Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Tenali Incident: YS Jagan Slams Police Surrender Kutami Prabhutvam1
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తెనాలి: రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్‌తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్‌ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్‌ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్‌లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్‌ 26న ఐతానగర్‌లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్‌ సీఐ, మరో పీఎస్‌ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్‌ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్‌ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్‌ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్‌, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్‌ ప్రశ్నించారు.

IPL 2025 Final: RCB VS PBKS Live Updates And Highlights2
IPL 2025 Final Updates: 200లోపు స్కోర్‌కే పరిమితమైన ఆర్సీబీ

200లోపు స్కోర్‌కే పరిమితమైన ఆర్సీబీటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్‌-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ (24) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్‌- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్‌ కోహ్లి ఔట్‌14.5వ ఓవర్‌- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ విరాట్‌ను క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 103/3విరాట్‌ కోహ్లి 32, లివింగ్‌స్టోన్‌ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్‌ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్‌ 80/2ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్‌- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ అగర్వాల్‌ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 55/1మయాంక్‌ అగర్వాల్‌ 24, విరాట్‌ కోహ్లి 13తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్‌- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్‌ 3) జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ రావడం​ ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్‌ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్‌ వరకు చేరాయి. లీగ్‌ దశలో పంజాబ్‌, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్‌ గెలిచాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

Himanta Sarma Responds To Pak If China Stops Brahmaputra Water3
బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

గువాహటి: పహల్లాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారత్‌ అనేక చర్యలను చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌ను పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో భారత్‌ పలు ఆంక్షల్ని అమలు చేసింది. అందులో పాకిస్తాన్‌ జాతీయుల్ని తక్షణమే దేశం విడిచి వెళ్లాపోవాలనే ఆంక్షలతో పాటు సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలుపుదల చేసింది. ఆపై ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది భారత్‌. అయితే సింధూ జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌.. సింధూ జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్‌కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్‌. బ్రహ్మపుత్రా నదీ జలాలను భారత్‌కు చైనా నిలిపివేస్తే అంటూ కొత్త రాగం అందుకుంది. అసలు బ్రహ్మపుత్రా నదికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండానే భారత్‌ను బెదిరించాలనే యత్నం చేసిందిదీనికి భారత్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సా ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. అసలు పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు అర్థంపర్థంలేనివిగా కొట్టిపారేశారు. అదే సమయంలో అసలు బ్రహ్మపుత్రా నదీ చైనా భూభాగంలో 30 నుంచి 35 శాతం మాత్రం ఉందని, ఇక మిగిలిని 65 శాతం నుంచి 70 శాతం భారత్‌లో ఉందన్నారు. బ్రహ్మపుత్రా నదీ గురించి వాస్తవ కోణంలో ఆలోచిస్తే ప్రధానంగా మంచు కరగడం, టిబెటన్ పీఠభూమిపై పరిమిత వర్షపాతం ద్వారా నదీ జలాలు పెరగడం అనేది ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం లేదనీ, ఒకవేళ అలా చేసినా భారత్‌కు మేలు చేసినట్లే అవుతుందన్నారు. అస్సాంలో వరదలు కారణంగా ప్రతీ ఏడాది నిరాశ్రయులయ్యే వారు వేలలో ఉంటున్నారని హిమాంతా బిశ్వా శర్మ చమత్కరించారు. సాధారణంగా భారత్‌-చైనా సరిహద్దు(టుటింగ్‌)లో బ్రహ్మపుత్రా నదీ పరిమాణం సెకనుకు 2,000 నుంచి 3,000 వేల క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని, అస్సాంలో వర్షాకాలంలో వచ్చేసరికి 15 వేల క్యూబిక్‌ల నుంచి 20 వేల క్యూబిక్‌ల ఆ నది పరిమాణం ఉంటుందన్నారు. ఇది బ్రహ్మపుత్రా నదీ ప్రవాహంలో భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. "బ్రహ్మపుత్ర నది అనేది ఎవరో ఒకరిచే నియంత్రించబడదు అనేది పాక్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. What If China Stops Brahmaputra Water to India?A Response to Pakistan’s New Scare NarrativeAfter India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:“What if China stops the Brahmaputra’s water to India?”…— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025

Chandrababu govt steps down on Kapu movement case4
కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యపై అటు కాపు నేతలు, ఇటు వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు సర్కార్‌ వెనకడుగువేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్లీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం,. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని సరికొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందనేది వాస్తవం. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే యత్నం​ చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్‌కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు

Chandrababu Govt Removed Pension Of Old Woman In Pithapuram5
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..

సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్‌ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్‌ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్‌ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్‌ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్‌ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్‌ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్‌ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్‌ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో:

Pakistan Defence Budget Expansion Raises IMF Concerns Amid Economic Struggles6
ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం.. పాక్‌ బడ్జెట్‌పై గందరగోళం!

రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పాకిస్థాన్‌ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్‌ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్‌ బడ్జెట్‌ను జూన్‌ 10కి వాయిదా వేశారు.పాక్‌ ప్రతిపాదిత బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్‌ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్‌ డాలర్ల అప్పును ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో విభేదాలు తలెత్తడంతో జూన్‌ 2న విడుదల కావాల్సిన బడ్జెట్‌ను పాకిస్థాన్‌ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్‌ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్‌ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ (పీఎస్‌డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్‌ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్‌ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్‌ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్‌లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి).

New Zealand Woman MP Shows AI generated Shocking photo of herself7
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ

అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్‌లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్‌క్లూర్‌.. న్యూజిలాండ్‌ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన‌ ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్‌ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్‌ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్‌లోడ్‌ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్‌ఫేక్‌.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్‌ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్‌ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి పాపులర్‌ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం.

Sonali Bendre shares This Hero made her Angry8
ఆ స్టార్‌ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె

బంగారు కళ్ల బుచ్చమ్మో.. పాటలో అమాయకంగా కనిపించి అందర్నీ ఇట్టే బుట్టలో వేసుకుంది హీరోయిన్‌ సోనాలి బింద్రె (Sonali Bendre). మురారి సినిమాలో ఆమె నటనకు తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయింది. దాదాపు 20 ఏళ్లలో కేవలం మూడే సినిమాలు చేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జడ్జిగా కనిపించేది.ముఖం చిట్లించేవాడుతాజాగా ఆమె ఓ స్టార్‌ హీరోతో చేసిన సినిమా అనుభవాల్ని పంచుకుంది. బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. 1999లో వచ్చిన హమ్‌ సాత్‌ హై సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)తో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్‌లో సల్మాన్‌ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం.తిట్టాలన్నంత కోపంక్లోజప్‌ షాట్స్‌ ఉన్నప్పుడు కూడా తన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నీ సమస్య ఏంటి? అని తిట్టాలనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్‌ బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు. తను చాలా మంచివాడు. సినిమా షూటింగ్‌ అయ్యేకొద్దీ అతడి గురించి కొద్దికొద్దిగా తెలుసుకుంటూ వచ్చాను. తను బయటకు కోపంగా కనిపిస్తాడు. అందరూ తనను ద్వేషించాలన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.బ్లాక్‌బస్టర్‌ బొమ్మకానీ తను మృదు స్వభావి. అతడి లోని మంచి మనిషిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చింది. సల్మాన్‌, సోనాలి జంటగా నటించిన హమ్‌ సాత్‌ హై సినిమాను సూరజ్‌ బార్జాత్యా తెరకెక్కించాడు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, మోహ్నిష్‌, కరిష్మా కపూర్‌ తదితరులు నటించారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌

Covid 19 Cases in India past 40009
భారత్‌లో నాలుగువేలకు పైగా కోవిడ్‌ కేసులు.. ఐదుగురి మృతి

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 భారత్‌లో అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్‌ ప్రస్తుతం పాండమిక్‌ కాదు.. ఎండమిక్‌ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది. ఈరోజు(మంగళవారం, జూన్‌ 3) భారత్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ప్రస్తుతం భారత్‌ నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. తాజాగా ఐదుగురు కోవిడ్‌తో మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, యూపీ, కేరళలలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కేరళలో అత్యధికంగా 1416 కేసులు నమోదు కాగా, అటు తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 494 కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్‌లో 397, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో 28 కేసులో వెలుగు చూడగా, తెలంగాణలో 4 కోవిడ్‌ కేసులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో, హర్యానా, తమిళనాడు, గుజరాత్‌లలో కోవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అయితే భారత్‌లో కోవిడ్‌ కేసులు పెరుగుదలకు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్‌ కోరలు ఇంకా సజీవంగా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌ సోకిన వారిలో కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి.

YS Jagan Tenali Tour: YSRCP Chief Console John Victor Family Updates10
తెనాలి: జాన్‌ విక్టర్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్‌ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్‌ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. పైగా పోలీస్‌ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్‌ అంటూ రివర్స్‌లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్‌ విక్టర్‌ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్‌ విక్టర్‌ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్‌ చేస్తే చట్టపరంగా యాక్షన్‌ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్‌గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్‌కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement