Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ahmedabad Plane Air India Incident Updates1
అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోదీ సమీక్ష

Ahmedabad Incident Updates..విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్‌ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్‌ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్‌ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్‌ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్‌ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్‌ విల్సన్‌ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్‌లు రద్దుఅహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్‌లు రద్దుగుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ, సిటీ సివిల్‌ హాస్పిటల్‌ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్‌వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్‌ విశ్వాస్‌కుమార్‌ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది.

Israel Operation Rising Lion On Iran June 13th Live Updates Latest News2
ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌.. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్‌

ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌.. అప్‌డేట్స్‌ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ చేపట్టిన ఇజ్రాయెల్‌ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్‌ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్‌దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్‌లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్‌ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్‌వంద డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌ సైన్యండ్రోన్‌ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్‌ఇరాన్‌ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ చేపట్టిన ఇజ్రాయెల్‌ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌, ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ జనరల్‌, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్‌ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్‌ కౌంటర్‌ ఎటాక్స్‌ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట ఇజ్రాయెల్‌ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్‌ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్‌ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్‌లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్‌ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్‌ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్‌ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్‌ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం తర్వాత ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ జనరల్‌ హోసెయిన్‌ సలామీ మృతిదాడుల్లో ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌ మొహమ్మద్‌ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరిట ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ అధిపతిఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్‌ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్‌ పోస్టు వైరల్ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్‌ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ఇరాన్‌ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్‌ఇరాన్‌ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభంఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్‌ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుఇరాన్‌ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్‌ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా

India expresses deep concern on Operation Raising Lion3
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..

ఇరాన్‌ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్‌ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్‌ దాకా ఇజ్రాయెల్‌ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్‌ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్‌, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది.

Union Minister Rammohan Naidu Social Media Post Criticized4
రామ్మోహనా.. రీల్స్‌ చేయడానికి వెళ్లావా..?

సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సోషల్‌ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్‌ క్రాష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోకు బ్యాక్‌ గ్రౌండ్‌ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్‌ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్‌ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025

APSRTC Bus Accident Karnataka Kolar Updates Full Details5
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి

బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్‌లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్‌ 0190 నెంబర్‌ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్‌లోని పుట్టిపురా గేట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి

Devika And Danny Web Series Review In Telugu6
‘దేవికా అండ్‌ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో వెబ్‌ సిరీస్‌ ‘దేవికా అండ్‌ డానీ’ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.సినిమాలైనా... వెబ్‌ సిరీస్‌లైనా... వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండిటిలోను ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైనా, కల్పన అయినా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే ‘దేవికా అండ్‌ డానీ’ వెబ్‌ సిరీస్‌. జియో హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతోంది. దీపక్‌ రాజ్‌ అందించిన ఈ సిరీస్‌ కథకు బి. కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్‌ సీరియస్‌ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు దర్శకుడు. ‘పెళ్ళి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సిరీస్‌లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. దేవిక పాత్రలో రీతూ జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే... దేవిక ఆ ఊరి స్కూల్‌లో సంగీతం నేర్పించే టీచర్‌గా పని చేస్తుంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనవరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. దేవికకు ఓ పెళ్ళి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్‌కి వెళ్ళే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఇల్లు, స్కూలుకి పరిధిలోని 20 కిలోమీటర్లలోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి... డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్ళి చేసుకుందా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘దేవికా అండ్‌ డానీ’ వెబ్‌ సిరీస్‌ చూసేయండి. సిరీస్‌ మొత్తం మంచి ట్విస్టులతో, చక్కటి హ్యూమర్‌తో ఎక్కడా బోర్‌ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి మరి.– హరికృష్ణ ఇంటూరు

Finn Allen Breaks Chris Gayle's World Record With 151 Run Knock In MLC 20257
న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ మహోగ్రరూపం దాల్చాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC) 2025 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ లీగ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న అలెన్‌.. వాషింగ్టన్‌ ఫ్రీడంతో ఇవాళ (జూన్‌ 13) జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. గేల్‌ 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్‌ 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అలెన్‌ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఎంఎల్‌సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు పూరన్‌ పేరిట ఉండేది. పూరన్‌ 2023 ఎడిషన్‌లో 40 బంతుల్లో శతక్కొట్టాడు. నేటి మ్యాచ్‌లో అలెన్‌ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఎంఎల్‌సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌. గతంలో కూడా ఈ రికార్డు యూనికార్న్స్‌ (215/5) పేరిటే ఉంది.నేటి మ్యాచ్‌లో యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి 20 బంతుల్లో 36, హసన్‌ ఖాన్‌ 18 బంతుల్లో 38 (నాటౌట్‌), టిమ్‌ సీఫర్ట్‌ 10 బంతుల్లో 18, జేక్‌ ఫ్రేజర్‌ 9 బంతుల్లో 6, కూపర్‌ కన్నోలీ 7 బంతుల్లో 5, కోరె ఆండర్సన్‌ 6 బంతుల్లో 3 (నాటౌట్‌) పరుగులు చేశారు. వాషింగ్టన్‌ బౌలర్లలో జాక్‌ ఎడ్వర్డ్స్‌ 2, నేత్రావల్కర్‌, మిచెల్‌ ఓవెన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్‌ గట్టిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటికీ.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 79 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతుంది. 10 ఓవర్ల తర్వాత వాషింగ్టన్‌ స్కోర్‌ 118/8గా ఉంది. బెన్‌ సియర్స్‌ (1), ఇయాన్‌ హోలాండ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మిచెల్‌ ఓవెన్‌ (20 బంతుల్లో 39), రచిన్‌ రవీంద్ర (17 బంతుల్లో 42), వన్‌ డౌన్‌ ఆటగాడు జాక్‌ ఎడ్వర్డ్స్‌ (7 బంతుల్లో 21) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఆతర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (5), గ్లెన్‌ ఫిలప్స్‌ (0), ఆండ్రియస్‌ గౌస్‌ (2), ఒబస్‌ పియనార్‌ (2), ముక్తార్‌ అహ్మద్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. యూనికార్న్స్‌ బౌలర్లలో రౌక్స్‌, హసన్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌ తలో 2 వికెట్లు తీయగా.. లియామ్‌ ప్లంకెట్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ​ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్‌-4 బ్యాటర్లు..ఫిన్‌ అలెన్‌-19 (న్యూజిలాండ్‌)క్రిస్‌ గేల్‌-18 (వెస్టిండీస్‌)సాహిల్‌ చౌహాన్‌-18 (సైప్రస్‌)క్రిస్‌ గేల్‌-18 (వెస్టిండీస్‌)

stock market updates on june 13 20258
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.91 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.24 శాతం పుంజుకుంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్‌ సూచీలు నిన్నటి సెషన్‌లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్‌ డాలర్లు)కు దిగివచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Mumbai Rap Crew Swadesi: Mahi Gs journey into conscious music9
ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌ కాస్తా.. ర్యాప్‌ సింగర్‌గా ప్రభంజనం..

ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని తన రాప్‌ సింగింగ్‌ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్‌ సింగర్‌ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్‌ షోస్‌ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్‌’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్‌ అయ్యి పేరు సంపాదించారు. ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.గిరిజన కోయిలమాహి పూర్తి పేరు మధుర యశ్వంత్‌ ఘనె. అయితే ర్యాపర్‌గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్‌ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్‌ కండెక్టర్‌గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు. వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్‌లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్‌ పాడే ర్యాప్‌ సాంగ్స్‌ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్‌ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.అడవి పాట ఇచ్చిందికోవిడ్‌ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్‌ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్‌ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.హక్కుల కోసం పాటమాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్‌యూ స్టూడెంట్స్‌ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్‌ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి. ‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్‌ తక్‌... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్‌ వరల్డ్‌ 2025లో..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement