Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan responds to Supreme Court verdict on the arrest of senior journalist Kommineni Srinivasa Rao1
‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Supreme Court Orders Release Of Kommineni Srinivasa Rao2
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సాక్షి చానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్‌ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.

Kommineni Arrest To Bail: Courts Slaps Police These Are Complete Details3
కొమ్మినేని అరెస్ట్‌ టు బెయిల్‌! ఎప్పుడేం జరిగిందంటే..

సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్‌ చేయాలంటూ.. ఆయన అరెస్ట్‌ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్‌ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్‌ సిటిజన్‌, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్‌ఎస్‌ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్‌) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్‌ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్‌ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.

Ahmedabad Plane Air India Incident Updates4
విమాన ప్రమాదం.. బ్లాక్‌ బాక్స్‌పై ఫేక్‌ ప్రచారం..

Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్‌ ప్రమాదానికి సంబంధించి బ్లాక్‌ బాక్స్‌పై ఫేక్‌ ప్రచారంబ్లాక్‌ బాక్స్‌ దొరికిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్‌ ఇండియా.బ్లాక్‌ బాక్స్‌పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్‌ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్‌ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్‌ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్‌ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్‌ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్‌ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్‌ విల్సన్‌ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్‌లు రద్దుఅహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్‌లు రద్దుగుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ, సిటీ సివిల్‌ హాస్పిటల్‌ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్‌వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్‌ విశ్వాస్‌కుమార్‌ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.

Air India Ahmedabad flight crash cocpit data Analyzing with blackbox5
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్‌(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్‌), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్‌డీఆర్‌)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్‌బ్లాక్స్‌లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్‌బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్‌ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్‌లేషన్‌లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్‌డీఆర్‌ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్‌ ఎఫ్‌డీఆర్‌ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్‌ ఇన్‌పుట్స్ వంటి పారామీటర్‌లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్‌ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్‌ ఆఫీసర్‌ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్‌ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్‌స్టర్‌ ఛైర్మన్‌ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్‌ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు.

India expresses deep concern on Operation Rising Lion6
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..

ఇరాన్‌ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్‌ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్‌ దాకా ఇజ్రాయెల్‌ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్‌ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్‌, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.

Nandamuri Balakrishna Fake Mustache Fallen Off: Video Viral7
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్‌

సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్‌ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్‌లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్‌ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్‌పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్‌ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్‌ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్‌ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్‌ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్‌లో ఎప్పటిలాగానే తన బ్లడ్‌ వేరు..బ్రీడ్‌ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని గమ్‌ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.గమ్‌ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్‌ బుక్‌ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్‌ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.Papam Bulbul Balayya 😂😂😂Chusukovali kada Mental 😜🤡 pic.twitter.com/9Dqp6BNf20— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 11, 2025బాలకృష్ణ గమ్ము గమ్ము అని అడుగుతుంటే ఎందుకబ్బా స్పీచ్‌ మధ్యలో bubblegum లేక chewing gum అడుగుతున్నాడని మొదట అర్థం కాలేదు తర్వాత అర్థమయింది 😁😁 pic.twitter.com/etuvYFQX5I— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) June 11, 2025

Plane Plummets To Earth: A Phone Call That Never Came8
పైలట్‌ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..

ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్‌ సుమీత్‌కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్‌కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్‌ తన తండ్రికి ఫోన్‌ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్‌ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారు.కాగా, అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్‌ కెప్టెన్‌ సుమీత్‌ సబర్వాల్, కో పైలట్‌ క్లైవ్‌ కుందర్‌ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్‌కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్‌ క్లైవ్‌కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది.

Union Minister Rammohan Naidu Social Media Post Criticized9
రామ్మోహనా.. రీల్స్‌ చేయడానికి వెళ్లావా..?

సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సోషల్‌ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్‌ క్రాష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్‌ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్‌ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025

The Global CEO of Chanel Leena Nair Receives UKs prestigious civilian honour10
ఎవరీ లీనా నాయర్‌? ఏకంగా బ్రిటిష్‌ అత్యున్నత గౌరవం..

భారత సంతతి సీఈవో లీనా నాయర్‌కు బ్రిటన్‌ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్‌ సీఈవోగా రిటైల్‌ అండ్‌ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్‌ గ్లోబెల​ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ లీనా నాయర్‌ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు. ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్‌ బ్రాండ్‌ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్‌ హవాను కొనసాగించడం, క్లయింట్‌ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్‌ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్‌లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్‌ బ్రాండ్‌కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్‌కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్‌లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్‌లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్‌లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్‌. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్‌ అయ్యారామె. (చదవండి: ఆన్‌లైన్‌ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్‌ఈ')

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement