breaking news
YSR District News
-
జిల్లాలో జడివాన
కడప అగ్రికల్చర్ : జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు జడిపట్టి కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా మబ్బులు.. వాన చినుకులతోనే రోజులు గడుస్తున్నాయి. ఇక బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. దీంతో పనులపై బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగ విధులకు వేళ్లే వారు సైతం అవస్థలు పడ్డారు. వరుస వానలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారి జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఖరీప్ సీజన్ ప్రారంభం నుంచి జిల్లాలో వర్షం కురవలేదు. దీంతో చాలా మేర పంటలసాగు కాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండున్నర నెల కావస్తున్నా నేటికి జిల్లాలో 20 శాతం మేరనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటలకు సరైన వర్షా లు లేక రైతన్నలు కాసింత ఇబ్బందులకు గురయ్యా రు. అల్పపీడనం కారణంగా జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాగు లో ఉన్న ఆరుతడి పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొ న్న, కొర్ర, కంది, పెసర, మినుము, వేరుశనగ, సన్ప్లవర్, సోయాబీన్, పత్తి పంటలకు జీవం వచ్చింది. వరిపంటలకు ఉన్న తెగులు తగ్గి ఏపుగా వస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు. ప్రారంభంకానున్న ఆరుతడి పంటలసాగు... గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భూమి పదునెక్కింది. ఇక రైతన్నలు కాడీ, మేడీ సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వేరుశనగతోపాటు పసుపు, జొన్న, కందితోపాటు ఇంకా పలు రకాల ఆరుతడి పంటలను సాగు చేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు కూడా రావడంతో వరిసాగు పనులు కూడా ఊపందుకున్నాయి. ఉద్యాన పంటలకు మేలే... జిల్లాలోని పులివెందుల, చక్రాయపేట, వేముల, వేంపల్లి, వీన్పల్లిలతోపాటు పలు మండలాల్లో సాగులో ఉన్న ఉద్యాన పంటలైన మామిడి, చీని, సపోట, జామ వంటి ఉద్యాన పంటలకు ఈ వర్షంతో ప్రాణం వచ్చింది. -
25 నుంచి ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి వివిధ కోర్సుల్లో నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీ పార్లర్ (35 రోజులు), జ్యూట్ ప్రోడెక్ట్ (14 రోజులు), కొవ్వొత్తుల తయారీ (11 రోజులు)లో శిక్షణ ఉంటుందని వివరించారు. 18–45 ఏళ్లలోపు కలిగిన నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తామన్నారు. నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఫార్మసీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ సైన్సు గ్రూపు(ఎంపీసీ/బైపీసీ) పాస్ అయిన విద్యా ర్థులు గవర్నమెంట్, ప్రైవేటు పాలిటెక్నిక్లో డి ఫార్మసీ (డిప్లొమా ఇన్ ఫార్మసీ) రెండేళ్ల కోర్సులో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ నెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 6302782239, 9440144057 సంప్రదించాలని సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన సుబ్బారెడ్డిఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆయనతో చర్చించా రు. ఇంతటి ఘోరమైన ఎన్నికలు తమ జీవితంలో చూడలేదన్నారు. మండలంలో ఏర్పా టు చేసిన ప్రతి బూత్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమక్షంలో ఆయన మనుషులు రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాజీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల కడప ఎడ్యుకేషన్ : పూర్వ విద్యార్థులకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ తెలిపారు. 2018, 2019, 2020, 2021,2022 సంవత్సరంలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు వన్ౖటైమ్ సెటిల్మెంట్ సప్లి మెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఇందులో ప్రతి ఒక్క పేపర్కు రూ. 1000 చెల్లించాలని తెలిపారు. పరీక్ష ఫీజును ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ ఫీజును చలానా ద్వా రా చెల్లించాలని వివరించారు. విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే ప్రభుత్వ పురుషుల కళాశాలోని పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. నిత్యపూజ స్వామికి రూ. 1,38,003 ఆదాయం సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజ స్వా మి హుండీ ఆదాయం లెక్కించారు. బుధవారం ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీధర్ మాట్లాడుతూ జూన్, జూలై నెలల్లో భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించగా రూ. 1,38,003 వచ్చిందని తెలిపారు. రాజంపేట దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్ పాల్గొన్నారు. ‘పింఛా’లో పెరిగిన నీటిమట్టం సుండుపల్లె : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది.బుధవారం సాయంత్రానికి 258 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా ప్రస్తుతం 996.6 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీరు 81.74 శాతంగా ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తుతారని, అందువల్ల ప్రాజెక్టుకు దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. -
ఉచిత బస్సు కొందరికే!
కడపకోటిరెడ్డిసర్కిల్ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లలో ఉచిత ప్రయాణం కొందరికే ఉపయోగపడనుంది. ఒకవైపు ఎక్స్ప్రెస్లలో ఉచితం అంటూనే నాన్ స్టాప్లుగా నడిచే ఎక్స్ప్రెస్లలో నో ఫ్రీ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ ప్రారంభించే సమయానికి ఇంకా ఎన్ని నిబంధనలు ఉంటాయోనని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఆర్టీసీ అధికారులకు మార్గదర్శకాలు రాకపోవడం విశేషం. జిల్లాలో కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో ఎక్స్ప్రెస్లు 113, పల్లె వెలుగు 189, అల్ట్రా పల్లె వెలుగు 58 బస్సులు ఉన్నాయి. ఇంతవరకు కొత్త బస్సు ఒక్కటి కూడా రాకపోవడం దారుణం. మరోవైపు ఎక్స్ప్రెస్ సర్వీసులైన నాన్స్టాప్ బస్సుల్లో అనుమతులు లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని చర్చించుకుంటున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు నడిచేవి పల్లె వెలుగు బస్సులు మాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని అంటున్నారు. డొక్కు బస్సుల్లోనే ప్రయాణం ప్రతిరోజు జిల్లాలో వివిధ బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వాటిలో మహిళలు 60–70 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. జిల్లాలో 360 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. కండీషన్లో లేని బస్సులు కడప రీజియన్లో అధికంగా ఉండడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే బస్సుల్లో లోడు పెరగడం ద్వారా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్లపైకి తీసుకు వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులకు తప్పని తిప్పలు ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, మరోవైపు ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా బస్సులో ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అఽధికారులు ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. ఇచ్చిన హామీ విస్మరించారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దె ఎక్కాలన్న తలంపుతో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని మడత పెట్టారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణమని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా కూడా చెప్పలేదు. అధికారం చేపట్టిన ఏడాది తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూ చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారని మహిళలు మండిపడుతున్నారు. నాన్ స్టాపుల్లో నో ఎంట్రీ జిల్లాలో కడప–తిరుపతి, కడప–ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు–జమ్మలమడుగు ప్రాంతాలకు నాన్స్టాప్ బస్సులను నడుపుతున్నారు. అయితే ఆర్టీసీలో ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులనే నాన్స్టాప్ సర్వీసులుగా నడుపుతున్నారు. వీటిల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు టిక్కెట్ జారీ ఇలా.. సీ్త్ర శక్తి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి టిక్కెట్జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బస్సు ఎక్కేచోటు నుంచి దిగే ప్రాంతం వరకు టిక్కెట్ ఇస్తారు. టిక్కెట్ విలువను సున్నాగా నమోదు చేస్తారు. టిక్కెట్ జారీ చేసే టిమ్ మిషన్లో ప్రత్యేకంగా ఉమెన్ ఫ్రీ టిక్కెట్ పేరిట బటన్ ఏర్పాటు చేశారు. బాలికలు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్స్కు జీరో ఫెయిర్ టిక్కెట్ ఇస్తారు. గుర్తింపు కార్డు తప్పనిసరి ఉచిత ప్రయాణానికి కండక్టర్కు గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపాలి. ఆధార్, ఓటరు ఐడీ, రేషన్కార్డు, పాస్పోర్టులలో ఏదో ఒకటి చూపడం తప్పనిసరి. ఆయా గుర్తింపు కార్డులో మన రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులకు తిప్పలు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లలో మాత్రమే అవకాశం నాన్స్టాప్లో ఉచిత ప్రయాణానికి నో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అందని ద్రాక్షబస్సులను కండీషన్లో ఉంచాం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని బస్సులను కండీషన్లో ఉండేలా చూస్తున్నాం. ఇదే సమయంలో సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. – పొలిమేర గోపాల్రెడ్డి, జిల్లా ప్రజా రవాణాధికారి, కడప -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు
కడప సెవెన్రోడ్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు బుధవారం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులు హజరత్ పీరుల్లాసాహెబ్ మాలిక్ మజార్ను దర్శించుకుని ఫాతెహా చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ మాట్లాడుతూ మృదు స్వభావి, ప్రజా నాయకుడు, సామాన్య కార్యకర్తను కూడా ఎంతో అభిమానంతో పలకరించే మిథున్రెడ్డిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఎన్ఆర్ఐలతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమవంతుగా తోడ్పాటు అందించిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి బెయిలుపై విడుదల కావాలని దర్గా గురువులను ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు షేక్ గఫార్, ఎన్.సుబ్బారెడ్డి, సి.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, ప్రధాన అధికార ప్రతినిధి షేక్ గౌస్ బాషా (చాక్లెట్) కార్పొరేటర్లు షేక్ షంషీర్, షేక్ జిలాన్ (డిష్ జిలాన్), జి.ప్రవీణ్, కుమార్రెడ్డి, షేక్ గయాజ్, బాబుభాయి, నాసర్, రాజాసాబ్, పీర్బాషా, ఫారూఖ్, అహ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
భర్త మద్యం మానలేదని బలవన్మరణం
నిమ్మనపల్లె : కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొంత కాలానికి భర్త మద్యానికి బానిస కావడంతో, ఎలాగైనా మాన్పించాలనుకుంది.. అందుకోసం ఎన్నోసార్లు భర్తతో గొడవ పడింది.. భర్త అలవాటును మార్చలేక.. తన వాళ్ల ముందు తలెత్తుకోలేక.. తీవ్ర మనస్థాపానికి గురై ఆ అభాగ్యురాలు తనువు చాలించింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన మలిశెట్టిపల్లె వెంకటరమణ, వెంకట రమణమ్మ దంపతుల కుమార్తె ఎం.రత్నమ్మ ఎం.ఫార్మసీ వరకు చదివి, మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్లోని అపోలో మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉండేది. నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన బల్లాపురం చంద్రశేఖర్ కుమారుడు జ్యోతి శేఖర్ తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ ముని సుబ్బమ్మతో ఉంటూ డిగ్రీ వరకు చదువుకొని మదనపల్లె అపోలో ఫార్మసీలో చేరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత 2019 సంవత్సరంలో పెద్దలను కాదని ఇరువురు తవళం నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముని పుష్కర్ నందన్ అనే ఒకటిన్నర ఏడాది బాబు ఉన్నాడు. వివాహం అనంతరం ఇరువురు ఉద్యోగాలు మానేసి, ఇంటివద్దే ఉంటూ జ్యోతి శేఖర్ పెయింటింగ్ పనులకు వెళ్తుండగా , రత్నమ్మ స్థానికంగా పనులకు వెళ్లేది. కొంతకాలంగా జ్యోతి శేఖర్ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో భార్యతో అతిగా గొడవపడేవాడు. ఈ క్రమంలో తరచు భార్యాభర్తల మధ్య మద్యం అలవాటు విషయమై విభేదాలు తలెత్తి గొడవపడేవారు. మూడు నెలలుగా రత్నమ్మ భర్తను నీవు మద్యం అలవాటు మానకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించేది. ఈ నేపథ్యంలో మంగళవారం భర్త మద్యం సేవించి ఇంటికి రాగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం జ్యోతి శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి, రత్నమ్మ ఇంటికి గడియ పెట్టి ఉండడంతో, జ్యోతి శేఖర్ కిటికీలో నుంచి లోనికి చూడగా భార్య ఉరి వేసుకొని వేలాడుతూ ఉండటం గమనించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి స్థానికుల సాయంతో భార్యను కిందికి దించి, వెంటనే స్థానిక పీహెచ్సీ కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది రత్నమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం తహసీల్దార్ తపస్విని స్థానికుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఆటో నగర్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ (29) అనే వ్యక్తి మృతి చెందాడు. కడప ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేటకు చెందిన వెంకటేశ్ కడపలో ప్రైవేటు దుకాణంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు ఇసుక టిప్పర్లు పట్టివేతచాపాడు : తిప్పిరెడ్డిపల్లె సమీపంలోని పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నట్లు ఏఎస్ఐ నరసింహులు తెలిపారు. ఎస్ఐ చిన్న పెద్దయ్య ఆదేశాల మేరకు పెన్నానదిలో దాడులు నిర్వహించగా నాలుగు టిప్పర్లు ఇసుకను తరలిస్తుండగా వాటిని పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి తహసీల్దారు రమాకుమారికి అప్పగించినట్లు చెప్పారు. పెట్రోల్తో పాటు నీళ్లుద్విచక్ర వాహనదారుల ఆందోళన వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోలు బంకులో పెట్రోలుతోపాటు నీరు వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పులివెందుల రోడ్డులోని హెచ్పీ పెట్రోలు బంకులో వర్షపు నీరు వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం వేంపల్లెకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఈ పెట్రోలు బంకులో తన మోటార్ బైకుకు రూ.500లకు పెట్రోలు పట్టుకోవడంతో పెట్రోలుతోపాటు నీరు కూడా వచ్చింది. మోటార్ బైకు కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోవడంతో మోటార్ బైకును బజాజ్ షోరూంకు తీసుకొని వెళ్లాడు. మెకానిక్ పరిశీలించి ట్యాంకరులో పెట్రోలుతోపాటు నీరు కూడా ఉందన్నారు. అయితే పెట్రోలు బంకు యాజమాని వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపినా ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి పెట్రోలు బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకుని వాహనదారులను కాపాడాలని కోరారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాజుపాళెం : వివిధ చోరీలు, ఇంటి యజమానిపై దాడి చేసిన సంఘటనల్లో నిందితుడు తిమ్మారెడ్డి మహమ్మద్ రఫీని బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం రూరల్ సీఐ, రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు మహమ్మద్ రఫీ గతంలో కర్నూలు, వెలుగోడు, గోనెగండ్లు, ఓర్వకల్లు, ఉలింది కొండ, చాగలమర్రి, ఆళ్లగడ్డ తదితర పోలీస్ స్టేషన్లో పలు చోరీ కేసులలో నిందితుడుగా ఉన్నాడన్నారు. పట్ట పగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవాడన్నారు. పట్టపగలే చోరీ.. ఈ నెల 7వ తేదీన రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటికి తాళం వేసి ఉండడాన్ని చూసి సదరు నిందితుడు మహమ్మద్ రఫీ ఇంటి తాళం, బీరువాను పగల గొట్టేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అంతలో ఇంటి యజమాని నంద్యాల వెంకటసుబ్బయ్య ఇంటిలోనికి రాగా బీరువాను పగులగొడుతున్న నిందితుడిని ఎవరు నువ్వు అని ప్రశ్నించగా దొంగతనానికి వచ్చానని చెప్పి ఇంటి యజమానిపై దాడి చేశాడన్నారు. చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్డు తీసుకొని వెంకటసుబ్బయ్య తలపై కొట్టడంతో రక్త గాయాలయ్యాయన్నారు. ఆ సమయంలో యజమాని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా ఇంట్లోకి రావడంతో చోరీ చేస్తున్న రఫీ పారిపోయాడని సీఐ తెలిపారు. నంద్యాల వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపాళెం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై చోరీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని గోపాయపల్లె చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. టంగుటూరు, రాజుపాళెం గ్రామాల్లో చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితుడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు చెప్పారు. నిందితుడు మహమ్మద్ రఫీ దువ్వూరు మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన వాడు. నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు చోరీలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విలువైన వస్తువులు, నగదును భద్రపరుచు కోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రా నాయక్, పోలీసులు సుధాకర్, కిరణ్ పాల్గొన్నారు. పట్టపగలే చోరీ, దాడి కేసులో నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు రూరల్ సీఐ -
ఫ్రీ పోలింగ్ జరపాలి
పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికలు ఫ్రీ పోల్ గా జరపాలి. టీడీపీ గుండాలు పోలింగ్ బూతుల వద్ద కాపు కాయడం సరికాదు. గ్రామస్తుల ఓటర్ స్లిప్పులను చింపి వాళ్లే ఓటు వేసుకుంటున్నారు. ఇప్పటికై నా ఇలాంటి సంస్కృతి మానేస్తే బాగుంటుంది. అంతేకాకుండా అధికారులు మా గ్రామం నుంచి వేరే గ్రామానికి పోలింగ్ బూతులను మార్చడం సరైన పద్ధతి కాదు. మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. – చందన, ఇ –కొత్తపల్లె (దళితవాడ) పులివెందుల ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. అందుకే మా కొత్తపల్లి దళితవాడలోని ఓటర్లందరం బాయ్ కాట్ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి టీడీపీ గుండాలు బూతుల వద్దకు చేరుకున్నారు. బూతు దగ్గరికి వెళ్లగానే మా దగ్గర ఉన్న స్లిప్పులు లాక్కుంటున్నారు. మీరు వెళ్లిపోండి మీ ఓటు మేమే వేస్తాం అని అంటున్నారు. మా ఓటును కూడా మేము వేసుకునే పరిస్థితిలో లేం. ఇలాంటి సంస్కృతి కూటమి నేతలు మార్చుకోవాలి. – గోవిందమ్మ, ఇ –కొత్తపల్లె, పులివెందుల ఓటింగ్ బాయ్ కాట్ పులివెందుల మండలంలోని ఇ–కొత్తపల్లె దళితవాడ గ్రామస్తులందరం పోలింగ్కు వెళ్లకుండా బాయ్ కాట్ చేశాం. నేను పోలింగ్ బూత్ లో ఏజెంటుగా ఉన్నాను. కానీ పోలింగ్ బూత్ వద్ద ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గుండాలు చుట్టూ ముట్టారు. నా దగ్గర ఉన్న ఏజెంట్ ఫారాన్ని లాక్కొని చింపి వేశారు. ఓటర్లు, ఏజెంట్లు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు జరపాలి. మా ఓటును స్వేచ్ఛగా అధికారులు వేసుకోలేనప్పుడు ఎన్నికలను రద్దు చేయాలి. – వరలక్ష్మి, మండలాధ్యక్షురాలు, ఇ –కొత్తపల్లె. -
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు బుధవారం అసోసియేషన్ నాయకులు కడప ఆర్టీసీ బస్టాండులోని ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని, గవర్నర్పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 8 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతోపాటు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, డిపో ప్రెసిడెంట్ జయరాం, గ్యారేజ్ సెక్రటరీ మల్లేష్, డిపో జాయింట్ సెక్రటరీ లక్ష్మయ్య, సీఎస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.ధర్నాలో ఎన్ఎంయూఏ నాయకులు -
విద్యా విషయాలపై అవగాహన పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిిస్థితులకు అనుగుణంగా విద్యా సంబంధిత విషయాలపై ప్రధానోపాధ్యాయులతోపాటు మండల విద్యాశాఖ అధికారులు సంపూర్ణ అవగాహన పొందాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో హెచ్ఎం, ఎంఈఓలకు ఒక్క రోజు వర్కుషాపు జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు జరగాలన్నారు. వీటితోపాటు విద్యా సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో జరుగుతున్న వర్కుషాపులో హెచ్ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాభివృద్ధ్దికి సంబంధించిన విషయాలపై చర్చించాలన్నారు. సమగ్రశిక్ష ఏసీపీ నిత్యానందరాజు మాట్లాడుతూ హెచ్ఎంలతోపాటు ఎంఈఓలు విద్యాపరంగా విలువైన సలహాలు ఇస్తే రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలో చాలా మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా హెచ్ఎంలు, ఎంఈఓలు పనిచేయాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ సరస్వతి, జిల్లా వైద్యశాఖ ప్రతినిధి వెంకట చంద్రరెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటన్ లక్ష్మి నరసింహారాజు, ఏఎంఓ వీరేంద్ర, జిసిడిఓ రూతు ఆరోగ్యమేరీ, ఏఎస్ఓ సంజీవరెడ్డి, ఏపీఓ మాధవి, విజయభాస్కర్ పాల్గొన్నారు. ఇన్స్పైర్ మనాక్ పోస్టర్ ఆవిష్కరణ ఇన్స్పైర్మనాక్ నామినేషన్ల స్వీకరణలో రాష్ట్రంలో వై ఎస్సార్జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం కడప కలెక్టరేట్ సభాభవన్లో ఇన్స్పైర్ మనాక్ పోస్టర్ను డిప్యూటి ఈఓలు రాజగోపాల్రెడ్డి, మీనాక్షి, జిల్లా సైన్సు ఆఫీసర్ ఎబినైజర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్పైర్ మనాక్కు ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు చేయించేలా హెచ్ఎం, ఎంఈఓలు చొరవ తీసుకోవాలన్నారు. ఇన్స్పైర్ మనాక్కు సంబంధించిన ప్రాజెక్టులు ఇన్నోవేటివ్గా ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా సైన్సు అధికారి ఎబినేజర్ మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం 5నుంచి శంకరాపురంలోని అంధుల పాఠశాలలో అందుబాటులో ఉంటానని... సందేహాలు ఉంటే తెలపాలని కోరారు. అప్లికేషన్ కోడ్ను 8328375357 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపితే స్కూల్ మెయిల్, పాస్వర్డు మార్చడం చేస్తామని తెలిపారు. -
వర్షానికి కూలిన పై కప్పు
కొండాపురం : నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వ ర్షానికి మండల పరిధిలోని బి.కొట్టాలపల్లె గ్రామానికి చెందిన ఆర్. హరికేశవరెడ్డి మట్టి మిద్దె ఇంటి కప్పు మంగ్లవారం రాత్రి కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం లేదా నూతన ఇళ్లు మంజూరు చేయాలని బాధితుడు కోరారు. అధికారుల పరిశీలన మైలవరం : మండల కేంద్రంలోని అయ్యవారిపల్లె గ్రామంలో వర్షానికి మిద్దె పైకప్పులు కూలిపోయాయి. బుధవారం ఉదయం తహసీల్దార్ లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని చేరుకుని మిద్దెను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు గంగబోయిన రవికుమార్, చౌడం వెంగళరావు తమ ఆవేదనను అధికారులకు విన్నవించారు. అనంతరం తహసీల్దార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
అవయవ దానం చేసి.. ప్రాణదాతగా నిలిచి..
మైలవరం : అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే రోజున వైద్యులు కల్పించిన అవగాహనతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. వివరాలు ఇలా.. ఈనెల 10వ తేదీన మైలవరం రిజర్వాయర్ గేట్ల వద్ద ప్రమాదవశాత్తు గోడ మీద పడిన దుర్ఘటనలో శివరామసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా వైద్యులు ఇచ్చిన స్ఫూర్తితో మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను ఆసుపత్రిలోనే దానం చేశారు. తాను మరణించినా మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదించి చిరంజీవిగా నిలిచిపోయాడని అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం సమీపంలోని రెండు కుళాయిల వద్ద ఉన్న పెన్నానదిలో నాయుని విక్రమ్ (20) అనే యువకుడు గల్లంతయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రమ్ వన్టౌన్ సర్కిల్లోని టీ దుకాణంలో మాస్టర్గా పని చేస్తున్నాడు. అతను తన స్నేహితులు వెంకటసాయి, ముత్తయ్య, శివలింగమయ్యలతో కలిసి బుధవారం పెన్నానదికి వెళ్లాడు. మిత్రులందరూ పెన్నానదిలో కొంత సేపు సరదాగా గడిపారు. కొంత సేపటి తర్వాత మళ్లీ వస్తానని చెప్పి విక్రమ్ వారికి దూరంగా వెళ్లాడు. అలా వెళ్లిన అతను నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బోటు సాయంతో నదిలో గాలించారు. నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో విక్రమ్ ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు. యువకుడి తల్లి రుక్మిణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
‘గండికోట’లోకి భారీగా కృష్ణా జలాల రాక
కొండాపురం : అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి సృజల స్రవంతి కెనాల్ ద్వారా 11,200 క్యూసెక్కుల కృష్ణజలాలు గండికోట జలాశయంలోకి వస్తున్నట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమా మహేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 20.1 టీఎంసీలకు చేరినట్లు ఆయన తెలిపారు. వాగులు వంకల ద్వారా 2700 క్యూసెక్కులనీరు జలాశయంలోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. పుల్ రిజర్వాయర్ లెవల్ 695.5 అడుగులు ఉండగా ప్రస్తుతం 690 అడుగులకు రిజర్వాయర్ లెవల్కు చేరినట్లు తెలిపారు. గండికోట స్పిల్ వే క్రిస్ట్ గేట్ల ద్వారా మైలవరం జలాశయానికి 7500 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయన్నారు. గండికోటఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు మోటర్లతో 440 క్యూసెక్కులనీరు పంపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. -
కౌంటింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలోని మౌలా నా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జేసీ అదితి సింగ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచామన్నారు. రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం మీడియా సెంటర్ను కుడా ఏర్పాటు చేశామన్నారు. – పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 30 మంది సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. -
పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంఘంలో జిల్లావాసులు
కడప అగ్రికల్చర్: విజయవాడ పశుసంవర్థశాఖ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా నుంచి ముగ్గురికి చోటు లభించింది. వేల్పులలో లైవ్ స్టాక్ ఆఫీసర్గా పనిచేస్తున్న చాంద్బాషాకు ఏపీ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్– వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు దక్కింది. అలాగే ఊటుకూరులో లైవ్స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్యకు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడిగా, ఖాజీపేట మండలం ఆంజనేయకొట్టాలులో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న గంగయ్యకు ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోటు లభించింది. మన జిల్లా నుంచి రాష్ట్ర సంఘానికి ఎన్నికై నందుకు వైయస్సార్ కడప జిల్లా తరఫున అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీ జూనియర్ వెటర్నీరీ ఆఫీసర్స్ అండ్ వెటర్నరీ ౖౖలైవ్ స్టాక్ ఆఫీసర్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు సదాశివయ్య, విద్యాసాగర్, మనీ, వెంకటసుబ్బయ్య, సునీల్, వీరకుమార్, మహదేవ, రమేష్ , పెంచలయ్య, శ్రీనివాసులు, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వేధింపులకు గురైన వ్యక్తి మృతి
కర్నూలు(హాస్పిటల్)/కొండాపురం: స్థల వివాదంలో పోలీసుల వేధింపులతో వైఎస్సార్ కడప జిల్లా కోర్టు ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మంగళవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్.చిన్నబాలయ్య(45)కు చెందిన స్థలం విషయంలో హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జున రెడ్డి, కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవ రెడ్డి, గంగిరెడ్డి, తుంగ జగదీశ్వర్ రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాల నారాయణరెడ్డి వేధిస్తున్నారని.. తన భార్య, పిల్లలను తనకు చూపించకుండా ఎక్కడో దాచారని అప్పట్లో ఆరోపించాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపి గత నెల 29న కోర్టు ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడికి కడప రిమ్స్లో ప్రాథమిక వైద్యం చేయించి అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డులో 60 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కోలుకోలేక మృతిచెందాడు. దాదాపు రెండు వారాల పాటు ఎలాగైనా తనను బతికించాలని.. తన భార్య, బిడ్డలను చూపించాలని వైద్యులను వేడుకోవడం అందరినీ కలచివేసింది. -
పులివెందులలో విష సంస్కృతికి బీజం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో విష సంస్కృతికి బీజం పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నిక జరిగింది. వేలాది మంది టీడీపీ అల్లరి మూకలవల్ల ఓటర్లు, ఏజెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్లను మంగళవారం టీడీపీ మూకలు ఆక్రమించుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ సాక్షి వాహనాన్ని చుట్టుముట్టి వాహనాన్ని బాది తాళాలు లాక్కొన్నారు., చొక్కా పట్టి కిందకు దించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో ‘సాక్షి’ మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. ఎర్రిపల్లె, కొత్తపల్లెల్లో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్పై టీడీపీ అల్లరి మూకల దాడి చేశారు. తుమ్మలపల్లె, కనంపల్లెలలో కట్టెలు పట్టుకుని టీడీపీ మూకలు గొడవలు చేశారు. తుమ్మలపల్లెలో షామియానా వేసి టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చివెళ్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మోట్నూతలపల్లెలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె, తుమ్మలపల్లె పోలింగ్ బూత్లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకుండా ఆక్రమించుకున్నారు. ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ను ఆధీనంలోకి తీసుకుని ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను సైతం తరిమేస్తూ.. ఊర్లో మహిళలపై దాడి, అసభ్యంగా ప్రవర్తించారు. గ్రామంలో ఎవరూ ఓటు వేయకుండా అడ్డుకున్నారు. పల్లెలపై పడ్డ పచ్చ మంద భయబ్రాంతులకు గురైన ఓటర్లు ఏజెంట్ల ఫారాలు చించివేత టీడీపీ అల్లరి మూకల భయానక పరిస్థితుల మధ్య ఎన్నికలు చోద్యం చూసిన పోలీసు యంత్రాంగం -
సత్యం వధ..ధర్మం చెర
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు.. కంచే చేను మేసిందన్న నానుడిని పోలీసు శాఖ రుజువు చేసిన రోజు.. అధికార పార్టీకి తొత్తుగా మారి.. కాదు కాదు ఆంక్షల సంకెళ్లలో బందీగా మారి పూర్తి బానిసగా మారిన రోజు.. అవును.. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. పులివెందులలో అడుగడుగునా రౌడీ రాజ్యం కనిపిస్తే.. ఒంటిమిట్టలో పచ్చ మూక బరితెగించింది.ఇంకా తెలవారకముందే.. సూరీడు కిరణాలైనా పడకముందే పులివెందుల పల్లెల్లో డబ్ డబ్ మంటూ ఖాకీల అడుగు చప్పుళ్లు వినిపించాయి. బందోబస్తుకు కాదు.. బందిపోట్లకు అండగా నిలవాలన్న తాపత్రయంతో వేసిన అడుగులవి. దొంగ ఓట్లను అరికట్టడానికి కాదు.. నిజమైన ఓటర్లను అడ్డుకోవడానికి వేసిన అడుగులవి. పచ్చని పల్లెల్ని పచ్చ స్వామ్యంగా మార్చాలనే కుట్రలో భాగంగా వేసిన అడుగులవి. ఇందులో భాగంగానే స్థానిక వాసి.. ప్రజా ప్రతినిధి.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికొచ్చారు. ఎన్నికల వేళ నేతల్ని ‘ఇంటి నిర్బంధం’ చేయడం సహజమే. కానీ ఇంట్లోనే ఉంటానన్న ఎంపీ వినతిని పట్టించుకోలేదు.. ఒంట్లో నలతగా ఉందన్నా కనికరించలేదు.. బలవంతపు అరెస్టు చేసి సగం జిల్లా తిప్పారు. పోనీ అధికార పార్టీ నేతల్ని చేశారా అంటే అబ్బే అస్సలు పట్టించుకోలేదు. పైగా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ఓట్ల దొంగల్ని దగ్గరుండి స్వాగతం పలికారు. కమలాపురం మండలం పెద్ద చెప్పలి ఎక్కడుంది.. పులివెందుల మండలంలోని ఎర్రిపల్లె ఎక్కడుంది... అక్కడి నుంచి వచ్చి ఏంచక్కా ఓట్లు వేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అంతేనా వేంపల్లె నుంచి.. జమ్మలమడుగు నుంచి.. ఎర్రగుంట్ల నుంచి.. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీల్ని.. పచ్చ మూకల్ని తరలించి మరీ ఓట్లేయించారు. సాక్షాత్తు డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ.. ఇలా పోలీసు బాసులందరూ తిష్ట వేసింది దీనికోసమే. ఈ అరాచకాలకు..అక్రమాలకు.. పోలీసు ఉన్నతాధికారులందరూ సాక్ష్యమే. ఇక సాక్షాత్తు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటిని ఉదయాన్నే చుట్టుముట్టిన పోలీసులు కొన్ని గంటల వరకు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలింగు బూతుల్లో దొంగ ఓట్ల జాతర ముగిశాక తీరిగ్గా ఓటు వేయడానికి రమ్మని అడిగారు. అప్పటికే నిండా ఆక్రోశంతో ఉన్న మహిళలు పోలీసుల తీరును తూర్పారబట్టారు. ఏజెంట్లు లేకుండా ఇంత సేపు దొంగ ఓట్లు వేసుకుని ఇప్పుడొచ్చి రమ్మంటారా అంటూ ఖాకీల్ని నిలదీశారు. జవాబు చెప్పలేక.. అక్కడి జనాల్లో ఉండలేక కాళ్లకు పని చెప్పడం పోలీసుల వంతైంది.ఎర్రిపల్లెలో సుమారు 350 మంది పచ్చ మూక బరితెగిస్తుంటే ఖాకీ సైన్యం చోద్యం చూస్తూ నిలబడింది. ఆడోళ్లని కూడా చూడకుండా పచ్చ మూకలు దౌర్జన్యం చేస్తుంటే అడ్డు చెప్పే ధైర్యం కూడా వారిలో లేకుండా పోయింది. పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫాం కనిపిస్తున్నా .. లోన వేసుకున్న ‘పచ్చ చొక్కాల లెక్క’ డామినేట్ చేసింది. పబ్లిగ్గా అది సాక్షాత్కరమైంది కూడా.పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నాయకుల అనుచరుల హల్చల్నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ కేంద్రం వద్ద జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. ఉదయం నుంచే బూత్లను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని వైఎస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వలేదు. టీడీపీ గూండాలు ఏజెంట్ల ఫారాలను లాక్కొన్నారు. మోట్నూతలపల్లిలో దారిని టీడీపీ అల్లరి మూకలు అడ్డగించి పోలింగ్ బూత్ కి 2 కిలో మీటర్లు ముందే వాహనాలు అపి కొట్టి వారు ఊరి బయటే వాహనాలను వెనక్కి పంపారు. కనంపల్లెలో టిడిపి అల్లరి మూకల మహిళా ఓటర్లపై దాడులు చేశారు. కనంపల్లెలో ఓటు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనంపల్లె సర్పంచ్ రామాంజనేయులు ఇంటి వద్ద మంచంపై పోలీసులు గన్ను పెట్టి బెదిరించారు. తుమ్మలపల్లె, కనంపల్లె పోలింగ్ బూత్లకు వెళ్లనీయకుండా టీడీపీ మూకలు ఓటు వేయడానికి వెళుతున్న మహిళా ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎర్రిపల్లె పోలింగ్ బూత్లోకి ఏజెంట్లను బీటెక్ రవి తమ్ముడు భరత్ రానీయకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చేస్తున్నారని మహిళా ఏజెంట్ వాపోయింది. -
స్లిప్పులు లాక్కోవడం ఏంటి?
ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించకోలేకపోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక తాలిబన్ల రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఎర్రిపల్లె గ్రామంలో 300 మంది టీడీపీ గూండాలు భయపెట్టారు. సోమవారం రాత్రి నుంచి గ్రామంలో తిరుగుతూ వైఎస్సార్సీపీకి చెందిన వారిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. గ్రామంలో ఎవరినీ కూడా ఓటు వేసేందుకు వెళ్లనివ్వలేదు. స్లిప్పులు లాక్కొని మర్యాదగా వెళ్లిపోతారా.. లేక దెబ్బలు తింటారా అని హెచ్చరించారు. ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదు. –కె.రామ్మోహన్ రెడ్డి, ఎర్రిపల్లె, పులివెందుల మండలం 500 మంది టీడీపీ గూండాలు వచ్చారు గ్రామంలోకి సోమవారం రాత్రి ఒకసారిగా 500 మంది టీడీపీ గూండాలు వచ్చారు. గ్రామంలో వీధి వీధి తిరిగారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. దీంతో వారు గ్రామంలో లేకుండా వెళ్లిపోయారు. ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించారు. భయపడి గ్రామస్తులు ఎవరూ కూడా ఓటు వేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. పోలీసులు టీడీపీ గూండాలకు తొత్తులుగా వ్యవహరించడం తగదు. – జి.సుధాకర్ రెడ్డి, ఎర్రిపల్లె, పులివెందుల మండలం బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు ఎర్రిపల్లె పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చొనేందుకు వెళ్లాను. బీటెక్ రవి తమ్ముడు భరత్కుమార్రెడ్డి నా వద్ద ఉన్న పత్రాలు లాక్కొని అడ్డుకున్నాడు. ఇతనితో పాటు పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఇలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి? పోలీసులు వారి డ్యూటీ చేయకుండా టీడీపీ గూండాలకు కాపలాగా ఉన్నారు. గ్రామంలో ఏ ఒక్కరినీ ఓటు వేయనీయలేదు. – గంగా భవాని, ఎర్రిపల్లె, పులివెందుల మండలం వైఎస్సార్సీపీ అంటే స్లిప్పులు లాక్కున్నారు కొత్తపల్లె పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా నిలబడటానికి వెళితే ఏజెంట్ పత్రాలను చించివేశారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిని ఏ పార్టీకి చెందిన వారని అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ అంటే స్లిప్పులు లాక్కొని వెనక్కు పంపిస్తున్నారు. గ్రామంలో ఇదేవిధంగా ప్రజల స్లిప్పులను తీసుకుని వారే ఓటింగ్ వేసేలా చేసుకున్నారు. రిగ్గింగ్ పక్కాగా జరిగింది. ఇంటింటికి వెళ్లి బెదిరింపులతో ఓటర్ల స్లిప్పులను తీసుకెళ్లారు. – పి.సాయికుమార్, చంద్రగిరి, పులివెందుల మండలం న్యూస్రీల్ -
ఒంటిమిట్టలో రాయచోటి రౌడీల వీరంగం
సాక్షి రాయచోటి/రాజంపేట: ఒంటిమిట్టలో జెడ్పీ టీసీ ఉప ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. మండలంలో 30 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి చోట పోలీసులు, ఎన్నికల సిబ్బంది సహకారం ఎల్లో గ్యాంగ్కు లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా పోలింగ్ బూత్ల్లోకి చొరబడి, ఓటర్ల నుంచి ఓటరు స్లిప్లు లాక్కుని వారే ఓటు వేసుకున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోయారు. మంత్రి నేతృత్వంలోఏజెంట్లపై దాడులు మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు.. పోలింగ్ బూత్లలో వున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. ప్రధానంగా మంటంపంపల్లె, చిన్నకొత్తపల్లె, గంగపేరూరు, నడింపల్లె తదితర పోలింగ్ బూత్లలో ఉదయం నుంచి ఏజెంట్లను బయటికి లాగి పడిసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలతో బూత్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నేతల యత్నం సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్రెడ్డిలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పోలింగ్ బూత్ వద్దకి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుతగులుతున్నారని భావించి.. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని పోలీసులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసి ఒంటిమిట్ట, కడప రిమ్స్, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లకు తరలించారు. -
మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఎన్ఆర్ఐలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ దేశాలలోని ఎన్ఆర్ఐలు కలిశారు. మంగళవారం విజయవాడ తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్లోబల్ ఎన్ఆర్ఐ కన్వీనర్ ఏ. సాంబశివ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్తో కలిసి గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పులపుత్తూర్ సురేష్ కుమార్ రెడ్డి, అడ్వైజర్ అరవ సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ఏజెంట్లను లాగిపడేసి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారన్నారు. రాజకీయ కక్షలతో వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారని, ఎంతో కాలం ఈ అక్రమాలు సాగవని హెచ్చరించారు. -
ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి !
సాక్షి ప్రతినిధి, కడప : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం వెలుగుచూసింది. మేధావుల ఫోరం, పులివెందుల పేరిట ‘ఆలోచించండి.. విజ్ఞతతో తీర్పు ఇవ్వండి’.. అంటూ ఓ బహిరంగ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు టీడీపీకి ఓటెందుకు వేయాలి? అని ప్రశ్నించడంతో పాటు.. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి అంశాలను అందులో ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది.. ● పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఏం చేశారు? ఏం చూసి ఓట్లు వేయాలి? కసనూరు సంస్కృతి (ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు) తెరపైకి తెచ్చి భయానక పరిస్థితులు కల్పించినందుకా? .. ప్రశాంత పట్టణంలో విచ్చలవిడి దౌర్జన్యం చేస్తున్నందుకు ఓటెయ్యాలా?.. కోనసీమను మరిపించేలా పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఉన్న పచ్చటి గ్రామాల్లో రక్తపాతం పారిస్తున్నందుకు ఓటెయ్యాలా?.. ఓ సారి ఆలోచించండి. కామధేనువు లాంటి వైఎస్ కుటుంబాన్ని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి? పులివెందుల మండల ప్రజలు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునేందుకు మాత్రమే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పరిమితం. నిర్దిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పులివెందుల అభివృద్ధంటూ జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మాత్రమే. ఈ విషయం మీకు తెలియంది కాదు. కళ్లెదుట కన్పిస్తోంది. ఉదాహరణకు.. ● విద్యాపరంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నాడు–నేడు పథకంలో అపురూపంగా మారిన పాఠశాలలు. ● ఆరోగ్య రంగంలో డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐఎల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, గోవిందరాజా టెక్స్టైల్స్, వ్యవసాయ రంగంలో చీనీ మార్కెట్ యార్డు, బనానా రీసెర్చ్ సెంటర్, ఐజీసీఏఆర్ఎల్ (ఐజీ కార్ల్), డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ గుర్తుకొస్తాయి. ఒక ప్రాంతంలో ఇన్ని సంస్థలు రావడం సాధ్యమా? వైఎస్ కుటుంబం చలువే కదా ఇదంతా. ● కృష్ణా జలాలను మెట్ట ప్రాంతంలో పారించాలనే తపన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అందుకే గండికోట రిజర్వాయర్ నుంచి నీరు లిఫ్ట్ చేసి, పైడిపాలెం రిజర్వాయర్లో నిల్వచేసే బృహత్తర ప్రాజెక్టు తీసుకొచ్చారు. ● మూడు టీఎంసీలకు మాత్రమే పరిమితమైన ఛిత్రావతి ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించారు. గండికోట నుంచి చిత్రావతి లిఫ్ట్ ద్వారా నీరు తీసుకొచ్చారు. కుడి, ఎడమ కాలువలు తవ్వారు. ● అద్భుతమైన రోడ్డు కనెక్టవిటీ సౌకర్యం కల్పించారు. బెంగళూరు–విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్లు, విలేజ్ కనెక్టివిటీ రోడ్లు, సచివాలయాలు, వరల్డ్ క్లాస్ ఆర్టీసీ బస్టాండ్, క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్ ఉలిమెల్ల లేక్వ్యూ, రాణి తోపుల ఇవన్నీ వైఎస్ కుటుంబం తీసుకొచ్చినవే కదా! టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం..? ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఎవరికి ప్రయోజనం? ప్రధానంగా బీటెక్ రవికి, పరోక్షంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఇద్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలింగ్లో దొమ్మి చేయాలని చూస్తున్నారు. పోనీ, ఆ తర్వాత కూడా ఇలాగే ఉంటారా? 2019లో అధికారంలోకి వైఎస్సార్సీపీ రాగానే రూ.10 కోట్లు ఇస్తాం, పార్టీలో చేర్చుకోండంటూ పాదాక్రాంతమయ్యారు. ఇదంతా వాస్తవమే కదా! జగన్ను ఓడించామని చెప్పుకునేందుకే.. పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించామని చెప్పుకునేందుకే.. నానా తంటాలు పడుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవస్థలు మిన్నకుండిపోయాయి. టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్ మెప్పు కోసమే ఈ యాగీ అంతా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్్ఎంసీ) 2024–25 విద్యా సంవత్సరంలోనే పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. నిర్దయగా వద్దని చంద్రబాబు సర్కారు లేఖ రాసింది. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రాజెక్టును మరుగునపర్చారు. ఎలాంటి పురోగతిలేదు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి. నిర్భయంగా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి. పులివెందుల పౌరుషాన్ని తెలియజేయండి. – మేధావుల ఫోరం, పులివెందుల అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా వారిని కాదని పక్కవారిని ఎందుకు బలపర్చాలి? ఆలోచించండి.. విజ్ఞత ప్రదర్శించండి.. పులివెందుల పౌరుషాన్ని చాటిచెప్పండి సోషల్ మీడియాలో మేధావుల ఫోరం బహిరంగ లేఖ వైరల్ -
జావెలిన్ త్రో స్టేట్ ఫస్ట్ సూఫియాన్
కమలాపురం : కమలాపురం దర్గా వీధికి చెందిన ఎస్. సూఫియాన్ కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కడపలోని డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 36వ ఏపీ స్టేట్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కాగా స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ను, అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోచ్ వెంకటేశ్వర్లును ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. జావెలిన్త్రోలో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ -
పోలింగ్కు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. కడప, పులివెందుల ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బ్యాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. జీపీఎస్తో కూడిన బస్సుల్లో రూట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పులివెందుల మండలంలో ఏర్పాటుచేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఒంటిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన 30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్తోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రూట్ మొబైల్స్, స్టైకింగ్ఫోర్స్లను, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు అత్యాధునిక డ్రోన్లను కూడా వినియోగిస్తుండడం విశేషం. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య కడప నగర శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాల స్ట్రాంగ్ రూముకు తరలించనున్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే ఒంటిమిట్ట ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (వైఎస్సార్ సీపీ), పూల విజయభాస్కర్ (కాంగ్రెస్), ముద్దుకృష్ణారెడ్డి (టీడీపీ), సౌమిత్రి చంద్రనాథ్, కోనేటి హరి వెంకట రమణ, గుండు మల్లికార్జునరెడ్డి, టక్కోలి శివారెడ్డి, నడివీధి సుధా కర్, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేష్ నంద్యాల (స్వతంత్రులు)లు పోటీలో ఉన్నారు. పులివెందుల తుమ్మల హేమంత్ రెడ్డి (వైఎస్సార్ సీపీ), మారెడ్డి లతారెడ్డి (టీడీపీ), మొయిళ్ల శివకల్యాణ్రెడ్డి (కాంగ్రెస్), అంకిరెడ్డి సురేష్కుమార్రెడ్డి, తుమ్మలూరు అనిల్కుమార్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, ఎం.గజేంద్రనాథ్రెడ్డి, మారెడ్డి జయభారత్రెడ్డి, ఎం.వెంగళరెడ్డి, యాదాటి సునీల్ యాదవ్ (స్వతంత్రులు)లు రంగంలో ఉన్నారు. -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
కడప ఎడ్యుకేషన్ : కంటికి కనిపించని శత్రువు. ఒంటికి హాని కలిగించేదే నులిపురుగు. ఇది మనిషి పేగుల్లో మకాం వేసి రక్తాన్ని పీల్చి పిల్లలను పిప్పి చేస్తూ రక్తహీనతను కలిగిస్తుంది. నులి పురుగులు అధిక శాతం అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దీని నివారణకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 12వతేదీ మంగళవారం అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలలో విద్యనభ్యసిస్తున్న పిల్లలందరికి ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం వైద్యశాఖాధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాత్రలను ఇప్పటికే అంగన్వాడీలు, స్కూల్స్, కళాశాలలకు తరలించారు. ఈ మేరకు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని వల్లూరు మోడల్ స్కూల్లో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్ట్రేట్ ఎన్డీడీ మానిటరింగ్ ఆఫీసర్, జెడ్ఎంఓ జమాల్ బాషా, డీఎంఅండ్హెచ్ఓ నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ హాజరుకానున్నారు. ఏడాది వయసు నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికి ఈ నులిపురుగులను నివారించే మాత్రలను వేయనున్నారు. వ్యాప్తి ఇలా.. ● నులి పురుగులు కలుషిత ఆహారం, దుమ్ము ధూళి, ఈగలు వాలిన తినుబండారాలు తినటం వలన వ్యాపిస్తుంది. ● బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన ద్వారా, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ● ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వస్తుంది. ● భోజనం వండేవారు, వడ్డించేవారు, తినేముందు తిన్న తరువాత చేతులు శుభ్రంగా కడక్కోకపోవడం వల్ల వస్తుంది. ● చేతివేళ్లకు గోర్లు ఉండటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ● ఆరుబయట తిరిగేటప్పుడు బూట్లు, చెప్పులు ధరించకపోవడం వల్ల వస్తుంది. బాల్యం చిక్కిపోతోంది.. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు 4,71,835 మంది ఉన్నారు. ఇందులో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు (అంగన్వాడీ కేంద్రంలోని) ఆల్బెండజోల్ 200 ఎంజీ, 3 నుంచి 19 సంవత్సరాలలోపు వారికి 400 ఎంజీ మాత్రలు మధ్యాహ్నం భోజనం తరువాత నీళ్లలో మింగించాలి. భోజనం చేయకుండా మాత్రను వేసుకుంటే కడపునొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు జ్వరం లేదా ఇతర ఇతర కారణాల వలన అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలు ఇవ్వకూడదు. ఆ రెండు మండలాలు మినహా.. జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల మండలాలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఈ రెండు మండలాల్లో నులిపురుగుల నివారణ మందులు వేయడం లేదు. ఇక్కడ ఈనెల 20వ తేదీ నులి పురుగుల నివారణ మందులను వేయనున్నారు. ఉపాధ్యాయులు పాటించాల్సిన నియమాలు.. ● ఈ నులి పురుగుల కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అరోగ్యశాఖ అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలి. ● ప్రార్థన సమయంలో ఆల్బెండోజోల్ 400 గ్రాముల మాత్రల ఆవశ్యకతతోపాటు చేతుల పరిశుభ్రత గురించి వివరించాలి. అందేలా చూడాలి నులిపురుగుల నిర్మూలన వల్ల ప్రయోజనాలు.. ● పిల్లల్లో రక్తహీనత నియంత్రిస్తుంది. ● పోషకాహార ఉపయోగతను మెరుగు పరుస్తుంది ● వ్యాధి నిరోధకతను మెరుగు పరుస్తుంది ● ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం, పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి హాజరు మెరుగుపరుస్తుంది నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఒంటిమిట్ట, పులివెందుల మినహా అన్ని మండలాల్లో మాత్రలు పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా, వైద్య ఆరోగ్యశాఖలు నేడు వల్లూరు మోడల్ స్కూల్లో జిల్లా కార్యక్రమంచిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం.. పిల్లల్లో నులి పురుగుల నివారణ లక్ష్యంగా వారి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఈ పురుగుల నివారణకు ఆల్బెండోజోల్ 400 ఎంజీ ఒక మాత్ర 2 ఏళ్లలోపు పిల్లలకు సగం మాత్రను నలిపి వేయాలి. 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వారికి ఒక మాత్ర చొప్పున వేయాలి. ఏదేని కారణాలతో మాత్రలు వేసుకోని వారికి 20వ తేదీన మళ్లీ వేస్తాం. అప్పుడు తప్పకుండా వేసుకోవాలి. – డాక్టర్ కె. నాగరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిప్రతి పాఠశాలలో ఇవ్వాలి జిల్లా వ్యాప్తంగా ఒంటిమిట్ట, పులివెందుల మండలాలు మినహా అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఆల్బెండోజల్ 400 గ్రాముల మాత్రలను ఇవ్వాలి. ఈ విషయంలో వైద్యశాఖ, విద్యాశాఖ సమన్వయంతో పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలి. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పిల్లలతో మాత్రలను మింగించాలి. ఏదైనా తేడా అనిపిస్తే తక్షణం వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి -
అక్రమ వసూళ్లు రూ.16.40 లక్షలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో 2024 ఆగస్టు నెల నుంచి సుమారు రూ.16.40 లక్షలు యూజర్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లు చేసినట్టు తేలిందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ వ్యాపార సంస్థల నుంచి క్లాప్ యూజర్ చార్జీలు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఆరు ప్రత్యేక బృందాలతో పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 2414 మందిని విచారించగా 258 మంది తాము యూజర్ చార్జెస్ ఇచ్చామని చెబుతూ అందుకు సంబంధించిన రశీదులు, ఆధారాలు చూపారన్నారు. మిగిలిన 2156 మంది తాము ఎలాంటి యూజర్ చార్జీలు చెల్లించలేదని చెప్పారన్నారు. రూ.4,20,750లకు స్లిప్పులు తగిన ఆధారాలు ఉన్నాయని, రూ.12,19,500లకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇందులో 2024 ఆగస్టు నుంచి కార్పొరేషన్కు రూ.7 లక్షలు జమ అయిందన్నారు. తమ విచారణలో బయటపడిన నాలుగు లక్షల 20 వేల 750 రూపాయలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇదివరకే ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మరో ఏడుగురు శానిటరీ సెక్రటరీలు, ముగ్గురు ఆప్కాస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే తెలపాలని, వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు. ఇకపై యూజర్ చార్జీలు వసూలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి అనధికారికంగా లేఔట్లు వేసిన వారు, అందులో ప్లాట్లు కొన్నవారు 24వ తేదీలోపు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్టర్ అయిన ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. 45 రోజుల్లో మొత్తం ఫీజు చెల్లించిన వారికి 10 శాతం, 90 రోజుల్లో చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కడప నగరంలో సుమారు వందకు పైగా అనధికారిక లేఔట్లు ఉన్నాయని, వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో రూ. 7 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లింపు రూ. 4.20 లక్షలకు ఆధారాలు లభ్యం ఆరు బృందాలతో 2414 మందిని విచారణ మీడియాతో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి -
విలేకరి బెదిరిస్తున్నాడని మహిళా సర్పంచ్ ఫిర్యాదు
కాశినాయన : మండలంలోని కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుపల్లె సుభద్రమ్మ తనను మహబూబ్ బాషా అనే పత్రికా విలేకరి వేధిస్తున్నాడని సోమవారం నరసాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రమణకు ఫిర్యాదు చేశారు. తాను విలేకరినని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతికి పీఏను అని పాత పనులకు బిల్లు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సర్పంచ్ తెలిపారు. 2017–18 సంవత్సరంలో తాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించానని, అప్పుడు తనకు బిల్లులు రాలేదని, ఇప్పుడు బిల్లులు ఇవ్వాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. సర్పంచ్పై విలేకరి ఫిర్యాదు రూ.50 లక్షలు గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని పత్రికలో తాను వార్త రాసినందుకు సర్పంచ్, ఆమె బంధువులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని నరసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరి మహబూబాషా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఆవుల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఆవుల వేణుగోపాల్ రెడ్డి మరణ వార్తను మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. సోమవారం ఆవుల కుమారులు ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఆయన సోదరుడు ఆవుల మల్లికార్జున రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిలు కూడా ఫోన్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన ప్రముఖులు.. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారక నాథ్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ, దేశాయి తిప్పారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ మదనపల్లె ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహమ్మద్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ ఛైర్మన్ దశరథరామిరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. -
కిక్కుకు.. పర్మిట్!
● మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూములు ● నెలాఖరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు ● అప్పటివరకు కూడా ఆగని మద్యం వ్యాపారులు ● ఇప్పటికే అనధికారికంగా ఏర్పాటుకడప వైఎస్ఆర్ సర్కిల్ : మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ అనుమతి పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరుకు పూర్తి చేయడంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. వాస్తవానికి మద్యం షాపులు ప్రారంభమైనప్పటి నుంచే వాటి యజమానులు చాలా చోట్ల గుట్టు చప్పుడు కాకుండా పర్మిట్ రూములు ఏర్పాటు చేసేశారు. ఇప్పుడు ప్రభుత్వమే దీనికి అనుమతులు ఇస్తుందన్న సమాచారంతో ఇంకా విచ్చల విడిగా పర్మిట్ రూములు తెరిచి పూర్తిగా తాగించేస్తున్నారు. గ్లాసులు, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్ ఏర్పాటు చేసి మరీ విక్రయిస్తున్నారు. అర్థరాత్రి వరకు తెరిచే ఉంచుతున్నారు. దీంతో మందుబాబులు అక్కడే తాగి తూలుతుండడంతో అటుగా వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పర్మిట్కు రైట్ రైట్... మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణం వద్దే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పునః ప్రారంభించే దిశగా ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు పర్మిట్ రూములకు అనుమతులివ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నూతన విధానంలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. అప్పటినుంచి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి అనుబంధంగా ఒక్కొక్కటిగా చొప్పున 153 సిట్టింగ్ రూములు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేషన్, మున్సిపల్ పరిధిలో పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు ఇతర ప్రాంతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు ప్రకటించింది. సగటు చొప్పున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసిన ప్రభుత్వానికి అదనంగా రూ.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పరిమిత ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మారుస్తున్నారు. ఆదాయమే లక్ష్యమా.. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు గాను 3100 దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. తద్వారా రూ.62 కోట్లు ఆర్జించింది. షాపులు దక్కించుకున్న వ్యా పారులు ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజుల్లో 1/6 వంతు చెల్లించారు. పర్మిట్ రూము లు సైతం అందుబాటులోకి వస్తే ఆదా యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఆదాయం లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తోందని దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమస్త సౌకర్యాలతో... ఇప్పటికే ప్రతి షాపు వద్ద ఒక పర్మిట్ రూమును అనధికారికంగా తెరిచేశారు. అది కూడా ఏదో చిన్న గది అనుకుంటే పొరపాటే. సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మరీ ఏర్పాటు చేశారు. మందుబాబులు కూర్చుని తాగేందుకు కుర్చీలు, టేబుళ్లు, వేశారు. వర్షం, ఎండా పడకుండా విశాలమైన షెడ్లు వేసి బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్ల లోపల పెద్ద ఫ్లడ్లైట్లు వేసి మరీ మందు అందజేస్తున్నారు. మంచింగ్ కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను అక్కడే ఉంచుతున్నారు. ఎంత సేపైనా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తుండడంతో మద్యం ప్రియులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే తప్ప తాగి తూలుతున్నారు. -
కదులుతున్న రైలు ఎక్కబోయి యువకుడి దుర్మరణం
జమ్మలమడుగు : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు(18) దుర్మరణం చెందాడు. ఆదివారం రాత్రి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో ముంబై–ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో అందులో ఎక్కబోయి ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో మృతి చెందినట్లు. కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. యువకుడి వివరాలు తెలియలేదన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం అట్లూరు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పనులను కేంద్ర పరిశీలక బృందం సభ్యుడు దయానందరెడ్డి పరిశీలించారు. తొలుత వరికుంట పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరిగిన తీరును ఆరా తీశారు. అలాగే తంబళ్లగొంది పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన 5 పనులను, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ఆనంద్, ఏఓ భాస్కర్రావు, ఏపీఓ జయచంద్రబాబు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన తుడిమెల ప్రశాంత్ (22) సోమవారం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ తెలిపారు. ఈ యువకుడు బాల్యం నుంచి చక్కెర వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండేవాడు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధి వచ్చిందని మనస్తాపం చెంది శనివారం విష ద్రావణం తాగాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చియ్యపాడులో కూలిన చౌడు మిద్దెచాపాడు : మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వీఆర్ఏ (గ్రామ సేవకుడు)గా పని చేస్తున్న మండ్ల సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం అందరూ చూస్తుండగా సిద్దయ్యకు చెందిన చౌడు మిద్దె పై కప్పు కూలిపోయింది. రెండు రోజుల క్రితమే సిద్దయ్య బంధువుల ఇంటికి వెళ్లడంతో మిద్దె కూలిన సమయంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది. మిద్దె కూలి పోవడంతో తాను కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కుక్క అడ్డు రావడంతో.. బ్రహ్మంగారిమఠం : బి.మఠంలోని గురుకుల పాఠశాల వద్ద సోమవారం సాయంత్రం సోమిరెడ్డిపల్లెకు చెందిన బొమ్ము రామమోహన్రెడ్డి అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రామమోహన్రెడ్డి బి.మఠం నుంచి మైదుకూరుకు బైకుపై వెళ్తుండగా గురుకుల పాఠశాల సమీపంలో కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ కుక్కకు తగిలి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం తిరుమల : వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఆర్ అసోసియేట్స్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు. ఈమేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు. -
సీఎంఓ డైరెక్షన్లో పులివెందుల ఎన్నిక
కడప సెవెన్రోడ్స్ : ముఖ్యమంత్రి కార్యాలయ డైరెక్షన్లోనే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, అధికార దుర్వినియోగం, దౌర్జన్యా లు, రిగ్గింగ్లతో గెలవాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. సీఎంఓ డైరెక్షన్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పనిచేస్తున్నారన్నారు. సోమవారం సాయంత్రం కడపలోని తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం 10,601 ఓట్లు ఉన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే, ఎస్పీ ఎర్రచందనంపై ప్రెస్మీట్ నిర్వహించడం, డీఐజీ పత్తి వ్యాపారం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డిపల్లె గ్రామంలో, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఎర్రబల్లి గ్రామంలో తిష్టవేసి చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే మనుషులను తరలించారన్నారు. స్లిప్పులు ఓటర్లకు పంపిణీ చేయకుండా అధికారులు టీడీపీ వారికి ఇస్తున్నారని విమర్శించారు. ఆ స్లిప్పులు తీసుకుని బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేయనున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు అభ్యంతరం చెప్పే ఏజెంట్లను లేకుండా చేశారన్నారు. మగవాళ్లందరికీ బైండోవర్ కేసులు బనాయించారని, రైతులను తోటల వద్దకు కూడా వెళ్లనీయడం లేదన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలా నాలుగు వేల ఓట్లు రిగ్గింగ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 100 కోట్లు అధికార పార్టీ ఖర్చుచేసేందుకు సిద్దమైందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం ద్వారా ఓటర్ల మనస్సు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాల్సింది పోయి విచ్చలవిడి దౌర్జన్యకాండకు దిగడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. పులివెందులలో గెలిచామని చెప్పుకునేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా ఎన్నికల్లో అక్రమాలు జరగలేదన్నారు. తాము కూడా ఇలా అనుకుని ఉంటే టీడీపీ వారు తిరిగే వారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీరెడ్డి వాట్సాప్ కాల్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ఎన్నికలు పోలీసు వ్యవస్థకు కూడా సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, నాయకులు పులి సునీల్కుమార్, నిరంజన్రెడ్డి, షఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దౌర్జన్యాలు, రిగ్గింగ్తో గెలిచేందుకు యత్నాలు స్లిప్పులు ఓటర్లకు కాకుండా టీడీపీ వారికి పంపిణీ బయట వ్యక్తులతో ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
జావెలిన్ త్రో స్టేట్ ఫస్ట్ సూఫియాన్
కమలాపురం : కమలాపురం దర్గా వీధికి చెందిన ఎస్. సూఫియాన్ కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. కడపలోని డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సూఫియాన్ బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 36వ ఏపీ స్టేట్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–14 కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. కాగా స్పోర్ట్స్ స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ను, అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోచ్ వెంకటేశ్వర్లును ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. జావెలిన్త్రోలో ప్రథమ స్థానంలో నిలిచిన సూఫియాన్ -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ప్రొద్దుటూరు : పోలీసులు – టీడీపీ నేతలు కలసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా.. దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేకునేందుకు వ్యూహాన్ని రచించారన్నారు. తొలి నుంచి పులివెందుల ప్రాంత వాసులను రౌడీలుగా, గుండాలుగా, రాక్షసులుగా, ఆటవికులుగా చూపి మాట్లాడిన టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చారన్నారు. పులివెందులకు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఆ కాలేజీలో సీట్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేశారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జగన్మోహన్రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజల చేతికి ఓటు ఇస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలే జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడపతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అనుచరులను పిలిపించి గ్రామాల్లో తిష్ట వేయించారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకంటే ముందుగానే వారు గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఒక్కో పోలింగ్ బూత్కు ఒక్కో నియోజకవర్గ ఎమ్మెల్యేలను టీడీపీ నియమించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాదులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే పులివెందులలోని జగన్ ఇంటి వద్దకు చేరుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడి పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. లాఠీ చార్జీలకు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెంట ఉంటూ సంఘటితంగా ఉండాలని కోరారు. చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులందరిని పోలీసులు ఇళ్లకు పంపారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే టీడీపీ నాయకులు, గుండాలు పులివెందులకు మళ్లీ చేరుకున్నారని, ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ను పోలీసులకు ఇచ్చిందన్నారు. పోలీసులు పూర్తిగా టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కోడ్ చూపించిన వారికి గ్రామాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ముందుగానే గ్రామాల్లోకి చేరిన టీడీపీ నేతలు ఓటర్ల నుంచి స్లిప్లను సేకరించారన్నారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేసుకుంటే అడ్డుకోబోయే వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల పోలింగ్ కేంద్రాల్లో ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు తిష్ట ఒక్కో బూత్కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే నియామకం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ప్రొద్దుటూరు : పోలీసులు – టీడీపీ నేతలు కలసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా.. దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేకునేందుకు వ్యూహాన్ని రచించారన్నారు. తొలి నుంచి పులివెందుల ప్రాంత వాసులను రౌడీలుగా, గుండాలుగా, రాక్షసులుగా, ఆటవికులుగా చూపి మాట్లాడిన టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చారన్నారు. పులివెందులకు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే ఆ కాలేజీలో సీట్లు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేశారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జగన్మోహన్రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రజల చేతికి ఓటు ఇస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలే జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడపతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను, అనుచరులను పిలిపించి గ్రామాల్లో తిష్ట వేయించారన్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకంటే ముందుగానే వారు గొడవలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఒక్కో పోలింగ్ బూత్కు ఒక్కో నియోజకవర్గ ఎమ్మెల్యేలను టీడీపీ నియమించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించి ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాదులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే పులివెందులలోని జగన్ ఇంటి వద్దకు చేరుకోవాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడి పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. లాఠీ చార్జీలకు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెంట ఉంటూ సంఘటితంగా ఉండాలని కోరారు. చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులందరిని పోలీసులు ఇళ్లకు పంపారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచే టీడీపీ నాయకులు, గుండాలు పులివెందులకు మళ్లీ చేరుకున్నారని, ఇందుకోసం చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక కోడ్ను పోలీసులకు ఇచ్చిందన్నారు. పోలీసులు పూర్తిగా టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కోడ్ చూపించిన వారికి గ్రామాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారన్నారు. ముందుగానే గ్రామాల్లోకి చేరిన టీడీపీ నేతలు ఓటర్ల నుంచి స్లిప్లను సేకరించారన్నారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు వేసుకుంటే అడ్డుకోబోయే వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల పోలింగ్ కేంద్రాల్లో ఇతర నియోజకవర్గాల కార్యకర్తలు తిష్ట ఒక్కో బూత్కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే నియామకం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
స్వర్ణ దుకాణంలో చోరీ
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలోని మార్కెట్వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా స్వర్ణ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరే శనివారం కూడా వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఫోన్ రావడంతో దుకాణంలో ఉండే పిల్లలను చూస్తూ ఉండమని చెప్పి దుకాణం నుండి బయటికి వచ్చాడు. అప్పటికే కాపు కాసిన ఇద్దరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్లో పరారయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దుకాణ యజమాని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని క్లూస్టీం పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఆరా.. వైఎస్సార్సీపీ నాయకుడైన జబీవుల్లాకు చెందిన స్వర్ణ దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులతో ఫోన్లో మాట్లాడి నిందితులను గుర్తించి బాధితుడికి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్రామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీ అండ్ డీ ప్రదేశంలో బీ గ్రేడ్ బైరెటీస్ ఖనిజం
ఓబులవారిపల్లె : తక్కువ గ్రేడ్ ఖనిజమైన సి అండ్ డి గ్రేడ్ యాడ్లో విలువైన బి గ్రేడ్ ఖనిజం తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆదివారం పెద్దఎత్తున బయట ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగంపేట ఏపీఎండీసీలో ఖనిజం అమ్మకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. సి అండ్ డీ గ్రేడ్ 0.4 గ్రావిటీ కలిగి ఉండి రూ. 2200 టన్ను ధరతో ఏపీఎండీసీ విక్రయాలు చేస్తోంది. అయితే 1.2 గ్రావిటీ కల్గిన బి గ్రేడ్ ఖనిజం టన్ను ధర దాదాపు రూ. 6 వేలు ఉంది. గనుల నుండి వెలికి తీసిన బి గ్రేడ్ ఖనిజాన్ని కేటాయించిన స్థలంలో కాకుండా సి అండ్ డి గ్రేడ్ ఖనిజం ఉన్న యార్డుకు తరలించి సి అండ్ డి గ్రేడ్ ధరకు బి గ్రేడ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుని పోతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. శనివారం బి గ్రేడ్ ఖనిజాన్ని సి అండ్ డి యార్డులో తోలినట్లు గమనించిన సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఖనిజాన్ని పరిశీలించారు. ఈ విషయంపై సీపీఓ గోపినాథ్ను వివరణ కోరగా బైరెటీస్ ఖనిజాన్ని పరిశీలించామన్నారు. అనాలసిస్ చేసిన అనంతరం 0.7 గ్రావిటీ వచ్చిందని అది సి అండ్ డి గ్రేడ్ ఖనిజమే అని నిర్ధారించినట్లు తెలిపారు.కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వైనం -
‘విద్యాదీపం’ సినిమా షూటింగ్ ప్రారంభం
కాశినాయన : మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన ముత్తుముల లోకేష్ హీరోగా ‘విద్యాదీపం’ అనే సినిమా షూటింగ్ను ప్రారంభించారు. శనివారం రాత్రి ఉప్పలూరులోని శ్రీఅభయాంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో షూటింగ్ చేశారు. హీరో లోకేష్, హీరోయిన్ సావిత్రికృష్ణలపై ఎంఈఓ నిర్మల క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి పిల్లి రమణారెడ్డి, సంఘ సేవకుడు బీఎస్ నారాయణరెడ్డితోపాటు 40 మంది సినిమా యూనిట్ సభ్యులు, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.ఎలుగుబంటి దాడిపోరుమామిళ్ల : మండలంలోని ఎరసాలకు చెందిన బాయకట్టు నాగరాజు ఆదివారం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఊరికి సమీపంలోని కొండలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. కొండపొలంలో గొర్రెలు మేస్తుండగా పిల్లలున్న ఎలుగుబంటి నాగరాజుపై దాడి చేసింది. హఠాత్తుగా వచ్చిన ఎలుగుబంటిని చూసిన నాగరాజు పెద్దగా కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దగ్గరలో ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో ఎలుగుబంటి పిల్లలతో పారిపోయింది. ముఖానికి, చేతులకు బాగా గాయాలవడంతో నాగరాజును పోరుమామిళ్లలో ప్రథమ చికిత్స అనంతరం కడపకు తరలించారు.గోడపై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలుమదనపల్లె రూరల్ : ఇంటి గోడపై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రెడ్డెమ్మ ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వగా, ఆ వైరు కిందకు వేలాడుతుండటంతో, ఇంటిగోడ పైకి ఎక్కి సరిచేసే క్రమంలో అదుపుతప్పి కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.రైలు కింద పడి ఆత్మహత్యరైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ మధ్యలో ఆర్.రాచపల్లి రైల్వేగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వృద్ధుడు(60) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. -
పిడుగుపాటుతో విద్యుత్ సామగ్రి దగ్ధం
అట్లూరు : ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పాటుకు మండల పరిధిలోని వళసపాళెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామస్తుల వివరాల మేరకు శనివారం రాత్రి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో విస్తారంగా వర్షం కురిసింది. అయితే అదే తరుణంలో భయంకరమైన మెరుపుతో గ్రామంలోని చిట్టెం వెంకటసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మల ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో వెంకటసుబ్బారెడ్డి బద్వేలులో వివాహ కార్యక్రమానికి వెళ్లారు. ఆయన భార్య రామసుబ్బమ్మ కూడా గ్రామంలోని రామాలయంలో భజన కార్యక్రమంలో ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. వారి ఇంటిలోని విద్యుత్ పరికరాలు, ఫ్రిజ్, తాగు నీటి మోటారుకు సంబంధించిన స్టార్టర్ పూర్తిగా కాలిపోయాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వీధిలైట్లు సైతం పగిలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. -
జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు
కడప అర్బన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా విధులను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో మీడియాకు వివరాలను తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో ఉప ఎన్నికకు 650 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారన్నారు. ఇప్పటివరకు పులివెందులలో 500 మందిపై, ఒంటిమిట్టలో 650 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడిందన్నారు. స్థానికేతరులు ఆయా ప్రాంతాలలో వుండకూడదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచుతామన్నారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 1400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విధులు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ వెల్లడి -
పెన్నానదికి నీరు విడుదల బంద్
జమ్మలమడుగు : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి అధికారులు నీటి విడుదలను ఆపేశారు. శనివారం నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో కొన్ని గ్రామాలకు సంబంధించిన రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా వేపరాల–జమ్మలమడుగు రహదారిపై రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో పాటు రోడ్డు కొట్టుకునిపోయింది. అదేవిధంగా ఎర్రగుంట్ల మండలంలోని థర్మల్ , ముద్దనూరుకు వెళ్లే పెన్నానది రహదారి నీటి పెరుగుదల వల్ల రోడ్డు కోసుకుపోవడంతో ఈ ప్రాంతంలో కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదివారం ఉదయం పెన్నానదిలో ముగ్గురు భక్తులు కన్యతీర్థం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో వాహనం పెన్నానదిలో చిక్కుకోవడంతో బాధితులను బయటికి తీయడం కోసం నీటిని బంద్ చేశారు. మైలవరంలో పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం.. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. ప్రస్తుతం జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా రోజుకు 13 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టులోనికి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం గండికోటలో 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని పూర్తి నీటి సామర్థ్యం 26 టీఎంసీలు. ప్రస్తుతం కృష్ణా జలాలు వస్తున్న నీటితో చిత్రావతి, వామికొండ, సర్వరాయసాగర్, మైలవరలం జలాశయంలో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సోమశిల ప్రాజెక్టులోనికి సైతం కృష్ణా జలాలు పెన్నానది ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 5.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో గండికోట నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీరు మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వదిలేయాలి. దీంతో గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు గండికోట నుంచి వదిలే నీటిని బంద్ చేశారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి నీటిని అధికారులు విడుదల చేస్తే గండికోట నుంచి మైలవరం జలాశయం లోనికి నీటిని విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయం పూర్తి సామర్థ్యంతో ఉండటంతో వచ్చే నీరు దిగువకు వదలాల్సి ఉంది. ప్రస్తుతం బంద్ కావడంతోనే గండికోట నుంచి నీటిని బంద్ చేసినట్లు గండికోట, మైలవరం ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు -
చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
పోరుమామిళ్ల : కలసపాడు మండలం గంగాయపల్లెలో ఈనెల 7న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ముట్టే నరేంద్ర( 20) అలియాస్ జగన్ను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నరేంద్ర జులాయిగా తిరిగేవాడన్నారు. మద్యానికి బానిసయ్యాడని, తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టేవాడన్నారు. సెల్ఫోన్లో అసభ్య వీడియోల ప్రభావంతో పథకం ప్రకారం చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పెడతామన్నారు. సమావేశంలో కలసపాడు, పోరుమామిళ్ల ఎస్ఐలు తిమోతి, కొండారెడ్డి పాల్గొన్నారు. -
పెన్నానదిలో చిక్కుకున్న వృద్ధ దంపతులు
ప్రొద్దుటూరు క్రైం : పెన్నానదిలో చిక్కుకున్న ఇరువురు వృద్ధులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రేగుళ్లపల్లె గ్రామానికి చెందిన గండి చిన్న సుబ్బరాయుడు, ఆయన భార్య నారాయణమ్మలు ఆదివారం పెన్నానదిలోకి వెళ్లా రు. అయితే పెన్నా నదికి మైలవరం నీరు వదలడంతో నీటి ప్రవాహం ఒక్క సారిగా పెరిగింది. దీంతో వృద్ధ దంపతులు నీళ్లలో చిక్కుకున్నారు. వారిని స్థా నికులు గుర్తించి డయల్ 100కు ఫోన్ చేశారు. రూ రల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు. బోటు ద్వారా నీళ్లలోకి వెళ్లి వృద్ధులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.సురక్షితంగా కాపాడిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది -
కూలిన మట్టి మిద్దె
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. తిరువెంగళాపురం ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోగు బాలకృష్ణ కొన్నేళ్లుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిలోని ఓ గది పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండటంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం కడప అర్బన్ : కడప నగరం బిల్డప్ సర్కిల్ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ కింద పడి దొరబోయిన సుదర్శన్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై కడప ట్రాఫిక్ సీఐ జావీద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నూరు మండలం కొక్కిరాయపల్లె గ్రామానికి చెందిన దొరబోయిన సుదర్శన్ (21) ఐటీఐ చదువుకుంటున్నాడు. అతని అన్న కడప కార్పొరేషన్కు సంబంధించి చెత్త సేకరించేందుకు తమ ట్రాక్టరు బాడుగకు ఇచ్చాడు. ఆదివారం కావడంతో సుదర్శన్ కూడా ట్రాక్టరుతోపాటు వచ్చాడు. విజయదుర్గాదేవి ఆలయం నుంచి బిల్టప్ మార్గమధ్యంలోకి రాగానే బర్రె అడ్డు రావడంతో ట్రాక్టరు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టరులో ఉన్న సుదర్శన్ జారి అదే ట్రాక్టరు క్రింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. త్రుటిలో తప్పిన ప్రమాదంచిన్నమండెం : పవిత్ర పుణ్య క్షేత్రం గండి నుంచి మదనపల్లెకు వెళ్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మదనపల్లెకు చెందిన ప్రయాణిలు గండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు -
వైఎస్సార్సీపీ విజయం తథ్యం
ఒంటిమిట్ట(రాజంపేట): జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచార చివరిరోజు ఆదివారం ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది.ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా కొనసాగిన ర్యాలీకి విశేషస్పందన లభించింది. రాములోరి కల్యాణవేదిక ప్రాంతం నుంచి కొనసాగిన ర్యాలీలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు,వివిధ ప్రాంతాల రైతులు, యువకులు, విద్యార్థులు, ముస్లీంమైనార్టీలు, దళితులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్ జగన్ అడ్డా అన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు పన్నినా, కేబినెట్ కదిలివచ్చినా చేసేదేమి ఉండదని, ఓటమి చవిచూడటం తప్ప అన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూటమి కుట్రలను ఒంటిమిట్ట వాసులే ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారన్నారు. ఎన్నికలకోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా ఒంటిమిట్టలో కొనసాగిందని ఉన్నతాధికారులకు తెలిసినా అడ్డుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలే అండగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిచారు. ● ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజద్బాషా, కొరముట్ల, కడప జెడ్పీచైర్మన్ రామగోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో భారీ ప్రచార ర్యాలీ -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12వ తేది జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆదివారం ఎస్పీ ఈజీ అశోక్కుమార్తో కలిసి కలెక్టరేట్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసేంతవరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికంతా పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించిన తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, రెండవ విడత సోమవారం నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వీటిలో సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెబ్కాస్టింగ్కు అవకాశం లేనిచోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. ప్రచారం ఆదివారం సా యంత్రం 5 గంటలకు ముగిసిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలన్నారు. లేనిపక్షంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకా మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలతో కూడిన పలు వినతులు రాగా, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఓటర్ల కోసం బస్సులు, ఆటోలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండే ఓటర్లు వీటిని సద్వినియోగం చేసుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే హెల్ప్డెస్క్, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, వి.కొత్తపల్లె ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చడం పట్ల వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, వివరాలను తొలుత ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించామని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వల్ల వీటిని ఖరారు చేశామన్నారు. ఈనెల 14వ తేది కడప సమీపంలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కట్టుదిట్టమైన భద్రత – ఎస్పీ పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. సీసీ కెమెరాలతోపాటు రూట్ మొబైల్స్, స్టైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 13 జిల్లా సరిహద్దు చెక్పోస్టులతోపాటు పులివెందుల, ఒంటిమిట్ట పరిసరాల్లోని 15 చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. పెట్రోలింగ్ పార్టీలు, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు రెండు అత్యాధునిక డ్రోన్స్ వినియోగిస్తున్నామని వివరించారు. రిటర్నింగ్ అదికారి ఓబులమ్మ పాల్గొన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు ఓటర్ల సౌలభ్యం కోసం బస్సులు, ఆటోలు ఏర్పాటు కలెక్టర్ శ్రీధర్,ఎస్పీ అశోక్కుమార్ -
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఆదివారం మోట్నూతలపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నదని, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కొడుకు హేమంత్రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ బరిలోకి దించిందన్నారు. సాధారణంగా ఈ ఎన్నికను సానుభూతికి వదిలేస్తారన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డి లాంటి జిమ్మిక్కులు చేసే వ్యక్తులకు తోడు చంద్రబాబు, లోకేష్ పోటీకి వ చ్చారన్నారు. పోటీ చేయడం తప్పేమి లేదు గానీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం, కొంతమందిని ఆర్థికంగా ప్రలోభాలతో మభ్య పెట్టడం దారుణమన్నారు. దీంతో పాటు భౌతిక దాడులకు దిగడం అరాచకానికి పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపైనే రివర్స్గా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు పెట్టించడం అన్యామన్నారు. ఇలా దుర్మార్గమైన పరిస్థితులలో ఎలెక్షన్లు జరుగుతున్నాయన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల మార్పుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఓటు వేయడానికి ఓటర్లు రాకుండా కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది తప్పుడు విధానమన్నారు. లోకేష్ ఆది నారాయణరెడ్డి ట్రాప్లో పడ్డారని, ఆదినారాయణరెడ్డి లేనిపోని అబద్దాలు మా ట్లాడుతూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పి.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్లు పులివెందులను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
సహకార సంఘాలకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని 30 సహకార సంఘాలకు ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక చైర్మన్తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణంగా ఎన్నికలను నిర్వహించి ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకుండా సొసైటీలో సభ్యత్వం ఉన్న వారిలోనే ఒకరిని చెర్మెన్గా మరో ఇద్దరిని కమిటీ మెంబర్స్గా ఎంపిక చేయడం గమనార్హం. జిల్లా స్కౌట్ రోవర్కు ‘నేషనల్ లీడర్‘ పురస్కారం కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ కడప జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు చెందిన స్కౌట్ రోవర్ సగినాల అహమ్మద్ ‘నేషనల్ కంటింజెంట్ లీడర్ అవార్డు‘ సాధించారు. ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూరు (సదరన్ రైల్వే)లో నేషనల్ రోవర్/ రేంజర్ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రేంజర్లు, రోవర్లు హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి పులివెందులకు చెందిన సగినాల అహమ్మద్ పాల్గొని వివిధ అంశాల్లో చక్కటి ప్రతిభను కనబరచటంతో పాటు ఓవరాల్గా ‘స్టేట్ బెస్ట్ కంటింజెంట్ లీడర్‘ అవార్డుకు ఎంపికయ్యాడు. జిల్లాకు చెందిన స్కౌట్ జాతీయస్థాయిలో కంటింజెంట్ లీడర్ అవార్డును అందుకోవడంపై జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్ఏ–1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ఎఫ్ఏ– 1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని దీంతోపాటు ప్రతి విద్యార్థికి అసెస్మెంట్ బుక్లెట్ అందాలని పాఠ్యపుస్తకాల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాము ఆదేశించారు. ఆదివారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కడప నగరంలోని సీఎస్ఐ పాఠశాలలో గల డీసిఈబీ హాల్ను, వల్లూరు మండల వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి తరగతి వారీగా సబ్జెక్టు వారీగా అసెస్మెంట్ బుక్కును తప్పనిసరిగా అందించా లని సూచించారు. అసెస్మెంట్ బుక్లో ఆగస్టు, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు అసెస్మెంట్ బుక్స్ను భద్రంగా ఉంచుకొని తర్వాత పరీక్షలకు ఇందులో నిర్వహించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ విజ య భాస్కర్ రెడ్డి, కడప మండల విద్యాశాఖ – 2 షేక్ ఇర్షాద్ అహ్మద్, ఉమ్మడి జిల్లా బుక్స్ గోడౌన్ మేనేజర్ రామాంజనేయమ్మ , జిల్లా బుక్స్ గోడౌన్ సిబ్బంది నరేష్, అనిల్, కడప సీఆర్ఎంటిలు పాల్గొన్నారు. జిల్లాలో జోరు వర్షం కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి, ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, ముద్దనూరు మినహా మిగతా 32 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో పెండ్లిమర్రిలో అత్యధికంగా 69.6 వర్షం నమెదుకాగా అత్యల్పంగా వీఎన్పల్లిలో 1.4 మి.మీ వర్షం నమోదైంది. -
● దౌర్జన్యం...రౌడీయిజం
సాక్షి ప్రతినిధి, కడప: సరిగ్గా 8 ఏళ్ల క్రితం జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేతగా.. సీఎంగా చంద్రబాబు లెక్కలేనన్ని కుట్రలు పన్నారు. వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కారు. మోసపు హామీలెన్నో ఇచ్చారు. ఓటర్లకు తాయిలాల ఆశ చూపెట్టారు... వినకుంటే బెదిరించారు. తాజా గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే ఫార్మూలాను అమలు చేస్తున్నారు. వందలాది మందికి ఉద్యోగ జాయినింగ్ లెటర్లు ఇస్తున్నారు. వేలాది మందికి ఏవేవో ఆఫర్లు ఇస్తున్నారు. అయినప్పటీకీ ఇవేవి పనిచేసేలా లేవని ఏకపక్ష పోలింగ్ కోసం చేపట్టాల్సిన చర్యలన్నీ ఎంచుకున్నారు. అదీ కూడా కుదరదంటే ఏకంగా బ్యాలెట్ బాక్సులే మారుస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు. ఓటర్లకు ఆశల ఎర.. పులివెందుల జెడ్పీటీసీ సీటు ఇవ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ .. టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉద్యోగం కావాలా? జాయినింగ్ లెటర్ రెడీ ఎన్నికల తర్వాత మీ బిడ్డల్ని ఉద్యోగంలో చేర్పించండి. లేదు డబ్బులు కావాలా? గుంప గుత్తగా ఎంతో చెప్పండి ఇస్తాం. అలా కాదంటారా...ఓటుకు వెళ్లొద్దు ఇదో ఇది ఉంచుకోండి. ఇంకా కాదు కూడదంటే బడితె పూజ తప్పదు.. ఇలా పులివెందులలో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో బరి తెగిస్తున్నారు. కుదిరితే ప్రలోభాలతో.. కాదంటే బెదిరింపులతో ముందుకు సాగుతున్నారు. వ్యవస్థల అండతో గెలుపే లక్ష్యంగా... వైఎస్సార్సీపీకి చెందిన క్రియాశీలక నేతలందర్నీ కట్టడి చేసే ఎత్తుగడను టీడీపీ ఎంచుకుంది. అందుకు వ్యవస్థలు అనుకూలంగా నిలుస్తున్నాయి. పోలింగ్ జనరల్ ఏజెంటు కూడా క్రియాశీలక నేతకు ఇవ్వకూడదనే దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి పోలింగ్ జనరల్ ఏజెంటుగా నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డిని నియమించాల్సిందిగా అభ్యర్థించారు. ఆమేరకు అనెగ్జర్–15, ఫారం–11కు ఒరిజనల్ ఆధార్, ఓటరు కార్డు జత చేశారు. శనివారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టుకున్నారు. దీనికి కూడా టీడీపీ నేతల నుంచి క్లియరెన్సు వస్తే తప్ప ఇవ్వమనే దిశగా అధికారులు బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు, వ్యవస్థలు అండతో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. వరుస హత్యాయత్నం ఘటనలతో ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న నేపఽథ్యంలో టీడీపీ కేవలం వ్యవస్థల ఆధారంగా పోలింగ్ నిర్వహించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల ఎన్నికల వేళ.. బాబు మాటలు.. తాయిలాలు! ‘మీరు మాకే ఓటు వేయాలి.. గెలిస్తేనే ఇళ్లు కడతాం..’ కొత్తగా 10 వేల పెన్షన్లు కేటాయింపు.. ముస్లీం మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని మహిళకు కుట్టు మిషన్ల పంపిణీ 40 వేల మంది డ్వాక్రా మహిళలు అకౌంట్లలో రూ.4 వేలు చొప్పున డబ్బులు జమ 20 మంది మంత్రులు అక్కడే ఉండి రూ.200కోట్లు ఖర్చు చేశారు. ‘నేనిచ్చిన పెన్షన్ తీసుకొంటూ, నేనిచ్చిన రేషన్ తింటూ నేను వేసిన రోడ్డు మీద తిరుగుతూ నాకు ఓటు వేయకపోతే నేను మాత్రం మీకు ఎందుకు ఇవ్వాలి’అని సీఎం హోదాలో చంద్రబాబు ఆ రోజు అమలు చేసిన ఫార్మూ లానే పులివెందులలోనూ ప్రయోగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కళ్లముందు కళకళలాడుతున్న అభివృద్ధి పులివెందులలో అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా అనేది అందరికీ తెలిసిందే. మరోవైపు టీడీపీకి పులివెందులలో నిర్థిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదు. అదే వైఎస్సార్సీపీకి కోకొల్లలు. విద్యారంగంలో జేఎన్టీయూ, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నాడు–నేడు స్కూల్స్, ఫుడ్ సైన్స్ కాలేజి ఏర్పాటును గుర్తు చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో వైఎస్సార్ మెడికల్ కళాశాల, నర్శింగ్ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐల్, ఆదిత్య బిర్లా ఫ్యాష న్స్, గోవిందరాజా టెక్స్టైల్స్, వ్యవసాయ రంగంలో చీని మార్కెట్ యార్డ్, బనానా రీసెర్చ్ సెంటర్, వాటర్ ఇరిగేషన్ ఐజిసీఏఆర్ఎల్ (ఐజీ కార్ల్), డాక్టర్ వైస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ విస్తరింపు.. ఇలా ఎన్నో..ఎన్నెన్నో. ఇక నీటివనరుల గురించి చెప్పుకుంటే గండికోట, మైలవరం ఆధునికీకరణ, పైడిపాలెం, చిత్రావతి విస్తరణ, చిత్రావతి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాలే తమ అభివృద్ధిని వివరిస్తాయి. రోడ్లు–భవనాలు గురించి బెంగుళూరు – విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్స్, విలేజ్ కనెక్టివిటీ రోడ్స్, సచివాలయాలు, వరల్డ్ క్లాస్ ఆర్టీసీ బస్టాండ్, క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్, ఉలిమెల్ల లేక్వ్యూ, రాణి తోపు చెప్పకనే చెబుతాయి. వెల్ఫేర్ ఆక్టివిటీస్, 20వేల జగనన్న ఇల్లు ఇలా.. అభివృద్ధి పనుల గురించి ఓటర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి చేశామనే స్థితిలో టీడీపీ లేదు. దీంతోనే ఆ పార్టీ వక్రమార్గాలు ఎంచుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అభివృద్ధి చేయకపోగా.. వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకున్న నీచపు నైజం టీడీపీది.. ఆపార్టీ అధినేతది. రూ.530కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాలలో మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు కూడా వద్దని చెప్పిన నేపధ్యం. ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం చెప్పుకునేందుకు ఏమి లేకపోవడంతోనే రౌడీయిజం చేస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓటర్లు ఓటుకు వెళితే వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుపై పడుతుందనే నమ్మకంతోనే పోలింగ్ కూడా ఏకపక్షంగా చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు వ్యవస్థలను సమర్థవంతంగా వాడుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. నంద్యాల తరహాలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక! వ్యవస్థలు అడ్డుపెట్టుకుని అడ్డదారులు. మోసపు హామీలు.. ఇప్పుడూ అంతే! ఎలాగైనా గెలవాలంటూకేడర్కు బాబు దిశా–నిర్దేశం క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న తెలుగుతమ్ముళ్లు -
విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్/రూరల్ : రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేసి తక్షణమే విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విద్యా హక్కు చట్టం అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి బీసీ, ప్రజా, విద్యార్థి సంఘాలు అనుమతి లేకుండా ప్రవేశించరాదని జీఓ జారీ చేయడం దారుణమన్నారు. ఈ జీఓ కారణంగా ఆయా విద్యా సంస్థల యాజమన్యాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు చైతన్యవంతులై తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడెం రెడ్డిబాబు పిలుపునిచ్చారు. శనివారం కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్, ఉపాధ్యక్షులుగా మణికుమార్, వివేకానంద, ప్రధాన కార్యదర్శిగా సునీల్, కార్యదర్శిగా నరసింహులుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముదిరాజ్లను ప్రస్తుతం ఉన్న బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మార్చి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ముదిరాజ్ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గండి క్షేత్రం.. జనసంద్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసి పోయింది. శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లు భక్తులతో రద్దీగా మారాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపుల పాయ క్రాస్ల వద్దనే వాహణా లను నిలిపి వేశారు. వృద్ధులు, మహిళల కోసం వేంపల్లె ప్రైవేట్ పాఠశాలల వారు ఉచితంగా వ్యాన్లు ఏర్పాటు చేశారు. కొందరు వేంపల్లె చక్రాయపేట,నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సహాయకమీషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కేవ్యాలీ ఎస్సై రంగారావు ఆద్వర్యంలో సుమారు 200 మంది పోలీ సులు బందో బస్తు నిర్వహించారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, అర్చకులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఏర్పాట్లలో విఫలం.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ తగు ఏర్పాట్లు చేయడంలో అదికారులు విఫలమయ్యారు. క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ వర్గాలకు సంబంధించి వచ్చిన బంధుమిత్రులకే ఇక్కడ రాచ బాటలు ఉన్నాయని విధులకు వచ్చిన వారికి అవమానాలే దక్కుతున్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు -
ఎస్సీకి రాఖీ కట్టిన ఓం శాంతి అక్కయ్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్కు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శాంతి సాధనకు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సంస్థ ప్రతినిధులు బ్రహ్మకుమారి గీతా అక్కయ్య, సుశీల అక్కయ్య, ఈశ్వరీ అక్కయ్య, ప్రదీప అక్కయ్య పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ కడప రూరల్ : జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ కడప నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వెస్ట్, పొల్యూషన్, ధరల పట్టిక, నీటి వసతి, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే అర్హత కలిగిన సిబ్బంది గురించి ఆరా తీశారు. నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కుమారి తదితరులు పాల్గొన్నారు. జూటూరు డిజిటల్లో ఆఫర్లు ప్రొద్దుటూరు : శ్రావణ మాసం పురస్కరించుకుని జూటూరు డిజిటల్ షోరూంలలో ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ యజమాని జూటూరు మధుసూదన్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం, ఆది వారం ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని జూటూరు డిజిటల్ షోరూంలలో డిస్కౌంట్ ధరలలో ఎలక్ట్రానిక్ పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, హోమ్, కిచెన్ అ ప్లైన్స్తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 50 శా తం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నట్టు తెలిపా రు. జీరో శాతంతో వడ్డీ రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ను ఇస్తున్నట్లు తెలిపారు. -
బ్రహ్మంసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి శనివారం తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈ వెంకటరామయ్య ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సాగర్లోకి 1350 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందన్నారు. రైతులు సాగు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, ఎస్సార్ శ్రీనివాసులరెడ్డి, జోగయ్య, నరసింహులు, సాంబశివారెడ్డి, నారాయణ యాదవ్, శివయ్య యాదవ్, డీఈఈ మురళీమోహన్, ఏఈఈ మద్దం నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం
చిన్నమండెం : ట్రాక్టర్ ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మజ్హీసింగ్(23), గలగసింగ్(20), లక్ష్మణ్సింగ్లు చిన్నమండెం–పెద్దమండ్యం జాతీయ రహదారిలో హైవోల్టేజీ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. పనులు ముగించుకొని ట్రాక్టర్లో చిన్నమండెంకు వస్తుండగా పడమటికోన గ్రామం తొగటపల్లె సమీపంలో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో మజ్హీసింగ్(23), గలగసింగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్సింగ్కు గాయాలయ్యాయి. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి సిద్దవటం : కడప రిమ్స్లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన పడిఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని కడప రిమ్స్లో చేర్పించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఒంటిమిట్ట సీఐ బాబు, 9121100581, సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ 9121100584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాదంలో గాయపడి.. కోలుకోలేక..ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాలు... స్థానిక మండల కేంద్రం ఇందిరా కాలనీకి చెందిన వెంకటరమణ, భార్య శాంతమ్మలు కలిసి గత గురువారం ద్విచక్రవాహనంలో పనుల మీద మదనపల్లెకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో వేపూరికోట వద్ద శాంతమ్మ చీర బైక్ చక్రానికి చుట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య గాలివీడు : మండలంలోని కొర్లకుంట పంచాయతీ పెద్దరెడ్డివారిపల్లెకు చెందిన నిర్జీ శంకరయ్య (38) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. మృతుడు రజక వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడంలో అప్పులు ఎక్కువ చేశాడు. వాటిని తీర్చుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో వివాహిత.. రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని సూర్య నగర్లో నివాసముంటున్న విద్యుత్ శాఖ ఏఈ యోగానంద్ భార్య చిన్న రెడ్డెమ్మ (40) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం
పులివెందుల/వేంపల్లె: పులివెందుల మండల జెడ్పీటీసీ మరోసారి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం పులివెందుల మండల పరిధిలోని నల్లగొండువారిపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి నల్లగొండువారిపల్లె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి పులివెందుల మండల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాల ని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆ గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. గ్రామంలో మహిళలు రక్షా బంధన్ సందర్భంగా ఎంపీని అన్నగా భావించి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అడుగడుగునా బాణా సంచా పేల్చుతూ గ్రామస్తులు స్వాగతం పలికారు. ప్రచారానికి విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు విశేష ఆదరణ లభించింది. మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అని చెప్పి అరకొర మందికి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ఒకేసారి రూ 20 వేలు ఇస్తామని చెప్పి మాట మార్చిందన్నారు. గ్రామ ప్రజలు ఏమన్నారంటే... ఎన్నికల ప్రచారంలో తమ ఊరిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పక్క గ్రామానికి తరలించారని ఎంపీ దృష్టికి పలువురు గ్రామస్తులు తీసుకొచ్చారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎక్కడ కూటమి నేతలు ఓడిపోతారేమోనని వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పోలింగ్ బూత్ ను తమ గ్రామంలోని ఏర్పాట్లు చేయించేటట్లు అధికారులతో మాట్లాడాలని కోరారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, దాడులను పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దుర్మార్గాలను చేస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి వచ్చేలా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఆ గ్రామ ప్రజలు భరో సా ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయ కులు నరసింహారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి,వైఎస్ మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ప్రచారం అడుగడుగునా స్వాగతంపలుకుతూ రాఖీలు కట్టిన మహిళలు -
బాబు మెప్పు కోసమే టీడీపీ నేతల కుట్రలు
పులివెందుల: ఎంతోమందికి వైఎస్సార్ కుటుంబం రాజకీయ బిక్ష పెట్టిందని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో మార్పు ప్రారంభమవుతుందని వైఎస్సార్సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మెప్పు పొందడం కోసం టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ‘తలకాయలు లేచిపోయేవి కదా’.. అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆలోచించాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నామని, రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం కోసమో...తెలుగుదేశం పార్టీ బాగుందనో ప్రజలను నమ్మించడానికి నానా పాట్లూ పడుతున్నారన్నారు. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మరిచిపోరన్నారు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడిందని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడాల్సిన టైం వచ్చిందని.. కచ్చితంగా బలంగా నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినదని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుస్తామని అవతలి వాళ్లకు అంత నమ్మకం ఉంటే శాంతియుత వాతావరణంలో సీసీ కెమెరాల నీడలో ఎన్నికలను నిర్వహించాలని అధికారులకు విన్నవించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి -
కడప– బద్వేలు మార్గంలో కూలిన వంతెన
సిద్దవటం : కడప– బద్వేలు మార్గంలోని అటవీ ప్రాంతంలో సాహెబ్ బావి రహదారికి సమీపంలో కిటికీల వంతెన శనివారం కూలిపోయంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ రహదారి గుండా నెల్లూరు, బద్వేలు కలువాయి, పోరుమామిళ్ల తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళుతుంటారు. 1983లో ఈ వంతెన నిర్మించారు. శనివారం అధిక లోడుతో వాహనాలు ప్రయాణించడంతో వంతెన కూలిపోయిందని ద్విచక్ర వాహనదారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి ప్రయాణికులు ఎవరినీ రోడ్డు దాటనీయకుండా చర్యలు చేపట్టారు. అధికారులు రెండు జేసీబీ యంత్రాలతో వంతెన పక్కనే అప్రోచ్ రోడ్డుకు చర్యలు చేపట్టారు. ఈ పనులను బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం సాయంత్రానికి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. -
ఆటోను ఢీకొన్న కారు
వేంపల్లె : మండలంలోని కత్తులూరు క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గండ్లూరు పుల్లయ్య (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు ఇచ్చిన వివరాల మేరకు.. మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన మెకానిక్ వలీ శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా గండి క్షేత్రానికి తన సొంత ఆటోలో కుటుంబ సమేతంగా బయలుదేరాడు. కత్తులూరు క్రాస్ వద్దకు ఆటో రాగానే రాజంపేటకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కారులో పులివెందుల నుంచి రాజంపేటకు వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. దీంతో ఆటో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు కింద పడ్డారు. గండ్లూరు పుల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే డ్రైవింగ్ చేస్తున్న వలీ, చిన్నారులైన సయాన్, మెహిరున్, వలిమాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ సంఘటనను చూసిన స్థానికులు 108 వాహనం ద్వారా హుటాహుటిన వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన సయాన్, మెహిరున్, వలిమాలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో గండ్లూరు పుల్లయ్య మృతి చెందడంతో వేంపల్లె ప్రభుత్వాసుపత్రి వద్దకు టి.వెలమవారిపల్లె ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు -
ఏపీకే ఫైల్.. బీ కేర్ ఫుల్ !
