Top Stories
ప్రధాన వార్తలు

ఏపీలో ఇవాళ వెన్నుపోటు దినం.. హైలైట్స్ ఇవే
సాక్షి, గుంటూరు: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చి.. ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయలేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’(Vennupotu Dinam)గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.👉చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటుకూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనవెన్నుపోటు దినంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలుకూటమి సర్కార్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహంచంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు👉అనంతపురం:చంద్రబాబు మోసాలపై ఉరవకొండలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉరగాద్రి ఫంక్షన్ హాల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన.👉అనంతపురం: రాయదుర్గంలో వెన్నుపోటు దినంవైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంవినాయక సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉గన్నవరంవైఎస్సార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నానివెన్నుపోటు కార్యక్రమానికి భారీగా హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్సీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు👉విశాఖ:పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసనగాజువాక డిపో వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకులు సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ 👉కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ..పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు సబ్ కలెక్టర్కు మెమోరాండం అందజేత 👉అన్నమయ్య జిల్లా:రాజంపేటలో పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏ ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూటమి పాలనపై నిరసనగా విశేషంగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొంటున్నారు👉తిరుపతి: ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరిస్తున్న మొదటి శంఖారావంచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటాంమాపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటాంప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అమ్మకు వందనం, నిరుద్యోగులకు 3వేల రూపాయలు ఇవ్వలేదుఏడాది కాలంలో పార్టీ నాయకులపై 2666 పై కక్ష్య సాధింపు చర్యలు చేశారు796 మందిపై హత్య ప్రయత్నం చేశారు 380 మందిని అరెస్ట్ చేయించారుఅక్క చెల్లెమ్మలు తో ఈరోజు నుంచి పోరాటాలు ప్రారంభం అయ్యాయితిరుపతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేస్తాం , వారికి అండగా నిలుస్తాముడాక్టర్ శిరీష, మేయర్ కామెంట్స్వైఎస్ జగన్ పిలుపుతో వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుఅమలు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారుసంక్షేమ పథకాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందిభూమన అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి లో ఈ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకతతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారురాష్ట్రంలో మొదటిగా ప్రభుత్వంపై గళం విప్పిన నియోజకవర్గం తిరుపతి కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటాం👉శ్రీసత్యసాయి జిల్లా:పెనుకొండలో చంద్రబాబు మోసాలపై వెన్నుపోటు దినం కార్యక్రమంమాజీమంత్రి, జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భారీ ర్యాలీపార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ. నిరసన ప్రదర్శన.👉వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో..పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలువెన్నుపోటు దినం సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగంఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారుబాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారుగత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసిందిబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్ష 55000 కోట్లు అప్పు చేసిందిఇంత అప్పు చేసిన ప్రజలకు ఒక పథకం అందివ్వలేదుమహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు.పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదిపులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం చేయలేదు 👉అనంతపురం జిల్లా:కళ్యాణదుర్గం మండల కేంద్రంలో చంద్రబాబు మోసాల పై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విన్సెంనెట్ పెరర్ విగ్రహం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉అనంతపురం గుంతకల్లులో చంద్రబాబు మోసాలపై గుంతకల్లులో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.👉శ్రీ సత్య సాయి జిల్లాలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపీ నేతలు వెన్నపూస రవీందర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన👉వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ పార్టీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులుప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుండి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీమునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వనున్న మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు👉శ్రీ సత్యసాయి జిల్లా: చంద్రబాబు మోసాలపై పుట్టపర్తి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ👉అనంతపురంలో.. చంద్రబాబు మోసాలపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, అనంతపురం నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ దాకా నిరసన ప్రదర్శన👉తిరుపతి, సత్యనారాయణపురంలో.. సత్యనారాయణ పురం సర్కిల్ నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ కార్యక్రమం. పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు👉విజయనగరం జిల్లా, బొబ్బిలిలో..బొబ్బిలిలో మొదలైన ర్యాలీబొబ్బిలి వైయస్సార్సీపి ఆద్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ.అబద్దపు హామీల కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన.హాజరైన మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.👉అనకాపల్లి. నర్సీపట్నంవెన్నుపోటు కార్యక్రమంనకు ఆటంకాలు పెడుతున్న కూటమి ప్రభుత్వం.నర్సీపట్నం లో నిరసనకు బైక్ ర్యాలీ కి నెల రోజులముందు దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.నిన్నటి వరకు సమాధానం చెప్పని పోలీస్.నిన్న సాయంత్రం బైక్లతో కాకుండా పాదయాత్ర కు మాత్రమే అనుమతి అంటూ నోటీసులు ఇచ్చిన పోలీస్.ర్యాలీ కి వస్తున్న ప్రజలపై కేసులు రాస్తూ భయాందోళన కలిగిస్తున్న పోలీసులు.👉అనంతపురం:మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంచంద్రబాబు సర్కార్ మోసాలపై యాడికిలో నిరసన కార్యక్రమం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్రమత్తమైన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టు అనుమతిఅయినా, అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం 👉విజయనగరం జిల్లా: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణనేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుకూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నిరసనలుచీపురుపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంపాల్గొననున్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం7 వేల కోట్లు మంగళవారం అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వంఆర్బీఐ సెక్యురిటీల వేలం ద్వారా అప్పుల సమీకరణచంద్రబాబు సీఎం అయ్యాక రికార్డ్ స్థాయిలో అప్పులుఇప్పటివరకు లక్ష 51 వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వంప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వంఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటునమ్మించి.. నట్టేట ముంచిన బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంసూపర్ సిక్స్ సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో నాడు ఇంటింటా బాండ్లు పంపిణీఏడాదిలో రూ.1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారుహామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనంటీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాటఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపుఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలుతక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ కలెక్టర్లకు, అధికారులకు ఆ హామీల డిమాండ్ పత్రాలు ఇవ్వనున్న నేతలు

ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. తన 18 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే, టీ20 వరల్డ్కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీలు వంటి ఐసీసీ టైటిల్స్ను సైతం విరాట్ సొంతం చేసుకున్నాడు. కానీ కింగ్ కెరీర్లో ఐపీఎల్ ట్రోఫీ ఒక్కటే వెలితిగా ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు కోహ్లి ఖాతాలో ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.కోహ్లి 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ప్రతీ సీజన్లో బ్యాటర్గా, ఫీల్డర్గా, కెప్టెన్గా ఆర్సీబీని భుజాల మీద మోసిన కోహ్లి.. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో ఏన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షగా ఊరించిన కలల కప్పు కింగ్ సొంతమైంది.ఫైనల్లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ తర్వాత ట్రోఫీని అందుకుని మైదానం చుట్టూ తిరిగుతూ సందడి చేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ రోజు వస్తుందని అస్సలు అనుకోలేదని కోహ్లి తెలిపాడు.పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా"18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి.గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోరీ్నలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించామని కోహ్లి పేర్కొన్నాడు.చదవండి: Virat Kohli Emotional Video: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెక్కి వెక్కి ఏడ్చిన కోహ్లి! వీడియో వైరల్

ఇరాన్లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం
టెహ్రాన్: ఇరాన్లో గల్లంతైన ముగ్గురు భారతీయుల ఆచూకీ లభ్యమైందని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.ఇస్లామిక్ రిపబ్లిక్ మెహార్ న్యూస్ ప్రకారం.. భారత్లోని పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి నిర్భందానికి గురయ్యాడు. ట్రెహాన్లో స్థానిక ట్రావెల్ కంపెనీ బాధితుడికి ఆస్ట్రేలియాలో ఉన్నత ఉద్యోగాలు, అత్యధిక శాలరీ ఇప్పిస్తామంటూ నమ్మించింది. టెహ్రాన్ నుంచి ఆస్ట్రేలియాలి వెళ్లాల్సి ఉంది. కానీ వాళ్లు మోసపోయారు. మోసగాళ్లు వారిని నిర్బందించారు. Three missing Indian citizens freed by Tehran policeLocal media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg— Iran in India (@Iran_in_India) June 3, 2025 చిత్ర హింసలకు గురి చేశారు. బాధితుల బంధువులకు వీడియో కాల్లో భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన గురైన బాధిత కుటుంబ సభ్యులు కేంద్రం, ఇరాన్లోని భారత దౌత్య కార్యాలయాలనికి ఫిర్యాదు చేశారు. ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఇరాన్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.భారత్ రాయబార కార్యాలయంలో విజ్ఞప్తితో రంగంలోకి దిగిన ఇరాన్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దక్షిణ టెహ్రాన్లోని వరమిన్లో బందీలుగా ఉన్న బాధితుల్ని సురక్షితంగా రక్షించారు. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. త్వరలో బాధితులు భారత్కు రానున్నారు.

Cash Row: జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అధికారిక భవనం ఔట్హౌస్లో సగం కాలిన స్థితిలో కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఘటనలో అప్రతిష్టను మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yashwant Varma)ను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమవేశాల్లో ఈమేరకు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతల సమ్మతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు త్వరలో సమావేశంకానున్నారని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ముగ్గురు జడ్జీల విచారణ కమిటీ సైతం జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా నివేదికను రూపొందించిన నేపథ్యంలో ప్రభుత్వం అభిశంసనకు(Impeachment) రంగం సిద్ధంచేస్తోంది. ఘటన వెలుగుచూసిన కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా అనాడే జస్టిస్ యశ్వంత్ను రాజీనామా చేయాలని మౌఖికంగా కోరినా అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఉదంతం తర్వాతే రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సీజేఐ హోదాలో జస్టిస్ ఖన్నా ఒక సిఫార్సు లేఖ రాశారు. జస్టిస్ యశ్వంత్ను అభిశంసించాల్సిందేనని ఆయన సిఫార్సుచేశారు. జూలై మూడోవారంలో మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Session) ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ తీర్మానాన్ని తీసుకొస్తారు. ఎంపీల్లో మూడింట రెండొంతుల మధ్య అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానానికి ఆమోదముద్రపడుతుంది. రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో కనీసం 100 మంది సభ్యులు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: జడ్జి నోట్ల కట్టల వ్యవహారం.. దాన్ని గోప్యంగానే ఉంచుతాం!

అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు.

విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
విద్యాలక్ష్మి స్కీము కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు (0.2%) తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. సంస్థను బట్టి విద్యా రుణాలపై వడ్డీ రేటు 7.5% నుంచి ప్రారంభం అవుతుందని వివరించింది. ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ స్కీమును రూపొందించారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలుగా (క్యూహెచ్ఈఐ) గుర్తింపు పొందిన 860 సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలవిద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయాలంటే కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.కేవైసీ వివరాల కోసం: ఆధార్, పాన్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్.అకడమిక్ రికార్డులు: మునుపటి అకడమిక్ ఏడాదిలోని మార్కు షీట్లను సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఇప్పటికే ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం కోసం చూస్తూ, దాని ప్రవేశ పరీక్ష రాసి ఉంటే అందుకు సంబంధించిన ర్యాంక్ కార్డును జోడించాలి.అడ్మిషన్ ప్రూఫ్: ఇప్పటికే సంస్థ నుంచి అడ్మిషన్ వస్తే ఫీజు స్ట్రక్చర్తో పాటు సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్.ఫొటోలు: పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.లోన్ హిస్టరీ: ఇప్పటికే బ్యాంకులు/ రుణదాతల నుంచి గతంలో లేదా ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు.ఆదాయ ధ్రువీకరణ పత్రం: రాష్ట్రంలోని నిర్దేశిత పబ్లిక్ అథారిటీ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం.

చిన్నారులను కంటికి రెప్పలమై కాపాడుకుందాం..!
ఇవి..అవి..అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం పిల్లలు అనేక రూపాల్లో శారీరక, లైంగిక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.వారిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి... మొదలైన విషయాలను అవగాహన పరిచే రోజు... సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే రోజు...ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’...పద్నాలుగు సంవత్సరాల వయసులో రోషిణి పర్వీన్కు వివాహం జరిగింది. పదిహేను సంవత్సరాలకే తల్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో రోషిణి పడిన బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనలా ఏ అమ్మాయీ బాధ పడకూడదు అనుకొని ముందుకు కదిలింది.ఇప్పటివరకు అరవైకి పైగా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకుంది.ఆ పిల్లలను మళ్లీ బడి బాట పట్టించి వారి భవిష్యత్ను వెలుగుమయం చేసింది. ఒకప్పుడు ‘నేను ఒంటరిని’ అనుకున్న బిహార్లోని సిమల్బరీ గ్రామానికి చెందిన రోషిణి ‘చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ‘నేను ఒంటరిని కాదు. నాతో మరెంతోమంది ఉన్నారు’ అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ప్రాణాలకు తెగించి బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకుంది.‘సేవ్ ది చిల్డ్రన్’లాంటి సంస్థలలో పని చేసిన రోషిణి ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే సమస్యల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నో స్కూల్స్లో ‘గర్ల్స్ గ్రూప్’లను ఏర్పాటు చేసింది. బిహార్లోని రోషిణి పర్వీన్ నుంచి శ్రీకాళహస్తిలోని వైశాలి వరకు ఎంతోమంది మహిళలు పిల్లల హక్కులు, భద్రత గురించి క్రియాశీలంగా పనిచేస్తున్నారు.క్షేత్రస్థాయిలోకి...‘కొంతమంది స్నేహితులు, న్యాయవాదుల సహాయంతో బుక్లెట్ రూపొందించాను. మా అబ్బాయితో మొదట దీని గురించి మాట్లాడాను. సేఫ్ ఇండియా, హ్యాపీ ఇండియా క్యాంపెయిన్ మొదలు పెట్టి పిల్లల భద్రత గురించి ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాం’ అంటుంది వైశాలి కోలా.పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకాళహస్తిలో‘తేజోభారత్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది వైశాలి. ‘ఏదైనా నేరం జరిగితే దానిగురించి కాసేపు మాట్లాడుకొని బాధ పడతారు. ఆ తరువాత మరచి పోతుంటారు. కొందరు మాత్రం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. అలాంటి వారు కూడా ఏదైనా చేద్దాం అంటే ముందుకు రారు. పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదాల గురించి అవగాహన కలిగించడానికి స్వరక్ష ఏర్పాటు చేశాం’ అంటుంది కేరళలోని కోచికి చెందిన అనూ సూరజ్. ‘స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లలపై జరిగే భౌతిక, లైంగిక, మానసిక హింస గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలకు తెలియజేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.ఎందుకు ఈరోజు?ప్రతి సంవత్సరం జూన్ 4న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 19, 1982లో మొదలైంది. మొదట్లో యుద్ధ బాధితులైన లెబనాన్, పాలస్తీనా పిల్లలపై దృష్టి పెట్టినప్పటికీ తరువాత దీని ఉద్దేశాన్ని విస్తృతీకరించారు. పిల్లలు రకరకాల రూపాల్లో ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి, వారి హక్కులను కాపాడడానికి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ఆలోచించడమే ఈ రోజు ఉద్దేశం.ఫన్నీగానే సీరియస్ విషయాలుబ్యాడ్ టచ్, గుడ్ టచ్ పిల్లలు గుర్తించేలా చేయడానికి, ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి, అంతర్గత శక్తిని పెంచడానికి ఆడియో–విజువల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం. ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. కథలు, ఫన్ వీడియోల ద్వారా చిన్న పిల్లలకు సీరియస్ విషయాల గురించి తెలియజేస్తున్నాం. ‘మాయ’ అనే షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించాం. పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రకరకాల ఏజ్ గ్రూపుల ఆధారంగా పిల్లలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం,– అనూ సూరజ్, స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు‘చైల్డ్ మ్యారేజ్–ఫ్రీ ఇండియా’ అనేది నా లక్ష్యం. నాది బాల్య వివాహం కావడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదనుకున్నాను. గ్రామాల్లో ‘చైల్డ్ ప్రొటెక్షన్’ కమిటీలు ఏర్పాటు చేశాం. అవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘మీ హక్కులు ఇవి’ అంటూ పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించాం.– రోషిణి, సామాజిక కార్యకర్తఎన్నెన్నో రూపాల్లో..పిల్లల్ని పనిలో పెట్టుకొని వారి భవిష్యత్ను చీకటిమయం చేసే, పిల్లల్ని అపహరించి అమ్ముకునే, పిల్లల్ని అపహరించి వ్యభిచార కూపాల్లోకి దింపే సంఘటనలు ఒకవైపు... మరోవైపు యుద్ధాలలో చని΄ోతున్న పిల్లలు. యుద్ధ భీభత్సానికి బా«ధితులు అవుతున్న పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రుల తగాదాలకు మానసికంగా దెబ్బతింటున్న, అయిన వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!)

బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. కేజీఎఫ్తో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025

RCB Vs PBKS: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా
ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్ నమ్దే’ (ఈ ఏడాది కప్ మనదే) జోక్గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం వచ్చేసింది...తమ టీమ్లోని 18వ నంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్’కు చేరి తొలి క్వాలిఫయర్లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీమ్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్లను అధిగమించి రాయల్గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లి కెరీర్లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త చాంపియన్గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్ మ్యాచ్లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్లో ‘ఈ సాల కప్ నమ్దు’ (ఈ ఏడాది కప్ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్ ఇన్గ్లిస్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు తుది పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... ఆర్సీబీ ఇన్నింగ్స్లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్ సాల్ట్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు), లివింగ్స్టోన్ (15 బంతుల్లో 25; 2 సిక్స్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. టపటపా... సీజన్ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (22 బంతుల్లో 26; 2 సిక్స్లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) పేలవ షాట్కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్లో దూకుడు ప్రదర్శించిన ఇన్గ్లిస్ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అయ్యర్ (బి) జేమీసన్ 16; కోహ్లి (సి అండ్ బి) అజ్మతుల్లా 43; మయాంక్ అగర్వాల్ (సి) అర్ష్ దీప్ (బి) చహల్ 24; పాటీదార్ (ఎల్బీ) (బి) జేమీసన్ 26; లివింగ్స్టోన్ (ఎల్బీ) (బి) జేమీసన్ 25; జితేశ్ శర్మ (బి) వైశాక్ 24; షెఫర్డ్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 17; కృనాల్ (సి) అయ్యర్ (బి) అర్ష్ దీప్ 4; భువనేశ్వర్ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్ 1; యశ్ దయాళ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–40–3, జేమీసన్ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్ 4–0–30–1, యుజువేంద్ర చహల్ 4–0–37–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 24; ప్రభ్సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; ఇన్గ్లిస్ (సి) లివింగ్స్టోన్ (బి) కృనాల్ 39; అయ్యర్ (సి) జితేశ్ (బి) షెఫర్డ్ 1; నేహల్ వధేరా (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 15; శశాంక్ సింగ్ (నాటౌట్) 61; స్టొయినిస్ (సి) యశ్ దయాళ్ (బి) భువనేశ్వర్ 6; అజ్మతుల్లా (సి) (సబ్) భందగే (బి) యశ్ దయాళ్ 1; జేమీసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–2, యశ్ దయాళ్ 3–0–18–1, హాజల్వుడ్ 4–0–54–1, కృనాల్ పాండ్యా 4–0–17–2, సుయాశ్ శర్మ 2–0–19–0, షెఫర్డ్ 3–0–30–1. 6 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్గా రజత్ పాటీదార్ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్ కింగ్స్; 5 సార్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్; 5 సార్లు), గౌతమ్ గంభీర్ (కోల్కతా నైట్రైడర్స్; 2 సార్లు), శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్; ఒకసారి), హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్; ఒకసారి) ఈ ఘనత సాధించారు.10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్ ఫైనల్స్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు టైటిల్ లభించింది. 9 ఐపీఎల్–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్ సీజన్లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.2 ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోపాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ సాధించిన రెండో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.1 ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

లుకలుకలు.. కుమ్ములాటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాం«దీభవన్లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్ఎస్లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం కూడా అటు బీఆర్ఎస్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ టార్గెట్ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్టాపిక్ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!
ఘోరం.. లేడీ టిక్టాక్ స్టార్ దారుణ హత్య...! పరువు హత్య?
ఇరాన్లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం
పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా: విరాట్ కోహ్లి
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
తల్లితో కలిసి పూజ చేసిన శ్రీలీల! (ఫొటోలు)
IPL 2025: గత మూడు ఫైనల్స్లో విరాట్ కోహ్లి ఎలా ఆడాడో చూడండి..!
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకే
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
హాస్య నటుడు అలీని అనరాని మాట అన్న రాజేంద్ర ప్రసాద్
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
పీఓకేలో నిరసనల హోరు
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!
ఘోరం.. లేడీ టిక్టాక్ స్టార్ దారుణ హత్య...! పరువు హత్య?
ఇరాన్లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం
పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా: విరాట్ కోహ్లి
శ్రేయస్ అయ్యర్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
సాక్షి కార్టూన్ ఆంధ్రప్రదేశ్ 02-06-2025
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
ఆయుష్ ఆసుపత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జి.. నెక్స్ట్ జరగబోయేది ఇదే
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
IPL 2025: గత మూడు ఫైనల్స్లో విరాట్ కోహ్లి ఎలా ఆడాడో చూడండి..!
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకే
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
పీఓకేలో నిరసనల హోరు
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
సినిమా

పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.

అది నా అదృష్టం: రీతూ వర్మ
‘‘చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు ‘నువ్వు అది చేయలేవు.. ఇది చేయలేవు’ అంటూ నిరుత్సాహపరుస్తుంటారు. అలాంటి వారికి ‘దేవిక అండ్ డానీ’ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు రావడం, నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ రీతూ వర్మ తెలిపారు.శివ కందుకూరి, రీతూ వర్మ, సూర్య వశిష్ఠ్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో బి. కిశోర్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. సుధాకర్ చాగంటి నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్లో నేను సుబ్బు అనే ఫన్నీ పాత్ర చేశాను’’ అన్నారు.‘‘దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బులాంటి పాత్రలు ఎలా మార్చాయనేది ఈ సిరీస్లో చూడొచ్చు’’ అని పేర్కొన్నారు సూర్య వశిష్ఠ్. ‘‘దేవిక అండ్ డానీ’లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ సహా అన్ని అంశాలున్న సిరీస్ ఇది’’ అని సుధాకర్ చాగంటి తెలిపారు. ‘‘శ్రీకారం’ సినిమా తర్వాత ఈ సిరీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ చూసే ఆడియన్స్ సమయం వృథా కాదు’’ అన్నారు బి. కిశోర్.

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ .. ఫైర్ థీమ్ రిలీజ్
అడివి శేష్ నటిస్తోన్న తాజా చిత్రం ' డకాయిట్'. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. ఇందులో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫైర్ థీమ్(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) రిలీజ్ చేశారు. ఈ ఫైర్ థీమ్ను భీమ్స్ సిసిరోలియో పవర్ఫుల్గా కంపోజ్ చేశారు. ఇక ఆడియన్స్కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అన్ని మ్యూజిక్ ఫ్లాట్ఫామ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకాగ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. Put on your headphones and enjoy the musical fire 🔥🎧#DACOITFire Glimpse OST now streaming on all platforms ❤🔥▶️ https://t.co/cEqYoQldqu#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas… pic.twitter.com/8DaP6zD1WH— Annapurna Studios (@AnnapurnaStdios) June 3, 2025

దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ప్రియమైన ప్రత్యర్థిపై ఘనమైన విజయం
ఆట ఏదైనా కొందరి పోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. చివర్లో విజేతగా ఎవరు అవతరించినా అభిమానులకు మాత్రం పైసా వసూల్ అవుతుంది. మహిళల బ్యాడ్మింటన్ విషయానికొస్తే భారత స్టార్ పీవీ సింధు, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా మధ్య మైదానంలో వైరం ఇప్పటిది కాదు. 2012లో ఆసియా యూత్ అండర్–19 చాంపియన్షిప్లో వీరిద్దరి మధ్య తొలి పోరు జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ తమ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ సీనియర్ స్థాయిలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. ప్రపంచ చాంపియన్గా అవతరించడంతోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లను అందుకున్నారు. ఈ క్రమంలో సింధు, ఒకుహారా మ్యాచ్లంటే బాడ్మింటన్ అభిమానులకు పసందైన విందుగా మారిపోయింది. ఒకసారి సింధు గెలిస్తే, మరోసారి ఒకుహారా నెగ్గి లెక్క సరిచేసేది. తాజాగా ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో వీరిద్దరు తొలి రౌండ్లోనే ఎదురెదురుగా తలపడ్డారు. ఇద్దరి మధ్య 20వ ముఖాముఖి పోరు ఎప్పటిలాగే ఆద్యంతం అద్భుతంగా సాగింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో చివరకు సింధు గెలిచి తన ప్రియమైన ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. మ్యాచ్ ముగిశాక ఈ చిరకాల ప్రత్యర్థులు పరస్పరం అభినందించుకోవడంతోపాటు... త్వరలో మరోసారి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొనడం విశేషం. జకార్తా: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తొలి అడ్డంకిని అధిగమించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 22–20, 21–23, 21–15తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహరా (జపాన్)పై అద్భుత విజయం సాధించింది. 79 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు కీలకదశలో పాయింట్లు గెలిచి అనుకున్న ఫలితాన్ని అందుకుంది. సింధు, ఒకుహరా ఇప్పటి వరకు 20 సార్లు అమీతుమీ తలపడగా... అందులో సింధు 11వసారి గెలుపొందింది. ప్రిక్వార్టర్స్లో థాయ్లాండ్ ప్లేయర్ పొర్న్పవీ చొచువాంగ్తో సింధు ఆడనుంది. ఈ ఏడాది అత్యుత్తమంగా ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరిన సింధు... ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక పలు టోర్నమెంట్లలో ఆరంభ దశల్లోనే వెనుదిరిగింది. మరోవైపు ఒకుçహారా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. గత కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న ఈ జపాన్ ప్లేయర్ బరిలోకి దిగిన చివరి ఆరు టోర్నీల్లో రెండో రౌండ్ దాటలేకపోయింది. ‘ఇటీవలి కాలంలో ఆరంభ రౌండ్లలోనే పరాజయాలు ఎదురయ్యాయి. అలాంటి దశలో ఈ విజయం చాలా ముఖ్యమైంది. ఒకుహరాతో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. తను అంత తేలికగా పరాజయాన్ని అంగీకరించదు. ఆటలో రోజురోజుకు చాలా మార్పులు వస్తున్నాయి. సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటాకింగ్ గేమ్ తగ్గి.. రక్షణాత్మక ధోరణిలో ఆడటం ఎక్కువైంది. ఇక అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆటకు ఫిట్నెస్ కీలకమే. దానిపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. ఈ నేపథ్యంలో ఈ విజయం నాలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఓపికగా ఎదురుచూస్తే లయ అందిపుచ్చుకోవచ్చని నిరూపితమైంది. ఫలితంతో సంతోషంగా ఉన్నా. కానీ ఇంకా చాలా విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా’ అని సింధు మ్యాచ్ అనంతరం పేర్కొంది. సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 67 నిమిషాల్లో 18–21, 21–18, 21–14తో లియో రాలీ కర్నాండో–బాగస్ మౌలానా (ఇండోనేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్యసేన్ 11–21, 22–20, 15–21తో టాప్ సీడ్ షి యూఖీ (చైనా) చేతిలో ఓడాడు. 65 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్లో పరాజయం పాలైన లక్ష్యసేన్... ఆ తర్వాత పుంజుకున్నా... కీలక సమయాల్లో పాయింట్లు గెలిచిన చైనా ప్లేయర్ మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్లో ప్రణయ్ 17–21, 18–21తో ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో మాళవిక బన్సోద్ (భారత్) 21–16, 16–15తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. ఇతర మ్యాచ్ల్లో అనుపమ (భారత్) 15–21, 9–21తో కిమ్ గా యిన్ (కొరియా) చేతిలో... రక్షిత శ్రీ (భారత్) 21–14, 15–21, 12–21 సుపనిద కటెథాంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.

సెమీస్లో సబలెంకా
పారిస్: కెరీర్లో నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ దిశగా ప్రపంచ నంబర్వన్, బెలారస్ స్టార్ సబలెంకా మరో అడుగు ముందుకు వేసింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడ్ సబలెంకా రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 7–6 (7/3), 6–3తో గెలుపొందింది. 1 గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడింది. అయితే ఏడో గేమ్లో కిన్వెన్ తడబడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కిన్వెన్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 4–4తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో నిలిచింది. టైబ్రేక్లో సబలెంకా జోరు కనబరిచి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సబలెంకా ఏడో గేమ్లో, తొమ్మిదో గేమ్లో కిన్వెన్ సర్వీస్లను బ్రేక్ చేసి అదే జోరులో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సబలెంకా ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. 20 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 18 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు కిన్వెన్ ఐదు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. 22 విన్నర్స్ కొట్టిన ఈ చైనా స్టార్ 31 అనవసరతప్పిదాలు చేసింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 7–5తో 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 1 గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్వియాటెక్ మూడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్లో స్వియాటెక్కిది వరుసగా 26వ విజయం. 2022, 2023, 2024లలో విజేతగా నిలిచిన స్వియాటెక్ టైటిల్ నిలబెట్టుకోవడానికి రెండు విజయాల దూరంలో ఉంది. సెమీస్లో ముసెట్టి పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 6–2, 4–6, 7–5, 6–2తో 15వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముసెట్టి ఎనిమిది ఏస్లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–1, 6–3, 6–4తో 17వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించాడు.

జూలై 5న నీరజ్ చోప్రా ‘క్లాసిక్’ ఈవెంట్
బెంగళూరు: భారత ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్కు కొత్త షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 5న బెంగళూరులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ల ఉమ్మడి భాగస్వామ్యంతో చోప్రా గత నెలలోనే ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. కానీ పహల్గాంలో ఉగ్రదాడి దరిమిలా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్, పాక్ల మధ్య డ్రోన్ దాడులతో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో భారత్లోని కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం తదితర ప్రతికూల పరిస్థితులతో మే 24న క్రీడాఈవెంట్ను నిర్వహించే వాతావరణం లేకపోయింది. ఈ జావెలిన్ త్రో టోర్నీయే కాదు... ప్రముఖ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కూడా వాయిదా పడింది! ఇప్పుడు ఉద్రిక్తతలు సద్దుమణగడంతో నీరజ్ చోప్రా, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ వాయిదా పడిన ఈవెంట్ నిర్వహణకు తుదికసరత్తు పూర్తి చేసి జూలై 5 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది స్టార్ అంతర్జాతీయ జావెలిన్ త్రోయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో చోప్రా సహా ఐదుగురు భారత అథ్లెట్లు కాగా... ఏడుగురు విదేశీ అథ్లెట్లు ఉన్నారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి నీరజ్తో పాటు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన సచిన్ యాదవ్, కిషోర్ జేనా, రోహిత్ యాదవ్, సాహిల్ పాల్గొంటున్నారు. విదేశీ స్టార్లలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోహ్లెర్ (జర్మనీ), 2015 ప్రపంచ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గెన్కీ డీన్ (జపాన్), రుమేశ్ పతిరగె (శ్రీలంక), లూయిజ్ మారిసియో (బ్రెజిల్) భారత్లో జరిగే ఈవెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 199 నుంచి రూ. 9999 ధర పలికే టికెట్లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ బాక్స్ ప్రేక్షకుల కోసం రూ. 44,999 టికెట్లు ఉన్నాయి.

ఆర్సీబీకి అందిన ద్రాక్ష
విరాట్ కోహ్లి 17 సీజన్లలో కలిపి 8 వేల పరుగులు చేసినా... క్రిస్ గేల్ విధ్వంసక బ్యాటింగ్తో 7 సీజన్లలో రికార్డులు బద్దలు కొట్టినా... డివిలియర్స్ 11 సీజన్లలో మరచిపోలేని మెరుపు ప్రదర్శనలు చూపించినా సాధ్యం కాలేదు... ఈ ముగ్గురు కలిసి 7 సీజన్లలో టి20 క్రికెట్ మజా ఏమిటో చూపిస్తూ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచినా... అసలు లక్ష్యం మాత్రం అందనంత దూరంలో నిలిచిపోయింది... గేల్ ఎప్పుడో టీమ్కు దూరమయ్యాడు...డివిలియర్స్ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితం తప్పుకున్నాడు...వీరిద్దరితో కలిసి ఐపీఎల్లో ఓవరాల్గా టాప్–2 భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లి... ఆ తర్వాత డుప్లెసిస్తో కలిసి మరో మూడు సీజన్లు బ్యాటింగ్ భారం మోశాడు. కానీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్లు వచ్చినా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం దక్కలేదు! అయితే ఎట్టకేలకు బెంగళూరు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకుంది. కోహ్లి ఆనందభాష్పాలు చూస్తే ఈ విజయం విలువేమిటో తెలుస్తుంది! స్టార్లు కాకపోయినా.... పెద్ద పెద్ద పేర్లు ముఖ్యం కాదు... చిన్న ఆటగాళ్లే అయినా వారు చూపించే ప్రభావం ముఖ్యమని ఆర్సీబీ నిరూపించింది. టోర్నీలో పది మంది బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్కు ముందు జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ‘బిగ్ త్రీ’పై మాత్రమే ఆధారపడిన గెలుపును ఆశించిన జట్టులా ఈసారి బెంగళూరు ఏమాత్రం కనిపించలేదు.వైవిధ్యంతో పాటు బ్యాటింగ్ లోతును కూడా టీమ్ చూపించింది. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆదుకున్నారు. లీగ్ దశలో పంజాబ్పై టిమ్ డేవిడ్, చెన్నైపై షెఫర్డ్, లక్నోపై జితేశ్ ఆడిన ఇన్నింగ్స్లు అసాధారణ ప్రదర్శనలుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి వేదికపై ఆడిన 7 మ్యాచ్లూ గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. సాల్ట్ను ఎంచుకొని... ఐపీఎల్ వేలం సమయంలో టీమ్ డైరెక్టర్ బొబాట్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘వారు ఎలా ఆడతారన్నది మేం ఆలోచించడం లేదు. మేం ఎలా ఆడించాలనే ఆలోచనే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే మేం ఆటగాళ్లను ఎంచుకున్నాం’ అని ఆయన చెప్పారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్లతో పాటు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలు బెంగళూరుకు అద్భుతంగా పని చేశాయి. కోహ్లికి జోడీగా విధ్వంసకర ఓపెనర్ కావాలంటూ కార్తీక్ పట్టుబట్టి మరీ సాల్ట్ను రూ. 11.25 కోట్లకు తీసుకునేలా చేశాడు. ఏకంగా 175 స్ట్రయిక్రేట్తో అతను 403 పరుగులు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ సూపర్... కెప్టెన్గా కూడా రజత పాటీదార్ను ఎంచుకోవడంలో ఆర్సీబీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. భారత్ క్రికెట్లో స్టార్ ఆటగాడు కాకపోయినా... ముస్తాక్అలీ ట్రోఫీలో అతని నాయకత్వ లక్షణాలు చూసి ఎంచుకుంది. ఇది ఎంత గొప్పగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోల్కతా, చెన్నై, ముంబైలపై వారి వేదికల్లో ఎన్నో ఏళ్ల తర్వాత విజయాలు సాధించడంలో బ్యాటర్గా పాటీదార్ పాత్ర ఎంతో ఉంది. 312 పరుగులతో అతను రాణించాడు. సుయాశ్ శర్మ, యశ్ దయాళ్లను సరైన సమయంలో సమర్థంగా వాడుకోవడంలో అతని కెప్టెన్సీ ప్రతిభ కనిపించింది. ఇప్పుడు 17 సీజన్లలో సాధ్యం కాని ఘనతను కెపె్టన్గా తన తొలి సీజన్లోనే అందుకొని పాటీదార్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును ఘనంగా లిఖించుకున్నాడు. అంతా కోహ్లిమయం... బెంగళూరు టీమ్ సభ్యులలో గతంలో కృనాల్ పాండ్యా, హాజల్వుడ్, భువనేశ్వర్, సాల్ట్ ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇతర యువ ఆటగాళ్ల కెరీర్ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు. ఇప్పటికిప్పుడు టైటిల్ గెలిచినా, ఓడినా వారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి పరిస్థితి అందరికంటే భిన్నం. అతను 18 సీజన్లుగా ఒకే జట్టుకు తన సర్వం ధారబోశాడు. ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. కానీ టైటిల్ మాత్రం గెలవలేని లోటు ప్రతీసారి వెంటాడేది. గతంలో మూడు ఫైనల్ మ్యాచ్లో ఓడిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా 2016 సీజన్లో ఏకంగా 973 పరుగులతో చెలరేగినా ఫైనల్లో పరాజయం అతడికి తీవ్ర వేదనను కలిగించింది. నాటినుంచి ఇప్పటి వరకు మళ్లీ జట్టు ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను ఈసారి గెలవలేకపోతే మరింత ఆవేదన కలిగేది. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కోహ్లి కోసమే వచ్చినట్లుగా ఉంది. అందుకే మైదానమంతా కోహ్లి చుట్టే సంబరాలు. గతంలో జట్టులో భాగంగా ఉండి ట్రోఫీ గెలవలేని డివిలియర్స్, గేల్ కూడా కోహ్లి పక్కన ఉండి అతని సంతోషంలో భాగం కావడం విశేషం. -సాక్షి క్రీడా విభాగం ‘పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా’ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోర్నీలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించాం. –విరాట్ కోహ్లి
బిజినెస్

ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్ బడ్జెట్ను జూన్ 10కి వాయిదా వేశారు.పాక్ ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్ డాలర్ల అప్పును ఐఎంఎఫ్ పాకిస్థాన్కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్తో విభేదాలు తలెత్తడంతో జూన్ 2న విడుదల కావాల్సిన బడ్జెట్ను పాకిస్థాన్ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (పీఎస్డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి).

రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదల
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. ఈ ప్రతిపాదిత చట్టం సమకాలీన డిమాండ్లకు సరిపోని నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేశారు. కొత్త బిల్లు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా బ్యూరోక్రసీ, మధ్యవర్తుల అవసరం తగ్గనుంది.ప్రాపర్టీ డాక్యుమెంటేషన్పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. భూ దందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు ప్రాధాన్యత చోటుచేసుకుంటున్నాయి.1908 రిజిస్ట్రేషన్ చట్టం ఆన్లైన్ డాక్యుమెంట్ నిర్వహణ, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఈ వెసులుబాట్లు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అత్యవసరంగా మారాయి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇప్పుడు కేవలం భూ దందాలకు మాత్రమే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాలకు కీలకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆన్లైన్ అప్లోడ్లు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశం అంతటా స్థిరమైన, విశ్వసనీయమైన వ్యవస్థను స్థాపించడానికి కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ ఏకరూపత పౌరులందరికీ సమర్థవంతమైన, సురక్షితమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్రతిపాదిత అంశాలు..గృహ కొనుగోలుదారులకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం కొత్త బిల్లులోని ప్రధానాంశాల్లో ఒకటి. ప్రతిపాదిత విధానంలో పౌరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆస్తి పత్రాలను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చు.ఆన్లైన్ ద్వారా పేపర్ వర్క్ తగ్గుతుందని, ప్రక్రియలను వేగవంతం చేస్తుందని, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.ఆస్తుల లావాదేవీలకు డిజిటల్ రికార్డులను తప్పనిసరి చేయడం ద్వారా చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఈ చర్యతో అమ్మకం ఒప్పందాలు, తనఖా పత్రాలు, సేల్ సర్టిఫికేట్లు వంటి కీలక డాక్యుమెంట్ల చట్టబద్ధత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.డిజిటల్-ఫస్ట్ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఆస్తి లావాదేవీలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం.

వచ్చే ఐదేళ్లలో 50 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు
దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్పోర్ట్ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్వర్క్లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) హబ్గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.

15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు
ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో రిటైల్ స్థాయిలో వంట నూనెల ధరలు 5-6 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనె ధరలు ఎట్టకేలకు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఇది సింగిల్ డిజిట్కు చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఇమామి అగ్రోటెక్ డైరెక్టర్, సీఈవో సుధాకర్ రావు దేశాయ్ తెలిపారు.తగ్గిన సుంకాల వల్ల కలిగే ప్రయోజనం మరో 15 రోజుల్లో రిటైల్ ధరల్లో ప్రతిఫలిస్తుందని భావిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లు ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ధరల దిద్దుబాటు కేవలం దిగుమతి చేసుకునే నూనెలకే పరిమితం కాదని దేశాయ్ తెలిపారు. దిగుమతులపై ఆధారపడని ఆవనూనె కూడా వంటనూనెలపై కూడా 3-4 శాతం తగ్గుదలను చూడవచ్చని అన్నారు.ఇదీ చదవండి: 300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్ముడి వంట నూనె, రిఫైన్డ్ ఆయిల్ సుంకాల మధ్య వ్యత్యాసం 12.5 శాతం నుంచి 22.5 శాతానికి పెరగడం వల్ల కంపెనీలు ముడినూనెను దిగుమతి చేసుకుని దేశీయంగా శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకుంది. అయితే తాజాగా 10 శాతం సుంకం తగ్గింపు నిర్ణయం ఈ విభాగంలోని వ్యాపారాలకు బూస్ట్గా నిలుస్తుందని హల్దర్ వెంచర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేశవ్ కుమార్ హల్దర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి దిగుమతి చేసుకున్న వంట నూనెల దేశీయ రిటైల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రైస్ బ్రాన్, ఆవనూనె వంటి నూనెలకు కూడా ఈ తగ్గుదల వర్తించే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫ్యామిలీ

వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా వారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ablu Rajesh Kumar (@ablurajesh_) (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్)

వయసు 70 ఏళ్లు..ఇప్పటికీ 40 కి.మీ సైకిల్పైనే..
చిన్న వ్యాపారమే నడుపుతున్నా..రయ్రయ్మని..బైక్ లేదా కార్లలలోన వెళ్తుంటారు. పైగా అది స్టేటస్ ఆఫ్ సింబల్గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు బడా వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా..ఇప్పటికీ సాధారణ సైకిల్పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కి.మీ పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భరంగా అంతలా ఫిట్నెస్ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!.అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపరావేత్త అయినా ఆయన ఫిట్నెస్కి వీరాభిమాని. ఆయన వ్యాపారిగా తన కెరీర్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూరత్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ..సైకిల్పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్ని సలాబత్పురా నుంచి అంకలేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్లోని తన ఇంటి నుంచి స్టేషన్కి మూడు కి.మీ సైకిల్పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడో 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే..ఆ సైకిల్ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనలా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన రోజూ పదివేల అడుగులపైగా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే..మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కి.మీ. సైకిల్పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!..(చదవండి: 'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్ నటుడు గోవింద్ వైఫ్ సైతం..)

ఉండాల్సిన నమ్మకం : భగవంతుడు సర్వాంతర్యామి
భగవంతుడు సర్వాంతర్యామి అనేది భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులకు నదీనదాలూ, కొండలూ, గుట్టలూ, జంతువులూ, పక్షులూ... ఒకటేమిటి– అన్నీ పూజనీయాలే. పండుగలూ పబ్బాలలో ప్రకృతితో మమేకమై తన్మయత్వంతో పూజలు చేయడం అందుకే! అయితే వివిధ రూపాల్లో ఉన్న దేవుని గుర్తించడంలో మాత్రం చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఇందుకు దైవాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వారికి లేకపోవడమే కారణం. దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడి లోపలికి చాలా భక్తిప్రపత్తులతో వెళతారు. కానీ గుడి మెట్లపై కూర్చునే యాచకులు, దీనులను చాలామంది పట్టించుకోరు. వారితోనే నిజంగా దేవుడు కూర్చున్నా గుర్తించలేరు. అయితే భగవంతుని గుర్తించడానికి శోధన అవసరం. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్అన్వేషించే కొద్దీ భగవంతుణ్ణి ఏదో ఒకరోజు తెలుసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులతోపాటు అన్వేషణా జ్ఞానాన్నీ సముపార్జించాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ నారాయణుడే మన ముందుకొచ్చి నిల్చున్నా తెలుసుకోలేం. పైపెచ్చు అనుమానిస్తాం. అతను నిజంగా నారాయణుడేనా అని ఆలోచనలో పడతాం. నారాయణుడేదో మన అవసరాలను తీర్చడానికొస్తే ఎదురు మనమే అవీ ఇవీ అడిగి అనుమానిస్తాం. అప్పుడు ‘నేను సాక్షాత్తూ ఆ నారాయణుడినే నయ్యా’ అని భగవంతుడు చెప్పినా సరే... మన మనసు ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. ‘అదేంటీ, నాకంత సులభంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడా’ అని సందేహిస్తాం. ఇటువంటి స్థితిలోనైనా మనకు ప్రహ్లాదుడి మాట గుర్తుకు రావాలిగా... ఆ హరి నారాయణుడు లేని చోటేది? అతను సర్వాంతర్యామి అనేది తెలిసుండాలిగా! అలాకాక ‘నీకు శంఖం, చక్రం లేవేమిటీ? నీ వాహనమైన గరుత్మంతుడేడీ?’ అని ప్రశ్నిస్తే ఆ నారాయణుడిని ఎలా చూడగలం?చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుందిమనకు మన మీదే అపనమ్మకం. అటువంటప్పుడు సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైనా ఏమీ చేయలేడు. కనుక మనకు ఉండాల్సింది నమ్మకం. అన్నింట్లోనూ ఆ భగవంతుడు ఉంటాడనేది తెలియాలి. – యామిజాల జగదీశ్

'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..)
ఫొటోలు
అంతర్జాతీయం

భారత్ను బెదిరించిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి!
లాహోర్: భారత్ను విచ్ఛిన్నం చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన జైఫే మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిచెందాడు. ఈ విషయాన్నిజైషే మహ్మద్ ఉగ్రవాద సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్ ధృవీకరించాయి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉగ్రవాది అబ్దల్ అజీద్ మృతిచెందిన విషయాన్ని వెల్లడించడంతో పాటు అతని అంత్యక్రియలు బహవల్పూర్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కార్డియక్ అరెస్టుతో అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశానికి చెందిన తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసింది, అందులో ఉగ్రవాది అబ్దల్ అజీజ్ అంత్యక్రియలు నిర్వహించనున్న బహవల్పూర్ ఒకటి.అయితే ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిచెందిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని ప్రపంచ దేశాల ముందు చులకనైన ఆ దేశం.. ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిపై మాట్లాడకుండా ఉండటమే మేలు అనే భావనలోనే ప్రకటనలకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతోనే పాకిస్తాన్ అధికారులు ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. Jaish-E-Mohammad Commander Maulana Abdul Aziz Esar died yesterday.Died of Cardiac arrest probably 🤷🏻♀️ pic.twitter.com/tdSAwsi908— manju 🇮🇳 (@justtweettz) June 3, 2025

నా పిల్లలు.. మోదీ తాతను మిస్ అవుతున్నారు: ఉషా వాన్స్
వాషింగ్టన్ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని నరేంద్ర మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) గుర్తు చేశారు. జేడీ వాన్స్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్ అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.Usha Vance about Modi ji 🔥 pic.twitter.com/44qcmseFFX— desi mojito 🇮🇳 (@desimojito) June 3, 2025అమెరికా వాషింగ్టన్ డీసీలో యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మీరాబెల్లు భారత్ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. 'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన ఐదేళ్ల కుమార్తె మీరాబెల్ పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు.

తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ!
కీవ్: ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా రష్యా భూభాగం 4 వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ చేపట్టిన కోవర్ట్ మిలటరీ ఆపరేషన్. ఇప్పుడిదే ప్రపంచ నేతల్లో హాట్ టాపిక్. ఎందుకంటే?.2022 నుంచి ప్రారంభమైన ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో ఓ వైపు శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమంటూ ఉక్రెయిన్ భీకర దాడికి తెగబడింది. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పేరుతో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఊహించని పరిణామంలో 40 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా మాస్కో 60వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.అయితే, నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యంలో ఉక్రెయిన్ బీభత్సం ఎలా సృష్టించిందనేదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.🇺🇦 #Ukraine - 🇷🇺 #Russia: Ukraine struck four Russian airbases in a coordinated long-range drone attack, destroying over 40 aircraft, including Tu-95 and Tu-22M3 bombers, as well as an A-50 surveillance jet. The drones were smuggled deep into Russia, hidden inside wooden sheds… pic.twitter.com/y7L0wVTMS6— POPULAR FRONT (@PopularFront_) June 1, 2025 రహస్యంగా రష్యాలోకి డ్రోన్ల తరలింపుఈక్రమంలో రష్యాపై ఉక్రెయిన్ దాడి జరిపిన తీరుపై జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. మూడు టైమ్ జోన్లు. 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు రష్యా వైమానిక స్థావరాలు. ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్ మార్కెట్లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు 1200 డాలర్లు ఖర్చుతో మొత్తం 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కుల్లో నింపింది. ఇందుకోసం ట్రక్కును ప్రత్యేకంగా చెక్కతో డిజైన్ చేయించింది. Today, a brilliant operation was carried out. The preparation took over a year and a half. What’s most interesting, is that the “office” of our operation on Russian territory was located directly next to FSB headquarters in one of their regions.In total, 117 drones were used in… pic.twitter.com/tU0SMN9jdB— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025మనుషుల అవసరం లేకుండానేమనుషుల సహాయం లేకుండా ఉక్రెయిన్లో ఉండి.. రష్యాలోకి చొరబడ్డ ట్రక్ డోర్లును ఓపెన్ చేయడం, ట్రక్కు లోపల ఉన్న డ్రోన్లు లోపలి నుంచి ఎగురుకుంటూ బయటకు రావడం, రష్యా బాంబర్ విమానాలపై మెరుపు దాడి చేయడం ఇదంతా ఉక్రెయిన్ రిమోట్ కంట్రోల్తో చేసింది. ఫలితంగా కొన్ని గంటల వ్యవధిలో రష్యా 40 యుద్ధ విమానాలు సర్వనాశనం చేసింది. ఈ హాని విలువ సుమారుగా 7 బిలియన్ (దాదాపు రూ.60వేల కోట్లకు)పైగా ఉన్నట్లు అంచనా.రష్యన్ భద్రతా సంస్థకు సమీపం నుంచి ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఆపరేషన్ను రష్యన్ భద్రతా సంస్థ (FSB) కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన అతిపెద్ద దాడిని చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్గా అభివర్ణించారు. “The ‘office’ of our operation on Russian territory was located directly next to an FSB headquarters in one of their regions,” — Zelenskyy. pic.twitter.com/RC10fBPUrG— Special Kherson Cat 🐈🇺🇦 (@bayraktar_1love) June 1, 2025ఈ దాడిలో మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్న సైనిక విమానాల్లో టు-95, టు-22ఎం, టు-160 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు ఏ-50 విమానం కూడా ఉంది. ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబర్లలో సుమారు 34శాతం నష్టం జరిగింది.జెలెన్స్కీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడి కోసం 18 నెలలపాటు ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందు, ఆపరేషన్లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి ఉక్రెయిన్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ విమానాల నష్టం వల్ల ఉక్రెయిన్పై విధ్వంసకర క్షిపణి దాడులను అందించగల సామర్ధ్యం రష్యాకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం
న్యూఢిల్లీ: కొత్తగా తయారుచేసి భారత్కు ఇవ్వాల్సిన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ(సుదర్శన చక్ర)లను 2025–2026 షెడ్యూల్ ప్రకారం అందజేస్తామని రష్యా స్పష్టంచేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్పైకి భారత్ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటు నుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం తెల్సిందే. దీంతో ఒప్పందం ప్రకారం మిగతా ఎస్–400 యూనిట్లనూ త్వరగా తయారుచేసి సరఫరాచేయాలని భారత్ ఇటీవల రష్యాను కోరింది. దీనిపై రష్యా డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ ఇండియా రోమన్ బబూష్కిన్ సోమవారం స్పందించారు. ‘‘భారత్, పాక్ పరస్పర సైనిక చర్యల్లో ఎస్–400 అద్భుత పాటవాన్ని ప్రదర్శించిందని మేం కూడా విన్నాం. భారత్తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్ మాత్రమేకాదు భారత్లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరో రెండు యూనిట్లను భారత్కు అందించాల్సి ఉంది. వాటిని షెడ్యూల్ ప్రకారం తయారుచేసి డెలివరీ ఇస్తాం’’అని బబూష్కిన్ అన్నారు. 2018లోనే రష్యాతో భారత్ రూ.46,000 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవడం తెల్సిందే. ఇందులోభాగంగా ఐదు స్క్వాడ్రాన్ల ఎస్–400 యూనిట్లను రష్యా తయారుచేసి భారత్కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ మరికొద్ది వారాల్లో ఖరారుకానుంది.
జాతీయం

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం
అన్నానగర్: ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి చెన్నైలోని పూందమల్లిలో నివసిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్స్ట్రాగామ్ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఉత్తర చెన్నైకి చెందిన సాయి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి తరచుగా కూతురిని మందలించింది. దీంతో ఆ బాలిక కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి, స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ బాలిక తన ప్రియుడిని ఓ సారి కలిసి మాట్లాడాలని ప్లాన్ చేసుకుంది. ఆదివారం రా త్రి 11 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి చెన్నైలోని కొత్తవల్సావడి ప్రాంతంలోని ఒక భవనం వద్ద ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో సాయి స్నేహితులు రాహుల్ (26)సహా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అక్కడికి వచ్చారు. హఠాత్తుగా సా యి, అతని స్నేహితులు కూడా ఆ బాలికను ఆ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ప్రయతి్నంచారు. ఆ ప్రాంత ప్రజలు దీనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోర్ట్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు.

కమల్ హాసన్కు కర్ణాటక హైకోర్టు చివాట్లు
సాక్షి,బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టింది. ‘మీరేమైనా చరిత్రకారులా అంటూ మండిపడింది. ప్రజలకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా. కానీ మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. జూన్ 5న థగ్లైఫ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో థగ్లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతు దారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో థగ్లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. ‘మీరు కమల్ హాసన్ అయితే కావొచ్చు ప్రజల మనోభావాలు దెబ్బ తీయోచ్చా?. ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమనే కోరారు.. కానీ మీరు థగ్ లైఫ్ సినిమా విడుదల విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడి వచ్చారు. సినిమా సాఫీగా విడుదల కావాలంటే క్షమాపణ చెబితే సరిపోతుంది కదా.మీరు కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టిందని స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కన్నడిగుల మనోభావాలో తక్కువగా అంచనా వేశారు. 75ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా శ్రీరాజగోపాలకృష్ణ చార్య క్షమాపణలు చెప్పారు. మీరూ క్షమాపణలు చెప్పండి అని సూచించింది.అందుకు తన స్టేట్మెంట్ను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కమల్ హాసన్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కమల్ హాసన్ తప్పని సరిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సూచించింది.

ఇండియా కూటమి నేతల కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి, కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం సమావేశ వివరాలను ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో మధ్యాహ్నం మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం.. సుమారు 200 మంది ఎంపీలతో సంతకాల సేకరణ జరిపింది ఇండియా కూటమి. పలు రాజకీయ పక్షాల ఎంపీలు సమ్మతి తెలిపిన ఆ ఉమ్మడి లేఖను సైతం ప్రధానికి పంపగా.. ఇవాళ మీడియా ముందు దానిని విడుదల చేయనున్నట్లు సమాచారం.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. తొలిసారి జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్రధాని మోదీ
సాక్షి,ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఈ నెల 6న (జూన్6) జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చీనాబ్ రైల్వే బ్రిడ్జీని ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉగ్రవాదం అణిచివేతపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోదీ తన పర్యటనలో సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ను వర్చువల్గా ప్రారంభించనున్నారు. తద్వారా జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు తొలగనున్నాయి.PM Modi is expected to inaugurate the Chenab Bridge—the world’s highest railway bridge—during his upcoming visit to Jammu and Kashmir on June 6, 2025.@DrJitendraSingh shared this update on platform X.Watch as @anchoramitaw, @MohitBhatt90 & @ShreyaOpines bring us more details. pic.twitter.com/3IZtoq9LIT— TIMES NOW (@TimesNow) June 3, 2025 దీంతో పాటు ఈ మార్గమధ్యంలో చీనాబ్ నది (Chenab River)పై నిర్మించిన బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు.
ఎన్ఆర్ఐ

ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ సీఈవోకి గూగుల్ రూ. 855 కోట్ల ఆఫర్
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ (Neal Mohan Youtube CEO) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రముఖ సెర్చ్ ఇంజీన్ గూగుల్ను వీడి ట్విటర్లో చేరకుండా ఉండేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో నీల్ మోహన్ తన అనుభవాలను, విశేషాలను పంచుకున్నారు. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఇటీవల తన 'People by WTF' పాడ్కాస్ట్ తాజా ఎపిసోడ్లో నీల్ మోహన్తో సంభాషించారు. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం నుండి ప్లాట్ఫామ్ అల్గోరిథంను ఛేదించే చిట్కాల వరకు ఇద్దరూ అనేక అంశాలపై చర్చించారు.సుదీర్ఘకాలంగా యూట్యూబ్లో ఎగ్జిక్యూటివ్గా సేవలు అందించి 2023నుంచి గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫాం సీఈవోగా ఉన్న ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ (ఎక్స్)లో చేరకుండా ఉండేందుకు 2011లో 15 ఏళ్ల క్రితం గూగుల్ మీకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు 855 కోట్ల రూపాయలు) చెల్లించిదటగా అని ప్రశ్నించాడు నిఖిల్ కామత్ వాదనను ఖండించకపోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. అయితే 2011 టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం అనేక సంవత్సరాలు కొనసాగే పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో , గూగుల్ ఆఫర్ ఇచ్చిందట నీల్మోహన్కు. అలా నీల్ మోహన్కు దూకుడు కళ్లెం వేసిందని తెలిపింది. అప్పటికే గూగుల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యూహంలో కీలకంగా ఉన్న నీల్మోహన్ను వదులుకోవడానికి ఇష్టపడని గూగుల్ యూట్యూబ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్య దీర్ఘకాలంలో గూగుల్కు మంచి ఫలితాలను అందించింది. అంతేకాదో సుందర్ పిచాయ్ను బోర్డులోకి తీసుకురావడానికి ట్విటర్ ప్రయత్నించిందట. దీంతో పిచాయ్కి కూడా 50 మిలియన్ల స్టాక్ గ్రాంట్ ఆఫర్ ఇచ్చింది గూగుల్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ,స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత నీల్ మోహన్, ఆండర్సన్ కన్సల్టింగ్ (ఇప్పుడు యాక్సెంచర్)లో తన కెరీర్ను ప్రారంభించారు. అక్కడినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ చివరికి బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత . 2007లో గూగుల్ డబుల్ క్లిక్ను 3.1 బిలియన్డాలర్లకు కొనుగోలు చేయడంతో గూగుల్ యాడ్స్ విభాగంలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 2023లో సుసాన్ వోజ్సికి తర్వాత నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్పై ఫ్యాన్ కామెంట్ వైరల్అప్పట్లో హిందీ రాదు, తలచుకుంటే నవ్వొస్తుంది...తన తండ్రి ఇండియాలో ఐఐటీలో చదవి పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లారని మోహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉన్నప్పుడే తాను పుట్టానని, తన బాల్యంలో ఎక్కువ భాగం అమెరికాలో గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే 1986లో భారతదేశానికి తిరిగి వచ్చా.. ఆ సమయంలో లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చేరినపుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు హిందీమీద అంత పట్టు లేదు, ఏడో తరగతిలో అదో పెద్ద సవాల్ అంటూ గుర్తు చేసుకున్నారు.చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్

పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో
తూర్పు గోదావరి జిల్లా: మరో మూడు వారాల్లో ఆ ఇంట వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఆనంద డోలికల్లో తేలియాడాల్సిన బంధుగణమంతా.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబోయే పెళ్లి కొడుకుగా రావాల్సిన కుమారుడు.. నిర్జీవంగా ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతులేకుండా పోయింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న మామిడికుదురు గ్రామానికి చెందిన ఎండీ తురాబ్ అలీ(28) ఈ నెల 17న గుండెపోటుతో మరణించారు. వచ్చే నెల 15న అతని వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులుండగా, ఈ విషాద వార్త ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వాస్తవానికి తురాబ్ అలీ సోమవారం ఇంటికి రావాల్సి ఉంది. యాదృచ్చికంగా అదే రోజు అతని మృతదేహం ఇంటికి చేరిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అతని తండ్రి రిజ్వానుల్ హసన్ హైదరాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, తురాబ్ అలీ పెద్దవాడు. తురాబ్ అలీ తాతయ్య తురాబ్ హుస్సేన్ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పేరునే తురాబ్ అలీకి తల్లిదండ్రులు పెట్టారు. పెళ్లి ఏర్పాట్లలో.. మరికొద్ది రోజుల్లో తురాబ్ అలీ వివాహం జరగాల్సి ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మంటపం బుక్ చేసి, పెళ్లికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంచడంలో బిజీగా ఉన్నారు. ఈలోగా తురాబ్ అలీ మరణవార్త చేరడంతో.. పెళ్లింట కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు నడుమ మామిడికుదురు ఖబర్స్థాన్లో తురాబ్ అలీ అంత్యక్రియలు జరిగాయి.

“కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ” విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ““కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ”అనే అంశంపై జరిపిన 80వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీ వేత్తలలో కొంతమంది ఈ రోజు ఒకే వేదికమీద పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ, శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అసంఖ్యాకంగాఉన్న భారతీయ భాషలలో, 24 భాషలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రదానంచేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న 8 మంది తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, వారు పురస్కారం పొందిన రచనలపై స్వీయవిశ్లేషణ చెయ్యడం చాలా వినూత్నంగా ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం భారతీయ పౌరసత్వం కల్గినవారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులు. కాని పద్మ పురస్కారాల లాగా, భారతీయ పౌరసత్వంతో సంభందం లేకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయమూలాలున్న రచయితలను కూడా ఈ కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారాలకు అర్హులను చేస్తే, మరిన్ని వైవిధ్య భరితమైన రచనలు పోటీలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని పరిశీలించాలని లక్షలాదిమంది ప్రవాసభారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీకి డా. ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.గత 12 సంవత్సరాలగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న డా. కృతివెంటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ “కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోల్చిచూస్తే వాసి లోను, రాశిలోనూ సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయన్నారు. అయితే మన తెలుగు రచనలు ఎక్కువగా ఆంగ్లం, హిందీ తదితర బాషలలోకి ఎక్కువగా అనువాదం కావలసిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరంనుండి రచయితలు ఎవ్వరికివారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలను పంపుకోవచ్చు అన్నారు.” ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులు గా పాల్గొన్న ...డా. గోరటి వెంకన్న, “వల్లంకి తాళం” కవిత, 2021-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. మధురాంతకం నరేంద్ర, “మనోధర్మ పరాగం” నవల, 2022-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, “రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు”, 2023-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), Galib-The Man, The Times, in English by Mr. Pavan Varma; “గాలిబ్ నాటి కాలం” తెలుగు అనువాదం-2023-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారగ్రహీత; పెనుగొండ లక్ష్మీనారాయణ, “దీపిక” రచనకు-2024-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, “మాయా లోకం” నవల, 2024-కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారగ్రహీత, డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడియా నవల “దాడీ బుధా” ను “ఈతచెట్టు దేవుడు” గా తెలుగులోకి అనువాదం- 2024-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారవిజేతలు తమ పురస్కార రచనల విశేషాలను ఆసక్తిగా పంచుకున్నారు.పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును

థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య తెప్పోత్సవం
శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) విదేశీ నీళ్లపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినం ‘తెప్పోత్సవాన్ని’ (దివ్య తెప్ప ఉత్సవం) ఘనంగా, భక్తిశ్రద్ధలతో టెమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద నిర్వహించింది. యుకె , యూరప్లో హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయి అని నిర్వాహకులు ప్రకటించారు. వేద పారాయణం, భజనలు, సమూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన ఈ సాయంత్రానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. సుందరంగా అలంకరించబడిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘గోవింద గోవింద’ నినాదాల మధ్య టెమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌక యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. శ్రద్ధతో, సమగ్రంగా రూపొందించి ఈ ఉత్సవం భక్తి, సమాజ చైతన్యం, దైవానుగ్రహానికి అద్దం పట్టింది.ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి SVBTCC హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. “దీపమైన భక్తితో నడిచిన కల నౌకై తేలింది — సేవతో నడిచింది, స్వామి అనుగ్రహంతో సాగింది. ఇది ఎంతోమందికి అరుదైన అనుభూతి - దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అనునిత్య సంప్రదాయాన్ని, యుకె భూమిలో నూతనంగా దర్శించుకోవడం… హృదయాలను నింపింది, ఆత్మలను ఉల్లాసపరిచింది.” అని SVBTCC ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం
అన్నానగర్: ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి చెన్నైలోని పూందమల్లిలో నివసిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్స్ట్రాగామ్ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఉత్తర చెన్నైకి చెందిన సాయి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి తరచుగా కూతురిని మందలించింది. దీంతో ఆ బాలిక కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి, స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ బాలిక తన ప్రియుడిని ఓ సారి కలిసి మాట్లాడాలని ప్లాన్ చేసుకుంది. ఆదివారం రా త్రి 11 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి చెన్నైలోని కొత్తవల్సావడి ప్రాంతంలోని ఒక భవనం వద్ద ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో సాయి స్నేహితులు రాహుల్ (26)సహా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అక్కడికి వచ్చారు. హఠాత్తుగా సా యి, అతని స్నేహితులు కూడా ఆ బాలికను ఆ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ప్రయతి్నంచారు. ఆ ప్రాంత ప్రజలు దీనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోర్ట్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు.

డైవర్షన్ గమనించలేదా?
రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిన్ని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.ఏం జరిగిందంటే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయ పడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ (40), దేవీ లలిత (34) దంపతులు, వారి కుమార్తె వర్షిత (13), తీగిరెడ్డి శివ (30), ఆయన కుమార్తె సాన్వి (4) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.డైవర్షన్ గమనించలేదా?ఏడీబీ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ను పక్క మార్గంలోకి మళ్లిస్తూ డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్ను, డైవర్షన్ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.అర్జున్, రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, అనపర్తి సీఐ సుమంత్ సందర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు, కవలగొయ్యి, రఘునాథపురం గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే..మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింద. బీచ్లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవతున్నారు.

పాముకాటుతో మహిళ మృతి
ఇచ్ఛాపురం టౌన్(శ్రీకాకుళం): మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు. అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు.

దూసుకొచ్చిన మృత్యువు
కాటారం : కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఇద్దరు వృద్ధుల నిండు ప్రాణాలు బలితీసుకుంది. కాలక్షేపం కోసం ఇంటి ఎదుట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారుపాక మధునమ్మ (90), నీలారపు బాలయ్య (65), మల్లయ్య ఆయన మనుమడు ఆరేళ్ల బాలుడు డానియల్తో కలిసి రోడ్డు పక్కన తమ ఇళ్ల ఎదుట చెట్టు నీడకు కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన మొగిళి (కారు డ్రైవర్), మరో ముగ్గురు దైవదర్శనం నిమిత్తం కాళేశ్వరం వెళ్లి అన్నారం బ్యారేజ్ను సందర్శించి దామెరకుంట మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా గంగారం ఎస్సీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుగా ఉన్న చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న వృద్ధులపైకి దూసుకెళ్లింది. మధునమ్మ కాలు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన బాలయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వృద్ధుడు మల్లయ్య, డానియల్కు సైతం తీవ్ర గాయాలవగా భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా మద్యం తాగి ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులో అతివేగంతో వెళ్లడంతో ఇద్దరి ప్రాణాలు పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలిని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మొగిళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ..గంగారంలో కారు ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఘటనా స్థలిని పరిశీలించారు. ఎస్పీ కిరణ్ఖరేతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రమాదానికి కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు.