Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Formula-E Car Race Case: KTR Arrest Comments Before ACB Inquiry1
భయపడను.. అరెస్ట్‌ చేస్తారని నాకు ముందే తెలుసు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ‍వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్‌పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్‌ వద్ద ఆయన ప్రకటించారు. ‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్‌ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్‌ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్‌కు ఇదే నా సవాల్‌.. లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్‌(KTR) అన్నారు.అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్‌ బంధుగా మార్చేశారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్‌-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అంతకు ముందు.. ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్‌ నివాసానికి కేటీఆర్‌ చేరుకున్నారు. అక్కడ హరీష్‌ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకున్నారు.

New Twist In Pak Nuclear Bomb Help To Iran Amid Israel Tensions2
ఇరాన్‌కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్‌

ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట తమపై ఇజ్రాయెల్‌ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్‌ అణు దాడులకు దిగుతుందని ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్‌ జనరల్‌ మొహ్సెన్‌ రెజాయ్‌ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్‌ యూటర్న్‌ తీసుకుంది.ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్‌ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్‌ అటాక్‌ చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ జనరల్‌, ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మెంబర్‌ మొహ్సెన్‌ రెజాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్‌ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్‌(పాక్‌) కూడా టెల్‌అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్‌ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్‌ వెల్లడించారు.అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్‌ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్‌ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్‌ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్‌ యూనిఫామ్‌ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. అబ్బే.. అలా అనలేదుఇరాన్‌ ఇచ్చిన ప్రకటనను పాక్‌ ఖండిచింది. తాము అలాంటి కమిట్‌మెంట్‌ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్‌ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్‌కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్ని పాక్‌ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌కు తాము మద్దుగా నిలుస్తామని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ జూన్‌ 14వ తేదీన పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్‌, యెమెన్‌, పాలస్తీనాలకు ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్‌ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది. భగ్గుమన్న పశ్చిమాసియాఇరాన్‌ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అయితే ఇరాన్‌ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్‌పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, భారత్‌, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.

Simmadhirappanna Comment: Kutami Fask in Rayalaseema3
సీమలోనూ సీను సితారే!

గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్‌సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు .. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు .. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే. .. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్‌కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి. సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు . అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.:::సిమ్మాదిరప్పన్న

BRS KTR Attend To ACB Office Over Formula E Car Race Updates4
ఏసీబీ ఆఫీసులో కేటీఆర్‌ విచారణ ప్రారంభం..

కేటీఆర్‌ ఏసీబీ విచారణ అప్‌డేట్స్‌.. కేటీఆర్‌ విచారణ ప్రారంభం..ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు.ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ. కేటీఆర్‌తో నలుగురి బృందం.. కేటీఆర్‌తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్‌ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌కేటీఆర్‌ వెంట అడ్వొకేట్‌ రామచందర్‌రావుఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించనున్న ఏసీబీతెలంగాణ భవన్‌ నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరిన కేటీఆర్‌కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్‌ఈ-రేస్‌ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ఎఫ్‌ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తుఅక్రమ కేసులకు భయపడం: కేటీఆర్‌అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారుఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చుచట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందిమూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తాఅక్రమ కేసులకు భయపడంఅరెస్ట్‌ చేసినా వెనక్కి తగ్గంజైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాంలై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం కాంగ్రెస్‌, బీజేపీవి దొంగాటలుడైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కేసులురైతు బంధును.. ఎలక్షన్‌ బంధుగా మార్చేశారు420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం లక్షలాది మంది కేసీఆర్‌ సైనికులను అడ్డుకోలేరుతెలంగాణభవన్‌ చేరుకున్న కేటీఆర్‌కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరు.తెలంగాణభవన్‌ వద్ద భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుతెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ..నందిని నగర్ నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..తాజా పరిస్థితులపై చర్చ..మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు.. కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌.. కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్..మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు చేరుకోనున్న కేటీఆర్..10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..భారీగా మోహరించి పోలీసులు..ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.👉మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.I will never be deterred by your enquiries, commissions and political vendettaWe @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో కేటీఆర్ జ‌న‌వ‌రి 9వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. త‌న లాయ‌ర్ రామ‌చంద్ర‌రావుతో క‌లిసి కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు.

Central Operations On Indians Evacuate From Iran5
‘భయంతో చచ్చిపోతున్నాం’.. భారతీయుల తరలింపునకు కేంద్రం ఆపరేషన్‌!

సాక్షి, ఢిల్లీ: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులకు తరలించేందుకు ‍కేంద్రం ఆపరేషన్‌ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ చేపట్టనుంది. ఇరాన్‌లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్‌ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్‌ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో ఇరాన్‌లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్‌ మొహిదీన్‌ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్‌మెంట్‌కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.The advisory issued in view of the current situation in Iran.All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్‌లోని షాహిద్‌ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.మరోవైపు.. ఇరాన్‌లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్‌లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది.

West Indies Beat Ireland By 62 Runs In 3rd T20I6
విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్లు.. బెంబేలెత్తిపోయిన ప్రత్యర్ధి బౌలర్లు

ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పర్యాటక వెస్టిండీస్‌ 1-0 తేడాతో కైవసం​ చేసుకుంది. నిన్న (జూన్‌ 15) జరిగిన మూడో టీ20లో విండీస్‌ 62 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దు కాగా.. చివరి మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ఓపెనర్లు ఎవిన్‌ లెవిస్‌ (44 బంతుల్లో 91; 7 ఫోర్లు, 8 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (27 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.లెవిస్‌, హోప్‌ తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి ఔటయ్యాక, హెట్‌మైర్‌ (7 బంతుల్లో 15; 3 ఫోర్లు), కీసి కార్టీ (22 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (13 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌), రొమారియో షెపర్డ్‌ (6 బంతుల్లో 19 నాటౌట్‌; 3 సిక్సర్లు) కూడా బ్యాట్‌ ఝులిపించడంతో విండీస్‌ అతి భారీ స్కోర్‌ చేసింది.ఐర్లాండ్‌ బౌలర్లలో మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-16-2) ఒక్కడే విండీస్‌ బ్యాటర్ల ఊచకోతను తప్పించుకున్నాడు. మిగతా బౌలర్లంతా 12కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నారు. లియామ్‌ మెక్‌కార్టీకి (4-0-81-0) విండీస్‌ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఫలితంగా అతను ఓ టీ20 ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు గాంబియా బౌలర్‌ మూసా జోబార్తే (4-0-93-0) పేరిట ఉంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. ఎక్కడా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాస్‌ అడైర్‌ (48) ఆ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హ్యారీ టెక్టార్‌ (38), మార్క్‌ అడైర్‌ (31 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరి తర్వాత అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (23) వచ్చాయి. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌ 3, జేసన్‌ హోల్డర్‌ 2, రొమారియో షెపర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు.

Director Sanal Kumar Sasidharan Accuses Mohanlal Thudarum Lifted from My Story7
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్‌తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు

మలయాళంలో ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం తుడరుమ్‌ (Thudarum Movie). మోహన్‌లాల్‌, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్‌ నిలిచింది. తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్‌ సనల్‌ కుమార్‌ శశిధరణ్‌ (Sanal Kumar Sasidharan) తుడరుమ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్‌​ రాశాను. తుడరుమ్‌ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్‌ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్‌ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్‌ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్‌లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్‌లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్‌ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్‌లో వాడుకున్నారు.ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్‌లో ఈ డైలాగ్‌ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్‌, టోవినో థామస్‌, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్‌కు అర్చకుల సూచన

Bomb Threat to Srihari Kota Intensified Checks8
‘శ్రీహరి కోట’కు బాంబు బెదిరింపు.. ముమ్మర తనిఖీలు

శ్రీహరి కోట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ‘షార్‌’కు ఈరోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. తమిళానాడు కంమాండ్‌ కంట్రోల్‌కు ఈ బెదిరింపు ఫోను కాల్‌ అందింది. ఈ నేపధ్యంలో అంతరిక్ష కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఇటీవల భారత్ , పాక్ మధ్య దాడులు జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. ఇదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం ‘షార్’ వద్ద భద్రతా దళాలును మొహరించారు. ఇది కూడా చదవండి: పాక్‌ ముస్లిం లీగ్‌.. జైరామ్‌ రమేష్‌ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ

Can we gift mutual funds in India? Know the conditions9
‘ఫండ్స్‌’ను బహుమతిగా ఇవ్వొచ్చా..?

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయా..? – వివేక్‌ ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాలు పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను ఆదా ప్రయోజనం కలిగినవవి. ఈ పథకాల్లో రాబడులు దీర్ఘకాలంలో సగటున 15–20% మధ్య ఉంటాయి. ఈ విభాగంలో బలహీన పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్‌ కంటే అధిక రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్‌ (వడ్డీపై వడ్డీ జమ కావడం) ప్రయోజనంతో పెట్టుబడి వృద్ధి చెందుతుంది.మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన సాధనాల్లో పెట్టుబడులు ఆటుపోట్లకు గురువుతుంటాయి. కనుక వాటి పనితీరును కాలానుగుణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంత కాలం పాటు మంచి పనితీరు చూపించినవి, ఆ తర్వాత చెత్త పథకాలుగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి మూడేళ్ల తర్వాత బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్‌ ముగిసిపోతుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారిపోయి ఉంటే అలాంటి వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ బదులు రిస్క్, కాల వ్యవధి, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఫ్లెక్సీక్యాప్, డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ తదితర పథకాలను పరిశీలించొచ్చు.మ్యూచువల్‌ ఫండ్స్‌లో నా పెట్టుబడులను మరొకరికి బహుమతిగా ఇవ్వడం ఎలా? – నీరజ్‌ ప్రసాద్‌మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్‌ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్‌ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలన్నా కుదరదు. పిల్లల కోసం అయితే వారి పేరుతో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది.ఇదీ చదవండి: ఇండియాలో స్టార్‌లింక్‌ సేవలకు డేట్‌ఫిక్స్‌?పిల్లలు మేజర్‌ అయ్యే వరకు (18 ఏళ్లు నిండే వరకు) తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులకు సంరక్షకులు అధికారం కలిగి ఉంటారు. పిల్లల బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు, గార్డియన్‌ కేవైసీ వివరాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. పిల్లలు కాకుండా వేరొకరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఇవ్వాలనుకుంటే ముందుగా వాటిని విక్రయించాలి. అలా వచ్చిన నగదును బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి బదిలీ చేయాలి. అప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Swarnim bharat yatra tour package offered by IRCTC10
బంగారు భారతం..! తప్పక సందర్శించాల్సిన యాత్ర..

ఇండిపెండెన్స్‌డే రోజు గాంధీజీ హృదయ్‌కుంజ్‌...ఆ తర్వాత... రోజుకొకటిగా అనేక ప్రదేశాలు. దేశఐక్యత ప్రతీక స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ... గాంధీజీ కారాగారం అగాఖాన్‌ ప్యాలెస్‌.మరాఠాల శౌర్యానికి ప్రతీక శనివార్‌వాడా... వావ్‌ అనిపించే గుజరాత్‌ మెట్ల బావులు...అదాలజ్‌ కా వావ్‌... పఠాన్‌లోని రాణీ కీ వావ్‌... దక్కన్‌ కోసం శంభాజీ నగర్‌ మినీ తాజ్‌మహల్‌. బౌద్ధ చిత్రాల అజంత గుహలు... శిల్పాల ఎల్లోరా... ఝాన్సీలో వీరాంగణ లక్ష్మీబాయ్‌ కోట.సంక్రాంతి వేడుకల రామ్‌రాజా టెంపుల్‌. మొధేరాలో సూర్యుడి మెత్తని కిరణాలు.ఈ టూర్‌లో మినిమమ్‌ గ్యారంటీలివి. మన భారతం బంగారు భారతం. అందుకే... ఇది స్వర్ణ భారత్‌ యాత్ర.1వ రోజురాత్రి ఏడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌కు చేరాలి. ఎనిమిది గంటలకు రైలు అహ్మదాబాద్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.2వ రోజుఉదయం రైల్లోనే టీ, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తయిన తర్వాత పదకొండు గంటలకు అహ్మదాబాద్‌ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ అవ్వాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్‌ కా వావ్, సాయంత్రం సబర్మతి రివర్‌ఫ్రంట్‌ విహారం తర్వాత హోటల్‌కు చేరాలి. భోజనం, బస అక్కడే.సబర్మతి తీరాన హృదయ్‌కుంజ్‌ అహ్మదాబాద్‌లో గాంధీజీ నివసించిన ఆశ్రమం సబర్మతి నది తీరాన ఉండడంతో సబర్మతి ఆశ్రమం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. కానీ గాంధీజీ తన ఇంటికి పెట్టుకున్న పేరు ‘హృదయ్‌ కుంజ్‌’. ఐదెకరాల్లో విస్తరించిన ఆశ్రమంలో గాంధీజీ నివసించడానికి ఒక భవనం, వంట కోసం, భోజనాల కోసం, స్వాతంత్య్ర సమరయోధుల సమావేశాల కోసం అనేక భవనాలను నిర్మించారు. ఇప్పుడు కొన్ని భవనాలను మ్యూజియంగా మార్చారు. ఇక రివర్‌ ఫ్రంట్‌ అంటే సబర్మతి తీరాన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణను, వాకింగ్‌కి అనువుగా డెవలప్‌ చేసిన కారిడార్‌. మన స్వాతంత్య్రదినోత్సవం నాడు దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ ఆశ్రమాన్ని, స్వాతంత్య్ర పథక రచనలు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతి అనిర్వచనీయమైనది.వావ్‌... ఇది బావిఅదాలజ్‌ కా వావ్‌. ఇది మెట్ల బావి. ఐదంతస్థుల నిర్మాణం. వర్షాకాలంలో మూడు అంతస్థులు దిగితే నీటిని అందుకోవచ్చు. వేసవిలో ఐదంతస్థుల కిందికి దిగితే కానీ నీరందదు. బయట ఎంత వేడి ఉన్నప్పటికీ ఈ బావి దగ్గర చల్లగా ఉంటుంది. మంచి గాలి వీస్తూ ఆహ్లాదంగా గడపవచ్చు. ఇది గుజరాత్‌ రాజధాని నగరం గాంధీనగర్‌కు సమీపంలో ఉంది. మధ్యయుగంలో విదేశాలతో వర్తక వాణిజ్యాలు నిర్వహించే వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రదేశం నుంచి రాకపోకలు సాగించేవారు. వారి సౌకర్యార్థం రాణి రుడాబాయి క్రీ.శ 1498లో దీనిని నిర్మించారు. ఇక్కడ పండుగలకు సంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఎనిమిదిన్నరకు రోడ్డు మార్గాన మొధేరాకు ప్రయాణం. మొధేరా సూర్యదేవాలయ వీక్షణం. లంచ్‌ తర్వాత పఠాన్‌కు ప్రయాణం. రాణీ కీ వావ్‌ విహారం తర్వాత అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్‌లో భోజనం, బస.పుష్పవతి తీరాన సూర్యదేవాలయంమొధేరాలోని సూర్యదేవాలయం అద్భుతమైన నిర్మాణం. దీని ఆర్కిటెక్చర్‌ గొప్పతనాన్ని వివరించాలంటే ఒక గ్రంథమే అవుతుంది. గుర్జర శైలి నిర్మాణం ఇది. దీనిని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. ఆలయం ఎదురుగా పెద్ద నీటి కొలను, దాని చుట్టూ జామెట్రికల్‌ డిజైన్‌తో నిర్మించిన మెట్లు మనదేశ నిర్మాణ కౌశలానికి నిదర్శనాలు.సరస్వతి తీరాన రాణీ కీ వావ్‌రాణీ కీ వావ్‌ చూస్తే నోరెళ్ల బెట్టి వావ్‌ అనాల్సిందే. ఇది పఠాన్‌ నగరంలో సరస్వతి నది తీరాన ఉంది. పఠాన్‌ నగరం మొధేరాకి 35 కిమీల దూరాన ఉంది. స్టెప్‌ వెల్‌ నిర్మాణాల్లో పతాకస్థాయి నిర్మాణం ఇది. ఈ గోడలకున్న శిల్పాలు, రాతిలో చెక్కిన డిజైన్‌లు చూపుతిప్పుకోనివ్వవు. ఈ గోడల మీదున్న డిజైన్‌లను చేనేతకారులు చీరల మీద నేస్తారు. యునెస్కో ఈ నిర్మాణాన్ని పదేళ్ల కిందట హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.]4వ రోజుబ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత అహ్మదాబాద్‌లోని హోటల్‌ గదిని చెక్‌ అవుట్‌ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. తొమ్మిదిన్నరకు రైలు ఏక్తానగర్‌కు బయలుదేరుతుంది. లంచ్‌ రైల్లోనే. ఒంటిగంటకు రైలు దిగి స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వీక్షణానికి వెళ్లాలి. అక్కడ షో చూసి, వెనక్కి వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి పది గంటలకు రైలు ఖాద్కీ (పూనే) స్టేషన్‌కు బయలుదేరుతుంది.నర్మద తీరాన ఐక్యత నిర్మాణంసర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మన దేశానికి భౌగోళిక రూపాన్నిచ్చిన ఆర్కిటెక్ట్‌. నర్మద నది తీరాన ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ దాదాపు ఆరువందల అడుగుల విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది పటేల్‌ నూటయాభైవ జయంతి ఏడాది. పటేల్‌ విగ్రహం తయారీకి శిల్పికి ఒక డిజైన్‌ ఇవ్వడానికి చరిత్రకారులు, కళాకారులు, విద్యావేత్తల బృందం పని చేసింది. ఈ విగ్రహం ఉన్న ప్రదేశం పేరు కెవాడియా. ఇక్కడి రైల్వేస్టేషన్‌కి అదే పేరు. ఇప్పుడు దీనిని ఏక్తానగర్‌గా మార్చారు.5వ రోజుఉదయం ట్రీ, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత తొమ్మిది గంటలకు రైలు ఖాద్కీ స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆగాఖాన్‌ ప్యాలెస్‌ సందర్శనానికి వెళ్లాలి. హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయ్యి, మధ్యాహ్న భోజనం తర్వాత కాస్బా గణపతి, లాల్‌ మహల్, శనివార్‌ వాడాల్లో పర్యటించి హోటల్‌కు చేరాలి. రాత్రి భోజనం, బస అక్కడే.మూలనది తీరం గాంధీజీ కారాగారంఅగాఖాన్‌ ప్యాలెస్‌ పూనేలో ఉంది. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడుతో΄ాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ కారాగార శిక్షను అనుభవించారు. కస్తూర్బా గాంధీ ఇక్కడే తుదిశ్వాస వదిలారు. ప్యాలెస్‌ ప్రాంగణంలో కస్తూర్బా సమాధి, గాంధీజీ చితాభస్మ సమాధి ఉన్నాయి. ప్యాలెస్‌లో క్విట్‌ ఇండియా ఉద్యమ చిహ్నంగా విగ్రహం ఉంది.ఛత్రపతుల కోట శనివార్‌ వాడాశనివార్‌ వాడా మరీ ప్రాచీనమైనదేమీ కాదు, 18వ శతాబ్దపు నిర్మాణం. సరైన నిర్వహణ లేక కొంతకాలం కళ తప్పింది. ఇప్పుడు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహణలోకి వచ్చిన తరవాత కళను సంతరించుకుంటోంది. ఇది ఏడంతస్థుల నిర్మాణం. మరాఠా వీరుల శౌర్యానికి ప్రతీకగా పీష్వా మొదటి బాజీరావ్‌ విగ్రహం ఉంది. ఢిల్లీలోని మొఘల్‌ పాలకులకు ఎదురు నిలబడి దీటుగా బదులిస్తున్నట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ కోటను ఉత్తరాభిముఖంగా నిర్మించాడు ఛత్రపతి షాహు.6వ రోజుఆరవ రోజు: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకుని హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి ఎనిమిది గంటలకంతా భీమశంకర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాలి. దారిలో లంచ్‌ చేసుకుని, ఆ తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఖాద్‌కీ రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. భోజనం, బస రైల్లోనే. రైలు రాత్రి పది గంటలకు ఛత్రపతి శంభాజీ నగర్‌ (ఔరంగాబాద్‌)కు బయలుదేరుతుంది.ప్రకృతి ఒడిలో భీమశంకరుడుద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర్‌ ఒకటి. ఇది పూనేకి 50 కిలోమీటర్ల దూరాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవిలో ఉంది.7వ రోజుఉదయం టీ, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తయిన తర్వాత రైలు ఛత్రపతి శంభాజీ నగర్‌కు చేరుతుంది. రైలు దిగి బీబీ కా మఖ్బారా వీక్షణానికి వెళ్లాలి. ఆ తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, లంచ్‌. ఆ తర్వాత ఎల్లోరా గుహలు చూసుకుని ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. రాత్రి భోజనం, బస హోటల్‌లో.శంభాజీ నగర్‌ మినీ తాజ్‌మహల్‌మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన రెండవ ఛత్రపతి శంభాజీ భోసాలే పేరుతో ఔరంగాబాద్‌ నగరానికి శంభాజీ నగర్‌ అని పేరు పెట్టారు. ఇక్కడ ఔరంగజేబు మనుమడు అజమ్‌ షా తన తల్లి దిల్‌రాస్‌ బాను బేగం కోసం తాజ్‌ మహల్‌ నమూనాలో నిర్మించిన బీబీ కా మఖ్బారా (మినీ తాజ్‌మహల్‌) పెద్ద టూరిస్ట్‌ అట్రాక్షన్‌. ఇక్కడ పాన్‌ ఫేమస్‌. స్టార్‌ పాన్‌ షాప్‌ నుంచి అరబిక్‌ దేశాలకు పాన్‌లు ఎగుమతి అవుతాయి. అత్యంత ఖరీదైన ఎక్స్‌΄ోర్ట్‌ క్వాలిటీపాన్‌ ధరలు వేలల్లో ఉంటాయి. ఈ టూర్‌ గుర్తుగా తక్కువలో తక్కువగా వచ్చే పాతిక రూపాయల పాన్‌ అయినా రుచి చూడాలి.8వ రోజుబ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి రోడ్డు మార్గాన అజంతా గుహలకు వెళ్లాలి. అజంతా గుహల సందర్శన తర్వాత మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత భుసావల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు సాయంత్రం ఆరు గంటలకు ఝాన్సీకి బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే. బౌద్ధ చిత్రాల అజంతఎల్లోరా– అజంతా గుహలు మనదేశంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పడానికి మనకున్న గొప్ప చారిత్రక ఆధారాలు. యునెస్కో ఈ గుహలను వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. ఇందులో కొన్ని గుహలు చైత్యాలు. అంటే ప్రార్థన మందిరాలు. కొన్ని విహారాలు... అంటే నివాస ప్రదేశాలు. రంగురంగుల పెయింటింగ్స్‌ కోసమే ఈ గుహలకు వెళ్లాలి. ఎల్లోరా గుహల్లో శిల్పాలుంటాయి. అజంతాగుహలు చిత్రాలకు ప్రసిద్ధి.9వ రోజుఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఏడుగంటలకు రైలు వీరాంగణ లక్ష్మీబాయ్‌ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఓర్చాలో హోటల్‌ గదికి వెళ్లి రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత చెక్‌ అవుట్‌ చేయాలి. ఓర్చాలో ఉన్న రామ్‌ రాజా టెంపుల్, చతుర్భుజ టెంపుల్, జహంగీర్‌ మహల్‌ చూసుకుని లంచ్‌ తర్వాత ఝాన్సీ వైపు సాగి΄ోవాలి. ఝాన్సీ కోట, మ్యూజియం సందర్శన తర్వాత ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కాలి. రైలు రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ, సఫ్దర్‌జంగ్‌ స్టేషన్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే.ఉత్తరాదిలో సంక్రాంతి వేడుకరామ్‌ రాజా మందిర్‌... ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, ఓర్చా పట్టణంలో ఉంది. ఓర్చా టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఆలయంలో ఏటా శైవ, వైష్ణవ పర్వదినాలతోపాటు మకర సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు, రాముడి ఆలయం. రాముడి ఆలయం అంటే ధనుర్ధారిౖయె సీతాలక్ష్మణ సమేతంగా అడవుల బాట పట్టిన కోదండ రాముడి రూపమే ఉంటుంది. ఇక్కడ మాత్రం రాముడు రాజు హోదాలో పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న శిల్పాల సముదాయాన్ని చూస్తే అరణ్యవాసం, రామరావణ యుద్ధం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రాముడిని తలపిస్తుంది. ఆలయ నిర్మాణం కూడా అంతఃపురాన్ని ΄ోలి ఉంటుంది.ఝాన్సీ కోటలో రాణిమహల్‌ఝాన్సీ కోట శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. కానీ ప్యాలెస్‌లు నిరాడంబరంగా ఉంటాయి. చతుర్భుజి ఆకారంలో రెండతస్థుల భవనం, మధ్యలో బావి, ఫౌంటెయిన్, లాన్, గదుల్లోపల గోడలకు చక్కటి పెయింటింగులతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్‌ ప్యాలెస్‌ అందంగా ఉంటుంది. బ్రిటిష్‌ సైన్యంతో ΄ోరాడిన ధీర మహిళ లక్ష్మీబాయ్‌. ఆమె యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమై, బిడ్డను వీపుకు కట్టుకుని కోట గోడ మీద నుంచి అమాంతం గుర్రం మీదకు దూకిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఝాన్సీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియంలో టెర్రకోట బొమ్మలు, లోహపు బొమ్మలు, ఆయుధాలు, శిల్పాలు, చేతి రాత ప్రతులు, చిత్రలేఖనాలు, బంగారు, వెండి, రాగి నాణేలు, లోహపు విగ్రహాలు, దుస్తులను చూడవచ్చు. 10వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ స్టేషన్‌కు చేరుతుంది. టీ తర్వాత రైలు దిగడంతో పర్యటన పూర్తవుతుంది.స్వర్ణిమ్‌ భారత్‌ యాత్ర (సీడీబీజీ 30), ఇది పది రోజుల టూర్‌. ఆగస్ట్‌ 14న మొదలై 23వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అహ్మదాబాద్, మొథేరా, పూనే, ఔరంగాబాద్, ఓర్చా, ఝాన్సీ ప్రదేశాలు కవర్‌ అవుతాయి. టూర్‌ కోడ్‌... SWARNIM BHARAT YATRA (CDBG30)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement