Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ex CM Kcr Attends Kaleshwaram Commission inquiry Updates1
కేసీఆర్‌ రిక్వెస్ట్‌.. వన్‌ టు వన్‌ విచారణ

కేసీఆర్‌ విచారణ అప్‌డేట్స్‌.. కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్‌కు నివేదిక ఇచ్చిన కేసీఆర్.కమిషన్ విచారణలో పాల్గొన్న ఇద్దరు నోడల్ అధికారులు.మొత్తం నలుగురు అధికారుల సమక్షంలో సాగుతున్న కేసీఆర్ విచారణ.నోడల్ అధికారుల పేర్లు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డివన్‌ టు వన్‌ విచారణ..కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారణ జరుపుతున్న పీసీ ఘోష్‌.అనారోగ్య కారణాలతో ఇన్‌ కెమెరా విచారణ కోరిన కేసీఆర్‌ఓపెన్‌ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్‌ చైర్మన్‌ ఘోష్‌. కేసీఆర్‌తో ప్రతిజ్ఞదేవుని పై ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని కేసీఆర్ తో ప్రతిజ్ఞ చేయించిన కమిషన్ చైర్మన్‌ ఘోష్‌.కమిషన్‌కు పలు డాక్యుమెంట్స్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్బీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తతబీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌.పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట. 👉కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌..ఇవన్నీ సీఎం రేవంత్‌ డ్రామాలు: కేటీఆర్‌👉బీఆర్‌కే భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వంద కాంపోనెంట్స్‌ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్ట్‌ వేస్ట్‌ అంటున్నారు. ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం ఆడిస్తున్న డ్రామాలు ఇవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్‌ వాళ్లే కుట్ర చేసి ఉంటారు. సీఎం రేవంత్‌.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. 94వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. తన వెంటన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల ఫైల్‌ను కేసీఆర్‌ తీసుకెళ్లారు. కేసీఆర్‌ వెంటన తొమ్మిది లోపలికి వెళ్లారు. 👉బీఆర్‌కే భవన్‌ వద్దకు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 👉నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌కే భవన్‌ వద్ద హైటెన్షన్‌కమిషన్‌ కార్యాలయానికి కేసీఆర్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే అనుమతి.మధుసూదనాచారి, హరీష్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, రవిచంద్ర, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌, పద్మారావు, మహమూద్‌ అలీ, లక్ష్మారెడ్డికి అనుమతి.బీఆర్‌కే భవన్‌ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.బీఆర్‌కే భవన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు. వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.రోప్‌తో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.బీఆర్‌కే భవన్‌ వద్ద పోలీసులతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాగ్వాదం.జై కేసీఆర్‌.. జై తెలంగాణ అంటూ గులాబీ పార్టీ కార్యకర్తల నినాదాలు.. 👉ఎర్రవల్లి ఫాం హౌస్ నుండి బీఆర్‌కే భవన్‌ బయలుదేరిన కేసీఆర్, హరీష్ రావు, కవితకాళేశ్వరం పై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/s4rDIftNpe— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్‌రావుతెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి.తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌ నిబద్ధత అచంచలమైనది.కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు.ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు. From achieving Telangana statehood to delivering transformative projects like Kaleshwaram, KCR’s commitment to the people has been unwavering.While others chase power, he changed lives.Congress conspiracy or enquiry commission can't erase his legacy.His sacrifices for…— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2025 కోర్టు హాల్‌ సిద్ధం..కమిషన్ కార్యాలయంలో కోర్టు హాల్ సిద్ధం చేసిన అధికారులు.ఇన్ కెమెరా ఏర్పాట్లను సైతం సిద్ధంగా ఉంచిన కమిషన్ సిబ్బంది.కేసీఆర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణ లేదా ఇన్ కెమెరా విచారణ చేయనున్న కమిషన్ 👉బీఆర్‌కే భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.👉దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు👉కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. కేసీఆర్‌ వస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు.👉బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఉదయం 11:30 గంటలకు బీఆర్‌కే భవన్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ ముందు రోడ్డును అధికారులు మూసివేశారు. దాదాపు ఐదు వేల మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ట్యాంక్ బండ్ వైపు రోడ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీఆర్‌కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. 👉ఇదిలా ఉండగా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్‌ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా లేక కేవలం కమిషన్‌ అధికారుల వరకే పరిమితమై ఇన్‌కెమెరా విచారణ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

