
ప్రకృతివనాల్లో చెత్తాచెదారం తొలగింపు
కై లాస్నగర్: ప్రజలకు ఆహ్లాదం పంచాల్సిన పట్టణ ప్రకృతివనాలు పచ్చదనం ఆనవాళ్లే లేకుండా పో తున్న తీరును వివరిస్తూ ‘వనం.. కళావిహీన’ శీర్షి కన ఈనెల 21న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. పట్టణ ప్రకృతి వనాల శుభ్రత పనులను శనివారం ప్రారంభించా రు. డిగ్రీ కశాశాల, డైట్ కళాశాల ఆవరణలోని ప్రకృతివనంలో పేరుకుపోయి న చెత్తాచెదారాన్ని, విరిగిపడ్డ చెట్ల కొమ్మల ను పారిశుధ్య సిబ్బందితో తొలగింపజేశారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవికిరణ్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.
ఎఫెక్ట్..

ప్రకృతివనాల్లో చెత్తాచెదారం తొలగింపు