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఏపీకే (అండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్స్) ద్వారా ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. మోసం చేసే విధానం.. ● నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్ట్రాగామ్ ద్వారా ఒక లింక్ పంపుతారు. ● డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, ఎస్బీఐ, రివార్డ్స్ అప్డేట్, ఫ్రీ గిఫ్ట్, అర్జెంట్ డాక్యుమెంట్, ఈ–చలానా, పీఎం కిసాన్ వంటి పేర్లు గల లింక్తో వినియోగదారులను ఆకర్షిస్తారు. ● ఆ లింక్ ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడు దాన్ని యాప్ అనుకుని ఇన్స్టాల్ చేస్తాడు. ● ఆ యాప్ పర్మిషన్స్ (అనుమతులు) అడుగుతుంది. ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాక్స్, స్టోరేజ్, నోటిఫికేషన్స్, అసెస్బులిటీ తదితరాలు అనుమతులు ఇచ్చిన వెంటనే ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది. ● ఫోన్లోని ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది. ● కొన్నిసార్లు యూపీఐ యాప్లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాలోని డబ్బును దొంగిలిస్తారు. ● అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్మెయిల్కు కూడా ప్రయత్నిస్తున్నారు. అమాయకులే లక్ష్యం అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధులు, ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. ● ప్లే స్టోర్ తప్ప మరో వేదికల నుంచి ఏ యాప్ను డౌన్లోడ్ చేయకండి. ● గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దు. ● ఫోన్లోని ప్రతి యాప్కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించాలి. ● బ్యాంక్ అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు. ● మీరు ఫోన్లో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్ను అన్ ఇన్స్టాల్ చేయండి. ● మొబైల్ను రీసెట్ చేసి ట్రస్ట్ చేసిన యాప్లను మాత్రమే తిరిగి ఇన్స్టాల్ చేయాలి. ● ఫోన్లో భద్రతాపరమైన భరోసా ఇచ్చే యాప్ (యాంటీ వైరస్/యాంటీ మాల్వర్) ఉపయోగించాలి ● బ్యాంకింగ్ అప్లికేషన్లలో బయోమెట్రిక్/2–ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలి. మోసానికి గురైతే.. ● తక్షణం 1930 నంబర్కు కాల్ చేయాలి (నేషనల్ సైబర్ హెల్ప్లైన్) ● డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సైబర్ క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. ● మీ దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ● ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహనతో ఉండాలి. నేటి మోసాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ● సైబర్ భద్రత జాగ్రత్తలు పాటించి మోసాల నుంచి దూరంగా ఉండాలి. ● ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ వాట్సాప్ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు. ● మీరు ఏపీకే ఫైల్స్ లింకును క్లిక్ చేసిన వెంటనే ఆ లింకు మీరు ఉన్న అన్ని గ్రూపులలో కూడా ఫార్వర్డ్ అవుతుంది. ● ఏపీకే ఫైల్స్ లింకులను క్లిక్ చేయకూడదని సూచిస్తున్నాం. ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ మోసాలు లింకులను క్లిక్, డౌన్లోడ్ చేస్తే వెంటనే వాట్సాప్ హ్యాక్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి -
ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్సీపీదే
ఒంటిమిట్ట: తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించేది వైఎస్సార్సీపీయేనని వైఎస్సార్సీపీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేశారు. .శనివారం మండల పరిధిలోని మంటపంపల్లి, రామచంద్రాపురం, అచ్చంపేట, ఎస్టీ కాలనీ, పెన్నపేరూరు గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి ఇరగంరెడ్డి సు బ్బారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట, పులివెందుల అభ్యర్థులను గెలిపించి, వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బహుమతిగా అందిస్తామన్నారు. ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని అన్నారు. ● వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ..పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారని, కేవలం 8 నెలలు ఉన్న ఈ పదవికి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. ● ఓటర్లను కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ..ముస్లిం, మైనారిటీలకు మేలు చేసింది ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ అన్నారు. ఇంతటి మేలు చేసిన వారికి మద్దతుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సుబ్బారెడ్డి ని గెలిపించాలని కోరారు. ● రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..కుప్పంలో గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం వైఎస్సార్సీపీ కై వసం చేసుకోవడంతో సీఎం చంద్రబాబు అవమానాన్ని భరించలేక వైఎస్ జగన్ ఇలాక అయిన కడప జిల్లాలో వైఎస్సార్సీపీ ని ఓడించి జగన్ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారన్నారు. ● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి మాట్లాడారు. -
ఆర్టీసీ స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్కు ఇవ్వడం తగదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : విజయవాడ నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ గవర్నరుపేట 1–2 డిపోలకు, పాత బస్టాండుకు సంబంధించిన నాలుగు వందల కోట్ల రూపాయల విలువ గల 4.15 ఎకరాల స్థలాన్ని లూలూ షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోసుబాబు, రామ్మూర్తి పేర్కొన్నారు. శనివారం కడపలోని అసోసియేషన్ జోనల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ రెండు డిపోలలో 200 బస్సులతో పాటు 1100 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తూ ఓ పారిశ్రామికవేత్తకు జీఓ నంబర్. 137 ద్వారా కట్టబెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. గవర్నరుపేట డిపోలకు 1, 2, పాత బస్టాండ్ స్థలాన్ని 1959లో గజం రూ. 16 చొప్పున సుమారు నాలుగు లక్షల ఆరు వేల రూపాయలకు ప్రభుత్వం కేటాయించిన రేటుకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఇలాంటి విలువైన స్థలాన్ని వ్యాపార వేత్తలకు ధారాదత్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యం.మల్లికార్జున, కడప డిపో అధ్యక్షుడు ఈ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ విల్సన్, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనుడు, పీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
కమలాపురం : కమలాపురం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంనగర్కు చెందిన మునీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. మునీంద్ర క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి బైక్పై వస్తుండగా ఆర్చి వద్ద వేగ నిరోధక హెచ్చరిక బోర్డును ఢీ కొన్నాడు. ఈ ఘటనలో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉత్సాహంగా క్రీడల పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : 2025 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నగరంలోని క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ, వెయిట్ లిప్టింగ్ పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు, డీఎస్ఎ క్రీడా మైదానంలో బాస్కెట్బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించగా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన వారిని జట్టుగా ఏర్పాటుచేస్తామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
ఏకశిలానగరిలో వేడెక్కిన ప్రచారం
సాక్షి, రాయచోటి : కూటమి సర్కార్ జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అడ్డదారుల వైపు అడుగులు వేస్తోంది. సాధారణ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా మంత్రులు మకాం వేసి అధికార దుర్వినియోగం చేయడం ఇందుకు అ ద్దం పడుతోంది. ఎలాగైనా సరే గెలవాలనే సంకల్పంతో అవసరమైన అన్ని వనరులను ఉపయోగిస్తున్నా రు. అధికారంలో ఉండడంతో తాము ఓటమి పాలైతే సర్కార్ ప్రతిష్ట మంటగలుస్తుందనే ఆలోచనతో ఇతర పార్టీలవారిని భయపెట్టడమో.. ఆదుకుంటామని చెబుతూ పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఒంటిమిట్ట, పులివెందుల లాంటి కేంద్రాల్లో తిరుగులేని ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పటికే ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెపుపే లక్ష్యంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అడుగులు వేస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజల్లో పట్టున్న వారితో చర్చించడంతోపాటు ఓట్లు భారీగా పడేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరోపక్క ప్రచారంలో ప్రజలతో కలిసిపోయి... వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ఓటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వేయాలంటూనే ఎన్నికల ముందు హామీలిచ్చి తరువాత విస్మరించిన కూటమి సర్కార్ మోసాలను కూడా వివరిస్తున్నారు. టీడీపీ వేస్తున్న ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జోరుగా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా చింతరాజుపల్లెలో కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ప్రచారం నిర్వహించారు. అలాగే మృకుంద ఆశ్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప నగర మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, యువజన విభాగం నాయకులు దేవిరెడ్డి ఆదిత్యలు ప్రచారం చేశారు. కోదండరామనగర్, మంటపంపల్లి తదితర ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్కుమార్రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యంలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గంగపేరూరు పంచాయతీలోని చిన్నకొత్తపల్లెలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి తదితరులు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో సుబ్బారెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే ప్రజల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ సంపూర్ణమద్దతు లభిస్తోంది. ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఫరూక్ లతో పాటు పలువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా మంత్రులు పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతల ప్రచారం ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో పోలింగ్పై దృష్టి సారించిన పోలీసులు పోలింగ్ కేంద్రాల పరిశీలన ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఒంటిమిట్టతో పాటు మంటపంపల్లి, ఇతర అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్కుమార్, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎక్కడికక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలను కింది స్థాయి అధికారులను ఆదేశించారు. పులివెందుల : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసుల ఆరాచకాలు ఎక్కువయ్యాయని, ఒకే వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల మండలం కొత్తపల్లెలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో మేం లేకపోతే ప్రాణాలు తీసి ఉండేవారని స్వయానా డీఐజీ చెప్పడం చూస్తే.. దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతోందన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ అధికారులే మాట్లాడటం నీచమైన సంస్కృతి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా పోలీసు ఆరాచకాలే ఎక్కువయ్యాయని, ఒక వర్గాన్ని ప్రోత్సహించడం మంచి పద్దతి కాదన్నారు. ఏదీ ఏమైనా రెండు, మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డీఐజీ ఈ మెసేజ్ ఇవ్వడమనేది బాధాకరమైన విషయమన్నారు. కిందిస్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారి మెసేజ్ను బట్టి అలా చేయడం దారుణమన్నారు. గతంలో ఒక గ్రామంలో మూడు, నాలుగు ఇళ్లను ఓటు అడిగి వచ్చేవారని, క్రమేనా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని అడగాలనే సంస్కృతి వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు వైఎస్సార్ ఆశయాలు, వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఓటు వేస్తారన్నారు. -
గండి ఆంజన్న దర్శనానికి ఏర్పాట్లు
చక్రాయపేట : శ్రావణమాసంలో మూడో శనివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహా య కమిషనర్ వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలికృష్ణతేజ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేశామని తెలిపారు. రాత్రి బసచేసే వారి కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాతలు అన్నదానం చేస్తారన్నారు. వీఐపీ పాసులు పొందినవారు నిర్ణయించిన సమయంలో వస్తేనే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాలన్నారు. గత శనివారం జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, ఐదు గంటలకు మహామంగళ హారతి నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. స్వామి సన్నిధిలో తిరుపతి జిల్లా జడ్జి గండి వీరాంజనేయ స్వామిని శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనచే ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగనాయకులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ మూడో శనివారం కావడంతో పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. వాహనాలను గండిలోకి అనుమతించమని వారు తెలిపారు. -
మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం : గండికోట జలాశయం గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి ఐదువేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా 13 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపారు. శెట్టివారిపల్లె మొయిన్ రెగ్యులేటర్ నుంచి గాలేరి నగరి సృజల స్రవంతి కాల్వ ద్వారా వామికొండ రిజర్వాయర్కు 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా నాలుగు మోటర్లతో నీటిని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కమ్ముకొస్తున్న కరువు మేఘం
ఖరీప్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికీ సరైన వర్షం కురవకపోవడంఓత అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మేఘం కమ్ముకొస్తోంది. ఎటు చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. కేసీ కెనాల్ కింద మినహా చాలా ప్రాంతాల్లో అధిక శాతం బీడుగా దర్శనమిస్తున్నాయి. గతేడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టాలను చవిచూసిన జిల్లా రైతులు తాజాగా వరుణుడి కరుణలేక నష్టపోతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 77475 హెక్టార్ల సాధారణ సాగుకుగానూ 14,467 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇది కేవలం 18.67 శాతం మేర మాత్రమే. మరో 50 రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరవు పరిస్థితి తప్పదని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు కొంతమేర ఆశలు చిగురించినా ఏ మాత్రం పంటల సాగుపై ప్రభావం చూపడంలేదు. గత ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురియడంతో రైతులు అశలు పెట్టుకున్నారు. జూన్లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి వరుణుడు ముఖం చాటేయడం, జులైలోనూ సాధారణ వర్షపాతం 96.7 శాతం కాగా.. కేవలం 59.7 శాతం కురవడంతో ఆశలు నీరుగారిపోయాయి. ఆగస్టులో ఇప్పటి వరకూ 22.9మేర వర్షం కురిసింది. 18.67 శాతం భూముల్లోనే పంటల సాగు జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం 18.67 శాతం మేర వివిధ పంటలు సాగయ్యాయి. ఇంకా 80 శాతం భూములు బీడుగానే కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77474 హెక్టార్లు ఉంది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 14467.58 శాతం మేర పంటలు సాగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్థమవుతోంది. అడపాదడపా నీటివసతి లేని ఆరుతడి పంటలు ఎండుతున్నాయి. కేసీ కెనాల్ పరీవాహన ప్రాంతంలో 30,804 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 6098 హెక్టార్లలో వరిపంట సాగైది. జొన్న 29 హెక్టార్లు, సజ్జ 689 హెక్టార్లు, మొక్కజొన్న 1728 హెక్టార్లు, కొర్ర 11.6 హెక్టార్లలో సాగు చేశారు. ఇక వేరుశనగ 926, పత్తి 3185, మినుము 1388 హెక్టార్లలోనూ సాగు చేశారు. కంది విస్తీర్ణం బాగా తగ్గిపోయి 112 హెక్టార్లకే పరిమితమైంది. సోయాబీన్ 45 హెక్టార్లలో సాగైంది. ఇంకా వర్షాలు కురవకపోవడంతో తాము పంటలు వేసే పరిస్థితి లేదని.. ఈ ఏడాది కరవు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల సాధారణ నమోదైన వర్షపాతం వర్షపాతం (మి.మీలలో) (మి.మీలలో) జూన్ 68.2 21.6 జులై 96.7 59.7 ఆగస్టు 118.8 22.9(ఇప్పటికి) ఖరీప్ ప్రారంభమైనా 14,467 హెక్టార్లలోనే పంటల సాగు కేసీ కెనాల్ కింద కాసింత సాగు ముమ్మరం -
ఎన్నికల భగ్నానికి కూటమి నాయకుల యత్నం
కడప ఎడ్యుకేషన్ : ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన జెడ్పీటీసీ ఉప ఎన్నికను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు పోలింగ్ కేంద్రాల మార్పు చేయరాదని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ను శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు ఒక ఊరు నుంచి మరో ఊరికి పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడంతో ప్రజలు ఓటు వేసేందుకు రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. వారి కుట్రలేవీ పనిచేయవన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్సే రమేష్ యాదవ్, నాయకులు రామలింగారెడ్డిలపై కూటమి నాయకులు దాడిచేసి చేయి విరగ్గొట్టారన్నారు. ఇవన్నీ మనం సినిమాల్లోనే చూసేవారమని.. ఇప్పుడు రియల్గానే చూస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరగలేదా? అని ప్రశ్నించారు. 2024లో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఎక్కడా రీపోలింగ్ జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ప్రజలను బయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాలను మార్చడం చూస్తుంటే.. పరీక్షల సమయంలో జంబ్లిగ్ విధానం గుర్తుకు వస్తోందన్నారు. కేంద్రాలను మార్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాము గతంలో ఇలా చేసి ఉంటే నారా లోకేష్ ప్రజాగళం యాత్ర, పవన్ కళ్యాన్ వారాహి యాత్ర చేసేవారే కాదన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పులిసునీల్కుమార్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను భయాందోళనకుగురి చేస్తున్నారు ఓటింగ్ శాతం తగ్గించేందుకు పోలింగ్ కేంద్రాల మార్పు కలెక్టర్కు విన్నవించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
పులివెందుల/వేంపల్లె: ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి పులివెందుల మండల పరిధిలోని చంద్రగిరి, ఇ.కొత్తపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఆ గ్రామ అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఎక్కడ చూసినా బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను వింటూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. త్వరలోనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాల ప్రజల ఉత్సాహాన్ని చూసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కచ్చితంగా అఖండ మెజార్టీతో గెలవడం తథ్యమని పేర్కొన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబం వైఎస్సార్ కుటుంబమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన పథకాలైన విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను నీరుగార్చారన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం వైఎస్ కుటుంబంతోనేనన్నారు. ప్రజల నుంచి విశేష స్పందనప్రచారంలో ప్రజల నుంచి వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రభోవాలు పెట్టినా.. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రజలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి రూ.18వేలు అని నమ్మబలికి ఏ పథకం అమలు చేయలేదని వారు పేర్కొ న్నారు. కావున జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా ఉంటూ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బలరామిరెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాల గంగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆది, చంద్ర, గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరుతున్న నాయకులు జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐదు రోజులుగా జోరుగాజెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామంలో టీడీపీ నుంచి 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. శుక్రవారం జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో బాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కడప ఎంపీ వైఎస్ అవినాస్రెడ్డి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న దాడులు, హింసలు, అరాచకాలను చూసి ఇష్టపడక వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, బలరామిరెడ్డిలకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. -
ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల ఏర్పాటు
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 11 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లపై చర్చించి అంతర్ జిల్లాల సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటుచేశామన్నారు. పార్టీ నాయకులు ప్రచారానికి ముందస్తుగా సమాచారం ఇస్తే భద్రత కల్పించామన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నల్లగొండువారిపల్లెకు వెళ్లి అక్కడ ప్రచారంలో టీడీపీకి చెందిన గూటూరు ధనుంజయపై వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డి, మరింతమంది కులం పేరుతో దూషించి మారణాయుధాలతో దాడి చేశారన్నారు. పరస్పర దాడులు జరుపుకోవడంతో మారెడ్డి జయవర్థన్రెడ్డి, చప్పిడి శ్రీనాథరెడ్డి, కిరికిరీ బాషా, అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, పేర్ల కళ్యాణ్రెడ్డి, పేర్ల సత్యనారాయణరెడ్డి, పేర్ల శేషారెడ్డి, ధనుంజయరెడ్డిలతోపాటు కొంతమంది కంప్లయింట్ ఇచ్చారని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ధనుంజయ తనను కులం పేరు దూషించినట్లు కంప్లయింట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల నియమావళి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి తీసుకోకుండా పోలీసుల రాకపోకలకు అంతరాయం కలిగించడంపై ఎంపీడీఓ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, బయపురెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డిలతోపాటు 150మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులతోపాటు కోరా విశ్వనాథరెడ్డి ఫోన్లలో నీ అంతు చూస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మల గంగాధరెడ్డిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యులైన వారిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ -
పొడదుప్పి మృతి
అట్లూరు : కుక్కల బారిన పడి పొడదుప్పి మృతిచెందిన సంఘటన అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఎస్.వెంకటాపురం కాలనీ లోకి గురువారం ఉదయం ఓ పొడదుప్పి వచ్చింది. కుక్కలు దాడి చేస్తుండగా స్థానికులు గమనించి తప్పించారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీషర్ సురేష్కు సమాచారం అందించగా ఆయన వచ్చేలోపే పొడదుప్పి మృతిచెందింది. స్థానిక పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఖననం చేసినట్లు సెక్షన్ ఆఫీషర్ సురేష్ తెలిపారు. గది అద్దెకిస్తే.. నగదు, నగలు అపహరణ లింగాల : గది అద్దెకిస్తే.. నమ్మించి..నగదు, నగలు అపహరించిన సంఘటన లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన హసీనా, మాబాషా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. తమకు ఆశ్రయం కల్పించాలని పార్నపల్లి గ్రామానికి వచ్చారు. ఆ యువతీ యువకులు అరటి కాయలు మోసే కూలిపనులు చేస్తూ గత ఆరు మాసాలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇల్లు అద్దెక్కించిన మహిళ ఇంట్లో లేనిది చూసి గురువారం ఆమె ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో దాచిన రూ.1.10లక్షల నగదు, జత బంగారు కమ్మలు, మాటీలు, కాళ్ల గొలుసులు అపహరించి పారిపోయారు. ఈ విషయమై ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తితోపాటు పారిపోయిన హసీనా, మాబాషాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇల్లూరులో మహిళపై దాడి జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామంలో నివాసముంటున్న లక్ష్మీదేవిపై అదే గ్రామానికి చెందిన నరేంద్ర దాడి చేశాడు. కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్ వివరాల మేరకు.. వినాయకచవితిని పురస్కరించుకుని ఇల్లూరు గ్రామంలో చందా వసూలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన నరేంద్ర లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి చందా ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరిగి నరేంద్ర కర్ర తీసుకుని లక్ష్మీదేవిపై దాడి చేశాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బాధితురాలిని పరామర్శించారు. యువకుడు ఆత్మహత్య జమ్మలమడుగు రూరల్ : విషద్రావణం తీసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. ఎస్ఐ రామక్రిష్ణ వివరాల మేరకు.. మోరగుడి గ్రామానికి చెందిన చాకలి జగన్ (33) మద్యానికి బానిసయ్యారు. కుటుంబ సమస్యలతో ఈ నెల 4న విష ద్రావణం తీసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. దేవగుడిలో వివాహిత... మండలంలోని దేవగుడి గ్రామానికి చెందిన వివాహిత రేవతి దేవి(40) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రేవతి దేవి గత కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది గురువారం ఫ్యాన్కు ఉరివేసుకోని అత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఖాజీపేటలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సినట్లు పోలీసులు తెలిపారు. -
చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
రాజుపాళెం : పట్ట పగలే రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించగా.. గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాజుపాళెం మండలం టంగుటూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు. కానగూడూరు ప్రధాన రహదారిలోని ఉంటున్న రైతు నంద్యాల వెంకట సుబ్బయ్య గ్రామానికి దూరంగా ఉన్న సచివాలయం వద్ద పని నిమిత్తం వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు మూసివేసి దుండగుడు ఇంట్లో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టే పనిలో కనిపించారు. రైతు వెంకటసుబ్బయ్యను చూసి దుండగుడు ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన వెంకట సుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ వెంకటరమణ పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగుడు దూవ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, షేక్ మహమ్మద్ రఫీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి దేవస్థానంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గురువారం ఆలయంలో విచారణ జరిపారు. ఆలయంలో అక్రమాలు జరిగాయంటూ తెల్లాకుల మనోహర్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం డిప్యూటీ కమిషనర్ ఆలయానికి వచ్చి ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావును విచారించారు. దసరా పండగ తర్వాత వివరాలను అందిస్తామని ఆయన చెప్పగా.. నెల రోజులలోపు పూర్తి వివరాలు అందించాలని డీసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. నవోదయ ప్రవేశ దరఖాస్తులకు గడువు పొడగింపు కడప ఎడ్యుకేషన్ : జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కూటీ డిక్కీలో నగదు మాయం – చాకచక్యంగా రూ.3.95 లక్షలు కొట్టేసిన దొంగ ప్రొద్దుటూరు క్రైం : స్కూటీలో డిక్కీలో రూ.3.95 లక్షల నోట్ల కట్టలను ఓ దొంగ చాకచక్యంగా కొట్టేశాడు. ఇంటికెళ్లి డిక్కీ తెరవగా డబ్బు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న కల్లూరు రమణారెడ్డి రాజుపాలెం మండలంలోని టంగుటూరు ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సబితారెడ్డి అన్నమయ్య జిల్లాలో టీచర్గా పని చేస్తోంది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలోని తన సొంత స్థలాన్ని ఈ నెల 5న కడపకు చెందిన మల్లేశ్వరికి రూ.4,95,500లకు విక్రయించాడు. ఆ మొత్తాన్ని రమణారెడ్డి బ్యాంక్ అకౌంట్లో వేసింది. బుధవారం గాంధీ రోడ్డులోని ఇండియన్ బ్యాంక్కు వెళ్లి ఆ డబ్బు రమణారెడ్డి డ్రా చేసుకున్నాడు. నోట్ల కట్టలను స్కూటీ డిక్కీలో పెట్టుకొని నేరుగా కొర్రపాడు రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. స్కూటీ కార్యాలయం ఎదుట పార్క్ చేసి స్థలం అమ్మిన పత్రాల్లో సంతకాలు పెట్టాడు. తిరిగి స్కూటీలో ఇంటికి వెళ్లి చేసుకోగా డిక్కీలోని నోట్ల కట్టల్లో రూ. 3.95,500 కనిపించలేదు. డిక్కీలో నగదు కాజేసి చాకచక్యంగా మళ్లీ డిక్కీ మూసివేశారని గుర్తించి అతను టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు దినం కడప కోటిరెడ్డి సర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 12దీన దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని వైఎస్సార్ కడప జిల్లా ఉప కార్మిక కమిషనర్ డి.వి.రంగరాజు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఈ నెల 1న మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలి కడప అర్బన్: జిల్లాలో పీ–4 విధానాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. పీ–4పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్ వీసీ ద్వారా గురువారం సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ జిల్లాలో గ్రామసభల ద్వారా నిర్వహిస్తున్న అసెస్మెంట్ సర్వే త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. డాక్యుమెంట్స్ అప్లోడ్ కార్యక్రమం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి దుర్మరణం చాపాడు: మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని పల్లవోలు గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబవరం శివ(31) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన అంబవరం శివ ట్రాక్టర్లో రాళ్లలోడుతో అన్నమయ్య జిల్లా రాయచోటికి వెళుతున్నాడు. చాపాడు మండలం పల్లవోలు గ్రామం వద్ద ప్రమాదశాత్తూ శివ క్రింద పడిపోయాడు. రోడ్డు ప్రక్కనే డివైడర్కు తల తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మృతుడు శివకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్టు
● అర కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం ● నాటు తుపాకీ, బొలెరో వాహనం, ఎర్రచందనం దుంగలు స్వాధీనం కడప అర్బన్ : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే అర కిలో బంగారం, రూ.10 లక్షల విలువ చేసే పది కిలోల వెంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్ టౌన్ పరిధిలోని చెన్నంపట్టిమిట్ట వద్ద నివాసముంటున్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, గౌరీశంకర్నగర్కు చెందిన నూతి వెంకటసుబ్బయ్య గత రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లు పగలు గుర్తించడం, రాత్రి చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు. వీరు ఎరచ్రందనం అక్రమ రవాణా చేయడమేగాక, కడప, నెల్లూరు జిల్లాలో తాళం వేసిన ఇళ్ల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఇళ్ల చోరీలో తక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించడంతో సంతృప్తి చెందక, ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దోచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లోని బంగారు దుకాణాలకు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గుంటూరులో బైక్ చోరీ చేశారు. ఈ ప్రయత్నంలోనే గతంలోనూ అరెస్టుయి జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. తీరికసమయాల్లో పేకాడడం, సహచరులతో లంకమల అడవికి వెళ్లి నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడడం చేశారు. గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై గతంలో 28 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా, 38 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతడిపి పీడీ యాక్ట్ ఉండడమేగాక, జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. చోరీలు పెరగడంతో పోలీసుల నిఘా జిల్లాలోని పోరుమామిళ్ల, బి.కోడూర్, మైదుకూర్, బద్వేల్ టౌన్, కలసపాడు, ఖాజీపేట, కాశినాయన, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కీచేసి, రాత్రి సమయాలలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీలు ఇటీవల పెరిగాయి. దాదాపు 12 ఇళ్లు, బంగారు దుకాణంలోనూ ఈ చోరీలు జరగడంతో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు మైదుకూర్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, మైదుకూరు యూసీపీఎస్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, బద్వేల్ రూరల్ ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించి నిఘా పెంచారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని చెలిమికుంట అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలు నరికి కర్ణాటకలోని కటికనహళ్లికి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్య ఎరచ్రందనం రవాణా చేసూం్త పట్టుబడ్డారు. వారి నుంచి బొలెరో వాహనం, నాలుగు ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించగా గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులని గుర్తించారు. అనంతరం పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలియడంతో అరెస్టు చేశారు. పోలీసులకు ఎస్పీ ప్రశంస మోస్ట్ వాంటెడ్గా ఉన్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్యలను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసి, చోరీ సొత్తు, ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ రికవరీ చేసిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ సీఐ ఎ.నాగభూషణ్, ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐలు కె.శ్రీకాంత్, చిరంజీవి, శివప్రసాద్, తదితర సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. -
శిక్షణ ఫలాలు సఫలీకృతం కావాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ సఫలీకృతమయ్యే విధంగా చూడాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యనందరాజు సూచించారు. కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ వివిధ ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులకు ఇచ్చిన శిక్షణ గురువారం ముగిసింది. ఏపీసీ నిత్యానందరాజు మాట్లాడుతూ జీసీడీవో దార్త రూత్ ఆరోగ్యమేరీ ఆధ్వర్యంలో కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, నెల్లూరు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నారు. బీడు, చౌడు భూముల్లో సేద్యం చేసి పంటలు పండించడం ఎంతకష్టమో. వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం అంతే కష్టమన్నారు. శిక్షణ తరగతుల్లో 21 మంది రిసోర్సు పర్సన్స్ పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..!
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసేందుకు విద్యా శాఖ ఏటా ఫార్మెటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి అసెస్మెంట్ మోడల్ పేపర్–1ను ఈ నెల 11వతేదీ నుంచి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను విధానంలో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం వరకూ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఏ విధానం అమలుచేయగా ఈ ఏడాది ఆ విధానాన్ని 9వ తరగతి వరకూ పొడిగించారు. కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్ పరీక్షలను జరపనున్నారు.జిల్లాలో విద్యార్థుల వివరాలిలా...జిల్లాలో 1912 ప్రభుత్వ, ఎయిడెడ్, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 96382 మంది విద్యార్థులున్నారు. 273 యూపీ స్కూల్స్లో 33226, 634 హైస్కూల్స్లో 165350 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2819 పాఠశాలల్లో 2,94,958 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.పరీక్షల షెడ్యూల్ ఇదీ...ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. 11వ తేదీన ఉదయం 9.30 నుంచి 10.45 వరకూ తెలుగు/ ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదే రోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 గంటల వరకు మ్యాథ్మాటిక్స్, 12న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం ఎన్విరాల్మెంట్ సైన్సు పరీక్ష ఉంటాయి. 13న ఉదయం ఓఓస్ఎస్సీ పరీక్ష 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉంటుంది.6,7,8 తరగతులకు సంబంధించి...ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు 11న ఉదయం 9.30 గంటల నుంచి 10.45 వరకు తెలుగు/ఉర్దూ/కాంజోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటలకు మ్యాథమాటిక్స్ పరీక్ష ఉంటాయి. 12న హిందీ/స్పెషల్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం జనరల్ సైన్సు/ఫిజికల్ సైన్సు పరీక్ష, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష, 14న 6,7వ తరగతులకు ఏఎస్ఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు.9,10 తరగతులకు సంబంధించి...హైస్కూల్స్లో 9, 10వ తరగతులకు 11న ఉదయం 11 గంటల నుంచి 12.15 వరకు తెలుగు/ఉర్దూ/కాంపోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4 గంటల వరకు మ్యాథ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 12న ఉదయం హింది/ స్పెషల్ తెలుగు, మధ్యాహ్నం ఫిజికల్ సైన్సు, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష ఉంటాయి. 13న ఉదయం 9.30 నుంచి 10.45 వరకు 8, 9, 10వ తరగతులకు బయోలాజికల్ సైన్సు, ఉదయం 11 గంటల నుంచి 12.45 వరకు ఓఎస్ఎస్సీ –1, మధ్యాహ్నం 2,45 నుంచి 4 గంటల వరకు ఓఎస్ఎస్సి–2 పరీక్ష నిర్వహించనున్నారు.బైలింగ్విల్లో ప్రశ్నాపత్రం...సిబిఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు పశ్నాపత్రం బైలింగ్విల్ ఽవిధానంలో ఉంటుంది. విద్యార్థికి ఆంగ్లం అర్థకాకుంటే తెలుగులో చదవి అర్థం చేసుకునే విధానం 2023–24 నుంచి ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలో పది ప్రశ్నలు అబ్జెక్టివ్ విధానంలో, మరో ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇవ్వనున్నారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ఓఎంఆర్ పత్రాల్లో జవాబు నింపి జిల్లాకు పంపాల్సి ఉంటుంది. సీబీటీ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో నింపాల్సి ఉంటుంది.ఎమ్మార్సీ కేంద్రాలకు...ప్రశ్న పత్రాలుసెల్ప్ అసెస్మెంట్ మోడల్ పేపర్ –1 పరీక్షలకు సంబంధించిన పశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలలోని ఎమ్మార్సీలకు తరలించాం. పరీక్ష పత్రాలకు ఎంఈఓలు కష్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని మార్గదర్శకాలు ఎంఈఓలు, హెచ్ఎంలకు జారీ చేశాం.– విజయభాస్కర్రెడ్డి, సెక్రటరీ, డీసీఈబీ, కడపపరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలిఎస్ఏఎంపీ–1 పరీక్షలను ప్రధానోపాధ్యాయుడు పకడ్బందీగా నిర్వహించాలి. ఏ రోజు పరీక్షకు ఆ రోజే ప్రశ్న పత్రాన్ని తీసుకెళ్లి పరీక్ష నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా హెచ్ఎంలు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలి. పరీక్ష పేపర్లు లీకై తే సంబధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.– షేక్ షంషుద్ధీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
గ్రామాల్లో వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ
పులివెందుల/వేంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి వైఎస్సార్సీపీకి విశేష ఆదరణ లభిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె, తండా, మల్లికార్జునపురం (దళితవాడ), ఎర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆ గ్రా మంలోని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. కూటమి కుట్రలను ఓటుతో తిప్పికొడదాం ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ కూటమి నేతల కుట్రలు, కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు కృష్ణా జలాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా చేసిన ఘనత వైఎస్సార్సీపీదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకట్రెండు అమలు చేసి అన్ని ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50ఏళ్లకుపైబడిన వారికి పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పి తుంగలో తొక్కిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఓడిపోతామని తెలిసి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ పేరుతో పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులను ప్రచారం చేయనీయకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ గ్రామంలో టీడీపీ, కూటమి నేతలు ఉన్నారని వైఎస్సార్సీపీ నాయకులను అక్కడికి ప్రచారానికి వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప క్రీడా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు భరత్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి -
జిల్లాలో పలు మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ఒంటిమిట్టలో అత్యధికంగా 70.8 మి.మీ కురిసింది. అలాగే అట్లూరులో 48.2 , గోవపరంలో 40, పెండ్లిమర్రిలో 28.4, చక్రాయపేటలో 20.4, సిద్దవటంలో 10.2, బద్వేల్లో 12.2, బి. కోడూరులో 6.2, బిమఠంలో 4.8 , ప్రొద్దుటూరులో 5, రాజుపాలెంలో 3.4, కమలాపురంలో 2.6, కడప, వీఎన్పల్లిలలో 2.2 , వేములలో 2 చెన్నూరు, తొండూరులలో 1.2 మి.మీ వర్షపాతం నమోదయింది. ఈ వర్షంతో వరినాట్లతోపాటు ఆరుతడి పంటలకు కొంత మేలు జరగనుంది. సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహించకూడదు కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల వారు ప్రభుత్వ సెలవు రోజు ల్లో తరగతులు నిర్వహించకూడదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. నిబంధలకు వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి తరగతులు, ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని చెప్పారు. జిల్లాలోని డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ ఉత్తర్వులు పాటించేలా చూడాలని.. పర్యవేక్షించాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు. 11వ తేదీ నుంచి అనుమతి లేని ప్లే స్కూల్స్ తెరవకూడదు... జిల్లావ్యాప్తంగా 11వ తేదీ సోమవారం నుంచి అనుమతులు పొందని ప్లేస్కూల్స్ తెరవకూడదు, తరగతులను నిర్వహించకూడదని ఆయా యాజమాన్యాలకు డీఈఓ షేక్ షంషుద్దీన్ సూచించారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై తగు చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. యూరియాను అధిక ధరకు అమ్మితే చర్యలుకడప అగ్రికల్చర్: జిల్లాలో ఎరువుల డీలర్లు ఎవరైనా యూరియాను అధిక ధరలకు అమ్మితే చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్కు వచ్చిన యూరియా రాక్ను జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్థన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉమ్మడి కడప జిల్లాకు 1335 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఇందులో వైఎస్సార్జిల్లాకు 870 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 400 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు కేటాయించామన్నారు. మిగతా 470 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించామన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 465 టన్నులు రాగా ఇందులో 265 టన్నులను మార్కెఫెడ్కు, మిగతా 200 టన్నులను ప్రైవేటు డీలర్లు కేటాయించామని తెలిపారు. ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
బరి తెగించారు!
పచ్చ సైకోలు ఊరిమీద పడ్డారు. బరిలోకి దిగి ఓటర్ల మనసులు గెలవాల్సింది పోయి అధికారదర్పాన్ని ఒళ్లంతా పూసుకుని బరితెగిస్తున్నారు. ప్రత్యర్థులపై రాళ్లూరప్పలు విసురుతున్నారు. కర్రలు..రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు. పెట్రోల్ క్యాన్లు పట్టుకుని తిరుగుతూ పల్లెల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇదంతా చేసేది ఒక్క జెడ్పీటీసీ సీటు కోసమే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న 'ముఖ్య'నేతల నుంచి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నేతలు వీరంగం చేస్తున్నారు. 'ఆపరేషన్ పులివెందుల' అంటూ పల్లెల్ని రణరంగంగా మారుస్తున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్: జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి. ఎంత అరాచకమైనా సరే, ఎన్ని కేసులైనా పర్వాలేదు. ‘ఆపరేషన్ పులివెందుల’లో టీడీపీ జెండా ఎగరాలి.. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన మార్గదర్శకాలివి. దీనికనుగుణంగానే క్షేత్ర స్థాయిలో చర్యలుంటున్నాయి. టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుట్రలు, కుయుక్తులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చొకూడదనే దిశగా పథకరచన చేస్తున్నారు. ఆమేరకు వరుసగా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పచ్చని పల్లెల్లో ప్రత్యక్ష భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.పులివెందులలో 30ఏళ్ల క్రితం ఇలాంటి సంస్కృతి ఉండేది. 20ఏళ్లుగా పట్టణ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. తాజా ఉప ఎన్నికలు ఒక్కమారుగా భయానక వాతావరణం తీసుకొచ్చాయి. వ్యవస్థలు చేష్టలుడిగి కూర్చుండిపోవడమే అందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మొన్న అ కారణంగా హత్యాయత్నం ఘటన ఉత్పన్నమైంది. 24 గంటలు గడవకముందే ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదుకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు నిందితులు మరికొంతమందిని టార్గెట్ చేసి కొడతామంటూ యఽథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రచారం ఉన్న ప్రాంతాలకు మాత్రమే బందోబస్తు కేటాయిస్తున్న పోలీసు అధికారులు.. దుండగుల కట్టడికి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.చెప్పినట్లు వింటారా... మీకు అదే గతి కావాలా?!పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెప్పినట్లు వింటారా...మీకు అలాంటి గతి పట్టించాలా?అంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అంటే ఏస్థాయికి బరితెగించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుశ్చర్యలన్నీ కూడా కేవలం పోలింగ్ రోజు ఏకపక్ష పోలింగ్ కోసమేనని పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందులలో టీడీపీ బలంతో పోలిస్తే వైఎస్సార్సీపీ బలం గణనీయంగా ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులు తెరపైకి తీసుకొస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.ఎల్లో గ్యాంగ్ హల్చల్....వరుసగా హత్యయత్నం ఘటనలకు పాల్పడిన తెలుగుదేశం మూకలు గురువారం సైతం పులివెందులలో యథేచ్ఛగా సంచరించారు. వాహనాల్లో మారణాయుధాలు వెంటబెట్టుకొని వాహన శ్రేణితో హల్చల్ చేశారు. టార్గెట్ నిర్ణయించిన వ్యక్తుల కోసం అన్వేషించినట్లు సమాచారం. పట్టణంలోని ఓ యూట్యూబర్, మరో ఇద్దరు వేముల మండల నాయకుల కోసం విశేషంగా అన్వేషణ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అధికారుల కళ్ల మందే అటు ఇటు తచ్చాడుతున్నా కట్టడి చేయాలనే ఆలోచన వారికి ఏమాత్రం కన్పించలేదు. కాగా, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏకంగా దిశా–నిర్దేశం చేస్తూ ఎల్లో గ్యాంగ్ను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కొంతమంది అధికారులు, తెలుగుతమ్ముళ్లు, బీజేపీ నేతలు సంయుక్తంగా అడ్డదారుల్లోనైనా సరే, పులివెందుల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలనే ఉత్సాహాన్ని అధికంగా కనబరుస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.త్రిముఖ వ్యూహం.. అధికారం ఉంది, ప్రతి చర్యలుండవు అనే ధీమా తెలుగుదేశం పార్టీ నేతల్లో బలంగా ఉంది. వెరసి తరచూ హత్యాయత్నం ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈక్రమంలో ముందుగా నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయడం, తర్వాత ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచడం, ఆ తర్వాత అధికారుల ద్వారా ఏకపక్ష పోలింగ్ నిర్వహించడం. అప్పటికీ గెలుపు అంచనాకు రాకుంటే విచ్చలవిడి హింసకు పాల్పడడంతోనైనా గట్టెక్కాలనే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఆమేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రణాళికలు రచించినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. -
వరాల పండుగకు వేళాయె!
కడప సెవెన్రోడ్స్: మహిళలు తమ సౌభాగ్యం కోసం ప్రార్థించే పండుగల్లో శ్రీ వరలక్ష్మిమాత వ్రతం ముఖ్యమైనది. శుక్రవారం పండుగ నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లలో ప్రజలు నిమ గ్నమయ్యారు. వరలక్ష్మీదేవి ఆరాధన కోసం అవసరమైన పూలు, పండ్లు, అరటి పిలకలు, మామిడాకులు, తమలపాకులు, టెంకాయలు, కర్పూరం, గంధం, కడ్డీలు తదితర పూజా సామగ్రి దుకాణా లు మహిళలతో రద్దీగా మారాయి. ముఖ్యంగా కడప నగరంలోని పాత బస్టాండు, గర్ల్స్ జూనియర్ కళాశాల, వన్టౌన్ సర్కిల్, బీకేఎం స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండు, కాగితాలపెంట, దొంగలచెరువుకట్ట, అప్సర సర్కిల్ తదితర ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. పండుగ కావడంతో పూజా సామాగ్రికి అవసరమైన వస్తువుల ధరలు కూడా వ్యా పారులు అమాంతం పెంచేశారు. కనకాంబరాలు పావు రూ.100, మల్లె, జాజి పూలు పావు రూ.80, చెండుమల్లె కిలో రూ.150, చేమంతి, రోజా పూలు కిలో రూ. 400 చొప్పున విక్రయించారు. అరటి పిలక రూ.30, అరటి పండ్లు డజన్ రూ. 60, మామిడి ఆకులు రూ.30 చొప్పున విక్రయించారు. తాము నందలూరు, రాజంపేట వంటి దూర ప్రాంతాల నుంచి అరటి పిలకలను తీసుకొచ్చి విక్రయిస్తున్నామని, కనీసం రూ. 50 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు బ్రాహ్మణులు, వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మివ్రతం కోసం అమ్మవారి కలశ ప్రతిష్ఠ చేసేందుకు భక్తులు సన్నాహాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల సామూహిక వ్రతాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అమ్మవారు కరుణించి కోరిన వరాలిస్తారని, సౌభాగ్యం అందజేస్తారని భక్తుల విశ్వాసం. కడప నగరంలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ఉదయం నిర్వాహకులు భక్తులచే సామూహికంగా అమ్మవారి వ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు వరలక్ష్మివ్రతం ఆలయాలు, ఇళ్లల్లో విశేష పూజలు -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు. ‘గండికోట’ కేసులో టెక్నికల్గా విచారణ గండికోటలో జరిగిన మైనర్బాలిక హత్య కేసులో ఇంకా టెక్నికల్గా ఆధారాలపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలియజేశారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు. గండిలో ట్రాఫిక్ ఆంక్షలు చక్రాయపేట: శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా మూడవ శనివారం రోజు వాహనాలను ఎట్టి పరిస్థితిలోను గండిలోకి అనుమతించే ప్రసక్తి లేదని ఆర్కే వ్యాలీ ఎస్సై రంగారావు తెలిపారు.శ్రావణ మాసం మూడవ శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు ఆయన వివరించారు. ఉదయం 5గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని చెప్పారు. సాయంత్రం భక్తుల రద్దీని బట్టి ఆంక్షలను సడలిస్తామని చెప్పారు. -
ఒకటే గమనం.. గెలుపే గమ్యం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు.ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు.కొత్త మాధవరంలో ముమ్మరంగా ప్రచారంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి
పులివెందుల: సాధారణ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి మోసం చేసిన టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కనంపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్లతో కలిసి ఇంటింటి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12న జరిగే జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ఒకేసారి రూ.20వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు ఇస్తామన్న పింఛన్ పథకం ఏమైందని ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేయలేని ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే ఎక్కడ ఓడిపోతామోనని వైఎస్సార్సీపీ నాయకులపై దాడు లు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమ ర్శించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ పేరుతో పోలింగ్కు రాకుండా నియంత్రించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గాలను చేస్తున్న టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కనంపల్లెలో ఘన స్వాగతం మండలంలోని కనంపల్లె గ్రామంలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఘనంగా గ్రామస్తులు స్వాగతం పలికారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కనంపల్లెలో ఇంటింటి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయనకు విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో భాగంగా జగనన్న పాటకు మహిళలు నృత్యాలు చేస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి పులివెందుల: ఈనెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందుల మండలం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో పులివెందుల ఎంతో ప్రశాంతంగా ఉండేదన్నారు. ఎలాంటి దాడులు గానీ, దుస్సంఘటనలు గానీ జరగలేదని, అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. మన పులివెందుల ప్రశాంతంగా ఉండాలంటే, మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, ఇక్కడి ప్రాంతాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్సీపీఅభ్యర్థిని గెలిపించండి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టిన ఆయన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పచ్చని పల్లెల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ విష సంస్కృతికి తెర తీస్తున్నారు. ఆది నుంచి హత్యా రాజకీయాల్నే నమ్ముకున్
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గతంలో ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు చేసిన ఆయన తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. భౌతిక దాడులు.. హత్యాయత్నం ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. తీవ్ర ఘర్షణలు..అల్లర్లు సృష్టించేందుకే నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమందిని బ్యాచ్లుగా ఎంపిక చేసి.. ఎంచుకున్న వారిపై హత్యాయత్నానికి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి హైటెక్ తెలివితేటలు అధికమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అది నిజమని పలుమార్లు రుజువైంది. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మా రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. ఒకే ఒక ఎంపీటీసీ సభ్యుడి ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. మెజార్టీ సభ్యుడిగా ఉన్న కొమ్మారామలింగారెడ్డి హత్యతో ఎంపీపీ ఖాళీ ఏర్పడితే ఆస్థానం గెలుపొంది చేజేక్కించుకోవచ్చునే ఎత్తుగడను బీటెక్ రవి ప్రయోగించారు. వెరసి ఎంపీపీ కొమ్మా రామలింగారెడ్డి హత్య తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆపై ఏర్పడ్డ ఫ్యాక్షన్ నేపధ్యంలో ప్రతీకార హత్యలు లేకపోలేదు. ఇంటి వాస్తు కోసం రోడ్డుకు అడ్డంగా గోడ ఏర్పాటు కసనూరు గ్రామానికి చెందిన బీటెక్ రవి సింహాద్రిపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి పరమడ వైపు రోడ్డు ఉంది. రోడ్డు అడ్డంగా గోడ కట్టారు. కారణమేమంటే వాస్తుకు అనువుగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు. అటువైపు ఇళ్లున్న వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. బీటెక్ రవి అనుచరులు దాడులు చేస్తారనే భయం వారిని బాహాటంగా ప్రశ్నించకుండా చేసింది. ఫలితంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించినా చూస్తుండిపోయిన దుస్థితి నెలకొంది. జెడ్పీటీసీ ఎంట్రీలోనూ అదే పరిస్థితి... సింహాద్రిపురానికి చెందిన బీటెక్ రవి తన సతీమణి లతాను పులివెందుల జెడ్పీటీసీగా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణం, రూరల్లో దందాలు, సెటిల్మెంట్లు మొత్తం వ్యవహారం గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. స్థానికంగా టీడీపీ నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నా, బీటెక్ రవి తన కుటుంబ సభ్యుల్ని పోటీలో దింపడం వెనుక ఈ ప్రాంతంపై పట్టు సాధించాలనే తపన అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి లోకల్. ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత నాన్ లోకల్ అయినప్పటికీ పోటీకి ఆసక్తి చూపడం వెనుక బహుళ ప్రయోజనాలున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందుల ప్రశాంతతకు భంగం... ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ప్రజలు, రైతులు కక్షలకు దూరంగా ఉండి పూర్తిగా వ్యవసాయం బాటపట్టారు. అందుకు అనువైన పరిస్థితులు మహానేత కల్పించారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు వచ్చి చేరింది. ఆదాయం కళ్లు చూడడం, క్రమేపి ప్రశాంత వాతావరణానికి జనాలు అలవాటు పడ్డారు. 2004 నుంచి 2024 వరకూ పులివెందులలో ప్రశాంత వాతావరణం కొనసాగేది. కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతతకు భంగం ఏర్పడింది. తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అది మరింత ఎక్కువైంది. మంగళవారం రాత్రి సైదాపురం సురేష్కుమార్రెడ్డి, అమరేష్రెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం నల్లగొండుగారిపల్లెలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. టీడీపీ మూకలు బరితెగించి గ్రామస్తుల సమక్షంలోనే వేల్పుల రామలింగారెడ్డి హత్యకు విశ్వయత్నం చేశారు. పెట్రోల్ పోసి నిలువునా అంటించడానికి ప్రయత్నించారు. వాహనాలు ధ్వంసం చేశారు. అద్దాలను సమ్మెటతో పగలగొట్టి వాహనంలోకి పెట్రోల్ చల్లారు. తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నల్లగొండుగారిపల్లె గ్రామస్తులు అడ్డుగా నిలవడంతో వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బతికిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అరాచకానికి నిలువెత్తు రూపంగా బీటెక్ రవి నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు! తాజాగా పులివెందులలో ఎంట్రీలోనూఇదే సంస్కృతికి బీజం పట్టణ ప్రశాంతత కలుషితం అవుతోందనిప్రజాస్వామ్యవాదుల ఆవేదన లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా రంగప్రవేశం వెనుక అతి పెద్ద స్కెచ్ -
వరుస దాడులు అమానుషం
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులపై వరుస దాడులు, బైండోవర్ కేసుల నమోదు అమానుషమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ అల్లరి మూకల దాడుల నేపథ్యంలో అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పులివెందులలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పట్టణంలోని మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతి పరులపై తీవ్రమైన భౌతిక దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్త అమరేష్లపై మంగళవారం దాడి జరిగింది. ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి, వారి అనుచరుల మీద దాడి జరిగింది. దాడి జరుగుతున్న పద్ధతి డెకాయిట్స్ బస్సు రాబరీ చేసే విధంగా ఉంది. నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అడ్డుకోకపోతే రాము, రమేష్ యాదవ్ ప్రాణాలతో ఉండేవారు కాదు. వైఎస్సార్సీపీని వదిలి దేశం పార్టీకి మారిన పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథరెడ్డిని అదేమని అడిగితే ‘నరుకుతాం’ అన్నారని తప్పుడు కేసులు పెట్టించడం దారుణం. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు, రానున్న ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం లేకే దాడులకు పాల్పడుతూ తప్పుడు పద్దతుల్లో గెలుపు మార్గాన్ని వెతుక్కుంటున్నారు. అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో బీటెక్ రవి అనుచరులు గెలుపుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. పార్థ, అతని తమ్ముడు, బీటెక్ రవి తమ్ముడు జయ భరత్ల ఆధ్వర్యంలో రాము, రమేష్లపై దాడి జరిగింది. వీరందరిని అరెస్టు చేస్తేనే ఈ ప్రభుత్వానికి, పోలీసులకు చిత్తశుద్ధి ఉన్నట్లు భావిస్తాం. మా సంయమనం బలహీనతగా భావించద్దు. ఇక వైఎస్సార్సీపీ నాయకులపై గడిచిన మూడు రోజులుగా వందల సంఖ్యలో బైండోవర్ కేసులు నమోదయ్యాయి. తమ పోరాటం పోలీసులతోనా లేక తెలుగుదేశం పార్టీతోనా అన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది’’ అని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఈ దాడులపై స్పందించాల్సిన అవసరం ఉందని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ అవినాష్రెడ్డి విమర్శ పులివెందులలో నిరసన ర్యాలీ -
బ్యాలెట్ బాక్స్లపై శిక్షణ
కడప సెవెన్రోడ్స్: ప్రిసైడింగ్ అధికారులకు బ్యాలెట్ బాక్స్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జెడ్పి సీఈవో – రిటర్నింగ్ అధికారి ఓబులమ్మ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రిసైడింగ్ అధికారులకు, ఏపీఓలకు బ్యాలెట్ బాక్స్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సి.ఓబుళమ్మ, పులివెందుల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటపతి, ఒంటిమిట్ట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రంగస్వామి, డివిషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వి.విజయలక్ష్మి, వి.రామాంజనేయులు , రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. నియామకం కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ షాకీర్ను రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రైతులందరికీ యూరియా అందజేస్తాం వేంపల్లె: జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతులందరికి అందిస్తామని వ్యవ సాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర నాయక్ పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని ఎరువులు దుకాణాలను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర నాయక్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వరి నాట్లు సాగు చేస్తుండడంతో యూరియా ఎక్కువగా అవసరం అవుతోందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు ఆర్ఎస్కే, ప్రైవేటు డీలర్లు వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. యూరియాతోపాటు భాస్వరం, పొటాషియం ఎరువులను తప్పకుండా వేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
అసలేం జరుగుతోంది!
సాక్షి టాస్క్ఫోర్స్: ఒక్క మండలం. కేవలం 10,800 ఓట్లు ఉన్న ప్రాంతం. ప్రజల మాన ప్రాణాలు రక్షించేందుకు రక్తాన్నైనా చిందిస్తామని ప్రతినబూనిన పోలీసు అధికారులంతా ఉన్నారు. అయినా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి.. వరుసగా హత్యాయత్నం ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అంత చిన్న ఏరియాలో ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం.. పోలీస్ శాఖ ఉంది. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న ధోరణి కారణంగా మొత్తం వ్యవస్థకే మచ్చ వస్తోంది. ● జిల్లాలో ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఇద్దరు, 9మంది డీఎస్పీలు, 48మంది సీఐలు, 98 మంది ఎస్ఐలు, 1600మంది సివిల్ పోలీసులు, 580 మంది ఏఆర్ పోలీసులు కొలువై ఉన్నారు. సరిగ్గా 2,333 మంది విధుల్లో ఉన్నారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వచ్చా యి. ఈ రెండు చోట్ల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడం పోలీసు యంత్రాంగానికి చేతకావడం లేదంటే తప్పులో కాలేసినట్టే. వ్యవస్థలో నెలకొన్న లోపభూయిష్టం కారణంగా కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారడంతోనే అల్లకల్లోలాలు తెరపైకి వస్తున్నాయి. మంగళవారం హత్యాయత్నం ఘటన చోటుచేసుకోగా, కేసు నమోదుతో సరిపెట్టారు. నిందితులు పులివెందులలోనే తిష్టవేసి మరో హత్యాయత్నం ఘటనకు పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి కొంత మంది పోలీసుల ఏకపక్ష చర్యలే అసలు కారణంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బెండోవర్ కేసులతో మొదలు.... ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం సముచితమే. కానీ..ఏకపక్ష చర్యలే అభ్యంతరకరం.ఇప్పటికీ పులివెందుల రూరల్ మండలంలో 100మందికిపైగా బైండోవర్ చేశారు. తెలుగుదేశం వారిని అసలు బైండోవర్కు పిలవలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని మాత్రమే బైండోవర్ చేయిస్తున్నారు. పులివెందుల మండలంలో పోలింగ్ నిర్వహిస్తుంటే నియోజకవర్గ వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. అదీ కూడా ఇరుపక్షాలను చేయడం లేదు. టార్గెట్గా వైఎస్సార్సీపీ నేతల్ని ఎంచుకున్నారు. పోలీసుల ఏకపక్ష చర్యలకు ఈవ్యవహారం మరో ఉదాహరణగా నిలుస్తోంది. ● కొరవడిన సమర్థవంత అధికారుల స్ఫూర్తి జిల్లాలో ఎందరో నిష్టాతులైన పోలీసు అధికారులు విధులు నిర్వర్తించారు. వారిలో గుర్తుండిపోయే అధికారులు కొందరే. ఇటీవల కాలంలో ఎస్పీలుగా పనిచేసి, సమర్థవంత అధికారుల పేర్లు పరిశీలించాల్సి వస్తే, బాపూజీ అట్టాడా, పీహెచ్డీ రామకృష్ణ, అభిషేక్ మహంతి, హర్షవర్ధన్రాజు తదితర అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా చేపట్టారు. కాగా తాజాగా పులివెందులలో ఒక జెడ్పీటీసీ ఎన్నికను సమర్థవంతంగా నడింపించలేకపోవడం ప్రజాస్వామ్యవాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎంతోమంది నిష్ణాతులైన అధికారులు ఉన్నప్పటికీ పులివెందులలో వరుస ఘటనలు తలెత్తుతున్నాయి. ప్రజలకు భయాందోళనలు అధికమయ్యాయి. దుండగులు పోలీసు వ్యవస్థకు సవాల్గా నిలుస్తు న్నా.. కట్టడి చేయడంలో స్థానిక అధికారులు, ఆపై జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం తేటతెల్లమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా హత్యాయత్న ఘటనలుజరుగుతున్నా పట్టించుకోని పోలీస్ శాఖ ఒక్క జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలోఇంత అల్లకల్లోలమా? ప్రజల మాన ప్రాణాలు రక్షణ పక్కనబెట్టి‘జీ..హుజూర్’ అంటున్న ఖాకీలు! -
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పులివెందుల: రాజకీయ సాంప్రదాయాలకు టీడీపీ తూట్లు పోడిచి పోటీకి సిద్ధపడిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కనంపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయకుండా ప్రజలందరినీ మోసం చేసిందన్నారు. సుపరి పాలనలో తొలి అడుగు అని ప్రజల ముందుకు వెళ్లి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. ప్రజా వ్యతిరేకత వల్లే పులివెందులలో దాడులు, దౌర్జన్యం, ధనబలం, అధికార బలం ఉపయోగించి అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. వేల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లపై దాడులు హత్యాయత్నం చేసి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. పులివెందులలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో భయానక వాతావరణం సృష్టించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నా రు. పులివెందుల ప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే కేవలం వైఎస్ఆర్, వైఎస్ జగన్ వల్లేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలవలేమని కూటమి నాయకులు డిసైడ్ అయ్యారన్నారు. ఎలక్షన్ కమీషన్, అధికార యంత్రాంగం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాన్నారు. -
ప్రతిభ చూపితే...భవిత మీదే..!
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగిన సృజనాత్మక ఆలోచలు, ఆవి ష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ ప్రథ మ సంవత్సరం వరకు చదివే వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకుగానూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల ఆహ్వానం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వతేదీ వరకు గడువు ఉంటుంది. ఆన్లైన్ పద్దతిలో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా అప్లికేషన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ పోటీపరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుండి 11(ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం)తరగతుల వరకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాయవచ్చు. వంద మార్కులకు పరీక్ష ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబరు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్లైన్లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన ఉంటుంది. పై రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాలంలో 90 నిమిషాల పాటు(గంటన్నర) రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఒకసారి యాప్లో లాగిన్ అవ్వగలుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. లెవల్–1 ప్రధాన పరీక్షలో ప్రతి తరగతులకు సంబంధించిన వంద ప్రశ్నలుంటాయి. సెక్షన్–ఎలో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి అంశంపై 20, సత్యేంద్రనాధ్ బోస్ జీవిత చరిత్రపై 20, సెక్షన్–బిలో 6 నుండి 11 తరగతుల విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50, లాజిక్, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవల్ టు (ద్వితీయ పరీక్ష)లో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. రాష్ట్ర స్థాయికి ఎంపిక ఇలా.... పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గానూ మొత్తం 150 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. డిసెంబర్ 21 లేదా 28 లేదా జనవరి 4 తేదీల్లో ఏదో ఒక రోజు రాష్ట్ర స్థాయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికేట్ అందజేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రస్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అకకడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బ హుమతిగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ. 10వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు 2000 చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీవో, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1–3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రారంభం : జూన్ 1, 2025 మాక్ పరీక్షలు : సెప్టెంబర్ 1 లెవల్ వన్ పరీక్ష : అక్టోబరు 28, 29, 30 లెవన్ టు పరీక్ష : నవంబర్ 7 పరీక్ష సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫలితాల వెల్లడి : నవంబరు 27 విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ఎంపికై తే స్కాలర్షిప్, ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్ సెప్టెంబర్ 15 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు తుది గడువు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి... పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జి.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వవచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. – ఆర్.శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ జిల్లా కో ఆర్డినేటర్, వైఎస్సార్ జిల్లా సృజనాత్మకతను వెలికి తీసేందుకు... విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఒక చక్కటి వేదికగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సైన్స్ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ప్రభుత్వ, ఇతర యాజమాన్య ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చు. – డివి.సుబ్బానాయుడు, విద్యార్థి విజ్ఞాన్ మంథన్, జోనల్ కో ఆర్డినేటర్ హెచ్ఎంలు కృషి చేయాలి... ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విజ్ఞన్ మంఽథన్ పరీక్షల్లో పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులతే స్కాలర్షిప్తోపాటు ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్కు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు అవగాహన కల్పించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఊయలే.. ఉరితాడై
– గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది. మహిళ అదృశ్యం బి.కోడూరు : మండలంలోని మున్నెల్లి పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన కొండా దొరసానమ్మ ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదని తండ్రి కొండావెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుఎస్ఐ సురేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు... తనపై దొంగతనం మోపారని మనస్తాపానికి గురైన దొరసానమ్మ ఈ నెల 3న ఇంటినుంచి వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి వస్తుంటుందని వెంకటరామిరెడ్డి తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. -
జూదరుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఆంధ్ర కేసరి రోడ్డులో పేకాడుతున్న నలుగురిని టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పేకాడుతున్నారని సమాచారం రావడంతో బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైవీయూ ఆచార్యుడికి ఫెలోషిప్ కడప ఎడ్యుకేషన్ : వైవీయూ ఆచార్యులు డాక్టర్ పి.వాసుగోవర్ధనరెడ్డికి జర్మనీలో అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫౌండేషన్ ఇచ్చే ఫెలోషిప్ దక్కింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు జర్మనీలో గోవర్ధన్రెడ్డి ప్రొఫెసర్ రెనే విల్హెల్మ్ మార్గదర్శకత్వంలో అసమాన ఆర్గానోక్యాటాలిసిస్లోపై పరిశోధన చేశారు. డాక్టర్ రెడ్డి ఎన్–హెపిరో సైక్లిక్ కార్సెనెస్ ఉత్ప్రేరక అనువర్తనాల పనితీరును గుర్తించి ఆ రంగంలో స్థిరమైన వృద్ధి ఫలితాలను తెచ్చారు. డాక్టర్ పి.వాసుగోవర్ధనరెడ్డి గతంలోనూ ప్రొఫెషనల్, నెట్ వర్కింగ్ ఈవెంట్లలో భాగస్వామ్యులయ్యారు. జర్మనీలో ఆయన పరిశోధనలకు ఫెలోషిప్ దక్కింది. ఈ సందర్భంగా యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, కుల సచివులు ఆచార్య పి పద్మ, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు. బి.మఠం రాజగోపురంపై కలశాల ఏర్పాటు బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం దక్షణ రాజగోపురానికి నూతన కలశాలను బుధవారం ఏర్పాటు గతంలో రాజగోపురంపై కలశాలను కోతులు విరగకొట్టడంతో దేవస్థానం నిర్వాహకులు నూతన కలశాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీశాఖ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం సెక్షన్ సుండుపల్లె బీట్ పరిధిలోని సద్దికూళ్లవంక చెక్పోస్టు దగ్గర అటవీశాఖ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ఒక హుండాయ్ కారు వేగంగా వచ్చి బారిగేట్ వేసిన విషయం పసిగట్టి సుండుపల్లె మార్గంలోకి వెళ్లగా అటవీ సిబ్బంది వెంబడించారు. సిబ్బందిని చూసి వాహనాన్ని నిలిపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనం తనిఖీ చేయగా అందులో 326 కేజీలు గల పది ఎర్రచందనం దుంగలున్నాయి. ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్ఓ రమేష్బాబు, ఎఫ్బీఓ అంజన స్వామి, గౌషా, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థర్మాకోల్ ప్లేట్లలో ఆహారం తింటే ప్రమాదం చిన్నమండెం : థర్మాకోల్ పేట్లలో ఆహారం తీసుకుంటే ప్రమాదమని ఆహార భద్రతా అధికారి వెంకటరెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండల కేంద్రంలో ఇటీవల పానీపూరీ విక్రయిస్తున్న దుకాణాల్లో థర్మాకోల్ ప్లేటు వాడుతున్న విషయం గమనించి వ్యాపారులను మందలించామని తెలిపారు. వినియోగదారుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వసుత్న్నాయని తెలిపారు. జనాల బలహీనతలతో వ్యాపారం చేయకూడదని, మండల వ్యాప్తంగా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేపట్టామన్నారు. వేడిగా ఉన్న కట్లెట్, పానీపూరీ తదితర ఫాస్ట్ఫుడ్ థర్మాకోల్ ప్లేట్లలో ఇవ్వడం గుర్తించామన్నారు. వాటిలో ఆహారం తీసుకుంటే ప్లాస్టిక్ కణాలు వేడికి ఆహార పదార్థాల్లో కలిసి కడుపులోకి వెళ్తాయని, కాలేయం దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. క్రమంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్టీలు పాత్రలే వాడాలని, పానీపూరి తయారీలో నాణ్యత విలువలు పాటించాలని సూచించారు. -
చేనేతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో చేనేతలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. 2014లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన 25 హామీలు బుట్టదాఖలు చేశారని విమర్శించారు. 2024 మేనిఫెస్టోలో చేనేతలకు ఉచిత విద్యుత్, జీఎస్టీ ఫ్రీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను తాము ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఏడాదిన్నర గడచినా ఇవ్వలేదని విమర్శించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి, చేనేత వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కారని, వారంతా మళ్లీ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1,20,000లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.983 కోట్లు ఆర్థిక సాయం అందించారని, కరోనా కష్ట కాలంలోనూ ఈ మొత్తం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆప్కో వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా పరిచయం చేసి చేనేతలను అగ్రగామిగా నిలిపారని తెలిపారు. వెంకటగిరి, మాధవరం, ధర్మవరం, మంగళగిరి, పెడన వంటి ప్రాంతాల్లో చేనేతలకు రెండు సెంట్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి -
భక్తిభావంపై రాజకీయ కుట్ర
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి నేతల కక్ష పూరిత రాజకీయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ రాజకీయ ప్రాబల్యం నిరూపించుకునేందుకు చివరికి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు వెనుకాడటంలేదు. ఈ కోవలోనే బద్వేల్కు సమీపంలో సగిలేరు ఒడ్డున ఓ వైఎస్సార్సీపీ నేత ఏర్పాటుచేసిన స్నానాల ఘాట్ను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ సమయంలో భక్తులు అడ్డుపడటంతో వెనుదిరిగారు. మంగళవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ చర్య రెవెన్యూ అధికారులు చేసిందా లేక అధికార పార్టీ నాయకులు చేసిందా? అనేది అంతుపట్టడం లేదు. ఘాట్ తొలగించేందుకు యత్నం మండలంలోని కొంగలవీడు సమీపంలో సగిలేరు ఒడ్డున వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వంకెలపోలిరెడ్డి సుమారు రూ.12 లక్షల సొంత నిధులతో స్నానాల ఘాట్ ఏర్పాటు చేయించారు. ఈ ఘాట్ను గతేడాది నవంబర్ 11న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధల చేతులమీదుగా ప్రారంభించారు. బద్వేల్ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి సారిగా నదీ పరివాహక ప్రాంతంలో ఘాట్ ఏర్పాటు చేయడంతో గతేడాది శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో వందలాది మంది భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు, మహిళలు నదీస్నానాలు చేరశారు. దీపాలు నదిలో వదిలి భక్తిభావంతో పరవశించిపోయారు. దీంతో ఘాట్ ఏర్పాటు చేయించిన వైఎస్సార్సీపీ నేత పోలిరెడ్డికి చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి పేరు లభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ నేతలు పోలిరెడ్డిని టార్గెట్ చేశారు. సిద్దవటం రోడ్డులో తన కుటుంబసభ్యులు నిర్మించుకున్న ఇళ్లకు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చి సీజ్ చేశారళ్లీ ఘటన మరువకముందే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన స్నానాల ఘాట్ను తొలగించాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ వ్యవహారం జేసీ కోర్టులో నడుస్తోంది. అవేమీ పట్టించుకోకుండా రాత్రి సమయంలో జేసీబీతో వచ్చి స్నానాలఘాట్ వద్ద ఏర్పాటుచేసిన గదిని తొలగించేందుకు యత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు గమనించి ఘాట్ను తొలగించకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక తొలగించేందుకు వచ్చిన వారు వెనుదిరిగారు. స్నానాల ఘాట్ తొలగించేందుకు యత్నం -
గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం
కొండాపురం : గండికోట ప్రాజెక్టు నీటిలో రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఓ యువకుడు శవం బుధవారం లభ్యమైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండలంలోని పాత కొండాపురం–ఏటూరు వైపు వెళ్లే పాతదారి వద్ద రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనుక జలాల్లో 4.5 అడుగుల గుర్తుతెలియని మృత దేహం కనిపించడంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని మృత దేహాన్ని బయటికి తీశారు. మృతుడు జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మద్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఎస్ఐ 9121100612, సీఐ 9121100611 ఫోన్లకు సమచారం ఇవ్వాలని తెలిపారు. కుక్కల దాడిలో మేక పిల్లల మృతి తొండూరు : మండలంలోని కోరవానిపల్లె గ్రామానికి చెందిన కొప్పల రామ్మోహన్కు చెందిన 22 గొర్రె, మేక పిల్లలు మంగళవారం అర్థరాత్రి కుక్కల దాడిలో మృతి చెందాయి. ఈ సందర్భంగా బాధిత గొర్రెలకాపరి రామ్మోహన్ మాట్లాడుతూ గొర్రె, మేక పిల్లలు చనిపోవడంతో దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నష్టాన్ని గుర్తించి, నష్టపరిహారం అందించాలని కోరారు. పిడుగుపాటుకు గొర్రెలు మృతి ముద్దనూరు : మండలంలోని చౌటిపల్లె స మీపంలో పిడుగుపడడంతో పది గొర్రెలు బుధవారం మృతి చెందాయి. బాధితుల సమాచారం మేరకు మంగళవారం రాత్రి భారీ మెరుపులతో కూడిన వర్షం కురిసి పిడుగుపడింది. గొర్రెల కాపరి సత్యనారాయణ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో మందలో వున్న పది గొర్రెలు మృతిచెందాయి. పిడుగుపాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
సామాజిక మాధ్యమాలే వేదికగా మోసాలు
ఎస్పీ ఈజీ.అశోక్కుమార్కడప అర్బన్ : సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేస్తున్నారని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ మార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్్లైన్ పెట్టుబడి మోసాల కేసులు నమోదవుతున్నాయని, డబ్బులు మోసమోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసగాళ్లు ముందుగా ‘ఇన్వెస్ట్ చేసి డబ్బు డబుల్ చేసుకోండ్ఙి అంటూ లింకులు పంపుతారని, మీరు పెట్టుబడిగా పెట్టిన రూ.1000 లేదా రూ.2000కు ముందు డబుల్ నగదు ఇచ్చినట్లు చూపి నమ్మిస్తారన్నారు. తర్వాత భారీ లాభాల కోసం డిపాజిట్లు చేయమని చెప్పి మోసం చేస్తారన్నారు. అనంతరం యాప్ లింక్ బ్లాక్ చేయడం, డబ్బు విత్డ్రా కాకుండా చేయడం చేస్తారని తెలిపారు. వాట్సాప్ ద్వారా ఓ మహిళ రూ.1.98కోట్లు, మరో యువకుడు రూ.17 లక్షలు నష్టపోయారని తెలిపారు. ఓ యువకుడికి మ్యాట్రిమొనీ ద్వారా ఆన్లైన్లో పరిచయమైన యువతి..్ఙషేర్ మార్కెట్ ట్రేడింగ్లో గ్యారెంటీ ప్రాఫిట్ఙ్ అంటూ చెప్పి నమ్మించడంతో లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలిపారు. ఆర్బీఐ, ఎస్బీఐ వంటి చట్టబద్ధ సంస్థల నుంచి గుర్తింపు పొందని యాప్లలో డబ్బు పెట్టిమోసపోవద్దని సూచించారు. మోసానికి గురైతే సైబర్ క్రైమ్ సెల్ లేదా 1939కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఖాకీకి ‘పసుపు’ మరక అంటుకుంటోంది. అధికార పార్టీ నాయకులకు నాలుగో సింహం దాసోహమవుతోంది. వారు చెప్పిందే వేదంగా.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై జూలు విదిలిస్తోంది. అడ్డదారులు తొక్కి అయినా.. కేసుల్లో ఇరికించాలని చూస్తోంది. టీడీపీ బడా నేతల వద్ద మార్కులు కొట్టేసే పనిల
సాక్షి ప్రతినిధి, కడప: ఓ చిన్న ఉప ఎన్నిక.. అదీ పది వేల ఓట్ల ఎన్నిక.. ఎటువంటి బలం లేకపోయినా.. ఎలాగోలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని, అడ్డదారులు ఎంచుకుంది కూటమి సర్కార్. పులివెందులలో ప్రజాబలం కంటే పోలీసు బలాన్నే నమ్ముకొని ఎన్నికలు నడిపిస్తున్నారు. వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ వేధింపులు ప్రారంభించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్న నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా బలం లేకపోయినా.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి, బీటెక్ రవి సతీమణి మారెడ్డి లత పులివెందుల మండలమే కాదు. స్థానిక బలం లేకపోయినా అధికారం ఉంది కదా అని వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డిపై పోటీకి దిగారు. ఇక ప్రజా బలం లేదు కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో గెలిచాం అని చెప్పుకోవాలనే తాపత్రయం.. పులివెందుల నుంచి అమరావతి వరకూ టీడీపీ ప్రధాన నేతల్లో ఉంది. ఆపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న సోమవారం అసలు పులివెందులలోనే లేని వ్యక్తులపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. వైఎస్సార్సీపీ తరఫున ఉన్న వైస్ ఎంపీపీ విశ్వనాథ్రెడ్డిని లోబర్చుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేని, హైదరాబాద్కు పరిమితమైన వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిపై కేసు నమోదు చేయించారు. ఈ ఫిర్యాదులో పేర్కొనని వ్యక్తులను కూడా అందులో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. నల్లపురెడ్డిపల్లెకు చెందిన అచ్చుకట్ల భాస్కరరెడ్డి లాంటి వారిని కూడా కేసులో చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలా మాట వినని, వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసే నాయకులపై వేధింపులు ముమ్మరం చేస్తున్నారు. వేములలో వేల్పుల రామలింగారెడ్డిపై బైండోవర్ పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై వేముల పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తే వేముల, వేంపల్లె, తొండూరు, సింహాద్రిపురం, లింగాల, చక్రాయపేట పోలీసు స్టేషన్లలో కూడా అక్కడి నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త రీత్యా అనుకున్నా.. ఇరుపక్షాల నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి. ఇప్పటి వరకూ ఒక్క టీడీపీ నాయకుడిపై కూడా బైండోవర్ కేసు నమోదు కాలేదు. పులివెందులతోపాటు పక్క మండలాలల్లో కూడా వైఎస్సార్సీపీ నేతల్ని బైండోవర్ చేస్తుండటం గమనార్హం. ఒక్క పులివెందుల మండలంలో ఇప్పటికే సుమారు 80 మందిని బైండోవర్ చేసినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఒక్కరంటే ఒక్కర్ని కూడా బైండోవర్ చేయకపోవడం విశేషం. ఎలాంటి కేసులు లేకపోయినా... జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, అలా కుదరకపోతే కనీసం వైఎస్సార్సీపీ మెజార్టీని అయినా తగ్గించాలని టీడీపీ, బీజేపీ నేతలు జట్టుకట్టి మరీ పావులు కదుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం కంటే.. వైఎస్సార్సీపీ వారిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి పల్లెల్లో వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్ కేసులు ప్రారంభించారు. ఎన్నిక రోజు కీలక నాయకులను బయటకు రాకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు అసలు పోలీసు రికార్డుల్లోనే ఎటువంటి కేసూ లేని వ్యక్తులను కూడా స్టేషన్లకు పిలిచి వేధింపులకు దిగుతున్నారు. అలాంటి వారిపై కూడా అన్యాయంగా బైండోవర్ కేసులు పెడుతున్నారు. బైండోవర్ కేసులు నమోదు అయిన వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు అభ్యంతరం పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. ‘మీరెన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని బైండోవర్ చేసినా ప్రజాబలంతో విజయదుందుభి మోగిస్తాం’ అని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి, ప్రజలను మెప్పించి, ఒప్పించడానికి చేతకాక.. ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుని విజయం సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. మరో వైపు వైఎస్సార్సీపీ ప్రజల్లోకి దూసుకెళుతూ ప్రజలకు తాము చేసిన సేవలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వెరసిప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పూర్తి మద్దతు తెలుపుతుండటం విశేషం. వైఎస్సార్సీపీ కీలక నేతలు బైండోవర్ బీటెక్ రవి ఒత్తిడికితలొగ్గుతున్న పోలీసులు విశ్వనాథరెడ్డి ఫిర్యాదు మేరకు మరికొందర్ని లాగేందుకు సన్నాహాలు వ్యవస్థలను ముందుపెట్టి పబ్బం గడుపుకునే పనిలో పడ్డ టీడీపీ -
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు. వృత్యంతర శిక్షణలో భాగంగా కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో కేజీబీవీల ఉపాధ్యాయులకు మంగళవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయినులు యోగాపై అవగాహన పెంచుకుని కేజీబీవీ విద్యార్థినులకు నేర్పించాలన్నారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానందరాజు మాట్లాడుతూ యోగా నిర్వహించడంతో శారీరక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి ఉపాధ్యాయినులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, అఖిల్, అనూష, వింధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఉప పోరు.. ప్రచార జోరు
● ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ● మద్దతు తెలుపుతున్న ప్రజలు పులివెందుల: పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం పులివెందుల మండల పరిధిలోని ఆర్.తుమ్మలపల్లె, రాయలాపురం, రచ్చుమర్రిపల్లె గ్రామాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు.. అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ, బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆర్.తుమ్మలపల్లె గ్రామ పంచాయతీలోని మూడు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఊరు, ప్రాంతం అభివృద్ధి చెందిందంటే.. అది వైఎస్ కుటుంబ చలువేనని చెప్పుకొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. గత 40 ఏళ్ల నుంచి తమ గ్రామాలకు మేలు చేస్తున్న వైఎస్ కుటుంబానికే అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏ పథకం అమలు చేయలేదని వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలు తెలుపుతున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు కానీ, ఇప్పటి వరకు సిలిండర్ డబ్బులు తమ అకౌంట్లో జమ కాలేదన్నారు. తల్లికి వందనం ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు అన్నారని, అనేక కొర్రీలు పెట్టి ఇవ్వలేదన్నారు. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు అన్నారని, ఆ పథకం కూడా అమలు చేయలేదని వాపోయారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారే చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చంద్రబాబు మోసానికి, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీకి జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని, ప్రజలు వారి చర్యలను గమనించి వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని కోరారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్కుమార్ తెలిపారు. విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లోని డీఏవీ భారతి పాఠశాల విద్యార్థులు ఈ నెల 3న ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్త్రోలో నరేష్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకూ బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమ సీఎంఓ సాయిరమేష్, హెచ్ఆర్ హెడ్ గోపాల్రెడ్డి, ఐఆర్అండ్పీఆర్ హెచ్.భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి విద్యార్థితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. -
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆగష్టు 18వ తేదీ నుంచి కళాశాలలో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని తెలిపారు. జిల్లాలో, జిల్లా బయట ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగష్టు 21 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ పత్రాల పరిశీలన, 21 నుంచి 24వ తేదీవరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు, 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాల బోధన, బోధనేతర సిబ్బందిచే విద్యార్థుల కోసం కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగష్టు 27న సీట్లను కేటాయిస్తారని, 28వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు. -
ఎన్నికలకు దూరంగా సహకారం
కాశినాయన : వ్యవసాయ రంగం అభివృద్ధి కంటే రాజకీయంగా పదవుల పందేరానికి సహకార వ్యవస్థ దోహదపడుతోందనే ఆరోపణలున్నాయి. త్రీమెన్, ఫైవ్మెన్ కమిటీలను వేస్తూ రైతులకు తూతూ మంత్రంగా సేవలు అందిస్తున్నారు. ప్రశ్నించే వారే లేకపోవడంతో కొన్ని చోట్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో సహకార వ్యవస్థను తీసుకొచ్చారు. సహకార పరపతి సంఘాలను ఏర్పాటుచేసి వాటిద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలకవర్గాలను ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవడం క్రమేణా జరుగుతోంది. 2013 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్నికల తర్వాత ఇంతవరకూ తిరిగి ఎన్నికలు జరగలేదు. దాదాపు 12ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో సహకార వ్యవస్థ లక్ష్యానికి దూరంగా వెళుతోందని విమర్శలున్నాయి. ఈ క్రమంలో పట్టించుకునేవారే కరవయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో 77 సహకార సంఘాలున్నాయి. వాటికి మొన్నటి వరకు త్రీసభ్య కమిటీలుండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా కమిటీలను వేయలేదు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చేవి. పాలక వర్గాలు లేకపోవడంతో ఈ నిధులు మంజూరుకావడం లేదు. నిధులు రాక రైతులకు అందించే రుణాల్లో రాయితీలు దక్కని పరిస్థితి నెలకొంది. అంతేగాక వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించేలా పంపిణీ చేసే ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను రైతులు పొందలేకపోతున్నారు. పాలకుల సిఫారసుతోనే... సహకార సంఘాలకు ఏ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదనేది చెప్పేవారే లేరు. అధికారులు మాత్రం పాలకుల నిర్ణయం మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఇంతకు మించి వివరణ ఇవ్వలేమంటూ సమాధానం దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాల స్థానంలో నియమించే కమిటీలు ఆయా ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సిఫారసులతోనే ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ కమిటీలను ఎందుకు వేయలేదో అర్థం కావడంలేదు. రేపు మాపు అంటూ ఏడాది గడిపేశారు. ఈ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావాహుల ఆశలు నెరవేరడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 77 సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను వేసేందుకు సంబంధిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో ప్రక్రియ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార పార్టీ నాయకులు అంటున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవులతో సరి ఏడాదిగా అతిగతీ లేని వైనం -
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డిలు పార్టీలోకి రావాలని సముదాయించేందుకు ప్రయత్నించారన్నారు. భాస్కర్రెడ్డి ఫోన్ చేస్తే విశ్వనాథరెడ్డి ఫోన్ ఎత్తలేదని.. ఈ మాత్రానికే బెదిరించినట్లు కేసుపెట్టడం దారుణమన్నారు. వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐని కోరుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి మాట్లాడటాన్ని బట్టి చూస్తే వారి కుట్ర బయటపడుతోందన్నారు. ఆచ్చివెళ్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిని బలవంతంగా టీడీపీలో చేర్చుకున్రాని దళితులు చెబితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు తెరతీశారన్నారు. ఈకార్యక్రమంలో షేక్ షఫీ, బి.సుబ్బరాయుడు, ఎన్.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు. పలువురు వ్యాపారుల వద్ద వేరుశనగ కాయలు తెచ్చి వ్యాపారం సాగించాడు. అప్పుల భారంతో మంగళవారం ఉదయం తన మిల్లులోనే విష గుళికలు మింగాడు. పరిస్థితి విషమించడంతో అతనిని స్థానిక హోమస్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్ద ఓబుళరెడ్డి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై జరిగిన దాడి సంఘటనను పెన్నుతో చేతిలో రాసుకున్నట్లు గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొండాపురంలో అత్యధికంగా 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 10.6 మి.మీ, లింగాలలో 9.2, జమ్మలమడుగులో 4.2, మైలవరంలో 3.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నకిలీ సర్టిఫికెట్స్పై విజి’లెన్స్’ కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది బోగస్ సర్టిఫికెట్స్ ద్వారా ఉద్యోగాలు కల్పించారన్న అంశంపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఈ అంశానికి సంబంధించి విజిలెన్స్ శాఖ విచారణ చేపడుతోంది. అందులో భాగంగా ఆ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుకు సంబంధించిన ఫైల్స్ను తీసుకెళ్లి విజిలెన్స్ అధికారులకు అందజేసినట్లుగా తెలిసింది. విచారణ అనంతరం వెలువడే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిగ్రీ ఇన్స్టెంట్ పరీక్షల తనిఖీ కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ కేంద్రంగా జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సెమిస్టర్ ఇన్స్టెంట్ పరీక్షలను మంగళవారం విశ్వవిద్యాలయ ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే ఎస్వీ కృష్ణారావుతో కలిసి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. దీంతోపాటు పరీక్షా కేంద్రంలో వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలను అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.లక్ష్మి ప్రసాద్ వివరించారు. 278 మంది పరీక్షలకు హాజరు కాగా, ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని కృష్ణారావు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా పీ4 అమలు కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ అంశంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి పీ4 అమలు చేయాలన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న పీ4 లక్ష్యాన్ని 2029 నాటికి సాకారం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశంతో.. మార్గదర్శుల నుంచి అందే చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందన్నారు. డబ్బుతోపాటు సాయం చేసే వారు కూడా మార్గదర్శులే అని, ఆ దిశగా మార్గదర్శులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘పోషకాహారం’పై ఒప్పందం కడప సెవెన్రోడ్స్: సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్ను ప్రారంభించడం (ఎనాక్ట్స్) అనే కార్యక్రమాన్ని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియన్ స్కూలు ఆఫ్ బిజినెస్ హైదరాబాదు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం కలెక్టర్ శ్రీధర్ తన చాంబర్లో డిజిటల్ సైన్ చేసిన అవగాహన ఒప్పంద పత్రాన్ని ఐఎస్బీ బీఐపీపీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాత్రేకి సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఎస్బీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా సమకూరే నిధులతో సాంకేతిక మద్దతు ద్వారా పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల లభ్యత, అందుబాటు, పౌష్టిక సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకే ఈ ప్రాజెక్టును జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన సంపూర్ణ పోషణ కోసం ఆహార పంటల ఉత్పత్తిని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎస్హెచ్జీలు, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎనాక్ట్స్ ప్రతినిధులు వైష్ణవి, శ్మతి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ మహేశ్వరకుమార్, ఐసీడీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ మంగళవారం పరిశీలించారు. స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(స్సీటీపీసీ)కు శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలోడీటీసీ పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్లు, కిచెన్, జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ను చూసి త్వరితగతిన శిక్షణకు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానం, క్లాస్ రూమ్స్, రన్నింగ్ ట్రాక్, పరేడ్ గ్రౌండ్స్, డ్రిల్ ఏరియా, బాటిల్ అబ్స్టాకల్స్ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. శిక్షణ కేంద్రంలో వసతి సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. డీటీసీ డీఎస్పీ అబ్దుల్కరీం, డీటీసీ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్కుమార్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పులివెందులలో భయోత్పాతం!
వ్యవస్థలు నిర్వీర్యం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. నిర్జీవంగా చేష్టలుగి కూర్చుండిపోయాయి. చిన్న జెడ్పీటీసీ ఎన్నికల కోసం కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా అడ్డుకునే సాహసం చేయ డం లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, ఎన్నికలు సమీపించేకొద్దీ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏకపక్ష చర్యలు వీడి.. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధం కావాలని పలువురు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భయోత్పాతం సృష్టిస్తోంది. ప్రజామద్దతుతో నెగ్గలేమనే అంచనాకు వచ్చిన టీడీపీ.. పరువు కాపాడుకునేందుకు అఽధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు మొదలు.. అనేక అక్రమాలకు పాల్పడుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీకర్ ఫంక్షన్ హాల్లో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అనుచురులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తొండూరు మండలం సైదాపురం సురేష్రెడ్డి (చంటి), అమరేష్రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని మారణాయుధాలతో దాడి చేశారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీకర్ ఫంక్షన్ హాల్ వద్ద వివాహం కోసం వేచియున్న సురేష్రెడ్డి, అమరేష్రెడ్డి, శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్రెడ్డిలపై సుమారు 30 మంది టీడీపీ వర్గీయులు ఒక్కమారుగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ నేతల్ని చుట్టుముట్టి మారణాయుధాలతో విచక్షణా రహితంగా కొట్టారు. అమరేష్రెడ్డి తలకు బలమైన గాయాలు కాగా, సురేష్రెడ్డి తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. చేయి ఫ్యాక్షర్ అయ్యింది. అడ్డువచ్చిన ముగ్గుర్ని కూడా వదలకుండా దాడి చేశారు. ఏమి మాట్లాడకుండానే విచక్షణా రహితంగా దాడి: వైఎస్సార్సీపీలో యాక్టివ్ రోల్ పోషించే నాయకులే లక్ష్యంగా టీడీపీ టార్గెట్ చేసిందని ఈ ఘటన రుజువు చేస్తోంది. పట్టణంలో సైదాపురం చంటి, అమరేష్రెడ్డి అండ్ టీమ్ యాక్టివ్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తున్నారు. వీరికి ఎలాంటి పాత గొడవలు కూడా లేవు. వైఎస్సార్సీపీ పార్టీకి వీరవిధేయులు.. అదొక్కటే ప్రధాన కారణమైంది. క్రియాశీలక నేతలపై దాడి చేయడంతో భయాందోళనతో వైఎస్సార్సీపీ కేడర్ను చిన్నాభిన్నం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితులు వివరిస్తున్నారు. నిల్చొని ఉన్న వ్యక్తులపై అకారణంగా మాట కూడా మాట్లాడకుండా.. బీటెక్ రవి వర్గీయులు దాడి చేయడం వెనుక పులివెందులలో భయోత్పాతం సృష్టించే ఎత్తుగడగా పలువురు వెల్లడిస్తున్నారు. బాధితుల్ని పరామర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల పట్టణం శ్రీకర్ ఫంక్షన్ హాల్ వద్ద టీడీపీ నేతల హత్యాయత్నం సంఘటనలో గాయపడ్డ బాధితులు సైదాపురం సురేష్రెడ్డి, అమరేష్రెడ్డి, శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్రెడ్డిలను డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చిన్నప్ప, రజనీకాంత్రెడ్డి తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై స్థానిక వైద్యులతో చర్చించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు ఎంచుకోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబట్టుతున్నారు. వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంసమీపంలో ఫంక్షన్ హాల్ వేచియున్న వైఎస్సార్సీపీ నేతలపైమూకుమ్మడిగా దాడి సైదాపురం సురేష్రెడ్డి, అమరేష్రెడ్డిలను టార్గెట్ చేసిన బీటెక్ రవి అనుచరులు పరామర్శించిన కడప ఎంపీవైఎస్ అవినాష్రెడ్డి -
సాయుధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్
పులివెందుల : ఈ నెల 12వతేదీన నపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయుధ బలగాలతో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత, స్వేచ్చాయుత ఎన్నిక లక్ష్యంగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పిస్తూ కనంపల్లె, నల్లపురెడ్డిపల్లె, ఆర్.తుమ్మలపల్లె గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఎవరైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పులివెందుల సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రసవత్తరంగా విద్యుత్ ఉద్యోగుల క్రీడల పోటీలు కడప కార్పొరేషన్ : విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. స్థానిక జోనల్ ఆఫీసు మైదానంలో జరిగిన ఈ క్రీడల్లో వాలీబాల్లో కడప, కర్నూలు జట్లు తలపడగా కర్నూలు జట్టు విజయం సాధించింది. బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో కడప జట్టు విజయం సాఽధించింది. మహిళా ఉద్యోగినులకు చెస్, క్యారమ్స్ నిర్వహించారు. ఏపీ ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్ క్రిష్ణ కుమార్ ఈ క్రీడా పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శ్రీరామచంద్రమూర్తి, స్పోర్ట్స్ సెక్రటరీ మస్తాన్, వీరాంజనేయులు, కల్చరల్ సెక్రటరీ వీరభద్రయ్య, వెంకట సుబ్బయ, శరణ్ పాల్గొన్నారు. -
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. విక్రయ ఒప్పందం లేదా హక్కు పత్రంతో ఉన్న అనధికార లే అవుట్కు 90 రోజుల్లో వ్యక్తిగతంగా రెగ్యులైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగష్టు 4వ తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్లో ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తే పది శాతం, 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం పెనాల్టీ తగ్గింపు ఉంటుందన్నారు. ఇప్పటికే ఐపీఎల్పీ ఆమోదింపబడిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివరాలకు 9849966639 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. -
టీడీపీ నేత భూ ఆక్రమణలపై ఆర్డీఓకు ఫిర్యాదు
బద్వేలు అర్బన్ : పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్, టీడీపీ నాయకుడు చెరుకూరి వీరచెండ్రాయుడు భూ ఆక్రమణలపై పోరుమామిళ్లకు చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణరెడ్డి సోమవారం ఆర్డీఓ ఎ.చంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమ్మవారిపల్లెకు చెందిన టీడీపీ నేత వీరచెండ్రాయుడు తన అధికార బలంతో రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసి దాదాపు వంద కోట్లు విలువ చేసే భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రంగసముద్రం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 75 లో దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే 3.22 ఎకరాల భూమిని 2017లో అసైన్మెంట్ కమిటీలో డీకేటీ పట్టాలు పొందినట్లు చూపుతున్నారని, అసలు అసైన్మెంట్ కమిటీలో భూమి పొందేందుకు ఆయన ఎలా అర్హుడయ్యారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఇదే గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 419 లో 74 సెంట్లు, 432 లో 94 సెంట్లు అనువంశికం కింద ఆన్లైన్లో ఎక్కించారని, ఆ భూమి ఆయనకు అనువంశికం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే పోరుమామిళ్ల పట్టణంలోని సుందరయ్యకాలనీకి దక్షిణ భాగాన ఉన్న సర్వే నెంబర్ 136–5 లో మాజీ సైనికోద్యోగి నాగరాజు పేరుతో ఆర్మీ కోటాలో భూమి పొందారని, ఇది అధికారులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. జిల్లా అధికారులు స్పందించి టీడీపీ నేత భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని కోరారు. -
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ప్రొద్దుటూరు ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సోమవారం ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్కు చెందిన కుంటుమల్ల సంతోష్, మహేంద్రనగర్కు చెందిన చౌడం ప్రేమచక్రి, మత్స్యకాలనీకి చెందిన గొర్రె నాగసాయి మిత్రులు. వీరు జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు లోనయ్యారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నిషేధిత గంజాయి విక్రయించే మార్గాన్ని ఎంచుకున్నారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లోని యువకులను పరిచయం చేసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయిని చిన్న చిన్న పొట్లాల రూపంలో చుట్టి రూ.500 నుంచి రూ. 5000 వరకు విక్రయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు దొరసానిపల్లె రోడ్డులోని భావనారాయణ స్వామి ఆలయం వద్ద గంజాయి విక్రయిస్తుండగా ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రారెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1800 గ్రాముల గంజాయి, మూడు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన కుంటుమల్ల సంతోష్ విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం వద్ద గల ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి చౌడం ప్రేమ్చక్రి, గొర్రె నాగసాయిలకు విక్రయించేవాడని ఎక్సైజ్ సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు చెప్పారు. -
మృత్యు కుహరంగా పెన్నా నది
జమ్మలమడుగు : పెన్నానది మృత్యుకుహరంగా మారుతోంది. పెన్నానదిలో నీరు ఉండటంతో ఈత కోసం, స్నానాల కోసం దిగి లోతు తెలుసుకోలేక గుంతల్లో పడి మరణిస్తున్నారు. పెన్నానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రతి ఏడాది పెన్నానది లోకి తాగునీటి అవసరాల కోసం మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గుంతలన్నీ పూడిపోయి ఎక్కడ ఏమి ఉందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్కు చెందిన మనోహర్ అతని కుమారుడు ఇయోల్ సోదరి ఇంటికి వచ్చి పెన్నానదిలో భార్య కళ్లెదుటే భర్త, కుమారుడు నీటిలో మునిగి మరణించారు. ఇది మరచిపోకముందే ఆగస్టు 1వతేదీ చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బారికేడ్ల నిర్మాణం కోసం కడప నుంచి కూలీలు జమ్మలమడుగుకు వచ్చారు. పనులు పూర్తయిన తర్వాత స్నానం చేయడం కోసం పెన్నానదిలోకి షేక్ మున్నా, గోపాల్లు దిగారు. అయితే లోతును సరిగా గుర్తించలేక పోయి నీటిలో మునిగారు. అదే సమయంలో పెన్నానదిలో దుస్తులు ఉతికేందుకు వచ్చిన రజకులు పరుగున వచ్చి వారిని బయటకి లాగే ప్రయత్నంలో భాగంగా చీరె వేసినా వారు అందుకోలేకపోయారు. దీంతో ఇరువురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టి షేక్ మున్నా మృతదేహాన్ని బయటికి తీశారు. ఆయితే గోపాల్ మృతదేహాం రెండు రోజుల తర్వాత లభించింది. పెన్నానదిలో కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే పది మందికిపైగా మునిగి చనిపోయారు. పెన్నానది సమీపంలో హెచ్చరిక బోర్డులు పెట్టినా స్నానం చేసేందుకు చాలా మంది నీళ్లలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పెన్నానది లోనికి మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి గుంతలు అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఎవరు గుంతల్లో దిగినా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అధికారులు పెన్నానదిలోకి ఎవరూ దిగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.రెండేళ్ల వ్యవధిలోనే పది మందికిపైగా మృత్యువాత -
విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం
కమలాపురం : విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. సోమవారం కమలాపురంలో నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఫీజుల భారం అధికం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వర రావు, రెడ్డయ్య, రమణ, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక ఏఐఎస్ఎఫ్ కమలాపురం ఏరియా నూతన కమిటీని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. కమలాపురం ఏరియా అధ్యక్షుడిగా రాఘవేంద్ర, కార్యదర్శిగా షేక్ సాదిక్, ఉపాధ్యక్షుడిగా మణికంఠ రెడ్డి, తిలక్, సహాయ కార్యదర్శులుగా షేక్ రబ్బాని, సుబ్బరాయుడు, వెంకట సాయి, కోశాధికారిగా శశికాంత్, సోషల్ మీడియా సభ్యులుగా ఫయాజ్, అంజి తదితరులను ఎన్నుకున్నారు. -
నులి పురుగుల నివారణకు చర్యలు
కడప సెవెన్రోడ్స్ : పిల్లల్లో నులి పురుగులు నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా సోమవారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. 1 నుంచి 2 సంవత్సరాలలోపు పిల్లలకు 200 మిల్లీ గ్రాములు, 3 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 మిల్లీ గ్రాములు చొప్పున అల్బేండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం తర్వాత వీటిని మింగించాలన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మింగించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలు గోర్లు కత్తిరించుకోవడం, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాళ్లకు చెప్పులు ధరించడం, మరుగుదొడ్లను వినియోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. 1–19 ఏళ్ల పిల్లలకు ఈనెల 12, 20 తేదీలలో నులి పురుగుల నివారణ మందు మింగించాలన్నారు. తొలుత ఆమె ఇతర అధికారులతో కలిసి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్, ఐసీడీఎస్ పీడీ, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
యూరియా సహా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి
కడప సెవెన్రోడ్స్ : యూరియా సహా అన్ని రకాల ఎరువులను తక్షణమే రైతులకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రాన్ని సమర్పించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు ఎరువుల పంపిణీపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు పెంచి అక్కడే రైతులకు అందజేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్కు తరలించే వ్యాపారుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల నిల్వలపై వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు జీఎన్ భాస్కర్రెడ్డి, చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్యాదవ్, రైతు విభాగం కడప నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, చెన్నూరు వైస్ ఎంపీపీ చిన్నా, రాచిన్నాయపల్లె సర్పంచ్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడునందలూరు : నందలూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న తిరుపతి పట్టణం కరకంబేడు వీధికి చెందిన చంద్ర రమేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను స్టోర్ బియ్యం విక్రయం కేసులో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితుడిని సోమవారం నందలూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. -
జాగ్రత్తలను పాటించాలి..
ఈ వ్యాధి దోమకాటుతో వ్యాప్తి చెందుతుంది. కనుక గొర్రెల కాపర్లు సాయంత్రం వేళ 6 నుంచి 7 గంటలలోపే దోమలు కుట్టకుండా వేపాకు లేదా యూకలిప్టస్ ఆకు లేదా కలబందను కాల్చి మంద చుట్టూ వేయాలి. ఈ పొగకు దోమలు దూరంగా పారిపోతాయి. ముఖ్యంగా వ్యాధి సొకిన గొర్రెను మంద నుంచి వేరుచేయాలి. ఎందుకంటే దానిని కుట్టిన దోమ ఆరోగ్యంగా ఉన్న గెర్రెను కుడితే దానికి కూడా వ్యాధి సోకుతుంది. గొర్రెలు, మేకల షెడ్లలో కీటకాలను చంపేందుకు ముందులు పిచికారి చేసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది. – డాక్టర్ రాంబాబు, పశువైద్యాధికారి, కడప -
కల్యాణ మూర్తులకు మహా సంప్రోక్షణ
బ్రహ్మంగారిమఠం : శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి మాస కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం నూతన కల్యాణ విగ్రహ మూర్తులకు మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు గోపూజ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు స్వామి వారికి ఏటా జయంతి వేడుకలు, మహాశివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించే వారు. భక్తులు, దాతల విన్నపం మేరకు ప్రతి నెలా మాస కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఫిట్ పర్సన్ సి.శంకర్బాలాజి, మేనేజర్ ఈశ్వరయ్య, బెంగళూరుకు చెందిన గౌరీ శంకరాచారి, పద్మావతమ్మ దంపతులు, రవికుమార్, ఆయన సతీమణి నలినాక్షి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రేపు మాతా గోవిందమ్మ, వీరబ్రహ్మేంద్ర స్వామి మాస కల్యాణంకాలజ్ఞాన ప్రబోధ కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబల మాస కల్యాణ మహోత్సవం బ్రహ్మంగారిమఠంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక మఠంలో ఉన్న దివంగత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు. కల్యాణంలో పాల్గొనదలచిన భార్యాభర్తలు సంప్రదాయ దుస్తుల్లో రావాలన్నారు. కల్యాణం శాశ్వత దాతలుగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చి చేరేందుకు అవకాశం ఉందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తీర్మానాలను ఆమోదించండి కడప కార్పొరేషన్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 20వ తేదీ నగరపాలక సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను ఆమోదించి అమలు పరచాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కోరారు. సోమవారం కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, అజ్మతుల్లా, డివిజన్ ఇన్చార్జులు ఐస్క్రీం రవి, సుబ్బరాయుడు, బసవరాజులు అదనపు కమిషనర్ రాకేష్ చంద్రకు మేయర్ రాసిన లేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జూన్ 20వ తేదీ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మెజార్టీ కార్పొరేటర్లు తీర్మానించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జూలై 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ మేరకు ఆ అంశాలన్నింటినీ నగరపాలక సంస్థ మినిట్స్ బుక్లో రాసి వాటి అమలుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిరామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లి పంచాయతీ దళితవాడకు సమీపంలో ఈ నెల 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న కారును బైకు ఢీకొన్న ఘటనలో బోనంశెట్టి రవీంద్రకు తీవ్ర గాయాలైన విషయం విదితమే. ఆయన కడప రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రామాపురం పోలీసులు తెలిపారు. -
గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి
కడప అగ్రికల్చర్ : జిల్లాలో రుతుపవనాల ఆగమనంతోపాటు ఉపరితల ఆవర్తణంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు ప్రారంభమయ్యాయి. గొర్రెలు, మేకల యజమానులు మారిన వాతావరణంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో అప్రమతంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 433588 గొర్రెలు, 176123 మేకలు ఉన్నాయి. ఈ వర్షాల రాకతో గొర్రెలు, మేకలకు నీలి నాలుక వ్యాధి సొకుతుంది. ఈ వ్యాధిని ఆయా ప్రాంతాలను బట్టి మూతివాపు వ్యాఽధి, నోటి పుండ్ల వ్యాధి వంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి మందలో ఒకేసారి గొర్రెలకు సోకే అవకాశం ఉంది. వ్యాధి సోకిన గొర్రెలు మృత్యువాత పడే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక గొర్రెలు, మేకల కాపర్లు, యజమానులు ఈ వర్షాకాలంలో గొర్రెల పెంపకంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు పలువురు గొర్రెలు, మేకల యజమానులు తెలిపారు. వ్యాధి వ్యాప్తి ఇలా.. గొర్రెలకు ఈ వ్యాధి వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వైరస్ మాధ్యమిక అతిదేయి దోమ(క్యూలికాయిడ్స్) జాతికి చెందిన కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మందలో ఒక గొర్రెకు ఈ వ్యాధి వస్తే ఒక గొర్రె నుంచి మరో గొర్రెకి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ప్రబలుతుంది. వ్యాధి లక్షణాలు ఇలా.. ● గొర్రెలలోకి వైరస్ ప్రవేశించిన వారం రోజుల్లో దాని ప్రభావం కనిపిస్తుంది ● 105 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి ఐదు రోజుల పైబడి ఉంటుంది ● జ్వరం వచ్చిన 48 గంటల తర్వాత నోటి నుంచి చొంగ కారడం, నోరు మొత్తం ఎర్రగా మారడం, చొంగ కూడా నురుగలా మారి పెదవులు, చిగుళ్లు, పై దవడ, నాలుక వాచిపోవడం, నాలుక ఇరువైపులా పుండ్లు ఏర్పడి బాగా ఉబ్బి నీలిరంగుకు మారుతుంది. ● గొర్రెలకు రక్తపు జీరలు కనిపించడం, ముక్కు లోపల భాగం నుంచి చీము రావడం, చీముతోపాటు రక్తం రావడం చేస్తుంది. ఆ తరువాత ముక్కులో జిగురు ఎండిపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడి గొర్రెలు, మేకలు చనిపోయే అవకాశం ఉంటుంది, ఈ వ్యాధి గొర్రెలకు, మేకలకు సోకినప్పుడు వాటిల్లో గర్భస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ● వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో వ్యాధి కాళ్లకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం ఎర్రగా కందిపోయి వాచి చీముపట్టి నడవలేక కుంటుతాయి ● ఈ రోగం కారణంగా మేత తినలేకపోవడం వలన జీవాలు నీరసించి బరువు కోల్పోయి మృత్యువాత పడతాయి ● వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ● ఈ వ్యాధి మేకలకు అరుదుగా సోకుతుంది. వ్యాధి నివారణ ఇలా.. ● జబ్బు చేసిన వాటిని మందలోని ఆరోగ్యవంతమైన జీవాల నుంచి వేరు చేయాలి. తర్వాత వేరు చేసిన వాటికి చికిత్స చేయాలి. ● పొటాషియం పర్మాంగనేట్ ఒక శాతం ద్రావంతో నోటిలో పుండు కలిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి బోరో గ్లిసరిన్ ఆయింట్మెంట్ రాయాలి. లేదా టాపిక్యుర్ ఓరల్ స్ప్రే కూడా వాడవచ్చు ● పశువైద్య డాక్టర్ను సంప్రదించి పెన్సిలిన్, ఓరల్ ఎన్రోప్లాక్సోసిస్ వంటి యాంటిబయాటిక్లను, జ్వరం రాకుండా మెలోనెక్ష ప్లస్ మందులు నోటి ద్వారా గాని, ఇంజక్షన్ రూపంలో ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఇవ్వాలి. ● గొర్రెలు నీరసంగా ఉంటే గ్లూకోస్, ఎలక్ట్రాల్ పౌడర్ను నీటిలో కలిపి తాగించాలి. వ్యాధి నుంచి కోలుకున్నాక సైలెనులు ఎక్కించడం, లివర్టానిక్, బలానికి విటమినులు కలిగిన టానిక్లు, ఖనిజ లవణాలు అందించాలి వాతావరణ మార్పులతో గొర్రెలు, మేకలకు వ్యాప్తి అప్రమత్తం అవసరం అంటున్న పశువైద్యులు అల్లోపతి, ఆయుర్వేదిక్, హోమియో చికిత్సలతో నివారణఆయుర్వేదిక్ చికిత్స కూడా.. ఈ వ్యాధి సోకిన గొర్రెలు, మేకలకు నేరేడు చెక్క 100 గ్రాములు, తులసి ఆకులు 50 గ్రాములు, నేలవేము ఆకులు 50 గ్రాములు నూరి ముద్ద చేసి రోజుకు ఒక సారి 3 రోజులు ఇవ్వాలి. 150 గ్రాముల వావిల ఆకులు, 100 గ్రాములు వేపాకు ఒక లీటరు నీటిలో అర లీటరు ఆయ్యే వరకు మరిగించి ఆ అర లీటరు నీటిని రోజుకు రెండు సార్లు చొప్పున 3 రోజులు ఇస్తే తగ్గిపోతుంది. హామియో చికిత్స ఇలా.. వ్యాధి సోకిన వాటికి ఉదయం ఎకినేసియ 200, మెర్క్ సాల్ 200, ఆసియం 200 మందులు తీసుకుని 5 చుక్కలు లేదా 5 మాత్రలు, 5 ఎంఎల్ వైవిరాల్ అనే విటమిన్లు ద్రావణంలో కలిపి ఇవ్వాలి. మధ్యాహ్నం.. రుస్ టాక్స్ 200లను 5 చుక్కలు లేదా 5 మాత్రలు వేయాలి. సాయంత్రం.. పల్సటిల్ల 200లను 5 చుక్కలు లేదా 5 మాత్రలను వేయాలి. లేదంటే జెమ్ ఫార్మ వారి బూటి – డీఎస్ఓ అనే మందును వాడాలి. -
సెల్ఫోన్లను వెనక్కి ఇచ్చిన అంగన్వాడీలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలోని కడప అర్బన్ పరిధిలో అంగన్వాడీలు సెల్ ఫోన్లను సీడీపీఓలకు వెనక్కి ఇచ్చినట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, జిల్లా కోశాధికారి ఎంపీ అంజలీదేవి తెలిపారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా నెలలుగా సెల్ ఫోన్లు పనిచేయడం లేదన్నారు. అయినప్పటికీ ఐసీడీఎస్ అధికారులు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చామన్నారు. ఐసీడీఎస్ అధికారులు వెంటనే కొత్త సెల్ఫోన్లను ఇచ్చి మ్యాపుల పేరుతో భారం తగ్గించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాంతి. వెంగమాంబ, వినీల, భారతి. కవిత, సుమలత, ఉదయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతికలికిరి : ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం కలికిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కేవీ పల్లి మండలం నూతనకాల్వ గ్రామం దిండువారిపల్లికి చెందిన చింతపర్తి మంగమ్మ(82) కలికిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా కలికిరి పట్టణానికి చెందిన సుబహాన్ ఆటోతో ఢీకొన్నాడు. ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంగమ్మ కుమార్తె రామ కుమారి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవరుపై కేసు నమోదు చేశారు. -
కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’
మనిషి జీవించడానికి ప్రధానంగా కూడు, గూడు, గుడ్డ అవసరం. ఈ మూడింటిలో మనం తీసుకొనే ఆహారానికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆహర అంశానికి చెందిన కీలకమైన ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా కల్తీ నియంత్రణ కలగా మారింది. కడప రూరల్ : మనం తీసుకొనే ఆహార పదార్ధాలకు సంబంధించిన అంశాలను ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’పరిధిలోకి వస్తాయి. అంటే మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈ శాఖ పాత్ర ఎంతో కీలకమైంది. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. సంస్ధ లక్ష్యం ఇదీ... మనం తినే ప్రతి ఆహారాన్ని పర్యవేక్షించే బాధ్యతలు ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. హోటళ్లు, బేకరీలు, గోధుమ, పసుపు, నూనెలు, పండ్ల వ్యాపారాలు తదితర ఆహార పదార్ధాల విక్రయ తయారీ కేంద్రాల్లోని కల్తీలను ఆ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్లు ఉన్నాయి. కడప డివిజన్–1లో కడప కార్పొరేషన్తో పాటు బద్వేల్, మైదుకూరు. ప్రొద్దుటూరు డివిజన్–2 పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఉన్నాయి. ఒక డివిజన్కు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. వీరి పర్యవేక్షణలోనే కల్తీల తనఖీలు జరుగుతుంటాయి. ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటారు. వివిధ పదార్థాలు..వస్తువుల నుంచి ఒక నెలకు 12 శ్యాంపిల్స్ తీయాలి. అంటే ఒక శ్యాంపిల్తో పాటే అదనంగా రెండు తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్ను తీస్తారు. ఒక్కో శ్యాంపిల్ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్లోని నాచారంలో గల ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు పరీక్షల్లో నాసిరకం అని తేలితే ‘సబ్ స్టాండెడ్, మిస్ బ్రాండెడ్’ అని అంటారు. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరుగుతుంది. అలాగే తినడానికి వీలులేని పదార్థాలు, వస్తువులను ‘అన్సేఫ్’అంటారు. దీనికి న్యాయ స్ధానం శిక్ష ఖరారు చేస్తుంది. సంబంధిత వ్యకికి రూ 2 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు భారీగా జరిమానా పడడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అదేవిధంగా ఈ శాఖ ప్రభుత్వ రంగ సంస్థలైన హస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంస్థ లక్ష్యాల జాబితా చాంతాడంత ఉంటుంది. శాపంగా మారిన కొరత... కీలకమైన ఈ శాఖకు కొరత శాపంగా మారింది. ముఖ్యమైన జిల్లా ఆహార సహయ భధ్రతా అధికారి (అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్) పోస్ట్ ఇన్చార్జీల పాలనలో నడుస్తోంది. ఇన్నాళ్లు పనిచేసిన ప్రభాకర్రావు ఒక నెల క్రితం పదవీ విరయణ పొందారు. దీంతో నెల్లూరు జిల్లా అధికారి వెంకటేశ్వరరావును ఇక్కడ ఇన్ఛార్జి అధికారిగా నియమించారు. ఈయన మరో రెండు జిల్లాలకు కూడా ఇన్ఛార్జి అధికారిగా విధులను చేపడుతున్నారు. ఇక అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పాత్ర ఎంతో కీలకమైంది. కల్తీ నియంత్రణలో వీరి ప్రాత్ర ప్రధానమైంది. కడప డివిజన్–1లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఉన్న షంషీర్ఖాన్ మే 23వ తేదీన బదిలీ అయ్యారు. దీంతో ప్రొద్దుటూరు డివిజన్–2 విధులను చేపడుతున్న హరిత, కడప డివిజన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కార్యాలయంలో మరికొన్ని పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. ప్రధానంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లకు వాహనాలు లేకపోవడం శోచనీయం.చివరికి ఆ శాఖ జిల్లా సహయ అధికారికి కూడా వాహనం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నా..ఎవరైనా ఫిర్యాదు చేసినా బస్సులు లేదా తమ ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలి. మారుమూల ప్రాంతాల్లోకి ఉన్నఫలంగా వెళ్లాలన్నా, రోజు వారీ పనులను నిర్వహించాలన్నా, ఈ సంస్థ అధికారులకు పెద్ద పరీక్షలా మారింది. జిల్లాలో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు? జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు, వస్తువులను తయారు చేసే కేంద్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాగా ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. లైసెన్స్ పరిధిలోకి పెద్ద హోటళ్లు, నూనె తదితర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, హోల్సేల్, రిటైల్ డిస్ట్రిబ్యూటర్లు తదితర వ్యాపార కేంద్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ పరిధిలో చిన్న హోటళ్లు ఉంటాయి. అధికారికంగా అన్నింటినీ కలుపుకున్నా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగినవి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. గాలిలో పర్యవేక్షణ... ఆహర పదార్థాలు కలుషితం అవుతే మనిషి అనారోగ్యం పాలవుతారు. ఫుడ్ పాయిజన్ అయితే ఆరోగ్యం విషమంగా మారుతుంది. చిన్న పిల్లలు, పెద్దలకు కడుపులో మంట, నొప్పి, వాంతులు, విరేచనాలు ఇలా ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే డాక్టర్ వద్దకు వెళతారు. సదరు వైద్యుని నుంచి ‘ఎక్కడ తిన్నారు..ఏం తిన్నారు’. అనే ప్రశ్న వస్తుంది. కలుషిత ఆహరం తీసుకొని పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలు ఎన్నో చూశాం. కాగా సమస్యలు..ఇబ్బందులు ఇలా ఎన్నయినా ఉండవచ్చు. ‘ఆహార నియంత్రణ’లో పర్యవేక్షణ మాత్రం కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ శాఖను గాలికి వదిలేయకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వివరణకు ఏఎఫ్సీ వెంకటేశ్వరరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ హరితను సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు. సిబ్బంది కొరత కొరవడిన పర్యవేక్షణ నిస్సహయంగా మారిన ‘జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ’ -
1321 టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్ : జిల్లాకు 1321 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తెలిపారు. సోమవారం జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్ధన్తో కలిసి జిల్లాకు రాక్లో వచ్చిన ఎరువులను ఆయన పరీశీలించారు. వైఎస్సార్ జిల్లాకు 942 మెట్రిక్ టన్నులను కేటాయించగా ఇందులో 426 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్కు, మిగతా 516 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించారు. అలాగే అన్నమయ్య జిల్లాకు 380 టన్నులను కేటాయించారు. ఇందులో 235 టన్నులను మార్కెఫెడ్కు, మిగతా 145 టన్నులను ప్రైవేటు డీలర్లు కేటాయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ మాట్లాడుతూ డీలర్లు ఎవరైనా కృత్రిమ కొతర సృష్టించినా, అధిక ధరలకు అమ్మినట్లు తెలిసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన పులివెందుల మండలంలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశానన్నారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐలు ఉలసయ్య, వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. బి.ఫారాలు అందజేత కడప సెవెన్రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్రెడ్డి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వారిరువురికి సంబంధించిన బి.ఫారాలను కార్పొరేటర్ మల్లికార్జున, సోషల్ వెల్ఫేర్ మాజీ చైర్మన్ పులి సునీల్కుమార్ సోమవారం ఎన్నికల అధికారి సి.ఓబులమ్మకు అందజేశారు. సమస్యలు పరిష్కరించాలి కడప సెవెన్రోడ్స్ : వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు సోమవారం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీఓ తీసుకు రావాలన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డుల ప్రదానం చేపట్టాలని కోరారు. వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు చంద్రమోహన్రాజు, నూర్బాష, రాజేష్, రవిప్రకాశ్, సిద్దయ్య, నారాయణ, అమర్, పఠాన్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు. -
మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి
వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు ఒంటిమిట్ట : 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని, ఈ నెల 12న జరగబోయే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మీ సత్తా కూటమి ప్రభుత్వానికి చూపించాలని మండల ప్రజలతో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, కోనరాజుపల్లి పంచాయతీల్లోని గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలను కోరారు. అనంతరం మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..తప్పుడు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికతో బుద్ధిచెప్పాలన్నారు. ● ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సూపర్ సిక్స్ అంటు అధికారంలోకి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అహంకారాన్ని అణిచేవిధంగా ఎన్నిక ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ● ఎమ్మెల్యే సుధ మాట్లాడుతూ..రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమన్న టీడీపీ నేతలకు ఈ ఉప ఎన్నికల పలితాలు చెంప పెట్టుకావాలన్నారు. ● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతిని ఇస్తానని మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఫలితాలతో సిగ్గు రావాలన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ..రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇస్తున్న రూ. 2 వేలతో కలిపి రూ. 20వేలు ఇస్తానని రైతన్నను నిలువులా ముంచేసిన ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓడించాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఫించన్లు పెంచినట్లే పెంచి వెనుకల గోతులు తీసినట్లు సుమారు 1లక్ష 50 వేల మంది పింఛన్దారులను అనర్హులగా చేసిన సీఎం చంద్రబాబుపై ఈ ఉప ఎన్నిక సహాయంతో మీ తిరుగుబాటును చూపించాలన్నారు. – మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన సాగిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రెడ్ బుక్ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే వారందరిపై అక్రమ కేసులు, హత్యా రాజకీయం, మహిళలపై అత్యచారాలు, దాడులు చేస్తూ శాంతి భద్రతలు అనేటివి మంటగలుస్తున్నాయి. అలాంటి అధికార పార్టీ ని ఓడించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. ● ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ రాజు లేని రాజ్యంగా తయారైందన్నారు. ఒంటిమిట్ట మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత లేక వర్గ పోరుతో వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాంటి వారిని మనం గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు. ● రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపిస్తే మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకులు బలవంతంగా కండువాలు వేశారు
పులివెందుల : సోమవారం ఉదయం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పులివెందుల మండలం అచ్చివెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్ర, జయరాం, గంగాధర్, రామకృష్ణ, రోబో గంగాధర్, దేవుడు, గంగరాజు, ఓబులేసులు కలిశారు. ఈ సందర్భంగా ఎంపీతో వారు మాట్లాడుతూ ఆదివారం తమను తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా బలవంతంగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లుగా సృష్టించారు. మేము స్వచ్ఛందంగా టీడీపీలో చేరలేదని, తాము ఎప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయనకు తెలిపారు. అలాగే తమకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి తమకు ఆదివారం పట్టిన దోషాన్ని తొలగించాలని ఎంపీని కోరారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో ఎన్నో ఆరాచకాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అలాంటి వాటికి లొంగక దీటుగా ఎదుర్కొంటారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి పాల్గొన్నారు. -
అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం
వేంపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ అక్షయపాత్ర సంస్థ ద్వారా త్వరలో నాణ్యమైన భోజనాన్ని అందించనున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని రెండు మెస్లలో పురుగుల భోజనం పెడుతున్నారని శనివారం రాత్రి విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆదివారం ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అలాగే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్లతోపాటు ఆయా శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్సీ విద్యార్థులకు భోజనం అందించే మెస్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెస్ల తనిఖీలో అవినీతితోపాటు అపరిశుభ్రంంగా ఉండడంతో మెస్ నిర్వాహకులపై, అధికారులపై ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. మెస్ల వద్దనే సిబ్బంది మూత్ర విసర్జన చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అధికారులు కూడా అప్పడప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అంశం తేలిందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు అవినీతికి పాల్పడుతున్న మెస్ నిర్వాహకుల బిల్లులను ఆపాలని డైరెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలను అక్షయపాత్ర ఫౌండేషన్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆగస్టు చివరి వారం నుండి అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీలలో ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ వెంట గండి దేవస్థానం మాజీ ఛైర్మన్ జీవీ రమణ, డీవీ సుబ్బారెడ్డి, ఎస్పీ జయచంద్రారెడ్డి, ఇడుపులపాయ యూనిట్ ఇన్చార్జి పోతిరెడ్డి శివ, కావలి భాను కిరణ్, ట్రిపుల్ ఐటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి హామీ -
నంద్యాల డయాసిస్ బిషప్ ఎంపిక
కలసపాడు: నంద్యాల డయాసిస్ బిషప్గా కలసపాడుకు చెందిన కె.సంతోష్ ప్రసన్నరావును సినాడ్ సభ్యులు ఎన్నుకున్నారు. బిషప్గా ఉన్న పుష్పలలిత రిటైర్డ్ కావడంతో 2024 ఏప్రిల్లో జరిగిన బిషప్ ఎన్నికల్లో రెవరెండ్లు సంతోష్ ప్రసన్న రావు, నందం ఐజాక్, సాల్మన్, ఐజాక్ ప్రసన్న కుమార్ పోటీ పడ్డారు. సినాడ్ డయాసిస్లో మోడరేటర్ లేకపోవడంతో నంద్యాల బిషప్ ఎంపిక ఆలస్యమైంది. ఇటీవల మోడరేటర్ను ఎన్నుకున్నారు. ఆదివారం సినాడ్ సభ్యులు కె.సంతోష్ ప్రసన్న రావును బిషప్గా ఎన్నుకున్నారు. డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన సంతోష్ ప్రసన్న రావు హైదరాబాద్లోని బైబిల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి పాస్టర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ముద్దనూరు ఫాస్ట్రేట్ చర్చి డీనరీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన బిషప్గా ఎంపిక కావడంపై నంద్యాల డయాసిస్ చర్చి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కేథడ్రాల్ చర్చిలో సంతోష్ ప్రసన్నరావుకు బిషప్గా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులుతమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. చెస్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ కడప వైఎస్ఆర్ సర్కిల్: బెంగుళూరులో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్లో జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారులు ప్రతిభ చాటారని చెస్ కోచ్ అనీష్ దర్బారీ పేర్కొన్నారు. బెంగుళూరులోని గోల్డోన్ బీ గ్లోబల్ స్కూల్లో జరిగిన 3వ చెస్ ప్యూషన్ నేషనల్ లెవల్ చెస్ టోర్నమెంట్లో అండర్–8లో బాలికల విభాగంలోజిల్లాకు చెందిన వినమత్ర ట్రోపీ గెలుచుకుందన్నారు. అండర్ –10లో బాలికల విభాగంలో ప్రొద్దుటూరు చెందిన ధనిత మెడల్ అందుకుందన్నారు. కాగా కాగా సీనియర్స్ విభాగంలో చెస్ కోచ్ అనీష్ దర్బారీ ప్రథమ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకోవడం విశేషం. ఇంటర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎలక్షన్ ఆఫీసర్ నిత్యపూజయ్య ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ చేపట్టగా అన్ని పోస్టులకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా సురేష్, కార్యదర్శిగా వెంకటసుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్గా ఖాదర్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా మల్లికార్జునరాజు, ట్రెజరర్గా రాధాకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివప్రసాద్, ఉమెన్ సెక్రటరీగా ఇందుమతి, ఈసీ మెంబర్లుగా బాలనరసయ్య, శివప్రసాద్, చరణ్లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
సెప్టెంబర్ 8 నుంచి కడపలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సెప్టెంబర్ 8,9,10, తేదీలలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పంపిణీ –సాగునీరు – పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశాలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 200 మంది జాతీయ నాయకులతో పాటు కేరళ, బెంగాల్, త్రిపుర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎన్నికై న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఉంటే ప్రభుత్వ భూముల్లో ఉంటాము– లేకుంటే జైల్లో ఉంటాము‘ అనే నినాదంతో వ్యవసాయ కార్మికులందరూ గ్రామ, గ్రామాన దండుగా ఐక్య భూ పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూమిలేని గ్రామీణ నిరుపేదలకు భూ పంపిణీ చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ప్రతి వ్యవసాయ కార్మికునికి రోజువారీ కూలి 1000 రూపాయలు ఇస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ, అదానీలకు 20 లక్షల కోట్ల ఆదాయం పెంచారని, వ్యవసాయ కార్మికులకు రోజువారి ఆదాయం 200 కూడా పెంచలేదని విమర్శించారు. జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో 20 గ్రామాలలో భూ పోరాటాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎం.సుబ్బమ్మ, చేతి ఉత్పత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.పి.బయన్న, వీ.శివ నారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.చిన్ని, వి.శివకుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన
వీరభద్రస్వామిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిరాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి కలకడ : ట్రాక్టర్ అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. శనివారం రాత్రి కలకడ మండలంలోని రాతిగుంటపల్లె పంచాయతీ, బట్టావారిపల్లె సమీపంలోని టమాటా పంట సాగుకు వినియోగించే సీడ్స్ కర్రలను కలకడ మండలంలోని దేవులపల్లెకు తరలిస్తుండగా రాతిగుంటపల్లె పంచాయతీ లక్ష్మీపురం గ్రామం మలుపువద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవులపల్లెకు చెందిన వెంటరత్నం(38) అక్కడికక్కడే మృతి చెందగా, గుర్రంకొండ మండలం మర్రిమేకలవారిపల్లె దళితవాడకు చెందిన నరసింహులుకు కాలు విరిగి తీవ్ర రక్తగాయాలయ్యాయి. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారును ఢీకొన్న ద్విచక్ర వాహనంరామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ దళితవాడ సమీపంలో ఆదివారం ఆగి ఉన్న కారును టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్న సంఘటనలో బోనంశెట్టి రవీంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న టీఎన్ 01ఏఈ 7263 నెంబర్ గల కారు గువ్వలచెరువు దళితవాడ సమీపంలో ఆగి ఉండగా వెనుకవైపు నుంచి సరస్వతిపల్లెకు చెందిన బోనంశెట్టి రవీంద్ర ఏపీ02బివి 8652 నెంబర్ గల టీవీఎస్ ఎక్సెల్లో వస్తూ ప్రమాదవశాత్తు కారును ఢీకొన్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్లట్లు రామాపురం పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసలై ఇద్దరి మృతి మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో మద్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలోని బసినికొండకు చెందిన లక్ష్మన్న, పద్మ దంపతుల కుమారుడు పవన్ (40)కు 15 సంవత్సరాల క్రితం భారతితో వివాహం కాగా, పెళ్లయిన ఏడాదికే ఆమె అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటినుంచి పవన్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. ఆదివారం బసినికొండ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మార్పురి వీధికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫుద్దీన్ (38) మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగేవాడు. అతని భార్య హమీదా స్థానికంగా కూలి పనులకు వెళ్తూ కుమారుడిని కుటుంబాన్ని పోషించుకుంటుంది.వేంపల్లె : రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడు. ఆదివారం వేంపల్లె–రాయచోటి బస్సులో కండక్టర్ మహిళ మెడపై చెయ్యి వేసి నెట్టి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్దాం పద అన్న తర్వాత కండక్టర్ తగ్గాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపో బస్సులోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కారడం దారుణం.. వేంపల్లె – రాయచోటికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం రాయచోటి డిపోకు చెందిన ఏపీ02జెడ్ 0254 నంబర్ గల ఏపీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికులు మొత్తం వర్షపు నీటితో తడిచిపోయారు. వర్షం పడితే ఆ బస్సులో ప్రయాణికులు స్నానం చేసినట్లే అని వాపోతున్నారు. ఈ బస్సులో ప్రతి కిటికీకి అద్దం ఒకటే ఉంది. రాయచోటి ఆర్టీసీ డీఎం గమనించి ఇలాంటి పాతబడిన, కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు.ఒకరికి తీవ్ర గాయాలు -
కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాలని కేజీబీవీల సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపు నిచ్చారు. ఆదివారం కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్,కెమిస్ట్రీ సబ్జెక్టు టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణకు రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీలలో విద్యనభ్యసించే విద్యార్థులంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారికి సేవ చేయడం మన అదృష్టింగా భావించాలని కోరారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే వారే నిజమైన ఉపాధ్యాయులన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు -
అన్నింట్లో ‘కోత’లే!
మాటల్లో.. సాయంలో.. కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం రైతులను మరోసారి దగా చేసింది. అధికారంలోకి రాకముందేమో అన్నదాత సుఖీభవ కింద ఏటా ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మాటల్ని కోటలు దాటించింది. అధికారంలోకి వచ్చాక నిధుల్లో కోత కోసింది. రైతులకు వ్యవసాయంలో అండగా నిలబడాల్సింది పోయి అవస్థలకు గురి చేస్తోంది. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలో పలు రకాల కొర్రీలతో కోత విధించి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెబ్ల్యాండ్లో నమోదు చేసిన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా నిధులను మంజూరు చేసి ఆర్థిక చేయూతనందించి పంటలసాగుకు అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా సాయంలో కోత కోసింది. వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ అన్నదాత సుఖీభవ నిధుల్లో ఎగనామం పెట్టింది. జిల్లావ్యాప్తంగా 16,434 మంది నిధులందక కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెబ్ల్యాండ్ అధారంగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రైతులకు అందించిన రైతు భరోసా పథకానికి వెబ్ల్యాండ్లో భూమి ఉందా లేదా అని మాత్రమే పరిశీలించి పేర్లున్న ప్రతిరైతుకు ఆర్థిక భరోసా కింద ఏటా రూ.13,500 సహాయం అందించారు. దీనివల్ల ఒక్క రైతుకు నష్టం కలగలేదు. అందరికీ సహాయం అందింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో రూ.1191.03 కోట్ల మేర రైతులకు లబ్థి చేకూరింది. ఇప్పుడు కొర్రీలు.... కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయాన్ని ఏటా ఇస్తామని ప్రకటించింది. మొదటి ఏడాది రైతులకు ఎగనామం పెట్టిన ప్రభుత్వం..రెండో ఏడాదిలో దీన్ని అమలు చేయడం కోసం కొర్రీలు విధించింది. లేనిపోని నిబంధనలు పెట్టడంతో జిల్లాలో 16,434 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కొల్పోయారు. దీంతో పథక అమలులోనే తొలి విడత నిధుల కింద రూ. 11.50 కోట్ల ఆర్థిక సహాయన్ని పొందలేకపోయారు. అసలే కరువుతో ఇబ్బందులు పడు తున్న రైతాంగానికి అండగా నిలవాల్సిన ప్రభు త్వం పథకం అమలులో మొండిచెయ్యి చూపింది. ఈ లెక్కన అర్హత కోల్పోయిన రైతులు ఏడాది మొత్తానికి రూ.20 వేలు చొప్పున రూ. 328.68 కోట్లు మేర నష్టపోనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల వివరాలుసంవత్సరం రైతుల విడుదలైన సంఖ్య నిధులు (కోట్లలో) కూటమి ప్రభుత్వంలో 1,94,047 మందికే అన్నదాత సుఖీభవ జిల్లావ్యాప్తంగా 16,434 మందికి ఎగనామం తొలి విడతలో రూ.11.50 కోట్లు నష్టపోయిన రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,10,481 మంది రైతులకు లబ్ధి 2019–20 206708 279.93 2020–21 208747 280.06 2021–22 199344 269.11 2022–23 202598 235.68 2023–24 210481 277.56 -
పోలీసుల గస్తీ
సిద్దవటం: సిద్దవటం పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్వే పై పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సుబ్బరామచంద్ర మాట్లాడుతూ సిద్దవటం వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు, సిద్దవటం ఎస్ఐ సూచనల మేరకు కాజ్వేపైన పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా మందస్తు చర్యగా అక్కడికి పర్యాటకులను రానివ్వలేదన్నారు. ఉదయం చేపలు పట్టే వారు వస్తే వారిని కూడా అక్కడినుంచి పంపిచేశామన్నారు.కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి నదిలోకి దిగుతారనే ఉద్దేశంతో కాజ్వే వద్ద ఉన్నామని ఏఎస్ఐ తెలిపారు. -
చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా
సాక్షి టాస్క్ఫోర్స్ : చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. సంబంధిత శాఖల అధికారులు వారికి కూటమి ప్రభుత్వం నేతల అండదండలు ఉన్నాయనే నెపంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గుట్టలు, చెరువులు గుల్ల చేసిన గ్రావెల్ మాఫియా అటవీ ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్ లభిస్తుండటంతో రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో సైతం చెట్లను తొలగించి గ్రావెల్ తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా రేయింబవళ్లు కొలుములపల్లె పంచాయతీలోని గుర్రంగుంపు రిజర్వాయర్ పైభాగంలోని దక్షిణ దిశలో రిజర్వు ఫారెస్ట్ గుల్ల చేస్తూ మూడు పెద్ద హిటాచీలు, 30 టిప్పర్లు ఏర్పాటు చేసుకొని గ్రావెల్ మాఫియా వ్యాపారం చేస్తోంది. యథేచ్ఛగా జాతీ య రహదారిపై మూడు రోజులుగా టిప్పర్లు గ్రావెల్ లోడుతో ప్రయాణిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
● ప్రతిఘటిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుతమ్ముళ్లు కుట్రలకు తెరలేపుతున్నారు. టీడీపీకి బీజేపీ తోడు కావడంతో ‘లెక్క’ లేనన్ని కుట్రలు, బెదిరింపుల కుతంత్రాలు తెరపైకి తెరపైకి తెస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ సీటు కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారులు ఎంచుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేయడం లేదంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఈమొత్తం వ్యవహారం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బిటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కేంద్రంగా నడుస్తోంది. ● ఈనెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి సర్కార్ అడ్డదారులు ఎంచుకుంది. వైఎస్సార్సీపీకి గణనీయమైన ప్రజాబలం ఉండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేమనే అంచనాకు టీడీపీ,బీజేపీ నేతలొచ్చారు. ఈ క్రమంలో ప్రలోభాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పులివెందుల పరిధిలో ఇద్దరు నేతలకు టీడీపీ కండువా కప్పారు. మరికొందర్ని అలాగే పార్టీ మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల యత్నాలను కొంతమంది తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అలాంటి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అప్పటికీ కాదు కూడదన్నవారికి పోలీసు వ్యవస్థ ద్వారా భయపెడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్స్టేషన్కు పిలిపించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎటువంటి కేసులు లేకున్నప్పటికీ ఎన్నికలలో గ్రామ స్థాయి నాయకుల ప్రభావాన్ని కట్టడి చేసే చర్యలకు దిగారు.‘అసలెందుకు పోలీసుస్టేషన్కు మమ్మల్ని పిలిపించార’ని ఎవరైనా అడిగితే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల కోసం పిలిచామని బదులిస్తున్నట్లు సమాచారం. పోలీసు వ్యవస్థ శృతిమించి వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ కోసం కృషి చేస్తే తప్పు లేదు కానీ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు వెల్లడిస్తున్నారు. ఉస్కో అంటే చాలు.. ఎగిరిపడుతున్న వ్యవస్థలు జెడ్పీటీసీ ఎన్నికలల్లో ఓడిపోతామనే భయంతో కనీస పరువు దక్కించుకోవాలనే దిశగా టీడీపీ, బీజేపీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఆ మేరకు వ్యవస్థలను ఇప్పటినుంచే వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం కడప విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంటు సీఐ శివన్న తదితర అధికారులు తనిఖీల పేరిట పల్లె బాట వెళ్లారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుడుగా ఉన్న అచ్చవెల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జనార్ధన్రెడ్డి రేషన్షాపులో రెవెన్యూ, విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు ఉమ్మడిగా తనిఖీలు చేపట్టారు. నిర్ణయిత పరిమితి కంటే 2కిలోలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ రూ.2 విలువైన రెండు కిలోలు బియ్యం స్వాహా చేశారని కేసు నమోదు చేయడాన్ని ఆశ్చర్యం కల్గించినా విజిలెన్సు అఽధికారులు కేసు నమోదు చేసిన విషయం వాస్తవమే. ఈ సాకుతో రేషన్ డీలర్షిప్ను రద్దు చేసే ఎత్తుగడను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్న బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆది ద్వయం మాట పెడచెవిన పెట్టినవారిపై వ్యవస్థలతో దాడి అచ్చవెళ్లి రేషన్షాపు డీలర్పై విజిలెన్సు తనిఖీలు బెదిరింపులో భాగమే తెరపైకి వస్తున్న పోలీసు అధికారుల వేధింపులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రలోభాలు బెదిరింపులను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిఘటిస్తున్నాయి. పులివెందులలో ఇటీవల పార్టీ ఫిరాయించిన ఇరువురు నేతలు పలు రకాలుగా ఆశలు చూపుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో ‘మీరా..మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసేది, మీరేంత, మీ స్థాయి, శక్తి ఎంత?’ అంటూ బాహాటంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సమస్యలుండొచ్చు అంతమాత్రనా వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెంచలేరంటూ పలువురు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘మీరేదో కక్కుర్తి పడి వెళ్లారు, ఇలాంటి వ్యవహారాల్లో తలదూరిస్తే.. ఇక మర్యాద ఉండదు..’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. -
ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి
కడప కార్పొరేషన్: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్న జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనుంబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందన్నారు. పోలీసులను ఉపయోగించి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు కూడా బనాయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రూ.1.87లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేదన్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో లబ్ధిదారులను కోత కోశారన్నారు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఐదు రోజులపాటు జరిగే ప్రచార కార్యక్రమాల్లో అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొని ఇంటింటి ప్రచారం చేయా లని సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, పాకా సురేష్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు, టీపీ వెంకటసుబ్బ మ్మ, జాషువా, దేవిరెడ్డి ఆదిత్య, మేసా ప్రసాద్, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపు -
భయానక వాతావరణం సృష్టిస్తున్న టీడీపీ నాయకులు
పులివెందుల టౌన్ : ఈనెల 12వతేదీన జరగనన్ను పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ నాయకులు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి ఆరోపించారు. ఆదివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో రాజకీయ క్రీడ జరగడంలేదని, జూదగాళ్ల క్రీడ జరుగుతోందన్నారు. తొడలు కొట్టి, మీసాలు మెలేసి ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఇన్చార్జి మంత్రి సవితకు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప వీరికి రాజకీయ విలువలు తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే వంద కోట్ల రూపాయల పార్టీ ఫండ్ కోసమే బీటెక్ రవి ఆయన భార్యను పోటీకి నిలబెట్టారన్నారు. పులివెందులలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని, ఈ విషయం బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి బాగా తెలుసు అన్నారు. ఈనెల 12వ తేదీన జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరిగి వైఎస్సార్సీపీ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తామన్నారు. పులివెందులకు మెడికల్ కళాశాల అవసరమని ముఖ్యమంత్రిని అడిగే దమ్ములేని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం చేస్తే అక్రమ కేసులు పెడతామని, రౌడీ షీట్ తెరుస్తామని ఇప్పటి నుంచే బెదిరింపు కాల్స్ మొదలయ్యాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ వైద్య విభాగాం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
‘జెడ్పీటీసీ’ విజయానికి సమష్టిగా కృషి చేద్దాం
పులివెందుల రూరల్: పులివెందుల మండల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఈనెల 12న జరిగే ఎన్నికలలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా పనిచేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె, అచ్చివెళ్లి, కనంపల్లె, రాగిమానుపల్లె, మోట్నూతలపల్లె గ్రామాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాలన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా.. ప్రజలకు పథకాలు అందడం లేదనే విషయాన్ని గ్రామాల్లోని ఓటర్లకు వివరించాలన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని... ఆయన చెప్పిన పథకాలన్నింటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకొని ఇప్పటికే పులివెందుల మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుంటుండడం సరికాదన్నారు. పచ్చ నేతల కుట్రలను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నేటి నుంచి సమిష్టి కృషితో కష్టపడి పని చేయాలన్నారు. తుమ్మల మహేశ్వరరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని.. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్రెడ్డిని గెలిపించి పులివెందుల ఖ్యాతిని నిలబెట్టే విధంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. చంద్రబాబు పాలనలో భవిష్యత్ అంధకారం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 14నెలల్లోనే ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు సక్రమంగా అమలుచేయక రాష్ట్ర ప్రజలను ముంచారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. ఓట్ల కోసం అలివికాని హామీలు ఇచ్చిన బాబు మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలు కరువు బారిన పడ్డారన్నా రు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, పథకాల ఎగవేతపై ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి సర్కార్ అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 14, 16 బాలబాలికల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి 60 మీటర్లు, 600 మీటర్లు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్పుట్, జావెలిన్త్రో ట్రయథ్లాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మర్ బాషా తెలిపారు. వీరు ఈనెల 9, 10, 11వ తేదీల్లో బాపట్లలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. వ్యాయామ సంచాలకులు నాగూర్ బాషా, శివారెడ్డి, ఎర్రన్న, శంకర్, నరేష్, చందు, నాగేశ్వరరావు, ఖాదర్రెడ్డి, దిలీప్, కోచ్ వివేకానందరెడ్డి, రబ్బాని, భార్గవ్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణలో సహకరించారన్నారు. -
ప్రభుత్వం సహకరిస్తే పతకాలు సాధిస్తాం
శాప్ డైరెక్టర్ రమణరావు కడప రూరల్: ప్రభుత్వం సహకరిస్తే పతకాలు సాధిస్తామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ డైరెక్టర్ (శాప్) ఆరికపూడి రమణరావు అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు కడప క్రీడా పాఠశాలను తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాలు, క్రీడాకారుల మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు. అలాగే క్రీడాకారులతో మాట్లాడామని తెలిపారు. క్రీడల్లో పతకాలు సాధించాలంటే నిధుల అవసరం ఎంతో ఉంటుందన్నారు. క్రీడలకు బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయించినపుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించవచ్చన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే పతకాలను సాధిస్తామని తెలిపారు. మరో డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారని, మరో రెండు వేల మంది ఫిజికల్ డైరెక్టర్లు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్లు తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. జిల్లా స్కూలు గేమ్స్ సెక్రటరీ అరుణకుమారి, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు సాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ జోరుగా ఇంటింటి ప్రచారం చేసింది. ఆదివారం మండల పరిధిలోని దర్జిపల్లి, గొల్లపల్లి, దవంతరపల్లి, నరసన్నగారిపల్లి, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లి గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా ప్రజా పరిషత్కు సంబంధించిన నిధులు మండల అభివృద్ధికి వినియోగించాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీకి వేసే ప్రతి ఓటు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మోసానికి చెప్పపెట్టు అన్నారు. సోమశిల ముంపు వాసులకు నష్టపరిహారం అప్పటి ప్రభుత్వం తక్కువగా ఇస్తే ఇక్కడి రైతులతో కలిసి తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి మాట్లాడుతూ తనపై వైఎస్సార్సీపీ పెట్టుకున్న నమ్మకానికి మండల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని, ఉప ఎన్నికలో తప్పక విజయం సాధించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, కొత్తమాధవరం 1,2,3 వార్డుల సర్పంచ్ చేపూరి ఓబయ్య, మండల ప్రచారం విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్ పాల్గొన్నారు. -
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. దీంతో ఇప్పటికే మంజూరైన కాలేజీలు కనుమరుగయ్యాయి. కేటాయించిన సీట్లు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వ హోమియోపతి వైద్య రంగం కూడా అచేతనంగా మారింది. తాజాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్లను ఒక్కట
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది. ‘యూజీ‘లకు తీవ్ర నష్టం డాక్టర్గా సేవలు అందించాలనేది బైపీసీ విద్యార్థుల కల. నీట్ పరీక్షలు రాశాక, ర్యాంకులు, ఇతర నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం వరస క్రమంలో మొదటగా ఎంబీబీఎస్ తరువాత బీడీఎస్ (డెంటల్), ఆయుర్వేదం, హోమియెపతి, యూనానిలో సీట్లను కేటాయిస్తారు. కాగా హోమియోపతికి సంబంధించి ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చిన వారు నాలుగున్నరేళ్ల పాటు యూజీ (అండర్ గ్రాడ్యుయేట్), ఒక ఏడాది హౌస్ సర్జన్గా చేయాలి. అనంతరం కీలకమైన పీజీ (పోస్టు గ్రాడ్యుయేట్) పూర్తి చేయాలి. ఇది మూడేళ్ల కోర్స్. ఈ కోర్స్ను పూర్తి చేసిన వారు మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా లేదా డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. పీజీకి అర్హత సాధించాలంటే ఇంకా కష్టపడి చదవాలి. కాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో ఏటా 38 మంది విద్యార్థులు యూజీ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి వారు కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి ఒక్క పీజీ సీటును కూడా కేటాయించకపోవడం దారుణం. గుడివాడ కాలేజీకి మాత్రమే సీట్లను కేటాయించడం గమనార్హం. ఇప్పుడు కడప కాలేజీకి పీజీ సీట్లను కేటాయించకపోవడం వల్ల.. ఇకపై పీజీ సీట్లను కేటాయించరనే వాదన వినిపిస్తోంది. అదే గనుక జరిగేతే యూజీ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రయాదం ఉందని.. ఈ రంగానికి చెందిన ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ హోమియోపతి కాలేజీలకు పీజీ సీట్ల కేటాయింపుల వివరాలు సంవత్సరం 2024 2025 యూజీ పీజీ యూజీ పీజీ పాలకుల నిర్లక్ష్య వైఖరే కారణం కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీపై శీతకన్ను పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కేటాయించని కౌన్సిల్ పట్టించుకోని పాలకులు కడప 38 08 38 – గుడివాడ 50 24 50 12 రాజమండ్రి 60 24 50 – కేటాయింపుల కోసం ప్రయత్నాలు కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్ల కేటాయింపుల అంశానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ కమిషనర్ దినేష్కుమార్ చర్యలు చేపడుతున్నారు. – డాక్టర్ శోభారాణి, ఇన్చార్జి ప్రిన్సిపల్, ప్రభుత్వ హోమియోపతి కాలేజీ, కడపకూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కకావికలమైంది. ఆ రంగానికి చెందిన అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పులివెందుల వంటి మెడికల్ కాలేజీ కనుమరుగైంది. కేటాయించిన సీట్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే ఒరవడిలో హోయోపతి వైద్య రంగం కూడా సమస్యలతో సతమతం అవుతోంది. పాలకపక్షం నుంచి కేంద్రంను ‘మాకు మెడికల్ కాలేజీలు.. మెడికల్ సీట్లు కావాలి’ అని అడిగే వారే కరువయ్యారు. దీంతో వైద్య రంగం పతనావస్థకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదన్నారు. అవినీతికి, దుర్మార్గాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు. పోలీసులను ముందుపెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘మేము ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ యాత్రలు చేసేవారా’ అని ప్రశ్నించారు. ‘ఎలా పాలించారో మీరే మాకు నేర్పిస్తున్నారు, ఏదైతే విత్తుతున్నారో అదే పెరిగి పెద్దదవుతుంది’ అన్నారు. ఇది పర్మినెంట్ ప్రభుత్వం కాదన్న సత్యాన్ని పోలీసులు, అధికారులు గుర్తించాలన్నారు. అలా కాకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే దానికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కేసీ కెనాల్కు నీరు వచ్చాయని రైతులు పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో.. యూరియా కొరత ఏర్పడిందని, సొసైటీల ద్వారా నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారని, మిగిలింది బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో కూటమి నామరూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఇది సుపరిపాలన కాదు.. అరాచక పాలన: రఘురామిరెడ్డి సుపరిపాలనకు తొలి అడుగు అంటూ కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం చేసేవన్నీ అరాచకాలేనని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో వైఎస్సార్సీపీ గెలిచిందని, కూటమి నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వారు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. జెడ్పీ ఉప ఎన్నిక పోలీసులకు అగ్ని పరీక్షలాంటిదన్నారు. ఈ ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించి పోలీ సులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో మీరు ఏదైతే చదువు చెప్తున్నారో రేపు అదే గిఫ్ట్గా వస్తుందని హెచ్చరించారు. మాకు పోటీ టీడీపీ కాదు.. పోలీసులే: రాచమల్లు జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీపై పోటీ చేస్తున్నది టీడీపీ కాదని, పోలీసులేనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగితే తామే విజయం సాధిస్తామన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం జరిగే ఐదు రోజుల్లో ఒక్క గొడవ గానీ, అవాంఛనీయ సంఘటనలు గానీ జరక్కుండా ఎన్నికలు జరిపితే పోలీసులను అభినందిస్తామన్నారు. ఏం జరిగినా వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసులు పెడితే మాత్రం మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, నాగేంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.కిశోర్ కుమార్, బంగారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ ఉప ఎన్నికలపై కోర్ కమిటీలో చర్చ త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గురుమోహన్, కె.నాగేంద్రారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి, సోషల్వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్, దాసరి శివ, బంగారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా పరిపాలించాలని మీరే చూపిస్తున్నారు ఇది పర్మినెంట్ ప్రభుత్వం కాదని పోలీసులు, అధికారులు గుర్తుంచుకోవాలి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
రైతు ఖాతాలకు నగదు జమ
కడప అగ్రికల్చర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు శనివారం రైతు ఖాతాలకు జమ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రూ.5 వేలు ఇలా మొత్తంగా రెండు పథకాలకు సంబంధించి 2025–26వ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా 1,94,047 మంది రైతులకు రూ.132.93 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధుల రాకతో అన్నదాతలకు పంటల సాగుకు కాసింత ఆర్థిక చేయూత లభించింది. డిప్లొమో ప్రవేశాల గడువు పొడిగింపు కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమో కోర్సు లలో ప్రవేశానికి ఈ నెల 11వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల పంచాలకులు టి.లక్షీప్రసాద్ తెలిపారు. జర్మలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్ ఆర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించిన వారు అర్హులన్నారు. కౌన్సెలింగ్కు అభ్యర్థులు అన్ని రకాల అర్హత పత్రాలతో నేరుగా విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. సాయంకాల తరగతులు కావడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు, పీజీ స్థాయి కోర్సులు చదువుతున్న వారు కూడా ఇందులో ప్రవేశం పొందవచ్చన్నారు. వివరాలకు యోగి వేమన విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.yvu.edu.inను సందర్శించాలని సూచించారు. 5న గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి ఇంటర్వ్యూలు కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ పీజీ కళాశాలలోని ఎంబీఏ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం కోసం ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ ఆలైడ్ బ్రాంచెస్), ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) అర్హతలు కలిగి ఉండాలన్నారు. ఎంబీఏ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ పేపర్లు, అలాగే అనుబంధ అంశాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ ఇన్ ఆర్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా వేరు హౌసింగ్ అండ్ మైనింగ్, బిజినెస్ అనలిటిక్స్, టాబ్ల్యూ, పవర్ బీ ఐ, డీజీఎంఎస్, డేటా విజువలైజేషన్లలో బోధించే వారు కావాలన్నారు. అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు బయో–డేటా అలానే సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో నేరుగా ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావా లని సూచించారు. రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు www. yvu.edu.in వైబ్సెట్ను సందర్శించాలని ఆయన సూచించారు. అన్నదాతల పంటల సాగుకు చేయూత కడప అగ్రికల్చర్: అన్నదాతల పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోందని కృషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు రైతుల ఖాతాలోకి రూ. 2 వేల నగదు జమకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూపీలోని వారణాసిలో ప్రారంభించిన ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం శనివారం కేవీకేలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ కింద ఏటా రైతులకు రూ.6 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. కడప ఏడీఏ సురేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ కడప నియోజకవర్గంలో 1576 మంది రైతులకు 19 లక్షలు పీఎం కిసాన్ డబ్బులు రైతు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం మెగా చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్ర సమన్వయకర్త అంకయ్యకుమార్, ఆత్మ పీడీ విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు ప్రశాంతి, శిల్పకళ, మహేష్బాబు, మానస, సురేస్రెడ్డి, గిరీష్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం
వైభవంగా రెండో శనివారోత్సవం చక్రాయపేట: గండి వీరాంజనేయస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం రెండో శనివారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం కంటే ఈసారి భక్తులు సంఖ్య పెరిగిందని ఆలయ వర్గాల అంచనా. ఉదయం నుంచి క్యూలైన్లు మధ్యాహ్నం 3 గంటల వరకు కిక్కిరిశాయి. పలువురు భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, అర్చకులు రఘు, సాయిలు ఉదయాన్నే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. గండికి వచ్చిన కొందరు భక్తులు తలనీలాలు ఇచ్చి స్నాన ఘట్టాల వద్ద స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్నారు. కడప సర్వజన ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చక్రాయపేట ప్రభుత్వ వైద్యశాల తరఫున వైద్య శిబిరం నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి సత్వరం చికిత్సలు చేశారు. అయితే వీవీఐపీ క్యూలైన్కు తాళం వేసి వాటి తాళాలు ఆలయ సిబ్బంది వద్దనే ఉంచుకొని పలువురు ప్రజాప్రతినిధులతోపాటు చక్రాయపేట మండల మెజిస్ట్రేట్ విజయకుమారిని సుమారు గంట పాటు కార్యాలయం వాకిట్లోనే నిలబెట్టారు. చివరకు కొందరు పోలీసులు, పాత్రికేయులు గమనించి ఆమెను స్వామి దర్శనానికి పంపారు. ఆలయానికి విరాళం ఇచ్చేందుకు వచ్చిన దాతలను కూడా పట్టించుకోక పోవడంతో కొందరు మండిపడ్డారు. రెండవ శనివారం సుమారు 40 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకొని ఉంటారని ఆలయ వర్గాల అంచనా. కొందరు భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు వాహనాలను కొద్దిసేపు గండిలోకి అనుమతించ లేదు. ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రగారావు తమ సిబ్బందిచే బందోబస్తు నిర్వహించారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. -
రైతులు మార్కెటింగ్లో జాగ్రత్తలు పాటించాలి
ప్రొద్దుటూరు రూరల్: రైతులు పంటలు పండించడమే కాకుండా ఉత్పత్తి, మార్కెటింగ్ విషయాల్లో జాగ్రత్తలు పాటించినప్పుడే లాభం కలుగుతుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. మండలంలోని చెన్నమరాజుపల్లె గ్రామంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు, జిల్లా కలెక్టర్గా తాను అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే రకాలైన పంటలను రైతులు పండించినప్పుడే వ్యవసాయం నష్టాల బాటలో ఉండదన్నారు. జిల్లాలో రైతుల పంటల సాగుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. సాగునీరు, ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం పెట్టుబడి నిధులను మంజూరు చేసిందని వివరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మరొక హామీని విజయవంతంగా నెరవేర్చిందన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేలు, కేంద్రం ప్రభుత్వం వాటాగా రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 10,326 మంది రైతులకు రూ.7.10 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్, ఏడీఏ అనిత, తహసీల్దార్ గంగయ్య, ఏఓ వరహరికుమార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, ఏజీఆర్ బ్యాంక్ చైర్మన్ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, సర్పంచ్లు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రాజువారి ఆదిలక్షుమ్మ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రాజువారి వెంకటసుబ్బయ్య, రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
ఫైర్ స్టేషన్లు పటిష్టం చేస్తాం
జోన్ –4 రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి కమలాపురం : జోన్–4 పరిధిలోని వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించి ఫైర్ స్టేషన్లను పటిష్టం చేస్తామని జోన్–4 రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలోని ఫైర్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఫైర్ ఎక్విప్మెంట్, ఫైర్ కాల్ వస్తే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లే పద్ధతి, ఫైర్ను కంట్రోల్ చేసే పద్ధతులను డ్రిల్ చేయించారు. వాహనం, పరికరాలు నాణ్యత తదితర వాటిపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 252 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో జోన్లోని అన్ని ఫైర్ స్టేషన్లను ఆధునికీకరిస్తామన్నారు. ఫైర్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలను మెరుగు పరుస్తూ వాటిని పటిష్టం చేస్తామన్నారు. ఇప్పటికే తిరుపతి–2, మొలకల చెరువు, శ్రీశైలం, నందికొట్కూరు, కళ్యాణదుర్గంలకు కొత్త ఫైర్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. శ్రీశైలం, నంది కొట్కూరులో స్లాబ్ లెవెల్ పనులు జరుగుతున్నాయని, మిగిలిన మూడు చోట్ల పనులు ప్రారంభిస్తామన్నారు. కడప, ప్రొద్దుటూరులో సెకండ్ ఫేజ్లో కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. వీలైతే థర్డ్ ఫేజ్లో కమలాపురంలో కూడా కొత్త భవనం నిర్మించే అవకాశం ఉందన్నారు. జమ్మలమడుగు, సూళ్లూరుపేట, వాల్మీకిపురంలో పెండింగ్లో ఉన్న భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామన్నారు. 110 కొత్త వాహనాల ఛాసిస్లు కొన్నామని, వాటిని ఫ్యాబ్రికేషన్కు పంపామన్నారు. 6 నెలల్లో పూర్తి అవుతాయని, మొత్తం స్టేషన్లకు కొత్త ఫైర్ వాహనాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ 5 బోట్లు ఇచ్చారని, దీంతో కమలాపురం, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల ఫైర్ స్టేషన్లలో బోట్లు ఉన్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 5 బోట్లు ఉన్నాయని, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్క బోటుమాత్రమే ఉందన్నారు. అయితే రిస్క్ జరిగినప్పుడు సిబ్బందితో పాటు బోట్లు కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లి రిస్క్ ఆపరేషన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులతో రిస్క్ పరికరాలు కూడా కొనుగోలు చేసి ఫైర్ స్టేషన్లను అన్ని విధాలా పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. రిస్క్ చేసే ఫైర్ సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్చార్జి ఎస్ఎఫ్ఓ జనార్దన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులకు అపార అవకాశాలు
పులివెందుల టౌన్ : బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవ తెలిపారు. శనివారం స్థానిక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని తన చాంబర్లో ఆయన మాట్లాడుతూ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటాలో బైపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 6వ తేదీ వరకు, ఎంపీసీ విద్యార్థుల నుంచి ఫార్మర్స్ కోటాలో దరఖాస్తులను ఈనెల 7వ తేదీవరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిదాయలయం ద్వారా స్వీకరిస్తారన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ నుంచి వివరాలు పొందవచ్చని తెలిపారు. పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అందుబాటులో ఉందన్నారు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు పులివెందుల కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఎంచుకోవాలని సూచించారు. గత ఏడాది ఈ కళాశాల నుంచి ఉత్తీర్ణులైన ఎక్కువమంది విద్యార్థులు వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందారని, కొందరు దేశ, విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రాంలో చేరారన్నారు. ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అభ్యసించిన వారికి ఆహార అనుబంధ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్(https://angrau. ac.in) చూడాలని కోరారు. పులివెందులలో ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు 9177776692 అనే ఫోన్ నంబర్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
నాటక రంగానికి బళ్లారి రాఘవ విశిష్ట సేవలు
జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ నీలమయ్యకడప సెవెన్రోడ్స్ : తెలుగు నాటక రంగానికి కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ విశిష్ట సేవలు అందించారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ నీలమయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో స్టెప్, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 145వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నాటక రంగానికి ఎనలేని కృషి చేసిన బళ్లరి రాఘవ స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. ఆయన చిన్నతనం నుంచి కళలపై మక్కువ చూపించారన్నారు. న్యాయవాదిగా ఆయన చేసిన ప్రజా సేవకుగాను బ్రిటీష్ ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించిందన్నారు. ఆయన ఎక్కువగా సామాజిక నాటకాలను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలు, రుగ్మతలపై ప్రదర్శనలు నిర్వహించి నాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. మహిళలను కూడా ఆయన నాటక రంగంలో ప్రోత్సహించారన్నారు. ఇంగ్లాండ్,ఫ్రాన్స్ ,జర్మనీస్ స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలలో ఆయన నాటక ప్రదర్శనలు చేసి విదేశీయుల మన్ననలు పొందారన్నారు. 1936లో సినిమా రంగంలోకి ప్రవేశించి సామాజిక మార్పులపై సినిమాలు నిర్మించారన్నారు. దళితుల కోసం ఆయన రాత్రిపూట పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. కుల వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించి సామాజిక సమానుత్వానికి పాటుపడ్డారని సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ ఒక మార్గదర్శకుడుగా జీవించారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాంతమ్మ, స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, ఎల్డీఎం జనార్దన, జిల్లా టూరిజం మేనేజర్ రామ్ కుమార్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలు
డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకడప సెవెన్రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని బోర్డ్ రూము హాలులో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈ ఓబులమ్మతో కలిసి డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితోపాటు ఓటర్లు, సాధారణ ప్రజానీకం అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను పాటించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పులివెందుల రెవెన్యూ డివిజన్, కడప రెవెన్యూ డివిజన్ అంతటా అమలులో ఉంటుందని తెలిపారు. సెల్సిటివ్, క్రిటికల్, వల్నరబిలిటీ పోలీస్ స్టేషన్లను గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులకు విధులను కేటాయించడం జరిగిందన్నారు. పులివెందుల ఆర్వోగా నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, ఒంటిమిట్ట ఆర్వోగా డిప్యూటీ కలెక్టర్ రిమ్స్ రంగస్వామిలను నియమించారన్నారు. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తామన్నారు. పులివెందులలో 15 పోలింగ్ స్టేషన్లు 10601 ఓటర్లు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ స్టేషన్లు 24606 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు బాబు, డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ సుధాకర్,పులివెందుల ఏఆర్ఓ కృష్ణమూర్తి, ఒంటిమిట్ట ఏఆర్ఓ సుజాతమ్మ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన పెంచుకోవాలి
కడప అర్బన్ : న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు.్ఙనల్సా (జాగృతి – అట్టడుగు స్థాయి సమాచారం, పారదర్శకత చొరవ కోసం న్యాయం అవగాహన) పథకం 2025 పై జిల్లా జాగృతి యూనిట్ సభ్యులకు శిక్షణ, ఓరియంటేషన్ కార్యక్రమం్ఙ శనివారం న్యాయసేవాసదన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సహాయం పొందడంలో సవాళ్లు, న్యాయ సహాయం కోసం చట్టపరమైన అవగాహన, ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీన బాబు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శాంతి, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే, కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, కడప అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కె.రాకేష్ చంద్రం, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
పీజీటీ టీచర్ల శిక్షణ విజయవంతం చేయాలి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీలలో పనిచేస్తున్న పీజీటీ టీచర్లకు ఆదివారం నుంచి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఏ. నిత్యానందరాజులు సూచించారు. శనివారం కడప సమగ్రశిక్ష కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టు టీచర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమంపై సమగ్రశిక్ష సెక్టోరియల్ ఆఫీసర్లకు సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడుతూ కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి రాయలసీమ పరిధిలోని కడప జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు జిల్లాలోని కేజీబీవీలలో పనిచేసే పీజీటీ సబ్జెక్టు టీచర్లందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయం సూపరింటెండెంట్ ప్రేమకుమారి, జీసీడీఓ దార్ల రూత్ ఆరోగ్యమేరీ, ఏఎంఓ వీరేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులకు బాధ్యతల అప్పగింత
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఇటీవల నియమితులైన ఎస్. గురుమోహన్, కె. నాగేంద్రారెడ్డి, ఆర్. వెంకట సుబ్బారెడ్డిలకు ఆ పార్టీ కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి బాధ్యతలు అప్పగించారు. గురుమోహన్కు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆర్. వెంకట సుబ్బారెడ్డికి కమలాపురం, బద్వేల్ నియోజకవర్గాలు, కె. నాగేంద్రారెడ్డికి పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలను సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. వీరు రీజనల్ కో ఆర్డినేటర్లు, పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలను సమన్వయం చేయాలని సూచించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసాద్రెడ్డి, పి. సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్ విభాగం అధ్యక్షులుగా కె.సుబ్బయ్య (డేవిడ్), ఎస్సీ విభాగం అధ్యక్షులుగా గజ్జెల కిరణ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఎస్.చంద్రశేఖర్రెడ్డిలను నియమించారు.