YS Jagan Visit Prakasam Podili Meet Tobacco Farmers Speech Live Updates2
పొదిలి పొగాకు బోర్డులో వైఎస్‌ జగన్‌

సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పోగాకు ధరలపై ఆయన అధికారులను ఆరా తీస్తున్నారు. కాసేపటి తర్వాత గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్న రైతులను ఆయన పరామర్శించి వాళ్ల సమస్యలు తెలుసుకోనున్నారు. జగన్‌ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జన సంద్రంగా మారింది.అంతకు ముందు.. జగన్‌కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు.. చూసేందుకు భారీగా రైతులు, జనం తరలి వచ్చారు. జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలతో హెరెత్తిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా.. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. కొందరు రైతులు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ‘‘మా పరిస్థితి ఏం బాగా లేదు. మిర్చి రైతుల దగ్గరి నుంచి అంతా నష్టాల్లోనే ఉన్నాం. టిఫిన్‌ తినడానికి కూడా డబ్బుల్లేవు. జగన్‌ పాలనలోనే మా పరిస్థితి బాగుంది. కూటమి పాలనలో మా పరిస్థితి అధ్వాన్నం. జగన్‌ హయాంలో కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేశారు.. .. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేక ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మా పరిస్థితి బాలేదని చెప్పుకున్నా అరెస్ట్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌, జగన్‌ పాలనలో రైతులకు మంచి జరిగింది. కూటమి పాలనలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒక్కో పొగాకు బేళ్లకు రూ.3 వేలు నష్టం. కనీసం ఇవాళ్టి జగన్‌ పర్యటనతోనైనా గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉంది. 2029లో కూటమి ప్రభుత్వాన్ని పడగొడతాం’’ అని కొందరు పొగాకు రైతులు సాక్షితో అన్నారు. జగన్‌ వస్తున్నాడయ్యా.. త్వరగా కానివ్వండి!ఏడాది కాలంగా పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే జగన్‌ రాక నేపథ్యంలో పొగాకు ఆక్షన్‌ పూర్తి చేయాలని ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆక్షన్‌ త్వరగతిన పూర్తి చేయాలని బోర్డుపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం నుంచి రైతులు లేకుండానే అధికారులు ఆక్షన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా తొంబై శాతం బేళ్లు కొనుగోలు జరిగినట్లు సమాచారం. మాములు రోజుల్లో ఇలా అసలు ఉండదు. రైతుల సమక్షంలోనే బోర్డు ఆక్షన్‌ నిర్వహిస్తోంది. పైగా వచ్చిన బేళ్లలో 40 శాతం మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అయితే.. ఇవాళ అందుకు భిన్నంగా అన్నీజరిగిపోతున్నాయి. పొగాకు రైతులను ఈ ఏడాది కాలంగా ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. ఇంతకాలం గిట్టుబాటు ధర లేక వాళ్లు అల్లలాడిపోయారు. ఈ తరుణంలో జగన్‌ రాక సందర్భంగా హడావిడిగా ఆక్షన్‌ నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Gali Janardhana Reddy And Telangana High Court Bail3
గాలి జనార్థన్‌ రెడ్డికి తెలంగాణ హైకో‍ర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఓబులాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసు(ఓఎంసీ)లో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తాజాగా నిలుపుదల చేసింది. ఈ క్రమంలో గాలి జనార్థన్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జనార్థన్‌ రెడ్డి.. దేశం విడిచి వెళ్లవద్దని.. ఆయన పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్‌‌‌‌ కేసు(ఓఎంసీ)లో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌‌‌‌ చేయాలంటూ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌‌‌‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ వెల్లడించారు. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌‌‌‌ రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌‌‌‌ ను దోషులుగా తేల్చుతూ సీబీఐ కోర్టు గత నెల 6న వారికి ఏడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును గాలి జనార్దన్‌‌‌‌రెడ్డి ఇతరులతోపాటు ఓఎంసీ కంపెనీ కూడా హైకోర్టులో సవాల్‌‌‌‌ చేసింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. మధ్యంతర అభ్యర్థనలపై బుధవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది.

iTDP and Co False Campaign On Eluru Sakshi Office Incident4
సాక్షిపై విషం చిమ్ముతూ.. మరింత దిగజారిన టీడీపీ!

సాక్షి, అమరావతి: అధికార పార్టీ తెలుగు దేశం మరింత దిగజారిపోయింది. అమరావతి మహిళలను టీవీ డిబేట్‌లో అగౌరవపరిచారంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతోంది. ఇప్పుడేమో సోషల్‌ మీడియా వేదికగానూ అసత్య ప్రచారాలతో ‘సాక్షి’పై విషం చిమ్ముతోంది.తాజాగా.. ఏలూరు సాక్షి కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టి ఫర్నీచర్‌ను దహనం చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మూడు రోజులుగా ఆఫీస్‌ వద్ద నిరసలు చేస్తూ.. మంగళవారం సాయంత్రం రెచ్చిపోయారు. తొలుత దెందులూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. ఆపై కార్యాలయం కింద ఉన్న ఫ్లెక్సీతో పాటు ఫర్నీచర్‌ను తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది కూడా. అయితే.. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఐ టీడీపీ, ఆ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా సాక్షిపై తప్పుడు ప్రచారానికి దిగింది. సాక్షి కార్యాలయానికి తమ పార్టీ శ్రేణులు నిప్పు పెట్టలేదని, సంస్థ ఉద్యోగులే నిప్పు పెట్టి సీసీ ఫుటేజీ దొరక్కుండా మాయం చేశారంటూ కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది. మరోవైపు.. పోలీసులేమో భిన్నమైన ప్రకటన ఒకటి చేయడం కొసమెరుపు. కార్యాలయం వద్ద జరిగిన దాడికి, సాక్షికి అసలు సంబంధమే లేదంటూ కాలిన ఫర్నీచర్‌ యాజమానితో చెబుతున్నారు(పోలీసులే చెప్పించారు!). ఇలా.. పరస్పర విరుద్ధ ప్రచారాలతో టీడీపీ అడ్డంగా దొరికిపోయినట్లైంది. టీడీపీ శ్రేణుల తీరుతో ప్రజల్లో వ్యతిరేకత రావటంతోనే ఇలా కొత్త డ్రామాలకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది.

T20 Mumbai 2025: Shreyas Iyer Led SoBo Mumbai Falcons Enters Into Finals5
పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్‌ అయ్యర్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్‌కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్‌ 1న ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్‌.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై టీ20 లీగ్‌ 2025లో నిన్న (జూన్‌ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్‌ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్‌ నమో బాంద్రా బ్లాస్టర్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.ఏడాది కాలంలో శ్రేయస్‌ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్‌కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్‌తో మొదలైన శ్రేయస్‌ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌ వరకు కొనసాగింది. 2024 ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌.. ఆతర్వాత ముంబైకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్‌ తృటిలో టైటిల్‌ మిస్‌ కావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే పంజాబ్‌ కింగ్స్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు.శ్రేయస్‌ తన జట్లను ఫైనల్స్‌కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్‌ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.అనంతరం ముంబైకు ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్‌రేట్‌తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2025 సీజన్‌లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్‌ ఈ లీగ్‌లో ఫామ్‌ను ప్రదర్శించాల్సి ఉంది.చరిత్ర సృష్టించాడుతాజాగా ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్‌ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్‌ను, 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.ముంబై టీ20 లీగ్‌ సెమీఫైనల్‌ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్‌ నమో బాంద్రా బ్లాస్టర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్లాస్టర్స్‌ 130 పరుగులకు ఆలౌట్‌ కాగా.. శ్రేయస్‌ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్‌లో శ్రేయస్‌ జట్టు సిద్దేశ్‌ లాడ్‌ నేతృత్వంలోని ముంబై సౌత్‌ సెంట్రల్‌ మరాఠా రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్‌ ఈ టైటిల్‌ను కూడా సాధిస్తే కెప్టెన్‌గా అతనికి తిరుగే ఉండదు.

Director A S Ravi Kumar Chowdary Passed Away6
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత

తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి చెందారు. గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతేడాది చివరగా రాజ్ తరుణ్‌తో 'తిరగబడరా సామీ' అనే మూవీ చేశారు. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది.గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి.. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం'తో పాటు ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు. అయితే 'తిరగబడరా సామీ' పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు.

Why NRI's Are Getting TAX Notices in India7
ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పన్ను నియమాలు పాటించకపోవడాన్ని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. భారత పన్ను అధికారులు అన్ని ఆర్థిక లావాదేవీలపై నిఘాను గణనీయంగా పెంచారు. అద్దె ఆదాయం నుంచి పాత పొదుపు ఖాతాల వరకు అన్ని అంశాలకు సంబంధించి స్క్రీనింగ్‌ చేసి పన్ను నోటీసులు జారీ చేస్తున్నారు.నోటీసులకు కొన్ని కారణాలు ఇవి..ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పన్ను దారులను గుర్తిస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐలు ఎలాంటి సందర్భాల్లో పన్ను నోటీసులు అందుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.నివేదించని అద్దె ఆదాయం: ఇండియాలో ఆస్తిని కలిగి ఉండి దానిపై అద్దెను ఆదాయం ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంటే మాత్రం చట్ట ప్రకారం పన్ను పరిధిలోకి వస్తారు.పాత పొదుపు ఖాతాలు: పరిమితికి మించి డిపాజిట్లు ఉన్న నిద్రాణమైన ఎన్ఆర్ఓ ఖాతాలుంటే పన్ను అధికారులు పరిశీలిస్తారు.అధిక విలువ కలిగిన లావాదేవీలు: పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌లు, ఆస్తి అమ్మకాలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తప్పకుండా తెలియజేయాలి. ట్యాక్స్‌ డిక్లరేషన్లను సరిగ్గా దాఖలు చేయకపోతే చర్యలు తప్పవు.ఇదీ చదవండి: ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా!మూలధన లాభాలు: భారతదేశంలో స్థిరాస్తి లేదా ఈక్విటీలను విక్రయించడం.. ఇక్కడి డబ్బును విదేశాలకు బదిలీ చేసినా పన్నులు వర్తిస్తాయి.వ్యాపార ఆదాయం: దేశీయ ఆధారిత వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఐలు ఆదాయపు పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండాలి.విదేశీ ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం: భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్నిసార్లు ఎన్‌ఆర్‌ఐలు తమ మొత్తం ఆదాయాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఇది పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు.

Telangana Govt Ministry Changes And High Command Decision8
రేవంత్‌ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్‌కు జాబితా

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. హైకమాండ్‌కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్‌ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్‌ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్‌ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది.ఇక, సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్‌ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్‌ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్‌ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్‌ ఫోన్‌లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్‌ చర్చించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Raj Kushwaha he Used to call Sonam Didi Raj Kushwahas sister9
‘హనీమూన్‌’ కేసు: సోనమ్‌ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్‌ల ‘హనీమూన్‌ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్‌లు సోనమ్‌కు సహకరించారని, ఇందుకు ‍ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్‌ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్‌ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్‌ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్‌లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్‌ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు

ప్రతీకాత్మక చిత్రం10
ముహూర్తానికి డెలివరీ లేట్‌ చేశారు, పాపకిక కష్టాలేనా? కేసు వేస్తా..!

ఇటీవలే ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మాకు పాప పుట్టింది. మా ఆవిడ గర్భవతి అయినప్పటినుంచి ఒకే డాక్టరు వద్ద చూపిస్తున్నాము. మా పంతులుగారిని అడిగి కాన్పుకు ముహూర్తం పెట్టుకున్నాము. హాస్పిటల్‌ వారికి చెప్పగా అలా చేయాలి అంటే ‘ముహూర్తం చార్జెస్‌’గా 10 వేల రూపాయలు ఎక్కువ కట్టాలి అని చెప్పారు. సరేలే అని అది కూడా కట్టాను. కానీ, డాక్టరు మరొక ఎమర్జన్సీ సర్జరీ ఆలస్యం అవటం వలన మా డెలివరీ ఆలస్యం చేశారు. మరొక ముహూర్తం కోసం ఆ రోజు సర్జరీ కూడా ఆపటం కుదరదు అని చెప్పారు. అందువల్ల మాపాప దుర్ముహూర్తాన పుట్టింది. దుర్ముహూర్తంలో పుట్టటం వలన పాపకి జీవితాంతం కష్టాలే ఉండ వచ్చు. అయితే పరిహారాలు చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది అని అంటున్నారు. వీటంతటికీ కారణం అయిన హాస్పిటల్‌ మీద, డాక్టరు మీద చర్యలు ఎలా తీసుకోవాలో సలహా ఇవ్వగలరు.- విక్కాంత్, సికింద్రాబాదుబాగుందండి. చాలా బాగుంది. కేసు వేయటానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారా? జడ్జిగారిని కూడా మీరు పెట్టుకున్న ముహూర్తానికే జడ్జిమెంట్‌ ఇమ్మని కూడా చెబుదామా? ఒకవేళ కేసు ఓడిపోతే ముహూర్త వైఫల్యం అంటారా లేక నా సలహా వైఫల్యం అంటారా? లేక ఏకంగా జడ్జీ గారికి గ్రహణం పట్టింది అంటారా? సెంటిమెంట్లు మీ వ్యక్తిగతం. మీ నమ్మకాన్ని మీరు పాటించవచ్చు, కాపాడుకోవచ్చు. అయితే అది చట్టానికి, న్యాయానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఉండకూడదు! అదేవిధంగా ప్రకృతి విరుద్ధంగా కూడా ఉండకూడదు. ఎవరు ఎప్పుడు జన్మించాలి అనేది దేవునిపై నమ్మకం ఉన్నవారు దైవనిర్ణయంగా భావిస్తే మంచిది. ఆధునిక వైద్యవిధానం - సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మీ నమ్మకాన్ని జోడించి కాన్పు సమయాన్ని నిర్ణయించుకున్నారు. కానీ అదే సమయంలో ఇంకొక మనిషికి సహాయపడుతున్న డాక్టర్‌ గారిని శిక్షించాలి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌మీకు ఇచ్చే జవాబు ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రి వారికి అలాగే ప్రభుత్వాలకి కూడా ఒక సూచన చేయాలి అనుకుంటున్నాను. రాజ్యాంగంలోని 51ఎ(జి) ఒకసారి చదవండి. ప్రభుత్వాలు శాస్త్రీయతను, మానవ విలువలను, తర్కాన్ని పెంపొందించాలి తప్ప మూఢనమ్మకాలను కాదు. వ్యక్తిగత నమ్మకాల కోసం మరొకరి జీవితాలను, హక్కులను కూడా లెక్కచేయను అనే ధోరణిని అరికట్టవలసిన అవసరం ఉంది. అధిక డబ్బు వసూలు చేసి మరీ ఇలాంటి ముహూర్తాలు పెట్టి కాన్పులు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోరణిని నియంత్రించాలి. చదవండి: పిల్లలకు సోషల్‌ మీడియా పరిమితులు : ఫోన్‌పై స్మార్ట్‌చెక్‌ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... మీ కేసులో ముహూర్తానికి 10,000 వసూలు చేసిన ఆసుపత్రి పై దావా వేసినా, కన్జ్యూమర్‌ కోర్టును ఆశ్రయించినా మీరు కట్టిన డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. మీరు కేసు వేసి హాస్పిటల్‌ వారిపై ఫైన్‌ కూడా విధించాలి అని కోరండి. మీ కేసులో డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ, మరొకసారి ఇలాంటి మతిలేని పనులు చేయడం మానేస్తారు హాస్పిటల్‌ వారు! మ్యాజిక్‌ రెమిడీస్‌ యాక్ట్, 1954, పరిధిలోకి ఇలాంటి హాస్పిటళ్లను తీసుకురావాలి.– శ్రీకాంత్‌ చింతల,హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement