Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former Minister Kakani Govardhan Reddy Arrest1
కూటమి సర్కార్‌ కక్ష సాధింపు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాకాణిపై మైనింగ్ పేరుతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెండు నెలలుగా పోలీసులు టార్గెట్ చేశారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి.. చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పొదలకురు మండలం రుస్తుం మైన్ కేసులో కాకాణిని పోలీసులు ఇరికించారు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కక్ష కట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్‌ని బయటపెట్టినందుకు ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది.క్వార్జ్‌ మైనింగ్‌ మైనింగ్‌పై తప్పుడు నివేదికతో కాకాణిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే మైనింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఓ వైపు క్వార్జ్‌ను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RJD chief Lalu Prasad Yadav expels son Tej Pratap2
అనుష్కతో సన్నిహితంగా పెద్ద కుమారుడు.. లాలూ సంచలన నిర్ణయం

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్‌ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తేజ్‌ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరణకు కారణం శనివారం ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ సోషల్‌ మీడియా పోస్టే లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్‌ ప్రతాప్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్‌ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్‌ చేశారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, అనుష్క యాదవ్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025దీంతో తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రకటనపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం పార్టీ (ఆర్జేడీ) సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని ఎక్స్‌ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్‌లో తెలిపారు.కాగా, తేజ్‌ ప్రతాప్‌ 2018లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Huge Troubles To Kazipet Mini Coach Factory3
‘కాజీపేట’కు రెడ్‌సిగ్నల్‌!

అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (మినీ కోచ్‌ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్‌ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్‌ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్‌ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్‌లోనూ వందేభారత్‌ కోచ్‌ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్‌ నిర్మాణ బాధ్యతను రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్‌ను ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌గా ప్రతిపాదించినప్పుడే ఆర్‌వీఎన్‌ఎల్‌ టెండర్లు పిలవగా పవర్‌మెక్‌–టైకిషాలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్‌ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్‌ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్‌ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్‌ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్‌వీఎన్‌ఎల్‌ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్‌ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్‌ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్‌వీఎల్‌ఎల్‌ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్‌ లేఅవుట్‌ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.

Sakshi Guest Column On India Pakistan Issues and Kashmir4
కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?

మనలో చాలా మందికి పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్‌ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్‌ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్‌గామ్‌ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్‌ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్‌డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?కశ్మీరీలు ఎలా స్పందించారు?ఇప్పుడు, కశ్మీరీలు పహల్‌గామ్‌ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్‌ బుకింగ్‌లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్‌ జరిగింది. అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్‌ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్‌ వాలాస్‌’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్‌లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్‌ షా, కల్నల్‌ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.ఇదీ నాగరిక పద్ధతి!దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ 1947 అక్టోబర్‌ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్‌ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్‌ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Hyderabad and Chennai win big in their last league matches5
ఆఖర్లో అదరహో

‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్‌ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్‌ హాఫ్‌ సెంచరీలతో విజృంభిస్తే... నైట్‌ రైడర్స్‌ బౌలర్లను క్లాసెన్, హెడ్‌ చీల్చి చెండాడారు. సీజన్‌ ఆరంభ పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్‌ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్‌ శర్మ, హెడ్‌ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్‌ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్‌ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్‌లో భారీ స్కోర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (39 బంతుల్లో 105 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్‌ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ తొలి ఓవర్‌లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్‌... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్‌లో హెడ్‌ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్‌ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లో 6, 4, 2, 6 బాదిన హెడ్‌... నాలుగో ఓవర్‌లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్‌లో అభిషేక్‌ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్‌ 79 పరుగులు చేసింది. నరైన్‌ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌... మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔట్‌ కాగా... క్లాసెన్‌ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్‌ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్‌ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్‌ ఓవర్‌లో 4, 6, ,6తో క్లాసెన్‌ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్‌ చేయడం ద్వారా నరైన్‌ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్‌ కిషన్‌ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్‌ ఓవర్‌లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్‌... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్‌ ఓవర్‌లో 6, 4 కొట్టిన క్లాసెన్‌... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 32; హెడ్‌ (సి) రసెల్‌ (బి) నరైన్‌ 76; క్లాసెన్‌ (నాటౌట్‌) 105; ఇషాన్‌ కిషన్‌ (సి) నోర్జే (బి) వైభవ్‌ 29; అనికేత్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్‌ రాణా 3–0–40–0; నరైన్‌ 4–0–42–2; వరుణ్‌ చక్రవర్తి 3–0–54–0; రసెల్‌ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) మనోహర్‌ (బి) మలింగ 9; నరైన్‌ (బి) ఉనాద్కట్‌ 31; రహానే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 15; రఘువంశీ (సి) నితీశ్‌ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్‌ (బి) హర్ష్ దూబే 9; రసెల్‌ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్‌ పాండే (సి) మనోహర్‌ (బి) ఉనాద్కట్‌ 37; రమణ్‌దీప్‌ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్‌ (సి అండ్‌ బి) మలింగ 34; వైభవ్‌ అరోరా (రనౌట్‌) 0; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్‌: కమిన్స్‌ 2–0–25–0; ఉనాద్కట్‌ 4–0–24–3; హర్షల్‌ 2–0–21–0; ఇషాన్‌ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్‌ రెడ్డి 1–0–6–0; అభిషేక్‌ 2–0–25–0. 278/3 ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్‌ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్‌... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్‌ తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో), వైభవ్‌ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 18వ సీజన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్‌ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్‌ పటేల్‌ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్‌ ఖాన్‌ వెసిన రెండో ఓవర్‌లో ఆయుశ్‌ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్‌ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్‌ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్, నూర్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్‌ 34; కాన్వే 52; ఉర్విల్‌ 37; బ్రెవిస్‌ 57, ప్రసిధ్‌ కృష్ణ 2/22) గుజరాత్‌ టైటాన్స్‌: 147 ఆలౌట్‌ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్‌ 41; అర్షద్‌ ఖాన్‌ 20, అన్షుల్‌ కంబోజ్‌ 3/13, నూర్‌ అహ్మద్‌ 3/21, జడేజా 2/17).ఐపీఎల్‌లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్‌ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Allu Aravind on Pawan Kalyans comments6
ఆ నలుగురిలో నేను లేను

సాక్షి, హైదరాబాద్‌: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్‌ టైమ్‌ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్‌. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్‌ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్‌లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్‌లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్‌ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్‌ క్లోజ్‌ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్‌ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్‌ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్‌కళ్యాణ్‌ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్‌ సినిమా విషయంలో పవన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్‌ చాంబర్‌ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్‌ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్‌ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్‌ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యాఖ్యల్ని అరవింద్‌ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్‌ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్‌ కంట్రోల్‌ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్‌ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్‌ కావాలి’అంటు అరవింద్‌ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్‌ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్‌ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను జతచేసి సోషల్‌ మీడియా వేదికలపై వైరల్‌ చేస్తున్నారు.

Ysrcp Sensational Tweet On Vijayasai Reddy7
వీడియో వైరల్‌: టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ

సాక్షి, తాడేపల్లి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. టీడీపీ కీలకనేత టీడీ జనార్ధన్‌ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారు’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.‘‘విచార‌ణ ముగిసిన వెంట‌నే మీడియా ముందు వైఎస్‌ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు, విష‌పు వ్యాఖ్య‌లు.. విజ‌య‌సాయిరెడ్డిని వైఎస్‌ జ‌గ‌న్ న‌మ్మి.. ద‌గ్గ‌ర పెట్టుకుని పార్టీలో క్రియాశీల‌క ప‌ద‌వుల‌తో పాటు రాజ్య‌స‌భకు పంపించి గౌర‌విస్తే ఇంకా మూడేళ్లు ప‌ద‌వీ కాలం ఉన్నా చంద్ర‌బాబుకు మేలు చేసేందుకు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది న‌మ్మ‌కం ద్రోహం కాదా?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ నిలదీసింది.విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు..మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశంతాడేప‌ల్లి పార్క్ విల్లాలో..విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు @ncbn న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025

Pakistan regard India as an existential threat says on US dia report8
సంచలన నివేదిక, భారత్‌ టార్గెట్‌గా.. అణ్వాయుధాలను అప్‌డేట్‌ చేస్తున్న పాక్‌

వాషింగ్టన్‌: ఏప్రిల్​ 22న జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ విజయవంతమైన నేపథ్యంలో అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్‌ తన అస్తిత్వానికి పాక్‌ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది డీఐఏ నివేదిక సారాంశం. 2025 worldwide threat assessment report పేరుతో డీఐఏ రిపోర్టును విడుదల చేసింది. అందులో భారత్‌ను ఇప్పటికీ పాక్ తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పాక్ విదేశీ సరఫరాదారుల, మధ్యవర్తుల ద్వారా భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను weapons of mass destruction (WMDs) సంపాదిస్తుందని, ఆ అణు పదార్ధాలతో పాటు, అందుకు కావాల్సిన సాంకేతికతను చైనా నుండి పొందుతుందని తెలిపింది. వీటి ట్రాన్స్‌ఫర్ హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా జరుగుతోందని హైలెట్‌ చేసింది. భారత్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక డీఏఐ తన నివేదికలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. మే 7 నుండి 10 వరకు రెండు దేశాలూ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మే 10 నాటికి రెండు సైనిక బలగాలు పూర్తి కాల్పుల విరమణపై అంగీకరించాయి’ అని డీఐఏ తన నివేదికలు తెలిపింది.

Deadly Inherited Cancer Detected in Offspring of One Man With 67 Kids9
ఓ వ్యక్తి వీర్యదానం.. 67మంది పిల్లలో 10మంది పిల్లలకు క్యాన్సర్‌

వాటికన్‌ సిటీ: ఓ వ్యక్తి వీర్య దానం పదిమంది పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. జన్యు పరివర్తన కారణంగా సదరు వ్యక్తి దానం చేసిన వీర్యం వల్ల 65 మంది పిల్లల్లో పది మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది.ఓ వ్యక్తి 2008 నుండి 2015 మధ్య ఐరోపాలోని ఎనిమిది దేశాలకు వీర్య దానం చేశారు. అతని స్పెర్మ్ ద్వారా 67 మంది పిల్లలు పుట్టారు. అయితే, కొంత కాలానికి ఆ వ్యక్తిలో అరుదైన క్యాన్సర్ కలిగించే జన్యు మ్యూటేషన్ ఉన్నట్టు గుర్తించారు. ఫలితంగా వీరిలో ఇప్పటివరకు 10 మంది పిల్లలకు క్యాన్సర్ సోకినట్లు తేలింది. వీర్య దానంతో 67మంది పిల్లల్లో 23 మందికి టీపీ53 అనే జన్యు మ్యూటేషన్ ఉందని గుర్తించారు. ఈ జన్యు మ్యూటేషన్ ఉన్నవారికి జీవితకాలంలో ల్యూకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ముందుగా రెండు కుటుంబాలు తమ పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల్ని సంప్రదించారు. వైద్యుల సలహా మేరకు ఫెర్టిలిటీ క్లినిక్స్‌ను సంప్రదించాయి. విచారణలో యూరోపిన్ స్పెర్మ్ బ్యాంక్ డోనర్ ద్వారా వచ్చిన శాంపిళ్లలో టీపీ53 మ్యూటేషన్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 2008లో డొనేషన్ జరిగిన సమయంలో ఈ మ్యూటేషన్ క్యాన్సర్ కలిగించేది అన్న విషయం వెలుగులోకి రాలేదు. కారణం సాధారణ స్క్రీనింగ్ ద్వారా ఇది గుర్తించేది కాదు. ఈ మ్యూటేషన్ ఉన్న పిల్లలు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ఫుల్ బాడీ ఎంఆర్ఐ స్కాన్లు, మెదడు, ఛాతీ స్కాన్లు, అలాగే కడుపు అల్ట్రాసౌండ్లు తీస్తున్నారు.

PM Modi Advises BJP Leaders on Remarks About Operation Sindoor10
నోటి దురుసు వ్యాఖ్యలు చేయొద్దు.. నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్‌

సాక్షి,ఢిల్లీ: బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే విషయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమక్షంలో నాయకులు చేసే వ్యాఖ్యల్లో అణుకువ, బాధ్యత ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా, ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణికి దూరంగా ఉండాలని, అనవసర వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారతాయని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. PM Narendra Modi tweets, "Participated in the NDA Chief Ministers' Conclave in Delhi. We had extensive deliberations about various issues. Various states showcased their best practices in diverse areas, including water conservation, grievance redressal, strengthening… pic.twitter.com/9Hd03QrWXG— ANI (@ANI) May 25, 2025మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీష్‌ దేవ్‌డా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘యావత్తు దేశ ప్రజలు, జవాన్లు తలలు వంచి ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్ జవాబిచ్చిన తీరును ప్రశంసించడానికి మాటలు చాలవు అని వ్యాఖ్యానించారు. ఇలా ఆపరేషన్‌ సిందూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా, ఎన్డీయే సమావేశంలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పై ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్డీయే సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌పై స్పష్టత ఇచ్చిన మోదీ.. కాల్పుల విరమణ ఒప్పందంలో దేశానిదే తుది నిర్ణయం. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాం. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో మరే ఇతర దేశం జోక్యం చేసుకోలేదన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement