Top Stories
ప్రధాన వార్తలు

స్పీకర్ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. గత విచారణలో బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఇవాళ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే: ముకుల్ రోహత్గీస్పీకర్కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదు: ముకుల్ రోహత్గీస్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం సరికాదు: ముకుల్ రోహత్గీగతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు: జస్టిస్ గవాయ్అది ప్రత్యేకమైన కేసు: ముకుల్ రోహత్గీసుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంది: ముకుల్ రోహత్గీనిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చు: ముకుల్ రోహత్గీ గత విచారణలో బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదిస్తూ.. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారని.. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని చెప్పారు. .. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అలాగే.. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయన్న ఆయన.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ప్రతివాదులు కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరగా.. బెంచ్ కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని మందలించింది.సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని గత విచారణలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
Waqf Bill In Lok sabha Updates..కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్లకన్నా ఐపీఎస్లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్లో హామీలు, స్కీమ్ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్మేట్తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె.

హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు

రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్లో మాత్రం పంత్కు ఊరట దక్కింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్లలోనూ పంత్ బ్యాటర్గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్తో మ్యాచ్లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్ఫ్లాప్లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025

నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
సాక్షి, తిరుమల/మంగళగిరి: తిరుమల దర్శనాల్లో మంత్రి నారా లోకేష్.. పీఏ దందా వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు బయటకు వచ్చాయి. పీఎస్ టూ సీఎంవో అంటూ దర్శన సిఫార్సు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాలకు సంబంధించిన దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎస్ టూ సీఎంవో అంటూ సాంబశివరావు.. తిరుమల జేఈవో కార్యాలయానికి దర్శన సిఫార్సు లేఖలు పంపిస్తున్నారు. రోజుకు 12కుపైగా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. సాంబశివరావు పనిచేసేది మంగళగిరిలో అయితే తిరుమల జేఈవో కార్యాలయంలో సీఎంవో పేరుతో దర్శనాలు ఇప్పిస్తున్నారు.ఇక, ఏపీ సీఎంవో పేషీతో ఎలాంటి సంబంధం లేని సాంబశివరావు సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు దర్శనాలు కొనసాగిస్తున్నారు. అయితే, మంత్రుల సిఫార్సు లేఖలతో రోజుకు రెండు దర్శనాలు మాత్రమే అనుమతి ఉంది. వారి సిఫార్సులతో వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే ఒక్క రోజుకు అనుమతి ఉంటుంది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు ఐదు నుంచి ఆరు వేలకు పైగా వీఐపీ దర్శనాలు పెరిగాయి. ఇష్టారాజ్యంగా కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాలను పెంచి సామాన్య భక్తుల దర్శనాలను మరింత ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై విచారణ చేపట్టాలని హిందుత్వ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గత ఏడాది ప్రారంభించిన అసోసియేట్ ప్రోగ్రామ్ నుంచి దాదాపు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జాప్)లో భాగంగా గత ఏడాది 1,500 మందిని కస్టమర్ సర్వీస్ రోల్స్ కోసం నియమించుకుంది. ఈ ఉద్యోగులను ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, సప్లై చైన్తో సహా వివిధ విభాగాల్లో సేవలకు ఉపయోగించుకుంది. ప్రస్తుతం జాప్లో ఉన్న వారిలో 1,000 మందిని కొనసాగించాలని, మిగతావారి(సుమారు 33 శాతం మంది) పనితీరు సరిగా లేదనే కారణంతో లేఆఫ్స్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.లేఆఫ్స్కు కారణంపనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి నష్టపరిహారంగా రెండు నెలల వేతనం ఇచ్చినట్లు చెప్పాయి. అయితే కొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించారని సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.పెరుగుతున్న పోటీఈ పరిణామంపై జొమాటో స్పందించలేదు. ఇటీవల తన మాతృసంస్థ పేరును ఎటర్నల్గా మార్చిన జొమాటోకు పెరుగుతున్న పోటీ, క్విక్ కామర్స్లో వస్తున్న మార్పుల వల్ల లాభాలు క్షీణిస్తున్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 57 శాతం క్షీణించి రూ.59 కోట్లకు పరిమితమైంది. క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ జొమాటోకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న ఫుడ్ డెలివరీ విభాగం వృద్ధి మందగిస్తుంది. ఫుడ్ డెలివరీలో వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటుందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..ఈ త్రైమాసికంలో జొమాటో ఉద్యోగుల బెనిఫిట్ వ్యయాలు(హెల్త్కేర్, రిటైర్మెంట్ ప్లాన్లు, వెల్నెస్ ప్రోగ్రామ్లు, పెయిడ్ లీవ్లు..) ఏడాది ప్రాతిపదికన 63 శాతం పెరిగి రూ.689 కోట్లకు చేరాయి. మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.5,405 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 31, 2024 నాటికి 8,244 మంది ఉద్యోగులు ఉన్నారు.

పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!కేవలం ప్యాకింగ్లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్లో దావా వేయొచ్చు. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 (చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?)

ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. భారీ అణుశక్తి..2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. Telegraph: Current US bombs not enough to penetrate Iran's nuclear facilities!The American B-2 bomber can penetrate to a depth of 61 meters, but the Natanz and Fordow nuclear facilities in Iran are built at a depth of 80 to 100 meters.In addition, Iran's facilities are… pic.twitter.com/lcDi8GMKAN— Sprinter Observer (@SprinterObserve) December 24, 2024ఫర్దో.. పర్వతగర్భంలో! భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ! దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.-జమ్ముల శ్రీకాంత్.Natanz for uranium enrichment. Underground enrichment facility of this center is protected by a concrete shield with a thickness of approximately 7.6 meters📍33°43'29.8"N 51°43'33.9" pic.twitter.com/jHffMnchWE— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) March 31, 2025
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
పోలీసుపై రెడ్ బుక్ రూల్
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
జీఎస్టీ వసూళ్ల రికార్డు
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీగా ఉద్యోగుల తొలగింపు
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
పంజాబ్ ఫటాఫట్
కౌంట్డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్నాథ్లో కొత్త రూల్
భారత్కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
స్పీకర్ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
మాకూ 'మంత్రి' ఇవ్వండి
గ్యాసు వేస్టు ఎందుకని!
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్బై
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
ఏపీలో బర్డ్ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
అట్టుడికిన హెచ్సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
మాండలే.. మరుభూమి
హెచ్సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
పుత్తడి @ రూ. 94,000
మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్లు ఓపెన్
ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి.. ఆస్తిలాభం
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు.. నేడు రెండో రౌండ్ విచారణ
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గం.. ఇండోపసిఫిక్
ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
ఆటిజం.. అర్థం చేసుకుందాం
మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
ఎగుమతి కోసం ప్రత్యేక వరి సాగు
టారిఫ్లకు వేళాయె
బీజేపీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత
హారర్ ఆహ్వానం
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
EPFO విత్డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
పంపాలో మట్టి దొంగలు
పవన్ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే డకౌట్
ఓటీటీకి వచ్చేసిన త్రిష మూవీ.. వారం రోజుల్లోనే ఎంట్రీ
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: మిథున్ రెడ్డి
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
హెచ్సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
పోలీసుపై రెడ్ బుక్ రూల్
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
జీఎస్టీ వసూళ్ల రికార్డు
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీగా ఉద్యోగుల తొలగింపు
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
పంజాబ్ ఫటాఫట్
కౌంట్డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
beat the heat ఇండోర్ ప్లాంట్స్తో ఎండకు చెక్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్నాథ్లో కొత్త రూల్
భారత్కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
స్పీకర్ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
మాకూ 'మంత్రి' ఇవ్వండి
గ్యాసు వేస్టు ఎందుకని!
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్బై
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
ఏపీలో బర్డ్ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
అట్టుడికిన హెచ్సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
మాండలే.. మరుభూమి
హెచ్సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
పుత్తడి @ రూ. 94,000
మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్లు ఓపెన్
ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి.. ఆస్తిలాభం
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు.. నేడు రెండో రౌండ్ విచారణ
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గం.. ఇండోపసిఫిక్
ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
ఆటిజం.. అర్థం చేసుకుందాం
మోదీ ఫొటో పెట్టాలనడం సరికాదు
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
ఎగుమతి కోసం ప్రత్యేక వరి సాగు
టారిఫ్లకు వేళాయె
బీజేపీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత
హారర్ ఆహ్వానం
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
EPFO విత్డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
పంపాలో మట్టి దొంగలు
పవన్ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే డకౌట్
ఓటీటీకి వచ్చేసిన త్రిష మూవీ.. వారం రోజుల్లోనే ఎంట్రీ
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
సినిమా

చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.

తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది.

ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)

కౌంట్డౌన్ స్టార్ట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ విడుదలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ప్రోడక్షన్స్తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. సరిగ్గా ఈ మూవీ విడుదలకు 30 రోజులు ఉండటంతో 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ...’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్.
న్యూస్ పాడ్కాస్ట్

నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్లాండ్, మయన్మార్లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...
క్రీడలు

సింధు తర్వాత ఎవరు?
సాక్షి క్రీడా విభాగం : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే దిగ్గజం. తదనంతరం ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వీళ్లిద్దరు పురుషుల కేటగిరీలో లెజెండ్స్! కానీ అమ్మాయిల విభాగంలో మాత్రం స్టార్లు, విజేతలంటూ ఎవరూ లేరు. మళ్లీ గోపీచంద్ తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచి్చన ‘ఆట’కు తిరిగివ్వాలనే లక్ష్యంతో కోచ్గా మారాక భారత బ్యాడ్మింటన్ ‘కోర్టు’లో రాణులు వెలుగులోకి వచ్చారు. అతను సానబెట్టిన సైనా నెహ్వల్ ఓ వెలుగు వెలిగింది. ఎన్నో ఏళ్లుగా మహిళల సింగిల్స్లో ఉనికి లేని భారత్కు ఘనవిజయాలు, ఒలింపిక్ పతకం తెచ్చి పెట్టింది. ఆమె ఆడుతుండగానే పీవీ సింధు దూసుకొచ్చింది. సింధుది గోపీచంద్ స్కూలే (కోచింగ్). ఆమె అచిరకాలంలోనే సైనాను మరిపించింది. బ్యాడ్మింటన్లో మురిపించింది. దేశాన్ని గర్వపడేలా చేసింది. ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ నంబర్వన్ ర్యాంక్, ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం ఇలా ఒకటేమిటి అన్నింటా సింధు మార్కు కనబడింది. అయితే కొంతకాలంగా సింధు ఆటతీరు గాడి తప్పింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత రెండు సీజన్లు సింధుకు కలిసి రాలేదు. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. కానీ తర్వాతే భారత బ్యాడ్మింటన్లో సింధు వారసురాలు కనబడటం లేదు. దీంతో సమీప భవిష్యత్తులో మహిళల సింగిల్స్లో ఆశాకిరణం ఫలానా అనే వారు లేక ప్రభ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ ప్రమాద ఘంటికలు 2025 సీజన్ ప్రారంభంలోనే మోగాయి. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ (కింగ్డావో–చైనా)లో చివరి నిమిషంలో గాయంతో సింధు వైదొలగగా... బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్తోనే సరిపెట్టుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్లలో నిలకడలేని ప్రదర్శనతో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. ఒక్క పురుషుల డబుల్స్లోనే ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ షెట్టితో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడు. వీలైతే విజయం (పతకం) లేదంటే రన్నరప్... ఇదీ కుదరకపోతే కనీసం సెమీఫైనల్ వరకైనా భారత ఆశల పల్లకిని మోసుకెళ్తున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగినట్లే ఎదిగి... క్రికెట్ మతమైన భారత్లో, ఘనచరిత్ర కలిగిన హాకీ, పతకాలపై గురి పెట్టే షూటింగ్లతో పాటు బ్యాడ్మింటన్ కూడా పతకాలు తెచ్చే ప్రముఖ క్రీడాంశమైంది. 2012 నుంచి భారత షట్లర్లు వరుసగా మూడు ఒలింపిక్ పతకాలు సాధించారు. లండన్ (2012)లో సైనా... ‘రియో’లో (2016)... ‘టోక్యో’లో (2020) సింధు పతకాలు పట్టుకొచ్చారు. దీంతో పాటు ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్యాలకు లెక్కేలేదు. ఒలింపిక్ నుంచి ఒలింపిక్ కాలచక్రంలో మిన్నంటే ప్రదర్శనతో షట్లర్లు వెలుగులీనారు. కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇలా వచ్చిన వారే. పతకం తేలేకపోయినా పురుషుల్లో లక్ష్య సేన్, మహిళల్లో సింధు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. కానీ తదుపరి ఒలింపిక్స్లో ఈ అర్హత ముచ్చట కూడా దక్కేలా కనబడటం లేదు. ఎందుకంటే శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్లలో పదును తగ్గింది. మ్యాచ్లు గెలిచే సత్తా కరువైంది. మహిళల సింగిల్స్లో సింధుకు ఇటు ఆటతీరులో నిలకడ లేదు! అటు ఫిట్నెస్లో స్థిరత్వం లేదు. దీంతో కొత్త ఒలింపిక్ సైకిల్లో వీళ్లెవరూ ముందుకెళ్లే షట్లర్లు కానేకారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటీ పరిస్థితి... ఎందుకీ దుస్థితి! శ్రీకాంత్, ప్రణయ్లు వెటరన్ ప్లేయర్లు కావడంతో సహజంగా వయసు పైబడిన ఛాయలు వారిని వెనక్కి లాగుతున్నాయి. కానీ లక్ష్యసేన్ తన కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాలతో ఔరా అనిపించాడు. కానీ కొన్నాళ్లుగా అలసత్వమో... అనాసక్తినో తెలియదు కానీ ఆశించిన స్థాయి ఆటతీరే కనబరచడం లేదు. ఇది భారత పతకాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. మహిళల సింగిల్స్లో సింధు ఎన్నో సాధించింది. దేశానికి ఎంతో పేరు తెచ్చింది. కానీ ఆమె తర్వాత కోర్ గ్రూపులో ఉండే కొదమ సింహాలను మాత్రం భారత బ్యాడ్మింటన్ రంగం తయారు చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే డబుల్స్ ప్రాధాన్యం వల్ల సింగిల్స్ స్టార్లు కరువైనట్లు ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. పురుషుల డబుల్స్లో పదో ర్యాంక్తో సాత్విక్–చిరాగ్ జోడీ, మహిళల డబుల్స్లో తొమ్మిదో ర్యాంక్తో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ టాప్–10లో ఉన్నాయి. కానీ సింగిల్స్లో సింధు (17), మాళవిక బన్సోద్ (23), అనుపమ ఉపాధ్యాయ్ (44), రక్షిత శ్రీ (45), ఆకర్షి కశ్యప్ (48), ఉన్నతి హుడా (55), తస్నిమ్ మీర్ (63), అన్మోల్ ఖరబ్ (67)... లక్ష్య సేన్ (18), ప్రణయ్ (29), కిరణ్ జార్జి (36), ప్రియాన్షు రజావత్ (38), ఆయుశ్ శెట్టి (44), సతీశ్ కుమార్ కరుణాకరన్ (47), తరుణ్ మన్నేపల్లి (53), కిడాంబి శ్రీకాంత్ (54), శంకర్ ముత్తుస్వామి (59)ల ర్యాంక్లు సమీప భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్కు ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతున్నాయి. నంబర్వన్ ర్యాంక్ దేవుడెరుగు... అసలు టాప్–10లో నిలువగలిగే ప్లేయరే కనిపించడం లేదు. కానీ... కాంపిటీటివ్ బెంచ్ (పోటీల్లో సత్తాచాటే బెంచ్)ను ముందుచూపుతో తయారు చేయడంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్లక్ష్యం కనబడుతోంది. కిం కర్తవ్యం? తదుపరి లాస్ ఎంజెలిస్ (2028) ఒలింపిక్స్ సైకిల్ మొదలైంది. తాజా పరిణామాలు, నిరాశాజనక ప్రదర్శనలు, వస్తోన్న ఫలితాలపై ‘బాయ్’ వెంటనే దృష్టి పెట్టాలి. అంటే విశ్వక్రీడలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. ఈ లోపు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ తదితర ఈవెంట్లెన్నో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ‘బాయ్’ గానీ, ‘సాయ్’గానీ ఇప్పుడే మేల్కొవాలి. ఒలింపిక్స్ మిషన్కు ఓ విజన్తో పని చేయాలి. బాగా ఆడే షట్లర్లు ఎందుకిలా అయ్యారో సమీక్షించాలి. వర్ధమాన షట్లర్లను గుర్తించి ఆర్థిక అండదండలు అందించాలి. కేంద్ర క్రీడా శాఖ ‘టాప్స్’లా ‘బాయ్’ కూడా సానుకూల దృక్పథంతో తమ ప్లేయర్లకు ఇంటా బయటా కోచింగ్కు, కోచ్లకు పెద్ద ఎత్తున వెచ్చించాలి. ఓ క్రమపద్ధతిలో లక్ష్యాలను పెట్టుకొని ఫలితాల కోసం కష్టపడితే పరిస్థితిలో మార్పు రావొచ్చు.

అంతర్జాతీయ హాకీకి వందన గుడ్బై
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది. ‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది. 2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది.

పంజాబ్ ఫటాఫట్
లక్నో: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఐపీఎల్ 18వ సీజన్లో అడుగు పెట్టిన పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి గెలిచింది. 171 వద్ద స్కోరు సమమైనపుడు లక్నో బౌలర్ అబ్దుల్ సమద్ వేసిన బంతిని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్స్గా మలిచి పంజాబ్ కింగ్స్ను విజయతీరానికి చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్స్లు) లక్నో బౌలర్ల భరతం పట్టి మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. ప్రభ్సిమ్రన్ అవుటయ్యాక వచ్చిన నేహల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు సాధించింది. అర్ష్ దీప్ సింగ్ (3/43) మూడు కీలక వికెట్టు పడగొట్టగా... మ్యాక్స్వెల్, ఫెర్గూసన్, యాన్సెన్, చహల్లకు ఒక్కో వికెట్ దక్కింది. లక్నో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో టాప్–3 బ్యాటర్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా... పంత్ 2 పరుగులతో నిరాశపరిచాడు. క్రీజులో నిలదొక్కుకున్న దశలో మార్క్రమ్ను ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆటతో లక్నో స్కోరు 100 దాటింది. చివర్లో సమద్ (12 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించడంతో లక్నో జట్టు ప్రత్యర్థి కి గౌరవప్రద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్లో ఆరంభంలోనే ఆర్య వికెట్ కోల్పోయినా పంజాబ్ వెనక్కి తగ్గలేదు. లక్నో బౌలర్లపై ప్రభ్సిమ్రన్, అయ్యర్ ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. శార్దుల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4,6 కొట్టిన ప్రభ్సిమ్రన్... రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో 4,4,6తో మెరిశాడు. అదే జోరులో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్లో 11వ ఓవర్ తొలి బంతికి ప్రభ్సిమ్రన్ ఇన్నింగ్స్కు తెరపడింది. దిగ్వేశ్ వేసిన బంతిని డీప్ మిడ్వికెట్ వైపు ప్రభ్సిమ్రన్ షాట్ ఆడగా... ఆయుశ్ బదోని క్యాచ్ తీసుకొని బౌండరీ లైను వద్ద బ్యాలెన్స్ కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నుంచి వచ్చిన రవి బిష్ణోయ్ గాల్లో ఉన్న బంతిని పట్టుకోవడంతో ప్రభ్సిమ్రన్ పెవిలియన్ చేరుకున్నాడు. ప్రభ్సిమ్రన్ వెనుదిరిగాక వచ్చిన నేహల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ 17వ ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) ఫెర్గూసన్ 28; మిచెల్ మార్ష్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ సింగ్ 0; నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 44; రిషభ్ పంత్ (సి) చహల్ (బి) మ్యాక్స్వెల్ 2; ఆయుశ్ బదోని (సి) మ్యాక్స్వెల్ (బి) అర్ష్ దీప్ సింగ్ 41; డేవిడ్ మిల్లర్ (సి) ప్రభ్సిమ్రన్ సింగ్ (బి) యాన్సెన్ 19; అబ్దుల్ సమద్ (సి) ఆర్య (బి) అర్ష్ దీప్ సింగ్ 27; శార్దుల్ ఠాకూర్ (నాటౌట్) 3; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–35, 4–89, 5–119, 6–166, 7–167. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–43–3, ఫెర్గూసన్ 3–0–26–1, మ్యాక్స్వెల్ 3–0–22–1, మార్కో యాన్సెన్ 4–0–28–1, స్టొయినిస్ 2–0–15–0, యుజువేంద్ర చహల్ 4–0–36–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శార్దుల్ ఠాకూర్ (బి) దిగ్వేశ్ రాఠి 8; ప్రభ్సిమ్రన్ సింగ్ (సి) రవి బిష్ణోయ్ (బి) దిగ్వేశ్ రాఠి 69; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 52; నేహల్ వధేరా (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–26, 2–110. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 3–0–39–0, అవేశ్ ఖాన్ 3–0–30–0, దిగ్వేశ్ రాఠి 4–0–30–2, రవి బిష్ణోయ్ 3–0–43–0, మణిమారన్ సిద్ధార్థ్ 3–0–28–0, అబ్దుల్ సమద్ 0.2–0–6–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X గుజరాత్వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(44) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), మార్క్రామ్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, మాక్స్వెల్, చాహల్ తలా వికెట్ సాధించారు.ఫ్రబ్సిమ్రాన్ విధ్వంసం..అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52 నాటౌట్) దుమ్ములేపారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.రిషబ్ పంత్ ఫెయిల్..ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటర్గా, ఇటు కెప్టెన్గా పంత్ నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్గా వ్యూహత్మకంగా వ్యవహరించలేకపోయాడు.
బిజినెస్

యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. మార్చి నెలలో రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. విలువ పరంగా ఇది సరికొత్త నెలవారీ గరిష్ట రికార్డు.ఫిబ్రవరిలో నమోదైన రూ.21.96 లక్షల కోట్లతో పోల్చితే విలువ పరంగా 12.7% వృద్ధి నమోదైంది. 2024 మార్చిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.19.78 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి నెలలో రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల విలువ రూ.79,903 కోట్లుగా నమోదైంది.

ఫార్మాకు చేదు మందు?
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్కేర్ వ్యవస్థలో మన జనరిక్స్కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. సవాళ్ల మధ్య అవకాశాలు.. వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు. మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్అండ్డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. అమెరికాపై ఎఫెక్ట్ .. ఫార్మా దిగుమతులపై టారిఫ్లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు. అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు.

క్రాష్ మార్కెట్
ముంబై: అమెరికా ‘లిబరేషన్ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ దాదాపు 2% క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్ 2ను డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా లిబరేషన్ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం, భారత ఈక్విటీ మార్కెట్ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,390 పాయింట్లు క్షీణించి 76,025 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 23,166 వద్ద స్థిరపడింది. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలిరోజున స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు... ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావంతో రోజంతా నష్టాలతో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,503 పాయింట్లు క్షీణించి 75,912 వద్ద, నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 23,136 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ టెలికమ్యూనికేషన్, ఆయిల్అండ్గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకుల షేర్లలో భారీ విక్రయాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1% నష్టపోయింది. స్మాల్క్యాప్ సూచీ స్వల్పంగా 0.07 శాతం లాభపడింది. సూచీల వారీగా రియల్టీ 3%, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ 2.50%, ఫైనాన్షియల్ సర్విసెస్ 2%, బ్యాంకెక్స్ 1.50 శాతం నష్టపోయాయి. ⇒ సూచీల 2% మేర పతనంతో మంగళవారం రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.409.43 లక్షల కోట్లు(4.78 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. ⇒ వొడాఫోన్ ఐడియా షేరు 19% లాభపడి రూ.8.10 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రమ్ వేలం బకాయిలు రూ.36,950 కోట్ల బదులుగా ఈక్విటీల రూపంలో వాటాను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వీఐ ఆదివారం ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. దీంతో వీఐలో కేంద్రం వాటా 48.99 శాతానికి చేరనుంది. ఇంట్రాడేలో 26% ఎగసి రూ.8.56 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.9,210 కోట్లు పెరిగి రూ. 57,828 కోట్లకు చేరింది. ⇒సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో ఇండస్ఇండ్ 5%, జొమాటో 0.27% మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా హెచ్సీఎల్ టెక్ 4%, బజాజ్ఫిన్సర్వ్ 3.50%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.35%, బజాజ్ ఫైనాన్స్3%, ఇన్ఫోసిస్ 3% నష్టపోయాయి.

2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారుగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల భవిష్యత్తును ఆయన హైలైట్ చేశారు.మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. నేను ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడాను. ఆ సమయంలో ఎవరూ దానిని నమ్మలేదు, కానీ నేడు అది నిజమైందని గడ్కరీ అన్నారు. అప్పట్లో, భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు దీని విలువ 22 లక్షల కోట్లకు పెరిగింది.భారత్.. అమెరికా, చైనా తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించింది. ఇప్పుడు 2030 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ

జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..)

అన్నతో కలిసి గ్రాండ్గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
రంజాన్ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరుడితో కలిసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి.రంజాన్ సందర్బంగా అర్పితా ఖాన్ ఇచ్చిన లావిష్ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి తరువాత తొలిసారి ఈద్ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్లో అందంగా కనిపించింది. ఇంకా జెనీలియా,రితేష్ దేశ్ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు తన సోదరి గెలాక్సీ అపార్ట్మెంట్స్లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్ సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఫ్యాన్స్ను అభినందించారు. ఈ సందర్బంగా సల్మాన్ మూవీ "సికందర్" అంటూ సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు.Shukriya Thank you aur sab ko Eid Mubarak! pic.twitter.com/EaW0CeaZWi— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2025

బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.డైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడమే..పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.తేడా వస్తే ఊబకాయమే..!జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీఇది ‘సెట్’ అయ్యేదెట్లా?అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి.

జస్ట్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్మెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్మార్క్గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్లోని చైనాటౌన్, రోజ్మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్చిల్లీ బాటిల్పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!)
ఫొటోలు


వయ్యారాల నడకలతో కనువిందు చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ (ఫొటోలు)


#IPL2025 : ముంబై మ్యాచ్లో ఆమె ఎవరు.. పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్? (ఫోటోలు వైరల్)


ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)


గ్రాండ్గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)


ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)


వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)


‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
International

మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార

సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్ల డెడ్లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి.

Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్క్రాఫ్ట్లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్లైనర్లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్లైనర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు.
National

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్పోర్ట్లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్వుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్కి రీమేక్గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.

రేపు లోక్సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్
ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజువక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి
బనస్కాంత:గుజరాత్లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్సాంగ్కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
NRI

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్షిప్తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్లో "లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది
క్రైమ్

మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్కు విసుగొచ్చి ఆమె సిమ్ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.

లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్య కేసులో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో 20 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, కేవలం ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. హత్య ఘటనకు సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు ధర్మవరపు ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడుపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పూర్తిగా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో నడుస్తూ.. టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా పని చేస్తున్నారనేందుకు ఈ సంఘటన తాజా ఉదాహరణ అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రామగిరి మండలంలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గత వారం జరిగిన రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది.అదే సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శనాయుడు, మనోజ్ నాయుడు తదితరులు వరుసగా రెండు రోజుల పాటు రాళ్ల దాడికి పాల్పడినా ఎస్ఐ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికితోడు కురుబ లింగమయ్య హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 20 మంది ఆ ఘటనలో పాల్గొంటే కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టి.. రెండు రోజులుగా వారికి రాజ¿ోగాలు కల్పించి, మంగళవారం అరెస్ట్ చూపించారు. ఇద్దరు నిందితుల అరెస్టు కురుబ మజ్జిగ లింగమయ్య (లింగన్న) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. లింగమయ్య కుమారుడు మనోహర్ మార్చి 30న అత్తగారింటికి వెళుతుండగా.. గ్రామానికి చెందిన ఆదర్శ్, అతని అనుచరులు అభ్యంతరకరంగా హేళన చేయగా, తండ్రి లింగమయ్యకు ఫోన్ చేసి తెలిపాడన్నారు. ఈ విషయంపై లింగమయ్య తన ఇంటి ముందు కూర్చుని.. అదే గ్రామానికి చెందిన ధర్మవరపు రమేష్ కుమారుడు ధర్మవరపు ఆదర్శ్, ధర్మవరపు మహేష్ కుమారుడు ధర్మవరపు మనోజ్ నాయుడులను ప్రశి్నంచారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులు లింగమయ్యపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. అనంతరం లింగమయ్యను అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై హతుడి భార్య ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులను మంగళవారం రామగిరి శివారులోని 11కేవీ సబ్స్టేషన్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు.

ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
సాక్షి, అనకాపల్లి: పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య (7) హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి రత్నకుమారి మంగళవారం తీర్పుచెప్పారు. బాధితుల తరఫున పీపీ ఉగ్గిన వెంకట్రావ్ వాదించారు. వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలోని గొల్లపేట వీధిలో హోటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె దివ్య (7) స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటోంది.హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారిని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను ధనలక్ష్మి, మురుగన్ దంపతులు పనిలో నుంచి తొలగించారు. దీంతో వారిపై సుబ్బాచారి కక్షగట్టాడు. 2015లో డిసెంబర్ 23న స్కూల్కు వెళ్లి వచ్చిన దివ్య సాయంత్రం నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు దేవరాపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా సుబ్బాచారిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. 2015 డిసెంబర్ 24న బిళ్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు చెప్పారు. మృతదేహంపై కత్తితో కోసిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను దివ్యగా గుర్తించి, సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు. బీరు సీసాతో పీక కోసి హత్య.. 23న దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, ఆమెకు రూ.20 ఇచ్చి గారెలు కొనుక్కోమన్నానని, అక్కడ నుంచి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిళ్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు కూడా ఉంది. హత్య కేసును విచారణ జరిపిన చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి బాలిక హత్యకు కారణమైన నిందితుడిని సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం దోషిగా నిర్థారిస్తూ పైవిధంగా శిక్ష విధించారు.

కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్లోని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్లో న్యూట్రీషన్గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. తుపాకీ చూపించి అత్యాచారం...అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్హౌజ్లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది. తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్రూమ్లోకి వెళ్లి రివాల్వర్ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరిగిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్ అప్పట్లో బేగంపేటలోని ఓ జిమ్కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు. ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ స్వీట్ మెమరీస్ ఇన్ హైదరాబాద్. బట్.. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ బ్యాడ్ మెమరీ ఫర్ మీ’ (హైదరాబాద్లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దారుణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి కేసుకూ ఫాస్ట్ట్రాక్ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమయం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ
వీడియోలు


జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్


ఇరాన్ ను నాశనం చేసే అస్త్రం అమెరికా ప్రయోగించనుందా?


పెన్షన్ పంపిణీ కాదు.. పబ్లిసిటీ ఈవెంట్


విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు


విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై కరణం ధర్మశ్రీ కామెంట్స్


వర్మ రివెంజ్ రాజకీయం


KSR Comment: తమిళనాడులో జనసేన.. ఊసరవెల్లి సిగ్గుపడేలా పవన్ తీరు


వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్


మయన్మార్ లో మళ్లీ భూకంపం


లక్నోపై పంజాబ్ గెలుపు