. వైఎస్సార్ జిల్లా రేంజ్ పరిధిలో కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల ,బద్వేలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పరిధిలో రాజంపేట, చిట్వేలి, సానిపాయి, బాలపల్లె, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు రేంజ్లున్నాయి. జనారణ్యంలోకి.. ఉభయ జిల్లాలో ఉన్న అభయారణ్యాల్లో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యాల్లో వీటి దాహార్తి తీర్చేందుకు అటవీపల్లెల వైపు చూస్తున్నాయి. మరోవైపు అడవికి నిప్పురాజుకున్న క్రమంలో వన్యప్రాణాలు గందరగోళ పరిస్ధితులో పడి ప్రాణాలు కాపాడుకునేందుకు అటవీ శివారుపల్లె వైపు పరుగులు తీస్తున్నాయి. మరికొన్ని ఆహారం, నీటి కోసం కూడా వచ్చి ప్రాణాలు పొగుట్టుకుంటున్నాయి. గురువారం సిద్ధవటం రేంజ్లో ఇలాంటి సంఘటన చోటుచేసుకున్న సంగతి విధితమే. ● వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి మాసంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకడం గగనంగా మారడం గమనార్హం.భానుడిసెగతో వన్యప్రాణులు విలవిల లాడుతున్నాయి. పగలు కన్నా..రాత్రుల్లోనే నీటికోసం.. అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీస్తున్నాయని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హాని ఉండదని, ఏనుగులతో హాని ఉంటుందని చెబుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తి తీర్చుకొని సేద తీరుతుంటాయి. గుక్కెడు నీటి కోసం నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి. జిల్లా రేంజ్లు విస్తీర్ణం(హెక్టారు) అభయారణ్యాలు: శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు వన్యప్రాణాలు దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ఫిబ్రవరి నుంచి వేసవి పరిస్ధితులు తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సాసర్పిట్, నీటి కుంటల్లో నీటిని నింపుతాము. 130 సాసర్పిట్స్లో రెండురోజులకొకసారి నీటితో నింపుతున్నాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపడుకునే బాధ్యత తీసుకున్నాం. –జగన్నాథ్సింగ్, జిల్లా అటవీ అధికారి, రాజంపేట వైఎస్సార్ 9 2లక్షల94వేలు అన్నమయ్య 8 2లక్షల74వేలు -
కట్టుదిట్టంగా గ్రూప్–2 మెయిన్ పరీక్షలు
కడప సెవెన్రోడ్స్: ఏపీపీఎస్సీ గ్రూప్–2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలను ఈ నెల 23న కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్–2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టరేట్లో లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పార్ట్–1 సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పార్ట్–2 సెషన్ ఉంటుందన్నారు. జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.45 గంటల వరకు, 1.30 గంటల నుంచి 2.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్–2 మెయిన్ పరీక్షలకు సంబంధించి హెల్ప్ డెస్క్ 08562–246344 నంబరు ఈనెల 21 నుంచి 23వ తేది వరకు కార్యాలయ సమయాల్లో పనిచేస్తుందన్నారు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలు ● కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కృష్ణాపురం, తాడిగొట్ల, చింతకొమ్మదిన్నె మండలం ● గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ (ఆర్ట్స్ కాలేజ్), కలెక్టరేట్ వద్ద, రిమ్స్ రోడ్డు, కడప ● కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం ● అన్నమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఆర్టీవో ఆఫీస్ వద్ద, రాయచోటి రోడ్డు, చింతకొమ్మదిన్నె మండలం ● గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో, కడప. ● శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (స్విస్ట్), పులివెందుల రోడ్, కృష్ణాపురం, తాడిగొట్ల గ్రామం, చింతకొమ్మదిన్నె మండలం ● శ్రీహరి డిగ్రీ కాలేజ్, తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద, బాలాజీ నగర్, కడప ● శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎస్వీ డిగ్రీ కళాశాల వద్ద, బాలాజీ నగర్, కడప ● నారాయణ జూనియర్ కాలేజ్, హరి టవర్స్, నాగరాజు పేట, కడప ● ఎస్కెఆర్ అండ్ ఎస్కెఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగరాజుపేట, కడప. ● నాగార్జున డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆర్టీసీ బస్టాండు వద్ద, అరవింద నగర్, కడప. ● శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, వై జంక్షన్ సమీపంలో, పక్కీరుపల్లె రోడ్డు, కడప ● కేఓఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కృష్ణాపురం, చింతకొమ్మదిన్నె మండలం. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు ఇంటర్మీడియేట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్చెరుకూరి తెలిపారు.గురువారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ విధానంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఇంటర్ పరీక్షలు ఎలాంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
బీఈడీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 1,3 సెమిస్టర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ కులసచివులు ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. ఎస్.వి. కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడపలో ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 10 కేంద్రాల్లో, అన్నమయ్య జిల్లాలోని ఐదు కేంద్రాల్లో తొలి రోజు 4,713 మంది పరీక్షలు రాశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. డబ్ల్యూడీసీ ద్వారా జిల్లాలో సాగులోకి లక్ష ఎకరాలు కడప సెవెన్రోడ్స్: వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీల (డబ్ల్యూడీసీ)ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అనుబంధ శాఖల సమన్వయంతో వచ్చే ఏడాదికి జిల్లాలో లక్ష ఎకరాలను సాగుబడిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటర్ షెడ్లు, ఫారం పాండ్లు, ఇంకుడు గుంతలు, స్టార్మ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా సమీప నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుతో మెట్ట భూములను సాగులోకి తీసుకురావాలన్నారు. వ్యవసాయంలో అంతర్భాగమైన ఉద్యాన, ప్రకృతి సాగు, పాడి, మత్స్య సంపదను గ్రామాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం సీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వీ ప్రవీణ్ కుమార్ సహజ పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించేందుకు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను పీపీటీ ద్వారా వివరించారు. డ్వామా పీడీ అదిశేషారెడ్డి, సీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్వీ ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పీపుల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి కడప సెవెన్రోడ్స్: ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన పీపుల్ సర్వేని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పి–4 విధానం (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్ షిప్) ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి జీవన ప్రమాణాలలో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే పై జిల్లా కలెక్టర్.. జెడ్పి సీఈఓ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేసి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లు పేదరికాన్ని అధిగమించి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పి–4 పాలసీని అమలు చేస్తోందన్నారు. సిసోడియాను కలిసిన కలెక్టర్: మదనపల్లె నుంచి విజయవాడకు వెళుతూ కడపలోని స్టేట్ గెస్ట్హౌస్లో బస చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (రెవిన్యూ) ఆర్పీ సిసోడియాను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రెవెన్యూ పరమైన అంశాలను కలెక్టర్ ఆయనకు తెలియజేశారు. త్వరితగతిన లక్ష్యం పూర్తి చేయాలి కడప అగ్రికల్చర్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిందు, తుంపర సేద్యం లక్ష్యాన్ని త్వరితిగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మనీటి సాగు పథకం(ఏపీఎంఐపీ) ఓఎస్డీ రమేష్ పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్లోని ఏపీఎంఐపీ జిల్లా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి తుంపర, బిందు సేద్యానికి సంబంధించి జిల్లాకు 15000 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8666 హెక్టార్ల లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సూక్ష్మ సేద్య పరికరాలు అవసరం ఉన్న రైతు లను గుర్తించి ప్రాథమిక తనిఖీలు చేపట్టి డ్రిప్పు పరికరాలను సరఫరా చేయాలన్నారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరెడ్డి, ఏపీడీ మురళీమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి బ్రహ్మోత్సవాలు నెల 23వ తేదీ నుంచి మార్చి 5 వరకు జరనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి గురువారం ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో డివి రమణారెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన వెంటనే నిర్వహించే మహా సంప్రోక్షణకు తిరుమల–తిరుపతి దేవస్థానం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రధాన గోపురాన్ని భక్తులు వీక్షించేందుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. కొన్ని నెలల తర్వాత గర్భాలయంలోని సీతారామ లక్ష్మణ మూర్తుల దర్శన భాగ్యం కల్పించనున్నందున ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు తెలిపారు. ఇందులోభాగంగా మార్చి 6 నుంచి 8 వతేదీ వరకు సాయంత్రం 5 గంటలకు అఖండ రామనామ భజన సంకీర్తనలు, శ్రీమద్రామాయణ సంగీత స్వరార్చన, రామాయణ ఉపన్యాసాలు జరుగుతాయన్నారు. రాయచోటి సబ్ జైల్ తనిఖీ రాయచోటి టౌన్: రాయచోటి సబ్ జైల్ను రాష్ట్ర సేవాధికార సంస్థ ఉమ్మడి కడప జిల్లా సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100 తదితర అంశాల గురించి వివరించారు. -
అడుగడుగునా సమస్యలే!
కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో నిర్లక్ష్యం, అవినీతి, అభద్రతలాంటి అంశాలు ‘అన్నీ’సాధ్యమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఔనంటే అవుననీ, కాదంటే కాదనే వ్యవహారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రిమ్స్ ఓపి విభాగంలో రోగులను పరీక్షించేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు వైద్యులు తమ దగ్గరికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి తగిన వైద్య సహాయం అందించాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని విభాగాల్లో ఆయా విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వదిలేస్తే, వారు సీఎస్లకు, సీనియర్ రెసిడెంట్లకు, పీజీలకు గానీ వారి బాధ్యతలను అప్పగించి ఎంచక్కా తమ అధికారిక పర్యటనలకు, సమీక్షల పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నారు. పీజీలు, సీనియర్ రెసిడెంట్లలో కొందరు మాత్రం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తిస్తే, మరికొందరు మాత్రం ‘ఏముందిలే’అని తమదారిన తాము వెళ్లిపోతున్నారు. విధులను హౌస్ సర్జన్లకు, వైద్య విద్యార్థులకు వదిలేసి వెళుతున్నారు ఒకరిద్దరు డాక్టర్లు తమ పనివేళల్లోనే ‘మహిళా ఉద్యోగిని’లను తమ ఛాంబర్లోకి పిలిపించుకోవడం, వారితో వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన ప్రజల గురించి ఆలోచించకుండానే తాము మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వైఖరిని గమనిస్తున్న ఉద్యోగులు కూడా విస్తుపోతున్నారు.● సెంట్రల్ల్యాబ్లోని కొన్ని విభాగాలలో కొందరు ఉద్యోగులు మాత్రం ల్యాబ్ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులకు తమ విధులను వదిలేసి తాము ‘సెల్ఫోన్’లలో ఇన్స్టా, వాట్సాప్లను చూసుకుంటూ, లేదంటే ఫోన్ వచ్చిందని పక్కకు జారుకుంటూ రోగులను గంటల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారు. దీనివల్ల రోగులు, వారి సహాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు.● ఓపీ, ఐపీ విభాగాలలో కొందరు డాక్టర్లకు తమ ఛాంబర్లను వదిలి బయటకు వెళ్లేటపుడు తప్పనిసరిగా లైట్, ఫ్యాన్ ‘ఆఫ్’చేసి వెళ్లాలన్న ధ్యాసకూడా ఉండదు. తమపాటికి తాము వెళ్లిపోతే క్రింది స్థాయి సిబ్బంది కూడా ‘లైట్లు’‘ఫ్యాన్’లు తిరుగుతున్నా, వెలుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.● రోగుల సౌకర్యార్థం 2007–08 సమయంలో పాత రిమ్స్ నుంచి– కొత్త రిమ్స్ వరకు అప్పటి కార్పొరేట్ స్థాయి సంస్థల విరాళంతో నాలుగు బస్సులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులనుంచి ఆయా బస్సుల నిర్వహణ కోసం డబ్బులను ఖర్చుపెట్టి ‘ఉచితం’గా రోగులను పంపించేవారు. తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఆటోలు, కార్లు, మోటార్ సైకిళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సులు కాలం చెల్లిపోయాయని మూలన పడేశారు. సూపరింటెండెంట్ వాహనాన్ని ఇటీవలనే పక్కన పెట్టారు. రోగులకు మాత్రం జేబులు చిల్లులు పడుతున్నాయి. సూపరింటెండెంట్కు గత ఏడాది నుంచి వాహనాన్ని సమకూర్చారు. కాన్పుల వార్డులో ‘ప్రసవవేదన’తో వచ్చే మహిళల నుంచి కొందరు వారి కాన్పులు, శస్త్రచికిత్సల అనంతరం ఒక్కొక్కరి నుంచి రూ. 1000 నుంచి 2000 వరకు డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా, ఇతర జిల్లాల నుంచి కడప రిమ్స్కు ‘కాన్పుల’కోసం వస్తే ఇక్కడ మాత్రం డబ్బులను వసూలు చేస్తూ పరిపాలన యంత్రాంగానికి ‘చెడ్డపేరు’తీసుకువస్తున్నారు. క్రింది స్థాయిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.● కొన్ని వైద్య విభాగాలలో రోగులకు వైద్య సేవలను అందించాలంటే ‘నిర్లక్ష్యం’కనిపిస్తోంది. వీల్ఛెయిర్స్, స్ట్రక్చర్స్ లేక చాలా సందర్భాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నడవలేని, నిస్సహాయ స్థితిలో వున్న రోగులను తరలించాలంటే వారి సహాయకులు, బంధువులు చేతులమీదుగా, భుజాల మీదనే తీసుకు రావాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన కొన్ని వీల్ఛెయిర్స్ను ‘భద్రం’గా దాచిపెట్టుకుంటున్నట్లు సమాచారం. వైద్యంలో భాగంగా ఆపరేషన్లను నిర్వహించిన తర్వాత రోగుల బాగోగులను పట్టించుకునే విషయంలో కొందరు వైద్యులు, వైద్య సిబ్బంది ‘బాధ్యత’గా వ్యవహరించకపోవడం గమనార్హం.● ఓపిలోని రేడియాలజీ విభాగంలో ‘ఎక్స్రే’యూనిట్ల విషయానికి వస్తే మొత్తం ఆరు యూనిట్లు ఉండాల్సి ఉండగా వీటిల్లో ఓ యూనిట్ గదిని మూసివేశారు. మిగతా యూనిట్లలో ఉన్న ఎక్స్రే పరికరాలన్నీ ‘మొబైల్’ఎక్స్రే యంత్రాలే కావడం గమనార్హం. ఎక్స్రే ఫిల్మ్లు లేకపోవడం, ఎక్స్రే తీశాక సంబంధిత డాక్టర్స్ మొబైల్ఫోన్లకు ఆన్లైన్లో పంపిస్తున్నారు. అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా, రెఫర్ చేసినా ఇబ్బందులు ‘తప్పవు. ఐపీ విభాగంలో వైద్య సేవలకు వచ్చిన వారిలో ఎక్కువ మందిని ‘ఆరోగ్యశ్రీ’వైద్య సేవలకే ప్రాధాన్యత ఇస్తూ నమోదు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు నమోదు చేసి వార్డులలో అడ్మిట్ చేసే ఉన్న ‘శ్రద్ధ’మళ్లీ డిశ్చార్జ్ అయ్యేవరకు వారికి అందించాల్సిన వైద్య సేవలపై ‘పర్యవేక్షణ లేకపోవడం కొందరి వైద్యుల, వైద్య సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి పరాకాష్ట. -
అధికారులూ.. మీకిది తగునా?
టాస్క్ ఫోర్స్: ప్రజా ప్రతినిధులతో అధికారులు కల వడం పాలనలో ఒక భాగం..కానీ నేడు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంట కాగుతూ ...వారి సేవల్లో కొందరు అధికారులు విధులకు డుమ్మా కొట్టి తరిస్తుండటంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది వారి విధులను ప్రక్కన పెట్టి రాజకీయ నాయకుల దృష్టిలో పడేందుకు అనేక రకాల పాట్లు పడుతున్నారు. ఈ కోవలోనే అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి మేనల్లుడు తిరుమలకు వెళుతుండగా ఆయన ఆశీస్సుల కోసం రాయ చోటికి చెందిన కొంతమంది మున్సిపల్, పోలీస్, ఇతర శాఖలకు చెందిన అధికారులు పూల బొకేలు, భారీ దండలతో స్వాగతాలు పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నట్లు తెలియవచ్చింది. -
పోలీస్ స్టేషన్కు బారికేడ్ల వితరణ
పులివెందుల రూరల్ : పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు గురువారం భారతి సిమెంటు కంపెనీకి చెందిన 50 బారికేడ్లను వితరణగా అందించారు. ఈ సందర్భంగా భారతి సిమెంటు కంపెనీ మార్కెటింగ్ శాఖ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మార్కెటింగ్ అధికారి కొండారెడ్డి, మేనేజర్ ప్రతాప్రెడ్డిలు ట్రాఫిక్ సీఐ హాజివలిని కలిసి బారికేడ్లను ప్రారంభించారు. అలాగే పాత బస్టాండులో వెలసిన శ్రీపద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయానికి కూడా 5 బారికేడ్లను భారతి సిమెంటు ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా భారతి సిమెంటు తరపున ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, భారతి సిమెంటు కంపెనీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా వెళుతున్న వాహనంలో మంటలు
గుర్రంకొండ : వేగంగా రోడ్డుపై వెళుతున్న బొలేరో వాహనంలోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పి, వాహనం ముందు భాగం మొత్తం కాలిపోయిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. పెద్దమండ్యం మండలానికి చెందిన రెడ్డెయ్య అనే వ్యక్తి టమాటా లోడుతో గురువారం కలకడ టమాటా మార్కెట్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండకు సమీపంలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద బొలేరో వాహనం ముందుభాగం ఇంజిన్ వైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో డ్రైవర్ రెడ్డెయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెంటనే వాహనం నిలిపేసి దిగిపోయాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడి వాహనం ముందుభాగం మొత్తం కాలిపోయింది. వాహనంలోని ఇంజిన్ భాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి. ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పై వామపక్షాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మోడీ వికసిత్ భారత్ అంటూ బూటకపు మాటలు చెప్తుంటే, రాష్ట్రంలో బాబు విలవిల ఆంధ్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వారం రోజుల్లో పెట్టబోతున్నారని, ఈ బడ్జెట్లోట్లో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బాబు తరచూ రాష్ట్రంలో తమది ఎన్డీఏ కూటమి అని చెబుతున్నప్పటికీ విభజన చట్టం హామీల అమలుకు గాని, రాజధాని, పోలవరం నిర్మాణానికి గానీ కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారన్నారు. గండికోట, మైలవరం, చిత్రావతి, సర్వరాయ సాగర్, వామికొండ, బ్రహ్మ సాగర్, వెలుగొండ తదితర చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 100 టీఎంసీలు నిలువకు అవకాశం ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరు లేక విలవిల పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ 2025 బడ్జెట్లో లేవన్నారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ, ప్రభుత్వ ఖర్చుల్లో కోతలు పెడుతోందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు ప్రతి బడ్జెట్లో కొంత తగ్గిస్తూ ఆ పథకాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదే జరిగితే గ్రామీణ పేదరికం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎం.ఎల్ .న్యూ డెమోక్రసీ), సీపీఐ (ఎం.ఎల్ .లిబరేషన్), ఆర్.ఎస్.పి, ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
అక్రమంగా వేప మొద్దులు తరలిస్తున్న లారీ సీజ్
అట్లూరు : అనుమతులు లేకుండా వేపచెట్లను నరికి తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ తెలిపారు. గురువారం అట్లూరు రెవెన్యూ పొలంలోని రెడ్డిపల్లి దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికి తరలించేందుకు లారీకి లోడు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. చెట్లను నరికి ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైలులో నుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు ముద్దనూరు : మండలంలోని చింతకుంట గ్రామ శివారులో గురువారం రైలులో నుంచి పడి ఉత్తరప్రదేశ్కు చెందిన అర్జున్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయిన యువకుడిని చింతకుంటకు చెందిన ఇరువురు రైతులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. కార్యదర్శి అవినీతిపై విచారణ ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన గురుమోహన్ అవినీతిపై మాజీ వార్డు సభ్యుడు మార్తల వెంకటసుబ్బారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు గురువారం డీఎల్పీఓ తిమ్మక్క గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపవరం గ్రామ పంచాయతీలో లే అవుట్లలో అప్పటి కార్యదర్శి గురుమోహన్ అక్రమ వసూళ్లు చేశారని, లే అవుట్లకు అనుమతులు జారీ చేసే విషయంలో అవినీతికి పాల్పడ్డారని, 2019 నుంచి 2023 వరకు దొంగ సర్టిఫికెట్లతో గ్రామ పంచాయతీలో చెన్నకేశవ అనే ప్రైవేట్ వ్యక్తికి కార్యదర్శి, అప్పటి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం జీతాలు ఇచ్చినట్లు మార్తల వెంకటసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు గతంలో ఓ మారు విచారణ చేశామన్నారు. ప్రస్తుతం కలెక్టర్, డీపీఓ ఆదేశాల మేరకు మరో మారు పునర్విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వద్ద నుంచి అవినీతికి సంబంధించిన ఆధారాలను ఆమె సేకరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామాంజనేయరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. -
దళితులపై దాష్టీకం
● వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్గా కక్షసాధింపు ● ముగ్గురికి సంబంధించిన గృహాల కూల్చివేత ● బాధితులను పరామర్శించిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రాజంపేట రూరల్ : కూటమి నాయకుల దాష్టీకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్గా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దళితుల గృహాలు కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. వివరాలు.. రాజంపేట మండల పరిధిలోని కూచివారిపల్లి పంచాయతీ కొమ్మివారిపల్లి దళితవాడలో వైఎస్సార్సీపీకి చెందిన గొంటు సుబ్బమ్మ, మద్దూరి సుబ్బలక్ష్మి, గొంటు ఈశ్వరమ్మలు ప్రభుత్వం అందజేసిన భూమిలో గృహాలను నిర్మించుకున్నారు.జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలతో సబ్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, తహసీల్దార్ పీర్మున్నీ, మన్నూరు సీఐ మహమ్మద్ అలీ దగ్గరుండి గృహాల కూల్చి వేతకు బుధవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. పోలీసు బలగాలు, జేసీబీలతో రెవెన్యూ అధికారులు దళితవాడ వద్దకు వచ్చారు. తమ వద్ద ఉన్న పట్టాలను దళితులు చూపించినా కనికరం చూపలేదు. నోటీసులు ఇవ్వకుండా వచ్చారు కదా సమయం ఇవ్వండి అని వేడుకున్నా కరుణించలేదు. పేదలం.. గృహాలను కూల్చవద్దని ప్రాధేయ పడినా వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల పహారాలో బుధవారం రాత్రి 10గంటల వరకు కూల్చివేతలను కొనసాగించారు. ప్రభుత్వ భూమి అని చెబుతున్నా రెవెన్యూ అధికారులు దళితుల గృహాల పక్కనే ఉన్న కూటమి ప్రభుత్వానికి చెందిన వారి గృహాల వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం గమనార్హం. దళితుల గృహాలను కూల్చివేయటం దుర్మార్గపు చర్య : ఆకేపాటి 2 సంవత్సరాల కిందట దళితులు నిర్మించుకున్న గృహాలను అధికార యంత్రాంగం దౌర్జన్యంగా కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మండి పడ్డారు. కొమ్మివారిపల్లి దళితవాడలో బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేసిన దళితుల గృహాలను గురువారం ఎమ్మెల్యే ఆకేపాటి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఆకేపాటి రాగానే దళితులు పెద్ద ఎత్తున రోదిస్తూ తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. రెక్కాడితే కానీ డొక్కాడని దళితులమైన మేము అగ్రకులాల వారి మధ్య గృహాలను నిర్మించుకున్నందున కుల వివక్షతో కూల్చేశారని బోరున విలపించారు. కూల్చవద్దని ప్రాధేయ పడుతున్నా వినలేదని, మహళలు అని చూడకుండా మా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారంటూ విలపించారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు జిల్లా అభివృద్ధికి దోహదపడాలి కానీ కూల్చివేతలకు ఆదేశాలివ్వడం తగదన్నారు. అధికారులు పక్ష పాత ధోరణి విడనాడాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో గృహాలను కూల్చివేయాల్సిన అవసరం అధికారులకు ఏముందని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఎపుడూ లేని విష సంస్కృతికి బీజం వేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించటం సరి కాదన్నారు. దళితులకు నష్ట పరిహారం చెల్లించి, గృహాలను నిర్మించే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. దళితులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నరు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏబీ సుదర్శన్రెడ్డి, మూరి గోవర్ధన్రెడ్డి, పాటూరు భరత్కుమార్రెడ్డి, అనుదీప్, వైఎస్సార్సీపీ నాయకులు పీ.విశ్వనాథరెడ్డి, కే. గోపిరెడ్డి, జేవీ కృష్ణారావు, జీ. త్రినాథ్, డి. బాస్కర్రాజు, శంకరయ్యనాయుడు, ఏ.సౌమిత్రి, ఎస్.నవీన్కుమార్, ఏ. వరదరాజు, దండు గోపీ, దాసరి పెంచలయ్య, జీవీ సుబ్బరాజు, ఆర్.కమలాకర్, ఆర్.గురుమూర్తి, ఏ.మధుబాబు, కె.రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
మదనపల్లె సిటీ : మనకు ఎన్ని భాషలు తెలిసినా మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగేది ఒక్క మాతృభాషలోనే. అలాంటి కమ్మనైన అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగానే వారి వారి మాతృభాషల పరిరక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలు కనుమరుగు కాకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా యునెస్కో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. నాటి నుంచి వారి వారి మాతృభాషలను గౌరవించుకుంటున్నారు. కనీసం 30 శాతం మంది వారి మాతృభాషలను నేర్చుకోకపోయినా.. మాట్లాడకపోయినా ఆ భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరించింది. గతం.. ఎంతో ఘనం రాజులు, నవాబుల పరిపాలనలో రాజ్యమేలిన భాషలు తెలుగు, ఉర్దూ. ఈ భాషలు రానురాను ప్రాభవం కోల్పోతున్నాయి. నేడు పాలనలో, పాఠశాలల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ మాతృభాషలు అటు తెలుగు, ఇటు ఉర్దూ అమలు అరకొరగానే ఉంది. తెలుగు వెలుగు కోసం.. తెలుగు వెలుగు కోసం పాలకులు చొరవ చూపాలని తెలుగు భాషాభిమానులు సూచిస్తున్నారు. తెలుగుభాషా రక్షణ, భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను నిధులు, విధులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. మాతృభాషల అభివృద్ధికి ఇలా చేయాలి.. ● రాష్ట్ర స్థాయిలో అధికార భాష, ద్వితీయ అధికార భాష అయిన తెలుగు, ఉర్దూలను నిర్బంధంగా అమలు చేయాలి. ● గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కూడా జరగాలి. ● ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి శాశ్వత భవనం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తెలుగు, ఉర్దూభాషాభివృద్ధికి వినియోగించాలి. ● పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషలను నిర్బంధంగా అమలు చేస్తూ ప్రాథమిక స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ● తెలుగు, ఉర్దూ అకాడమీలను, అధికారభాషా సంఘాలకు అధికారులు, నిధులు, విధులు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించి భాషాభివృద్ధికి కృషి చేయాలి. ● పోటీ పరీక్షలన్నింటినీ ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ మాధ్యమ అభ్యర్థులకు 5 శాతం అదనపు మార్కులు కలిపి ప్రశ్నాపత్రాలను తెలుగు, ఉర్దూలో కూడా ఇవ్వాలి. ద్వితీయ అధికార భాషగా ఉర్దూను అమలు చేయాలి రారష్ట్రంలోని 13 జిల్లాలలోనూ ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. తెలుగుతో సమానంగా ఉర్దూలో కూడా కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తర కార్యక్రమాలు అమలు చేసి ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి. ఉర్దూ పాఠశాలలు, కళాశాలలు, డైట్లలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఒక జాతి మనుగడ వారు మాట్లాడే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. – మహమ్మద్ఖాన్, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లె. జాతి మనుగడకు భాషే ఆధారం అమ్మ ఉగ్గుపాలతో నేర్చుకు న్న భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తెలుగువారైన మనందరిపైనా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు మన తెలుగుభాష ను అందించాలి. ఒక జాతి మనుగడ, వారు మాట్లా డే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. తెలుగుభాషాభివృద్ధిలో భాగంగా ఏర్పాటైన తెలుగు అకాడమీలను బలోపేతం చేయాలి. – టీఎస్ఏ కృష్ణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, మదనపల్లె. అందరి బాధ్యత అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమిష్టిగా మాతృభాషాభివృద్ధికి చొరవ చూపాలి. – వీఎం నాగరాజు, మరసం సభ్యులు, మదనపల్లె. తల్లిదండ్రుల పాత్ర కీలకం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుదకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు. – అంజలి, ఉపాధ్యాయురాలు, మదనపల్లె. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -
కూటమికి ఓట్లేసి ప్రజలు బాధపడుతున్నారు
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి ఎర్రగుంట్ల : ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని.. ఇప్పుడు మోసపోయామని తెలుసుకుని బాధపడుతున్నారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగుంట్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యక్తిగతంగా తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, తనను తిట్టడం తగదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ప్రజల ఖాతాల్లో రూ. లక్ష పడి ఉండేదన్నారు. ఎన్నికల్లో పోట్లదుర్తి గ్రామంలో ఎంపీ సీఎం రమేష్ నాయుడు నిజాయితీగా పనిచేయడం వల్లే ఆదినారాయణరెడ్డికి అక్కడ మెజార్టీ వచ్చిందన్నారు. కానీ తన సొంత పార్టీ నేత పనులనే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఎంపీ సైతం జమ్మలమడుగులోని పేకాట క్లబ్లపై స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు. తమ హయాంలో ఒక్క ఫించన్ కూడా రద్దు చేయలేదని, ఇప్పుడు నియోజకవర్గంలో 2 వేలకు పైగా పింఛన్లు రద్దయ్యే పరిస్థితి ఉందన్నారు. వాటిని నిలబెట్టాలని కోరారు. ఎర్రగుంట్లలో డ్రైనేజీలో పూడికలు తీసేందుకు రూ.34 లక్షలు, నాలుగు రోడ్ల కూడలిలో రూ.10 లక్షలతో చేస్తున్న పనుల్లో అవినీతి కనిపిస్తోందన్నారు. ఇసుక మాఫియా, ఎర్రమట్టి, ఫ్లైయాష్ కోసం టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నారని విమర్శించారు. కొండాపురం ఆర్ అండ్ ఆర్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12 లక్షలు ఇప్పించాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజకీయం తెలియని వారు కూడా గెలిచారని.. ఆదినారాయణరెడ్డి గెలవడం గొప్ప విషయం కాదన్నారు. సూపర్ సిక్స్ పథకాలే ఈ విజయానికి కారణమన్నారు. వ్యక్తిగత దూషణలు మాని ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జయరామక్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ అలీ, పార్టీ నాయకులు నారపురెడ్డి, రామలింగారెడ్డి, నాగరాజు, ఇస్మాయిల్, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దాల్మియా యాజమాన్యం వైఖరి దారుణం
–ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు : ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చి సహకరించిన రైతుల పట్ల దాల్మియా యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాల్మియా యాజమాన్యం వంకలు, వాగులు ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల వర్షా కాలంలో వరదలు వచ్చిన ప్రతి సారి పంట పొలాలతో పాటు గ్రామాలను సైతం వరద ముంచెత్తుతోందన్నారు. దీనిపై నవాబుపేట, దుగ్గనపల్లి ఎస్సీకాలనీ ప్రజలతోపాటు చిన్నకొమెర్ల రైతులు అనేక సార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో మూడు గ్రామాల రైతులు లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. ఇటీవల లోకాయుక్త కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన రైతులకు, బ్లాస్టింగ్తో దెబ్బతిన్న నవాబుపేట గ్రామస్తులకు న్యాయం చేయాలని, దుగ్గనపల్లి గ్రామంలోని రైతుల పంట పొలాలకు పరిహారం ఇవ్వడంతోపాటు వారి గ్రామాన్ని వేరే చోటికి తరలించి శాశ్వతమైన పరిష్కారం చూపాలని లోకాయుక్త యాజమాన్యానికి సూచించిందన్నారు. అయితే యాజమాన్యం ఇవేమీ పట్టించుకోకుండా ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా రెండో ప్లాంట్ విస్తరణకు వెళితే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం దాల్మియా చుట్టుపక్కల గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించనున్నట్లు రామసుబ్బారెడ్డి తెలిపారు. రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శివగురివిరెడ్డి, నవాబుపేట భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయపడిన మహిళ మృతి లింగాల : లింగాల మండలం ఎగువ లింగాల గ్రామానికి చెందిన అలవలపాటి శోభ(40) అనే మహిళపై ఈనెల 15వ తేదీ శనివారం విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో మహిళ కాలు పూర్తిగా రెండు ముక్కలై తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా.. గత శనివారం తన పొలంలోని బుడ్డశనగ పంటను భారీ మిషన్తో నూర్పిడి చేశారు. తర్వాత పక్క పొలంలో బుడ్డశనగ పంట నూర్పిడికి కూలీలు తక్కువగా ఉన్నారని కొద్దిసేపు పంట నూర్పిడి మిషన్ వద్దకు రావాలని కూలీల మేసీ్త్ర పిలవడంతో శోభ వెళ్లింది. బుడ్డశనగ పంట కుప్పలను మిషన్లోకి వేయడానికి వెళ్లగా భారీ మిషన్కు అడ్డంగా పైన ఉన్న విద్యుత్ తీగలను మిషన్ తగలగా.. సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగి బుడ్డశనగ కుప్పను ఎత్తుతున్న శోభపై పడింది. దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేయగా కాలిపై పడి రెండు ముక్కలైంది. విద్యుత్ స్తంభానికున్న కడ్డీ తలకు తగిలి బలమైన గాయమైంది. వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు శోభకు భర్త బాల శేఖరరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇరువర్గాల గొడవ పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గాంధీనగర్ వద్ద గురువారం రాత్రి కొంతమంది యువకులు గొడవపడ్డారు. గాంధీ నగర్కు చెందిన కుమార్, పుష్పంత్.. అదే కాలనీకి చెందిన ప్రతాప్, ప్రదీప్, హరిలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో కుమార్, పుష్పంత్లతోపాటు ప్రదీప్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పూలంగళ్ల సమీపంలోని రంగనాథ స్వామి తిరుణాలలో ఇరువర్గాలకు చెందిన వీరు మాటా, మాటా మాట్లాడి గొడవపడ్డారు. గురువారం ఇరువర్గాలు ఫైర్ స్టేషన్లో రాడ్లతో కొట్టుకోవడంతో వీరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హంస వాహనంపై ఊరేగిన వీరభద్రస్వామి చాపాడు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం సన్నిధిలో మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన గురువారం రాత్రి వీరభద్రస్వామి, భద్రకాళీమాత హంస వాహనంపై ఊరేగారు. ఆలయ ప్రాంగణంలో గణపతి, వల్లీ దేవసేన, సుబ్రమణ్యేశ్వరస్వామి, చండీశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి, త్రిశూలేశ్వరస్వామి పంచమూర్తి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణంలో ఊరేగిన వీరభద్రస్వామికి వేలాది మంది భక్తులు పూజలు చేశారు. -
హంస వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథుని కాంప్లెక్స్లో ప్రాచీన దేవాలయమైన శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బుధవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పగలు శ్రీర ంగనాథస్వామికి ఆలయ ప్రదాన అర్చకులు కృష్ణరాజేష్శర్మ విజేష పూజలు జరిపించారు. చక్రస్నానం చేయించారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. స్వామి వారికి భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పులివెందుల వాల్మీకి నాట్యమండలి వారిచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటక ప్రదర్శన నిర్వహించారు. పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధీకర్రెడ్డి, ఈఓ కెవి రమణలు, సభ్యులు పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు -
చికెన్, గుడ్లను నిర్భయంగా తినొచ్చు
● జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ కడప అగ్రికల్చర్: జిల్లాలో బర్డ్ప్లూ లేదని మాంస ప్రియులు చికెన్, గుడ్లను బాగా ఉడికించుకుని నిర్భయంగా తినొచ్చని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ సూచించారు. బుధవారం నగరంలోని రాజీమార్ మార్గ్లో కలెక్టర్ ఆదేశానుసారం బర్డ్ప్లూపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బర్డ్ప్లూపై వస్తున్న వదంతాలను ఎవరు నమ్మొద్దన్నారు. జిల్లాలో ఎక్కడ బర్డ్ప్లూ లేదన్నారు. ఈ విషయమై జిల్లాలో రాపిడ్ రిస్కు టీమ్స్ను ఏర్పాటు చేసి ప్రతి మండలంలో ప్రజలకు సూచనలు, సలహాలను ఇస్తున్నామని వివరించారు. అనంతరం చికెన్ లాలిపాప్స్ను తెప్పించి పశువైద్యాధికారులు తినడంతోపాటు అక్కడకు హాజరైన జనాలకు తినిపించారు. జిల్లాలోకి చనిపోయిన కోళ్లు సరఫరా కాకుండా ఉండటానికి మార్కెటింగ్, ట్రాన్స్పోర్టు, మైనింగ్, పోలీసు చెక్ పోస్ట్ వారికి గట్టి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అయితా నాగేశ్వరావు, పీవీపీ ఏడీలు రంగస్వామి, సుబ్బరాయుడు, పశువైద్యాధికారి డాక్టర్ అనుపమ, జేవీఓ రాజశేకర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీ సర్వేపై అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డితో కలిసి సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో భూముల రీ సర్వే పై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలని, నివేదికలు పంపాలన్నారు. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. భూముల రిసర్వే ప్రక్రియ రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని అన్నారు. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజలకు పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్క రూ నిబద్ధతతో పనిచేయాలన్నా రు. రెవెన్యూ శాఖలో ఎక్కడా కూడా పెండింగ్ అంశాలు లేకుండా చూడాలన్నారు. భూ రికార్డు లను సంతృప్తి కరంగా ఏలాంటి లోటుపాట్లను లేకుండా అప్డేట్ చేయాలన్నారు. ఇందుకు ఆయా తహసీల్దార్, వీఆర్ఓలు బాధ్యత వహించాలని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చిత సమాధానం ఇవ్వాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, సర్వే ల్యాండ్ అధికారి, రెవెన్యూ అధికారులు, పాల్గొన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలి కాశినాయన:రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీ అదితిసింగ్ పేర్కొన్నారు. బుధవారం తహసీల్దారు కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు నరసింహులు, ఆర్ఐ అమర్నాఽథ్ రెడ్డి పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ -
అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!
●నిబంధనలకు విరుద్ధంగా.. ‘ హలో సార్... మీ పాప రమ్య పదవ తరగతి చదువుతున్నది కదా..! ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలానా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఎంసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్ను విజిట్ చేసి చూడండి ’ . ‘సార్ గుడ్ ఈవినింగ్, సురేష్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా. బీటెక్ కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఏఐఎంల్, డేటా సైన్సు, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే చెప్పండి... రాయితీలు ఇప్పిస్తాం’... మదనపల్లె సిటీ: టెన్త్, ఇంటర్ చదవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి , ఇంటర్మీ డియట్ కు సంబంధించి వేలాది మంఇ రాస్తున్నారు. కనీసం వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాకముందే కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేటతో పాటు మండల కేంద్రాల్లో సైతం బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి... తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లు కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజినీరింగ్ కాలేజీలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షలో ఫీజులు బాదేస్తున్నారు. మరో వైపు పీఆర్ఓలు... తిరుపతి, విజయవాడ కేంద్రాల కార్పొరేట్ కాలేజీల తరపున వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆయా విద్యా సంస్థల పీఆర్ఓలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కాలేజీల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీ పడుతున్నారు. పరీక్షల కంటే ముందే అడ్మిషన్ల కోసం తంటాలు ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సుల పేరిటముందస్తు దోపిడీ తల్లిదండ్రులకు పెరిగిన ఫోన్ల తాకిడి సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈ సారి గత ఏడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కాలేజీలు సిద్ధమయ్యాయి. -
పటిష్టంగా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఆశోక్ కుమార్ పేర్కొన్నారు. పొలతల క్షేత్రంలోని పర్యాటక భవనంలో బుధవారం సాయంత్రం ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. అలాగే ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించాలన్నారు. ముఖ్యంగా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఈఓ కృష్ణానాయక్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని రాజ్యలక్ష్మి, తహశీల్దార్ అనురాధ, ఎంపీడీఓ జగన్మోహన్రెడ్డి,ఆర్టీసీ, అటవీ అధికారులు పాల్గొన్నారు. -
‘స్టాఫ్ నర్స్’ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ జాబితాను సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు. 23న హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపిక పులివెందుల టౌన్: పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టర్బ్ హాకీ గ్రౌండ్లో ఈనెల 23న ఆదివారం ఉదయం హాకీ సీనియర్ పురుషుల జిల్లా జట్టు ఎంపికలు జరగనున్నాయని హాకీ జిల్లా సెక్రటరీ ఎం.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న హాకీ క్రీడాకారులు మార్చి 6 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పురుషుల హాకీ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఎంపికలకు పాల్గొనే క్రీడాకారులు 01–01–1991 తర్వాత 31–12– 2005 ముందు జన్మించి ఉండాలని వివరించారు. క్రీడాకారులు ఒరిజనల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. రేపు జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: పోరుమామిళ్ల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఈనెల 21వ తేదిన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ నిర్వహించే ఈ జాబ్మేళాలలో నవత ట్రాన్స్పోర్టు కంపెనీలో క్లర్క్, డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అలాగే డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలాకాలింగ్ ఆఫీర్, ఎల్ఐసీలో బీమా సాక్షి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.. ఎంపికైన వారికి రూ.7 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనం హోదాను బట్టి లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఫర్నీచర్ సరఫరాకు కొటేషన్లు ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: కడప స్పెషల్ పొక్సో కోర్టు కోసం కొత్త ఫర్నీచర్ వస్తువుల సరఫరా కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్లతో కలుపుకొని 7 ఐరన్ అల్మారాలు, 1ఐరన్ ర్యాక్, 8 ఆఫీసు టేబుల్స్, 3 కుషన్ ఛైర్స్, 30 ‘ఎస్’ౖ టెప్ మార్క్ ఛైర్స్, ఒక క్రోన్ చైర్, 5 ఐరన్ స్టూల్స్, 2 కోట్ హాంగర్స్, 3 ఉడెన్ బెంచులు, ఒక సోఫా సెట్, 5 టీ పాయి, ఒక డ్రైనింగ్ టేబుల్, ఒక ప్లాస్టిక్ చైర్ మొత్తం 13 రకాల ఫర్నిచర్ వస్తువుల కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు.టెండరుదారు సమర్పించే కొటేషన్ కవరు పైన ‘కొటేషన్ ఫర్ సప్లయ్ అండ్ ఇన్స్ట్రాలేషన్ ఫర్ ఫర్నీచర్ ఐటమ్స్’అని రాయాలన్నారు. నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేది సాయంత్రం 5 గంటల లోపు. ప్రిన్సిపల్ డీస్ట్రిక్ట్ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు. వివరాల కోసం వెబ్ సైట్ కడప.డికోర్ట్సు,జీఓవీ.ఇన్లో చూడవచ్చని, అలాగే 08562–254963 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లాకు యూరియా రాక కడప అగ్రికల్చర్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు బుధవారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో వైఎస్సార్జిల్లాకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 1000 మెట్రిక్ టన్నల యూరియాను మార్క్ఫెడ్కు అలాట్ చేసినట్లు వివరించారు. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మార్క్ఫెడ్కు 300 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించామని పేర్కొన్నారు. రైతులు యూరి యా కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు తెలిపారు. -
● ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు...
చాపాడు మండలంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు ఎల్సీ గోపాల్రెడ్డి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యులకు అందించాల్సిన రేషన్ బియ్యం పంపిణీ, తూకంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రధానంగా రేషన్షాపు డీలర్లు టీడీపీ నేతలే ఉన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా సైతం మైదుకూరు నియోజకవర్గంలో తిష్ట వేసి ఉంది. అందులో దువ్వూరు మండలంలోని టీడీపీ వర్గీయుడు గిరియాదవ్ పోలీసులకు సైతం పట్టుబట్టారు. చిన్నసింగనపల్లెకు చెందిన మరో టీడీపీ వర్గీయుడు ఏకంగా డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారిపై బెదిరింపులకు దిగారు. ● అంతేనా టీడీపీ నేతలు భూ ఆక్రమణలకూ తెరతీశారు. ఏకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ చెరువులను చెరబట్టారు. వంకలను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ, పరంబోకు భూములు స్వాహా అవుతోన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుతమ్ముళ్లు నేతృత్వంలో తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అవే విషయాలు పత్రికల్లో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధిగా పుట్టా సుధాకర్యాదవ్ స్పందించాలి కదా... కట్టడి చేయాలి కదా... అంటూ విపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
● గ్రామాల్లో బెల్ట్ట్షాపులు..
మైదుకూరు నియోజకవర్గంలో మద్యం యధేచ్ఛగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు తిష్టవేశాయి. చివరికి బ్రహ్మంగారిమఠం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా బెల్ట్షాపులు వెలిశాయి. ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని స్వయంగా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికై నా బెల్డ్ షాపు బ్రహ్మంగారిమఠంలో కట్టడి చేశారా? అంటే లేదు. కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే స్థాయికి అది ఎంత పని? వాస్తవంగా ఎకై ్సజ్, పోలీసులు అధికారులు తనిఖీలకు వెళితే ఎమ్మెల్యే సహాయకుడు నుంచి వెంటనే అధికారులకు ఫోన్ వస్తున్నట్లు పలువురు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారులు వాపోతున్నారు. అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయాలని భావించి చర్యలు చేపడితే ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు నుంచి ఫోన్లు వస్తున్నట్లు వాపోతున్నారు. నిజంగా మైదుకూరులో అవినీతి అధికారులు తిష్టవేసి ఉన్నారా...అధికారులను బెదిరించి దారికి తెచ్చుకోవాలనే తపనతో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారా...అన్న విషయం సందిగ్ధంగా ఉందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అవినీతి అధికారులు తిష్టవేసి ఉంటే అలాంటి వారికి పోస్టింగ్ ఇప్పించిన నాయకులెవ్వరు? విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. అధికారుల విధులకు పాలకపక్షం ఆటంకం కల్గించకుంటే అదే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు వివరిస్తున్నారు. -
విద్యార్థుల వినూత్న నిరసన
ప్రొద్దుటూరు రూరల్: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలలో విద్యార్థులు బుధవారం స్టైఫండ్ ఇంగ్లీషు అక్షరాల ఆకారంలో నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పశువైద్య కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ స్టైఫండ్ పెంచాలని 17 రోజుల నుంచి నిరసన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. స్టైఫండ్ పెంచాలి.. ప్రభుత్వం స్పందించాలి.. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి అని వారు నినాదాలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు తమ సమస్యను వివరిస్తామన్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు సమానంగా తమకు స్టైఫండ్ పెంచి ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. -
ఆధ్యాత్మిక అంశాలకు నెలవు రామాయణం
కడప కల్చరల్ : ÝëÐ]l*-hMýS, B«§éÃ-†-ÃMýS, OÐðlgêq-°MýS A…Ô>-ÌSMýS$ Æ>Ð]l*-Ķæ$×æ… ¯ðlÌSÐ]l° ç³…^èl çÜçßæ-{Ýë-Ð]l«§é° yéMýStÆŠ‡ Ðól$yýl-Ýë-°-Ððl*-çß毌S A¯é²Æý‡$. OÐðlÒ-ĶæÊÌZ° {»o¯ŒS ¿êÚë ç³Ç-ÔZ«§ýl¯]l MóS…{§ýl…ÌZ “™ðlË$VýS$ÌZ Æ>Ð]l*-Ķæ$-×ê-Ë$&-Ýë-Ð]l*-hMýS §ýl–MýSµ-£ýl…’ A…Ôèæ…Oò³ fÆý‡$VýS$-™èl$¯]l² Æð‡…yýl$ ÆøkÌS A…™èlÆ>j-¡Ä¶æ$ çܧýl-çÜ$ÞÌZ ¿êVýS…V> º$«§ýl-ÐéÆý‡… ÝëĶæ$…{™èl… Ð]l¬W…ç³# çÜÐ]l*-Ðól-Ô>°² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. Ð]l¬QÅ A†¤V> Ñ^óla-íܯ]l yéMýStÆŠ‡ Ðól$yýlÝë° Ððl*çß毌S Ð]l*sêÏ-yýl$™èl* ÐéÎ-ÃMìS Ð]l$çßæÇÛ _{†…-_¯]l Æ>Ð]l¬yýl$ VýS$Æý‡$-Ð]l#-ÌSMýS$ VýS$Æý‡$-Ð]l-°, B^èl-Æý‡-×æ-Ö-Ë$yýl° A¯é²Æý‡$. Æ>Ð]l*-Ķæ$×æ MýSÌSµ-Ð]l–-„ýS…ÌZ ÕÐ]l-«§ýl-¯]l$Æý‡Â…VýS… çÜ…§ýl-Æ>°² ÑÔèæÓ¯é£ýl E§é-™èl¢…V> _{†…-^éÆý‡-¯é²Æý‡$. B^éÆý‡Å Ð]l*yýl-¿¶æ*íÙ çÜ…ç³™Œæ MýS$Ð]l*ÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* Æ>Ð]l¬° Ð]lÌSÏ Æý‡çœ¬Ð]l…Ôèæ… MîSÇ¢…-º-yìl…§ýl° {ç³gêMýSÑ ÐólÐ]l$¯]l A¯é²-Æý‡-¯é²Æý‡$. {í³°Þ-ç³ÌŒæ B^éÆý‡Å G‹Ü.-Æý‡-眬¯é£ýl Æð‡yìlz Ð]l*sêÏ-yýl$™èl* Æ>Ð]l*-Ķæ$-×æ…ÌZ Æ>Ð]l¬yýl$ A¯ólMýS MýSÚëtË$ G§ýl$ÆöP-¯é²-yýl-°, M>± ¯ólsìæ Ķæ¬Ð]l™èl _¯]l² _¯]l² çÜÐ]l$-çÜÅ-ÌSMóS yîlÌê-ç³yýl$-™èl$¯é²-Æý‡-¯é²Æý‡$. gê¯]l-Ð]l$-¨ª ÑfĶæ$ ¿êçÜPÆŠ‡ Ð]l*sêÏ-yýl$™èl* VýS™èl…ÌZ MýSyýl-ç³hÌêÏ Æý‡^èlƇ$$-™èlÌS çÜ…çœ$… B«§ýlÓ-Æý‡Å…ÌZ Vöç³µV> Ð]l$à-çÜ-¿ýæË$ °Æý‡Ó-íßæ…-^é-Æý‡-°, D Æð‡…yýl$ ÆøkÌS çܧýlçÜ$Þ ¯ésìæ çÜ¿ýæ-ÌS¯]l$ ™èlÌSí³…-ç³gôæ-Ô>Ķæ$-¯é²Æý‡$. D çܧýl-çÜ$ÞÌZÏ 80 Ð]l$…¨ §ólÔèæ, ѧól-Ô>ÌS {糆-°«§ýl$Ë$, ç³{™èl çÜÐ]l$Æý‡µ-MýS$Ë$ ÑÑ«§ýl A…Ô>-ÌSOò³ {ç³çÜ…-W…-^éÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ B^éÆý‡Å h.´ë-Æý‡Ó-†, yéMýStÆŠ‡ ¯]lÆ>ÌS Æ>Ð]l*-Æð‡yìlz, B^éÆý‡Å õ³r }°-ÐéçÜ$-ÌS-Æð‡yìlz, B^éÆý‡Å çÜ…VýS-¯]l-¿ýæ-rÏ ¯]lÆý‡çÜĶæ$Å, B^éÆý‡Å h.»ê-ÌS-çÜ$-{º-çßæÃ-×æÅ…, B^éÆý‡Å G¯ŒS.-D-ÔèæÓ-Æý‡-Æð‡yìlz, yé॥ MðS.Æý‡Ñ-»êº$, yé॥ sìæ.G-‹Ü.-Ððl…MýSsôæÔŒæ, yé॥ G‹Ü.-Ð]l$-Ð]l$™èl, yéMýStÆŠ‡ í³.ÌZ-MóSÔèæÓÇ, yé॥ ¿¶æ*™èlç³#Ç Vø´ë-ÌS-MýS–çÙ~ Ô>[íÜ¢, yéMýStÆŠ‡ _…™èl-MýS$…-rÕ-Ðé-Æð‡yìlz, B^éÆý‡Å yìl.Ñ-f-Ķæ$ÌS-„ìS-Ã, B^éÆý‡Å sìæ.Æ>-Ð]l$-{ç³-Ýë§ýl Æð‡yìlz, B^éÆý‡Å h.§é-Ððl*-§ýlÆý‡ ¯éĶæ¬yýl$, B^éÆý‡Å G…G… ѯø¨-°, fíÜt‹Ü ç³çÜ$-ç³#-Ìôæsìæ Ôèæ…MýSÆŠæ, ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
రాజకీయ ఒత్తిళ్లతో చెక్ పవర్ రద్దు చేసే యత్నం
కడప సెవెన్రోడ్స్ : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తన చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని వీఎన్.పల్లె మండలం బుసిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్ లింగారెడ్డి అనూరాధ ఆరోపించారు. ఆమె భర్త, రాష్ట్ర మైనింగ్ మాజీ డైరెక్టర్ ఎల్.వీరప్రతాప్రెడ్డితో కలిసి డీపీఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ మాట్లాడుతూ బుసిరెడ్డిపల్లె నుంచి గంగనపల్లె వరకు లక్షా 14 వేల రూపాయలతో గ్రావెల్ రోడ్డు నిర్మించామని, ఏఈ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. బిల్లు ఇంతవరకూ తీసుకోలేదన్నారు. రోడ్డు పనుల్లో తాము అవినీతికి పాల్పడ్డామని అధికార పార్టీకి చెందిన లైన్మెన్ ప్రసాద్రెడ్డి, నల్లబల్లె రమణారెడ్డి డీపీఓకు ఫిర్యాదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన డీపీఓ రాజ్యలక్ష్మి విచారణ బాధ్యతను పులివెందుల డివిజనల్ పంచాయతీ అధికారికి అప్పగించారన్నారు. తమది ఫ్యాక్షన్ గ్రామమని, డీపీఓ వైఖరి కారణంగా కక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తాను, తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు : డీపీఓ పులివెందుల డీఎల్పీఓను విచారణకు నియమించామని, నివేదిక పరిశీలించిన తర్వాత చర్యలు చేపడతామని డీపీఓ రాజ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. అభియోగాలు రావడం సహజమని, ఆడిట్ జరిగిందా? లేదా? అనే దానితో సంబంధం లేదని తెలిపారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని, చట్ట వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమన్నారు. తప్పు జరిగిఉంటే ఏఈ బాధ్యులవుతారని తెలిపారు. డీపీఓ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన -
అరటి తోటకు నిప్పు.. రూ.3 లక్షల నష్టం
వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె సమీపంలో కొందరు ఆకతాయిలు తన అరటి తోటకు నిప్పుపెట్టినట్లు ఎరబ్రోయిన రవి తెలిపారు. బాధితుడి వివరాల మేరకు.. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రబోయినరవి వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ పొలాల్లో మూడు ఎకరాల్లో అరటితోట సాగు చేస్తున్నారు. ఈ తోటకు సమీపంలో కొందరు ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండెకరాల్లో అరటి చెట్లు, ప్లాస్టిక్ పైపులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. కాలిపోయిన అరటి పంటను హార్టికల్చర్ సిబ్బంది శివ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందించాలని కౌలు రైతు కోరారు. అగ్నికి ఆహుతైన అరటి పులివెందుల రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూమికి నిప్పంటించడంతో మంటలు వ్యాపించి అరటి తోటలో 46 చెట్లు దగ్ధమయ్యాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడు ఎరబ్రండ కొత్తపల్లిలో ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. తోట పక్కన బీడు భూమి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పంటించారు. మంటలు వ్యాపించి రైతుకు చెందిన అరటిచెట్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.60 వేల పంట నష్టం జరిగిందని రైతు చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బంగారం రికవరీ పేరిట మాకు వేధింపులా?
కడప కల్చరల్ : చోరీ జరిగిన బంగారాన్ని రికవరీ చేయడం పేరిట బంగారు దుకాణ యజమానులను వేధించడం సమంజసం కాదని కడప జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జరుగు రాజశేఖర్రెడ్డి అన్నారు. వైవీ స్ట్రీట్లో కడప జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ గత కొద్దికాలంగా పోలీసు యంత్రాంగం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, కడపలోని ఏ నగల దుకాణ వ్యాపారి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బంగారు కొనుగోలు విషయంలో ఇలాంటి అనర్థాలు వస్తాయనే విషయం తమకు తెలుసని, అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. దొంగ బంగారం కొనుగోలు చేసినట్లు పెద్ద మొత్తంలో రికవరీ చేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఎవరికై నా ఇలాంటి సమస్యలు వస్తే అసోసియేషన్లో సంప్రదించాలని, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యువెలర్స్ అసోసియేషన్ నాయకులు, బంగారు దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం జ్యువెలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జరుగు రాజశేఖర్రెడ్డి, గౌరవాధ్యక్షులుగా సయ్యద్ సలావుద్దీన్, ఆకుల రాజమోహన్, కార్యదర్శిగా సయ్యద్ చాంద్బాష, కోశాధికారిగా ఆకుల రాజశేఖర్లను ఎన్నుకున్నారు. వీరితోపాటు ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జ్యువెలర్స్ దుకాణదారుల ఆవేదన -
ఏపీజీబీ కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలి
కడప కార్పొరేషన్ : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్ బాషా కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆయన లేఖ రాశారు. రైతులు, కర్షకులు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆ బ్యాంకు, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారిందన్నారు. రాయలసీమ గ్రామీణ బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంకు, పినాకినీ గ్రామీణ బ్యాంకులు ఐదు జిల్లాలకు సంబంధించి ఉండేవని, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కడప కేంద్రంగా ఉండేదన్నారు. ఈ బ్యాంకు ఎక్కువ టర్నోవర్ సాధించడంతో కడపలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారన్నారు. ఇప్పుడు 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా కుదించడంతో కడపలోని ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ ఆలోచనలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలన్నారు. దేశంలోని 43 ప్రాంతీయ బ్యాంకుల కన్నా ఏపీజీబీ 552 శాఖలతో, రూ.50 వేల కోట్ల టర్నోవర్తో, రూ.802 కోట్ల లాభాలతో, రూ.4591కోట్ల రిజర్వ్తో వ్యాపారాభివృద్ధిలో మిగతా బ్యాంకుల కన్నా అగ్ర భాగాన ఉందన్నారు. ఈ బ్యాంకులో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలోని హైకోర్టు, లా యూనివర్సిటీ, ఎంఎస్ఎంఈ కేంద్రం, గతంలో అనంతపురానికి రావాల్సిన ఎయిమ్స్ను ఇతర ప్రాంతాలకు తరలించి అన్యాయం చేశారన్నారు. వ్యాపారం, టెక్నాలజీ, ఆర్బీఐ అనుమతించిన ప్రత్యేకమైన కరెన్సీ, చెస్ట్ సౌకర్యం, సొంత భవనాలు ఏపీజీబీకే మిగతా వాటికంటే మిన్నగా ఉన్నాయన్నారు. 2006లో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కడపలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి 0.50 సెంట్ల స్థలానికి కేటాయించగా, మరియాపురం వద్ద రూ.15 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారన్నారు. రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి లేఖ రాసిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా -
అవమానించిందని మహిళ హత్య
వేముల : మండలంలోని కె.కె.కొట్టాల సమీపంలో ఈ నెల 2న జరిగిన సింగంశెట్టి పద్మావతి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన సింగంశెట్టి పద్మావతి గ్రామ సమీపంలో ఎనుములు మేపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్లారన్నారు. పద్మావతిని చంపి ఆమె శరీరంపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారన్నారు. మృతురాలి కుమార్తె గోగుల దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం గాలించామని తెలిపారు. మృతురాలు సింగంశెట్టి పద్మావతి తనను అవమానకరంగా మాట్లాడుతుండడంతో చంపాలని సింగంశెట్టి రమేష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ నెల 2న ఎనుములు మేపుకొనేందుకు పద్మావతి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన రమేష్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు ధరించి తలపై దాడిచేసి చంపాడన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాల కోసం చంపారనుకునేలా మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించాడన్నారు. బుధవారం ముద్దాయి సింగంశెట్టి రమేష్ను అరెస్టు చేసి అతని వద్ద బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు -
అధికార పార్టీ అండతో ఇంటి స్థలం ఆక్రమణ
కడప సెవెన్రోడ్స్ : అధికార తెలుగు దేశం పార్టీ నాయకుల అండ చూసుకుని తమ గ్రామానికి చెందిన పెరుగు నాగమ్మ, ఇతరులు తన ఇంటి స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామానికి చెందిన చిన్న పాలయ్య బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. నంద్యాలంపేట గ్రామ పొలం సర్వే నెంబరు 290/ఎలో ఎనిమిదిన్నర సెంట్ల ఇంటి స్థలం ఉందన్నారు. దీనిపై మైదుకూరు సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒకవైపు విచారణ ముగిసి న్యాయస్థానం తీర్పు వెలువడకముందే టీడీపీ నాయకులు దౌర్జన్యంగా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పగా దౌర్జన్యానికి దిగుతున్నారని, పోలీసుస్టేషన్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. కోర్టు తుది ర్పు వచ్చే వరకు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని, ఎవరికీ ప్రవేశం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
అంగన్వాడీ టీచర్ మెడలో గొలుసు చోరీ
చక్రాయపేట : మండలంలోని గొట్లమిట్ట అంగన్వాడీ టీచర్ లింగారెడ్డి నిర్మల మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు చక్రాయపేట ఎస్సై కృష్ణయ్య తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. గొట్లమిట్ట నుంచి వచ్చి వేంపల్లె గాలివీడు ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ వద్ద నిర్మల వేచియున్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై రావడంతో ఆమె వారిని లిఫ్ట్ అడిగిందన్నారు. వారు ఆమెను ఎక్కించుకొని బాట్లోపల్లె సమీపంలోకి రాగానే బండిలో పెట్రోల్ అయిపోయిందని కిందకు దిగమన్నారు. బండి దిగగానే మెడలో ఉన్న ఒకటిన్నర తులం బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. ఆమె ఫిర్యాదు చమేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా?
ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంపొందించి ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రకృతి వ్యవసాయం అమలు తీరు, విస్తరణపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ సాగు పద్ధతులను అమలు చేసేందుకు.. గ్రామాలను యూనిట్లుగా తీసుకుని వీవోలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో... న్యూట్రీగార్డెన్స్ ఏర్పాటుకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఎస్.వి.ప్రవీణ్ కుమార్, ఆనంద్నాయక్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు.డీఏఓ అయితా నాగేశ్వరరావు -
చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణం, లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరగా పరిశీలించి న్యాయం చేయాలని, రికార్డులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్స్ బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపారు. మట్కా, క్రికెట్, బెట్టింగ్ తదితర నేరాల పట్ల కఠినంగా వ్యవహరించవలసిందిగా ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. -
అశ్వ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 8వరోజు మంగళవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి అశ్వవాహనంపై భక్తులను కరుణించారు. స్వామివారు వేట మార్గమున వెలుతున్న తీరును కళ్లకు కట్టినట్లుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామోత్సవంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తిరుణాల ప్రాంగణంలో రాత్రి పులివెందుల శ్రీశివజ్యోతి నాటక కళానికేతన్ వారిచే నవరత్నాలు స్టేజీ నాటక ప్రదర్శన నిర్వహించారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు బుధవారం శ్రీరంగనాథుడు సతీసమేతుడై హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
కుంభమేళా.. రైలెక్కేదెలా!
● 26తో ముగియనున్న కుంభమేళా ● గుత్తి–రేణిగుంట మార్గంలో ఒక్క రైలు కూడా లేని వైనం ● ప్రయాగ్రాజ్ ప్రయాణానికి ఇక్కట్లు ● రహదారి మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు రాజంపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలపై చర్చ సా గుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహా కుంభమేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించడం మంచిదని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్రాజ్కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వు కావడం డిమాండ్ను తెలియజేస్తోంది. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వల్ల ఒరిగిందేమీలేదు: భారతీయ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా కనిపించడంలేదని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. రైల్వేబోర్డుకు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా తాను సిఫార్సు చేసి ఉంటే కుంభమేళాకు రైలు నడిపేవారు. అయినా ఆయన జిల్లా మీదుగా కుంభమేళాకు రైలు వేయించుకోలేకపోయారని భక్తులు పెదవి విరుస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్ధితి.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లేందుకు రైలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా బస్సులు మాట్లాడుకొని వెళుతున్నారు. ఇలా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్రాజ్ దారులు రద్దీగా మారుతున్నాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కొందరు బెంగళూరు, చైన్నె నుంచి విమానాల ద్వారా కుంభమేళాకు వెళుతున్నారు. గుత్తి–రేణిగుంట లైనులో ఒక్క రైలేదీ.. గుత్తి–రేణిగుంట లైనులో కుంభమేళాకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా నడిపించలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్ల గురించి తెలుసుకొని వ్యయ ప్రయాసాలతో గూడూరుకు వెళ్లి, అక్కడి నుంచి రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి కూడా ఇప్పుడు కుంభమేళాకు రైలు నడవడంలేదని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్కు వెళ్లే రైళ్లు సదరన్ రైల్వే నుంచి వస్తే వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటర్సిటీనే కుంభమేళా రైలుగా నడిపించాలి ఈ మార్గంలో నడిచే పేదోళ్ల రైలు ఇంటర్సిటీ(హుబ్లీ–తిరుపతి) రద్దు చేసి, ఆ రైలును కుంభమేళాకు వినియోగించారు. అదే రైలును ఈ మార్గంలో నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలును తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్కు రోజూ నడిపిస్తే రాయలసీమ ప్రాంత భక్తులకు ఉపయోగపడేది. ఆ దిశగా రైల్వేశాఖ ఆలోచించకపోవడం విచారకరమని హిందూ సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు. సురక్షితం.. సౌకర్యం.. ప్రయాగ్రాజ్కు వెళ్లే వారికి రైళ్లు సురక్షితం. తక్కువ ఖర్చుతో గమ్యానికి చేరుకోవచ్చు. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకొనే వీలుంటుంది. వాహనాలు లభ్యంకాని భక్తులు నేరుగా నడకమార్గం ద్వారా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లా వాసులు రైలులో వెళ్లలేని పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లలేని పరిస్థితి. రైలు సౌకర్యం ఉంటే వేలాదిమంది వెళ్లేవారు. రైలులో గూడూరు నుంచే వెళ్లాలి. టిక్కెట్లు దొరకవు. జనరల్ బోగీలలో వెళితే సీట్లు ఉండవు. నానా కష్టాలు పడాలి. జిల్లా రైలు మార్గంలో రైలు నడిపించకపోవడం దారుణం. మన ప్రాంతంపై రైల్వే వివక్ష చూపుతోంది. –భూమన శంకర్రెడ్డి, మాజీ సర్పంచ్, నాగిరెడ్డిపల్లెకుంభమేళాకు రైలు వేయాలని జీఎంను కోరా జిల్లా మీదుగా కుంభమేళాకు ఒక రైలు నడపాలని ఇటీవల తిరుపతిలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఏకే జైన్ను కలిసి విన్నవించాను. కుంభమేళా ముగిసే లోపు ఒక్కసారి అయినా రైలు నడిపిస్తే భక్తులు సద్వినియోగం చేసుకుంటారు. రద్దయిన ఇంటర్సిటీనే కుంభమేళాకు ఏర్పాటు చేయాలి. –తల్లెం భరత్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు, గుంతకల్ -
భారతీయ సంస్కృతికి ప్రతీక రామాయణం
కడప కల్చరల్ : రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘తెలుగులో రామాయణాలు– సామాజిక దృక్పథం’ అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా మంగళవారం ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రధానార్చకులు వీణా రాఘవాచార్యులు అతిథులతో కలిసి రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రామాలయం లేని గ్రామం లేదని, అందులోని ప్రతి పాత్ర సందేశమిస్తుందన్నారు. సభాధ్యక్షుడు, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ రామాయణాన్ని ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా ఆధునిక సమాజానికి పనికొచ్చే గ్రంథంగా చూడాలన్నారు. ఈగ్రంథం మానవాళికి చేసే మేలు గురించి తెలియజెప్పేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని వివరించారు. సదస్సు సమన్వయకర్త, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ రామాయణాన్ని వివిధ కవులు రచించారని, వారి రచనా దృక్పథంతో వెలువడిన వివిధ సామాజిక అంశాలను పత్రాల ద్వారా వెలుగులోకి తీసుకురావడం ఈ సదస్సు ఉద్దేశమన్నారు. కీలకోపన్యాసకులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కె.మలయవాసిని మాట్లాడారు. విశిష్ట అతిథి, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ , గౌరవ అతిథి స్వామి అనుపమానంద, ఆత్మీయ అతిథి, చిన్మయా మిషన్ సంచాలకులు స్వామి తురియానంద తదితరులు ప్రసంగించారు. ● అనంతరం జరిగిన సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు నేరుగాను, అంతర్జాలంలోనూ పత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’ నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి సభను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైవీయూ తెలుగుశాఖ అధ్యక్షురాలు ఆచార్య ఎంఎం వినోదిని, అధ్యాపకులు ఆచార్య టి.రామప్రసాద రెడ్డి, ఆచార్య పి.రమాదేవి, ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైవీయూ వీసీగా ప్రకాష్బాబు నియామకం
కడప ఎడ్యుకేషన్: కడప యోగివేమన విశ్వ విద్యాలయ నూతన వైస్ చాన్సులర్గా ఫణితి ప్రకాష్బాబు నియమితులయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వు మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫణితి ప్రకాష్బాబు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ లైప్ సైన్సెస్ లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాగా ఆయన నేడో, రేపో బాధ్యతలను చేపట్టను న్నట్లు సమాచారం. గండికోటను సందర్శించిన పర్యాటక శాఖ ఎండీ జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను రాష్ట్ర పర్యాటకశాఖ ఏండీ అజయ్ జైన్ సందర్శించారు. మంగళవారం కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డిలతోకలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పెన్నాలోయ అందాలతోపాటు,మాధవరాయ స్వామి ఆలయం, జుమ్మామసీదు, రంగనాథస్వామి దేవాలయంతోపాటు ధాన్యాగారాన్ని సందర్శించారు. అనంతరం గండికోటలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆదితో చర్చించారు. ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలి అట్లూరు: ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు కె.నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓసీ సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లంకమల్లేశ్వర క్షేత్రంలో మెడికిల్ క్యాంపు నిర్వహించాలని సూచించారు. అనంతరం మాడపూరు పంచాయతీ పరిదిలోని చిన్నరాజుపల్లిలో జరుగుతున్న బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగు పరీక్షల సర్వేను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రమేష్, స్థానిక వైద్యాధికారి డాక్టరు హమీదాబేగం, సీహెచ్ఓ మురళీకృష్ణ, పీహెచ్ఎన్ లక్ష్మిదేవి, సూపర్వైజరు సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం
● పోషణ్ భీ, పడాయి భీకార్యక్రమం అమలు ● ఆరు రోజులపాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ● అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా అభివృద్ధి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పిల్లలకు ఆరేళ్ల వయస్సులోనే 85 శాతం మెదడు అభివృద్ధిని సాధిస్తుంది. ఆ సమయంలో సరైన పోషణ, విద్యను అందించడం ఎంతో అవసరం. ఇందుకోసం కేంద్రం ‘పోషణ్–భీ, పడాయి భీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పిల్లల శారీరక, అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి, సాంస్కృతిక, కళాత్మక అభివృద్ధి, కమ్యూనికేషన్, మాతృభాష, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. -
● పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి
కడప ఎడ్యుకేషన్/కడప కోటిరెడ్డి సర్కిల్: విద్యాశాఖ బలోపేతానికి పూర్వ ప్రాథమిక విద్య ప్రఽథమ ప్రాధాన్యత వహిస్తుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు అన్నారు. కడప నగరంలోని జయనగర్ నగర్ కాలనీలోగల జెడ్పీ బాలికల పాఠశాలలో ‘పోషణ్ భీ, పడాయి భీ’ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్న ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్ష, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ..అంగన్వాడీ రెండు అనుసంధానంగా పని చేయాలన్నారు. కడప మండల విద్యాశాఖ అధికారి దుద్దికుంట గంగిరెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే అభివృద్ధికి మైలురాళ్లు ఏర్పడాలని తెలిపారు. న్యూ క్లస్టర్ విధానంలో బేసిక్ ప్రైమరీ స్కూల్లకు అంగన్వాడీలను అనుసంధానం చేస్తూ పూర్వ ప్రాథమిక విద్య ..ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. జిల్లా జ్ఞానజ్యోతి డిస్ట్రిక్ కో– ఆర్డినేటర్ కిరణ్ రథం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2383 మంది అంగన్వాడీ వర్కర్స్కు శిక్షణ ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్, విద్యాశాఖ సమగ్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య బలపడుతుందని పేర్కొ న్నారు. అనంతరం కి రిసోర్స్ పర్సన్ (ఏసిడిపిఓ)శోభారాణి, సూపర్వైజర్ ప్రశాంతి వర్కర్లకు పలు సూచనలు చేశారు. కడప నగరంలోని ఆరు సెక్టా ర్ల సూపర్వైజర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
పటిష్టంగా ఇరవై సూత్రాల అమలు
కడప సెవెన్రోడ్స్: ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని చైర్మన్ లంకా దినకర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసిన వివరాలు అందజేయాలన్నారు. అలా గే మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వారా కల్పించిన ఆస్తుల నాణ్యత, నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయంపై విచారణ చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద పూర్తయినట్లు చూపుతున్న పనుల్లో నాణ్యతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 1922 గ్రామాల్లో 2.91 లక్షల గృహాలకుగాను 2.77 లక్షల గృహాలకు నీటి కొళాయిలు బిగించినట్లు లెక్కలు ఉన్నప్పటికీ కుళాయిల్లో నీరు రావడం లేదన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి జిల్లాలోని ఐదు దీర్ఘకాలిక నీటి వనరుల ద్వారా రక్షిత తాగునీరు ఇచ్చే లక్ష్యంతో సవరించిన డీపీఆర్తో జల్జీవన్ మిషన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామ న్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్లపై సబ్సిడీ ఇస్తోందన్నారు. జిల్లాలో 5600 టిడ్కో గృహాల్లో 3296 పూర్తయినట్లు, 80 శాతం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ ఆ గృహాల్లో నివాసం ఉంటున్న వారు సున్నా కావడం బాధాకరమన్నారు. కడప కార్పొరేషన్లో అమృత్ 1.0 కింద చేపట్టిన పనులు ఏడేళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. ఇప్పుడు అమృత్ 2.ఓ కింద 663 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాట్లాడుతూ పంటలకు విపరీతమైన పురుగు మందులు వాడకం వల్ల ఆహారం విషపూరితం కాకుండా ఇరవై సూత్రాల్లో కొత్త విధానాలను తీసుకు రావాలన్నారు. అధ్వాన్నంగా తయారైన కాంక్రీట్ రోడ్లకు మరమ్మత్తులు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పరిశ్రమలు, పర్యాటకం ప్రధాన భూమిక పోషించనున్నాయన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ లంకా దినకర్ -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
పులివెందుల రూరల్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని ఆయన నివాసంలో ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీ పథకాలలో ఒకటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి చంద్రబాబు ప్రజా దర్బార్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు
సిద్దవటం: నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వంగపాటి మహేంద్ర రూ. 5. 51లక్షలకు దక్కించుకున్నారని ఆలయ ఈఓ మోహన్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యపూజ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి సమర్పించుకునే తలనీలాల ప్రోగు కోసం ఈ వేలం పాటను నిర్వహించామన్నారు. -
22న ఉర్దూ సాహిత్యంపై జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈ నెల 22న ఉర్దూ కవిత, సాహిత్యం్ఙపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం ఆచార్యులు రియాజున్నీసా తెలిపారు. సదస్సులో ఉర్దూ సాహిత్యం, దాని ప్రాముఖ్యత, ఉర్దూ స్థితి, కడపలో ఉర్దూ సాహిత్యంతిపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రవచన కర్తలు తమ వ్యాసాలను ప్రదర్శిస్తారని చెప్పారు. సాహిత్య వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థులంతా సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదనపు సమాచారం కోసం 9885348482లో సంప్రదించాలన్నారు. హాస్టల్ను తనిఖీ చేసిన న్యాయమూర్తి కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ మరియాపురం, శంకరాపురం, ప్రకాశ్నగర్లలోని హాస్టళ్లను మంగళవారం తనిఖీ చేశారు. వంటశాల, వసతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూము పరిసరాలతోపాటు టాయిలెట్లను పరిశీలించారు. తగు సూచనలు, సలహాలిచ్చారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మినారాయణ, వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణకు ఆదేశాలు జారీ చేయాలి కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్ధానిక స్టేట్ గెస్ట్ హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్యాక్లాగ్్ ఉద్యోగాలకు, డీఎస్సీ నియామకాలు ఏబీసీడీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా మార్చిలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 20న విజయవాడలోని గాంధీ నగర్ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీ.ఆంజనేయులు, ఓబులేసు, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు వేళాయె.. సందడి లేదాయె ?
ప్రముఖ శైవ క్షేత్రంగా కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. అంత వైభవం కలిగిన త్రేతేశ్వరుడి వేడుకల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మహాశివరాత్రి మహోత్సవాల సందడి కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దేవస్థానంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. రాజంపేట రూరల్ : ఉమ్మడి జిల్లాలలో ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాలకులు ఎవరైనా ఈ ఆలయానికి ప్రత్యేకత చూపడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది బహుదా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. అగస్తేశ్వర మహర్షి ప్రతిష్ఠించిన త్రేతేశ్వరస్వామి, గదాధర స్వామిని దర్శించుకోవడం వరంలా భావిస్తారు. దీంతోపాటు అత్తిరాలలోనూ ఏటా శివరాత్రి ముందు రోజు, తరువాత రోజు, శివరాత్రి పర్వదినం రోజున పలు కార్యక్రమాలు చేపడతారు. పాలక మండలి ఏర్పాటు ఎప్పుడో?. త్రేతేశ్వర దేవస్థానంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు ముందే పాలక మండలి ఏర్పాటుచేయడం ఆనవాయితీ. అలా వీలుకాని పక్షంలో తాత్కాలిక చైర్మెన్ను నియమించి శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవస్థానం చైర్మన్ పదవి, పాలక మండలిపై మందరం, అత్తిరాల, అప్పయ్యరాజుపేట, పోలీ, సీతారామపురం కూటమి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ప్రజలలో అయోమయం నెలకొంది. 22 నుంచి ఉత్సవాలు జరిగేనా? శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించి మార్చి 02వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారా? లేక వేడుకలకు మంగళం పాడతారా? అని భక్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినానికి నెల రోజుల నుంచి హడావిడి ఆరంభమయ్యేది. అన్ని శాఖల అధికారులతో డివిజనల్ స్థాయి( ఆర్డీఓ లేక సబ్ కలెక్టర్) అధికారి సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారు. అత్తిరాలను ఉన్నతాధికారులు సందర్శించి దేవాదయశాఖతో సమన్వయం చేసుకని ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది ఈ వాతావరణం కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. సౌకర్యాల ఊసే లేదు శివరాత్రి మహోత్సవాలకు దాదాపు 7 నుంచి 15 రోజుల ముందు వాహనాల గేటుకు ఎంపీడీఓ ఆద్వర్యంలో వేలంపాట నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకూ వేలం వేయక పోవడం వెనుక అంతర్యమేమిటో అర్థంకాక భక్తులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు రాజంపేట–నెల్లూరు ప్రధాన రహదారిలోని అత్తిరాల ముఖ ద్వారం వద్ద నుంచి త్రేతేశ్వర దేవస్థానం వరకు రోడ్డు సమస్య పీడించేది. కమ్మపల్లిలో మాత్రం కొంత దూరం సిమెంటు రహదారి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సిమెంటు రోడ్డు ప్రారంభించాలని తలపెట్టినా అర్ధంతరంగా కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో రహదారికి ఇరువైపులా గుంతలు, మట్టి దిబ్బలు అలాగే ఉన్నాయి. అత్తిరాలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ సమస్యలు తప్పవు. రహదారి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లబోదిబోమంటున్న వ్యాపారులు శివరాత్రి మహోత్సవాలలో చిరు అంగళ్లు ఏర్పాటు చేసుకొని జీవించాలనుకొనే వ్యాపారులు లబోదిబో మంటున్నారు. త్రేతేశ్వరుని దేవస్థానం సమీపంలో రహదారి నిర్మాణం అలాగే ఉండడంతో వ్యాపారులు అంగళ్లను ఏర్పరుచుకోనే వీలులేదు. ఇప్పటి నుంచే అంగళ్లు ఏర్పరుచుకోకుంటే అప్పటికప్పడు కష్టంగా ఉంటుంది. వాహనాలలో సమాగ్రీనీ తీసుకెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రేత్రేశ్వరస్వామి ఆలయంలో కానరాని ఏర్పాట్లు శివరాత్రి మహోత్సవాలపై అయోమయం 9 రోజుల వేడుకలకు మంగళమేనా? అత్తిరాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం -
విద్యార్థిని ఆత్మహత్య
– పాఠశాలకు వెళ్లి చదువుకోలేక...! కడప అర్బన్ : పాఠశాలకు వెళ్లడం లేదని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప నగర శివారులోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కడప చిన్నచౌక్ పోలీసుల ప్రాథమిక విచారణ, మృతురాలి బంధువుల వివరాలిలా వున్నాయి. దేవకుమార్, ప్రభావతిల కుమారుడు మస్తానయ్య, సన్నీ కుమార్తె సుచిత్ర ఉన్నారు. మస్తానయ్య తన తండ్రితో పాటు బేల్దారిపనికి వెళుతున్నాడు. తల్లి ప్రభావతి ఇంటింటా పనులు చేసి జీవనం సాగించేది. సుచిత్ర మున్సిపల్ మెయిన్ హైస్కూల్లో పదోతరగతి చదువుతోంది. సుచిత్ర తన అనారోగ్యం కారణాలతో నెలకు 15 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. హాజరు సరిగా లేక ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. దీంతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థిని సుచరిత తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు వెళ్లిపోయిన తరువాత ఇంటిలోపల గడియ వేసుకుని ఫ్యాన్కు చీరతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుప్రక్కల వాళ్లు గమనించి తల్లిదండ్రులకు, పోసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆదేశా మేరకు ఎస్ఐ పి.రవికుమార్, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాథమికంగావిచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్కల దాడిలో మేకల మృతి వేంపల్లె : పట్టణంలోని కడప రోడ్డులో నివాసముంటున్న సుధాకర్కు చెందిన మేకలపై మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేశాయి. నాలుగు మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ పోషణకు మేక పిల్లలను పెంచుకుంటున్నానని, కుక్కల దాడితో రూ.50 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని కోరారు. బొలెరో వాహనం ఢీకొని పొట్టేళ్లు దుర్మరణంకొండాపురం : కడప–తాడిపత్రి నాలుగు వరసల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో పొట్టేళ్లు మృతి చెందాయి. బాధితుడి వివరాల మేరకు.. చౌటిపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి చెందిన పొట్టేళ్లు కడప–తాడిపత్రి రహదారి దాటుతున్నాయి. మండలంలోని గండ్లూరు సమీపంలో బొలెరో వాహనం వేగంగా ఢీకొనడంతో 12 పొట్టేళ్లు మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. విద్యుత్తు తీగలు తగిలి.. కాలిన టిప్పర్ ఎర్రగుంట్ల : మండలంలోని చిన్నదండ్లూరు సమీపంలో విద్యుత్తు తీగలు తగలి టిప్పర్ కాలిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నదండ్లూరు గ్రామానికి గ్రావెల్ రోడ్డు వేస్తున్నారు. ఈ తరుణంలో టిప్పర్లోని మట్టిని రోడ్డుపై వేసేందుకు ట్రాలీ పైకెత్తగా..పైన విద్యుత్తు తీగలను తాకింది. దీంతో ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. కొలవలి గ్రామానికి చెందిన డ్రైవర్ నాగార్జునకు గాయాలయ్యాయి. కలమల్ల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. -
వంక స్థలం ఆక్రమణ
కడప టాస్క్ఫోర్స్ : ప్రభుత్వ స్థలాలు అప్పనంగా కాజేస్తున్నా.. ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దవటం మండలం దిగువపేట నందు బద్వేల్ రోడ్డు ప్రక్కనే ఉన్న రూ.50 లక్షల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. దిగువపేట పెద్ద కుమ్మరి గుంతకు ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు స్థానిక మండల నేతల అండదండలతో దౌర్జన్యంగా చదును చేసి ముళ్ల కంచె వేశారు. సుమారు 0.43 సెంట్ల స్థలాన్ని దిగువపేట గాంధీ నగర్ హరిజనవాడ ప్రజలు కర్మ కాండలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ ఇక్కడే చేసుకుంటారు, భర్త చనిపోయిన మహిళలకు ఇక్కడే వితంతువుగా మారుస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది కొంత ప్రభుత్వ భూమిగా, మరి కొంత వంకపొరంబోకుగా ఉంది. ఈ వంకపై ప్రభుత్వం ఒక మోరీ గతంలో నిర్మించింది. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఈ వంకను నామరూపాలు లేకుండా చేశారు. బద్వేల్ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న విలువైన స్థలాన్ని చదును చేసి ఆక్రమిస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు వారు గుసగుసలాడుతున్నారు. కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని టీడీపీ కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఆక్రమించింది టీడీపీ నేత కావడమే కారణం -
ఇద్దరు ట్రాన్స్ఫార్మర్ దొంగల అరెస్టు
– 180 కిలోల కాపర్ తీగలు, పల్సర్ బైక్ స్వాధీనం చక్రాయపేట : ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. గాలివీడు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి నిందితులు పారి పోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వైస్సార్ జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోని 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు దొంగిలించినట్లు వారు అంగీకరించారని చెప్పారు. వారి అరెస్టు అనంతరం కడప విమానాశ్రయం వద్ద కంపచెట్లలో దాచిన 180 కిలోల కాపర్ వైరు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. నిందితులు చెన్నూరు మండలం శాటిలైట్ సిటీ సమీపాన ఉన్న రుద్రభారత్పేటకు చెందిన ఈభూది మల్లికార్జున, శంకల శంకర్ అని చెప్పారు. దొంగలను పట్టుకున్న సీఐ ఉలసయ్య, ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని డీఎస్పీ మురళి అభినందించారు. -
ఇమామ్, మౌజన్లకు అన్యాయం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలోని మౌజన్లు, ఇమామ్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీనా దస్తగిరి అన్నారు. స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇమామ్లు, మౌజన్లకు నెలకు రూ.15వేల చొప్పున ఇచ్చేవారని, 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా వారికి గౌరవవేతనం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ వారికి రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.45కోట్లు ఇవ్వడానికి జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు. రానున్న రంజాన్ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని, ప్రభుత్వం ఆ మిగిలిన రూ.45 కోట్లు విడుదల చేయాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండీ.షఫీ మాట్లాడుతూ గతంలో హజ్కు పోయే వారికి విజయవాడ నుంచి అధిక టికెట్లు ఉంటే అప్పటి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో వైఎస్సార్సీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ మాజీ ఛైర్మెన్ గౌస్లాజం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లిం, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 3529 మందిని ఒకేసారి హజ్కు పంపిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.23వేల కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్బాషా, అతావుల్లా, మియ్యా, అహమ్మద్ పాల్గొన్నారు. -
దొరసానిపల్లెలో చోరీకి విఫలయత్నం
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దొరసానిపల్లె సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉంటున్న భూమా రాజా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను బెంగళూరు నుంచి అప్పుడప్పుడూ దొరసానిపల్లెలోని ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రాజా ఇంటి తాళాలు పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్లు తెరవడానికి ప్రయత్నించగా అవి తెరుచుకోలేదు. దుండగులు చేసేదేమిలేక వెనక్కి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి రాజాకు సమాచారం తెలియజేశారు. ఈ మేరకు రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ వెంకటసురేష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటి ఊళ్లకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. పోలీసులకు తెలిపితే ఎల్హెచ్ఎంస్తో పనిచేసే నిఘా కెమెరాలను వారి ఇంట్లో ఏర్పాటు చేయిస్తామన్నారు. చోరీల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఐ కోరారు. రేపు వామపక్షాల సదస్సు కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజా వ్యతిరేక పొలిటికల్ బడ్జెట్ను నిరసిస్తూ ఈ నెల 20 వామపక్షాల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. నగరంలోని రామకృష్ణ నగర్లో వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొలిటికల్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. 70 శాతం అణగారిన ప్రజలను విస్మరించారని, మధ్య తరగతి ప్రజలను భ్రమలకు గురిచేసే విధంగా ఉందని తెలిపారు. గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారన్నారు. వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలకు ముందు భ్రమలకు గురి చేసే బడ్జెట్ ప్రవేశపెట్టారని, కార్పొరేట్ల పెరుగుదలకు 42 శాతం ప్రజాధనాన్ని దోచిపెట్టే విధంగా అంకెల గారడి ఉందన్నారు. ప్రాజెక్టులు, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు, దీర్ఘకాలిక అభివృద్ధికి నిధులు విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో అన్వేష్, రామ్మోహన్, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. చిరుత సంచార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పులివెందుల రూరల్ : చిరుత, వాటి పిల్లలు సంచరించే ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల చిరుత సంచారం గురించి వివిధ గ్రామాల ప్రజలు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆయన కడప జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్కు ఫోన్ చేసి చిరుత సంచరిస్తున్న గ్రామాలలో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. స్పందించిన అధికారులు మంగళవారం నల్లపురెడ్డిపల్లె, సింహాద్రిపురం, లింగాల మండలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా చిరుత సంచారం, అడుగుజాడలు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని అటవీ అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మానవత్వం ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వెదుర్ల బజారుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి (71) గతంలో కూరగాయల మార్కెట్లో పనిచేశారు. మంగళవారం వెంకట సుబ్బారెడ్డికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన భార్య రామసుబ్బమ్మ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేర్చే లోపే ఆయన చనిపోవడంతో ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియక రోదిస్తూ ఉండిపోయింది. పోలీస్ ఔట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్బాషా విషయం తెలుసుకుని ఓ ప్రైవేట్ అంబులెన్స్ను పిలిపించి మృతదేహాన్ని ఇంటికి పంపించడంతోపాటు, అవసరమైతే హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు జరిపిస్తానని ఆమె తెలిపారు. షబ్బీర్బాషా మానవత్వాన్ని పలువురు అభినందించారు. వెంకటసుబ్బారెడ్డికి ఇద్దరు కుమారులుండగా ఒకరి మానసికస్థితి బాగాలేదు. మరో కుమారుడు ప్రైవేట్ బస్సులో క్లీనర్గా పనిచేస్తున్నాడు. ట్రాలీ కింద పడి మహిళ మృతి రాజుపాళెం : మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన దారాల ఆరోగ్యమ్మ (52) ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మంగళవారం మృతి చెందినట్లు రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనగ పంట కోతకు వెళ్లిన ఆరోగ్యమ్మ పొలం వద్దనే ఉన్న ట్రాక్టర్ ట్రాలీ వద్ద సేద తీరుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ తోలడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ట్రాలీ కింద పడిన ఆరోగ్యమ్మకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. మృతురాలి కుమారుడు దారాల చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. శవాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
తూతూ మంత్రం.. రాయితీరుణం
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 300 మందికి మాత్రమే రాయితీపై రుణాలు మంజూరుచేయడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. దొరసానిపల్లెలోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు లక్షల జనాభా గల నియోజకవర్గంలో 300 యూనిట్ల సబ్సిడీ రుణాలు మంజూరుకాగా, 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 300 మందిని ఎంపిక చేస్తే మిగిలిన 2,700 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 60 వేల ఓటర్లు గల చేనేతలకు 40, 20 వేల ఓటర్లు గల యాదవులకు 15, ఆర్య వైశ్యులకు 2, బ్రాహ్మణులకు 1 చొప్పున రుణాలు మంజూరుచేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిఫారసు చేసిన వారికే రుణాలు వస్తాయని, ఒక్కో రుణానికి ఆయా వార్డుల శ్రేణులు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అర్హతే ప్రామాణికంగా దళారీ వ్యవస్థ లేకుండా రూ.2.72 లక్షల కోట్లు మంజూరుచేశారన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలతోపాటు ఏ నాయకుల పాత్ర ఎంపికలో లేదన్నారు. జగన్న బటన్ నొక్కితే అర్హత ఉన్న వారి ఖాతాకు డబ్బు వచ్చేదన్నారు. సచివాలయాల ఉద్యోగుల నియామకానికి, మంత్రుల పలుకుబడి కూడా పనిచేయలేదని, నిజాయితీగా ఉద్యోగులను ఎంపిక చేశారన్నారు. పాలిచ్చే ఆవును వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్న చందాన ప్రజల పరిస్థితి ఉందన్నారు. 300 మందికి అన్న క్యాంటీన్లో భోజనం పెట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గుంతలు పూడ్చి హైవే రోడ్లను నిర్మించినట్లు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ పాలన చూస్తే 11 సీట్లు కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, పాతకోట వంశీధర్రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, గుర్రం లావణ్య, చౌడం రవీంద్ర, దేస్ రామ్మోహన్రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
నిధుల కేటాయింపులో సీమను విస్మరిస్తే ఉద్యమం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీటి పారుదల శాఖ రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం చేపడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కడపలో జరిగే ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు కార్యాచరణ వేదిక కానుందన్నారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి – భనకచర్ల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల కడుపు నింపి ఎన్నికల నిధి పోగు చేసుకోవడానికి ఉపయోగపడుతోందని ఆరోపించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో క్యారీ ఓవర్ నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతూ వచ్చారని, నేడు కొత్త ప్రతిపాదనల పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. పోలవరం పూర్తిచేస్తే పట్టిసీమకు ప్రాధాన్యం ఉండదని తెలిసినా రూ.1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. సీమ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కేటాయిస్తే ప్రాధాన్యత క్రమంలో పంట కాల్వల నిర్మాణం పూర్తయి పది లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాలతో ఎగువ భద్ర ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం జాతీయ హెూదా కల్పించిందన్నారు. శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు రాకముందే నీటిని తోడేస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళ,బుధవారాల్లో ‘తెలుగులో రామాయణాలు – సామాజిక దృక్పథం’అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ కె. కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు. సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు 60 మంది పరిశోధనా పత్రాలు సమర్పణ చేస్తారన్నారని తెలిపారు. విదేశాల ప్రతినిధులు, పత్ర సమర్పకులు అంతర్జాలం ద్వారా కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారన్నారని ఆమె వివరించారు. కందుల కొనుగోళ్లు ప్రారంభించండి – జేసీ అదితి సింగ్ కమలాపురం : కందుల కొనుగోళ్లు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. కమలాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కోనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. దిగుబడులు కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు, సంచులు తదితర సామగ్రి ఉందా? అని సిబ్బందితో ఆరా తీశారు. ఏ మేరకు దిగుబడులు రావచ్చని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏపీ మార్క్ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి, ఏడీఏ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : కడపజిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు తెలిపారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ (ఐఈ కో–ఆర్డినేటర్), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఏఎస్ఓ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను అడిషినల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కడప ఎన్జీఓ కాలనీలోని సమగ్రశిక్ష కార్యాలయంలోని అందచేయాలని తెలిపారు. పూర్తి సమాచారం, వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్ష కార్యాలయ ఏపీసీని సంప్రదించాలని తెలిపారు. రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ బి. నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయానికే పరిమితి కావడం, ఇతర కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు. భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ రాయచోటి టౌన్ : రాయచోటి భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి మూలవిరాట్కు స్వామివారికి అర్చకులు పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు.పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధులు, ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్ : పోషణ్ బీ, పడాయి బీ కార్యక్రమం అమల్లో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు మంగళవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నామని ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 ప్రాజెక్టులలో 2389 అంగన్వాడీ కేంద్రాలలో శిక్షణ ఉంటుందని వివరించారు. -
వక్ఫ్బోర్డు స్థలంపై కన్నేశారు
ప్రొద్దుటూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్బోర్డు స్థలాన్ని లీజు రూపంలో తక్కువ ధరకు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నేతలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. వక్ఫ్బోర్డుకు సంబంధించి ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె మసీదు పరిధిలో సుమారు 27 ఎకరాల పొలాలు, స్థలాలు ఉన్నాయి. ఇందులో కోట్ల రూపాయల విలువైన స్థలాలు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ ఏరియాలో.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికంగా వక్ఫ్బోర్డుకు సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాదిలో 9 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వక్ఫ్బోర్డుకు సంబంధించి సర్వే నంబర్ 293/2లో 39 సెంట్ల స్థలం ఉంది. మొత్తం 40 సెంట్ల స్థలంలో సెంటు స్థలం బైపాస్ రోడ్డు నిర్మాణానికి పోగా మిగిలిన 39 సెంట్లు అలాగే ఉంది. గతంలో వక్ఫ్బోర్డు అధికారులు తమ స్థలమని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి ఎదురుగా ప్రముఖ థియేటర్ ఉంది. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం కమర్షియల్ హబ్గా మారింది. కోట్ల రూపాయల విలువైన స్థలం కావడంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి పరిధిని పెంచారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వక్ఫ్బోర్డు అధికారులు ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వరాదని నిర్ణయించారు. లోపాయికారి ఒప్పందం.. తాజాగా ఈ స్థలాన్ని వెలవలి హుస్సేన్ పీరా అనే వ్యాపారి తక్కువ ధరతో లీజుకు తీసుకునేందుకు దరఖాస్తు చేశారు. లోపాయికారిగా టీడీపీ నేతలతో ఒక ఒప్పందం జరిగినట్లు సమాచారం. మోడంపల్లె మసీదు మేనిజింగ్ కమిటీ ద్వారా ఈ దరఖాస్తును విజయవాడలోని వక్ఫ్బోర్డు కార్యాలయానికి పంపారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో మైనారిటీ సంస్థల ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించారు. బయటికి తెలియకుండా ఒకే దరఖాస్తును తీసుకుని ఎలా పంపారని ప్రశ్నించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో మరుసటి రోజే మోడంపల్లె మసీదులో ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయమై నోటీసు బోర్డులో పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ థియేటర్ యజమాని స్థలాన్ని తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మోడంపల్లె మసీదు మేనేజింగ్ కమిటీ కార్యదర్శి షకిల్ అహ్మద్ను ‘సాక్షి’ వివరణ కోరగా గతంలో వెలవలి హుస్సేన్ పీరా నుంచి వచ్చిన దరఖాస్తును వక్ఫ్బోర్డు కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. నెలకు రూ.40వేలు చొప్పున లీజుకు ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేశారన్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు ఈ స్థలం కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంపై తుది నిర్ణయం వక్ఫ్బోర్డు పరిధిలో మాత్రమే ఉంటుందని, తమకు సంబంధం లేదన్నారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని చౌకగా కొట్టేసే యత్నం.. టీడీపీ నేతల క్రియాశీలక పాత్ర -
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్ డి.ఎస్పీ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు సిబ్బందికి రెండు వారాల పాటు నిర్వహించే మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోం గార్డ్ విధుల్లో చేరేముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. మొబిలైజేషన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఫిజికల్ ఫిట్ నెస్, మాబ్ కంట్రోల్, బందోబస్తు విధులు, డ్రిల్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తామని ఎస్పీ తెలిపారు. మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్.పి (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ లు శ్రీశైల రెడ్డి, ఆనంద్, వీరేష్, ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ● సీకే దిన్నె మండలం ఊటుకూరు గ్రామ పొలం సర్వే నెంబరు 182/3ఏ1, 182/3ఏ2, 182/3ఏ3, 182/3ఏ5లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలుగా ఇవ్వాలని దళిత భూ సాధన పోరాట సమితి అధ్యక్షులు ఓబులపతి, నాయకులు ఆర్ఎన్ రాజు, వెదురూరు బాబు తదితరులు కోరారు. ● విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తి 4 ఎకరాల 55 సెంట్ల తన పట్టా భూమిని ఆక్రమించాడని, ఆయనపై చర్యలు తీసుకుని తన భూమి తనకు అప్పగించాలని సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన చిన్న గంగన్నగారి నారామ్మ అనే వృద్ధురాలు కలెక్టర్ను వేడుకున్నారు. ● అంగన్వాడీ సెంటర్ల అవసరాల కోసం ప్రభు త్వం ఒక్కో సెంటర్కు రూ. 3000 చొప్పున ఇచ్చిందని, ఆ మొత్తాన్ని వినియోగించడంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాల ని సీఐటీయూ నాయకులు మనోహర్, చంద్రారెడ్డి తదితరులు విన్నవించారు. ● కడప దౌలతాపురానికి చెందిన నాగరాజు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ, ఎస్డీసి వెంకటపతి పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలను అరికడదాంవిద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు వీడియో, ఆడియో, వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేబుల్ నెట్వ ర్క్, టీవీలు, ప్రొజెక్టర్ల ద్వారా విద్యుత్ భద్రత నియమాలు గురించి ప్రదర్శనలు నిర్వహిస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి విధిగా ఎర్తింగ్, ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలను వాడాలన్నారు. అలాగే వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు విధిగా పాటించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
రంగ రంగ.. వైభవంగా !
పులివెందుల : పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణలతో రథాన్ని కదిలించారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డితోపాటు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ చిన్నప్ప, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణ, పార్నపల్లె కిశోర్, మాజీ బలిజ సంఘం అధ్యక్షుడు సోపాల వీరా, వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ సుధీకర్రెడ్డి, ఈఓ వెంకటరమణ వారికి శాలువతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్కు చేరుకుంది. రథోత్సవ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. కదిలింది బ్రహ్మరథం దారిపొడవునా గోవిందా నామస్మరణలు, భజనలు -
●వైఎస్సార్సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కువైట్ ఎంబసీ మిసాల్ ముసాపా ఆల్–షామితి..ఆయనను తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కలిశారు. కువైట్ నుంచి విమానాలు తిరుపతి రన్వేపైకి తీసుకురావాలని కోరారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో రెండు లక్షలకుపైగా కువైట్లో జీవనోపాధి కోసం వెళుతుంటారు..వస్తుంటారు..వీరిని దృష్టిలో వుంచుకొని ఎడారి విమానం తిప్పాలని విన్నవించారు. రాజంపేట : ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాల విమానాలకు రెక్కలొచ్చేదెప్పుడోనని గల్ఫ్వాసుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రామ్మోహన్నాయుడుపై తిరుపతి ఎయిర్పోర్టులో ఎడారిదేశాలకు విమానయాన సౌకర్యం కల్పించే బాధ్యత పడింది. ఇవి తిరుపతి రన్వేపై ఎగిరితే తమ పయనానికి ఇక ఇక్కట్లు ఉండవని వేయికళ్లతో వలసజీవులు ఎదురుచూస్తున్నారు.అయితే పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రయానం నుంచి విమానాల దాకా.. గల్ఫ్దేశాలకు వెళ్లేవారు నాలుగు దశాబ్దాల కిందట సముద్రయానం ద్వారా చేరుకునేవారు. వారాల కొద్దీ పయనించి ఎడారిదేశాలకు చేరుకునేవారు. అప్పట్లో గల్ఫ్ జీవనోపాధికి డిమాండ్ లేని రోజుల్లో మాట ఇది. రానురాను అక్కడ పనిచేసే ఉన్నతంగా జీవనం సాగించవచ్చని, తమ కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం కావచ్చనే భావనతో ఎడారి పయనాలు అధికమయ్యాయి. ముఖ్యంగా రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతో పాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మంది ఎడారిదేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు కరోనా సమయంలో గల్ఫ్లో కరోనా సోకిన వారిని విమానాల ద్వారా తిరుపతి ఎయిర్పోర్టుకు చేర్చారు. అప్పట్లో ఏపీఎన్ఆర్టీ ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కేంద్రప్రభుత్వం గల్ఫ్లో కరోనా బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎయిర్పోర్టుకు నేరుగా విమానాల్లో తీసుకొచ్చి, వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా నివారణ శిబిరాల్లో ఉంచి, తర్వాత ఇళ్లకు క్షేమంగా చేర్చిన సంగతి విధితమే. కాగా అంతర్జాతీయసర్వీసులు తీసుకొచ్చేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎడీసీఎల్) ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయస్ధాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న కలలు ఇంకా కలలాగే మిగిలిపోతున్నాయి. వ్యయప్రయాసలతో . చైన్నె, కర్ణాటక, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా అనేక మంది భాష రాక ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూరప్రయాణంతో అనేక అవాంతరాలు, ప్రమాదాలబారిన పడుతున్నారు.విమానటికెట్తో పాటు ఎయిర్పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించలేకపోతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయహోదా కల్పించారు. కానీ ఆ స్ధాయిలో విమాన సర్వీసులను తీసుకురాలేదన్న అపవాదును కేంద్రప్రభుత్వం మూటకట్టుకుంది. ఉభయ జిల్లాల నుంచి.. రాయలసీమలో ప్రధానంగా ఉభయ వైఎస్సార్ జిల్లాల నుంచి ఎడారిదేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధికోసం కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా,బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలకు వెళతారు. ఉద్యోగరీత్యా, విద్య కోసం అమెరికా, కెనడా, సౌతాఫ్రికా,శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో స్ధిరపడిన వారు ఉన్నారు. వీరు కూడా విదేశీయానం చేయాల్సివస్తే కష్టతరంగానే ఉంది. భాష రాని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించాలంటే గగనమవుతోంది. గల్ఫ్దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారు చాలామంది ఉభయ జిల్లాలో ఉన్నారు. గల్ఫ్ విమాన సర్వీసులు తీసుకురావాలి తిరుపతి ఎయిర్పోర్టులో విదేశీ విమాన సర్వీసులను తీసుకొచ్చేందుకు వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఇప్పటి వరకు కరుణించలేదు. గల్ఫ్వాసులకు విమానయాన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేశాయి. – పీవీ మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట కేంద్రం తక్షణమే స్పందించాలి రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్పోర్టు నుంచి విదేశీ విమాన స ర్వీసులను ప్రవేశపెట్టాలి.దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. చైన్నె, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన విమానశ్రయాల ద్వారా వెళ్లాలంటే కష్టతరంగా ఉంది. కువైట్ ఎంబీసీకి తిరుపతి ఎంపీతో కలిసి ఈ విషయం తెలియజేశాం. కనీసం కడపోళ్ల కోసం కువైట్ నుంచి విమానం నడిపించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు తిరుపతి రన్వేపైకి.. ఎడారి విమానాలెప్పుడో! ఎదురుచూపుల్లో ఉభయ జిల్లాల గల్ఫ్వాసులు ఇప్పటికై నా కేంద్రం కరుణించేనా ! తిరుపతి, రాజంపేట లోక్సభ సభ్యులు తమ వంతుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రన్వే మీదకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కనికరించలేదు. ఫలితంగా రాయలసీమవాసులకు విదేశీయానం గగనతరంగా మారింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తిలు కువైట్ ఎంబసీని కలిసి గల్ఫ్ విమానాలు తిరుపతి విమానశ్రయం నుంచి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.