Top Stories
ప్రధాన వార్తలు

నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: వైఎస్ జగన్
సాక్షి, తెనాలి: రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని.. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్బుక్తో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యం. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారు. రాకేష్ హైదరాబాద్లో జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండడం లేదు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. రాకేష్ను చూడడానికి అతని స్నేహితులు వచ్చారు. వాళ్లు కూడా మంగళగిరి నుంచి వచ్చారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్. బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉంది. ఐతా నగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గోవడ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారు. గొడవపడుతున్న కానిస్టేబుల్ను వీళ్లు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. తెనాలి పీఎస్లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న ఐతానగర్లో నడిరోడ్డు మీద పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నా పోలీసులు వదల్లేదు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారు. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ కూడా ఉన్నారు. ఇద్దరూ వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది అర్థమవుతోంది. పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసి కూడా.. ఎల్లో మీడియా బ్యాచ్ దారుణంగా కథనాలు ఇచ్చింది. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లంటూ పరువు తీస్తూ కథనాలు ఇచ్చాయి. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చు. ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా?. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా?. ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా?. పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా?. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని జగన్ ప్రశ్నించారు.

IPL 2025 Final Updates: 200లోపు స్కోర్కే పరిమితమైన ఆర్సీబీ
200లోపు స్కోర్కే పరిమితమైన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో జితేశ్ శర్మ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో లివింగ్స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి ఔట్14.5వ ఓవర్- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ విరాట్ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 103/3విరాట్ కోహ్లి 32, లివింగ్స్టోన్ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 80/2ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1మయాంక్ అగర్వాల్ 24, విరాట్ కోహ్లి 13తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్

బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
గువాహటి: పహల్లాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారత్ అనేక చర్యలను చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్ను పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో భారత్ పలు ఆంక్షల్ని అమలు చేసింది. అందులో పాకిస్తాన్ జాతీయుల్ని తక్షణమే దేశం విడిచి వెళ్లాపోవాలనే ఆంక్షలతో పాటు సింధూ జలాలను పాక్కు వెళ్లకుండా నిలుపుదల చేసింది. ఆపై ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్. అయితే సింధూ జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. సింధూ జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్. బ్రహ్మపుత్రా నదీ జలాలను భారత్కు చైనా నిలిపివేస్తే అంటూ కొత్త రాగం అందుకుంది. అసలు బ్రహ్మపుత్రా నదికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండానే భారత్ను బెదిరించాలనే యత్నం చేసిందిదీనికి భారత్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సా ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అసలు పాకిస్తాన్ చేసిన ఆరోపణలు అర్థంపర్థంలేనివిగా కొట్టిపారేశారు. అదే సమయంలో అసలు బ్రహ్మపుత్రా నదీ చైనా భూభాగంలో 30 నుంచి 35 శాతం మాత్రం ఉందని, ఇక మిగిలిని 65 శాతం నుంచి 70 శాతం భారత్లో ఉందన్నారు. బ్రహ్మపుత్రా నదీ గురించి వాస్తవ కోణంలో ఆలోచిస్తే ప్రధానంగా మంచు కరగడం, టిబెటన్ పీఠభూమిపై పరిమిత వర్షపాతం ద్వారా నదీ జలాలు పెరగడం అనేది ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం లేదనీ, ఒకవేళ అలా చేసినా భారత్కు మేలు చేసినట్లే అవుతుందన్నారు. అస్సాంలో వరదలు కారణంగా ప్రతీ ఏడాది నిరాశ్రయులయ్యే వారు వేలలో ఉంటున్నారని హిమాంతా బిశ్వా శర్మ చమత్కరించారు. సాధారణంగా భారత్-చైనా సరిహద్దు(టుటింగ్)లో బ్రహ్మపుత్రా నదీ పరిమాణం సెకనుకు 2,000 నుంచి 3,000 వేల క్యూబిక్ మీటర్లు ఉంటుందని, అస్సాంలో వర్షాకాలంలో వచ్చేసరికి 15 వేల క్యూబిక్ల నుంచి 20 వేల క్యూబిక్ల ఆ నది పరిమాణం ఉంటుందన్నారు. ఇది బ్రహ్మపుత్రా నదీ ప్రవాహంలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. "బ్రహ్మపుత్ర నది అనేది ఎవరో ఒకరిచే నియంత్రించబడదు అనేది పాక్ తెలుసుకుంటే మంచిదన్నారు. What If China Stops Brahmaputra Water to India?A Response to Pakistan’s New Scare NarrativeAfter India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:“What if China stops the Brahmaputra’s water to India?”…— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025

కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్యపై అటు కాపు నేతలు, ఇటు వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు సర్కార్ వెనకడుగువేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్లీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన రోజు వ్యవధిలోనే దాన్ని వెనక్కి తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం,. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని సరికొత్త డ్రామాకు తెరలేపింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందనేది వాస్తవం. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటుచేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే యత్నం చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసి కాపు సామాజికవర్గాన్ని తీవ్రషాక్కు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు

బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో:

ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్ బడ్జెట్ను జూన్ 10కి వాయిదా వేశారు.పాక్ ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్ డాలర్ల అప్పును ఐఎంఎఫ్ పాకిస్థాన్కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్తో విభేదాలు తలెత్తడంతో జూన్ 2న విడుదల కావాల్సిన బడ్జెట్ను పాకిస్థాన్ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (పీఎస్డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి).

ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం.

ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
బంగారు కళ్ల బుచ్చమ్మో.. పాటలో అమాయకంగా కనిపించి అందర్నీ ఇట్టే బుట్టలో వేసుకుంది హీరోయిన్ సోనాలి బింద్రె (Sonali Bendre). మురారి సినిమాలో ఆమె నటనకు తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయింది. దాదాపు 20 ఏళ్లలో కేవలం మూడే సినిమాలు చేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జడ్జిగా కనిపించేది.ముఖం చిట్లించేవాడుతాజాగా ఆమె ఓ స్టార్ హీరోతో చేసిన సినిమా అనుభవాల్ని పంచుకుంది. బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం.తిట్టాలన్నంత కోపంక్లోజప్ షాట్స్ ఉన్నప్పుడు కూడా తన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నీ సమస్య ఏంటి? అని తిట్టాలనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్ బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు. తను చాలా మంచివాడు. సినిమా షూటింగ్ అయ్యేకొద్దీ అతడి గురించి కొద్దికొద్దిగా తెలుసుకుంటూ వచ్చాను. తను బయటకు కోపంగా కనిపిస్తాడు. అందరూ తనను ద్వేషించాలన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.బ్లాక్బస్టర్ బొమ్మకానీ తను మృదు స్వభావి. అతడి లోని మంచి మనిషిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చింది. సల్మాన్, సోనాలి జంటగా నటించిన హమ్ సాత్ హై సినిమాను సూరజ్ బార్జాత్యా తెరకెక్కించాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, టబు, మోహ్నిష్, కరిష్మా కపూర్ తదితరులు నటించారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్

భారత్లో నాలుగువేలకు పైగా కోవిడ్ కేసులు.. ఐదుగురి మృతి
న్యూఢిల్లీ: కోవిడ్-19 భారత్లో అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్ ప్రస్తుతం పాండమిక్ కాదు.. ఎండమిక్ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది. ఈరోజు(మంగళవారం, జూన్ 3) భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ప్రస్తుతం భారత్ నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. తాజాగా ఐదుగురు కోవిడ్తో మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, యూపీ, కేరళలలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కేరళలో అత్యధికంగా 1416 కేసులు నమోదు కాగా, అటు తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 494 కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్లో 397, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో 28 కేసులో వెలుగు చూడగా, తెలంగాణలో 4 కోవిడ్ కేసులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో, హర్యానా, తమిళనాడు, గుజరాత్లలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అయితే భారత్లో కోవిడ్ కేసులు పెరుగుదలకు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ కోరలు ఇంకా సజీవంగా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సోకిన వారిలో కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి.

తెనాలి: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ .. ఫైర్ థీమ్ రిలీజ్
ప్రశాంత్ కిషోర్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి
IPL 2025 Final: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. 70 మందికి అస్వస్థత
రాజ్కుమార్ రావు యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయొలెంట్గా టీజర్!
కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..
అమర్దీప్తో సుప్రీత సినిమా.. గ్లింప్స్ రిలీజ్
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
కింగులా బతికాడు సింగిల్గా..!
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్ డే (ఫొటోలు)
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
తల్లితో కలిసి పూజ చేసిన శ్రీలీల! (ఫొటోలు)
హాస్య నటుడు అలీని అనరాని మాట అన్న రాజేంద్ర ప్రసాద్
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ .. ఫైర్ థీమ్ రిలీజ్
ప్రశాంత్ కిషోర్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి
IPL 2025 Final: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. 70 మందికి అస్వస్థత
రాజ్కుమార్ రావు యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయొలెంట్గా టీజర్!
కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..
అమర్దీప్తో సుప్రీత సినిమా.. గ్లింప్స్ రిలీజ్
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
కింగులా బతికాడు సింగిల్గా..!
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
IPL 2025: గత మూడు ఫైనల్స్లో విరాట్ కోహ్లి ఎలా ఆడాడో చూడండి..!
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
సినిమా

థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఉండగానే స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చేస్తున్నారట. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులోకి రానుంది?రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'భోల్ చుక్ మాఫ్'. లెక్క ప్రకారం ఈ మూవీ గత నెల తొలి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సడన్గా ప్రకటించారు. దీంతో ప్రముఖ మల్టీప్లెక్ సంస్థ.. కోర్టుని ఆశ్రయించింది. రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో నిర్మాతలు దిగిరాక తప్పలేదు. అలానే మే 23న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?)విడుదలై రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే 'భోల్ చుక్ మాఫ్' సినిమాని అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. జూన్ 6 నుంచి అంటే ఈ వీకెండ్లో సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక థియేటర్లలో ఉండగానే సినిమా.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చేస్తున్నట్లే.భోల్ చుక్ మాఫ్ విషయానికొస్తే.. వారణాసిలో ఉండే రంజన్(రాజ్ కుమార్ రావ్).. టిట్లీ(వామికా గబ్బీ)ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ శివుడికి ఇచ్చి మొక్కుని మరిచిపోతాడు. దీంతో టైమ్ లూప్లో చిక్కుకుని, పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. కామెడీని ఎంజాయ్ చేసే వాళ్లకు ఇదో టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు)

జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది.

కురచ దుస్తులపై కామెంట్స్.. సురేఖావాణి ఏమందంటే?
బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary) వెండితెరపై తన సత్తా చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడి చేతిలో మూడు సినిమాలదాకా ఉన్నాయి. అందులో ఒకటి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి (Chowdary Gari Abbayi tho naidu Gari Ammayi Movie). సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.డ్రెస్సింగ్పై నెగెటివ్ కామెంట్స్ఈ ఈవెంట్కు సురేఖావాణి (Surekha Vani) హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు పొట్టి బట్టలపై వచ్చే కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. సినిమాలో పని చేసే ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుంటారు. వాటిని చూసే జనాలు.. ఆడపిల్ల అయి ఉండి ఇలాంటి దుస్తులు వేసుకుంటారా? అని నెగెటివ్గా కామెంట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మీరెలా ఉండాలని సలహా ఇచ్చేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.నవ్వుకునేవాళ్లందానికి సురేఖావాణి స్పందిస్తూ.. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించలేవు కదా.. వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కూతురు ఆ కామెంట్లు చదువుకుని రియాక్ట్ అయ్యేవాళ్లం. తర్వాత దాన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవడమే మానేశాం అని చెప్పుకొచ్చింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్

ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో హృతిక్, ఎన్టీఆర్ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

IPL 2025 Final: క్రికెట్ అభిమానులకు చేదు వార్త
క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన అహ్మదాబాద్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. ఇవాళ (జూన్ 3) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వర్షం మొదలుకావడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Will rain delay the IPL 2025 Final in Ahmedabad? Live Visuals from narendra modi stadium 🏟️ #RCBvsPBKS #IPLFinals #rain #iplfinal2025 #ahmedabadweather pic.twitter.com/Jwnqa7inIg— Parth Vyas (@ImPaRthVyas) June 3, 2025ఇదే వేదికపై జూన్ 1న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. అయితే ఆ మ్యాచ్ ఎలాంటి ఓవర్ల కోత లేకుండా సాగింది. నేటి మ్యాచ్లో కూడా అదే పరిస్థితి పునరావృతమౌతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి రావడం మొదలుపెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా రెండు గంటలకు పైగా సమయం ఉండటంతో ఆలోపు వర్షం తగ్గుతుందని ఫ్యాన్స్ అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షం మరీ అంత భారీగా కురువడం లేదు. ఒకవేళ ఇప్పుడు భారీ వర్షం పడినా నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్ త్వరలోనే క్లియర్ అవుతుంది. హీన పక్షంలో ఇవాళ మ్యాచ్ సాధ్యపడకపోతే రేపు రిజర్వ్ డే ఉంది. రేపైనా విజేత ఎవరో తేలిపోతుంది. రేపు కూడా వర్షం పడితే మాత్రం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ కంటే మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ విజేతగా నిలుస్తుంది. అయితే పరిస్థితి ఇంత వరకు రాకపోవచ్చు. మ్యాచ్ వర్షాటంకం లేకుండా సాగాలని ఫ్యాన్స్ దేవుళ్లని ప్రార్దిస్తున్నారు.వర్షం విషయం అటుంచితే, ఈ సీజన్లో ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ పైచేయి సాధించింది.

వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీ ఎంట్రీ
ఇంగ్లండ్, ఐర్లాండ్తో టీ20 సిరీస్లకు రెండు వెర్వేరు జట్లను వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. గతేడాది బార్బడోస్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడ్డ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు మాజీ కెప్టెన్ హోల్డర్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే రస్సెల్ కేవలం ఇంగ్లండ్ సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అదేవిధంగా సూపర్ ఫామ్లో ఉన్న కీస్ కార్టీ.. ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. అతడు ఐర్లాండ్ పర్యటనకు తిరిగి జట్టులో చేరనున్నాడు. టెస్టు కెప్టెన్ రోస్టన్ ఛేజ్, స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ సైతం ఇంగ్లండ్ టూర్ తర్వాత తమ స్వదేశాలకు పయనం కానున్నారు. మరోవైపు ఈ రెండు సిరీస్లకు విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ దూరమయ్యాడు. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత జూన్ 6 నుండి 10 వరకు ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న కరేబియన్ జట్టు. .జూన్ 12 నుండి 15 వరకు ఆతిథ్య టీమ్తో మూడు టీ20లు ఆడనుంది.ఇంగ్లండ్తో టీ20లకు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, జైడ్ గూలీ, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ఐర్లాండ్తో టీ20లకు విండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్

వేలంలో అన్సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన పర్ధీప్ నర్వాల్
కబడ్డీ లెజెండ్, స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హర్యానాకు చెందిన పర్దీప్ నర్వాల్.. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.స్పోర్ట్స్ బ్రాడ్క్టాస్టర్ సునీల్ తనేజాతో ఇంటారక్షన్లో పర్ధీప్ ఈ షాకింగ్ న్యూస్ను వెల్లడించాడు. కోచ్గా తన కొత్త అవతరామెత్తనున్నట్లు నర్వాల్ తెలిపాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పర్దీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పాట్నా పైరేట్స్ వరుసగా మూడు పీకెఎల్ టైటిల్స్ను గెలవడంలో నర్వాల్ది కీలక పాత్ర. అదేవిధంగా ప్రోకబడ్డీ లీగ్ హిస్టరీలో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు కూడా నర్వాల్ పేరిట ఉంది. ఈ హర్యానా ఆటగాడు పీఎకెల్లో 190 మ్యాచ్లు ఆడి 1801 పాయింట్లు సాధించాడు. మ్యాచ్కు సగటున 9.47 రైడ్ సాధించడం విశేషం. అయితే గత నాలుగు సీజన్లలో పర్ధీప్ తన ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. యుపి యోధాస్, బెంగళూరు బుల్స్ తరపున నర్వాల్ పెద్దగా రాణించలేకపోయాడు. కాగా గతంలో భారత కబడ్డీ జట్టుకు కూడా నర్వాల్ ఆడాడు.చదవండి: IPL 2025 Final: 'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'

'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'
ఐపీఎల్-2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ సిద్దమయ్యాయి. ఈ తుది పోరుకు ఇరు జట్లు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ హైవోల్జేజ్ మ్యాచ్కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని, పవర్ ప్లేలో ఔట్ కాకపోతే 250 పరుగులకు పైనా లక్ష్యమున్నా అతడు చేజ్ చేసేస్తాడని యోగరాజ్ పంజాబ్ను హెచ్చరించాడు."ఆరంభంలో విరాట్ కోహ్లిని ఔట్ చేయకపోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు పవర్ప్లేలో ఔట్ కాకపోతే 250 నుంచి 300 పరుగుల టార్గెట్నైనా కరిగించేగలడు. అయితే పంజాబ్ జట్టు అత్యుత్తమంగా ఉంది. వారు ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి పది ఓవర్లలో కోహ్లి ఔట్ కాకపోతే మ్యాచ్ వన్సైడ్ అయినట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక టాలెంటెడ్ ప్లేయర్. ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్, కోహ్లి మధ్య పోటీ అనే చెప్పుకోవాలి.ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లి ఉంటే, పంజాబ్లో అయ్యర్ ఉన్నాడు. పంజాబ్ గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్.పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్.
బిజినెస్

పెయింటర్స్కు గుర్తింపు ఇస్తున్న ప్రోగ్రామ్..
ప్రతి మనిషి తన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలనుకుంటారు. అందుకు సరైన అవకాశం రావాలి. అయితే అలాంటి అవకాశాలు వాటంతటవే వస్తాయని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ విజయం వరించదు. జీవితంలో కెరియర్ పరంగా ఎదిగేందుకు వచ్చే ప్రతి మలుపును అవకాశంగా మలుచుకోవాల్సిందే. వివిధ రంగులను కలబోసి ప్రత్యేక రంగులు సృష్టించేవారికి మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెయింటర్లకు శిక్షణ ఇస్తున్నాయి. వాటిని తన జీవితంలో ఎదిగేందుకు అవకాశంగా మలుచుకున్నవారిలో విశాఖపట్నానికి చెందిన గణిరాజు సిరిపురం ఉన్నారు. అందుకు ప్రముఖ పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా చాలా మందికి శిక్షణ ఇస్తోంది. ఇందులో రంగుల కలయికతో ప్రదేశానికి తగినట్లుగా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి రంగులు తయారు చేయాలో, ఎలాంటి డిజైన్లను ఇష్టపడుతున్నారో వంటి అంశాలను తెలియజేస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గణిరాజు సిరిపురం ‘కామ్యాబీ కే రంగ్’ సీజన్ 6లో ప్రతిభ కనబరిచారు.పాఠాలు నేర్చుకున్నారు.. జీవితాలు మార్చుకున్నారు..గణిరాజు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కంపెనీ తెలిపింది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకొని తమ జీవితాలను మార్చుకున్న కాంట్రాక్టర్ల స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. సీజన్ 6లో గణిరాజు ప్రతిభ కనబరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు వివిధ సీజన్ల్లో ఢిల్లీకి చెందిన జునైద్ కాజ్మీ, గుజరాత్లోని మధపార్కు చెందిన అమృత్ బెన్, వారణాసి నుంచి బంటి బింద్ ముందువరుసలో ఉన్నారని చెప్పింది.కుటుంబ పోషణకు పెయింటింగ్ వైపుఏషియన్ పెయింట్స్ ప్లాట్ఫాం ద్వారా సంస్థ లక్షల మందికి ప్రేరణ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వారిలో విశాఖపట్నంకు చెందిన గణిరాజు సిరిపురం ఒకరు. పట్టుదలతో తన జీవితాన్ని విజయగాథగా మార్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. కానీ పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి బాధపడుతున్న తండ్రిని చూసి తన కలలను పక్కన పెట్టారు. కుటుంబాన్ని ఆదుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ వేసేవారు. ఈ క్రమంలో వైవిధ్యంగా పెయింటింగ్ వేస్తూ తానకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.పని పట్ల గౌరవం.. జీవితంపై స్పష్టత..కాలక్రమేణా కస్టమర్ల అంచనాలు పెరుగుతున్న కొద్దీ తనను తాను మెరుగుపరచుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ గురించి తెలుసుకున్నారు. ఈ ప్లాట్ఫాం ద్వారా ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ పొందారు. ఈ శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసంతో పాటు పని పట్ల గౌరవం, జీవితంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రోగ్రామ్లో మెలకువలు నేర్చుకుని వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు గణిరాజు కేవలం పెయింటర్ మాత్రమే కాదు. ఒక కళాకారుడిగా తన కెరియర్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన పనికి ఒక గుర్తింపు ఉంది. ఈ వృత్తిలో ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా స్థిరపడ్డారు. సరైన అవకాశం దొరికితే ఎటువంటి కష్టం వచ్చినా జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని తన కథ చెబుతోంది.ఇదీ చదవండి: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఎంతో మందికి స్ఫూర్తిదాయకంఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘కామ్యాబీ కే రంగ్ అనేది సాధారణ క్యాంపెయిన్ మాత్రమే కాదు. వ్యక్తుల విజయాలను స్మరించుకునే ఒక ఉత్సవం. సాధారణ జీవితం సాగించే పెయింటర్లు కంపెనీ ప్రోగ్రామ్ ద్వారా సమాజంలో ఎదగడం చూస్తున్నాం. ఈ ప్రయాణం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు 21 లక్షలకు పైగా ట్రైనింగ్ సెషన్లు నిర్వహించింది. ఈ శిక్షణలోని పెయింట్ అప్లికేషన్, వాటర్ప్రూఫింగ్, ఉడ్ ఫినిషెస్, మెషినరీ వాడకం, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్ని 79 శాతం మంది తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. 88 శాతం మంది తమ పనిలో మెరుగయ్యారు. 86 శాతం మందికి సామాజిక గౌరవం లభించింది’ అన్నారు.

నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు తగ్గి 24,634కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 ప్లాయింట్లు దిగజారి 81,044 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.67 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

యూపీఐ లావాదేవీల రికార్డ్
న్యూఢిల్లీ: పేద, ధనిక తేడా లేకుండా స్మార్ట్ఫోన్ వినియోగదారులందరికీ అత్యంత చేరువైన యూపీఐ లావాదేవీలు గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లను తాకింది. 2024 మే నెలలో నమోదైన రూ. 20.44 లక్షల కోట్ల విలువైన లావాదేవీలతో పోలిస్తే వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం నెల అంటే ఈ ఏప్రిల్లో నమోదైన రూ. 23.94 లక్షల కోట్లతో చూసినా వీటి విలువ 5 శాతం ఎగసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలివి. పరిమాణంలోనూ లావాదేవీల సంఖ్య 1,789.3 కోట్ల నుంచి 1,867.7 కోట్లకు పెరిగింది. కాగా..రోజువారీ లావాదేవీల విలువ ఈ ఏప్రిల్తో చూస్తే రూ. 79,831 కోట్ల నుంచి రూ. 81,106 కోట్లకు బలపడింది.

‘మే’లో తయారీ మందగమనం
న్యూఢిల్లీ: దేశీ తయారీ రంగ వృద్ధి గత నెలలో మందగించింది. మూడు నెలల కనిష్టానికి చేరింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) మే నెలలో 57.6కు చేరింది. అంతకుముందు నెల ఏప్రిల్లో 58.2గా నమోదైంది. ఇందుకు ప్రధానంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డిమాండ్ నీరసించడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపాయి. పీఎంఐ 50కుపైగా నమోదైతే తయారీ రంగం వృద్ధిలో కొనసాగుతున్నట్లే. 50 దిగువకు చేరితే ప్రతికూల వృద్ధికి చేరినట్లు. అయితే మే నెలలో తయారీ రంగ వృద్ధి రేటు గత మూడు నెలల్లోనే కనిష్టంగా నమోదైనట్లు సర్వే పేర్కొంది.
ఫ్యామిలీ

కేరళ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కారం ‘విత్తన బిళ్లలు’
కేరళలోని వయనాడ్ జిల్లా అంబలవాయల్కు చెందిన అజి థామస్ (AjiThomas) కూరగాయలు, అరటి, రబ్బరుతో పాటు వరిని పండిస్తారు. రైతులు తగిన ఆదాయం లేక వరి సాగు మానుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో బయో స్లర్రీతో వరి విత్తనాల ‘పెల్లెటైజేషన్’ (pelleting technique ) పద్ధతిని ఆయన అభివృద్ధి చేశారు. విత్తనం చుట్లూ మట్టిని లేపనం చేస్తే వాటిని విత్తన గుళికలు అనొచ్చు. ఇది అలా కాదు. నాలుగు పలకలుగా ఉండే పేడ తదితర పోషకాలతో కూడిన బిళ్లలో వరి విత్తనం పెంచి, నాట్లేస్తారు. కాబట్టి ‘విత్తన బిళ్లలు’ అని చెప్పుకుందాం. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి బయో స్లర్రీలోని సూక్ష్మజీవులు పొలం మట్టిలోని పోషకాలను విచ్ఛిన్నం చేసి వరి మొక్కలకు అందించటంతో రెట్టింపు దిగుబడి వస్తున్నదని వారు తెలిపారు. ఈ పద్ధతిలో హెక్టారుకు 5.5–6 టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, వయనాడ్ ప్రాంతంలో సాధారణ పద్ధతిలో వచ్చే ధాన్యం దిగుబడితో పోల్చితే రెట్టింపని థామస్ తెలిపారు. కూలీల ఖర్చు 25 శాతానికి తగ్గింది. ప్రతి కుదురుకు 50–60 పిలకలు వస్తున్నాయి. కంకి పొడవు పెరిగింది. ఎకరానికి వరి విత్తనాల అవసరం 30–50 కిలోల నుంచి 2.5–5 కిలోలకు తగ్గింది. పంట 15–20 రోజులు ముందే కోతకు వస్తోందని అజి థామస్ తెలిపారు. ఇదీ చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీవిత్తన బిళ్లల తయారీ ఖర్చు ఎంత?హెక్టారుకు సరిపడా వరి విత్తన బిళ్లల తయారీకి 12–14 కిలోల బయో–స్లర్రీ అవసరం. దీనికి హెక్టారుకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇది సాధారణ రసాయనిక సాగు పద్ధతిలో ఎరువులు, ఇతర ఉత్పాదకాల సగటు ఖర్చు కంటే రెట్టింపు. అయినప్పటికీ, కూలీల అవసరం/ఖర్చు, విత్తనాల ఖర్చు తగ్గి ధాన్యం దిగుబడి రెట్టింపు కావటంతో ఈ పద్ధతిలో వరి సాగు లాభదాయకంగా మారిందని థామస్ వివరించారు.ఇదీ చదవండి: ‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా! ప్రభుత్వ ప్రోత్సాహంకేరళ ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఈ పద్ధతి కేరళలో రైతుల ఆదరణ పొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అజి థామస్ చెబుతున్నారు. ‘విత్తన బిళ్ల’ అంటే? తయారీ ఎలా?వరి విత్తనాలను ట్రేలలోని చిన్న చిన్న చతురస్త్రాకారపు గదుల్లో బయో స్లర్రీని నింపి, అందులో వరి విత్తనం పెట్టి, మొలకెత్తిస్తారు. ఆ తర్వాత పొలంలో నాట్లు వేసే పద్ధతి ఇది. ఆవుపేడ, పులియబెట్టిన ఆకుల ద్రావణం, పంచగవ్య, ద్రవ జీవామృతంతో పాటు సూడోమోనాస్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులు కలిపి బయో–స్లర్రీ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బల్ల మీద ఉంచిన స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలో లేదా సాధారణ బోలు రబ్బరు మ్యాట్లో 1–1.5 అంగుళాల లోతు/పొడవు/వెడల్పుతో నలుచదరంగా ఉండే గుంతల్లో బయో స్లర్రీని పోసి, అందులో వరి విత్తనాలను గుచ్చుతారు. ఒక రోజులో ఆ స్లర్రీ గట్టిపడి విత్తన బిళ్లలు తయారవుతాయి. ఆ తర్వాత ట్రే నుంచి విత్తనంతో కూడిన ఆ బిళ్లలను బయటకు తీసి 12 గంటలు ఎండబెడతారు. ఆ తర్వాత వాటిపై నీరు చిలకరిస్తారు. 3 రోజుల్లో వరి మొలకలు బయటకు వచ్చి, తగినంత ఎత్తు పెరిగిన తర్వాత, ఆ బిళ్లతో కూడిన వరి నారును దమ్ము చేసిన పొలాల్లో మనుషులతో వరుసలుగా నాటుతారు. వరుసల మధ్య 25 సెం.మీ. (పది అంగుళాలు) దూరం పెడుతున్నారు. ఎకరానికి ఇట్లాంటి వరి నారు బిళ్లలు 64 వేలు అవసరమవుతాయి. ఇదే ప్యాడీ సీడ్ పెల్లెటైజేషన్ పద్ధతిచదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది

‘చెదలు’తో విసిగిపోయారా? మహిళా రైతు ఐడియా!
చెద పురుగులు (termites) ఇళ్లలోనే కాదు, పంట పొలాల్లో కూడా సమస్యలు సృష్టిస్తుంటాయి. పంటలను ఆశిస్తూ 10 నుంచి 50% వరకు దిగుబడి నష్టం కలిగిస్తుంటాయి. రైతులు సాధారణంగా రసాయనాలు చల్లి పంట పొలాల్లో చెదలును నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, రసాయనాలతో పని లేకుండా సులభంగా, స్వల్ప ఖర్చుతో చెదలు సమస్యకు పరిష్కారాన్ని వెదకటంలో ఓ వృద్ధ మహిళా రైతు అసాధారణమైన విజయం సాధించారు. యూకలిప్టస్ కొమ్మలు/కట్టె ముక్కలను పొలంలోని పంటల సాళ్ల మధ్య ఉంచితే, చెద పురుగులు పక్కనే ఉన్న పంటల జోలికి వెళ్లకుండా యూకలిప్టస్ కొమ్మలనే ఆశిస్తున్నాయని ఆమె కనుగొన్నారు. సజ్జ నుంచి గోధుమ వరకు..గోధుమ చేనులో 12“12 మీటర్ల దూరంలో ఎకరానికి 32 చొప్పున స్ప్రింక్లరు ఉంటాయి. ప్రతి స్ప్రింక్లర్కు దగ్గర్లో ఒక యూకలిప్టస్ కట్టె ముక్క/ కొమ్మను ఆమె పెట్టారు. ఒక్క గోధుమ మొక్కను కూడా చెదలు ఆశించలేదు. ఒక్కో కట్టె ముక్కను వేలకొద్దీ చెద పురుగులు చుట్టుముట్టాయి. అంటే పంట వైపు నుంచి ఈ యూకలిప్టస్ కట్టెలు చెదపురుగుల దృష్టిని వంద శాతం మళ్లించాయన్న మాట. ఎకరానికి ఖర్చు కేవలం రూ. 320లు. ఈ కట్టెలను ప్రతి పంట కాలానికీ కొత్తవి వేయాల్సిన అవసరం లేదు. మూడు పంటల వరకు అవే సరిపోతున్నాయని ఆమె తెలిపారు.వ్యవసాయ విశ్వవిద్యాలయ గుర్తింపుభగవతి దేవి ఈ విషయాన్ని ఫతేపూర్ షెఖావతిలోని కేవీకే శాస్త్రవేత్తల చెప్పారు. వరుసగా నాలుగేళ్ల పాటు అనేక పంటల్లో ప్రయోగం చేసి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. బికనెర్లోని రాజస్థాన్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బార్లీ పంటలోనూ అద్భుత ఫలితాలు రావటంతో, రైతులందరికీ ఇది అనుసరించమని చెబుతున్నారు. తళుక్కుమన్న ఉపాయంపనులు చేస్తూనే అసాధారణంగా ఉన్న విషయాలను గమనిస్తూ ఉండటం భగవతి దేవికి అలవాటు. వంట కలపను ఇంటికి తెచ్చి పొయ్యిలో పెడుతున్న ఒక సందర్భంలో ఆమె దృష్టిని యూకలిప్టస్ కర్రలు ఆకర్షించాయి. యూకలిప్టస్ కర్ర ముక్కల పైకి మిగతా కర్రల కంటే చాలా ఎక్కువ చెదపురుగులు చేరుతున్నట్లు ఆమె గుర్తించారు. ఈ గ్రహింపు కలిగిన మరుక్షణమే ఆమె మదిలో ఒక కొత్త ఉపాయం తళుక్కున మెరిసింది. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పుడు సాగులో ఉన్న సజ్జ పంటలో అమలు చేసింది. 2 నుంచి 3 అడుగుల పొడవు, 2 నుంచి 3 అంగుళాల లావు ఉన్న యూకలిప్టస్ కర్ర ముక్కలను తీసుకొని, సజ్జ పొలం అంతటా సాళ్ల మధ్యలో పెట్టింది. ఆమె అనుకున్నట్లుగానే, ఆ కర్ర ముక్కల చుట్టూ వేలకొలది చెద పురుగులు చేరి, కర్రలను కొరికి తినటం ప్రారంభించాయి. ఆశ్చర్యమేమిటంటే.. చెద పురుగులు ఇక సజ్జ మొక్కల జోలికి పోలేదు. యూకలిప్టస్ కర్ర ముక్క నుంచి 4 అంగుళాల దూరంలో ఉన్న సజ్జ మొక్కలను కూడా అవి ఆశించలేదు. అంతే. భగవతి దేవి మొహం ఆనందంతో వెలిగిపోయింది. జఠిలమైన చెదలుకు ప్రకృతిసిద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్న రాజస్థాన్ వృద్ధ మహిళా రైతు యూకలిప్టస్ కర్ర ముక్కలను పొలంలో ఉంచటం ద్వారా.. చెద పురుగులు పంటలను పాడు చెయ్యకుండా కాపాడుతున్నారు.

ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు

పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!
ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజింగ్గా మారిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఇందుకు ముఖ్య కారణాలని ప్రముఖ మనస్తత్వవేత్త సుదీర్ సండ్రా తెలిపారు. సుధీర్ ఆధ్వర్యంలో నగరంలోని శిల్పకళా వేదికగా నిర్వహించిన సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్లో 1,300 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే అధునాతన యాప్ ‘పేరెంట్ షాలా’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్నారులకు సరైన గైడెన్స్ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారని, దీనికి అనువైన వేదిక ‘పేరెంట్ షాలా’ అని పేర్కొన్నారు. వారికి ఇదొక మెంటార్ లా సాయపడుతుందని చెప్పారు. నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు కమ్యూనిటీ పరంగా సహాయం అందిస్తుందని, భారతీయ సంప్రదాయాలకు, ఆధునిక పేరెంటింగ్ పద్ధతులను జతచేసి అనుబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా చిన్నారుల దృష్టిని మళ్లిస్తుందని, అలాగే తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే వేదికపై సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టోరీ టెల్లర్ రమా రావి, డాక్టర్ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ (ఎన్హెచ్ఏ) డైరెక్టర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్)
ఫొటోలు
అంతర్జాతీయం

ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్

ఏకాంత వీడియోలు ఒక్కొక్కరివిగా బయటకు..!
పొరుగుదేశం పాకిస్తాన్లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల కమ్యూనిటీని వణికిపోతోంది. గత కొన్నిరోజులుగా అక్కడి ఇన్ఫ్లుయెన్సర్ల పరువు బజారున పడుతోంది. వరుసబెట్టి ఒక్కొక్కరి ఏకాంత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనాలు వాళ్లను తిట్టిపోస్తుండగా.. మరోవైపు వాళ్ల కవరింగ్లు, వివరణలు, చట్టపరమైన చర్యలతో ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్ టాపిక్గా మారింది.పాక్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లతో పాపులర్ అయిన కొందరు యువతుల ప్రైవేట్ వీడియోలు గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్నాయి. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మినాహిల్ మాలిక్, ఇమ్షా రెహమాన్ల వీడియోలు తొలుత సర్క్యులేట్ కావడంతో.. వాళ్లకున్న మిలియన్ల ఫాలోవర్లు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే టాక్ షోలు, మ్యూజిక్ వీడియోలతో పాపుల్ అయిన మథీరా ఖాన్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా.. కన్వాల్ అఫ్తాబ్ అనే మరో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోలను ఆ ఇన్ఫ్లుయెన్సర్లు(Influencers) ఖండిస్తున్నారు. అవి తమవి కావని, ఇదంతా ఏఐ సృష్టి అని వివరణలు ఇస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు వెెళ్తున్నామని ప్రకటించారు. మినాహిల్ ఓ అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ కామెంట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు కారణం.. ఆమె చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్ గతంలో చెప్పిన మాటలు కావడం!.ఇదిలా ఉంటే.. ఈ డర్టీ వ్యవహారంలో భారత్ ప్రస్తావనతో అక్కడి టీవీ చానెల్స్లో చర్చలు నడిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంతో అక్కడి మీడియా ఛానెల్స్ను, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలామందిని భారత్ నిషేధించింది. ఈ క్రమంలో ఇది భారత్ నుంచి జరుగుతున్న వ్యవహారమేనని అక్కడి మీడియా చర్చ జరపడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది.SHOCKING NEWS 🚨 Private videos of several Pakistani influencers of Pakistan have leaked online.Pakistan’s influencer community is facing a wave of scandals one after another 😱After viral incidents involving TikTok stars Minahil Malik and Imsha Rehman, now videos of Mathira… pic.twitter.com/rFdRAPIBY8— BALA (@erbmjha) June 1, 2025

‘ఉగ్రవాదానికి తావు లేదు’: కొలరాడో దాడిపై శశి థరూర్
న్యూఢ్లిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంపై పలు దేశాలకు తెలియజేస్తూ, అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(MP Shashi Tharoor), కొలరాడోలో జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్లో ఉగ్రవాదానికి తావులేదన్నారు.కొలరాడోలోని బౌల్డర్లో జరిగిన ఉగ్ర దాడిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘బౌల్డర్లో ఈరోజు జరిగిన ఉగ్రదాడి గురించి భారత ఎంపీల ప్రతినిధి బృందం సభ్యులు తెలుసుకున్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియగానే ఉపశమనం పొందామని, ఉగ్రవాదానికి మన దేశాలలో స్థానం లేదు’ అని శశిథరూర్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. థరూర్ ప్రతినిధి బృందం ప్రస్తుతం బ్రెజిల్(Brazil)లో ఉంది. మంగళవారం అమెరికాకు చేరుకోనుంది. Members of the Indian MPs’ delegation learned with concern about the terror attack in Boulder, Colorado today. We are relieved there was no loss of life.We all share Secy of State @SecRubio’s view that “terror has no place” in our countries.#boulderattack @IndianDiplomacy…— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2025కొలరాడోలోని బౌల్డర్ డౌన్ టౌన్లోని కోర్టు భవనం సమీపంలో మొహమ్మద్ సబ్రీ సోలిమాన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో అనుమానితుడు కాక్టెయిల్స్, తాత్కాలిక ఫ్లేమ్త్రోవర్ను ఉపయోగించాడని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తి ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ కేకలు వేశాడు. హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని కోరుతూ ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండగా, అక్కడికి సమీపంలోనే ఈ దాడి జరిగిందని యాంటీ-డిఫమేషన్ లీగ్ తెలిపింది. ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..

OP Spider Web: రష్యాకు తగిన శాస్తే జరిగింది
కీవ్: ఉక్రెయిన్ తాజాగా రష్యా సైనిక వైమానిక స్థావరాలపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ మెగా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Ukrainian President Zelensky) సమర్థించుకున్నారు. ఇది అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించిన ఆయన.. రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగించిందని, ఆ దేశానికి తగిన శాస్తేనని ప్రకటించారు.Today, a brilliant operation was carried out — on enemy territory, targeting only military objectives, specifically the equipment used to strike Ukraine. Russia suffered significant losses — entirely justified and deserved.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025‘స్పైడర్స్ వెబ్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించిందని, దీనికి తగిన సంఖ్యలో డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారని జెలెన్స్కీ చెప్పారు. వారు రష్యా వైమానిక స్థావరాలలో ఉంచిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ఢీకొట్టేలా చేశారని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ దాడులు చేసేందుకు ఏడాది పాటు ప్రణాళిక వేశారని, అది ఇప్పుడు ఇది సంపూర్ణంగా అమలయ్యిందని, ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్(Special operation) అని గట్టినమ్మకంతో చెబుతున్నానని జెలెన్స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ దాడితో రష్యన్లు 40 యూనిట్లకు పైగా వ్యూహాత్మక వైమానిక స్థావరాలను కోల్పోవడం తనకు సంతృప్తికరంగా అనిపించిందని, తాము ఇటువంటి దాడులను ఇకముందు కూడా కొనసాగిస్తామని జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడిలో కీవ్ సహాయం అందించిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. తాము దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు, తమకు రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజలను అన్ని విధాలుగా రక్షించుకుంటామని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నది రష్యన్లే అని జెలెన్స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్లో మాస్కో- కైవ్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి లో ప్రారంభమైంది. ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు.ఇది కూడా చదవండి: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
జాతీయం

చిన్న వయసు, విష్ణుప్రియ డాక్టర్ ఆశలకు 'ఉరి'
శివమొగ్గ(కర్ణాటక): శివమొగ్గలో ఉన్న సుబ్బయ్య మెడికల్ కళాశాలలో హాస్టల్లో ఓ మెడికో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు విష్ణుప్రియ (22). వివరాలు.. ఈమె కుటుంబం బెంగళూరుకు చెందినది కాగా, జర్మనీలోని బెర్లిన్లో నివసిస్తోంది. విష్ణుప్రియ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇంటర్న్షిప్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో పూర్తయి డాక్టర్ కానుంది. అయితే ఏమి జరిగిందో మరి.. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కారణాలు తెలిసి రాలేదు. డెత్నోట్ ఏదీ దొరకలేదు. శివమొగ్గ గ్రామీణ పోలీసులు ఆమె శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అమ్మానాన్నా అక్కర్లేదు.. పేరెంట్ చాలు
కొచ్చి: లింగమార్పిడి జంటకు చెందిన సంతానానికి జనన ధృవీకరణ పత్రంలో అమ్మా, నాన్నా కాలమ్లకు బదులు కేవలం పేరెంట్ అని రెండు సార్లు సూచించాలని కేరళ హైకోర్టు స్థానిక యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. అబ్బాయిగా మారిన జహాద్, అమ్మాయిగా మారిన జియా పావల్లు తమ సంతానానికి లింగ నిష్పాక్షిక(జెండర్ న్యూట్రల్) జనన ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వాలని ఈ జంట చేసిన అభ్యర్థనను కేరళలోని కోజికోఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నిరాకరించింది.అప్పటికే జహాద్ను తల్లిగా, జియాను తండ్రిగా పేర్కొంటూ జారీచేసిన బర్త్ సర్టిఫికేట్లో సవరణలు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఈ జంట కేరళ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎ.ఎ. జియాద్ రహమాన్ సారథ్యంలోని ధర్మాసనం కేసును విచారించి పై విధంగా తీర్పునిచ్చింది. జహాద్ వాస్తవానికి జన్మతః అమ్మాయి. గర్భంతో ఉన్నప్పుడు అబ్బాయిగా మారడానికి ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో బిడ్డను జన్మనిచ్చి తర్వాత అబ్బాయిగా మారింది.

చెప్పుతో కొట్టి.. కాళ్ల బేరానికి
శివాజీనగర: ఆవేశంలో కన్నుమిన్ను కానక ఆటో డ్రైవర్ను హిందీ మహిళ చెప్పుతో కొట్టింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. జైలు జీవితం తప్పదని గ్రహించిన ఆమె కాళ్ల బేరానికి వచ్చింది. బిహార్కు చెందిన వివాహిత పంఖూరి మిశ్రా, ఆమె భర్త ఆటోడ్రైవర్ కాళ్లపై పడి క్షమాపణ చెప్పారు. క్షమించండి ప్లీజ్ రోడ్డుపై తమ స్కూటర్కు తగిలాడని ఆటోడ్రైవర్ లోకేశ్ను పంఖూరి మిశ్రా చెప్పుతో బాదింది. వీడియో తీస్తావా.. తీయ్ అని కూడా బూతులు తిట్టింది. ఈ వీడియో వైరల్ కాగా మిశ్రా అకృత్యంపై జనం మండిపడ్డారు. ఆటోడ్రైవర్ ఫిర్యాదు మేరకు ఆమె మీద బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆ జంటను పిలిపించి విచారణ జరిపారు. నేను గర్భవతిని, ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో తగిలింది, కోపంతో దాడి చేశాను, ఆటోడ్రైవర్ నాపై దాడికి ప్రయత్నించాడు అని తెలిపింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని బెయిలు ఇచ్చి పంపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఆటోడ్రైవర్కు క్షమాపణలు చెప్పారు. కన్నడిగులు తమను క్షమించాలని, బెంగళూరును, ఇక్కడి సంస్కృతిని ప్రేమిస్తున్నామని, కావాలని చేయలేదని పంఖూరి వివరణ ఇచ్చింది. ఆటోడ్రైవర్ల ధర్నా మరోవైపు చెప్పుల దాడిని ఖండిస్తూ బెంగళూరులో ఆటోడ్రైవర్ల సంఘం ధర్నా చేసింది. ఫ్రీడంపార్క్లో వందలాదిగా చేరి నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టి అనంతరం క్షమాపణ చెప్పిన యువతిబెంగుళూరు పట్టణంలోని బెల్లందూరు పరిధిలో తన స్కూటీపై వెళ్తున్న బీహార్కు చెందిన మహిళను వెనక నుండి ఢీకొన్న ఆటోదీంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగినిఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు… pic.twitter.com/QFu8B3EwC3— Telugu Scribe (@TeluguScribe) June 2, 2025

పీఓకేలో నిరసనల హోరు
గిల్గిత్: ఆపరేషన్ సిందూర్తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్–బాల్టిస్టాన్లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మార్ట్ నగర్లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిసాŠత్క్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)లో కలికితురాయి వంటి కారాకోరమ్ జాతీయ రహదారిని గత మూడు రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్(నవాజ్) పారీ్టకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లబి్ధచేకూర్చేలా ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారని సరకు ఎగుమతి, దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2023 అక్టోబర్లోనూ గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రజలు భారత్ అనుకూల ఉద్యమం చేశారు. భారత్లోని కార్గిల్ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని స్థానికులు ఉద్యమించారు. ‘సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దును తెరవండి’’అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగడడం తెల్సిందే. తర్వాత ఆయనను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్ సర్కార్ అరెస్ట్చేసింది. పరస్పర నిందారోపణలు గిల్గిత్–బాల్టిస్తాన్లో ఇమ్రాన్ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలతో తమకు సంబంధంలేదని పీఎంఎల్(నవాజ్) పార్టీ చెబుతోంది. ‘‘పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కారి్మకులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు, హోటళ్లు, చిరువ్యాపారులు అందరూ ఆరు నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా?’’అని పీఎంఎల్(నవాజ్) పార్టీ నేత జావేద్ హుస్సేన్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ‘‘ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు’’అని గిల్గిత్–బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ అలీ ఖయీద్ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థిక చితికిపోతున్నారు. సరకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు. కస్టమ్స్ క్లియరెన్సుతో.. సరిహద్దుల్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా 257 కన్సైన్మెంట్లు ఇలా డ్రై పోర్ట్లోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరకు పాడయింది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరకుకు సైతం రోజువారీ నిల్వ చార్జీలు ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరకుకు మోక్షం కల్గించేదాకా కారాకోరమ్ హైవేను తెరిచేదిలేదని వ్యాపారులు భీషి్మంచుకుని కూర్చున్నారు. నగర్, హూంజా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్–బాల్టిస్తాన్ దిగుమతి, ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్–చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి.
ఎన్ఆర్ఐ

ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ సీఈవోకి గూగుల్ రూ. 855 కోట్ల ఆఫర్
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ (Neal Mohan Youtube CEO) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రముఖ సెర్చ్ ఇంజీన్ గూగుల్ను వీడి ట్విటర్లో చేరకుండా ఉండేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో నీల్ మోహన్ తన అనుభవాలను, విశేషాలను పంచుకున్నారు. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఇటీవల తన 'People by WTF' పాడ్కాస్ట్ తాజా ఎపిసోడ్లో నీల్ మోహన్తో సంభాషించారు. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం నుండి ప్లాట్ఫామ్ అల్గోరిథంను ఛేదించే చిట్కాల వరకు ఇద్దరూ అనేక అంశాలపై చర్చించారు.సుదీర్ఘకాలంగా యూట్యూబ్లో ఎగ్జిక్యూటివ్గా సేవలు అందించి 2023నుంచి గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫాం సీఈవోగా ఉన్న ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ (ఎక్స్)లో చేరకుండా ఉండేందుకు 2011లో 15 ఏళ్ల క్రితం గూగుల్ మీకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు 855 కోట్ల రూపాయలు) చెల్లించిదటగా అని ప్రశ్నించాడు నిఖిల్ కామత్ వాదనను ఖండించకపోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. అయితే 2011 టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం అనేక సంవత్సరాలు కొనసాగే పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో , గూగుల్ ఆఫర్ ఇచ్చిందట నీల్మోహన్కు. అలా నీల్ మోహన్కు దూకుడు కళ్లెం వేసిందని తెలిపింది. అప్పటికే గూగుల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యూహంలో కీలకంగా ఉన్న నీల్మోహన్ను వదులుకోవడానికి ఇష్టపడని గూగుల్ యూట్యూబ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్య దీర్ఘకాలంలో గూగుల్కు మంచి ఫలితాలను అందించింది. అంతేకాదో సుందర్ పిచాయ్ను బోర్డులోకి తీసుకురావడానికి ట్విటర్ ప్రయత్నించిందట. దీంతో పిచాయ్కి కూడా 50 మిలియన్ల స్టాక్ గ్రాంట్ ఆఫర్ ఇచ్చింది గూగుల్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ,స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత నీల్ మోహన్, ఆండర్సన్ కన్సల్టింగ్ (ఇప్పుడు యాక్సెంచర్)లో తన కెరీర్ను ప్రారంభించారు. అక్కడినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ చివరికి బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత . 2007లో గూగుల్ డబుల్ క్లిక్ను 3.1 బిలియన్డాలర్లకు కొనుగోలు చేయడంతో గూగుల్ యాడ్స్ విభాగంలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 2023లో సుసాన్ వోజ్సికి తర్వాత నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్పై ఫ్యాన్ కామెంట్ వైరల్అప్పట్లో హిందీ రాదు, తలచుకుంటే నవ్వొస్తుంది...తన తండ్రి ఇండియాలో ఐఐటీలో చదవి పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లారని మోహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉన్నప్పుడే తాను పుట్టానని, తన బాల్యంలో ఎక్కువ భాగం అమెరికాలో గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే 1986లో భారతదేశానికి తిరిగి వచ్చా.. ఆ సమయంలో లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చేరినపుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు హిందీమీద అంత పట్టు లేదు, ఏడో తరగతిలో అదో పెద్ద సవాల్ అంటూ గుర్తు చేసుకున్నారు.చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్

పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో
తూర్పు గోదావరి జిల్లా: మరో మూడు వారాల్లో ఆ ఇంట వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఆనంద డోలికల్లో తేలియాడాల్సిన బంధుగణమంతా.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబోయే పెళ్లి కొడుకుగా రావాల్సిన కుమారుడు.. నిర్జీవంగా ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతులేకుండా పోయింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న మామిడికుదురు గ్రామానికి చెందిన ఎండీ తురాబ్ అలీ(28) ఈ నెల 17న గుండెపోటుతో మరణించారు. వచ్చే నెల 15న అతని వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులుండగా, ఈ విషాద వార్త ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వాస్తవానికి తురాబ్ అలీ సోమవారం ఇంటికి రావాల్సి ఉంది. యాదృచ్చికంగా అదే రోజు అతని మృతదేహం ఇంటికి చేరిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అతని తండ్రి రిజ్వానుల్ హసన్ హైదరాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, తురాబ్ అలీ పెద్దవాడు. తురాబ్ అలీ తాతయ్య తురాబ్ హుస్సేన్ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పేరునే తురాబ్ అలీకి తల్లిదండ్రులు పెట్టారు. పెళ్లి ఏర్పాట్లలో.. మరికొద్ది రోజుల్లో తురాబ్ అలీ వివాహం జరగాల్సి ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మంటపం బుక్ చేసి, పెళ్లికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంచడంలో బిజీగా ఉన్నారు. ఈలోగా తురాబ్ అలీ మరణవార్త చేరడంతో.. పెళ్లింట కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు నడుమ మామిడికుదురు ఖబర్స్థాన్లో తురాబ్ అలీ అంత్యక్రియలు జరిగాయి.

“కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ” విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ““కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ”అనే అంశంపై జరిపిన 80వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీ వేత్తలలో కొంతమంది ఈ రోజు ఒకే వేదికమీద పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ, శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అసంఖ్యాకంగాఉన్న భారతీయ భాషలలో, 24 భాషలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రదానంచేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న 8 మంది తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, వారు పురస్కారం పొందిన రచనలపై స్వీయవిశ్లేషణ చెయ్యడం చాలా వినూత్నంగా ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం భారతీయ పౌరసత్వం కల్గినవారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులు. కాని పద్మ పురస్కారాల లాగా, భారతీయ పౌరసత్వంతో సంభందం లేకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయమూలాలున్న రచయితలను కూడా ఈ కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారాలకు అర్హులను చేస్తే, మరిన్ని వైవిధ్య భరితమైన రచనలు పోటీలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని పరిశీలించాలని లక్షలాదిమంది ప్రవాసభారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీకి డా. ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.గత 12 సంవత్సరాలగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న డా. కృతివెంటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ “కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోల్చిచూస్తే వాసి లోను, రాశిలోనూ సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయన్నారు. అయితే మన తెలుగు రచనలు ఎక్కువగా ఆంగ్లం, హిందీ తదితర బాషలలోకి ఎక్కువగా అనువాదం కావలసిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరంనుండి రచయితలు ఎవ్వరికివారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలను పంపుకోవచ్చు అన్నారు.” ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులు గా పాల్గొన్న ...డా. గోరటి వెంకన్న, “వల్లంకి తాళం” కవిత, 2021-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. మధురాంతకం నరేంద్ర, “మనోధర్మ పరాగం” నవల, 2022-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, “రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు”, 2023-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), Galib-The Man, The Times, in English by Mr. Pavan Varma; “గాలిబ్ నాటి కాలం” తెలుగు అనువాదం-2023-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారగ్రహీత; పెనుగొండ లక్ష్మీనారాయణ, “దీపిక” రచనకు-2024-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, “మాయా లోకం” నవల, 2024-కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారగ్రహీత, డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడియా నవల “దాడీ బుధా” ను “ఈతచెట్టు దేవుడు” గా తెలుగులోకి అనువాదం- 2024-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారవిజేతలు తమ పురస్కార రచనల విశేషాలను ఆసక్తిగా పంచుకున్నారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును

థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) విదేశీ నీళ్లపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినం ‘తెప్పోత్సవాన్ని’ (దివ్య తెప్ప ఉత్సవం) ఘనంగా, భక్తిశ్రద్ధలతో టెమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద నిర్వహించింది. యుకె , యూరప్లో హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయి అని నిర్వాహకులు ప్రకటించారు. వేద పారాయణం, భజనలు, సమూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. శ్రద్ధతో, సమగ్రంగా రూపొందించి ఈ ఉత్సవం భక్తి, సమాజ చైతన్యం, దైవానుగ్రహానికి అద్దం పట్టింది.ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి SVBTCC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “దీపమైన భక్తితో నడిచిన కల నౌకై తేలింది — సేవతో నడిచింది, స్వామి అనుగ్రహంతో సాగింది. ఇది ఎంతోమందికి అరుదైన అనుభూతి - దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అనునిత్య సంప్రదాయాన్ని, యుకె భూమిలో నూతనంగా దర్శించుకోవడం… హృదయాలను నింపింది, ఆత్మలను ఉల్లాసపరిచింది.” అని SVBTCC ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

దూసుకొచ్చిన మృత్యువు
కాటారం : కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఇద్దరు వృద్ధుల నిండు ప్రాణాలు బలితీసుకుంది. కాలక్షేపం కోసం ఇంటి ఎదుట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారుపాక మధునమ్మ (90), నీలారపు బాలయ్య (65), మల్లయ్య ఆయన మనుమడు ఆరేళ్ల బాలుడు డానియల్తో కలిసి రోడ్డు పక్కన తమ ఇళ్ల ఎదుట చెట్టు నీడకు కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన మొగిళి (కారు డ్రైవర్), మరో ముగ్గురు దైవదర్శనం నిమిత్తం కాళేశ్వరం వెళ్లి అన్నారం బ్యారేజ్ను సందర్శించి దామెరకుంట మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా గంగారం ఎస్సీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుగా ఉన్న చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న వృద్ధులపైకి దూసుకెళ్లింది. మధునమ్మ కాలు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన బాలయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వృద్ధుడు మల్లయ్య, డానియల్కు సైతం తీవ్ర గాయాలవగా భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా మద్యం తాగి ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులో అతివేగంతో వెళ్లడంతో ఇద్దరి ప్రాణాలు పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలిని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మొగిళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ..గంగారంలో కారు ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఘటనా స్థలిని పరిశీలించారు. ఎస్పీ కిరణ్ఖరేతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రమాదానికి కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు.

పట్టాలపై మృత్యుఘంటికలు
సాక్షి, హైదరాబాద్: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ మరికొందరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్లకు రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు యథేచ్చగా పట్టాలు దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్ తమను చేరే లోపు ట్రాక్ దాటేయొచ్చనే అతివిశ్వాసం కూడా నిండు ప్రాణాలను హరిస్తోంది. నగరంలోని ఎంఎంటీఎస్, సబర్బన్ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఈ ట్రాక్లను దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు దాటాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్పురా, ఉప్పుగూడ, మలక్పేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్, బీహెచ్ఈఎల్, సికింద్రాబాద్ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మలుపులు...మృత్యు పిలుపులు ‘‘లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే క్రమంలో నేచర్క్యూర్ హాస్పిటల్, భరత్నగర్, హఫీజ్పేట్, తదితర చోట్ల ట్రాక్ మలుపులు ఉన్నాయి. ఈ రూట్లో ట్రైన్ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్ వచ్చేలోపు దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్ శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే అది వందల మీటర్ల దూరం పరుగులు తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ మలుపుల వద్దనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ట్రాక్లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి బ్రేక్ అప్లయ్ చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్ దూరంలో ఆగుతుంది. అప్పటికే ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్ లొకోపైలెట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా మేనియా.... సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్లపైన నించొని రకరకాల రీల్స్ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత ఇలాంటి సోషల్ మీడియా మేనియాలో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు సనత్నగర్ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్ పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయతి్నంచి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆరీ్పఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు.రైలు ఢీకొని అన్నదమ్ముల దుర్మరణంకాచిగూడ: రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ కమల్ కుటుంబంతో కలిసి సమీపంలోని రైలు పట్టాల వద్ద నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన మహ్మద్ షాబుద్దీన్ (26) ఎలక్ట్రికల్ షాపులో వర్కర్గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు మహ్మద్ ఫైజల్ (21) వెల్డింగ్ వర్కర్గా పని చేస్తున్నాడు. సోమవారం అన్నదమ్ములిద్దరూ గడ్డికోసం పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచి్చన రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులో క్రికెటర్ కోహ్లీ పబ్పై కేసు
సాక్షి బెంగళూరు: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్, రెస్టారెంట్ ‘ఒన్ 8 కమ్యూన్’ మరోసారి వార్తల్లోకెక్కింది. మే 29న సోదాలు చేపట్టిన పోలీసులు స్మోకింగ్ జోన్ లేని విషయాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించి మే 31న కేసు నమోదు చేశారు. స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్, పబ్కు సహయజమానిగా ఉన్న కోహ్లీకి, సిబ్బందికి నోటీసులు సైతం జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో తప్ప నిసరిగా స్మోకింగ్జోన్లను ఏర్పాటు చేయాలి. అయితే, ‘ఒన్ 8 కమ్యూన్’గతంలోనూ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 2024 జూలై 6న అర్ధరాత్రి దాటాక 1.20 గంటల వరకు పబ్ను తెరిచే ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ గతేడాది డిసెంబర్లో నగర పాలక సంస్థ నోటీసులు పంపింది.

కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు.