Top Stories
ప్రధాన వార్తలు

మీ భూములు.. మా వ్యాపారం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘‘మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం. మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం..!’’ అంటూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పేరుతో రైతులను బెదిరించి సారవంతమైన భూములను గుంజుకుంటున్నారు. లీజు ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూములను తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెర తీశారు. లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ పూచీకత్తు ఉండదని.. రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పదంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి కనుసన్నల్లో నయానా భయాన సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి తమకు బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు. గడువు ముగిసినా.. కంపెనీ కనికరిస్తేనే!అవుకు మండలంలో ‘హీరో’ సోలార్ కంపెనీ 1,252 ఎకరాల భూమిని సేకరిస్తుండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా.. పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు. ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, రెండేళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది!!శాశ్వతంగా దూరం చేసే కుట్ర..నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్ ప్యూచర్ ఎనర్జీస్ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1,252 ఎకరాలను ‘క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ నిబంధనలు పరిశీలిస్తే రైతులు తమ అవసరాల కోసం పొలం విక్రయించకుండానే శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఇవీ నిబంధనలు..⇒ రైతులు తమ భూమిని 29 ఏళ్ల 11 నెలలు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్ (అగ్రిమెంట్ లీజు) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. ⇒ లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీజు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే.⇒ లీజుకింద ఏడాదికి రూ.40 వేలు ఇస్తారు. రెండేళ్లకోసారి ఐదు శాతం పెరుగుతుంది.⇒ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే.⇒ భూమిని కంపెనీ థర్డ్ పార్టీకి (మరొకరికి) లీజుకు ఇవ్వవచ్చు.రైతన్నల పొలాలకు దారేది?రాయలసీమలో సోలార్ విద్యుదుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకూ బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు. ‘చుట్టూ సోలార్ కోసం అందరూ పొలాలిస్తుంటే మీరొక్కరే ఎలా వ్యవసాయం చేస్తారు? దారి, నీళ్లు లేకుండా పొలంలోకి ఎలా వెళతారు..?’ అని కంపెనీ ప్రతినిధులు, మంత్రి బీసీ జనార్దనరెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మంత్రికి, కంపెనీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు జంకుతున్నారు. భూములు లేకుంటే స్థానిక గొర్రెల కాపరులు మేత కోసం అల్లాడాల్సిందే. లెవలింగ్ పేరుతో పొలం గట్లను చదును చూస్తే రైతులకు దారి ఉండదు.కంపెనీ చేతుల్లోకి..వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం లీజుకు ఇస్తే వ్యవసాయేతర భూమి కిందకు మారుతుంది. అప్పుడు రైతులు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ విషయాలను రైతులకు వివరించకుండా కంపెనీ దాగుడు మూతలు ఆడుతోంది. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములనే బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. ఒకవేళ నష్టాలొచ్చి దివాళా తీస్తే ఆ రుణాలను ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లగలరా? ఇక లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ మెటీరియల్ ఎవరు తొలగించాలి? ఎక్కడ పడేయాలి? ఆ ఖర్చు సంగతేమిటి? అనే వివరాలేవీ ఎంవోయూలో లేవు. రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. లీజు ముగిసిందని రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పొలం విక్రయించుకోవాలంటే కుదరదు. కంపెనీ లీజు పొడిగించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే! అంటే రైతుకు 30 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.సాగు భూముల్లో సోలార్..!సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఎస్ఆర్బీసీ 13వ బ్లాక్ నుంచి పొలాలకు నీరు అందుతుంది. ఇక్కడ మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లీజు అగ్రిమెంట్లో లొసుగులపై రైతుల తరఫున కంపెనీని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవుకు, శింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్రనరసింహారెడ్డి బుజ్జగిస్తుండగా శింగనపల్లెలో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు.భూములు మావి.. లోన్లు మీకా?: కోట శంకర్రెడ్డి, రైతు శింగనపల్లె లీజుకు తీసుకున్న మా భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారట. 30 ఏళ్ల లీజు అంటే సగం జీవితం అయిపోతుంది. మా పిల్లలకు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పొలాలు లీజుకు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. భూములిచ్చి కూలికి వెళ్లాలా?సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటోంది. నాకు 2.20 ఎకరాలు ఉంది. పొలం అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ రైతుగా బతుకుతున్నాం. భూములిచ్చి కూలి పనికి వెళ్లాలా? సోలార్ ప్లాంటుతో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్లు ఎలా? దారి ఎలా? రైతులను బాధ పెట్టొద్దు.– లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, శింగనపల్లె

అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్బుక్ పాలన రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్ చేయించడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు.. అరెస్టులు.. వేధింపులతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రెడ్బుక్ కుట్రలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి తరలి వస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. ఆ మైన్లో క్వార్ట్జ్, పల్స్పర్, మిక్స్డ్ మైకా 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని, అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే, కూటమి పెద్దలు కాకాణిని టార్గెట్ చేసి, అక్రమంగా మైనింగ్ జరిగిందంటూ బాలాజీ నాయక్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా ఆ మైన్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇచ్చిన వారిలో ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ కూడా ఉండడం విశేషం. అధికార దుర్వినియోగం జరిగిందనేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.19 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: భరణి ఉ.7.40 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.6.51 నుండి 8.21 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు,అమృతఘడియలు: రా.3.45 నుండి 5.16 వరకు.సూర్యోదయం : 5.29సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.. నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.. మిత్రులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.మిథునం... కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార , ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.సింహం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. కుటుంబసభ్యులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కన్య.... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాల్లో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. శ్రమకు ఫలితం అంతగా ఉండదు.తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.వృశ్చికం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు.ధనుస్సు..... పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. దూరప్రయాణాలు.మకరం...... రుణఒత్తిడులు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని‡ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.కుంభం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం... బంధువులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. తీర్థయాత్రలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

‘కాజీపేట’కు రెడ్సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (మినీ కోచ్ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్లోనూ వందేభారత్ కోచ్ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్ నిర్మాణ బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్ను ఓవర్హాలింగ్ వర్క్షాప్గా ప్రతిపాదించినప్పుడే ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్మెక్–టైకిషాలతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్వీఎన్ఎల్ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్వీఎల్ఎల్ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్ లేఅవుట్ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.

భారత్తో మనుగడకే ప్రమాదం
ఇస్లామాబాద్: భారత్ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్డీఐఏ) వరల్డ్ త్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్ కంట్రోల్ వంటి వాటిపైనా పాక్ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది. నివేదికలో భారత్ గురించి ఏముంది? జమ్మూకశీ్మర్లోని పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్ ‘మేడ్ ఇన్ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.

ఆ నలుగురిలో నేను లేను
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు.

పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎఫ్అండ్వో.. ఓ డేంజర్ ‘గేమ్’!
ప్రసాద్ (55) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలి మార్కెట్ దిద్దుబాటుకు ముందు ఎఫ్అండ్వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఒక ప్రైవేటు సంస్థ సిఫారసులతో ట్రేడ్ చేయగా.. ఒక్కరోజులోనే రూ. లక్షన్నర లాభం కళ్లజూడడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్రేడింగ్ చేశాడు. పది రోజుల తర్వాత అకౌంట్ చూసుకుంటే అప్పటి వరకు వచ్చిన లాభాన్నంతా మళ్లీ మార్కెట్టే పట్టుకుపోయిందని అర్థమైంది. అంతేకాదు, అదనంగా రూ.2 లక్షల పెట్టుబడి కూడా కరిగిపోయింది. అయినా సరే పోయినచోటే వెతుక్కోవాలనే తపనతో.. ప్రసాద్ పొద్దస్తమానం ఎఫ్అండ్వో ఆలోచనలతో బతికేస్తున్నాడు. ఎఫ్అండ్వో మార్కెట్ విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ల పరిణతి లేమికి మచ్చుకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే! సెబీ అధ్యయనం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్వో విభాగంలో ప్రతి 10 మంది ట్రేడర్లకు గాను లాభం పొందింది ఒక్కరే. 91.1 శాతం మంది (73 లక్షల మంది సుమారు) ఎఫ్అండ్వోలో నష్టాలు పోగేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8.9 శాతం మందిలో రూ. లక్షపైన లాభం సొంతం చేసుకున్నది కూడా కేవలం ఒక్క శాతమే ఉన్నారు. 75 శాతానికి పైగా ఎఫ్అండ్వో ట్రేడర్లు 2023–24లో తమ ఆదాయం రూ.5 లక్షల్లోపే అని వెల్లడించడం వీరంతా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారన్నది స్పష్టం చేస్తోంది. అంతేకాదు వీరంతా అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఎఫ్అండ్వో చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల ‘గేమ్’ కానే కాదని నిపుణులు తరచూ చెప్పేది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీపడే సామర్థ్యాలు, వసతులు, నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లకు లేకపోవడంతో ఎఫ్అండ్వోలో నెగ్గలేని పరిస్థితి. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలు, టెక్నాలజీ, వసతులతోనే ఎఫ్అండ్వోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైనదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. వేగంగా లాభాలు అసాధ్యం! కరోనా విపత్తు తర్వాత ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2019లో 3.93 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే అవి ప్రస్తుతం 19.24 కోట్లకు పెరగడం దీనికి నిదర్శనం. కొత్త ఇన్వెస్టర్లలో ప్రధానంగా కనిపించే సమస్య.. లాభాల ఆకాంక్షలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కొద్ది పెట్టుబడితోనే భారీగా సంపాదించేయొచ్చన్న అత్యాశ వారిని ఎఫ్అండ్వో మార్కెట్వైపు ఆకర్షిస్తోంది. ‘‘డెరివేటివ్లు (ఎఫ్అండ్వో) అన్నవి హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, యాక్టివ్ ట్రేడింగ్ కోసం రూపొందించినవి. కానీ, ప్రస్తుత రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేటివ్ ట్రేడింగ్వైపే మొగ్గు కనిపిస్తోంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎఫ్అండ్వోలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా దీన్నొక ఆదాయ మార్గంగా చూస్తుండడం మరింత రిస్్కను ఆహ్వానించడమే అవుతుంది. రుణంతో మరింత రిస్క్ ఎఫ్అండ్వో మార్కెట్లో మార్జిన్ ఫండింగ్, వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్కు సైతం రిటైల్ ఇన్వెస్టర్లు వెనుకాడడం లేదు. ట్రేడ్లతో నష్టపోయి.. తమవద్ద పెట్టుబడి సరిపోక రుణ సదుపాయంతో పొజిషన్లు తీసుకుంటున్నారు. లాభంతో తీర్చేయొచ్చన్న అంచనాలతో మరింత రిస్క్ తీసుకుంటున్నారు. నష్టం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. ఇన్వెస్టర్లలో ప్రవర్తనా పరమైన బలహీనతలు సైతం అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రేడ్లో నష్టం రాగా, తదుపరి ట్రేడ్లో లాభం వస్తుందన్న అతివిశ్వాసం పనికిరాదంటున్నారు. ‘‘ఆప్షన్ ధరల తీరు, నమూనాలు, డెరివేటివ్లను సరిగ్గా అర్థం చేసుకోకుండా.. యూట్యూబ్ ఛానళ్లను చూడడం, సోషల్ మీడియా గురువులను అనుసరించడం లేదంటే వాట్సాప్ గ్రూప్లలో చేరడం ద్వారా ఎఫ్అండ్వోలో లాభాలు సంపాదించేయగలమన్నది తప్పుడు అవగాహనే అవుతుంది’’ అని ప్రైమ్ వెల్త్కు చెందిన సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్పీ) అలోక్ దూబే పేర్కొన్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లలో సరైన విజ్ఞానం, క్రమశిక్షణ ఉండడం లేదన్నారు. ఇవి లేకుండా ఎఫ్అండ్వో ట్రేడింగ్ గ్యాంబ్లింగే అవుతుందని హెచ్చరించారు. పెద్ద సవాలు.. ఎఫ్అండ్వో ట్రేడింగ్ అన్నది ఎంతో సంక్లిష్టమైనదని నిపుణుల విశ్లేషణ. మార్కెట్, స్టాక్స్ కదలికలు దేశీ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఉంటాయి. కనుక ఒక స్టాక్ పెరుగుతుందా? పడుతుందా? అని ఊహించడం అసాధ్యం. ఈ సవాళ్లను అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి. ట్రేడ్స్ ఎంపికకు స్పష్టమైన, నిర్మాణాత్మకమైన విధానం లేకుండా ఎఫ్అండ్వో మార్కెట్లోకి అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పిదమని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. అసలు ఎఫ్అండ్వో మార్కెట్ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. క్యాష్ మార్కెట్ లేదా ఎఫ్అండ్వో లేదా కమోడిటీలు ఇలా ఏ విభాగమైనప్పటికీ కాల పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసమరని.. అవి లేకుండా ట్రేడింగ్ చేయడం అవకాశమే కానీ, నైపుణ్యం కాబోదన్నారు. ‘‘ఎఫ్అండ్వో వారం, నెలవారీ సిరీస్లలో రోజులు గడుస్తూ, ఎక్స్పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చలనం లేకపోతే, అప్పుడు ఆప్షన్ల విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఒక వ్యూహం ఫలించి మంచి లాభం వచ్చినప్పటికీ.. అదే వ్యూహం ప్రతి రోజూ ఫలితమిస్తుందని గ్యారంటీ లేదు’’ అని అగర్వాల్ వివరించారు. ఫిన్ఫ్లుయెన్సర్స్ మాయలోపడితే అంతే.. బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ప్రకారం.. ఎఫ్అండ్వోలోకి ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు అడుగు పెట్టడం వెనుక ఆర్థిక ప్రభావశీలురు (ఫిన్ఫ్లూయెర్స్) పరోక్ష ప్రోద్బలం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎఫ్అండ్వోలో తాము పెద్ద మొత్తంలో సంపాదించామంటూ యూట్యూబ్, ఎక్స్ ప్లాట్ఫామ్, ఇన్స్టా్రగామ్లపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. అప్పటి వరకు ఎఫ్అండ్వో మొహం చూడని వారు సైతం ట్రేడింగ్కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ప్రభావశీలురులో రాబడులను ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్్కలు, ట్రేడింగ్ స్ట్రాటజీలను వెల్లడించడంపై ఉండదు. దీంతో ఎఫ్అండ్వో ట్రేడింగ్ ధనవంతులు కావడానికి సులభ మార్గం అన్న తప్పుడు అభిప్రాయానికి దారితీస్తోంది. అందుకే ఫిన్ఫ్లుయెన్సర్స్ తీరును నియంత్రించేందుకు సెబీ ఎన్నో కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇన్స్టిట్యూటషనల్ ఇన్వెస్టర్లదేపైచేయి ఎఫ్అండ్వో మార్కెట్లో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి.. అతి కొద్ది మంది బడా ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సమర్పయామిగా మారుతోంది. ‘‘ఎఫ్అండ్వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లకు స్పష్టమైన అనుకూలతలు ఉన్నాయి. గొప్ప టెక్నాలజీ వసతులు, ట్రేడ్లపై తక్కువ చార్జీలు, క్రమశిక్షణతో కూడిన విధానాలు వారి సొంతం’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిసింగ్ వివరించారు. 2023–24లో ప్రొప్రయిటరీ ట్రేడర్లు (బ్యాంక్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజీలు తదితర) రూ.33,000 కోట్లు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.28,000 కోట్ల చొప్పున ఎఫ్అండ్వో మార్కెట్లో లాభాలు పోగేసుకున్నారు. రిటైల్ ట్రేడర్లు ఉమ్మడిగా రూ.61,000 కోట్లు నష్టపోయారు. లావాదేవీల చార్జీలు దీనికి అదనం. ‘‘అతి విశ్వాసం, పాక్షిక వాదం తదితర ప్రవర్తనా లోపాలకు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఉచ్చులోకి లాగేవి ఇవే. అత్యాధునిక టూల్స్, వ్యయాల పరంగా సానుకూలత, సహేతుక నిర్ణయాలు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఎఫ్అండ్వో మార్కెట్లో అనుకూలిస్తున్నాయి’’ అని రవిసింగ్ తెలిపారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఆల్గోరిథమ్ ట్రేడింగ్ (ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు, విక్రయాలు చేయాలన్న కోడింగ్ సాఫ్ట్వేర్) అత్యంత అనుకూలించే అంశం. ప్రొప్రయిటరీ ట్రేడర్లలో 96 శాతం మందికి లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నట్టు రవిసింగ్ తెలిపారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ధరల గమనం ఆధారంగా వేగంగా కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను ఆల్గోరిథమ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ పూర్తి చేస్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో 13 శాతం మందే ఆల్గోరిథమ్ ట్రేడింగ్ వినియోగిస్తున్నారు. ‘‘ఇనిసిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తాజా మార్కెట్ సమాచారాన్ని మైక్రో సెకన్లలోనే తెలుసుకోగలరు. ఆప్షన్లతో హెడ్జ్ చేసుకోగలరు. వోలటాలిటీ స్ప్రెడ్స్ (తటస్థ ఆప్షన్ విధానం), నేరుగా మార్కెట్ యాక్సెస్, తక్కువ చార్జీలు వారికి అనుకూలం. రిటైల్ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాపై ఆధారపడుతుంటారు. ట్రేడ్వారీ చార్జీలు వీరికి ఎక్కువ. అంచనాలు తప్పడం, సోషల్ మీడియా టిప్స్ వారికి ప్రతికూలం’’ అని రవిసింగ్ వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్ల తప్పటడుగులు → ఫ్యూచర్స్, ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలియకుండా ఎఫ్అండ్వోలోకి పెట్టుబడితో అడుగుపెట్టడం. → మార్కెట్ సంకేతాలను, కాంట్రాక్టుల సంక్లిష్టతలను తప్పుగా అర్థం చేసుకోవడం. → మార్జిన్ ఫండింగ్తో ట్రేడ్లు చేయడం. → నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్లాస్ ఆర్డర్లను వినియోగించుకోకపోవడం. → స్పష్టమైన ప్రణాళిక లేకుండా అత్యాశ, భయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. → నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మరిన్ని ట్రేడ్లు చేయడం. → తరచూ ట్రేడ్లు చేయడం ద్వారా చార్జీల రూపంలో అధికంగా నష్టపోవడం. → ప్రతికూల పరిణామాల్లోనూ ట్రేడ్లు కొనసాగించడం. → ఎలాంటి వ్యూహాలు లేకుండా మార్కెట్లో వచ్చే సమాచారం ఆధారంగా స్వీయ అంచనాలతో ట్రేడ్లు చేయడం. ప్రయోజనాలు వేరు.. ఎఫ్అండ్వో అన్నది నిజమైన స్టాక్స్ కాకుండా డిజిటల్ కాంట్రాక్టులు. కనుక 10–20 శాతం మార్జిన్తోనే 100 శాతం విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్లు అయితే ఇంకా తక్కువ పెట్టుబడికే వస్తాయి. మార్కెట్ పతనాల్లో స్టాక్స్ హోల్డింగ్స్ విలువను కాపాడుకునేందుకు ఎఫ్అండ్వోను హెడ్జింగ్ టూల్ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటారు. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీలు తెలియవు. పైగా వారి పెట్టుబడి హెడ్జ్ చేసుకునే స్థాయిలోనూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల తరఫున ఫండ్ మేనేజర్లు ఈ హెడ్జింగ్ టూల్స్ను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. సెబీ ఇటీవలే అనుమతించిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) అనే కొత్త మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అయితే ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తుల్లో గరిష్టంగా 20 శాతం వరకు ఎఫ్అండ్వో ఎక్స్పోజర్ తీసుకునేందుకు అనుమతి ఉంది. కనుక రిస్క్ ఉన్నా అధిక రాబడి కోరుకునే వారు సిఫ్లను పరిశీలించొచ్చు. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి మార్గం..? ‘‘భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు, అపరిమిత ట్రేడింగ్, స్టాప్లాస్లను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం పెట్టుబడిని వేగంగా హరించేస్తుంది. విజయవంతమైన ట్రేడింగ్ అంటే సానుకూల పరిస్థితుల్లో లాభాలు ఆర్జించడమే కాదు. క్రమశిక్షణతో ప్రతికూలతలను అధిగమించి పెట్టుబడిని కాపాడుకోవడం కూడా’’ అని సహజ్ అగర్వాల్ తెలిపారు. → డెరివేటివ్లకు సంబంధించి సాంకేతిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. మార్జిన్ అవసరాలు, అస్థిరతలు, ఆప్షన్ ధరల తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అంశాలు తెలియాలి. – సంప్రదాయ స్టాక్స్లో పెట్టుబడులతో పోలి్చనప్పుడు ఎఫ్అండ్వోలో పెట్టుబడులపై ప్రాథమి క అవగాహన ఒక్కటే సరిపోదు. తగినంత వి జ్ఞానం కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. వేగంగా లాభాలు సంపాదించాలన్న కాంక్షతో చాలా మంది రిటైల్ ట్రేడర్లు దీన్ని విస్మరిస్తుంటారు. – దశాబ్దాల అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ టూల్స్, పెట్టుబడి బలంతో ఉన్న ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పోటీపడాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి. – స్పెక్యులేటివ్ ధోరణిని వీడి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, హెడ్జింగ్ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలి. – ఆర్థిక ప్రభావశీలురు, తప్పుదోవ పట్టించే కంటెంట్కు దూరంగా ఉండాలి. ట్రేడింగ్, సాంకేతిక అంశాలపై విఖ్యాత ఇన్వెస్టర్లు రాసిన పుస్తకాలను చదవి అపోహలు తొలగించుకోవాలి. ‘‘ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ రెండూ విరుద్ధమైనవి. పెట్టుబడులకు సహనం, దీర్ఘకాల దృష్టి అవసరం. ట్రేడింగ్లో రిస్్కతో కూడిన తక్షణ వ్యూహాత్మక చర్య అవసరం. అవగాహన కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తమ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్కు పరిమితం కావడం మంచిది. ఈ విషయంలోనూ నిపుణుల మార్గదర్శనం అవసరమే’’ అని సహజ్ అగర్వాల్ సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్కతా నైట్రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్ను ముగించాయి. గుజరాత్తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్సెంచరీ అందుకున్నాడు. హెడ్ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన క్లాసెన్... వరుణ్కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

Hyderabad: అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు..
సికింద్రాబాద్: కన్నపిల్లల కళ్ల ముందే ఓ తల్లి రైలు బోగీ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో విషాదాన్ని నింపింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్, శ్వేత (33) దంపతులు. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ తన భార్య శ్వేత, ఇరువురు పిల్లలతో కలిసి లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో కొద్ది రోజులు శ్వేత తన ఇద్దరు పిల్లలతో దొండపూడిలో గడిపి రావాలనుకుంది. ఇందుకోసం భర్త వెంకటేశ్ ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేశాడు. ఉదయం భార్య, పిల్లలను లింగంపల్లి రైల్వేస్టేషన్ తీసుకువచి్చన వెంకటేశ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కించి డీ3 బోగీలోని సీట్లలో కూర్చోబెట్టాడు. సీట్ నంబర్ సరిగా ప్రింట్ కాకపోవడంతో.. రైలు బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత శ్వేత కూర్చున్న సీట్లు తమవని వేరే ప్రయాణికులు వచ్చారు. తన వద్ద ఉన్న టికెట్ను మరోసారి సరిచూసుకోగా తన బోగీ డీ8గా గుర్తించింది శ్వేత. రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3వ నంబరు బోగీ నుంచి 8వ నంబర్ బోగీ వరకు బోగీల మార్గం నుంచి వెళ్లడం సాధ్యం కాలేదు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైలు నిలపగానే డీ3 బోగీ దిగిన ఆమె తన పిల్లలు, లగేజీతో 8వ నంబర్ బోగీ వద్దకు చేరుకుంది. అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. రైలు బోగీ, ప్లాట్ఫాం మధ్య నలిగి.. పిల్లలను, లగేజీని హుటాహుటిన బోగీలోకి ఎక్కించి తాను ఎక్కేందుకు ఉపక్రమిస్తున్న సమయంలోనే రైలు వేగం పుంజుకుంది. దీంతో కాలుజారి కిందపడిన శ్వేత బోగీకి ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై పట్టాల పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు, పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న భర్త వెంకటేశ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆన్లైన్ టికెట్లో ప్రింట్ సరిగా పడని కారణంతోనే తన భార్య రైలు ప్రమాదానికి బలైందన్నాడు. శ్వేత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.
స్థిరమైన ఆదాయం కోసం కొత్త ఫండ్
రింగ్లో దిగనున్న 'కరాటే కిడ్: లెజెండ్స్'.. ఎప్పుడంటే
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
యూనస్ బంగ్లాదేశ్ను అమ్మేస్తున్నారు
తాజ్మహల్ రక్షణకు యాంటీడ్రోన్ వ్యవస్థ
పచ్చ నేతలకు చంద్రన్న తోఫా!
‘బిస్కెట్ డబ్బా’ నుంచే బిగ్ డిబేట్
మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం
గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు?
పేకాట సిగ్గుమాలిన పని కాదు
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
సాక్షి కార్టూన్ 24-05-2025
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం
స్థిరమైన ఆదాయం కోసం కొత్త ఫండ్
రింగ్లో దిగనున్న 'కరాటే కిడ్: లెజెండ్స్'.. ఎప్పుడంటే
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
యూనస్ బంగ్లాదేశ్ను అమ్మేస్తున్నారు
తాజ్మహల్ రక్షణకు యాంటీడ్రోన్ వ్యవస్థ
పచ్చ నేతలకు చంద్రన్న తోఫా!
‘బిస్కెట్ డబ్బా’ నుంచే బిగ్ డిబేట్
మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం
గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు?
పేకాట సిగ్గుమాలిన పని కాదు
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
సాక్షి కార్టూన్ 24-05-2025
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..
సినిమా

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో టాప్లో ట్రెండింగ్!
సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరుడ 2.0. గతంలో తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు రీమేక్గా తెరకెక్కించారు. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సినిమా అదేస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఏకంగా టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా చూసినవారు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj)

నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ నలుగురితో కలపకండి: అల్లు అరవింద్
సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్ మాత్రమే ఉందన్నారు. స్టాండ్ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ..'రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉన్నారు. తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.' అని అన్నారు.

అదుర్స్ నటుడు మృతి.. జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
బాలీవుడ్ నటుడి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.కాగా..బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.ముకుల్ దేవ్కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించారు. Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I— Jr NTR (@tarak9999) May 24, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్దే పైచేయి అయింది. రన్నరప్గా నిలిచిన శ్రీకాంత్కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్లో, 2021 ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్కతా నైట్రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్ను ముగించాయి. గుజరాత్తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్సెంచరీ అందుకున్నాడు. హెడ్ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టిన క్లాసెన్... వరుణ్కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో రాజస్తాన్పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్తో ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో

కోల్కతాపై సన్రైజర్స్ గ్రాండ్ విక్టరీ..
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్దూబే తలా రెండు వికెట్లు సాధించారు.

హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ! వీడియో
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.అతడి బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఈ క్రమంలో క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. క్లాసెన్ ఓవరాల్గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్లాసెన్తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు. కాగా ఇది ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్లో అత్యధిక టోటల్ నమోదు చేసిన రికార్డు కూడా ఎస్ఆర్హెచ్ పేరిటే ఉంది. ఐపీఎల్-2024లో బెంగళూరుపై సన్రైజర్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.HEINRICH KLAASEN - Fastest Century by an SRH player 🔥🫡 #SRHvKKR pic.twitter.com/glWohcuB4x— Arun Vijay (@AVinthehousee) May 25, 2025
బిజినెస్

ఎఫ్అండ్వో.. ఓ డేంజర్ ‘గేమ్’!
ప్రసాద్ (55) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలి మార్కెట్ దిద్దుబాటుకు ముందు ఎఫ్అండ్వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఒక ప్రైవేటు సంస్థ సిఫారసులతో ట్రేడ్ చేయగా.. ఒక్కరోజులోనే రూ. లక్షన్నర లాభం కళ్లజూడడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్రేడింగ్ చేశాడు. పది రోజుల తర్వాత అకౌంట్ చూసుకుంటే అప్పటి వరకు వచ్చిన లాభాన్నంతా మళ్లీ మార్కెట్టే పట్టుకుపోయిందని అర్థమైంది. అంతేకాదు, అదనంగా రూ.2 లక్షల పెట్టుబడి కూడా కరిగిపోయింది. అయినా సరే పోయినచోటే వెతుక్కోవాలనే తపనతో.. ప్రసాద్ పొద్దస్తమానం ఎఫ్అండ్వో ఆలోచనలతో బతికేస్తున్నాడు. ఎఫ్అండ్వో మార్కెట్ విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ల పరిణతి లేమికి మచ్చుకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే! సెబీ అధ్యయనం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్వో విభాగంలో ప్రతి 10 మంది ట్రేడర్లకు గాను లాభం పొందింది ఒక్కరే. 91.1 శాతం మంది (73 లక్షల మంది సుమారు) ఎఫ్అండ్వోలో నష్టాలు పోగేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8.9 శాతం మందిలో రూ. లక్షపైన లాభం సొంతం చేసుకున్నది కూడా కేవలం ఒక్క శాతమే ఉన్నారు. 75 శాతానికి పైగా ఎఫ్అండ్వో ట్రేడర్లు 2023–24లో తమ ఆదాయం రూ.5 లక్షల్లోపే అని వెల్లడించడం వీరంతా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారన్నది స్పష్టం చేస్తోంది. అంతేకాదు వీరంతా అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఎఫ్అండ్వో చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల ‘గేమ్’ కానే కాదని నిపుణులు తరచూ చెప్పేది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీపడే సామర్థ్యాలు, వసతులు, నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లకు లేకపోవడంతో ఎఫ్అండ్వోలో నెగ్గలేని పరిస్థితి. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలు, టెక్నాలజీ, వసతులతోనే ఎఫ్అండ్వోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైనదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. వేగంగా లాభాలు అసాధ్యం! కరోనా విపత్తు తర్వాత ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2019లో 3.93 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే అవి ప్రస్తుతం 19.24 కోట్లకు పెరగడం దీనికి నిదర్శనం. కొత్త ఇన్వెస్టర్లలో ప్రధానంగా కనిపించే సమస్య.. లాభాల ఆకాంక్షలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కొద్ది పెట్టుబడితోనే భారీగా సంపాదించేయొచ్చన్న అత్యాశ వారిని ఎఫ్అండ్వో మార్కెట్వైపు ఆకర్షిస్తోంది. ‘‘డెరివేటివ్లు (ఎఫ్అండ్వో) అన్నవి హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, యాక్టివ్ ట్రేడింగ్ కోసం రూపొందించినవి. కానీ, ప్రస్తుత రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేటివ్ ట్రేడింగ్వైపే మొగ్గు కనిపిస్తోంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎఫ్అండ్వోలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా దీన్నొక ఆదాయ మార్గంగా చూస్తుండడం మరింత రిస్్కను ఆహ్వానించడమే అవుతుంది. రుణంతో మరింత రిస్క్ ఎఫ్అండ్వో మార్కెట్లో మార్జిన్ ఫండింగ్, వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్కు సైతం రిటైల్ ఇన్వెస్టర్లు వెనుకాడడం లేదు. ట్రేడ్లతో నష్టపోయి.. తమవద్ద పెట్టుబడి సరిపోక రుణ సదుపాయంతో పొజిషన్లు తీసుకుంటున్నారు. లాభంతో తీర్చేయొచ్చన్న అంచనాలతో మరింత రిస్క్ తీసుకుంటున్నారు. నష్టం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. ఇన్వెస్టర్లలో ప్రవర్తనా పరమైన బలహీనతలు సైతం అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రేడ్లో నష్టం రాగా, తదుపరి ట్రేడ్లో లాభం వస్తుందన్న అతివిశ్వాసం పనికిరాదంటున్నారు. ‘‘ఆప్షన్ ధరల తీరు, నమూనాలు, డెరివేటివ్లను సరిగ్గా అర్థం చేసుకోకుండా.. యూట్యూబ్ ఛానళ్లను చూడడం, సోషల్ మీడియా గురువులను అనుసరించడం లేదంటే వాట్సాప్ గ్రూప్లలో చేరడం ద్వారా ఎఫ్అండ్వోలో లాభాలు సంపాదించేయగలమన్నది తప్పుడు అవగాహనే అవుతుంది’’ అని ప్రైమ్ వెల్త్కు చెందిన సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్పీ) అలోక్ దూబే పేర్కొన్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లలో సరైన విజ్ఞానం, క్రమశిక్షణ ఉండడం లేదన్నారు. ఇవి లేకుండా ఎఫ్అండ్వో ట్రేడింగ్ గ్యాంబ్లింగే అవుతుందని హెచ్చరించారు. పెద్ద సవాలు.. ఎఫ్అండ్వో ట్రేడింగ్ అన్నది ఎంతో సంక్లిష్టమైనదని నిపుణుల విశ్లేషణ. మార్కెట్, స్టాక్స్ కదలికలు దేశీ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఉంటాయి. కనుక ఒక స్టాక్ పెరుగుతుందా? పడుతుందా? అని ఊహించడం అసాధ్యం. ఈ సవాళ్లను అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి. ట్రేడ్స్ ఎంపికకు స్పష్టమైన, నిర్మాణాత్మకమైన విధానం లేకుండా ఎఫ్అండ్వో మార్కెట్లోకి అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పిదమని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. అసలు ఎఫ్అండ్వో మార్కెట్ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. క్యాష్ మార్కెట్ లేదా ఎఫ్అండ్వో లేదా కమోడిటీలు ఇలా ఏ విభాగమైనప్పటికీ కాల పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసమరని.. అవి లేకుండా ట్రేడింగ్ చేయడం అవకాశమే కానీ, నైపుణ్యం కాబోదన్నారు. ‘‘ఎఫ్అండ్వో వారం, నెలవారీ సిరీస్లలో రోజులు గడుస్తూ, ఎక్స్పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చలనం లేకపోతే, అప్పుడు ఆప్షన్ల విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఒక వ్యూహం ఫలించి మంచి లాభం వచ్చినప్పటికీ.. అదే వ్యూహం ప్రతి రోజూ ఫలితమిస్తుందని గ్యారంటీ లేదు’’ అని అగర్వాల్ వివరించారు. ఫిన్ఫ్లుయెన్సర్స్ మాయలోపడితే అంతే.. బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ప్రకారం.. ఎఫ్అండ్వోలోకి ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు అడుగు పెట్టడం వెనుక ఆర్థిక ప్రభావశీలురు (ఫిన్ఫ్లూయెర్స్) పరోక్ష ప్రోద్బలం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎఫ్అండ్వోలో తాము పెద్ద మొత్తంలో సంపాదించామంటూ యూట్యూబ్, ఎక్స్ ప్లాట్ఫామ్, ఇన్స్టా్రగామ్లపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. అప్పటి వరకు ఎఫ్అండ్వో మొహం చూడని వారు సైతం ట్రేడింగ్కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ప్రభావశీలురులో రాబడులను ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్్కలు, ట్రేడింగ్ స్ట్రాటజీలను వెల్లడించడంపై ఉండదు. దీంతో ఎఫ్అండ్వో ట్రేడింగ్ ధనవంతులు కావడానికి సులభ మార్గం అన్న తప్పుడు అభిప్రాయానికి దారితీస్తోంది. అందుకే ఫిన్ఫ్లుయెన్సర్స్ తీరును నియంత్రించేందుకు సెబీ ఎన్నో కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇన్స్టిట్యూటషనల్ ఇన్వెస్టర్లదేపైచేయి ఎఫ్అండ్వో మార్కెట్లో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి.. అతి కొద్ది మంది బడా ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సమర్పయామిగా మారుతోంది. ‘‘ఎఫ్అండ్వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లకు స్పష్టమైన అనుకూలతలు ఉన్నాయి. గొప్ప టెక్నాలజీ వసతులు, ట్రేడ్లపై తక్కువ చార్జీలు, క్రమశిక్షణతో కూడిన విధానాలు వారి సొంతం’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిసింగ్ వివరించారు. 2023–24లో ప్రొప్రయిటరీ ట్రేడర్లు (బ్యాంక్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజీలు తదితర) రూ.33,000 కోట్లు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.28,000 కోట్ల చొప్పున ఎఫ్అండ్వో మార్కెట్లో లాభాలు పోగేసుకున్నారు. రిటైల్ ట్రేడర్లు ఉమ్మడిగా రూ.61,000 కోట్లు నష్టపోయారు. లావాదేవీల చార్జీలు దీనికి అదనం. ‘‘అతి విశ్వాసం, పాక్షిక వాదం తదితర ప్రవర్తనా లోపాలకు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఉచ్చులోకి లాగేవి ఇవే. అత్యాధునిక టూల్స్, వ్యయాల పరంగా సానుకూలత, సహేతుక నిర్ణయాలు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఎఫ్అండ్వో మార్కెట్లో అనుకూలిస్తున్నాయి’’ అని రవిసింగ్ తెలిపారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఆల్గోరిథమ్ ట్రేడింగ్ (ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు, విక్రయాలు చేయాలన్న కోడింగ్ సాఫ్ట్వేర్) అత్యంత అనుకూలించే అంశం. ప్రొప్రయిటరీ ట్రేడర్లలో 96 శాతం మందికి లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నట్టు రవిసింగ్ తెలిపారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ధరల గమనం ఆధారంగా వేగంగా కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను ఆల్గోరిథమ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ పూర్తి చేస్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో 13 శాతం మందే ఆల్గోరిథమ్ ట్రేడింగ్ వినియోగిస్తున్నారు. ‘‘ఇనిసిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తాజా మార్కెట్ సమాచారాన్ని మైక్రో సెకన్లలోనే తెలుసుకోగలరు. ఆప్షన్లతో హెడ్జ్ చేసుకోగలరు. వోలటాలిటీ స్ప్రెడ్స్ (తటస్థ ఆప్షన్ విధానం), నేరుగా మార్కెట్ యాక్సెస్, తక్కువ చార్జీలు వారికి అనుకూలం. రిటైల్ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాపై ఆధారపడుతుంటారు. ట్రేడ్వారీ చార్జీలు వీరికి ఎక్కువ. అంచనాలు తప్పడం, సోషల్ మీడియా టిప్స్ వారికి ప్రతికూలం’’ అని రవిసింగ్ వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్ల తప్పటడుగులు → ఫ్యూచర్స్, ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలియకుండా ఎఫ్అండ్వోలోకి పెట్టుబడితో అడుగుపెట్టడం. → మార్కెట్ సంకేతాలను, కాంట్రాక్టుల సంక్లిష్టతలను తప్పుగా అర్థం చేసుకోవడం. → మార్జిన్ ఫండింగ్తో ట్రేడ్లు చేయడం. → నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్లాస్ ఆర్డర్లను వినియోగించుకోకపోవడం. → స్పష్టమైన ప్రణాళిక లేకుండా అత్యాశ, భయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. → నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మరిన్ని ట్రేడ్లు చేయడం. → తరచూ ట్రేడ్లు చేయడం ద్వారా చార్జీల రూపంలో అధికంగా నష్టపోవడం. → ప్రతికూల పరిణామాల్లోనూ ట్రేడ్లు కొనసాగించడం. → ఎలాంటి వ్యూహాలు లేకుండా మార్కెట్లో వచ్చే సమాచారం ఆధారంగా స్వీయ అంచనాలతో ట్రేడ్లు చేయడం. ప్రయోజనాలు వేరు.. ఎఫ్అండ్వో అన్నది నిజమైన స్టాక్స్ కాకుండా డిజిటల్ కాంట్రాక్టులు. కనుక 10–20 శాతం మార్జిన్తోనే 100 శాతం విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్లు అయితే ఇంకా తక్కువ పెట్టుబడికే వస్తాయి. మార్కెట్ పతనాల్లో స్టాక్స్ హోల్డింగ్స్ విలువను కాపాడుకునేందుకు ఎఫ్అండ్వోను హెడ్జింగ్ టూల్ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటారు. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీలు తెలియవు. పైగా వారి పెట్టుబడి హెడ్జ్ చేసుకునే స్థాయిలోనూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల తరఫున ఫండ్ మేనేజర్లు ఈ హెడ్జింగ్ టూల్స్ను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. సెబీ ఇటీవలే అనుమతించిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) అనే కొత్త మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అయితే ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తుల్లో గరిష్టంగా 20 శాతం వరకు ఎఫ్అండ్వో ఎక్స్పోజర్ తీసుకునేందుకు అనుమతి ఉంది. కనుక రిస్క్ ఉన్నా అధిక రాబడి కోరుకునే వారు సిఫ్లను పరిశీలించొచ్చు. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి మార్గం..? ‘‘భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు, అపరిమిత ట్రేడింగ్, స్టాప్లాస్లను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం పెట్టుబడిని వేగంగా హరించేస్తుంది. విజయవంతమైన ట్రేడింగ్ అంటే సానుకూల పరిస్థితుల్లో లాభాలు ఆర్జించడమే కాదు. క్రమశిక్షణతో ప్రతికూలతలను అధిగమించి పెట్టుబడిని కాపాడుకోవడం కూడా’’ అని సహజ్ అగర్వాల్ తెలిపారు. → డెరివేటివ్లకు సంబంధించి సాంకేతిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. మార్జిన్ అవసరాలు, అస్థిరతలు, ఆప్షన్ ధరల తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అంశాలు తెలియాలి. – సంప్రదాయ స్టాక్స్లో పెట్టుబడులతో పోలి్చనప్పుడు ఎఫ్అండ్వోలో పెట్టుబడులపై ప్రాథమి క అవగాహన ఒక్కటే సరిపోదు. తగినంత వి జ్ఞానం కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. వేగంగా లాభాలు సంపాదించాలన్న కాంక్షతో చాలా మంది రిటైల్ ట్రేడర్లు దీన్ని విస్మరిస్తుంటారు. – దశాబ్దాల అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ టూల్స్, పెట్టుబడి బలంతో ఉన్న ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పోటీపడాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి. – స్పెక్యులేటివ్ ధోరణిని వీడి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, హెడ్జింగ్ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలి. – ఆర్థిక ప్రభావశీలురు, తప్పుదోవ పట్టించే కంటెంట్కు దూరంగా ఉండాలి. ట్రేడింగ్, సాంకేతిక అంశాలపై విఖ్యాత ఇన్వెస్టర్లు రాసిన పుస్తకాలను చదవి అపోహలు తొలగించుకోవాలి. ‘‘ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ రెండూ విరుద్ధమైనవి. పెట్టుబడులకు సహనం, దీర్ఘకాల దృష్టి అవసరం. ట్రేడింగ్లో రిస్్కతో కూడిన తక్షణ వ్యూహాత్మక చర్య అవసరం. అవగాహన కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తమ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్కు పరిమితం కావడం మంచిది. ఈ విషయంలోనూ నిపుణుల మార్గదర్శనం అవసరమే’’ అని సహజ్ అగర్వాల్ సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్

పెంచిన జీతం వెనక్కి ఇవ్వండి: ప్రముఖ కంపెనీ ఆదేశం
ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు పెంచితే సంబరపడిపోతారు. అయితే పెంచిన జీతాన్ని.. తిరిగి ఇచ్చేయమంటే?, వినటానికి వింతగా, కష్టంగా అనిపించినా.. ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ 'ర్యాన్ఎయిర్' (Ryanair) ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం..ర్యాన్ఎయిర్ సంస్థ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. జీతాల పెంపు తరువాత ఒక్కో ఉద్యోగి 3400 డాలర్లు (రూ. 2.9 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి కంపెనీ ఖాతాలో జమ చేయాలని, లేకుంటే.. ప్రతి నెలా జీతంలో కోతలు విధించాల్సి ఉంటుందని వెల్లడించింది.నిజానికి ర్యాన్ఎయిర్ ఉద్యోగులకు సంబంధించి.. సీసీఓఓ (CCOO), యూఎస్ఓ (USO) అనే రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వేతనాల పెంపుకు సంబంధించిన సీసీఓఓతో మాట్లాడి.. జీతాలను పెంచింది. కానీ ఈ నిర్ణయంపై యూఎస్ఓ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీతాల పెంపు విషయంలో ర్యాన్ఎయిర్.. 'సీసీఓఓ'తో చేసుకున్న ఒప్పందం కుదరదని కోర్టు తీరునిచ్చింది. దీంతో చేసేదేమీ లేక కంపెనీ ఉద్యోగులకు నోటీసులు పంపిస్తూ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకికంపెనీ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని.. కార్మిక సంఘం ప్రతినిధి 'ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్' పేర్కొన్నారు. అయితే.. ర్యాన్ఎయిర్ మాత్రం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నామని, ఆ తీరు కారణంగానే నోటీసులు జరీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.

అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
దశాబ్దం క్రితం ఇండియన్ మార్కెట్లో తిరుగులేని కారుగా ప్రసిద్ధి చెందిన హిందూస్తాన్ అంబాసిడర్.. తరువాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కగా కొన్ని కార్లు కనిపించినప్పటికీ.. కంపెనీ మాత్రమే ఉత్పత్తిని ఆపేసి చాలాకాలం అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఈ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేయనున్నట్లు, దీనికి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అంబాసిడర్ 2.0 పేరుతో మళ్ళీ ఆ కారు మార్కెట్లో తిరిగి వస్తుందని సమాచారం. ఇది మొదట్లో ఉన్న కారు కంటే కూడా చాలా అద్భుతంగా.. నేటి కాలానికి తగిన విధంగా ఉండేలా సంస్థ రూపొందించే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిందూస్తాన్ అంబాసిడర్ కారు.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బోల్డ్ గ్రిల్ కలిగి వెనుక భాగంలో లేటెస్ట్ స్టైల్ టెయిల్ లైట్స్ పొందుతాయి. ఇది క్లాసీ డిజైన్ కలిగి.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కారు లోపల కూడా ప్రీమియం సీట్లు, పెద్ద టచ్స్క్రీన్ డిస్ప్లే, డిజిటల్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటివి కూడా ఉండనున్నాయి. అయితే డిజైన్, ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..అంబాసిడర్ 2.0 కారు 1.5 లీటర్ లేదా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రావచ్చు. ఆ తరువాత కాలంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలను పొందే అవకాశం ఉంది. ఏబీఎస్, ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి కూడా ఈ కారులో సేఫ్టీ ఫీచర్లుగా ఉండనున్నట్లు సమాచారం.

సరికొత్త ప్లాట్ఫామ్: రూ.1 లక్ష లోపే బైక్!
ఎలక్ట్రిక్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా ఓ100 (ఓ హండ్రెడ్) పేరిట రెండో ప్లాట్ఫాంపై కసరత్తు చేస్తోంది. రూ.1 లక్ష లోపు ధర ఉండే మోటర్ సైకిల్స్ తయారీ కోసం దీన్ని ఉపయోగించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు.ఈ ప్లాట్ఫాంపై రూపొందించిన వాహనాలను ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు వివరించారు. దేశీ టూ వీలర్ల మార్కెట్లో దాదాపు 30 శాతం వాటా ఉంటున్న 100 సీసీ వాహనాలకు సరిసమాన సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు మధుమిత అగర్వాల్ పేర్కొన్నారు.
ఫ్యామిలీ

ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.నిమిషానికి 120 ఫ్లాష్లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్ట్రా ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!)

చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి)

కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్లో మాస్టర్ బెడ్రూమ్ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్లోని డోర్సెట్కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్లాంగ్ లాకప్కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి! (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..)

అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!
అందమంతా పోతపోసుకున్నట్లు కనువిందు చేసే మాయ పేరే మృణాళిని రవి. సోషల్ మీడియాలో రీల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్పై రియల్గా కనిపించడంలోనే కాదు, ఫ్యాషన్లోనూ స్టయిలిష్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాటు ఒక్కటి చాలు మీ అందాన్ని మరింత పెంచడానికి. రోజూ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఆ అలవాటే నా అందానికి సహజత్వాన్ని ఇస్తుందని చెబుతోంది మృణాళిని రవి.రాయల్ రింగ్..సాధారణ దుస్తుల్లో కూడా రాయల్గా కనిపించాలంటే.. మీ దగ్గర తప్పకుండా ఒక్కటైనా స్టేట్మెంట్ రింగ్ ఉండాల్సిందే! అది చిన్నదైనా, పెద్దదైనా సరే, మొత్తం మీ లుక్కే ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్ను ఇవ్వగలదు. ఇవి ఎక్కువగా వివిధ ఆకారాలు, రంగులు, స్టోన్స్తో ప్రత్యేకమైన డిజైన్స్లో ఉంటాయి. స్టేట్మెంట్ రింగ్ వేసుకున్నప్పుడు చేతికి వేరే ఏ ఇతర ఆభరణాలతోనూ స్టయిలింగ్ చేయొద్దు. ఎక్కువ రింగ్స్ వేసుకుంటే ఫోకస్ చెదిరిపోతుంది. మంచి నెయిల్ పాలిష్తో జత కలిపితే ఉంగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మ్యూట్ షేడ్స్ లేదా డ్రెస్కు మ్యాచ్ అయ్యే కలర్స్ ఉపయోగించండి. లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్లు, టాప్లు అసలు వేసుకోవద్దు. అలాగే హ్యాండ్బ్యాగ్కు బదులు క్లచ్ తీసుకెళ్లడం ఉత్తమం. (చదవండి: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!)ఇక కాంప్లిమెంటరీ జ్యూలరీగా కమ్మలను చూజ్ చేసుకోండి. అవికూడా మితంగా, సేమ్ టోన్ జ్యూలరీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోషూట్స్, వివాహాది శుభకార్యాలకు సింపుల్ అండ్ గ్రేట్ ఆప్షన్ ఇది. అప్పుడు అక్కడ మీరు మాట్లాడకపోయినా సరే, మీ స్టయిల్ మాట్లాడుతుంది. ఇక మృణాళిని ధరించే జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ఇయర్ రింగ్స్ ధర: రూ. 33,200, ఉంగరం ధర: రూ. 2,200, చీర బ్రాండ్: ఆలివ్ హ్యాండ్ప్రింట్స్ రూ. 3,850/-.బ్లౌజ్ ధర: రూ. 1,050/-.(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఉక్రెయిన్–రష్యా మధ్య 390 మంది యుద్ధ ఖైదీల మార్పిడి
కీవ్: తుర్కియే చర్చల సమయంలో కుదిరిన అంగీకారం మేరకు ఉక్రెయిన్, రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మొదలైంది. ఉక్రెయిన్–బెలారస్ సరిహద్దుల్లో శుక్రవారం చెరో 390 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. 2022లో రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఈ స్థాయిలో యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ అప్పగించిన తమ 390 మంది సైనికులు, పౌరులను వెంటనే బెలారస్కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా సైతం తమ 390 మంది సైనికులను అప్పగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. మొత్తం వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకునేందుకు 16న తుర్కియేలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఇందులో మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, ఈ వారాంతంలో మరికొందరిని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలున్నాయని జెలెన్స్కీ వివరించారు. కాగా, తదుపరి చర్చల విషయంలో ఎలాంటి అంగీకారం కుదరలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. ఖైదీల మార్పిడి పూర్తయ్యాక దీర్ఘకాల, సమగ్ర శాంతి ఒప్పందం కోసం రూపొందించిన షరతుల ముసాయిదాను ఉక్రెయిన్కు అందజేస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు.కీవ్పై విరుచుకుపడ్డ రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగానే రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సైరన్ మోతలు, పేలుళ్ల శబ్ధాలతో కీవ్ వాసులు బాంబు షెల్టర్లలో రాత్రంగా గడిపారు. రష్యా ప్రయోగించిన 14 క్షిపణులు, 250 షహీద్ డ్రోన్లనకు గాను 6 క్షిపణులను, 245 డ్రోన్లను కూల్చామని కీవ్ యంత్రాంగం తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ఘటనల్లో 15 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని వెల్లడించింది. పలు నివాస భవనాలు, అపార్టుమెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మంటలు చెలరేగాయని వివరించింది. మే 20–23వ తేదీల మధ్య ఉక్రెయిన్ తమ దేశంపైకి ప్రయోగించిన 788 డ్రోన్లను కూల్చి వేసినట్లు రష్యా తెలపగా, గురువారం రాత్రి సైతం రష్యా తమపైకి 175 షహీద్ డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.

అసూర్యంపశ్య
అసూర్యంపశ్య. అంటే ఎండ కన్నెరగని స్త్రీ. చైనాలో ఓ 48 ఏళ్ల మహిళ ఉదంతమిది. సిచువాన్ ప్రావిన్సులో చెంగ్డూ నగరానికి చెందిన ఆమె తన ఒంటిని ఒక్క సూర్యకిరణం కూడా తాకనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆరుబయటకు వెళ్లినా ఒళ్లంతా కప్పేలా వ్రస్తాలు ధరించేది. ముఖం, చేతులు బయటకు కనిపించక తప్పని పరిస్థితుల్లో నిండుగా సన్స్క్రీమ్ లోషన్ పట్టించి మరీ వెళ్లేది. ఈమెకు ఉన్న ఈ అలవాటు ఇప్పటిది కాదు. చిన్ననాటి నుంచే ఇదే తంతు. ఎండ తగిలితే కందిపోవడమే గాక నల్లబడతానన్న భయమే ఇందుకు కారణం. అందుకే నిత్యం పొడవాటి టాప్స్ ధరించేది. చలువ కళ్లద్దాలు, సాక్స్, షూ, పొడవాటి చొక్కా.. ఇలా ఏ రకంగానూ సూర్యకాంతి సోకకుండా బహుజాగ్రత్తలు తీసుకుంది. షార్ట్స్, స్లీవ్స్ పొరపాటున కూడా వేసుకునేది కాదు! అయితే ఏమైంది? ఒంటికి ఎండ తాకక అత్యావశ్యకమైన ‘డి’విటమిన్ లోపించింది. ఎంతగా అంటే, ఇటీవల ఆమె పడక మంచంపై కాస్త అటూ ఇటూ కదలగానే ఏకంగా ఓ ఎముక విరిగిపోయింది. డి విటమిన్ లోపంతో ఎముకలు గట్టిదనం తగ్గి పెళుసుబారడమే అందుకు కారణం. ఎముక విరగడంతో నరకయాతన నడుమ ఆస్పత్రిలో చేరింది. మెత్తని బెడ్ మీద ఎముక ఎలా విరిగిందని వైద్యులే విస్తుపోయారు. పరీక్షలన్నీ చేసి, డి విటమిన్ లోపమని తేల్చడమే గాక ఆమెను మందలించారు. బోలు ఎముక వ్యాధిగా పేర్కొనే ఆస్టియోపోరోసిస్ బారినపడ్డట్టు చెప్పారు. లాంగ్ షువాంగ్ అనే సంప్రదాయ వైద్యున్ని ఉటంకిస్తూ సౌత్చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ తాజాగా ఈ వింతగాథను బయటపెట్టింది. ఇదిప్పుడు అంతటా పెద్ద చర్చనీయంగా మారడమే గాక సోషల్ మీడియాలోనూ తెగ వైరలైంది. కీలకమైన విటమిన్ విటమిన్ డి ప్రకృతిలో సహజంగా లభించదు. శరీరమే దాన్ని తయారు చేసుకుంటుంది. అందుకు సూర్యకాంతి అవసరం. ఉదయపు లేత కిరణాల వేడికి చర్మం కింది పొరలోని రసాయనాలు వేడెక్కి డి విటమిన్ను తయారు చేసుకుంటాయి. అది ఉంటేనే మన శరీరం అత్యధికంగా కాల్షియంను సంగ్రహించుకోగలదు. కాల్షియం సమపాళ్లలో ఉన్నప్పుడే ఎముకలకు గట్టిదనం వస్తుంది. అవి గట్టిగా ఉంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలం. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. ఎముక ఆరోగ్యంగా, అస్థిపంజరం పటిష్టంగా ఉండాలంటే ఉదయపు ఎండ తగలాల్సిందే. చైనాలో విపరీత పోకడ చైనాలో ఇలా ఎండకు ముఖం చా టేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరుబయటకు వెళ్లినా పేద్ద గొడుగు, చేతులన్నీ కప్పేసేలా దుస్తులు, పెద్ద కళ్లద్దాలు, గ్లౌజ్లు, ఫేస్ మాస్క్ లు, కాళ్లకు షూ, అతినీలలోహత కిరణాలను ఆపే హూడీలు... ఇవే ఇప్పుడు చైనాలో ట్రెండ్! ఇలా చేస్తే కాల్షియం సంబంధ వ్యాధులతో ఆస్పత్రిపాలవడం ఖాయ మని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. ఒంట్లో పదేళ్లకోసారి ఎముకలన్నీ కొత్త శక్తితో పునరుజ్జీవం పొందుతాయి. 40 ఏళ్లు దాటాక మాత్రం ఎము కల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి పెళుసుబారతాయి. చక్కటి వ్యాయామం, ఆహారశైలే దానికి విరుగుడని గ్వాంగ్జూ వైద్య విశ్వవిద్యాలయంలో ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జియాంగ్ గ్జియోబింగ్ చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్

సగం విశ్వమానవాళికి సంక్షోభాల సెగ
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొద లు హమాస్, ఇజ్రాయెల్ పోరు, ఎర్రసముద్రంలో హౌతీల క్షిపణి దాడులదాకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటాలు, యుద్ధాలు, ఉద్యమాలు, సైనిక చర్యలతో ప్రపంచ జనాభాలో సగం మంది సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారని అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ల కారణంగా దక్షిణాసియాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొందని ‘‘సాయుధ సంక్షోభాలు, ప్రాంతాలు, సంఘటనలు(ఏసీఎల్ఈడీ)’’సంస్థ తెలిపింది. స్వతంత్య్రంగా పనిచేసే లాభాపేక్షలేని ఏసీఎల్ఈడీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, సంక్షోభాల వివరాలతో ఒక నివేదికను రూపొందించింది. చాలా సంవత్సరాలుగా ఊహించనంతగా చాలా దేశాల్లో సంక్షోభాలు ఉన్నప్పటికీ కేవలం గత 12 నెలల్లో పరిణామాలను గమనిస్తేనే 50 దేశాల్లో 423 కోట్ల మంది ప్రజలు పలు రకాల సంక్షోభాలకు బాధితులుగా మిగిలిపోయారని గణాంకాలు ఘోషించాయి. 2024 డిసెంబర్నాటి ‘సంక్షోభ సూచీ’గణాంకాల ప్రకారం 10 దేశాలు అత్యంత సంక్షుభిత దేశాలుగా, 20 దేశాలు అతి, మధ్యస్థ స్థాయి సంఘర్షణలకు కేంద్రస్థానాలుగా తయారయ్యాయి. పాలస్తీనా 2024 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దయనీయమైన ప్రాంతంగా మారింది. మయన్మార్లో ఏకంగా 170 సాయుధ గ్రూప్లు క్రియాశీలకంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సైతం దారుణమైన యుద్ధసంక్షోభాన్ని చవిచూస్తోంది. ఎందుకీ సంక్షోభాలు? పలు దేశాల్లో బలహీనమైన నాయకత్వం, మిత్రదేశం కోసం అప్పటికే జరుగుతున్న యుద్ధంలో కలగజేసుకోవడం, దేశాల మధ్య చెడిన సఖ్యత,మారిన ప్రభుత్వాల అంతర్జాతీయ విధానాలు, పొరుగు దేశాల పట్ల శత్రుభావన స్థాయిలో మార్పులు, దేశంలో చెలరేగిన విద్వేషాలను పొరుగుదేశాలు సొమ్ముచేసుకోవడం, ఉద్దేశపూర్వకంగా వైషమ్యాలను రెచ్చగొట్టి ఉద్యమాలకు తెరతీయడం వంటి పలు రకాల ఉదంతాలతో ఆయా దేశాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్థమవుతోంది. నిత్యావసరాలూ మృగ్యమయ్యాయి. సహస్రాబ్దివేళ కాస్తంత శాంతించి.. 1960 దశకంలో కలహాలతో సమస్యల వలయంలో చిక్కుకున్న దేశాల సంఖ్య 15గా ఉండేది. 1991 ఏడాదికి వచ్చేసరికి ఈ సంఖ్య ఏకంగా 53 దేశాలకు పాకింది. తర్వాత 2000 సంవత్సరానికి వైషమ్యాలు బాగా సమసిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని 2010 ఏడాదికల్లా 31 దేశాల్లో ఘర్షణలు, యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఇక 2023 ఏడాదికల్లా సమరంలో కత్తులు దూసుకుంటున్న దేశాల సంఖ్య రికార్డ్స్థాయిలో 59కి పెరిగింది. మరణాల సంఖ్య సైతం ఇదే పంథాలో కొనసాగింది. 1960 ఏడాదిలో యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాల్లో 64,873 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990 ఏడాదిలో ఏకంగా 80,297 మంది అమాయకులు చనిపోయారు. 2005 ఏడాదికి వచ్చేసరికి ఈ జగడాల్లో మరణాల సంఖ్య 12,150కి దిగివచ్చింది. ఇక ఉక్రెయిన్, రష్యా యుద్ధంసహా ప్రపంచవ్యాప్తంగా వైషమ్యాలు, దేశాల మధ్య కలహాలు కట్టుతప్పడంతో 2022 ఏడాదిలో మరణాలు రికార్డ్ స్థాయిలో 2.77 లక్షలను దాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇప్పుడే అత్యధికం ‘‘ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాతి నుంచి చూస్తే విశ్వావ్యాప్తంగా దేశాల మధ్య రణాల గొణ ఇప్పుడే ఎక్కువగా ఉంది. దేశాల మధ్య గొడవలకు తోడు దేశీయంగానూ ఉద్యమాలు, అల్లర్లు, హింస కారణంగా మృత్యువు ఒడిలోకి చేరుతున్న అమాయక ప్రజల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది’’అని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ప్రొఫెసర్ సిరి అసద్ రుస్తాద్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పటికే సగం ప్రపంచ జనాభాకు సమరాల సెగ తగులుతోంది. ఈ విద్వేషాగ్ని ఇప్పట్లో చల్లారేలా లేదు. దాదాపు ఏడాదిన్నర యుద్ధం తర్వాత కూడా ఇజ్రాయెల్ ఆదివారం గాయాల గాజాపై మరింతగా క్షిపణులను ఎక్కుపెట్టడమే ఈ దారుణపర్వానికి ప్రబల తార్కాణం’’అని రుస్తాద్ వ్యాఖ్యానించారు. ఓవైపు చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్పై మరోమారు భీకర స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడి రష్యా తన ఆక్రమణ జెండాను దించేదిలేదని తెగేసి చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

పారిపోండ్రోయ్..!!
ఇస్లామాబాద్: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్ స్థావరం మీదా భారత్ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరాతీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది.
జాతీయం

‘నాన్న నన్ను క్షమించండి.. నా చావుకు మామ, వదినే కారణం’
మొరాదాబాద్: అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేశాను. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా ఆడపడుచు, మామ వేధింపులు భరించలేకపోతున్నా. ఈ జన్మకు మిమ్మల్ని ఆనందంగా చూసుకోలేకపోయాను. మళ్లీ జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా జన్మిస్తాను అంటూ వీడియో రికార్డు చేసి నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. మొరాదాబాద్కు చెందిన అమ్రీన్ జహాన్(23) నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో అతడు అక్కడికి వెళ్లాడు. అమ్రీన్ అత్తారింట్లోనే ఉంది. ఈ క్రమంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా అత్తంట్లో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో ఆమెను వేధించడంతో బాధను తట్టుకోలేకపోయింది. దీంతో, ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, ఆడపడుచు, మామనే కారణమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేసింది.వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా భర్త కొన్నిసార్లు నా ఆహారపు ఆటవాట్ల గురించి సెటైర్లు వేస్తారు. నా ఆడపడుచు ఖతిజా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా వారికి నచ్చదు. కొన్నిసార్లు వారు నా గదికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. నా మామ షాజిద్ నాతో అనుచితంగా ప్రవరిస్తాడు. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు. వారి వేధింపుల గురించి నా భర్తకు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. పైగా నన్నే తిడుతున్నాడు. నువ్వు ఎందుకు చచ్చిపోవడం లేదని అంటున్నాడు. నా ఆడపడుచు, మామ కూడా ఇలాగే అంటున్నారు. చచ్చిపో.. చచ్చిపో అని అంటున్నారు. వీరి వేధింపులను నేను సహించలేకపోతున్నాను. నేను చనిపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలియదు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. నా చావుకు నా భర్త, ఆడపడుచు, మామనే కారణం’ అని చెప్పుకొచ్చింది. అనంతరం, ఆత్మహత్య చేసుకుంది.తన బిడ్డ చావు అమ్రీన్ తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. అనంతరం, ఆమె తండ్రి సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్రీన్ నిన్న తనకు ఫోన్ చేసి ఏడ్చాడని అతను చెప్పాడు. తనపై దాడి జరుగుతోందని, తనను కాపాడమని వేడుకున్నట్టు తెలిపాడు. ఇంటి వచ్చేలోపే బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సలీం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సలీం ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్రీన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

తాజ్ మహల్కు బాంబు బెదిరింపు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో గల తాజ్ మహల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఎక్స్తో తాజ్మహల్ను పేల్చివేస్తామని కేరళ నుంచి ఈ మెయిల్ అందిన దరిమిలా సంబంధిత అధికారులు తాజ్ మహల్(Taj Mahal) వద్ద హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా సంస్థలు అప్రమత్తమై, నిఘాను మరింత ముమ్మరం చేశాయి.బాంబు బెదిరింపు ఈ ఇమెయిల్ అందిన వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), తాజ్ భద్రతా పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. తాజ్ మహల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు(Delhi Police) గుర్తు తెలియని మెయిల్ ఐడి నుండి బెదిరింపు మెయిల్ అందింది. తాజ్ మహల్ను ఆర్డీఎక్స్తో పేల్చివేస్తామని దానిలో హెచ్చరించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ నకిలీదని తేలింది. దీనిపై సైబర్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న

ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజాగా గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్(By-election schedule)ను ప్రకటించింది. జూన్ 19 (గురువారం)న ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 23 (సోమవారం)న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.గుజరాత్లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ఒక్కొక్క అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లో, సిట్టింగ్ ఎమ్మెల్యే కర్సన్భాయ్ పంజాభాయ్ సోలంకి మృతితో కాడి స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. సిట్టింగ్ సభ్యుడు భయానీ భూపేంద్రభాయ్ గండుభాయ్ రాజీనామా కారణంగా రాష్ట్రంలోని విశావదర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.కేరళలో, పి వి అన్వర్ రాజీనామా చేయడంతో నీలంబర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ సభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి మృతి కారణంగా పంజాబ్లోని లూథియానా స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాగా భారత కూటమి మిత్రపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) (ఆప్)తో భాగస్వామ్యం లేకుండా విశావదర్, కాడి అసెంబ్లీ స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేయనున్నామని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ గతంలో ప్రకటించారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ మే 26న ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. వీటి పరిశీలన జూన్ 3న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 5గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘ఆపరేషన్ సింధూర్’ గర్వకారణం: ప్రధాని మోదీ

‘ఆపరేషన్ సింధూర్’ గర్వకారణం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైనికులు చూపిన శౌర్యపరాక్రమాలు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ 122వ ఎపిసోడ్(మే 25)లో ప్రధాని నరేంద్ర మోదీ తన మసుసులోని మాటను వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, పలు కుటుంబాలు దీనిని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక దేశంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం బీహార్లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడినవారు, కుట్రదారులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని కలచివేసిందన్నారు.ఉగ్రవాదంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారని ప్రధాని గుర్తుచేశారు. కాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు రాకతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. ఈ గ్రామం మావోయిస్టుల హింసకు గురైందని, గ్రామానికి తొలిసారిగా బస్సు చేరుకున్నప్పుడు ఘనంగా స్వాగతించారని అన్నారు. గత మన్ కీ బాత్లో ప్రధాని మోదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏప్రిల్, మే నెలల ప్రాముఖ్యతను తెలియజెప్పారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) చేసిన త్యాగాలను వివరించారు.ఇది కూడా చదవండి: Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

నువ్వులేక.. నేనుండలేను
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్కు, పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్లో సునీల్ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

కుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది. మహాదేవస్వామి, భార్య మంజుల, వీరి చిన్న కుమార్తె హర్షిత మృతులు. మహాదేవస్వామిపెద్దకుమార్తె హర్షిత రెండురోజుల క్రితం ప్రియునితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. గ్రామంలో తల ఎత్తుకోలేకపోయామని తల్లిదండ్రులు, చెల్లెలు ఆవేదనకు లోనయ్యారు. శనివారం గ్రామ సమీపంలోని చెరువులోకి దూకారు. చెరువు కట్టపై బైక్, చెప్పులు ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా ఏమీ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ సిబ్బందితో వచ్చి చెరువులో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.

రెండు దుర్ఘటనల్లో.. ఏడుగురు బలి!
చింతకొమ్మదిన్నె/సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన దుర్ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. విజయవాడలోని ఓ అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ ముగ్గురు బలయ్యారు. వివరాలివీ.. కారుపైకి లారీ దూసుకొచ్చి.. వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన బసినేని శ్రీకాంత్రెడ్డి, బి. కోడూరుకు చెందిన కోగటం తిరుపతిరెడ్డి కుటుంబాలు బెంగళూరులో ఉంటున్నాయి. వీరిలో శ్రీకాంత్రెడ్డి బెంగళూరులో.. తిరుపతిరెడ్డి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తిరుపతిరెడ్డి ఇటీవలే స్వదేశానికి వచ్చి వారం రోజుల కిందట తిరిగి జర్మనీకి వెళ్లాడు. ఈ క్రమంలో.. శ్రీకాంత్రెడ్డి (32), తన భార్య శిరీష (28), కుమార్తె త్రిషికారెడ్డి (3).. తిరుపతిరెడ్డి భార్య శశికళ (35), కుమార్తె సాయి హర్షిత (9), కుమారుడు రిషికేశవర్రెడ్డి (8), శశికళ సోదరి స్వర్ణ (38) కడప జిల్లా బద్వేలుకు శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి బయల్దేరారు. సమీప బంధువులైన వీరంతా తమ స్వగ్రామం బద్వేలు మండలం చిన్న పుత్తాయపల్లెలోని శ్రీరాముల దేవాలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరి కారు కడప–చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్.. చింతకొమ్మదిన్నె రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చిoది. అదే సమయంలో ఎరువుల లోడుతో విల్లుపురం నుంచి హైదరాబాదుకు వెళ్తున్న లారీ వెనక నుంచి వేగంగా వచ్చి, కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో శ్రీకాంత్రెడ్డి, శిరీష, రిషికేశవర్రెడ్డి, సాయిహర్షిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని పసిగట్టి శ్రీకాంత్, శిరీషలు తమ కుమార్తె చిన్నారి త్రిషికారెడ్డిని కారు నుంచి బయటకు తోసేయగా మట్టి కుప్పలపై పడి గాయపడింది. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్, డీటీఆర్బీ (డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో) సీఐ మహమ్మద్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్ సాయంతో కారు, లారీని వేరుచేశారు. కారులో ఇరుక్కుపోయిన నాలుగు మృతదేహాలను బయటికి తీసేందుకు గంటన్నరసేపు శ్రమించాల్సి వచి్చంది. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించి మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు.దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ సాయిటవర్స్ అపార్ట్మెంట్లో కాకినాడు జిల్లా సామర్లకోటకు చెందిన చలాది రామదుర్గా ప్రసాద్ (55), రాధ (45) ఉంటున్నారు. ప్రసాద్ లారీడ్రైవర్గా పనిచేసేవారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రసాద్ చెల్లి ఊటుకూరి ముత్యావళి (42) ఇంటి ముందు ఇనుప తీగపై దుస్తులు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ వైరు, కేబుల్ వైరు, దుస్తులు ఆరేసే తీగ అన్నీ కలిపి ఉన్నాయి. వర్షాలతో ఎర్త్వైర్కు విద్యుత్ సరఫరా అవడంతో తీగపై దుస్తులు వేయగానే ముత్యావళి విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ప్రసాద్, రాధ షాక్కు గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఫ్లాట్ ఖాళీచేస్తున్న తరుణంలో.. కుటుంబ తగాదాల నేపథ్యంలో ప్రసాద్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముత్యావళి రెండ్రోజుల క్రితం కడియం నుంచి వచ్చింది. సామగ్రిని తరలించేందుకు అన్నీ సర్దుకుని మరికొన్ని గంటల్లో బయల్దేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి ఇంట్లో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా రాజమహేంద్రవరంలోని వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రమాదం జరిగిన ఇంటికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్ను హ్యాక్ చేసి ఆమె డీప్ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.