Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On The Situation Under Chandrababu Govt Rule1
ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు...ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీ‌షీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.Today, I visited Tenali and raised a serious concern about the growing high-handedness of the police under the @ncbn Garu-led government.In Tenali, three Dalit and minority youths were brutally assaulted by the police without any legal basis—one a junior advocate, another a… pic.twitter.com/vuvKiJidBn— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2025

IPL 2025: RCB Wins Title In 18th Attempt, Beats Punjab Kings In Finals2
RCBvPBKS: ఈ సాలా కప్‌ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్‌పై ఘన విజయం

ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ కల సాకారమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (జూన్‌ 3) జరిగిన ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్‌ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్‌ పంజాబ్‌ చేతుల్లో నుంచి జారి పోయింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 24, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 26, జోస్‌ ఇంగ్లిస్‌ 39, శ్రేయస్‌ అయ్యర్‌ 1, నేహల్‌ వధేరా 15, స్టోయినిస్‌ 6, ఒమర్‌జాయ్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్‌ చేసి పంజాబ్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ 2, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, షెపర్డ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL— Johns. (@CricCrazyJohns) June 3, 2025ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్‌ ఎట్టకేలకు 18వ సీజన్‌లో టైటిల్‌ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్‌కు 18 నంబర్‌ మరోసారి కలిసొచ్చింది. విరాట్‌ జెర్సీ నంబర్‌ కూడా 18 అన్న విషయం​ తెలిసిందే. టైటిల్‌ గెలిచాక విరాట్‌ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.

Himanta Sarma Responds To Pak If China Stops Brahmaputra Water3
బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

గువాహటి: పహల్లాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారత్‌ అనేక చర్యలను చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌ను పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో భారత్‌ పలు ఆంక్షల్ని అమలు చేసింది. అందులో పాకిస్తాన్‌ జాతీయుల్ని తక్షణమే దేశం విడిచి వెళ్లాపోవాలనే ఆంక్షలతో పాటు సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలుపుదల చేసింది. ఆపై ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది భారత్‌. అయితే సింధూ జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌.. సింధూ జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్‌కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్‌. బ్రహ్మపుత్రా నదీ జలాలను భారత్‌కు చైనా నిలిపివేస్తే అంటూ కొత్త రాగం అందుకుంది. అసలు బ్రహ్మపుత్రా నదికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండానే భారత్‌ను బెదిరించాలనే యత్నం చేసిందిదీనికి భారత్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సా ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. అసలు పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు అర్థంపర్థంలేనివిగా కొట్టిపారేశారు. అదే సమయంలో అసలు బ్రహ్మపుత్రా నదీ చైనా భూభాగంలో 30 నుంచి 35 శాతం మాత్రం ఉందని, ఇక మిగిలిని 65 శాతం నుంచి 70 శాతం భారత్‌లో ఉందన్నారు. బ్రహ్మపుత్రా నదీ గురించి వాస్తవ కోణంలో ఆలోచిస్తే ప్రధానంగా మంచు కరగడం, టిబెటన్ పీఠభూమిపై పరిమిత వర్షపాతం ద్వారా నదీ జలాలు పెరగడం అనేది ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం లేదనీ, ఒకవేళ అలా చేసినా భారత్‌కు మేలు చేసినట్లే అవుతుందన్నారు. అస్సాంలో వరదలు కారణంగా ప్రతీ ఏడాది నిరాశ్రయులయ్యే వారు వేలలో ఉంటున్నారని హిమాంతా బిశ్వా శర్మ చమత్కరించారు. సాధారణంగా భారత్‌-చైనా సరిహద్దు(టుటింగ్‌)లో బ్రహ్మపుత్రా నదీ పరిమాణం సెకనుకు 2,000 నుంచి 3,000 వేల క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని, అస్సాంలో వర్షాకాలంలో వచ్చేసరికి 15 వేల క్యూబిక్‌ల నుంచి 20 వేల క్యూబిక్‌ల ఆ నది పరిమాణం ఉంటుందన్నారు. ఇది బ్రహ్మపుత్రా నదీ ప్రవాహంలో భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. "బ్రహ్మపుత్ర నది అనేది ఎవరో ఒకరిచే నియంత్రించబడదు అనేది పాక్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. What If China Stops Brahmaputra Water to India?A Response to Pakistan’s New Scare NarrativeAfter India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:“What if China stops the Brahmaputra’s water to India?”…— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025

IPL 2025 Final, PBKS VS RCB: Virat Kohli Creates History, Becomes First Player In The World To Achieve THIS Massive IPL Record4
IPL 2025 Final: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్‌ 3) జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఫైనల్లో రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఫోర్లు బాదిన విరాట్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు శిఖర్‌ ధవన్‌ పేరిట ఉండేది. ఐపీఎల్‌లో శిఖర్‌ 768 బౌండరీలు బాదగా.. విరాట్‌ ఈ మ్యాచ్‌లో ఆ మార్కును క్రాస్‌ చేశాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 770 బౌండరీలు ఉన్నాయి.ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన టాప్‌-5 ఆటగాళ్లు..విరాట్‌ కోహ్లి- 770 (267 ఇన్నింగ్స్‌లు)శిఖర్‌ ధవన్‌-768 (222)డేవిడ్‌ వార్నర్‌-663 (184)రోహిత్‌ శర్మ-640 (272)అజింక్య రహానే-514 (172)భారీ రికార్డును మిస్‌ చేసుకున్న విరాట్‌ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో భారీ రికార్డు సొంతం చేసుకునే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ 86 పరుగులు చేసుంటే, ఐపీఎల్‌ చరిత్రలో మూడు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అయితే విరాట్‌ 43 పరుగులకే ఔట్‌ కావడంతో ఈ సీజన్‌లో అతని పరుగుల సంఖ్య 657 పరుగుల వద్ద ఆగిపోయింది. విరాట్‌ 2016 సీజన్‌లో 973 పరుగులు, 2024 సీజన్‌లో 741 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్‌తో పాటు క్రిస్‌ గేల్‌ ఒక్కడే రెండు సీజన్లలో 700 పరుగుల మార్కును తాకిన ఆటగాడిగా ఉన్నాడు. గేల్‌ వరుసగా 2012, 2013 సీజన్లలో ఈ ఘనత సాధించాడు.ఫైనల్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ 16, జితేశ్‌ శర్మ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. సాల్ట్‌ 16, విరాట్‌ కోహ్లి 43, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో జేమీసన్‌ 2, ఒమర్‌జాయ్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు.

Tenali Incident: YS Jagan Slams Police Surrender Kutami Prabhutvam5
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తెనాలి: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్‌తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్‌ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్‌ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్‌లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్‌ 26న ఐతానగర్‌లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్‌ సీఐ, మరో పీఎస్‌ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్‌ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్‌ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్‌ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్‌, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్‌ ప్రశ్నించారు.

Chandrababu govt steps down on Kapu movement case6
కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యపై అటు కాపు నేతలు, ఇటు వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు సర్కార్‌ వెనకడుగువేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్లీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం,. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని సరికొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందనేది వాస్తవం. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే యత్నం​ చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు

IPL 2025 Final, RCB VS PBKS: Phil Salt Grabs A Stunning Catch At Boundary Line7
RCB Vs PBKS: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన సాల్ట్‌

పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్‌ సాల్ట్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద నమ్మశక్యం కాని రీతిలో ప్రియాంశ్‌ ఆర్య క్యాచ్‌ అందుకున్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ చివరి బంతికి ఇది జరిగింది. ఈ వికెట్‌ హాజిల్‌వుడ్‌ ఖాతాలో పడింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.A GAME CHANGING CATCH BY SALT 🥶 pic.twitter.com/SxdpRgA4Se— Johns. (@CricCrazyJohns) June 3, 2025మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26), శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఔట్‌ కాగా.. జోష్‌ ఇంగ్లిస్‌ (31), నేహల్‌ వధేరా (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు.

Chandrababu Govt Removed Pension Of Old Woman In Pithapuram8
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..

సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్‌ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్‌ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్‌ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్‌ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్‌ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్‌ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్‌ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్‌ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో:

Pakistan Defence Budget Expansion Raises IMF Concerns Amid Economic Struggles9
ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం.. పాక్‌ బడ్జెట్‌పై గందరగోళం!

రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పాకిస్థాన్‌ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్‌ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్‌ బడ్జెట్‌ను జూన్‌ 10కి వాయిదా వేశారు.పాక్‌ ప్రతిపాదిత బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్‌ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్‌ డాలర్ల అప్పును ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో విభేదాలు తలెత్తడంతో జూన్‌ 2న విడుదల కావాల్సిన బడ్జెట్‌ను పాకిస్థాన్‌ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్‌ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్‌ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ (పీఎస్‌డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్‌ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్‌ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్‌ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్‌లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి).

New Zealand Woman MP Shows AI generated Shocking photo of herself10
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ

అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్‌లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్‌క్లూర్‌.. న్యూజిలాండ్‌ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన‌ ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్‌ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్‌ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్‌లోడ్‌ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్‌ఫేక్‌.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్‌ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్‌ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి పాపులర్‌ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement