Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Royal Challengers Bangalore beat Punjab Kings by 6 runs in IPL final1
కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా

ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్‌సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్‌ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్‌లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్‌సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్‌ నమ్‌దే’ (ఈ ఏడాది కప్‌ మనదే) జోక్‌గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్‌సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్‌ గర్వపడే క్షణం వచ్చేసింది...తమ టీమ్‌లోని 18వ నంబర్‌ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. లీగ్‌ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరి తొలి క్వాలిఫయర్‌లోనే గెలుపుతో ఫైనల్‌ చేరిన టీమ్‌ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్‌లను అధిగమించి రాయల్‌గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్‌సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్‌ కోహ్లి కెరీర్‌లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీ చరిత్రలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్‌ మ్యాచ్‌లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్‌లో ‘ఈ సాల కప్‌ నమ్‌దు’ (ఈ ఏడాది కప్‌ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్‌ పాటీదార్‌ సారథ్యంలోని ఆర్‌సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్‌ ఇన్‌గ్లిస్‌ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్‌ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు రన్నరప్‌ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్‌ చేరిన పంజాబ్‌ జట్టు తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి. సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన... ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్‌ సాల్ట్‌ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్‌ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. మయాంక్‌ అగర్వాల్‌ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్‌ (15 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్‌ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్‌లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్ సింగ్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్‌సీబీ 3 వికెట్లు కోల్పోయింది. టపటపా... సీజన్‌ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (22 బంతుల్లో 26; 2 సిక్స్‌లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) పేలవ షాట్‌కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్‌లో దూకుడు ప్రదర్శించిన ఇన్‌గ్లిస్‌ను కృనాల్‌ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్‌ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్‌ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అయ్యర్‌ (బి) జేమీసన్‌ 16; కోహ్లి (సి అండ్‌ బి) అజ్మతుల్లా 43; మయాంక్‌ అగర్వాల్‌ (సి) అర్ష్ దీప్ (బి) చహల్‌ 24; పాటీదార్‌ (ఎల్బీ) (బి) జేమీసన్‌ 26; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) జేమీసన్‌ 25; జితేశ్‌ శర్మ (బి) వైశాక్‌ 24; షెఫర్డ్‌ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 17; కృనాల్‌ (సి) అయ్యర్‌ (బి) అర్ష్ దీప్ 4; భువనేశ్వర్‌ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్ 1; యశ్‌ దయాళ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్‌: అర్ష్ దీప్ సింగ్‌ 4–0–40–3, జేమీసన్‌ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్‌ 4–0–30–1, యుజువేంద్ర చహల్‌ 4–0–37–1. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్‌ (బి) హాజల్‌వుడ్‌ 24; ప్రభ్‌సిమ్రన్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 26; ఇన్‌గ్లిస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కృనాల్‌ 39; అయ్యర్‌ (సి) జితేశ్‌ (బి) షెఫర్డ్‌ 1; నేహల్‌ వధేరా (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 15; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 61; స్టొయినిస్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) భువనేశ్వర్‌ 6; అజ్మతుల్లా (సి) (సబ్‌) భందగే (బి) యశ్‌ దయాళ్‌ 1; జేమీసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–38–2, యశ్‌ దయాళ్‌ 3–0–18–1, హాజల్‌వుడ్‌ 4–0–54–1, కృనాల్‌ పాండ్యా 4–0–17–2, సుయాశ్‌ శర్మ 2–0–19–0, షెఫర్డ్‌ 3–0–30–1. 6 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్‌గా రజత్‌ పాటీదార్‌ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్‌ కింగ్స్‌; 5 సార్లు), రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌; 5 సార్లు), గౌతమ్‌ గంభీర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; 2 సార్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌; ఒకసారి), హార్దిక్‌ పాండ్యా (గుజరాత్‌ టైటాన్స్‌; ఒకసారి) ఈ ఘనత సాధించారు.10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో 10 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్‌ చేసిన జట్టుకు టైటిల్‌ లభించింది. 9 ఐపీఎల్‌–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్‌ సీజన్‌లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.2 ముంబై ఇండియన్స్‌ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)తోపాటు ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ సాధించిన రెండో జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ గెలిచింది.1 ఐపీఎల్‌ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్‌ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Chandrababu Naidu deceiving AP people with false promises2
ప్రజలకే వెన్నుపోటు

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్‌ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదంతొక్కుతున్నాయి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఒనగూరే ప్రయోజనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో 143 హామీ­లు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి, గోబెల్స్‌ సిగ్గుతో చచ్చిపో­యేలా అబద్ధాలు వల్లె వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ‘నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న’ సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు.. అప్పుల్లో రికార్డులు సృష్టించినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తుంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్‌ అంబాసిడర్‌ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటూనే ఉన్నారు.తల్లికి వందనం పేరుతో అమ్మలకు మోసం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇచ్చిన పాపాన పోలేదు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.మహిళలకు ద్రోహం ⇒ ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా ఆడబిడ్డ నిధి ఊసే లేదు.. ⇒ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఏడాది అయినా ఉచిత బస్సు జాడే లేదు. ⇒ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మబలికారు. గతేడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్‌తో సరిపెట్టి, మహిళలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్‌ మాటే లేదు..అన్నదాతకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకూ రూ.20 వేలు అందించలేదు. తొలి ఏడాది రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన రూ.10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది సీజన్‌ ప్రారంభమైనా పైసా పెట్టుబడి సాయం అందించకుండా నిలువునా ముంచేశారు. ఐదేళ్లుగా పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి వారిపై బీమా భారం మోపారు.ఖరీఫ్‌ 23 సీజన్‌కు సంబంధించి ప్రీమియం బకాయిలు చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల మేర పంటల బీమా పరిహారం రైతులకు దక్కకుండా చేశారు. కరువు బకాయిలతో సహా గడిచిన ఏడాదిలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 8.94 లక్షల మంది రైతులకు రూ.554 కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచారు. ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాటు పాడి రైతులకు అండగా నిలిచిన అమూల్‌ ప్రాజెక్టును అటకెక్కించి.. కార్పొరేట్, ప్రైవేటు డెయిరీల దోపిడీ బారిన పడేలా చేశారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతకు టోపీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని– ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్న హామీ ఒకటి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో నిరుద్యోగుల సంక్షేమం కోసం ఒక్కపైసా కూడా విదిల్చలేదు. ఏపీలో గతేడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా, నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు అయితే ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండి చెయ్యి చూపించింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చే సరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు చొప్పున ఏడాదికి రూ.61,200 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి వ్యయం అవుతుంది. ఇచ్చిన హామీలో భాగంగా ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు నిరుద్యోగుల కోసమే వెచ్చించాలి. కానీ, చంద్రబాబు చాణిక్యంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ దగాకు గురయ్యారు.జాబ్‌ క్యాలెండర్‌ హుష్‌కాకి..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగులను నియమించారు. 2019–24 మధ్య శాశ్వత, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి కొలువులిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం.రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్‌ కాదు మేము’ అని చంద్రబాబు, లోకేష్‌ బీరాలు పోయారు. జనవరి పోయి 5 నెలలు దాటినా జాబ్‌ కేలండర్‌ దేవుడెరుగు.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచి్చన గ్రూప్‌–1, 2 మెయిన్స్‌ను పలుసార్లు వాయిదా వేసి, అభ్యర్థులను నిలువునా మోసం చేసి గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహించారు. సంస్కరణల పేరుతో గ్రూప్‌–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపే నిర్ణయం తీసుకుని గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేసేందుకు ప్రణాళిక వేశారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ దాదాపు వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతించింది. వాటికి నోటిఫి­కేç­Ùన్లు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బాబొచ్చారు.. జాబేదీ? బాబు వస్తే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఏడాదయినా ఒక్కరికీ ఉద్యోగం వచి్చంది లేదు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు.బట్టబయలైన దుష్ప్రచారంగుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారకముందే తలుపుతట్టి వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్‌ అందించడం దగ్గరనుంచి అన్ని ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా సమకూర్చారు.పరిపాలన సంస్కరణల్లో ఇదో విప్లవమనే ప్రశంసలు పొందారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్‌ విషం చిమ్మారు. 2023 అక్టోబరు 7న రెండో విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు రోడ్‌ షోలో.. 33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ పవన్‌ హేయంగా మాట్లాడారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరు 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమేనని.. 46 మంది బాధితులని వెల్లడించడం గమనార్హం. ఇసుక దోపిడీ.. అడ్డగోలు తవ్వకాలువైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేసింది. దీంతో రూ.750 కోట్ల ఆదాయం వచి్చంది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ పెట్టింది. కూటమి ప్రభుత్వం వచి్చన కొద్ది రోజుల్లోనే 80 లక్షల టన్నుల ఇసుకను పచ్చ మాఫియా దోచేసి, జేబులు నింపుకొంది. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తవ్వేసి.. అధిక ధరలకు అమ్ముకుంటూ భారీఎత్తున దోచేస్తోంది. లిక్కర్‌ నుంచి సిలికా, క్వార్ట్జ్‌ వరకు వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.రెడ్‌బుక్‌తో టెర్రర్‌ సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు.. పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతును నొక్కేందుకు రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి వెంటాడి, వేటాడి హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 390 మందిని చంపేశారు.హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి.. 500 మంది నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 79 మందిని జైలు పాల్జేశారు. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. 63 అక్రమ కేసులు నమోదు చేసి.. 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి.. ఇద్దరిని జైలుపాల్జేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.మద్యం మాఫియా బయటకు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతిపెట్టిన ప్రైవేటు మద్యం సిండికేట్‌ భూతానికి చంద్రబాబు సర్కారు మళ్లీ ఊపిరిపోసి వదిలింది. మద్యం ఏరులై పారించడం ద్వారా భారీ దోపిడీకి టీడీపీ మద్యం సిండికేట్‌ పన్నాగం పన్నింది. ప్రైవేటు దుకాణాలను తిరిగి తెచి్చంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా టీడీపీ గూండాలతో పాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 3,396 మద్యం దుకాణాల పరిధిలో దాదాపు 55 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది.ఎంఆర్‌పీ కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అన్ని దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు వచి్చన రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని 2025–26లో రూ.35 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కనీసం రూ.10 వేల కోట్లు చొప్పున మద్యం ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2028–29 నాటికి ఏకంగా రూ.75 వేల కోట్లకు చేరాలన్న ఉద్దేశంలో ఉంది.రాజధాని నిర్మాణంలో అడ్డగోలు దోపిడీ..తాను, తన సన్నిహితులు, బినామీలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరలకే కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి అధిక వడ్డీలకు రూ.31 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. మరో రూ.21 వేల కోట్లు అప్పునకు సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రూ.77 వేల కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్‌ ఇచ్చారు.అధిక వడ్డీలకు తెచి్చన నిధులతో.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ముట్టజెప్పి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. దేశంలో ఎన్‌హెచ్‌ఏఐ కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున జాతీయ రహదారులను నిరి్మస్తుంటే.. రాజధానిలో మాత్రం కి.మీ.కు రూ.66 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేశారు. చదరపు అడుగు రూ.1,800 నుంచి రూ.2 వేల లోపు వ్యయంతో భవనాలను నిరి్మంచవచ్చు. కానీ.. ఏకంగా చదరపు అడుగు రూ.పదివేల చొప్పున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో అధిక వడ్డీలకు తెచి్చన అప్పులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. పప్పులు బెల్లాల్లా.. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు పప్పులు, బెల్లాల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం పంచిపెడుతోంది. ఊరూపేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉర్సా.. మంత్రి నారా లోకేశ్‌ సన్నిహితుడిది. ఇక లులూ సంస్థకు మాల్‌ నిర్మాణానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండడం భూదోపిడీకి పరాకాష్ట. మొదటి సంతకమే దగా.. దగాఅధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సీఎం హోదాలో 16,437 పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గత ఏడాది డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా దాదాపు 11 నెలలు కాలయాపన చేసి మార్చి చివరి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులోనూ అనేక కొర్రీలు పెట్టారు. 50 శాతం అర్హత మార్కుల నిబంధన తెచ్చి అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్‌ అభ్యర్థులు 3 లక్షల మందిని డీఎస్సీకి దూరం చేశారు. టెట్‌ ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు.ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటరీ్మడియట్‌లో, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసినవారికి ఈ నిబంధన వర్తించదని 2019లో కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల ఉసురు తీసింది.తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడ్‌ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)లో రిజర్వుడ్‌ అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలు ఇచి్చంది. జనరల్‌ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 50 శాతంగా అలాగే ఉంచింది. జనరల్‌ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆ మేరకు తగ్గించకపోవడం గమనార్హం.పాలనలో అట్టర్‌ ప్లాప్‌.. డైవర్షన్‌ పాలిటిక్స్‌ సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగుతున్నారు. కూటమి వచి్చన వెంటనే పచ్చమూకలు.. వెంటాడి, వేటాడి 36 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చంపేశాయి. 300 మంది నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.ఈ దారుణాన్ని దేశానికి చాటిచెప్పేందుకు జూలై 24న ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ ధర్నాకు దిగారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులంటూ చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగారు. కృష్ణా, బుడమేరు వరద నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో విజయవాడను వరద చుట్టుముట్టి 50 మంది పైగా బలితీసుకుంది. దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు పడవలతో గేట్లను ఢీకొట్టే కుట్ర చేశారని ఆరోపించారు. వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు. ఇంటింటికీ కరెంట్‌ షాక్‌ కరెంటు చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని గెలిచాక.. కరెంటు చార్జీలను పెంచేసి.. ఇంటింటికీ కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి.ఇంటింటికీ రేషన్‌ రద్దు.. మద్యం సరఫరా ఇంటి వద్దకే రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడంతో 20 వేల మంది రోడ్డున పడ్డారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రేషన్‌ బియ్యం, సరుకులు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్‌ దుకాణం వద్ద గంటల కొద్దీ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే బెల్ట్‌ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.వలంటీర్లపై సమ్మెట దెబ్బ తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.పది వేల వేతనం ఇస్తామని పవన్‌ కళ్యాణ్‌ సైతం వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసి వారిని నట్టేట ముంచేశారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ఫ్రచారం చేశారు. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం తప్పుడు కథనాలను వండివార్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్‌ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు.చివరకు గతేడాది నవంబర్‌ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రూ.7,21,918 కోట్లే. ఈ లెక్కన 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు మాత్రమే. ఇందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం సంపద సృష్టించి.. వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నమ్మలికారు. కానీ.. సంపద సృష్టి మాటలకే పరిమితమైంది. సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన ప్రజలనుద్దేశించి.. సంపద సృష్టించడం ఎలాగో తన చెవిలో చెప్పాలంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్రాన్ని 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి వైఎస్‌ జగన్‌ ప్రగతిపథంలో నిలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు.లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిరాణాన్ని వైఎస్‌ జగన్‌ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్‌ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్‌ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై యూటర్న్‌ ప్రజల భూములు లాక్కునేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తెచ్చారని, దస్తావేజులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని దారుణమైన అబద్ధాలతో కూటమి నేతలు ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. 13 వేల గ్రామాలకుగాను 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. ప్రతి రైతుకు ఒక యూనిక్‌ ఐడీ నెంబర్‌ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్‌ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్‌ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ కుట్రలో ఈ చట్టం బలైపో­యింది. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయత్నించారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్‌ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్‌ తీసుకుని కొనసాగిస్తున్నారు.

Judge Cash Row: Impeachment Motion Against Justice Yashwant Varma Details3
Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు బిగ్‌ షాక్‌!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అధికారిక భవనం ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఘటనలో అప్రతిష్టను మూటగట్టుకున్న అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ(Justice Yashwant Varma)ను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ సమవేశాల్లో ఈమేరకు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతల సమ్మతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు త్వరలో సమావేశంకానున్నారని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ముగ్గురు జడ్జీల విచారణ కమిటీ సైతం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు వ్యతిరేకంగా నివేదికను రూపొందించిన నేపథ్యంలో ప్రభుత్వం అభిశంసనకు(Impeachment) రంగం సిద్ధంచేస్తోంది. ఘటన వెలుగుచూసిన కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అనాడే జస్టిస్‌ యశ్వంత్‌ను రాజీనామా చేయాలని మౌఖికంగా కోరినా అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఉదంతం తర్వాతే రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సీజేఐ హోదాలో జస్టిస్‌ ఖన్నా ఒక సిఫార్సు లేఖ రాశారు. జస్టిస్‌ యశ్వంత్‌ను అభిశంసించాల్సిందేనని ఆయన సిఫార్సుచేశారు. జూలై మూడోవారంలో మొదలయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Session) ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో ఈ తీర్మానాన్ని తీసుకొస్తారు. ఎంపీల్లో మూడింట రెండొంతుల మధ్య అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానానికి ఆమోదముద్రపడుతుంది. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యులు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: జడ్జి నోట్ల కట్టల వ్యవహారం.. దాన్ని గోప్యంగానే ఉంచుతాం!

Rasi Phalalu: Daily Horoscope On 04-06-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; జ్యేష్ఠ మాసం; తిథి శు.నవమి రా.1.40 వరకు, తదుపరి దశమి; నక్షత్రం: ఉత్తర పూర్తి (24 గంటలు); వర్జ్యం: ప.11.28 నుండి 1.11 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.27 వరకు; అమృత ఘడియలు: రా.9.50 నుండి 11.33 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు; యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు; సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27 మేషం... ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ కృషిని మెచ్చుకుంటారు. విద్యాకాశాలు దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.వృషభం... శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.మిథునం.. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల నుంచి పిలుపు. నిర్ణయాలు అందరూ సమర్థిస్తారు. వ్యాపారాలు వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.సింహం.... చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో కలహాలు. అనారోగ్య సూచనలు. మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కన్య.... ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తుల తగాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.తుల.... రాబడికి మించిన ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం..... కొత్త మిత్రులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎంతోకాలంగా ఉన్న ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ధనుస్సు... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మకరం.... మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కుంభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.మీనం... సన్నిహితుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

YS Jagan Fires On Tenali Issue and TDP Chandrababu Govt Rule5
రెడ్‌బుక్‌ వత్తాసు.. అదుపు తప్పిన ‘పోలీసు’

రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తు కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్‌ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తు­న్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి, పోలీసులకింత, ఎమ్మెల్యేకు ఇంత, చంద్రబాబుకు ఇంత, లోకేశ్‌కు ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది.ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్‌ రూములకు అనుమతిస్తున్నారు. ప్రతి పర్మిట్‌ రూమ్, ప్రతి బెల్ట్‌ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌ , ల్యాటరైట్‌.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అనేది ఉందా?గొడవల వల్ల కేసులుండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు.. ఏది న్యాయం.. అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారు. కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా? అలా చేస్తే అది ధర్మమేనా?-వైఎస్‌ జగన్‌సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఎవరి మీదైనా కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో యథే­­చ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరి­గణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల తెనాలిలో పోలీ­సులు నడిరోడ్డుపై ముగ్గురు యువకులను అరికాళ్లపై కొడు­­తూ హింసించిన ఘటనకు సంబంధించి బాధిత యు­వకుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేస్తోందో కనిపిస్తోందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. అసలేం జరిగిందంటే.. ⇒ పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, చేబ్రోలు జాన్‌ విక్టర్, కరిముల్లాలు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్‌ తెనాలిలో ఉండడు. పాలిటెక్నిక్‌ చదివిన అతను హైదరాబాద్‌లో జొమాటో కంపెనీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా యువకులు. చిన్నతనంలో ఏదో పాత కేసు వాయిదా కోసం రాకేష్‌ తెనాలి వచ్చాడు. అతన్ని చూడటానికి అతని స్నేహితుడు జాన్‌ విక్టర్‌ మంగళగిరి నుంచి వచ్చాడు. అతను జూనియర్‌ అడ్వకేట్, బార్‌ కౌన్సిల్‌లో కూడా రిజిస్టర్‌ అయ్యాడు. విక్టర్‌ వెంట అతని స్నేహితుడు మెకానిక్‌ అయిన కరీముల్లా కూడా వచ్చాడు. ⇒ ఈ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతా నగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఒక కానిస్టేబుల్‌ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్‌విక్టర్‌ బైక్‌తో పాటు, అతడి మొబైల్‌ను సివిల్‌ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించి ఆ కానిస్టేబుల్‌ నుంచి బైక్‌ కీ, మొబైల్‌ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్‌ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్‌ విక్టర్‌ మంగళగిరి వెళ్లారు. ఇది జరిగింది ఏప్రిల్‌ 24న. ⇒ ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్‌ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్‌.. జూనియర్‌ అడ్వకేట్‌ అయిన జాన్‌విక్టర్‌తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాకేష్‌ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్‌ పీఎస్‌లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్‌ 26న ముగ్గురినీ స్టేషన్‌కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్‌ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ తెనాలి టూ టౌన్‌సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు. (ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చూపారు) ⇒ అంతటితో ఊర్కోక, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్‌ 27న కూడా మరో రోడ్‌ సెంటర్‌కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా, విక్టర్‌ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించారు. ఆ మర్నాడు, ఏప్రిల్‌ 28న వారిని కోర్టులో హాజరు పర్చారు. పోలీసుల దెబ్బలకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషషన్‌కు తీసుకెళ్లి, ప్రైవేట్‌ పార్టులకు కరెంట్‌ షాక్‌ ఇస్తామని బెదిరించారు.ఈ ప్రశ్నలకు బదులేది?⇒ ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించా­రని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ము­గ్గురూ వాటిని చూపినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్‌ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్‌ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్‌ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి. ⇒ ఏప్రిల్‌ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీరి్ణంచుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు. ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్‌గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.అన్ని వ్యవస్థలూ నాశనం⇒ లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిన పరిస్థితుల మధ్య.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వక పోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేదు. ⇒ మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్‌ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికి రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రాని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.అందుకే ‘వెన్నుపోటు దినం’ ⇒ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ను గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా బుధవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని మరోసారి పిలుపునిస్తున్నా. ⇒ ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నా. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మె­ల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశో­క్‌­బాబు, నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.పలకరించిన వారే లేరు.. జగన్‌ భరోసా ఇచ్చారుమా అబ్బాయి బాబులాల్‌ అలియాస్‌ కరిముల్లా మంగళగిరిలో బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలసి తెనాలి వచ్చాడు. మర్నాడు తెల్లవారు­జామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించ లేదు. వైఎస్‌ జగన్‌ ఒక్కరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.– షేక్‌ అమీర్‌బాషా, రాంతున్‌ (బాబులాల్‌ తల్లిదండ్రులు) బాధలో ఉన్న మాకు ధైర్యం చెప్పారు మా అబ్బాయి రాకేష్‌కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్‌ వేశారు. కాలులో రాడ్‌ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్‌ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. – దోమ వాసు, మాధవి (రాకేష్‌ తల్లిదండ్రులు)పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?⇒ ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవరు? ⇒ జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్‌విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌ కాదా? రాకేష్‌ చెల్లెలు ఇంజనీర్‌ (ఆమెను చూపుతూ). రాకేష్‌ పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, కొట్టి పరువు తీయడం ధర్మమేనా? ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి? అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్‌ ⇒ కరీముల్లాపై కూడా గతంలో ఎలాంటి కేసులు లేవు. కానీ అతడని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్‌విక్టర్, రాకేష్‌ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్‌ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డా­రన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొ­చ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్‌ మీడియా ఇష్టానుసారం దు్రష్పచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్‌ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు. ⇒ కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టు­లు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసు­కో­వడం ధర్మమేనా అని అడుగుతున్నా.. పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ వారు సోషల్‌ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరు అయితేనేం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూ­డా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాల పరువు తీస్తారా? ⇒ పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్ట­డం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశా­రు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టు­ల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరు­ప­క్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని, పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్‌ చేస్తూ వారి కుటుంబ పరువు తీయడం భావ్యమేనా? ⇒ ఇది రాకేష్‌ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్‌­రే. అతడి కాలు విరిగితే ఆపరేషషన్‌ చేసి లోపల రాడ్‌ వేశారు. ఆ విషయం మొర పె­ట్టు­కున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్‌ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చిత­కబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమే­నా?⇒ ఈ పాప రాకేష్‌ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. వీరి పరువు తీశారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్‌­ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా? విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. విక్టర్‌ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్‌ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్‌. ఒక మాజీ జర్నలిస్ట్‌ కొడుకు పరిస్థితి ఇది. ఇది ధర్మ­మేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి.పోలీస్‌ రాజ్యం.. హింసాకాండ⇒ ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడిపై తప్పు­డు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్‌లో పడేస్తే వారి తల్లి­దండ్రులు, గ్రామç­Ü్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్ల­తో దొంగ సర్టిఫికెట్‌ ఇప్పించుకున్నారు. కానీ హరి­కృష్ణ ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉన్నా­డు. ⇒ రాజమండ్రిలో పులిసాగర్‌ అనే సోషల్‌ మీడి­యా యాక్టివిస్ట్, దళిత యువకుడిని పోలీస్‌ స్టేషన్లో రాత్రంతా చిత్రహింసల­కు గురి చేశారు. వీరు పోలీసులా.. రాక్షసులా? అని సోషల్‌ మీ­డియా­­లో ప్రశ్నించినందుకు అత­­­డిని హింసి­ంచారు. చివరకు మహిళలు అని కూడా చూడ­కు­­ండా వైఎస్సార్‌సీపీకి చెందిన సోష­­ల్‌ మీడి­యా యాక్టివిస్ట్‌లు సుధారా­ణి, కృష్ణవేణి మీద పలు పోలీస్‌ స్టేష­న్లలో కేసులు న­మో­దు చేసి నెలల తరబడి తిప్పు­తూ వేధించారు. ఇవ­న్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా­మా లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.జగన్‌ పర్యటనలో భద్రత లోపాలుచింతలపూడి చెక్‌పోస్టు నుంచే ఆటంకాలుట్రాఫిక్‌ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యంటీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో వచ్చినా అడ్డుకోని వైనంకనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్‌ పోలీసులువైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్‌ జగన్‌ తెనాలి పర్య­ట­నలో పోలీ­సులు పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. జగన్‌ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. కొంత మంది పోలీ­సులను కేటాయించినా, వారు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యా­రు. తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్‌పోస్టు నుంచి జగన్‌ కాన్వాయ్‌కి ఆటంకాలు మొదలయ్యాయి. జగన్‌ కాన్వాయ్‌ వస్తుందని తెలి­సినా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏ మాత్రం దారి మళ్లించ­లేదు. దీంతో కాన్వా­య్‌ ముందుకు సాగడానికి ఆలస్యం అయ్యింది. పట్టణంలోకి అడు­గు పెట్టాక కూడా కనీసం రోప్‌ పార్టీని ఏర్పాటు చేయ­లేదు. టీడీపీ నాయ­కులు జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్‌ వస్తున్న మార్గంలో వారు నల్ల బెలూన్లతో వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు. వైఎస్‌ జగన్‌ వాహనాన్ని చుట్టుముట్టిన జనం.. కానరాని పోలీసులు ఓ దశలో వారు జగన్‌ కాన్వాయ్‌కి అడ్డం పడే ప్రయ­త్నం చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరా­మర్శించడానికి వస్తు­న్నా­రన్న కారణంతోనే పోలీసులు ఉదాశీనంగా వ్యవ­హరించినట్లు తెలు­స్తోంది. ఐతా నగర్‌లో దోమా రాకేష్‌ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుకు సందులో ఉన్న రాకేష్‌ ఇంటికి వెళ్లడా­నికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు, జగన్‌ పర్సనల్‌ సె­క్యూ­రిటీ సిబ్బంది ఆయ­న్ను లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక­రి­ద్దరు అధి­కారులు తప్ప పోలీసు సిబ్బంది కనపడలేదు. జగన్‌ కాన్వా­య్‌లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్‌ కూడా దిగలేదు. దీన్ని బట్టి కావా­ల­నే జగన్‌ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ శ్రేణు­లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ పర్యటన సమాచారం ముందు­­గానే జిల్లా ఎస్పీకి అందించినా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.

27 more people die in Gaza6
అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా

రఫా: గాజాలోని పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్‌ మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్తున్న వారే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది మూడు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్‌ క్రాస్‌ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఖాన్‌యూనిస్‌లోని నాస్సెర్‌ ఆస్పత్రికి తరలించారు.బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రులకు తరలిస్తుండగా చూశామని, కొందరు ఉత్త చేతులతోనే వెనుదిరిగి వస్తుండగా, నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ ఆహార పంపిణీ కేంద్రం వద్ద దారుణ పరిస్థితిని వివరించారు. కాగా, పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్కచేయలేదని ఇజ్రాయెల్‌ ఆర్మీ అంటోంది. గాజాలో ఇజ్రాయెల్‌ ఏర్పాటు చేసిన మిలటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్‌ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్‌ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ అంటుండగా..ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది, సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు విడిచారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ, చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్‌ మిలటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటుచేసుకున్నాయి. ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఈ ఆహారమే ఆధారం. ఇజ్రాయెల్‌ ఆర్మీ నెలలపాటు కొనసాగించిన దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటాయి.

Internal strife in the three main parties in Telangana7
లుకలుకలు.. కుమ్ములాటలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్‌ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్‌ఎస్‌లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్‌లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్‌లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్‌లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్‌ నేతలు గాం«దీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్‌ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్‌ డౌన్‌ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్‌’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్‌ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్‌ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్‌కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్‌ఎస్‌లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్‌ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్‌ఎస్‌నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్‌ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్‌ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్‌ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్‌ఎస్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్‌ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్‌ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్‌ఎస్‌ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్‌కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్‌ వెళ్లడం కూడా అటు బీఆర్‌ఎస్‌లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్‌ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్‌ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్‌రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్‌ టార్గెట్‌ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్‌ స్టైల్‌ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్‌ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్‌ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్‌ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Ukraine massive drone attack deep inside Russia8
రణ పంచతంత్రం

అగ్రరాజ్యం అమెరికాకు సరిసాటిగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న రష్యా గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌ను యుద్ధంలో ముచ్చెమటలు పట్టిస్తోంది. యుద్ధం తొలినాళ్లలోనే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను వందలాది ట్యాంక్‌లతో చుట్టేసి ఆక్రమించినంత పనిచేసిన రష్యా ఆతర్వాత కాస్తంత వెనుక్కు తగ్గింది. అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్‌ ఏనాటికైనా తన ముందు తలవంచక తప్పదన్న రష్యా నిఘా నిర్లక్ష్యం తాజాగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్‌ డ్రోన్ల దండు ‘స్పైడర్‌ వెబ్‌’ పేరుతో చేసిన దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్తతరహా రణతంత్రంగా మార్మోగిపోతోంది.దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యుద్ధవ్యూహాలకు పదునుపెట్టక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గతంలో యుద్ధట్యాంకులను ఎంత త్వరగా ముందుకు ఉరికిస్తే అంత త్వరగా శత్రుదేశ భూభాగం మన వశం అవుతుందనే భావన ఉండేది. ఇప్పుడు ఎంత మెరుపువేగంతో డ్రోన్లను సరైన లక్ష్యందిశగా పంపితే అంత త్వరగా సమరక్షేత్రంలో జైత్రయాత్ర పూర్తిచేయొచ్చనే వాదన మొదలైంది. ఉక్రెయిన్‌ స్పైడర్‌ వెబ్‌ దాడి ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాలుగా రణవ్యూహాలను రాటుదేల్చాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదింటి గురించి ఓసారి పరిశీలిస్తే..1. దాడి కంటే వ్యూహం కీలకంయుద్ధంలో ఎంత బలంగా కొట్టామనేది కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టామనేది ముఖ్యం. దాడి కంటే వ్యూహం ప్రధానమని తాజా ఘటన మరోసారి నిరూపించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ముందు.. ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లులేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. రష్యా వైమానికస్థావరాలపై దాడి కోసం తాము దాదాపు ఏడాది, ఏడాదిన్నరకాలంగా వ్యూహరచన చేస్తున్నామని ఆదివారం దాడి తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఖచ్చితమైన దాడి కంటే అత్యంత స్పష్టమైన ప్రణాళిక అనేదే యుద్ధవిజయానికి కీలకం. కొత్త తరహా వ్యూహాన్ని రచించడం, దాని అమలుకు సిబ్బందిని మోహరించడం, దాడి చేయడం, దాడి తర్వాత అక్కడి నుంచి మెరుపువేగంతో అదృశ్యమవడం అనేవి ముఖ్యం.2. రవాణా మార్గాలు.. రణతంత్ర ఆయుధాలుయుద్ధంలో సరిహద్దుల వద్దకు క్షిపణులను, భారీ బాంబులను తరలించడానికి స్వదేశంలోని రహదారులనే ఏదేశమైనా ఉపయోగించుకుంటుంది. కానీ ఉక్రెయిన్‌ ఈ దాడిలో రష్యన్‌ రహదారులనూ ఉపయోగించుకుంది. డ్రోన్లను సరిహద్దు దాటించాక ఎవరూ గుర్తుపట్టకుండా చెక్క క్యాబిన్లలో సర్దిపెట్టి వాహనాల్లోకి ఎక్కించారు. తర్వాత వందల కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లారు. సరిహద్దు దాటొచ్చిన డ్రోన్లను ఉక్రెయిన్‌ సమీప ప్రాంతాల్లో ఉపయోగించకుండా ఇలా వందల కిలోమీటర్లు తరలిస్తుందనే రష్యా అధికారులు అస్సలు ఊహించలేదు.అందుకే సుదూర ప్రాంతాల్లో ఎక్కడా వాహనాల తనిఖీలు జరగలేదు. యుద్ధంవేళ దేశవ్యాప్తంగా భారీ కంటైనర్లను సైతం తనిఖీచేయాలనే కొత్త నిబంధనను ఈ ఉదంతం తెరమీదకు తెస్తోంది. ప్రతీ కంటైనర్‌ను తనిఖీచేస్తే ఇంతటి దాడుల నుంచి ఏ దేశమైనా రక్షణ పొందొచ్చనే కొత్త పాఠాన్ని ఈ దాడి బోధిస్తోంది. రష్యాలో జరిగే అక్రమ సరకు రవాణా మార్గాలను ఉక్రెయిన్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఏదైనా దేశంలో జరిగే స్మగ్లింగ్, అక్రమ రవాణా అనేది ఇలాకూడా వైమానికస్థావరాలపై దాడులకు పరోక్షంగా కారణమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది.3. బుల్లి డ్రోన్‌తోనూ భారీ లక్ష్యం బద్దలు!ఆదివారం రష్యాలో ధ్వంసమైన విమానాలను ఉక్రెయిన్‌ ప్రధాన భూభాగం నుంచి సుదూర ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. ఈ విమానాలను ఉక్రెయిన్‌ తన సొంత భూభాగం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణి కావాలి. ఆ క్షిపణి తయారీకి భారీ స్థాయిలో వ్యయం తప్పదు. సైబీరియా, ఆర్కిటిక్‌ ఖండ సమీప రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేయాలంటే అత్యంత సుదూరాలకు ప్రయాణించే బాలిస్టిక్‌ క్షిపణులు అవసరం. కానీ ఇవేం లేకుండానే ఇదే పనిని బుల్లి డ్రోన్లు అత్యంత సులభంగా పూర్తిచేయగలవని తాజా ఘటనతో స్పష్టమైంది. అంటే సుదూర లక్ష్యల ఛేదనకు వందల కోట్ల ఖర్చుతో తయారైన క్షిపణులతో పనిలేదని ఈ ఘటనతో తేలిపోయింది. లక్ష్యం ఎంత దూరంగా ఉందనేది ముఖ్యంకాదు. దానికి ఎంత దగ్గరి నుంచి బద్దలుకొట్టగలం అనేదే ప్రధానం.4. తక్కువ వ్యయంతో ఎక్కువ నష్టం చేయొచ్చు..ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత. యుద్దవిమానాలను కూల్చేయాలంటే మనం కూడా యుద్ధవిమానంతోనో, క్షిపణితోనో దాడి చేసి నాశనంచేయాల్సిన పనిలేదని ఈ దాడి కొత్త విషయాన్ని చెబుతోంది. అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న బాంబర్‌ విమానాలను నాశనం చేయడానికి అత్యంత చవకైన డ్రోన్లు ఉంటే చాలు. ఉక్రెయిన్‌ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.వాటి విలువ ఏకంగా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను నిర్వీర్యంచేసేందుకు మనం కూడా అంతే స్థాయిలో ఖర్చుచేయాల్సిన పనిలేదని ఈ దాడి ఘటన తేటతెల్లంచేసింది. స్పైడర్స్‌ వెబ్‌ దాడి తర్వాత రణతంత్రాల పాఠాలను తమకూ బోధించాలని కొన్ని మిత్రదేశాలు బతిమాలినట్లు అంతర్జాతీయమీడియాలో కథనాలు వెలవడ్డాయి. అణ్వస్త్ర దేశంకాకపోయినా ఇప్పుడీ దాడితో ఉక్రెయిన్‌ ఒక్కసారిగా వార్‌ హాట్‌ఫేవరెట్‌గా నిలిచింది.5. మనం మాత్రమే రహస్యం అనుకుంటే సరిపోదు..రహస్య స్థావరం అనేది రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. అందరికీ తెల్సిపోయాక రహస్య స్థావరం అంటే బాగోదు. గగనతల నిఘా నేత్రాలు కొలువైన శాటిలైట్లయుగంలో ప్రతీదీ బహిరంగమే. అందుకే ఫలానా చోట స్థావరం ఉందని తెలిసినా దానిపై దాడి చేయడం అసాధ్యం అనే స్థాయిలో దానికి భద్రత కల్పించడం అవశ్యమని తాజా ఘటనతో నిరూపితమైంది. నిఘా సంస్థ కార్యాలయంలో రహస్యాలు ఎంత భద్రంగా ఉంటాయో, నిఘా సంస్థ పరిసరాలు సైతం అంతే రక్షణాత్మకంగా ఉండాలని తాజా ఘటన చాటింది.రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం సమీపంలోనే తమ కమాండర్‌సెంటర్‌ను నిర్వహించామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. దీంతో శత్రు దేశాలపై నిఘాతోపాటు స్వీయ నిఘాపైనా మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. అధునాతన ఆయుధాలకంటే అధ్భుతమైన ఆలోచనలే ఆయాదేశాలకు అసలైన అస్త్రాలుగా అక్కరకొస్తాయని స్పైడర్స్‌వెబ్‌ ఘటన ఉద్ఘాటిస్తోంది.

Chandrababu Naidu has recently taken another loan of 7 thousand crores9
అప్పుల భారం @ రూ.1,51,604 కోట్లు

‘అప్పు’డు అలా..మేం అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే రాష్ట్ర సంపద పెంచుతాం.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను భారీగా చేపడతాం –ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పలుఇప్పుడు ఇలా.. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది.. ఏడాది గిర్రున తిరిగింది.. మరి సీఎంగా చంద్రబాబు చేసింది ఏమున్నది అంటే.. రాష్ట్ర ప్రజలపై రూ.1,51,604 కోట్ల అప్పు భారం మోపడం. సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను నమ్మి.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేసి.. ప్రజలకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పుల భారం వేసింది. తాము గెలిచి ఏడాది అయినందుకు.. ప్రజలకు బహుమానంగా మంగళవారం మరో రూ.7 వేల కోట్లు అప్పు చేసింది.» తాజా అప్పుతో సరిగ్గా ఏడాదిలో బడ్జెట్‌ అప్పులే ఏకంగా రూ.1,01,194 కోట్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా 6.61 శాతం నుంచి 6.84 శాతం వడ్డీకి ఈ మొత్తం అప్పును సమీకరించింది. » బడ్జెట్‌ లోపలే కాకుండా బడ్జెట్‌ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రా­జధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. » ఇంత పెద్దమొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచి్చన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. » ఏడాది పాలనలో చంద్రబాబు సర్కారు చేసింది ఏమైనా ఉంది అంటే.. అది భారీగా అప్పులే. ఏపీఎండీసీకి చెందిన 436 మైనర్‌ గనుల లీజుల విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్‌ బాండ్లు జారీ ద్వారా రూ.9 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల మేర బాండ్లు జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్లు జారీ ద్వారా అప్పు చేయనుంది. » ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున గతంలో ఏ ప్రభుత్వమూ అప్పులు చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. లేని అప్పులను ఉన్నట్లు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలు తెలియజేయడం లేదు. పైగా చంద్రబాబు సర్కారు ఆస్తుల కల్పనకు గానీ సంక్షేమానికి గానీ పైసా వ్యయం చేయడం లేదు. ఒకపక్క ఎక్కువగా అప్పులు చేస్తూనే మరోపక్క సూపర్‌ సిక్స్‌ అమలుకు డబ్బుల్లేవంటూ ఏడాదిగా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.

Devdutta Majhi tops JEE Advanced in female category10
వృథా చేయని సమయమే ర్యాంక్‌ తెస్తుంది

ఐ.ఐ.టి. జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్‌ పరీక్ష అంటే పరీక్షలకే పరీక్ష. అలాంటి పరీక్షను 2025లో లక్షా తొంభై వేల మంది రాస్తే వారిలో అమ్మాయిలు 43,000 మంది. ఆ మొత్తం అమ్మాయిల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంది దేవదత్తా మాఝీ(Devdutta Majhi). బెంగాల్‌లోని చిన్న ఊర్ల విద్యార్థినుల విజయం ఇది. జె.ఇ.ఇ. మెయిన్ సీజన్ 1, సీజన్ 2లలో టాప్‌ 1 ర్యాంక్‌ సాధించిన దేవదత్తా కోచింగ్‌ లేకుండా సొంతగా చదువుకుంది. ‘మీరు వేస్ట్‌ చేసే ప్రతి నిమిషం మిమ్మల్ని ర్యాంక్‌కు దూరం చేస్తుంది’ అని హెచ్చరిస్తూ ఉంది ఆ చదువుల సరస్వతి.ర్యాంక్‌ రావడం గురించి కోచింగ్‌ సెంటర్‌లకు ఒక వైఖరి ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక వైఖరి ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది. మా దగ్గర కూచోబెట్టి రాత్రి తెల్లవార్లు చదివిస్తే ర్యాంకు వస్తుందని కోచింగ్‌ సెంటర్‌ వాళ్లూ, ఎయిత్‌ క్లాస్‌ నుంచే కోచింగ్‌లో పెడితే ఇంటర్‌ అయ్యే సరికి చచ్చుకుంటూ ర్యాంక్‌ వస్తుందని తల్లిదండ్రులూ, ఆపకుండా క్లాసులు విని మాక్‌ టెస్టులు రాస్తే ర్యాంక్‌ వస్తుందని విద్యార్థులు అనుకుంటూ ఉంటారు.తీరా రిజల్ట్స్‌ వచ్చాక అంచనాలు తారుమారు అయి ఉంటాయి. బ్లేమ్‌ క్వశ్చన్‌ పేపర్‌ మీదకు వెళుతుంది. ‘పేపర్‌ చాలా టఫ్‌గా వచ్చింది కాబట్టే మా అబ్బాయికి ర్యాంక్‌ రాలేదు’ అనీ, ‘కెమిస్ట్రీ ఫిజిక్స్‌ బాగా చేసింది కాని మేథ్స్‌లో దెబ్బతింది మా అమ్మాయి’ అని కామెంట్లు వస్తుంటాయి. కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు బాగా చెప్పలేదని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించి చదివించలేదని కోచింగ్‌ సెంటర్‌ వారూ అనుకుంటారు. మన తెలివితేటలకు ఇంకా మంచి ర్యాంక్‌ రావాలని విద్యార్థులు డిజ΄్పాయింట్‌ అవుతారు.కాని జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌కే కాదు ఏ పరీక్షకైనా ర్యాంక్‌ రావాలంటే మొదట పూనుకోవాల్సింది, సంకల్పించాల్సింది విద్యార్థే అంటోంది దేవదత్తా మాఝీ. లక్షా తొంభై వేల మంది రాసిన జె.ఇ.ఇ. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో కామన్‌ ర్యాంక్‌ 16 సాధించిన దేవదత్తా అమ్మాయిలందరిలో టాప్‌ 1 ర్యాంకర్‌గా నిలిచింది. అంతే కాదు జె.ఇ.ఇ మెయిన్స్‌లో 100 పర్సంటైల్‌ సాధించింది.కోచింగ్‌ లేకుండానే...‘నేను కోచింగ్‌ తీసుకోలేదు. కొన్ని ఆన్‌లైన్‌ క్లాసులు ఢిల్లీ లెక్చరర్ల నుంచి తీసుకున్నాను. మిగిలినదంతా సెల్ఫ్‌ స్టడీనే.పోటీ పరీక్షల్లో ర్యాంకు రావాలంటే ముందు నుంచి మనం క్రమశిక్షణతో ఉండాలి. టెన్త్‌ అయిపోయాక రెండేళ్లపాటు నేను నా ఫ్రెండ్స్‌ని, బంధువులను కలవలేదు. ఫంక్షన్స్‌కు అటెండ్‌ కాలేదు. కచ్చితంగా రోజుకు పది, పన్నెండు గంటలు చదివాను. ఏనాడూ డిసిప్లిన్‌ తప్పలేదు. మనం వేస్ట్‌ చేసే ప్రతి నిమిషం మనల్ని ర్యాంకుకు దూరం చేస్తుందని గ్రహించాలి’ అంది దేవదత్తా మాఝీ.తల్లి మార్గదర్శనందేవదత్తా తల్లి ఫిజిక్స్‌ టీచర్‌. తండ్రి లెక్చరర్‌. వీరు ఉంటున్నది కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కత్వా అనే చిన్న ఊరు. దేవదత్తా గవర్నమెంట్‌ హైస్కూల్‌లోనే టెన్త్‌ చదివి 2023లో స్టేట్‌ టాప్‌ 6వ ర్యాంకర్‌గా నిలిచింది. ‘అప్పటినుంచే నాకు ఐ.ఐ.టి. అడ్వాన్స్‌డ్‌ సాధించాలని కోరిక. అందుకు వేరెవరో కష్టపడితే నాకెలా ర్యాంక్‌ వస్తుంది. కష్టపడి చదవాల్సింది నేనే... ర్యాంక్‌ సాధించాల్సింది నేనే. కోచింగ్‌ సెంటర్లలో కష్టపడి లెక్చరర్లు చెప్పడం ద్వారా మనకు ర్యాంక్‌ వచ్చేయదు. నా చదువుకు అమ్మ కొంచెం గైడ్‌ చేసింది. నేను మొదట మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో థియరీ అంతా చదువుకున్నాను. తర్వాత ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేశాను. టెక్స్‌›్టబుక్స్‌ మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదివాను’ అంటుంది దేవదత్తా.ఏ.ఐ. చదవాలని...దేవదత్తా ఖరగ్‌పూర్‌ ఐ.ఐ.టి. పరిధిలోకి వచ్చినా తాను మాత్రం ఐ.ఐ.ఎస్‌.సి. బెంగళూరులో ఏ.ఐ. అండ్‌ రోబోటిక్స్‌ చదవాలని అనుకుంటోంది. ‘నేను వయొలిన్‌ బాగా వాయిస్తాను. కాని పరీక్షల కోసం దానినీ పక్కన పెట్టేశాను. అయితే పరీక్షలయ్యాక ఇప్పుడు మళ్లీ వయొలిన్‌ వాయిస్తున్నాను. ఈ రెండేళ్లు నేను అమ్మతో మాత్రమే మాట్లాడుతూ రిలాక్స్‌ అయ్యాను. ఆమెతో మాటలు తప్ప మిగిలినదంతా పుస్తకాలతోనే’ అని ముగించింది దేవదత్తా.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement