Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Fathers Day 2025: Ys Jagan Emotional Tweet About His Father Ysr1
నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే స్ఫూర్తి.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఫాదర్స్‌ డే సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్‌ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025

ysrcp Buggana Rajendranath Satirical Comments On CBN Govt2
‘సూపర్‌ సిక్స్‌ కాదు.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌’

సాక్షి, హైదరాబాద్‌: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్‌ సిక్స్‌ ఏమో కానీ.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌ అని సెటైర్లు వేశారు. ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు. ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్‌కు మా బడ్జెట్‌కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్‌ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్‌సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి. అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.ఉద్యోగులకు మోసం.. ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్‌లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్‌సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Sarfaraz Khan blasts 76-ball century in front of Ajit Agarkar with VVS Laxman watching3
సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్‌.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మ‌రో నాలుగు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై అడుగు పెట్టిన భార‌త జ‌ట్టు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.కాగా ఈ సిరీస్ స‌న్న‌హాకాల్లో భాగంగా బెకింగ్‌హ‌మ్ వేదిక‌గా భార‌త సీనియ‌ర్ జ‌ట్టు భార‌త-ఎ టీమ్‌తో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త‌-ఎకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సెంచ‌రీతో మెరిశాడు.బీసీసీఐ వ‌ర్గాల స‌మాచారం.. ప్రకారం రెండో రోజు ఆట‌లో స‌ర్ఫరాజ్ టీ20 త‌ర‌హాలో త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. తర్వాత ఇతరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన‌ భార‌త జ‌ట్టులో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు చోటు ద‌క్క‌లేదు. అత‌డు స్ధానంలో క‌రుణ్ నాయ‌ర్‌కు అవ‌కాశ‌మిచ్చారు.కానీ స‌ర్ఫరాజ్ ఇప్పుడు త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సెల‌క్ట‌ర్లకు గ‌ట్టి స‌మాధాన‌మిచ్చాడు. బీసీసీఐ ఛీప్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్కర్‌, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీయ‌స్ ల‌క్ష్మ‌ణ్ ముందే స‌ర్ఫరాజ్ ఈ సెంచ‌రీ సాధించిన‌ట్లు తెలుస్తోంది. అంత‌కుముందు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ఈ ముంబైక‌ర్ 92 పరుగులు చేశాడు.ఈ క్ర‌మంలో స‌ర్ఫ‌రాజ్‌ను భార‌త జ‌ట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉంచే అవ‌కాశ‌ముంది. ఇక ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో భార‌త సీనియ‌ర్ జ‌ట్టు 459 పరుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కొత్త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహ‌ల్ హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా- ఎ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 299 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిషన్ 45 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 35, శార్దుల్ ఠాకూర్ 19 ప‌రుగులు చేశారు.బుమ్రా ఫెయిల్‌..అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిరాశపరిచాడు. ఏడు ఓవర్లు వేసిన బుమ్రా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 36 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షదీప్ సింగ్ కూడా 12 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకుండానే 52 పరుగులు సమర్పించుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించారు.ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు భార‌త జ‌ట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్చదవండి: వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్‌ కెప్టెన్‌

Satellite Images Show Damage At Irans Nuclear Site4
ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో..

టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.ఇరాన్‌లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్‌ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్‌లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్‌ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్‌లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్‌ఐఎస్‌)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్‌లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్‌ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్‌ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్‌ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్‌ని అదే కాపాడిందా?

Mydukur Primary Health Center Locked5
మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా.. చేతులెత్తేసిన కూటమి సర్కార్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగింది. మైదుకూరులో పట్టపగలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. నిర్వహణ చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తనిఖీకి వెళ్లిన సందర్భంలో తాళం వేసిన ఆసుపత్రి దర్శనమిచ్చింది.వైఎస్‌ జగన్‌ హయాంలో మంచి భవనాలు కట్టించి.. సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం చేతకాక తాళం వేశారు. సిబ్బంది తాళం వేసుకుని వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌ నానా హంగామా చేశారు. డీఎం అండ్‌ హెచ్‌వోకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని సస్పెండ్‌ చేయాలంటూ హుకుం జారీ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే కూటమి ప్రభుత్వ చేతగానితనం బట్టబయలైంది. కనీసం మండల స్థాయిలో ఉన్న పీహెచ్‌సీని కూడా నిర్వహించలేని కూటమి సర్కార్‌ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విఫల మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు

Uttarakhand helicopter crashed Gaurikund6
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు మృతి

డెహ్రాడూన్‌: అహ్మాదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. సదరు హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ గౌరీకుండ్‌ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా.. పైలట్‌తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరంతా ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. Uttarakhand helicopter crash | Today, at around 5:20 am, a helicopter, which was going from Shri Kedarnath Dham to Guptkashi, has been reported to have crashed near Gaurikund. There were six passengers, including the pilot (5 adults and 1 child). The passengers in the helicopter… pic.twitter.com/AVGtuxWKGj— ANI (@ANI) June 15, 2025మృతుల వివరాలు..రాజ్‌వీర్‌- పైలట్‌. విక్రమ్‌ రావత్‌,వినోద్‌, త్రిష్టి సింగ్‌, రాజ్‌కుమార్‌, శ్రద్దా, రాశి(10).. #UPDATE | Uttarakhand helicopter crash: The helicopter that crashed had taken off for Gaurikund after taking devotees to Kedarnath. There were seven people on board. The place where this accident took place is a very remote area. Police and SDRF teams have left for the spot: IG…— ANI (@ANI) June 15, 2025మరోవైపు.. హెలికాప్టర్‌ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా..‘రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. Chopper Crash in Gaurikund, UttarakhandIt is a very serious situation: Harshvardhan, Aviation Expert tells @anchoramitawTimes Now's Abhishek Sinha & @RishabhMPratap share more details. pic.twitter.com/cMazWahTM4— TIMES NOW (@TimesNow) June 15, 2025 #UPDATE | The helicopter that went missing in Gaurikund has crashed. There were six people on board the crashed helicopter. More details awaited: Uttarakhand ADG Law and Order, Dr V Murugeshan https://t.co/vDaSNjtSva— ANI (@ANI) June 15, 2025

Gaddar Awards: Nandamuri Balakrishna Forgot TG Deputy CM Name, Video Goes Viral7
గద్దర్‌ అవార్డ్స్‌: డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయిన బాలయ్య..వీడియో వైరల్‌

నందమూరి బాలకృష్ణ స్పీచ్‌ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో అసలు అర్థమే కాదు. ఏదో చెప్పబోయి.. మరేదో చెబుతుంటారు. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులను అవలీలగా చెప్పినా.. బయట మాత్రం చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేక తడబడుతుంటారు. ఆ మధ్య దేశభక్తి గేయం ‘సారే జహాసె అచ్చా’కూడా సరిగ్గా పాడలేక ట్రోలింగ్‌కి గురయ్యారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య నవ్వుల పాలయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయి.. దాన్ని కవర్‌ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట బాగా వైరల్‌ అయింది.(చదవండి: సీఎం రేవంత్‌ సమక్షంలో అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌..వీడియో వైరల్‌)శనివారం సాయంత్రం హైటెక్స్‌లో జరిగిన గర్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుని ఇచ్చి సన్మానించింది. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అవార్డును అందజేశారు. అనంతరం బాలకృష్ణ వారికి ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భట్టి పేరుని మర్చిపోయారు. ఆర్థిక, విద్యుత్‌ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి..(గ్యాప్‌ తీసుకున్నాడు).. మల్లు..(గ్యాప్‌ తీసుకున్నాడు) అంటూ పూర్తి పేరుని పలకడానికి తడబడ్డారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత పక్కనే ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి అందించడంతో భట్టి పేరుని స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025

Sakshi Editorial On Chandrababu Govt Super Six Promises By Vardhelli Murali8
నవ్విపోదురు గాక..!

‘‘ఆరు సూపర్‌ సిక్స్‌ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్‌ సిక్స్‌ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్‌ మీట్‌ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్‌ సిక్స్‌ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్‌ ఇయర్‌ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్‌ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్‌ అనే పథకంతో లింక్‌ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్‌ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్‌ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్‌ షిప్‌గా పెట్టుకున్న సూపర్‌ సిక్స్‌లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్‌షిప్‌ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్‌ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్‌ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్‌బుక్‌ నోరు తెరుస్తుంది. రెడ్‌ బుక్‌ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్‌ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్‌ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్‌ డెస్క్‌ ఇన్‌ఛార్జిగా నేను, స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్‌ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్‌ఆర్‌ లైవ్‌ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్‌ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్‌ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్‌ తొలగించి రిమాండ్‌కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్‌ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్‌ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్‌ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్‌ నవ్వు, ఇన్‌స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Chhattisgarh DSP Tasleem Arif wife Birth Day Viral Video9
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?

రాయ్‌పూర్‌: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్‌ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్‌పై కూర్చుని కేక్‌ కట్‌ చేస్తూ.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మ‌ధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫ‌ర్హీన్ ఖాన్ త‌న పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉప‌యోగించడం వివాదాస్పదంగా మారింది. ఫ‌ర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్‌పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్‌ కటింగ్‌ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్‌తో దాన్ని తుడిచేశాడు. అనంత‌రం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్‌పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్‌ వీడియోను సరగానా రిసార్ట్‌(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్‌పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్‌ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india)

Father's Day 202510
దేవుడు ముడివేసిన బంధం

లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్‌ ఈజ్‌ గాడ్‌’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్‌ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్‌ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్‌. ఆ ఎమోషన్స్‌ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్‌డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్‌ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్‌ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న అవనీశ్‌ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్‌ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్‌ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్‌ లాంటి స్పెషల్‌ చిల్డ్రన్‌ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్‌ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్‌ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్‌ ఫాదర్‌కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్‌కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్‌ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్‌ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్‌ బెస్ట్‌ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్‌లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్‌ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్‌షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్‌ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్‌కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్‌ దివిగికర్‌ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్‌ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్‌ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్‌ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్‌ కజిన్‌ కరణ్‌.. సుశాంత్‌ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్‌ తండ్రి ప్రదీప్‌ దివిగికర్‌కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్‌.. సుశాంత్‌ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్‌ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్‌కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్‌.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్‌ గే ఇండియా’ 2014 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్‌ గే వరల్డ్‌’ చరిత్రలో అత్యధిక సబ్‌–టైటిల్స్‌ గెలుచుకున్న ఏకైక ఇండియన్‌ తనే. అదే ఏడాది సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్‌ బాస్‌ 8’ కంటెస్టెంట్‌గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్‌ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్‌ బాస్‌ ఓటీటీకి ఆఫర్‌ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్‌’ అని అభివర్ణించి ఆఫర్‌ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్‌’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్‌. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్‌ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్‌ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్‌ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్‌లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్‌ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్‌ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్‌ అయ్యాడు. అలా, లహర్‌ జోషీ ఒక ‘స్టే–ఎట్‌–హోమ్‌ డాడ్‌’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్‌కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్‌ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్‌ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్‌గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్‌ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్‌ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్‌కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్‌ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్‌. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్‌.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్‌ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్‌ని చేశారు రాజేష్‌. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్‌తంత్ర’ అనే బొటిక్‌ జ్యూలరీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్‌ గుజరాత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్‌ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్‌ ఖాన్‌తో కబీర్, డా.కేదార్‌ పడ్తేఅది 2007. యూసఫ్‌ ఖాన్‌ అనే 26 ఏళ్ల మ్యూజిక్‌ టీచర్‌.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్‌లో ‘ద మ్యూజిక్‌ బాక్స్‌’ అనే మ్యూజిక్‌ స్కూల్‌ను నడుపుతున్న యూసఫ్‌.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్‌ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్‌ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్‌కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్‌ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్‌ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్‌ 3న పనాజీలో కబీర్‌ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్‌ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్‌లోనే ఉంటున్నాడు యూసఫ్‌. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్‌ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్‌ డాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ‘గువో గ్యాంగ్‌టాంగ్‌’ అనే తండ్రి కథ యావత్‌ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్‌ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్‌ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్‌ జెన్స్‌ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్‌ సైకిల్‌ కొనుక్కుని, దాని వెనుక మిస్‌ అయిన కొడుకు ఫొటోను బ్యానర్‌గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్‌ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్‌ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్‌ ఆఫ్‌ ది సెర్చింగ్‌ ఫర్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్‌’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్‌ఏ టెక్నాలజీతో జిన్‌ జిన్‌ ను కనుగొన్నామని, అతడు హేనాన్‌ ప్రాన్స్‌లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్‌ జెన్‌ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్‌ అండ్‌ లవ్‌’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్‌ డే!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement