Top Stories
ప్రధాన వార్తలు

రెడ్బుక్ అరెస్ట్: కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి
కాకాణి అరెస్ట్ అప్డేట్స్..వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్బుక్ పాలన పీక్ స్టేజ్కు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్ చేస్తూ అరెస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు.👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు.

పుతిన్కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తపరిచారు.ట్రంప్ తాజాగా ట్విట్టర్లోని ట్రుత్ వేదికగా స్పందిస్తూ..‘రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ, ఇప్పుడు పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. ఉక్రెయిన్పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు. అన్యాయంగా ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.Donald Trump Truth Social 05.25.25 08:46 PM ESTI’ve always had a very good relationship with Vladimir Putin of Russia, but something has happened to him. He has gone absolutely CRAZY! He is needlessly killing a lot of people, and I’m not just talking about soldiers. Missiles…— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 26, 2025పుతిన్.. ఉక్రెయిన్లోని ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం ఉక్రెయిన్ను కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. బహుశా అది నిజమే కావచ్చు.. కానీ అలా చేస్తే, అది రష్యా పతనానికి దారి తీస్తుంది. అధ్యక్షుడు జెలెన్స్కీ తను మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలను సృష్టిస్తుంది. అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం, వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్తో సహా 30 కి పైగా నగరాలు, గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

మీ భూములు.. మా వ్యాపారం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘‘మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం. మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం..!’’ అంటూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పేరుతో రైతులను బెదిరించి సారవంతమైన భూములను గుంజుకుంటున్నారు. లీజు ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూములను తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెర తీశారు. లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ పూచీకత్తు ఉండదని.. రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పదంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి కనుసన్నల్లో నయానా భయాన సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి తమకు బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు. గడువు ముగిసినా.. కంపెనీ కనికరిస్తేనే!అవుకు మండలంలో ‘హీరో’ సోలార్ కంపెనీ 1,252 ఎకరాల భూమిని సేకరిస్తుండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా.. పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు. ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, రెండేళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది!!శాశ్వతంగా దూరం చేసే కుట్ర..నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్ ప్యూచర్ ఎనర్జీస్ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1,252 ఎకరాలను ‘క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ నిబంధనలు పరిశీలిస్తే రైతులు తమ అవసరాల కోసం పొలం విక్రయించకుండానే శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఇవీ నిబంధనలు..⇒ రైతులు తమ భూమిని 29 ఏళ్ల 11 నెలలు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్ (అగ్రిమెంట్ లీజు) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. ⇒ లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీజు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే.⇒ లీజుకింద ఏడాదికి రూ.40 వేలు ఇస్తారు. రెండేళ్లకోసారి ఐదు శాతం పెరుగుతుంది.⇒ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే.⇒ భూమిని కంపెనీ థర్డ్ పార్టీకి (మరొకరికి) లీజుకు ఇవ్వవచ్చు.రైతన్నల పొలాలకు దారేది?రాయలసీమలో సోలార్ విద్యుదుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకూ బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు. ‘చుట్టూ సోలార్ కోసం అందరూ పొలాలిస్తుంటే మీరొక్కరే ఎలా వ్యవసాయం చేస్తారు? దారి, నీళ్లు లేకుండా పొలంలోకి ఎలా వెళతారు..?’ అని కంపెనీ ప్రతినిధులు, మంత్రి బీసీ జనార్దనరెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మంత్రికి, కంపెనీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు జంకుతున్నారు. భూములు లేకుంటే స్థానిక గొర్రెల కాపరులు మేత కోసం అల్లాడాల్సిందే. లెవలింగ్ పేరుతో పొలం గట్లను చదును చూస్తే రైతులకు దారి ఉండదు.కంపెనీ చేతుల్లోకి..వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం లీజుకు ఇస్తే వ్యవసాయేతర భూమి కిందకు మారుతుంది. అప్పుడు రైతులు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ విషయాలను రైతులకు వివరించకుండా కంపెనీ దాగుడు మూతలు ఆడుతోంది. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములనే బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. ఒకవేళ నష్టాలొచ్చి దివాళా తీస్తే ఆ రుణాలను ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లగలరా? ఇక లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ మెటీరియల్ ఎవరు తొలగించాలి? ఎక్కడ పడేయాలి? ఆ ఖర్చు సంగతేమిటి? అనే వివరాలేవీ ఎంవోయూలో లేవు. రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. లీజు ముగిసిందని రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పొలం విక్రయించుకోవాలంటే కుదరదు. కంపెనీ లీజు పొడిగించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే! అంటే రైతుకు 30 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.సాగు భూముల్లో సోలార్..!సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఎస్ఆర్బీసీ 13వ బ్లాక్ నుంచి పొలాలకు నీరు అందుతుంది. ఇక్కడ మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లీజు అగ్రిమెంట్లో లొసుగులపై రైతుల తరఫున కంపెనీని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవుకు, శింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్రనరసింహారెడ్డి బుజ్జగిస్తుండగా శింగనపల్లెలో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు.భూములు మావి.. లోన్లు మీకా?: కోట శంకర్రెడ్డి, రైతు శింగనపల్లె లీజుకు తీసుకున్న మా భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారట. 30 ఏళ్ల లీజు అంటే సగం జీవితం అయిపోతుంది. మా పిల్లలకు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పొలాలు లీజుకు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. భూములిచ్చి కూలికి వెళ్లాలా?సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటోంది. నాకు 2.20 ఎకరాలు ఉంది. పొలం అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ రైతుగా బతుకుతున్నాం. భూములిచ్చి కూలి పనికి వెళ్లాలా? సోలార్ ప్లాంటుతో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్లు ఎలా? దారి ఎలా? రైతులను బాధ పెట్టొద్దు.– లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, శింగనపల్లె

‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (మినీ కోచ్ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్లోనూ వందేభారత్ కోచ్ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్ నిర్మాణ బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్ను ఓవర్హాలింగ్ వర్క్షాప్గా ప్రతిపాదించినప్పుడే ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్మెక్–టైకిషాలతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్వీఎన్ఎల్ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్వీఎల్ఎల్ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్ లేఅవుట్ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.

భారత్తో మనుగడకే ప్రమాదం
ఇస్లామాబాద్: భారత్ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్డీఐఏ) వరల్డ్ త్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైనా పాక్ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది. నివేదికలో భారత్ గురించి ఏముంది? జమ్మూకశీ్మర్లోని పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్ ‘మేడ్ ఇన్ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.

Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు
గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల క్రితం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్ నజ్జర్కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్లో హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసిన అనంతం ఈ యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్ హమాస్ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది. ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..

పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్ రావిపూడి స్పీడ్కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్ అయితే వస్తుంది.

కొత్త క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్బ్యాక్
ముంబై: యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ ఫస్ట్ యూపీఐ ప్లాట్ఫామ్ ‘సూపర్.మనీ’ భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ‘యాక్సిస్ బ్యాంక్ సూపర్.మనీ రూపే క్రెడిట్ కార్డ్’ అన్నది రూపే నెట్వర్క్పై పనిచేస్తుంది. యూపీఐ చెల్లింపులకు, పీవోఎస్ టెర్మినళ్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఏటీఎంలలో దీన్ని వినియోగించుకోవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. కార్డు దారులు సూపర్.మనీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. దీని సాయంతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తే 3 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఇతర విభాగాల్లో ఈ కార్డుతో చేసే వ్యయాలపై ఒక శాతం క్యాష్ బ్యాంక్ లభిస్తుంది. ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా జీవితకాలం ఉచిత సదుపాయంతో ఈ కార్డు లభిస్తుందని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్కతా నైట్రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్ను ముగించాయి. గుజరాత్తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్సెంచరీ అందుకున్నాడు. హెడ్ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన క్లాసెన్... వరుణ్కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో
పుతిన్కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్ వార్నింగ్
'థగ్ లైఫ్' వేదికపై అదిరిపోయే సాంగ్ పాడిన శ్రుతి హాసన్
Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు
స్టాక్మార్కెట్, కరెన్సీ అప్డేట్స్
బిహార్లో పెళ్లి కొడుకును అపహరించారు
కొత్త క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్బ్యాక్
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
రెడ్బుక్ అరెస్ట్: కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి
ప్రపంచ సుందరి పోటీలకు ‘మెట్రోరైల్’ విస్తృత ప్రచారం
భూమికగా ఎలా మారిందంటే..?
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
పుతిన్కు పిచ్చి పట్టింది.. రష్యాకు ట్రంప్ వార్నింగ్
'థగ్ లైఫ్' వేదికపై అదిరిపోయే సాంగ్ పాడిన శ్రుతి హాసన్
Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు
స్టాక్మార్కెట్, కరెన్సీ అప్డేట్స్
బిహార్లో పెళ్లి కొడుకును అపహరించారు
కొత్త క్రెడిట్ కార్డు.. యూపీఐ పేమెంట్లపై క్యాష్బ్యాక్
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
రెడ్బుక్ అరెస్ట్: కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి
ప్రపంచ సుందరి పోటీలకు ‘మెట్రోరైల్’ విస్తృత ప్రచారం
భూమికగా ఎలా మారిందంటే..?
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
ఆర్టీసీలో ఇక ఔట్సోర్సింగ్ కండక్టర్లు
సినిమా

పవర్ఫుల్ సర్దార్
హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘సర్దార్ 2’. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదివారం (మే 25) కార్తీ బర్త్ డే.ఈ సందర్భంగా ‘సర్దార్ 2’ నుంచి కార్తీ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో 2022లో ‘సర్దార్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిపాత్ర పేరు సర్దార్ అనే సంగతి గుర్తుండే ఉంటుంది.

బిగ్బాస్ బ్యూటీ స్టన్నింగ్ లుక్.. ప్రీతిజింటాతో ఆర్జే మహ్వశ్..!
బిగ్బాస్ బ్యూటీ అశ్విని శ్రీ స్టన్నింగ్ లుక్..ప్రీతిజింటాతో కలిసి ప్యాలెస్లో ఆర్జే మహ్వశ్..ఆధ్యాత్మి బాటలో ఐశ్వర్య రాజేశ్...సండేను ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ రాశి ఖన్నా..కొరియాలో చిల్ అవుతోన్న సీనియర్ హీరోయిన్ మీనాసాగర్... View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్లో ట్రెండింగ్!
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

స్వప్నం సాకారం
మోంటెకార్లో: టెన్నిస్లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్లో ‘మొనాకో’ గ్రాండ్ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఏనాటికైనా మొనాకో గ్రాండ్ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 20వ ల్యాప్లో నోరిస్ పిట్ స్టాప్లోకి వెళ్లడంతో రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్స్టాపెన్ 29వ ల్యాప్లో తొలిసారి పిట్ స్టాప్లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్లో వెర్స్టాపెన్ పిట్ స్టాప్లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్షిప్లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్ప్రి జూన్ 1న జరుగుతుంది.

రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్దే పైచేయి అయింది. రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్లో, 2021 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్కతా నైట్రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్ను ముగించాయి. గుజరాత్తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్సెంచరీ అందుకున్నాడు. హెడ్ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన క్లాసెన్... వరుణ్కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

కోల్కతాపై సన్రైజర్స్ గ్రాండ్ విక్టరీ..
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్దూబే తలా రెండు వికెట్లు సాధించారు.
బిజినెస్

మోసాలకు వ్యతిరేకంగా టెలికం కంపెనీల జట్టు!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న టెలికం మోసాలు, స్కామ్లకు వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడుదామంటూ రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలను ఎయిర్టెల్ కోరింది. సున్నితమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టెలికం మోసాలకు వ్యతిరేకంగా పరిశ్రమ అంతా ఒక్కటై సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి, ట్రాయ్కి ఎయిర్టెల్ లేఖ రాసింది. 2024 మొదటి తొమ్మిది నెలల్లో రూ.11,000 కోట్లకుపైగా ఆర్థిక నష్టంతో కూడిన 17 లక్షల సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు కావడాన్ని తోటి టెలికం కంపెనీల దృష్టికి తీసుకెళ్లింది. ఫోన్కాల్స్ ద్వారా ఓటీపీలు తెలుసుకోవడం, ఫిషింగ్ లింక్లు పంపడం ద్వారా డేటా చోరీ తదితర నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ఎయిర్టెల్ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్పామ్లు, మోసాలను గుర్తించే సొల్యూషన్లను ఎయిర్టెల్ కొన్ని వారాల నుంచి తన నెట్వర్క్ పరిధిలో అమలు చేస్తుండడం గమనార్హం. ‘‘ఫిషింగ్ దాడులు, హానికారక యూఆర్ఎల్ ఆధారిత స్కామ్లు ఇటీవలి కాలంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన నేపథ్యంలో.. పరిశ్రమ వ్యాప్తంగా మరింత సమన్వయంతో కూడిన చర్యలు అవసరం. టెలికం సేవల ప్రొవైడర్ల మధ్య సమన్వయ లోపాలను ఈ తరహా అత్యాధునిక మోసపూరిత పథకాలు ఉపయోగించుకుంటాయి’’అని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటి, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్కు రాసిన లేఖలో ఎయిర్టెల్ పేర్కొంది. ఉమ్మడి చర్యల దిశగా టెలికం సరీ్వస్ ప్రొవైడర్లను (జియో, వొడాఐడియా) ఈ నెల 14న సంప్రదించినట్టు తెలిపింది. అన్ని కంపెనీలు రియల్ టైమ్ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ పంచుకోవడం, నెట్వర్క్ల మధ్య సమన్వయంతో మోసాలను గుర్తించి, నిరోధించేందుకు ఈ చర్య చేపట్టినట్టు వివరించింది.

రూ.16,000 కోట్ల వసూలు లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున మొండి బకాయిల (ఎన్పీఏ) వసూలు లక్ష్యాన్ని పెట్టుకుంది. రూ.16,000 కోట్ల వసూళ్లతోపాటు.. కొత్త ఎన్పీఏలను ఒక శాతం లోపునకు పరిమితం చేయనున్నట్టు, అదే సమయంలో లాభదాయకతను కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్చంద్ర తెలిపారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పీఎన్బీ వసూళ్లు రూ.4,733 కోట్లుగా ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వసూళ్లు రూ.14,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక కొత్త ఎన్పీలుగా 0.73 శాతంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గరిష్ట స్థాయిలో వసూళ్లు చేసుకోవడం, తాజా ఎన్పీఏలను వీలైనంత కనిష్టానికి కట్టడి చేయడం తమ ప్రాధాన్యమని అశోక్ చంద్ర తెలిపారు. త్రైమాసికం వారీ తాజా ఎన్పీఏలు రూ.1,500–1,700 కోట్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. సాంకేతిక మాఫీ రూపంలో రూ.6,000 కోట్ల వసూలును సాధించనున్నట్టు తెలిపారు. అధిక విలువ కలిగిన మొండి ఖాతాల్లేవంటూ.. చాలా వరకు ఎన్పీఏ ఖాతాలు ఒక్కోటీ రూ.25–50 కోట్ల మధ్యనున్నవేనని పేర్కొన్నారు. ర్యామ్ రుణాలకు ప్రాధాన్యం.. రిటైల్, అగ్రికల్చరల్, ఎంఎస్ఎంఈ (ఆర్ఏఎం/ర్యామ్) రంగాలకు రుణాల వెయిటేజీని 58 శాతానికి పెంచుకోనున్నట్టు అశోక్ చంద్ర తెలిపారు. ఇందుకోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కార్పొరేట్ రుణాలు, రెపో ఆధారిత రుణాల్లో తగ్గిన రేట్ల ప్రభావాన్ని అధిగమించడానికి ర్యామ్ పోర్ట్ఫోలియో కుషన్గా ఉంటుందన్నారు. 2025 మార్చి నాటికి ర్యామ్ పుస్తకం మొత్తం రుణాల్లో 56 శాతంగా (రూ.6,02,682 కోట్లు) ఉన్నట్టు తెలిపారు. తదుపరి రుణ రేట్ల కోత ప్రభావాన్ని సైతం ఎదుర్కొనేందుకు ర్యామ్ విభాగం మద్దతుగా నిలుస్తుందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో లాభదాయకతను పెంచుకోవడంలో పీఎన్బీ ముందుంది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎన్బీ లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసుకుంటే 102 శాతం వృద్ధి చెందింది. రూ.8,245 కోట్ల నుంచి రూ.16,630 కోట్లకు లాభం పెరిగింది. మొత్తం వ్యాపారం 14 శాతం పెరిగి రూ.26.83 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.

మళ్లీ ఐపీవోల హవా
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి నెలకొంది. ఈ బాటలో మరో నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్ల తలుపు తట్టనున్నాయి. ఈ వారం ఇష్యూలు ప్రారంభంకానున్న కంపెనీల జాబితాలో లీలా ప్యాలసెస్ హోటల్స్ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ చేరాయి. ఇతర చిన్న సంస్థలలో ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ ఐపీవోకు రానున్నాయి. మరోపక్క గత వారం ఇష్యూలను పూర్తి చేసుకున్న బొరానా వీవ్స్(28న), బెల్రైజ్ ఇండస్ట్రీస్(29న) లిస్ట్కానున్నాయి. లీలా ప్యాలసెస్ ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు షేరుకి రూ. 413–435 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 3,500 కోట్ల సమీకరణపై కన్నేసింది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏజిస్ వొప్యాక్ లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ రూ. 223–235 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్కోడా ట్యూబ్స్స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబులు, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ రూ. 130–140 ధరల శ్రేణిలో ఈ నెల 28–30 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 220 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ సమీకృత పవర్ సొల్యూషన్ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 95–105 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమూ 29న ముగియనుంది. తద్వారా రూ.168 కోట్లు సమకూర్చుకోనుంది.

జీడీపీ గణాంకాలపై ఫోకస్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా యూఎస్, భారత్ జీడీపీ గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ వివరాలు, రుతుపవనాల తీరు తదితర పలు అంశాలు సైతం ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇటు దేశీ, అటు విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా పలు ఆర్థిక గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. దేశీయంగా చూస్తే ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), త యారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి –మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. విదేశీ అంశాలు ఏప్రిల్ నెలకు యూఎస్ మన్నికైన వస్తు ఆర్డర్లు 27న, కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్(ఎఫ్వోఎంసీ) గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్) 28న విడుదలకానున్నాయి. 29న క్యూ1 జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి. ఇదే రోజు మే నెలకు జపాన్ కన్జూమర్ కాని్ఫడెన్స్ ఇండెక్స్ వెల్లడికానుంది. 30న యూఎస్ ఏప్రిల్ పీసీఈ ధరల ఇండెక్స్ విడుదలకానుంది. కాగా.. చైనాసహా ఇతర దేశాలతో యూఎస్ వాణిజ్య చర్చలకు ప్రాధాన్యమున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. కొద్ది రోజులుగా మళ్లీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నప్పటికీ కొన్ని సెషన్లలో అమ్మకాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని నిపుణులు పేర్కొన్నారు. క్యూ4 ఫలితాలు ఇప్పటికే క్యూ4(జనవరి–మార్చి2025) ఫలితాల సీజన్ ముగింపునకురాగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాల పనితీరు వెల్లడికానుంది. జాబితాలో బజాజ్ ఆటో, ఐఆర్సీటీసీ, అరబిందో ఫార్మా తదితరాలున్నాయి. ఈ ఏడాది అంచనాలకంటే ముందుగానే రుతుపవనాలు కేరళను తాకడం, కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ అత్యధిక డివిడెండ్ చెల్లింపు సానుకూల అంశాలుకాగా.. యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్తోపాటు, ప్రభుత్వ రుణ భారం అధికమవుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత వారాంతాన ఆర్బీఐ ప్రభుత్వానికి రూ. 2.69 లక్షల రికార్డ్ డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. సాంకేతికంగా గత వారం మార్కెట్లు స్వల్పంగా డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 610 పాయింట్లు(0.75 శాతం) క్షీణించి 81,721 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు(0.7 శాతం) నష్టంతో 24,853 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ మాత్రం 0.95 శాతం ఎగసింది. సాంకేతికంగా ఈ వారం నిఫ్టీకి 24,950–25,000 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ బాటలో సెన్సెక్స్కు 82,500–83,000 పాయింట్లవద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు.
ఫ్యామిలీ

ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్ చేస్తారు. దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. (చదవండి: ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!)

ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.నిమిషానికి 120 ఫ్లాష్లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్ట్రా ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!)

చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి)

కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్లో మాస్టర్ బెడ్రూమ్ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్లోని డోర్సెట్కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్లాంగ్ లాకప్కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి! (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..)
ఫొటోలు
అంతర్జాతీయం

పాకిస్తాన్కు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
మనామా: దాయాది దేశం పాకిస్తాన్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్లో ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ భారత్ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్ వల్లే జరుగుతున్నాయి.మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc— ANI (@ANI) May 24, 2025ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్ భారత కాన్సులేట్లో ప్రసంగించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్ పేర్కొన్నారు.పహల్గామ్లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స

ఉక్రెయిన్–రష్యా మధ్య 390 మంది యుద్ధ ఖైదీల మార్పిడి
కీవ్: తుర్కియే చర్చల సమయంలో కుదిరిన అంగీకారం మేరకు ఉక్రెయిన్, రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మొదలైంది. ఉక్రెయిన్–బెలారస్ సరిహద్దుల్లో శుక్రవారం చెరో 390 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. 2022లో రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఈ స్థాయిలో యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ అప్పగించిన తమ 390 మంది సైనికులు, పౌరులను వెంటనే బెలారస్కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా సైతం తమ 390 మంది సైనికులను అప్పగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. మొత్తం వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకునేందుకు 16న తుర్కియేలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఇందులో మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, ఈ వారాంతంలో మరికొందరిని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలున్నాయని జెలెన్స్కీ వివరించారు. కాగా, తదుపరి చర్చల విషయంలో ఎలాంటి అంగీకారం కుదరలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. ఖైదీల మార్పిడి పూర్తయ్యాక దీర్ఘకాల, సమగ్ర శాంతి ఒప్పందం కోసం రూపొందించిన షరతుల ముసాయిదాను ఉక్రెయిన్కు అందజేస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు.కీవ్పై విరుచుకుపడ్డ రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగానే రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సైరన్ మోతలు, పేలుళ్ల శబ్ధాలతో కీవ్ వాసులు బాంబు షెల్టర్లలో రాత్రంగా గడిపారు. రష్యా ప్రయోగించిన 14 క్షిపణులు, 250 షహీద్ డ్రోన్లనకు గాను 6 క్షిపణులను, 245 డ్రోన్లను కూల్చామని కీవ్ యంత్రాంగం తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ఘటనల్లో 15 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని వెల్లడించింది. పలు నివాస భవనాలు, అపార్టుమెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మంటలు చెలరేగాయని వివరించింది. మే 20–23వ తేదీల మధ్య ఉక్రెయిన్ తమ దేశంపైకి ప్రయోగించిన 788 డ్రోన్లను కూల్చి వేసినట్లు రష్యా తెలపగా, గురువారం రాత్రి సైతం రష్యా తమపైకి 175 షహీద్ డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.

అసూర్యంపశ్య
అసూర్యంపశ్య. అంటే ఎండ కన్నెరగని స్త్రీ. చైనాలో ఓ 48 ఏళ్ల మహిళ ఉదంతమిది. సిచువాన్ ప్రావిన్సులో చెంగ్డూ నగరానికి చెందిన ఆమె తన ఒంటిని ఒక్క సూర్యకిరణం కూడా తాకనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆరుబయటకు వెళ్లినా ఒళ్లంతా కప్పేలా వ్రస్తాలు ధరించేది. ముఖం, చేతులు బయటకు కనిపించక తప్పని పరిస్థితుల్లో నిండుగా సన్స్క్రీమ్ లోషన్ పట్టించి మరీ వెళ్లేది. ఈమెకు ఉన్న ఈ అలవాటు ఇప్పటిది కాదు. చిన్ననాటి నుంచే ఇదే తంతు. ఎండ తగిలితే కందిపోవడమే గాక నల్లబడతానన్న భయమే ఇందుకు కారణం. అందుకే నిత్యం పొడవాటి టాప్స్ ధరించేది. చలువ కళ్లద్దాలు, సాక్స్, షూ, పొడవాటి చొక్కా.. ఇలా ఏ రకంగానూ సూర్యకాంతి సోకకుండా బహుజాగ్రత్తలు తీసుకుంది. షార్ట్స్, స్లీవ్స్ పొరపాటున కూడా వేసుకునేది కాదు! అయితే ఏమైంది? ఒంటికి ఎండ తాకక అత్యావశ్యకమైన ‘డి’విటమిన్ లోపించింది. ఎంతగా అంటే, ఇటీవల ఆమె పడక మంచంపై కాస్త అటూ ఇటూ కదలగానే ఏకంగా ఓ ఎముక విరిగిపోయింది. డి విటమిన్ లోపంతో ఎముకలు గట్టిదనం తగ్గి పెళుసుబారడమే అందుకు కారణం. ఎముక విరగడంతో నరకయాతన నడుమ ఆస్పత్రిలో చేరింది. మెత్తని బెడ్ మీద ఎముక ఎలా విరిగిందని వైద్యులే విస్తుపోయారు. పరీక్షలన్నీ చేసి, డి విటమిన్ లోపమని తేల్చడమే గాక ఆమెను మందలించారు. బోలు ఎముక వ్యాధిగా పేర్కొనే ఆస్టియోపోరోసిస్ బారినపడ్డట్టు చెప్పారు. లాంగ్ షువాంగ్ అనే సంప్రదాయ వైద్యున్ని ఉటంకిస్తూ సౌత్చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ తాజాగా ఈ వింతగాథను బయటపెట్టింది. ఇదిప్పుడు అంతటా పెద్ద చర్చనీయంగా మారడమే గాక సోషల్ మీడియాలోనూ తెగ వైరలైంది. కీలకమైన విటమిన్ విటమిన్ డి ప్రకృతిలో సహజంగా లభించదు. శరీరమే దాన్ని తయారు చేసుకుంటుంది. అందుకు సూర్యకాంతి అవసరం. ఉదయపు లేత కిరణాల వేడికి చర్మం కింది పొరలోని రసాయనాలు వేడెక్కి డి విటమిన్ను తయారు చేసుకుంటాయి. అది ఉంటేనే మన శరీరం అత్యధికంగా కాల్షియంను సంగ్రహించుకోగలదు. కాల్షియం సమపాళ్లలో ఉన్నప్పుడే ఎముకలకు గట్టిదనం వస్తుంది. అవి గట్టిగా ఉంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలం. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. ఎముక ఆరోగ్యంగా, అస్థిపంజరం పటిష్టంగా ఉండాలంటే ఉదయపు ఎండ తగలాల్సిందే. చైనాలో విపరీత పోకడ చైనాలో ఇలా ఎండకు ముఖం చా టేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరుబయటకు వెళ్లినా పేద్ద గొడుగు, చేతులన్నీ కప్పేసేలా దుస్తులు, పెద్ద కళ్లద్దాలు, గ్లౌజ్లు, ఫేస్ మాస్క్ లు, కాళ్లకు షూ, అతినీలలోహత కిరణాలను ఆపే హూడీలు... ఇవే ఇప్పుడు చైనాలో ట్రెండ్! ఇలా చేస్తే కాల్షియం సంబంధ వ్యాధులతో ఆస్పత్రిపాలవడం ఖాయ మని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. ఒంట్లో పదేళ్లకోసారి ఎముకలన్నీ కొత్త శక్తితో పునరుజ్జీవం పొందుతాయి. 40 ఏళ్లు దాటాక మాత్రం ఎము కల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి పెళుసుబారతాయి. చక్కటి వ్యాయామం, ఆహారశైలే దానికి విరుగుడని గ్వాంగ్జూ వైద్య విశ్వవిద్యాలయంలో ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జియాంగ్ గ్జియోబింగ్ చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

కుల గణనతో బడుగుల సాధికారత
న్యూఢిల్లీ: సమాజంలో వెనుకంజలో ఉన్న బడుగు బలహీన వర్గాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి కుల గణన ఒక కీలకమైన ముందడుగు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల రాజకీయాలపై తమకు విశ్వాసం లేదని అన్నారు. అణగారిన వర్గాల సాధికారితకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. భౌగోళికంగా అన్ని ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల ప్రజలు, మహిళల ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించినవారికి నివాళులరి్పంచారు. మూడో టర్మ్లో మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఈ భేటీలో ప్రధానమంత్రి మాట్లాడారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి మనం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆపరేషన్ సిందూర్ విజయమే సాక్ష్యమని తెలిపారు. ఉగ్రవాదుల భరతం పట్టడంలో మన స్వదేశీ రక్షణ సాంకేతికత కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఉగ్రవాద క్యాంప్లను నేటమట్టం చేయడంలో మన సైనిక దళాలు అద్భతంగా పనిచేశాయని పేర్కొన్నారు. అత్యుత్తమ పాలనా విధానాలపై అధ్యయనం ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్న ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) సహా వేర్వేరు రాష్ట్రాల్లోని అత్యుత్తమ పరిపాలనా విధానాలను మోదీ ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్లో బస్తర్ ఒలింపిక్స్, అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం, బిహార్లో జల జీవన్ హరియాలీ అభియాన్, గుజరాత్లో సోలార్ విద్యుత్ కార్యక్రమం, మేఘాలయాలో పారదర్శక పరిపాలన వంటివి ఇందులో ఉన్నాయి. వీటిపై అధ్యయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. ‘వికసిత్ భారత్’ సాధన కోసం ఎన్డీయే పాలిత రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారత్ను శక్తివంతమైన, స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని అన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘ఎక్కడైనా, ఏదైనా మాట్లాడే’ ధోరణి మానుకోవాలని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన కమ్యూనికేషన్ అవసరమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం ప్రమేయం ఎంతమాత్రం లేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టంచేశారు. పాకిస్తాన్ నుంచి వచి్చన విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు తాము అంగీకరించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలన్న నిర్ణయాన్ని కొనియాడుతూ మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జె.పి.నడ్డా, తదితరులు పాల్గొన్నారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అమిత్ షా వివరించారు.

ఆపరేషన్ సిందూర్ బలమైన భారత్కు ప్రతీక
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం యావత్తూ ఒక్కతాటిపైకి వచ్చిందని అన్నారు. ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడం అద్భుతం అని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక ఆపరేషన్ కాదని.. బలీయమైన శక్తిగా ఎదుగుతున్న భారతావనికి అసలైన ప్రతీక అని వివరించారు. ప్రపంచ వేదికపై మన శక్తి సామర్థ్యాలు, సంకల్పం, పెరుగుతున్న బలాన్ని ఈ ఆపరేషన్ కళ్లకు కట్టిందని హర్షం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఒక టర్నింగ్ పాయింట్ అని అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదంటూ మరోసారి దృఢంగా చాటిచెప్పామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆదివారం 122వ ‘మన్కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నేడు దేశమంతా ఏకమైందని, ఉగ్రవాద భూతం అంతం కావాలన్న సంకల్పం వారిలో ఏర్పడిందని ఉద్ఘాటించారు. మన ఉమ్మడి శక్తిని, దేశభక్తిని చాటాల్సిన సమయం ఇదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. మన నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు స్వదేశీ ఉత్పత్తులే వాడుకుందామని, విదేశీ ఉత్పుత్తులపై ఆధారపడడం తగ్గించుకుందామని, ఈ మేరకు మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. మన్కీ బాత్లో ప్రధాని మోదీ ఇంకా చెప్పారంటే... స్వశక్తితో దక్కిన విజయం ‘‘స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వయం స్వావలంబనకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకొనే అంశమని గుర్తుంచుకోవాలి. మనం వేసే ఒక్క అడుగు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎంతోమంది పాటలు, గేయాలు రాశారు. పిల్లలు పెయింటింగ్స్ వేశారు. దేశమంతటా తిరంగా యాత్రలు నిర్వహించారు. ఇటీవల రాజస్తాన్లోని బికనీర్కు వెళ్లినప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ పిల్లలను నాకు బహూకరించారు. కొందరు తల్లులు అప్పుడే జన్మించిన తమ బిడ్డలకు ‘సిందూర్’ అని పేరు పెట్టుకున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక మన స్వశక్తి ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ఆయుధాలతో ఉగ్రవాదులను అణచివేశాం. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో రక్షణ పాటవం పెంచుకోవడంపై దృష్టిం పెట్టాం. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు, రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి తోడు మన సైనికుల శౌర్య ప్రతాపాలు విజయం సాధించి పెట్టాయి. మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల స్వేదం, ప్రజల భాగస్వామ్యంతో ఈ గెలుపు సొంతమైంది’’ అని మోదీ అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగులు ‘‘మావోయిజంపై సమ్మిళిత పోరాటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. పౌర సేవలు అందుతున్నాయి. బస్సు సరీ్వసులు నడుస్తున్నాయి. అక్కడ చిన్నారులు చదువుకుంటున్నారు. మావోయిస్టుల ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో గడ్చిరోలీ జిల్లాలోని కాతేఝారీ గ్రామానికి తొలిసారి బస్సు వచ్చినప్పుడు ప్రజలు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. సైన్స్ ల్యాబ్లు కూడా వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పదో తరగతి ఫలితాల్లో దంతెవాడ జిల్లా మొదటి స్థానంలో, 12వ తరగతి ఫలితాల్లో ఆరో స్థానంలో నిలవడం సంతోషం కలిగించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారులు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. గర్వపడే విజయాలు సాధిస్తున్నారు. సైన్స్పైనా వారికి ఆసక్తి పెరుగుతోంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ప్రజలు వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. తమ జీవితాలను బాగు చేసుకోవాలన్న తపన వారిలో మొదలైంది’’ అని మోదీ చెప్పారు. యోగాతో జీవన విధానంలో మార్పు ‘‘జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే యోగా డే కార్యక్రమానికి నేను హాజరవుతున్నా. ‘యోగ్ ఆంధ్రా అభియాన్’లో భాగంగా 10 లక్షల మంది యోగా అభ్యాసకులను తయారు చేయబోతున్నారు. మన జీవన విధానాన్ని యోగా మార్చేస్తుంది. పాఠశాలల్లో చక్కెర బోర్డులు ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించడం హర్షణీయం. చక్కెర వినియోగం, దానివల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించబోతున్నారు. క్యాంటీన్లు, కార్యాలయాల్లోనూ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఐటీబీపీ జవాన్లు చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది. వారు మకాలూ పర్వతంపైకి వెళ్లి, 150 కిలోల వ్యర్థాలను కిందికి తీసుకొచ్చారు. పర్వతాన్ని శుభ్రం చేయడం మామూలు విషయం కాదు. పట్టుదల, అంకితభావం ఉంటే మార్గం అదే దొరుకుతుందని వారు నిరూపించారు. కాగితాలను వృథా చేయడం ఇటీవల బాగా పెరిగింది. భూమిలో చేరుతున్నవాటిలో కాగితపు వ్యర్థాలే అధికంగా ఉంటున్నాయి. అందుకే కాగితం పునరి్వనియోగంపై దృష్టి పెట్టాలి. విశాఖపట్నం, గురుగ్రాం, జాల్నాలోని కొన్ని స్టార్టప్ కంపెనీలు ప్యాకేజింగ్ బోర్డులు, పేపర్ ఉత్పత్తులను రీసైకిల్ చేస్తున్నాయి’’ అని ప్రధాని మోదీ వివరించారు. ‘భారతదేశ స్వావలంబన’ రుచిని ఆస్వాదించండి ‘‘గుజరాత్లోని గిర్ అడవుల్లో ఆసియా సింహాల సంఖ్య 674 నుంచి ఐదేళ్లలో 891కి చేరుకుంది. ఇది నిజంగా ఎంతో ప్రోత్సాహకరమైన ప్రగతి. అక్కడి ప్రజల ఉమ్మడి కృషి, ఆధునిక విధానాలతో ఇది సాధ్యమైంది. గుజరాత్లో 11 జిల్లాల పరిధిలో 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆసియా సింహాలు ఉన్నాయి. వాటి సంతతి క్రమంగా పెరుగుతోంది. చుట్టూ ఉన్న జంతుజాలం మనదే అనే భావన ప్రజల్లో ఏర్పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ నెల 20న ప్రపంచ తేనెటీగల దినం నిర్వహించుకున్నాం. ఆరోగ్యం, స్వయం ఉపాధి, స్వయం సమృద్ధికి తేనె ఒక గుర్తు. దేశంలో గత 11 ఏళ్లుగా తీపి విప్లవం జరుగుతోంది. ప్రతిఏటా 70–75 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న తేనె ఉత్పత్తి ఇప్పుడు 1.25 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే ఉత్పత్తి 60 శాతం పెరిగింది. తేనె ఉత్పత్తి, ఎగుమతిలో మనం ముందంజలో ఉన్నాం. నేషనల్ బీకిపింగ్, హనీ మిషన్తో ఎంతో మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఛత్తీస్గఢ్లో రైతులు ‘సొన్హనీ’ పేరుతో ఆర్గానిక్ తేనె ఉత్పత్తి చేస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. కేవలం పరిమాణమే కాదు, నాణ్యమైన తేనె ఉత్పత్తిపైనా మనం దృష్టి పెట్టాం. స్థానిక రైతులు, మహిళా వ్యాపారుల నుంచి తేనె కొనుగోలు చేయండి. భారతదేశ స్వావలంబన రుచిని అందరూ ఆస్వాదించండి’’ అని మోదీ సూచించారు.

నోటి దురుసు వ్యాఖ్యలు చేయొద్దు.. నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్
సాక్షి,ఢిల్లీ: బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే విషయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని మోదీ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమక్షంలో నాయకులు చేసే వ్యాఖ్యల్లో అణుకువ, బాధ్యత ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా, ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణికి దూరంగా ఉండాలని, అనవసర వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారతాయని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. PM Narendra Modi tweets, "Participated in the NDA Chief Ministers' Conclave in Delhi. We had extensive deliberations about various issues. Various states showcased their best practices in diverse areas, including water conservation, grievance redressal, strengthening… pic.twitter.com/9Hd03QrWXG— ANI (@ANI) May 25, 2025మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘యావత్తు దేశ ప్రజలు, జవాన్లు తలలు వంచి ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ జవాబిచ్చిన తీరును ప్రశంసించడానికి మాటలు చాలవు అని వ్యాఖ్యానించారు. ఇలా ఆపరేషన్ సిందూర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా, ఎన్డీయే సమావేశంలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పై ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్డీయే సమావేశంలో ఆపరేషన్ సిందూర్పై స్పష్టత ఇచ్చిన మోదీ.. కాల్పుల విరమణ ఒప్పందంలో దేశానిదే తుది నిర్ణయం. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు సీజ్ఫైర్కు అంగీకరించాం. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరే ఇతర దేశం జోక్యం చేసుకోలేదన్నారు.

ఢిల్లీ షహదరాలో అగ్ని ప్రమాదం.. ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్లో మంటలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షహదరాలో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీ రామ్ రోడ్డులోని ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం నుంచి రెండు కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది.కాగా గత ఆదివారం.. ఓల్డ్ రాజేందర్నగర్లోని బడాబజార్ రోడ్డులోని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

నువ్వులేక.. నేనుండలేను
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్కు, పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్లో సునీల్ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

కుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది. మహాదేవస్వామి, భార్య మంజుల, వీరి చిన్న కుమార్తె హర్షిత మృతులు. మహాదేవస్వామిపెద్దకుమార్తె హర్షిత రెండురోజుల క్రితం ప్రియునితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. గ్రామంలో తల ఎత్తుకోలేకపోయామని తల్లిదండ్రులు, చెల్లెలు ఆవేదనకు లోనయ్యారు. శనివారం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకారు. చెరువు కట్టపై బైక్, చెప్పులు ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.

రెండు దుర్ఘటనల్లో.. ఏడుగురు బలి!
చింతకొమ్మదిన్నె/సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన దుర్ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. విజయవాడలోని ఓ అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ ముగ్గురు బలయ్యారు. వివరాలివీ.. కారుపైకి లారీ దూసుకొచ్చి.. వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన బసినేని శ్రీకాంత్రెడ్డి, బి. కోడూరుకు చెందిన కోగటం తిరుపతిరెడ్డి కుటుంబాలు బెంగళూరులో ఉంటున్నాయి. వీరిలో శ్రీకాంత్రెడ్డి బెంగళూరులో.. తిరుపతిరెడ్డి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తిరుపతిరెడ్డి ఇటీవలే స్వదేశానికి వచ్చి వారం రోజుల కిందట తిరిగి జర్మనీకి వెళ్లాడు. ఈ క్రమంలో.. శ్రీకాంత్రెడ్డి (32), తన భార్య శిరీష (28), కుమార్తె త్రిషికారెడ్డి (3).. తిరుపతిరెడ్డి భార్య శశికళ (35), కుమార్తె సాయి హర్షిత (9), కుమారుడు రిషికేశవర్రెడ్డి (8), శశికళ సోదరి స్వర్ణ (38) కడప జిల్లా బద్వేలుకు శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి బయల్దేరారు. సమీప బంధువులైన వీరంతా తమ స్వగ్రామం బద్వేలు మండలం చిన్న పుత్తాయపల్లెలోని శ్రీరాముల దేవాలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరి కారు కడప–చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్.. చింతకొమ్మదిన్నె రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చిoది. అదే సమయంలో ఎరువుల లోడుతో విల్లుపురం నుంచి హైదరాబాదుకు వెళ్తున్న లారీ వెనక నుంచి వేగంగా వచ్చి, కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో శ్రీకాంత్రెడ్డి, శిరీష, రిషికేశవర్రెడ్డి, సాయిహర్షిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని పసిగట్టి శ్రీకాంత్, శిరీషలు తమ కుమార్తె చిన్నారి త్రిషికారెడ్డిని కారు నుంచి బయటకు తోసేయగా మట్టి కుప్పలపై పడి గాయపడింది. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్, డీటీఆర్బీ (డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో) సీఐ మహమ్మద్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్ సాయంతో కారు, లారీని వేరుచేశారు. కారులో ఇరుక్కుపోయిన నాలుగు మృతదేహాలను బయటికి తీసేందుకు గంటన్నరసేపు శ్రమించాల్సి వచి్చంది. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించి మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు.దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ సాయిటవర్స్ అపార్ట్మెంట్లో కాకినాడు జిల్లా సామర్లకోటకు చెందిన చలాది రామదుర్గా ప్రసాద్ (55), రాధ (45) ఉంటున్నారు. ప్రసాద్ లారీడ్రైవర్గా పనిచేసేవారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రసాద్ చెల్లి ఊటుకూరి ముత్యావళి (42) ఇంటి ముందు ఇనుప తీగపై దుస్తులు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ వైరు, కేబుల్ వైరు, దుస్తులు ఆరేసే తీగ అన్నీ కలిపి ఉన్నాయి. వర్షాలతో ఎర్త్వైర్కు విద్యుత్ సరఫరా అవడంతో తీగపై దుస్తులు వేయగానే ముత్యావళి విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ప్రసాద్, రాధ షాక్కు గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఫ్లాట్ ఖాళీచేస్తున్న తరుణంలో.. కుటుంబ తగాదాల నేపథ్యంలో ప్రసాద్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముత్యావళి రెండ్రోజుల క్రితం కడియం నుంచి వచ్చింది. సామగ్రిని తరలించేందుకు అన్నీ సర్దుకుని మరికొన్ని గంటల్లో బయల్దేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి ఇంట్లో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా రాజమహేంద్రవరంలోని వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రమాదం జరిగిన ఇంటికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్ను హ్యాక్ చేసి ఆమె డీప్ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.