Top Stories
ప్రధాన వార్తలు

బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?
గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025

భారత చెస్ యువ కెరటం గుకేష్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: నార్వే చెస్ ఛాంపియన్షిప్లో వరల్డ్ చాంపియన్, భారత చెస్ సంచలనం డి గుకేష్.. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్ల్సన్ను ఓడించడంపై గుకేష్కు అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. కేవలం 62 మూవ్లతోనే కార్లసన్ను మట్టికరిపించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన వైఎస్ జగన్.. గుకేష్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గుకేష్ గెలిచిన ఆనంద క్షణాల్ని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉ఇదీ చదవండి: ప్రపంచ నంబర్ వన్ను ఓడించిన గుకేష్ప్రపంచ చాంపియన్ కార్లసన్తో జరిగిన ఆరో రౌండ్ పోరులో భారత చెస్ యువ కెరటం అనూహ్య విజయాన్ని సాధించాడు. క్లాసికల్ గేమ్లో గుకేష్ కార్ల్సెన్ను ఓడించడం ఇదే మొదటిసారి. దీంతో గుకేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోతే, కార్ల్సన్కు మాత్రం అసహనం కట్టలు తెంచుకుంది. కార్ల్సెన్ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ బల్లపై బలంగా కొట్టాడు. It was enthralling to watch World Champion @DGukesh defeating the Norwegian chess grandmaster, Magnus Carlsen, in 62 moves in Round 6 of the 2025 Norway Chess. Hearty congratulations to this hero! May his prowess reign supreme and bring many more laurels to India.#NorwayChess… pic.twitter.com/TaBZkE97Ew— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025

2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. ‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతన్న సంక్షేమానికి పెద్దపీట రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. యువతే మన భవిష్యత్తు.. యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. కులగణనతో దేశానికి ఆదర్శంగా.. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్లో ఇదొక తొలి మెట్టు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు. పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారంతెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ జరిపిన కవాతు ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు. అవార్డు అందుకున్న గద్దర్ సతీమణి.. దివంగత ప్రజాకవి గద్దర్ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు.

సంయమనం అవసరం
నెత్తురు చిందకుండా, నష్టం జరగకుండా యుద్ధం సాగుతుందనీ, ముగుస్తుందనీ ఎవరూ అనుకోరు. ప్రత్యర్థిని చిత్తు చేద్దామని ఇరుపక్షాలూ విశ్వప్రయత్నం చేస్తాయి. కానీ అనేక కారణాలవల్ల ఎవరో ఒకరినే విజయం వరిస్తుంది. ఇందులో సరైన అంచనాలకు రాలేకపోవటం దగ్గరనుంచి స్థానిక వాతావరణ స్థితిగతుల వరకూ చాలా వుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా మన విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో మనకు కలిగిన నష్టాలగురించి వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. యాదృచ్ఛికంగానే కావొచ్చుగానీ... మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ శనివారం సింగపూర్లో మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. ఆ అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు వదలటం లేదా వారితో చర్చించి ఎప్పుడు ఏ విధంగా చెప్పాలో సలహా తీసుకోవటం సరైన విధానం. విదేశీ గడ్డపై చెప్పటమైతే ఎంతమాత్రమూ సరికాదు. పైగా ఆయన సింగపూర్ వెళ్లింది ఏటా జరిగే అంతర్ ప్రభుత్వాల భద్రతా వ్యవహారాలపై నిర్వహించే ‘షాంగ్రీ లా డైలాగ్’ కోసం. అందులో పాకిస్తాన్ త్రివిధ దళాల చీఫ్ కూడా పాల్గొన్నారు. ఒకపక్క మన ఎంపీల అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ ఆగడాల గురించీ, వాటిని నిలువరించక తప్పని స్థితి గురించీ వివరించటానికి వేర్వేరు దేశాల్లో పర్యటిస్తున్నాయి. కనుక జనరల్ చౌహాన్ ప్రకటన ఏ రకంగా చూసినా సమయం, సందర్భం లేనిది. కొందరు మాజీ సైనికాధికారులూ, నిపుణులూ చెప్పినట్టు పాకిస్తాన్కు మన దళాలు కలిగించిన భారీ నష్టంతోపాటు దీన్నీ చెప్పివుంటే ఇంత వివాదమయ్యేది కాదేమో! గత నెల 7 నుంచి పదో తేదీ వరకూ సాగించిన దాడుల్లో మన నష్టం ఏపాటో చెప్పాలని విపక్షాలు కోరుతున్నాయి. దాడి చేయటానికొచ్చిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఆధారంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఈ డిమాండ్ మొదలుపెట్టారు. మన సైనిక దళాలు సాధిస్తున్న విజయాలను ఎన్డీయే ప్రభుత్వం తన సత్తాకు ప్రతీకగా చెప్పుకోవటాన్ని నిరోధించేందుకు విపక్షాలు ఈ ప్రయత్నం చేసివుండొచ్చు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడిచేయాలనే అంశాలను పూర్తిగా త్రివిధ దళాలకు అప్పగించాక వాటిపై అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరు చేసినా తప్పే. యుద్ధంలో తొలి క్షతగాత్ర సత్యమేనంటారు. ఎందుకంటే అవతలి పక్షాన్ని చావుదెబ్బ తీశామని, అనేకమంది శత్రు సైనికుల్ని హతమార్చామని, కీలక స్థావరాలు ధ్వంసం చేశామని ప్రభుత్వాలు చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా వున్నదే. యుద్ధం ముగిసిన కొన్నాళ్లకుగానీ వాస్తవ గణాంకాలు బయటకు రావు. మన విపక్షాలు అంతవరకూ ఆగలేకపోయాయి. పాక్ మీడియా వార్తల్ని విశ్వసించి మన ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాయి. ఇదంతా రాజకీయంగా బీజేపీకి లాభిస్తుందన్న ఆందోళనే దీనికి కారణం. ఎప్పుడూ లేనివిధంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో మన సేనలు పాకిస్తాన్ నగరాలను నేలమట్టం చేయటం మొదలుకొని పలు విజయాలు సాధించినట్టు ప్రచారం సాగింది. ఇదెంత ముదిరిందంటే... ఒక దశలో మన ప్రభుత్వం ఖండించాల్సి వచ్చింది కూడా. మరోపక్క యుద్ధంవల్ల కలిగే అనర్థాల గురించి చెప్పిన మాజీ సైనికాధికారులనూ, వారి కుటుంబసభ్యులనూ దూషించటం, ఉగ్రవాదుల దుర్మార్గానికి భర్తను కోల్పోయిన యువతి ముస్లింలపై ద్వేషం వద్దని అన్నందుకు ఆమెను దుర్భాషలాడటం వంటి వైపరీత్యాలూ చోటుచేసుకున్నాయి. కొందరైతే దాడులు నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శిపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా నోరుపారేసుకున్నారు. యుద్ధకాలంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలనూ, సలహాలనూ పాటించటం తప్ప ఉన్మాదం ఆవహించినట్టు ఊగిపోవటం సరైంది కాదు. ఇందువల్ల మన జవాన్లకు వీసమెత్తు ఉపయోగం లేదు సరికదా... ప్రజల్లో తప్పుడు భావాలు వ్యాప్తి చెందే ప్రమాదం వుంటుంది. దాడులు ఎప్పుడు మొదలెట్టాలో, ఎప్పుడు ఆపాలో, ఏ దశలో ఏం చేయాలో నిర్ణయించటానికి ప్రభుత్వం ఉన్నప్పుడు గుంపులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం అనర్థదాయకం.చౌహాన్ చెబుతున్న ప్రకారం నాలుగు రోజుల దాడుల్లో తొలి రెండు రోజులూ మనకు నష్టం వాటిల్లింది. వెంటనే లోపాలు గుర్తించి సరిచేసుకోవటం పర్యవసానంగా ఆ తర్వాత మన జెట్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలిగాయని ఆయన అన్నారు. ఏ లోపమూ చోటుచేసుకోకుండా, ఏ నష్టమూ జరగకుండా మనం కోరుకున్న ప్రకారం అంతా జరిగిపోవాలనుకునేవారికి ఇది నిరాశ కలిగించవచ్చు. బీజేపీ అగ్ర నాయకులంతా ఈ విజయాలను తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపు కావొచ్చు. కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో సంయమనం పాటించటం అందరి బాధ్యత. దాడులు ప్రారంభించటానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరిన ప్రభుత్వం ముగించటానికి ముందు కూడా ఆ పనే చేసివుంటే బాగుండేది. కనీసం మన దళాలు సాధించిన విజయాలు, మన నష్టాల గురించి ఈ నెల్నాళ్లలోనైనా అఖిలపక్షం నిర్వహిస్తే సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ తరహా ఉదంతాలు ఇకపై పునరావృతం కాకూడదనుకుంటే కేంద్రం ఆ పని చేయాలి. అందులో అధికార, విపక్షాల వ్యవహారశైలి గురించీ, కొన్ని శక్తులనుంచి అతిగా వచ్చిన స్పందనల గురించీ తన వైఖరేమిటో చెప్పాలి. కష్టకాలంలో సంయమనం పాటించటం ఎంత ముఖ్యమో వివరించాలి.

నదీ జలాలతో ఆటలాడవచ్చా?
పాల్ సెజాన్ (ఫ్రాన్స్) 1890లో ఓ పెయింటింగ్ వేశారు. దాని పేరు ‘ఎట్ ద వాటర్’స్ ఎడ్జ్.’ నీటిపై కాంతి ప్రతిఫలనాన్ని వినూత్న రీతిలో చూపెడుతూ చేసిన చిత్రమిది. దాన్ని గీసేందుకు రంగులను పొరలు పొరలుగా అద్దారు. అవి కరుగుతున్నట్టుగా ఉంటాయి. దీనికి ఈ టైటిల్ ఇవ్వడం వెనుక చిత్రకారుడి ఉద్దేశం ఏమిటో తెలియదు. కానీ, పహల్గామ్ ఊచకోత ఇండియా, పాకిస్తాన్ దేశాలను సింధూ నది నీటి అంచున నిలబెట్టింది.టిబెట్ పర్వతాల మీద 18,000 అడుగుల ఎత్తున మానస సరోవరం వద్ద పుట్టిన సింధూ నది వేల సంవత్సరాలుగా ఎన్నో నాగరికతలకు ఆలవాలమైంది. ఇటీవలి సంవత్సరాల్లో నదుల గురించి, వాటి చరిత్రల గురించి చాలా రచనలు వెలువడుతున్నాయి. బ్రిటిష్ చరిత్రకారుడు, ‘ద కాంక్వెస్ట్ ఆఫ్ నేచర్’ రచయిత డేవిడ్ బ్లాక్బోర్న్ ఇలా అంటాడు: ‘‘ప్రకృతిపై విజయం సాధించాలన్న మానవుడి తపన వెనుక అనేక ఊహలు ఇమిడి ఉంటాయి. మానవ, సాంకేతిక శక్తులతో ప్రకృతిని జయించాలని మనిషి అనుకుంటాడు. నదుల అస్తిత్వం పట్ల అతడి వైఖరి కూడా దీనికి ఒక కారణమవుతుంది’’.నైలు నదిని మార్చిన ఫలితం?నదులకు వ్యక్తిత్వం ఉందీ అనుకున్నా, అవి ఏం ఆలోచిస్తాయో తెలియదు. అయితే, నదుల గురించి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలుసు. నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో లెక్కగట్టి వాటి స్వరూపాన్ని నిర్ణయిస్తాం. అంతే కాకుండా, వాటిపై ఆధారపడి ఉండే వృక్ష జంతుజాలం, ఆ నదులను పెనవేసుకుని ఉండే ఆచార వ్యవహారాలు, కల్పిత గాథలు ఆధారంగా వాటి గొప్పతనాన్ని అంచనా వేస్తాం. శత్రుదేశం మీద ప్రయోగించడానికి సింధూ నదిని ఒక అస్త్రంగా మార్చుకోవాలని ఇండియా భావిస్తోంది. నదులతో ఆడుకుంటే వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసిన విషయమే. నైలు నదీ స్వరూపాన్ని మార్చేయాలని 200 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడలేదు. ఆస్వాన్ డామ్ కట్టడంతో నైలు నదీ డెల్టాను వేల సంవత్సరాలుగా సారవంతం చేసిన ఒండ్రుమట్టి ఆ ప్రాంతంలో మేట వేయడం నిలిచిపోయింది. అంతేకాదు, నత్తగుల్లల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి శిస్టోమియాసిస్ ప్రబలడానికీ, మలేరియా వ్యాప్తికీ కారణమైంది.నది మీద డ్యామ్ కడితే అది ఇక నదే కాదు. ‘‘నీటిని అదుపులోకి తెచ్చుకోవడమంటే, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే. హైడ్రలాజికల్ ప్రాజెక్టుల వల్ల అక్కడి మానవ ఆవాసాలు అంతరిస్తాయి. ఆ మానవ సమూహాల విలువైన పారంపరిక విజ్ఞానం శాశ్వతంగా కనుమరుగవుతుంది’’ అని కూడా బ్లాక్బోర్న్ రాస్తాడు.భారీ నీటిని నిల్వ చేయగలమా?కశ్మీర్ ‘పాకిస్తాన్ జీవనాడి’ అంటూ, పహల్గామ్ ఊచకోతకు కొద్దిరోజుల ముందు, పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. వాస్తవానికి సిం«ధూ నది ఈ రెండు దేశాలను యుద్ధం వైపు నడిపించే అవకాశం ఉన్నది! సైనిక ప్రతిచర్యలకు అదనంగా, ఇండియా 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఇన్నిసార్లు వచ్చినా ఇలా చేయడం ఇదే ప్రథమం. జల యుద్ధాలు సంభవించే ముప్పు ఉందంటూ కొన్ని దశాబ్దాలుగా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిప్పుడు పరీక్షా సమయం. ఒప్పందం నిలిపివేయడంతోనే సిం«ధూ జలాలు దిగువకు ప్రవహించకుండా ఆగిపోవు. ఒక్క చుక్క నీటిని కూడా వదలం అంటూ జలశక్తి మంత్రి హెచ్చరించడం పాక్ను బెదిరించే రాజకీయ ప్రకటన. సిం«ధూ ప్రవాహాన్ని అకస్మాత్తుగా అపేయడం సాధ్యపడేది కాదన్నది మనకు తెలిసిన విషయమే. ‘‘నెత్తురు నీరు కలసి ప్రవహించ జాలవు’’ అని 2016 కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం ఇండియా హెచ్చరించింది. అయితే, ఇస్లామాబాద్కు మద్దతుగా చైనా రంగంలోకి దిగిత్సాంగ్పో (బ్రహ్మపుత్ర) ఉపనది ప్రవాహాన్ని అడ్డుకుందని వార్తలు వచ్చాయి.ఇండియా ప్రస్తుత జలవిద్యుత్ ప్రాజెక్టులతో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ (1960) అందుకు అంగీకరించదు కూడా. ఒప్పందాన్ని పునః సమీక్షించడం కోసం, స్టోరేజ్ సదుపాయాల ఏర్పాటు కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు రచించిన వ్యూహం ఇది. ఇండియా ప్రస్తుతం 20 శాతం నీటినే వినియోగించుకోగలుగుతోంది. మరీ ఎక్కువగా నీరు నిల్వ చేస్తే వరద ముంపు ప్రమాదం ఎదురవుతుంది.దౌత్యవ్యూహంగా సరే!ఇరు దేశాలూ తమ జల వివాదాలను పరిష్కరించుకోడానికి 2022 నుంచీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మారుతున్న జనాభా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందంపై పునఃసమీక్ష జరగాలని 2023లో ఇండియా ప్రతిపాదించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం అంటే వ్యయంతో కూడుకున్న పని. నీటి మళ్లింపు ఆర్థిక రీత్యా సాధ్యం కాకపోవచ్చు. చైనా సైతం త్సాంగ్పో నీటి మళ్లింపు విషయంలో ఈ కారణంతోనే సందిగ్ధంలో పడింది.‘‘సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో ప్రత్యేకించి చీనాబ్ బేసిన్లో జలవాతావరణం భారీ మార్పులకు లోనవుతోంది. ఈ వాతావరణ మార్పుతో ఇప్పటికే మనం సమరం చేస్తున్నాం’’ అని ‘సౌత్ ఏషియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్’ (ఎస్ఏఎన్డీఆర్పీ) సమన్వయకర్త పరిణీతా దాండేకర్ చెబుతున్నారు.ఇండియాలోని సింధూ పరీవాహక ప్రాంతపు పశ్చిమ నదులపై ఎక్కడా లేనన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు చీనాబ్ బేసిన్లో ఉన్నాయి (హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్లో కొంతభాగం చీనాబ్ పరీవాహక ప్రాంతం కిందకు వస్తాయి). తొందరపడి మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయిస్తే ఇండియా, పాకిస్తాన్ దేశాలు రెండూ ప్రకృతి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎస్ఏఎన్డీఆర్పీ బృందం 2024లో చీనాబ్ నది ఆసాంతం పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఇప్పటికే భూకంపాలు, నిరంతర వాతావరణ విపత్తులు ఎదుర్కొంటున్న చీనాబ్ నదీ ప్రాంతం మరిన్ని భారీ ప్రాజెక్టులను తట్టుకోలేదు. అయినా సరే నిర్మిస్తే పెను ఉపద్రవం తప్పదని ఈ నివేదిక హెచ్చరించింది. వీటివల్ల ఉత్పన్నమయ్యే జీవావరణ, భూగర్భ సంబంధిత దుష్పరిణామాలను సరిదిద్దడానికి వీలు కూడా కాదు. నదీజలాల మళ్లింపు వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇక్కట్ల పాలవుతారు. లక్షల మంది నిర్వాసితులు అవుతారు. జలప్రవాహాన్ని నిలిపివేయడం తెలివైన దౌత్యవ్యూహమే కావచ్చు. కానీ నదీప్రవాహంతో ఆటలాడితే దీర్ఘకాలంలో ప్రమాదం తప్పదు.కిసలయ భట్టాచార్జీ వ్యాసకర్త జిందాల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ డీన్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
ఐపీఎల్ 2008లో మొదలైంది... తొలి సీజన్... రెండు.... మూడు... నాలుగు... ఇలా చూస్తూ చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు మారారు... కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలూ మారాయి... వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతీసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు... ఒక టీమ్ ఈ ప్రయత్నంలో మూడుసార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా... మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది... ఇప్పుడు ఆ రెండు టీమ్లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో కొత్త జట్టు చాంపియన్గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారి ఈ టైటిల్ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: ఐపీఎల్–18 సీజన్లో 73 హోరాహోరీ మ్యాచ్ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రదర్శనను చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపించాయి. రన్రేట్ కారణంగా పంజాబ్ మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో నిలిచినా... రెండు టీమ్లూ సమంగా తొమ్మిదేసి విజయాలు సాధించి 19 పాయింట్లతో నిలిచాయి.‘ప్లే ఆఫ్స్’కు ముందు ప్రత్యర్థులుగా తలపడిన మ్యాచ్లలో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని అందుకోగా... క్వాలిఫయర్–1లో పంజాబ్ను చిత్తు చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో గెలిచి పంజాబ్ లెక్క సరి చేస్తుందా లేదా ఆర్సీబీ ఆధిత్యం కొనసాగుతుందా చూడాలి. మొత్తంగా ఎవరు గెలిచినా తొలి ట్రోఫీతో సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. సమష్టి ప్రదర్శనతో... ఐపీఎల్లో ఆర్సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన ఎనిమిది సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు పది మ్యాచ్లు గెలిస్తే తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వీడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 600కు పైగా పరుగులు, 8 అర్ధసెంచరీలతో జట్టుకు చుక్కానిలా నిలిచాడు. అతని ఓపెనింగ్లో సరైన జోడీగా ఫిల్ సాల్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు.మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేశ్, కృనాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ఆడారు. కెపె్టన్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా... కెపె్టన్గా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. మైదానంలో కోహ్లి అనుభవం, సూచనలు అండగా ఉన్న పాటీదార్ నాయకత్వంలో టీమ్ టైటిల్ గెలిస్తే ఆర్సీబీ అభిమానుల కోరిన నెరవేర్చిన ప్రత్యేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.బౌలింగ్లో కూడా టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ సత్తా తొలి క్వాలిఫయర్లో పంజాబ్పైనే కనిపించింది. ముఖ్యంగా హాజల్వుడ్ ఆ్రస్టేలియా నుంచి తిరిగి రావడం ఒక్కసారిగా జట్టు బలాన్ని పెంచింది. 21 వికెట్లతో అతను టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... భువనేశ్వర్, యశ్ దయాళ్ సహకరించారు. లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేయగలడు. ఆ నలుగురితో కలిసి... తొలి క్వాలిఫయర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫయర్లో ముంబైని చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇన్గ్లిస్, స్టొయినిస్లకు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోగల నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో నలుగురు బ్యాటర్లు పోషిస్తున్నారు.వీరంతా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్తో పాటు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో రాణిస్తే కింగ్స్కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్లో కాస్త తడబాటు కనిపిస్తోంది. అర్ష్దీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జేమీసన్ మెరుగ్గా ఉన్నా, మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్కు గెలుపు కష్టం కాబోదు. తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్వుడ్. పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్సిమ్రన్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్దీప్ సింగ్. పిచ్, వాతావరణం సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్ తర హాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన ప్రస్తుతానికి లేదు కానీ వాన వస్తే అదనపు సమయంతో పాటు బుధవారం ‘రిజర్వ్ డే’ కూడా ఉంది.

నోటీస్ కాదు.. నన్ను సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాపుకు రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి’ అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. రాజాసింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్తో రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’

ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆర్బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచింది. ఈసారి జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కట్ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తోంది.నివేదికలో ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థలు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకేజూన్ పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు 100 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనలమేరకే ఉన్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేయడంతో పంటల దిగుబడి, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలను ఉటంకిస్తూ ఎస్బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక పనితీరు పరంగా చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ 7.4%కు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.4% నుంచి తగ్గింది.

‘సర్’ ని ఎవరు కాపాడే యత్నం చేశారు?
చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో 39 ఏళ్ల జ్ఞానశేఖరన్ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది. ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్ఐఆర్లో ‘సర్’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్, సీఎం ఎంకే స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.దీనికి సీఎం స్టాలిన్ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటంటే..గతేడాది డిసెంబర్ 23వ తేదీన జ్ఞానశేఖరన్ అన్నామలై క్యాంపస్లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా, యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్ మెయిల్ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్పై సుదీర్ఘమైన క్రిమినల్ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.

ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
సాక్షి,విజయవాడ: పలు అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులగా ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్దారించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వంశీ ఐసీయూలో లేనందున ఆరోగ్యం కుదుటపడేందుకు స్లీప్ మెడిసిన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులు వంశీకి అందించిన చికిత్స తాలూకూ మెడికల్ రిపోర్టులు, డిశార్జ్ సమ్మరీతో సహా సీల్డ్ కవర్లో ఈనెల 5వ తేదీన జైలు అధికారులు హై కోర్టుకు సమర్పించనున్నారు.గత గరువారం ..వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం (జూన్ 5) నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?
కార్ల్సన్కు గుకేశ్ షాక్
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
సంయమనం అవసరం
నదీ జలాలతో ఆటలాడవచ్చా?
మనసు నీకై రథమయ్యే రారా...
మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
కింగులా బతికాడు సింగిల్గా..!
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్ డే (ఫొటోలు)
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
ఆంధ్రాకు నేనే బ్రాండ్.. చంద్రబాబు
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
ఏ కష్టమొచ్చిందో.. ఏమో..?
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
పది మందికి రూ. 1 కోటికి పైగా...
'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
కెనరా బ్యాంక్ గుడ్న్యూస్: పొదుపు ఖాతాల్లో..
అలాగే సీఎం లాలూప్రసాద్యాదవ్ అని అనకండీ!! మీరే సీఎం!!
కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!?
పోలండ్ అధ్యక్షుడిగా కరోల్ ఎన్నిక
తిండిగింజలకు నానాతిప్పలు
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నేడు తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
ఔను.. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ మెరుపులు
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?
కార్ల్సన్కు గుకేశ్ షాక్
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
కింగులా బతికాడు సింగిల్గా..!
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
ఆంధ్రాకు నేనే బ్రాండ్.. చంద్రబాబు
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
ఏ కష్టమొచ్చిందో.. ఏమో..?
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
పది మందికి రూ. 1 కోటికి పైగా...
'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
కెనరా బ్యాంక్ గుడ్న్యూస్: పొదుపు ఖాతాల్లో..
అలాగే సీఎం లాలూప్రసాద్యాదవ్ అని అనకండీ!! మీరే సీఎం!!
రిటైర్మెంట్ ప్రకటించిన గ్లెన్ మాక్స్వెల్
సినిమా

బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా: హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించినవారిలో మౌసమి చటర్జీ (Moushumi Chatterjee) ఒకరు. మౌసమి అసలు పేరు ఇందిర. చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేజర్ కాకముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. తన ఆంటీ చివరి కోరిక మేరకు పదో తరగతిలో ఉండగానే జయంత్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనురాగ్ అనే చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంధురాలిగా నటించింది. ఈ సినిమా సక్సెస్తో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. అయితే అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది.నా వల్ల కాలేదుకానీ ఓ సినిమా యూనిట్ చేసిన పనికి తను భయంతో రోదించానంటోంది మౌసమి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1973లో వచ్చిన కుచ్చె ఢాగె సినిమా షూటింగ్లో జరిగిన సంఘటన ఇది.. నాకు బ్యాక్లెస్ బ్లౌజ్, పొట్టి గాగ్రా ఇచ్చి వేసుకోమన్నారు. అవి చూడగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆ డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్లే అనిపించింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి నాకిక్కడ పని చేయాలని లేదు.. ఒక్క ఫోన్ కాల్..నన్ను కోల్కతాకు పంపించేయమని వేడుకున్నాను. అప్పటికే వాళ్లు నా బట్టలన్నీ తీసేసుకున్నారు. నా ఫోన్కాల్తో ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అలా ఆ సినిమా పూర్తి చేశాను. పొట్టి స్కర్టు ధరించాల్సి ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డి సినిమాను రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. గుడ్డి చిత్రంలో జయా బచ్చన్ నటించగా ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచింది.సినిమామౌసమి 'ఆరి' అనే బెంగాలీ చిత్రంతో ఇటీవలే వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఆమె చివరగా నటించిన పీకు సినిమా కూడా మే 9న రీరిలీజ్ అయింది. బాలీవుడ్లో మౌసమి.. రోటీ కపడా ఔర్ మకాన్, అనారి, జిందగీ, స్వర్గ్ నరక్, ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్, ప్రేమ్ బంధన్, స్వయంవర్, అంగూర్, నిశ్చయ్ వంటి పలు చిత్రాలు చేసింది.చదవండి: నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్

తెలుగు ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించిన ఏఎం రత్నం
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపంథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ను ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ సినిమాకు ఎపీలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి ఇవ్వాలంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్కు ఆయన వినతి పత్రం అందించారు. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి త్వరలో సంప్రదించనుంది. ఆ సమయంలో 'హరిహర వీరమల్లు' సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అదనపు షోలు రన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరనుంది. 'హరిహర వీరమల్లు'కు టికెట్ల రేట్ల పెంపు కోసం పవన్ కల్యాణ్ కొత్త స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా నిర్మాత ఏఎమ్ రత్నం ద్వారా తన సినిమా కోసం టికెట్ ధరలు పెంపు, అదనపు షోల అనుమతి కోసం ప్లాన్ అమలు చేశారు. పవన్ సూచన మేరకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏఎమ్ రత్నం కలిశారని అర్థం అవుతుంది. డైరెక్ట్గా తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటే విమర్శలొస్తాయని ఫిల్మ్ చాంబర్ ద్వారా పవన్ ఇలా స్కెచ్ వేశారని చెప్పవచ్చు. నేడో, రేపో ఫిల్మ్ చాంబర్ నుంచి కొందరు ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్నారు. పవన్ తన సినిమా కోసం థియేటర్స్పై తనిఖీలు చేయించారని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాకు ఇలా లబ్ధి పొందే ప్లాన్ను ఆయన అమలు చేశారు.

అనుష్క 'ఘాటి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) వెండితెరపై కనిపించి రెండేళ్లవుతోంది. ఈసారి ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఘాటి చిత్రం (Ghaati Movie)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో తాజాగా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ఘాటి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అనుష్క, విక్రమ్ ప్రభు నదిలో సంచులు మోసుకుంటూ వెళుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ కృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.'వేదం'తర్వాత అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కలిసిన చేస్తున్న రెండో చిత్రమిది. అనుష్క, UV క్రియేషన్స్తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం. అనుష్క ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్: ద వైల్డ్ సోర్సరర్ చేస్తోంది. ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అవేవీ బయటకు చెప్పకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచుతోంది. #Ghaati GRAND RELEASE WORLDWIDE ON JULY 11th ❤🔥#GhaatiFromJuly11th⭐ing @iamVikramPrabhu🎥 Directed by the phenomenal @DirKrish🏢 Proudly produced by @UV_Creations & @FirstFrame_Ent🎼 Music on @adityamusic pic.twitter.com/VGM9A3cpkS— Anushka Shetty (@MsAnushkaShetty) June 2, 2025చదవండి: బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా

నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
అద్నాన్ సమీ (Adnan Sami).. పాకిస్తాన్ ఈ సింగర్ స్వదేశాన్ని కాదనుకుని భారత్పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.తల్లి చనిపోయిందని తెలిసినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్ పాక్లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్ అందుకు అంగీకరించినా.. పాక్ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.భారత్ సొంతిల్లుగా ఎలా మారిందంటే?1998లో నేను కొన్ని పాటలు రిలీజ్ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.ఆమె సలహా వల్లే..సింగర్ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్లో రికార్డ్ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్లో వర్కవుట్ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.కెరీర్..అద్నాన్ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్ దాదా ఎంబీబీఎస్), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్ ఆలపించాడు.చదవండి: రీరిలీజ్లో ఆల్టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ!
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

IPL 2025: ఓటమి బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ముంబై ఇంటికి, పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరాయి. జూన్ 3న జరుగనున్న ఫైనల్లో పంజాబ్.. ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.కాగా, ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్లోని సభ్యులందరికీ కూడా 50 శాతం (రూ. 12 లక్షలు) మ్యాచ్ ఫీజ్ జరిమానాగా పడింది.ఈ సీజన్లో రూల్స్ మారడంతో హార్దిక్ సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ సీజన్కు ముందు వరకు ఓ సీజన్లో మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించేవారు. ఇదే మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా జరిమానా పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడంతో రూ.24 లక్షల ఫైన్ విధించారు. పంజాబ్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధిస్తారు) కోత విధించారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు.

ENG VS WI 2nd ODI: చరిత్ర సృష్టించిన ఆదిల్ రషీద్
ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్గా అవతరించాడు. వెస్టిండీస్తో నిన్న (జూన్ 1) జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసిన రషీద్ తన వన్డే వికెట్ల సంఖ్యను 221కి పెంచుకున్నాడు. రషీద్ టీ20ల్లో 131, టెస్ట్ల్లో 60 వికెట్లు తీశాడు. మొత్తం కలిపి రషీద్ తన అంతర్జాతీయ కెరీర్లో 298 ఇన్నింగ్స్ల్లో 412 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మరే స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. నిన్నటి మ్యాచ్లో రషీద్ గ్రేమ్ స్వాన్ను (223 ఇన్నింగ్స్ల్లో 410 వికెట్లు) అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లిష్ స్పిన్నర్గా అవతరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఇంగ్లండ్ స్పిన్నర్లు..ఆదిల్ రషీద్-412 (298 ఇన్నింగ్స్లు)గ్రేమ్ స్వాన్-410 (223)మొయిన్ అలీ-366 (318)అండర్వుడ్-329 (175)జాన్ ఎంబురే-223 (164)ఓవరాల్గా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున 560 ఇన్నింగ్స్ల్లో 991 వికెట్లు తీశాడు (మూడు ఫార్మాట్లు కలిపి). ఆండర్సన్ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ (485 ఇన్నింగ్స్ల్లో 847 వికెట్లు), ఇయాన్ బోథమ్ (283 ఇన్నింగ్స్ల్లో 528 వికెట్లు), డారెన్ గాఫ్ (252 ఇన్నింగ్స్ల్లో 466 వికెట్లు) ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్నారు. ఈ జాబితాలో ఆదిల్ రషీద్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి నలుగురు పేసర్లే కావడం విశేషం.ఇదిలా ఉంటే, నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కీసీ కార్టీ సెంచరీతో (103) చెలరేగడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులు చేసింది.అనంతరం జో రూట్ భారీ సెంచరీతో (166 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి వెస్టిండీస్ను ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవర్లో జూన్ 3న జరుగనుంది.

హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. క్లాసెన్ ఈజీగా మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ కెరీర్ను కొనసాగించి ఉండవచ్చు. మరో విధ్వంసకర బ్యాటర్, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన రావడంతో వారివారి దేశ క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్తో పోలిస్తే క్లాసెన్కు వయసు, ఫామ్ రెండూ ఉన్నాయి. పైగా 2027లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్కప్ జరుగనుంది. క్లాసెన్ ఈ టోర్నీ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించి ఉంటారు. అయితే క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకుని వారికి దుఖాన్ని మిగిల్చాడు. ఈ ఏడాది స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తున్నారు. రోహిత్, కోహ్లి టెస్ట్లకు.. స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్ వన్డేలకు.. తాజాగా క్లాసెన్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లాసెన్.. సౌతాఫ్రికా తరఫున 4 టెస్ట్లు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు (వన్డేల్లో), 16 హాఫ్ సెంచరీల సాయంతో 3245 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా క్లాసెన్ ఐపీఎల్ తదితర లీగ్ల్లో కొనసాగుతాడు. క్లాసెన్ ఇటీవలే ఐపీఎల్లో సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. కేకేఆర్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో క్లాసెన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 (నాటౌట్) పరుగులు చేశాడు. క్లాసెన్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 172.70 స్ట్రయిక్రేట్తో 487 పరుగులు చేశాడు. ఈ సీజన్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్రైజర్స్ యాజమాన్యం క్లాసెన్ను రీటైన్ చేసుకుంది.

ఆసియా కప్ 2025 వాయిదా
జూన్ 6 నుంచి శ్రీలంకలో జరగాల్సిన మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2025 వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం మరియు ఆరోగ్య పరిస్థితులు కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం (జూన్ 2) ప్రకటించింది. టోర్నీని వాయిదా వేయాలని ఆతిథ్య బోర్డు (శ్రీలంక) అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఏసీసీకి లేఖ రాశాడు. ఈ లేఖను పరిగణలోకి తీసుకొని ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని, ఆ ప్రాంతంలో చికున్గున్యా వ్యాప్తి చెందుతుందని సిల్వా తన లేఖలో పేర్కొన్నాడు. టోర్నీ తదుపరి షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వెల్లడించాడు.కాగా, ఏసీసీ మహిళల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో తొలిసారి జరిగింది. హాంగ్కాంగ్ వేదికగా నాడు జరిగిన టోర్నీలో భారత్ ఏ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ ఏను 31 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్, థాయ్లాండ్, మలేసియా జట్లు పాల్గొంటాయి.
బిజినెస్

వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!
రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక గణాంకాలు వెల్లడించింది. రూ.2000 నోట్లు రద్దయి రెండేళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్లో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రోజున చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్ల నుంచి 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. రూ.2000 నోట్ల రద్దు సమయంలో 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకు శాఖల్లో వీటి డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. దాంతో చాలామంది వారి వద్ద ఉన్న నోట్లను సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకున్నారు. అప్పటికీ మార్చుకోలేనివారు ఆ తేదీ తరువాత దేశవ్యాప్తంగా ఆర్బీఐకు చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వీలు కల్పించింది.ఇదీ చదవండి: నెలలో 22,315 యూనిట్లు సరఫరా2023 అక్టోబరు 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు.

నెలలో 22,315 యూనిట్లు సరఫరా
భారత ఆటోమోటివ్ మార్కెట్లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడాకారెన్స్ క్లావిస్కియా లైనప్లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్ గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ఈపీఎఫ్వో UAN యాక్టివేషన్ గడువు పెంపు
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది. ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోసుకునేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది.యూఏఎన్ అంటే..యూఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే 12 అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఆన్లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, నిర్వహించడానికి యూఏఎన్ సహాయపడుతుంది.యూఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలా?ఉద్యోగులు ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఉపయోగించి తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో చూడండి..ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ను సందర్శించండి."ఇంపార్టెంట్ లింక్స్" విభాగం కింద "యాక్టివేట్ యూఏఎన్" పై క్లిక్ చేయండి.యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్కు పర్మిషన్ ఇవ్వడానికి 'అగ్రీ' క్లిక్ చేయండి.మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ రావడానికి "గెట్ ఆథరైజేషన్ పిన్" పై క్లిక్ చేయండి.యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయండి. మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పాస్వర్డ్ వస్తుంది.

పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడా
ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు సీజన్ నడుస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్కు గడువు సాధారణంగా జూలై 31 వరకూ ఉండగా ఈసారికి ఆ గడువును సెప్టెంబర్ 15కు పెంచింది ప్రభుత్వం. ట్యాక్స్ ఫైలింగ్ అంటేనే అందరి దృష్టి ట్యాక్స్ డిడక్షన్లపైనే ఉంటుంది. అయితే కొంతమంది పన్ను ఆదా కోసం తప్పుడు ట్యాక్స్ డిడక్షన్లతో మోసానికి పాల్పడుతున్నారు.ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చేసిన దర్యాప్తులో 90,000 మందికి పైగా వేతన జీవులు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది దేశ పన్ను ఖజానాకు రూ .1,070 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఫైలింగ్ ప్రక్రియను కఠినతరం చేసింది. మోసపూరిత పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయడం ఇప్పుడు అంత సులువు కాదు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్న్ యుటిలిటీలు ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని కీలక విభాగాలలో మినహాయింపులకు బలమైన రుజువును కోరుతున్నాయి.ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులను కవర్ చేసే సెక్షన్ 80సీ కింద చేసే క్లెయిమ్లలో పాలసీ నంబర్లు లేదా డాక్యుమెంట్ ఐడీలు ఉండాలి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం, పన్ను చెల్లింపుదారులు బీమా కంపెనీ పేరు పాలసీ నంబర్ను పేర్కొనాల్సి ఉంటుంది. రుణాలపై కోరే మినహాయింపులనూ ప్రభుత్వ కఠినతరం చేసింది. సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ కింద క్లయిమ్ చేసే ఎడ్యుకేషన్, హోమ్ లోన్ బెనిఫిట్స్ కు బ్యాంకుల పేర్లు, లోన్ అకౌంట్ నంబర్లు, మంజూరు తేదీలతో సహా సవివరంగా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెల్లడించాలి.200 శాతం జరిమానాట్యాక్స్ ఫైలర్లు చేసిన క్లెయిమ్లను క్రాస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్) ను ఉపయోగించుకుంటుంది. నకిలీ క్లెయిమ్లను అరికట్టడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా సమ్మతిని పెంచడం ఈ కఠిన నిబంధనల లక్ష్యం. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తాము చేసే ప్రతి మినహాయింపునకు సరైన డాక్యుమెంటేషన్తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే పన్ను బకాయిపై 200 శాతం జరిమానాను 24 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెక్షన్ 276సీ కింద దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ

Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్లాండ్కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్లాండ్లోని ఫుకెట్లో. మా ఊరూ హైదరాబాద్లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్లో డిటెక్ట్ అయిన ట్యూమర్తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్తో బ్రెస్ట్క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..)

పులిలా కనిపించే పిల్లి..!
ఈ పిల్లి వాక్ చేస్తే ఫర్నిచర్ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్చిప్గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది. పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. దానికున్న భారీ ఆకారమే జ్యూస్ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్ బ్రాండ్ ట్రీ ట్స్తో స్పెషల్ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. జ్యూస్ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్లో లైక్స్ వస్తాయి. జ్యూస్ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..)
ఫొటోలు
అంతర్జాతీయం

పేగు క్యాన్సర్ బాధితులకు వ్యాయామంతో మేలు
వాషింగ్టన్: నిత్యం వ్యాయామంతో పేగు క్యాన్సర్ బాధితులకు ఎంతో మేలు కలుగుతున్నట్లు తాజా అధ్యయనంతో తేలింది. కనీసం మూడేళ్లపాటు వ్యాయామం చేస్తే వారు వారు జీవించే అవకాశాలు చాలావరకు మెరుగవుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా వ్యాయమం చేసేవారికి ఈ క్యాన్సర్ సోకే పరిస్థితి ఉండదని అంటున్నారు. పేగు క్యాన్సర్కు చికిత్స పొందుతున్నవారు కసరత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంగ్ల్లండ్, కెనడా, ఆ్రస్టేలియాలో ఈ అధ్యయనం నిర్వహించారు. 889 మంది బాధితులను పరిశీలించారు. వీరంతా పేగు క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ చికిత్స పొందినవారే. సగం మందికి వ్యాయామాలు చేయాలని సూచించారు. తగిన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. కానీ, వారు పెడచెవిన పెట్టారు. మిగిలిన సగం మందికి అధ్యయనకర్తలు కోచ్లను ఏర్పాటుచేశారు. కచ్చితంగా వ్యాయామాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నడక, ఈత వంటి ఎక్సర్సైజ్లతో శరీరాలను బాగా కదిలించినవారు చురుగ్గా మారడంతోపాటు పేగు క్యాన్సర్ ప్రభావం తగ్గిపోయినట్లు తేలింది. వ్యాయామం చేయనివారితో పోలిస్తే వీరి జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది.

అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లాస్ ఏంజెలెస్ నగరంలోని బాల్డి్వన్ పార్క్లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైఫిల్తో కాల్పులకు దిగాడు. ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మరో ఘటన..నార్త్ కరోలినాలోని కటౌబా కౌంటీలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న మరో కాల్పుల ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.

గాజాలో అన్నార్తులపైకి కాల్పులు 31 మంది మృతి
రఫా (గాజా స్ట్రిప్): గాజాలో మాటలకందని ఘోరం చోటుచేసుకుంది. అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఐరాస సాయాన్ని కాదని అమెరికా దన్నుతో గాజా లో ఇజ్రాయెల్ స్వయంగా సహాయ కేంద్రాలను మొదలుపెట్టడం తెలిసిందే. వాటినుంచి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. ఆ కాల్పుల్లో 31 మంది పాలస్తీనావాసులు బలయ్యారు. కనీసం 170 మందికి పైగానే గాయపడ్డట్టు హమాస్ వర్గాలు వివరించాయి. సహాయ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగినట్టు గాజా ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా దుమారం రేగుతుండటంతో ఇజ్రాయెల్ తీవ్ర ఇరకాటంలో పడింది. అలాంటి ఉదంతమేదీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని నెతన్యాహు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది.

చెట్టు రంగు మారిందో... అగ్నిపర్వతం పేలిందే!
అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్ధలవుతాయో కచ్చితంగా గుర్తించగల పరిజ్ఞానం ఇప్పటిదాకా లేదు. ఇది తరచూ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. అగ్నిపర్వతాల విస్ఫోటాన్ని ముందుగానే కనిపెట్టగల విధానాన్ని తాజాగా ఆవిష్కరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లూ చేమల ఆధారంగా అదెప్పుడు పేలేదీ ముందుగానే గుర్తించవచ్చని వారంటున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (మాగ్మా) వెలువడుతుందన్నది తెలిసిందే. మాగ్మా కంటే ముందే కార్బన్ డయాక్సైడ్ అధిక మోతాదుల్లో వెలువడుతుంది. దాన్ని పీల్చే చెట్ల ఆకుల రంగు మారిపోతుంది. అవి ముదురు ఆకుపచ్చ రంగును సంతరించుకుంటాయి. ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అంతేగాక పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భూమి ఎత్తు హఠాత్తుగా పెరుగుతుంది. భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతాలేనని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహాలతో విశ్లేషణ అగ్నిపర్వతాలపై కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను గుర్తించాలంటే సైంటిస్టులు ఆ పర్వతాలపైకి చేరుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇది చాలాసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇకపై దూరమైనట్లే. ఎందుకంటే చెట్ల ఆకుల రంగు ద్వారా అగ్నిపర్వతాల పేలుడును కచ్చితంగా గుర్తించగలమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ రకమైన విశ్లేషణకు ఎన్నో రకాల శాటిటైట్లు అందుబాటులో ఉన్నాయని టెక్సస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో వోల్కనాలజీ డాక్టోరల్ విద్యార్థి నికోల్ గిన్ చెప్పారు. ఇటలీలో సిసిలీ తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంతోపాటు సమీపంలోని చెట్టూచేమల చిత్రాలను లాండ్శాట్ 8, టెరా శాటిలైట్, సెంటినెల్–2తోపాటు ఇతర ఎర్త్–అబ్జర్వింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. వాటిని సమగ్రంగా విశ్లేషించారు. అక్కడ అధిక కార్బన్ డయాక్సైడ్తో చెట్ల ఆకుల రంగు మారినట్లు కనిపెట్టారు. ఈ అగ్నిపర్వతం నుంచి మాగ్మా ప్రవాహం మొదలైంది.→ ప్రపంచ జనాభాలో 10 శాతం అగ్నిపర్వతాలకు కొన్ని మైళ్ల దూరంలోనే నివసిస్తోంది.→ అగ్నిపర్వతాల పేలుడు గురించి ముందే తెలియక చాలా సందర్భాల్లో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి.→ చెట్ల ఆకుల రంగు ద్వారా పేలుడును సామాన్యులు సైతం ముందే కనిపెట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..
గౌహతి: అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొదటి రోజున రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన సిల్చార్(Silchar)లో 24 గంటల్లో ఏకంగా 415.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. జూన్ 1న సిల్చార్లో కురిసిన వర్షపాతం 132 ఏళ్ల కిత్రం నాటి 290.3 మి.మీ వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఎగువకు వీస్తున్న గాలి ప్రభావం, అల్ప స్థాయి ద్రోణుల కలయిక ఈ అస్థిర వాతావరణానికి కారణంగా నిలుస్తోంది. 2022లో సిల్చార్ వరదల్లో చిక్కుకుంది. నాడు పట్టణంలోని 90 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. కాగా గత మూడు రోజుల్లో అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది మృతిచెందారు.గడచిన ఐదు రోజుల్లో మేఘాలయ అంతటా భారీ వర్షపాతం నమోదైంది. మేఘాలయలోని 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. మణిపూర్లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన వరదల కారణంగా 19 వేల మందికి పైగా ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: ‘స్పైడర్స్ వెబ్’ సక్సెస్: దాడుల వివరాలు షేర్ చేసిన జెలెన్స్కీ

దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు
న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం

బ్రిటన్ గాట్ టాలెంట్ పోటీలో రన్నరప్గా అసోం చిన్నారి
గువాహటి: అసోంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా చెత్రీ ప్రఖ్యాత ‘బ్రిటన్ గాట్ టాలెంట్ (బీజీటీ)’ రియాలిటీ డ్యాన్స్ పోటీల్లో రెండో రన్నరప్గా నిలిచింది. కొండప్రాంత కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బాలిక ప్రపంచ వేదికపై సత్తా చాటడం విశేషం. ఈమె ప్రతిభను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మెచ్చుకున్నారు. ఆమె ప్రదర్శన బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్ నది వరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిందని, తమను గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. శనివారం జరిగిన ఫైనల్స్లో బ్రిటిష్ మెజీíÙయన్ హ్యారీ మౌల్డింగ్ విజేతగా నిలిచాడు. ఎల్ఈడీ డ్యాన్స్ గ్రూప్ రెండో స్థానంలో నిలిచింది. బీజీటీ ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలు బినితాయేనని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బినితా స్వగ్రామం పేరు టల్బాలిజన్. తండ్రి అమర్ చెత్రీ ఊళ్లో చిన్న కోళ్లఫారం నడుపుతుంటారు. బినితా ప్రిపరేషన్ కోసం కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ రూ.5 లక్షలు సాయంగా అందజేసింది.

270 ఏళ్ల తర్వాత... మహా కుంభాభిషేకం
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం 270 సంవత్సరాల తర్వాత అరుదైన భిమహా కుంభాభిషేక వేడుకలకు సిద్ధమైంది. పురాతనమైన ఈ ఆలయం పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం ఆలయ పవిత్రను ప్రతిష్ఠాపించడం, ఆధ్యాతి్మక శక్తిని బలోపేతం చేయడమే అని అధికారులు వివరించారు. ఇలాంటి పవిత్ర క్రతువులు 270 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు.
ఎన్ఆర్ఐ

పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో
తూర్పు గోదావరి జిల్లా: మరో మూడు వారాల్లో ఆ ఇంట వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఆనంద డోలికల్లో తేలియాడాల్సిన బంధుగణమంతా.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబోయే పెళ్లి కొడుకుగా రావాల్సిన కుమారుడు.. నిర్జీవంగా ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతులేకుండా పోయింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న మామిడికుదురు గ్రామానికి చెందిన ఎండీ తురాబ్ అలీ(28) ఈ నెల 17న గుండెపోటుతో మరణించారు. వచ్చే నెల 15న అతని వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులుండగా, ఈ విషాద వార్త ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వాస్తవానికి తురాబ్ అలీ సోమవారం ఇంటికి రావాల్సి ఉంది. యాదృచ్చికంగా అదే రోజు అతని మృతదేహం ఇంటికి చేరిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అతని తండ్రి రిజ్వానుల్ హసన్ హైదరాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, తురాబ్ అలీ పెద్దవాడు. తురాబ్ అలీ తాతయ్య తురాబ్ హుస్సేన్ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పేరునే తురాబ్ అలీకి తల్లిదండ్రులు పెట్టారు. పెళ్లి ఏర్పాట్లలో.. మరికొద్ది రోజుల్లో తురాబ్ అలీ వివాహం జరగాల్సి ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మంటపం బుక్ చేసి, పెళ్లికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంచడంలో బిజీగా ఉన్నారు. ఈలోగా తురాబ్ అలీ మరణవార్త చేరడంతో.. పెళ్లింట కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు నడుమ మామిడికుదురు ఖబర్స్థాన్లో తురాబ్ అలీ అంత్యక్రియలు జరిగాయి.

“కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ” విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ““కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ”అనే అంశంపై జరిపిన 80వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీ వేత్తలలో కొంతమంది ఈ రోజు ఒకే వేదికమీద పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ, శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అసంఖ్యాకంగాఉన్న భారతీయ భాషలలో, 24 భాషలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రదానంచేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న 8 మంది తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, వారు పురస్కారం పొందిన రచనలపై స్వీయవిశ్లేషణ చెయ్యడం చాలా వినూత్నంగా ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం భారతీయ పౌరసత్వం కల్గినవారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులు. కాని పద్మ పురస్కారాల లాగా, భారతీయ పౌరసత్వంతో సంభందం లేకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయమూలాలున్న రచయితలను కూడా ఈ కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారాలకు అర్హులను చేస్తే, మరిన్ని వైవిధ్య భరితమైన రచనలు పోటీలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని పరిశీలించాలని లక్షలాదిమంది ప్రవాసభారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీకి డా. ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.గత 12 సంవత్సరాలగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న డా. కృతివెంటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ “కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోల్చిచూస్తే వాసి లోను, రాశిలోనూ సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయన్నారు. అయితే మన తెలుగు రచనలు ఎక్కువగా ఆంగ్లం, హిందీ తదితర బాషలలోకి ఎక్కువగా అనువాదం కావలసిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరంనుండి రచయితలు ఎవ్వరికివారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలను పంపుకోవచ్చు అన్నారు.” ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులు గా పాల్గొన్న ...డా. గోరటి వెంకన్న, “వల్లంకి తాళం” కవిత, 2021-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. మధురాంతకం నరేంద్ర, “మనోధర్మ పరాగం” నవల, 2022-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, “రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు”, 2023-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), Galib-The Man, The Times, in English by Mr. Pavan Varma; “గాలిబ్ నాటి కాలం” తెలుగు అనువాదం-2023-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారగ్రహీత; పెనుగొండ లక్ష్మీనారాయణ, “దీపిక” రచనకు-2024-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, “మాయా లోకం” నవల, 2024-కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారగ్రహీత, డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడియా నవల “దాడీ బుధా” ను “ఈతచెట్టు దేవుడు” గా తెలుగులోకి అనువాదం- 2024-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారవిజేతలు తమ పురస్కార రచనల విశేషాలను ఆసక్తిగా పంచుకున్నారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును

థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) విదేశీ నీళ్లపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినం ‘తెప్పోత్సవాన్ని’ (దివ్య తెప్ప ఉత్సవం) ఘనంగా, భక్తిశ్రద్ధలతో టెమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద నిర్వహించింది. యుకె , యూరప్లో హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయి అని నిర్వాహకులు ప్రకటించారు. వేద పారాయణం, భజనలు, సమూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. శ్రద్ధతో, సమగ్రంగా రూపొందించి ఈ ఉత్సవం భక్తి, సమాజ చైతన్యం, దైవానుగ్రహానికి అద్దం పట్టింది.ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి SVBTCC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “దీపమైన భక్తితో నడిచిన కల నౌకై తేలింది — సేవతో నడిచింది, స్వామి అనుగ్రహంతో సాగింది. ఇది ఎంతోమందికి అరుదైన అనుభూతి - దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అనునిత్య సంప్రదాయాన్ని, యుకె భూమిలో నూతనంగా దర్శించుకోవడం… హృదయాలను నింపింది, ఆత్మలను ఉల్లాసపరిచింది.” అని SVBTCC ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్ సర్కార్కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే, సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. ట్రంప్ తాజా సంచలన నిర్ణయం అనేక మంది విదేశీ విద్యార్థులకు దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది.ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుహార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) హార్వర్డ్పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని ప్రకటించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. అలాగే ‘హార్వర్డ్లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’ అనిఆమె పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ చర్య చట్టబద్ధమైనదేనా?అమెరికా చట్టాల ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో SEVP జాబితా నుండి కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్ SEVP సర్టిఫికేషన్ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.
క్రైమ్

వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు.

సైబర్ మోసాలు పదిరకాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా వివరాలు చెప్పించుకొని మరీ బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. అవగాహనా లేమి, అత్యాశలే సైబర్ మోసాలకు ప్రధాన కారణాలు. మన చుట్టూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా వాటిపై చాలా మంది ధ్యాస పెట్టడం లేదు. మాకు అంతా తెలుసులే అనే అతిధోరణితో మోసపోతున్నారు. సైబర్ మోసాలపై నమోదవుతున్న కేసులను గమనిస్తే ప్రధానంగా పది రకాల మోసాలే ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ భద్రతాధికారులు చెబుతున్నారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 1. పెట్టుబడుల పేరిట స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. తక్కు వ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ తో ఎంతో మంది అమాయకులు సులువుగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో 30–40% లాభాలంటూ సైబర్ నేరగాళ్లు ఊదరగొడుతున్నారు. ఈ ప్రకటనలకు స్పందించే వారికి వాట్సాప్లో లింక్లు పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్ లలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. లాభాలు వస్తున్నట్లు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు. నగదు ఉపసంహరణకు ప్రయతి్నంచినప్పు డు డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. అందు వల్ల ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలి. 2. లైక్లు.. షేర్ల పేరిట.. సోషల్ మీడియా పోస్టులను లైక్, షేర్ చేయడం వంటి సులువైన టాస్క్లతో డబ్బులు సంపాదించండంటూ ప్రకటనలిస్తూ సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. తొలుత చిన్నచిన్న మొత్తాలు రాబడి రూపంలో చూపుతారు. అవతలి వ్యక్తి నమ్మకం పెరిగాక అసలు మోసానికి తెరతీస్తున్నారు. ఫొటోలు, వీడియోలకు లైక్, షేర్ చేస్తే అవతలి వ్యక్తులు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ మరవొద్దు. 3. క్రెడిట్కార్డు మోసాలు స్కామర్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ల మాదిరిగా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సీవీవీ, క్రెడిట్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డబ్బులు కొల్లగొడతారని గుర్తుపెట్టుకోండి.4. తప్పుగా డబ్బులు పడ్డాయంటూ.. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు పంపుతారు. ఆ తర్వాత సైబర్ మోస గా ళ్లు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా లో పొరపాటున జమ అయిన మొత్తాన్ని తిరిగి పంపాలంటూ డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సమ యాల్లో బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకుండా స్పందించవద్దు.5. కేవైసీ అప్డేట్ పేరిట.. మీ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు చెబుతూ ఫోన్ చేస్తారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కొన్ని లింక్లు పంపి అందులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వారు అడిగిన వివరాలు ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టేనని గుర్తుపెట్టుకోండి.6. కస్టమ్స్ అధికారులమంటూ.. మీ బంధువులు, స్నేహితులు విదేశాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారని.. అది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని.. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఎస్ఎంఎస్లు లేదా ఫోన్లు చేస్తారు. బహుమతిపై ఆశతో ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు పంపి మోసపోతున్నారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని.. మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇతరులకు ఈ విషయం చెబితే మీకే చిక్కులంటూ భయాందోళనలకు గురిచేసి అందినకాడికి ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్కాల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త.7. ఐటీ చెల్లింపులు, రిటర్న్ల పేరు చెప్పి.. ఆదాయపు పన్ను చెల్లింపుల పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ నకిలీ లోగోతో సందేశాలు పంపుతారు. పన్ను చెల్లింపుదారులకు తాము ఐటీ అధికారులమని చెప్పి.. రీఫండ్ను వేగవంతం చేయడానికి బ్యాంకు వివరాలు ఇవ్వాలంటూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనవిగా గుర్తించాలి. 8. ట్రాయ్ పేరిట.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల పేరిట ఇటీవల ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు, ఇతర నేరగాళ్ల ఫోన్ లిస్టులో మీ నంబర్ ఉందని బెదిరిస్తారు. మీ నంబర్ను ఆ లిస్టులోంచి తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబడతారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి అందినకాడికి డబ్బులు దండుకుంటారు. ట్రాయ్ అధికారులు ఈ తరహా ఫోన్కాల్స్ చేయరని గుర్తుంచుకోవాలి. 9. డిజిటల్ అరెస్టులు.. ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్టులు ప్రధానమైనవి. సీబీఐ, పోలీసు అధికారులమని వాట్సాప్లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్ డీపీలో పోలీస్ యూనిఫాంతో ఉన్న ఫొటోలు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు పోలీస్ యూనిఫాంలో ఉంటూ మీ కుమారుడు అత్యాచారం, హత్య కేసులో చిక్కినందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తారు. ఈ విషయాలు ఎవరితో పంచుకోవద్దని, బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే తాము చెప్పిన నంబర్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు.10. ఏఐతో వలవేసి.. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సైతం మోసాలకు వాడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పంచుకొనే ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని.. ఏఐ సాయంతో వారి గొంతును అనుకరిస్తూ ఆడియోలు తయారు చేస్తారు. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి అత్యవసరమనో లేదా ఆసుపత్రిలో ఉన్నామనో చెబుతూ వెంటనే డబ్బులు పంపాలని అభ్యర్థిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు.