Adilabad District Latest News
-
టెండర్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ని బస్ స్టేషన్లలో పక్కా స్థలం, ఖాళీ ప్రదేశాల్లో వ్యాపారాల నిర్వహణకు సంబంధించి టెండ ర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్షన్, మ్యానువల్ టెండర్ల విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, గుడిహత్నూర్, జైనథ్, ఇచ్చోడ బస్స్టేషన్లలో మొత్తం 19 స్థలాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఈనెల 19వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటా యని పేర్కొన్నారు. ఈనెల 20న మధ్యాహ్నం 2గంటల వరకు రీజియన్ కార్యాలయంలో సమర్పించవచ్చని, అదే రోజు 3గంటల వరకు టెండర్లు ఫైనల్ అవుతాయని పేర్కొన్నారు. -
17ఏళ్ల కల.. నెరవేరిన వేళ
● డీఎస్సీ–2008 అభ్యర్థులకు పోస్టింగ్ ● హైకోర్టు ఉత్తర్వులతో కాంట్రాక్ట్ టీచర్ కొలువు ● అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు ● జిల్లాలో 10 మందికి ప్రయోజనం ఆదిలాబాద్టౌన్: 2008–డీఎస్సీ బీఎడ్ అభ్యర్థుల న్యాయ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కాంట్రాక్ట్ కొలువు దక్కింది. రెండు, మూడు నెలల క్రితం అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి వీరికి పోస్టింగ్ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జాప్యం అయింది. దీంతో సదరు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీలోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాల మీద నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 74 మందికి ప్రయోజనం చేకూరగా ఆదిలా బాద్ జిల్లాలో 10 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా వారికి వివిధ పాఠశాలల్లో పోస్టింగ్ కల్పించారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ప్రభుత్వ కొలువు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరికి డీఈవో ప్రణీత నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యాలయ ఉద్యోగులు తుషార్, సతీష్, సాయితేజ, గోవర్దన్ ఇందులో పాల్గొన్నారు. ఫలించిన నిరీక్షణ ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో కామన్ నియమాకాలు చే పట్టారు. దీంతో ఎస్జీటీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో 70:30 నిష్పత్తిలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 135 మంది అభ్యర్థులు ఎంపికై నప్పటికీ 70: 30 కారణంగా ఉద్యోగా లకు దూరమయ్యారు. అప్పటి నుంచి వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరికి కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల వివరాలను సేకరించింది. చాలా మంది ఇతర శాఖల్లో కొలువులు పొందారు. అర్హులుగా గుర్తించిన వారిలో ప్రస్తుతం ఉ మ్మడి జిల్లా పరిధిలో 74 మంది మాత్రమే మిగిలిపో యారు. ఆదిలాబాద్ జిల్లాకు 10 మంది, మంచిర్యాలకు 14 మంది, నిర్మల్కు 20 మంది, కుమురంభీం ఆసిఫాబాద్కు 30మందిని ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు నియామక ప్రక్రియ పూర్తి చేశారు.కాంట్రాక్ట్ పద్ధతిన.. 2008 డీఎస్సీ బీఎడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు లేని పాఠశాలలను ఎంపిక చేసి పోస్టింగ్ కల్పించారు. బోథ్, గాదిగూడ మండలానికి ఇద్దరు చొప్పున, భీంపూర్, జైనథ్, బేల, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ మండలాలకు ఒకరు చొప్పున కేటాయించారు. వీరికి నెలకు రూ.31,040 వేతనం చెల్లించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు ఈ వేతనంపై వీరు సేవలందించాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మళ్లీ వీరంతా తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్లను సైతం అందించాల్సి ఉంటుందని అధికారులు తెలి పారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాఠాలు బోధించేందుకు బడిబాట పట్టడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. -
● క్రమబద్ధీకరణపై యంత్రాంగం దృష్టి ● పూర్తయిన వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే ● 353 మంది ఉన్నట్లు తేలిన లెక్క ● త్వరలోనే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు
ప్రత్యేక సర్వే.. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు ఎంత మంది ఉన్నారనే దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టారు. ఐదుగురు రెవెన్యూ అధికారులు, ఐదుగురు టౌన్ప్లానింగ్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయాచౌక్ల్లో సర్వే నిర్వహించారు. వీధి వ్యాపారి పేరు, సెల్నంబర్, వారు నిర్వహించే వ్యాపారం వంటి వివరాలు సేకరించారు. సర్వే అనంతరం వారిని అక్కడి నుంచి తరలించనున్నారు. ఇప్పటికే గుర్తించిన గణేశ్ థియేటర్ స్థలం, పాత వెంకటేశ్వర సామిల్ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయా చౌక్లను సుందరంగా మార్చేందుకు సైతం ఈ ప్రక్రియ తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కై లాస్నగర్: పట్టణంలోని వ్యాపార, వాణిజ్య ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై భారీ డివైడర్లతో పాటు వాటికిరువైపులా తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకుని వీధి వ్యాపారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లోని రోడ్లన్నీ ఇరుకుగా మారి ట్రాఫిక్కు తరచూ అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆటోలు వెళ్లిన సమయంలో మరో వాహనం వెళ్లలేని పరిస్థితి. పాదాచారులు నడిచేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తొలగించే దిశగా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వీధి వ్యాపారుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టారు. మొత్తం 353 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సమాచారాన్ని మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. వివరాలను కమిషనర్ పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేయనున్నారు. అనంతరం వారికి నిర్దేశిత ఎంపిక స్థలాల్లో వ్యాపారాల కోసం స్థలాలు కేటాయించనున్నారు. జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ పట్టణంలోని దేవీచంద్చౌక్ నుంచి గాంధీచౌక్ మీదుగా అంబేడ్కర్చౌక్ వరకు, అలాగే అంబేడ్కర్ చౌక్ నుంచి శివాజీచౌక్ వరకు వ్యాపార, వాణిజ్య పరంగా ప్రధాన కూడళ్లు. వివిధ పనుల నిమిత్తం పట్టణవాసులే కాకుండా చుట్టు పక్కల గ్రా మాల నుంచి నిత్యం జనం భారీగా వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు అసలే చిన్నవిగా ఉండగా, వాటిపై డివైడర్లు నిర్మించడం, అలాగే వాటికి ఇ రువైపులా వీధి వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పా టు చేయడంతో మరింత ఇరుకుగా మారుతున్నా యి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను రోడ్లపై, షాపుల ఎదుట పార్కింగ్ చేస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ పరిస్థితిని తొలగించాలనే ఉద్దేశంతో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సి పల్, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీ క్ష నిర్వహించారు. వీధి వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడంతో పాటు భారీగా ఉన్న డివైడర్ల ఎత్తు, వెడల్పు తగ్గించాలని ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్యను నియంత్రించవచ్చని తెలిపారు. వ్యాపారులు సహకరించాలిప్రజలకు ఇబ్బందికరంగా మారిన ట్రాఫి క్ సమస్యను తొలగించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానచౌక్ల్లో ఉన్న వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే పూర్తయింది. 353 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. వీరికి గణేశ్ థియేటర్, వెంకటేశ్వర సామిల్ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. వారు కూడా సహకరించాలి. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
ఫలించిన నిరీక్షణ
● రూ.4.90 కోట్ల పెండింగ్ ఎంపీ ల్యాడ్స్ విడుదల ● బిల్లుల చెల్లింపునకు అధికారుల కసరత్తు ● కాంట్రాక్టర్లు, నాయకుల హర్షంకై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఎంపీ హయాంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 17వ లోక్సభకు సంబంధించి మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా విడుదల చేసింది. వాటి చెల్లింపునకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. వారం, పది రోజుల్లో పనులు చేసిన వారందరికీ బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర నిర్ణయంపై ఈ నిధులతో పనిచేసిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం పనులు పూర్తి... 2019–24కి సంబంధించి 17వ లోక్సభకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సోయం బాపూరావు కొనసాగారు. ఈ సమయంలో ఎంపీ ల్యాడ్స్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో రూ.4.90 కోట్లతో కూడిన 160 పనులను ప్రతిపాదించారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ వంటి తది తర పనులున్నాయి. ఎంపీ ప్రతిపాదించగా వాటికి కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు, బీజేపీ నాయకులు, అప్పటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు ఈ పనులను తమతమ ప్రాంతాల్లో చేపట్టి పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో రూ.3.90 కోట్లతో 137 పనులు చేపట్టారు. అలాగే నిర్మల్ జిల్లాలో రూ.52లక్షలతో 11 పనులు, కుమురంభీం జిల్లాలో రూ.43లక్షలతో 11 పనులు, మంచిర్యాల జిల్లాలో రూ.4లక్షలతో కూడిన ఒక పనిని పూర్తి చేశారు. ఈ పనులు పూర్తయి ఏళ్లు గడిచినప్పటికీ నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం చేసింది. ఎంపీగా సోయం పదవీ కాలంలో ఎంత ప్రయత్నించినప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన వారంతా ఇప్పటి వరకు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు విడుదల... గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్ బీజేపీ తరఫున గెలుపొందారు. ఆయన గెలిచిన రెండు నెలలకే తన నియోజకవర్గ నిధికి సంబంధించి కేంద్రం రూ.5కోట్ల ఎంపీ ల్యాడ్స్ విడుదల చేసింది. అయితే సోయం పదవీ కాలానికి సంబంధించిన నిధులు మాత్రం పెండింగ్లోనే పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడంతో ఆ నిధులు విడుదలవుతాయో లేవోనని పనులు పూర్తి చేసిన వారిలో ఆందోళన వ్యక్తమైంది. వాటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తుండగా వారి నిరీక్షణకు తెరదించుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ బిల్లులను చెల్లించే దిశగా ప్రణాళిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. ఏళ్లుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
డిజిటలైజేషన్తో రికార్డులు మరింత భద్రం
ఆదిలాబాద్టౌన్: కోర్టులోని కేసుల రికార్డులను భ ద్రంగా ఉంచేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిజిటలైజేషన్ చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసొసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇప్పటి వరకు మ్యానువల్గా ఉన్న రికార్డులను కంప్యూటరీకరిస్తూ భద్రపరుస్తున్నామన్నారు. అనంతరం కోర్టు హాలులో పెండింగ్ కేసులపై పో లీసు అధికారులతో సమీక్షించారు. అలాగే మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో అత్యధి కంగా రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీళజైన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దుఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స పొందవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. కోర్టు ఉద్యోగులు, సి బ్బంది కోసం కోర్టుప్రాంగణంలో శనివారం ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని జడ్జి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీళ జైన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజ న్య, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, క్షయ నియంత్రణ అధికారి సుమలత, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్ పాల్గొన్నారు. -
ఈవీఎంల గోదాం తనిఖీ
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ నెల తనిఖీల్లో భాగంగా శనివారం స్థానిక శాంతినగర్లో గల ఈవీఎంల గోదాంను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం సీలు తెరిపించి గోదాంలో భద్రపర్చిన ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు యథావిధిగా సీల్ వేయించి, తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల, సిబ్బంది దేవరాజ్, తదితరులున్నారు. -
వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వండి
ఆదిలాబాద్టౌన్: యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్చార్జి సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్కళాశాల వసతి గృహంలో కొనసాగుతున్న భీంపూర్, మావల మండ ల కేజీబీవీ విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారమివ్వాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాగే కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో, బాల్యవివాహ, ఇతర చట్టాలను వివరించారు. ఇందులో డీఈవో టి.ప్రణీత, పాఠశాలల ప్రత్యేకాధికారులు సీహెచ్.రజనీ, సువర్ణ, సీఆర్టీలు తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్స్టేషన్కు నూతన వాహనాలు
ఆదిలాబాద్టౌన్: విపత్తు సమయాల్లో బాధితులను త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు తరలించేందు కోసం ఆదిలాబాద్ ఫైర్స్టేషన్కు ఒక బస్సు, ట్రక్ మంజూరైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్కుమార్ శనివారం వాటిని ప్రారంభించారు. పని తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తు సమయంలో సామగ్రితో పాటు ఇతర వస్తువులను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఫైర్ స్టేషన్లకు వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శని వారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ హోమం, యజ్ఞం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులో కాటిపెల్లి వసంత్ రెడ్డి, పిడుగు సంజీవరెడ్డి, వెంకటేశ్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
కైలాస్నగర్: ఈనెల 27న నిర్వహించనున్న నిజా మాబాద్–కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై పీవోలు, ఏపీవోలకు జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన చేపట్టే ఓటింగ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవహరించాలన్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వర కు పోలింగ్ ఉంటుందన్నారు. నిర్దేశిత సమ యం లోపు కేంద్రం పరిధిలో క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26న ఉదయం 8గంట లకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్లిస్ట్లో పొందుపర్చిన మెటీరియ ల్ ఉందా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం బృందంతో కలిసి యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళా శాల ప్రవేశాల ప్రచార పోస్టర్ను కలెక్టర్ తన కార్యాలయ చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలకు శిక్షణ -
● కంది పంట దిగుబడి అమ్మేందుకు వెనుకంజ ● కొనుగోళ్లు మొదలై పది రోజులైనా.. నామమాత్రంగానే విక్రయాలు ● పరిమితి పెంపు, ధర హెచ్చుపై రైతుల ఆశలు
సాక్షి,ఆదిలాబాద్: ఇది జిల్లాలో కంది రైతుల పరి స్థితి. ఈ పంట దిగుబడులు చేతికొచ్చి రోజులు గ డుస్తున్నాయి. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించి పది రోజులవుతుంది. అయితే రైతులు మాత్రం కంది పంట దిగుబడులను మార్కెట్కు తీసుకొచ్చేది లేదు.. అమ్మేది లేదన్నట్టుగా తమ ఇంట్లో, లేనిపక్షంలో చేనులోనే నిల్వ చేసేశారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఎకరానికి కేవలం 3.31 క్వింటాళ్ల చొప్పున రైతు నుంచి పంట దిగుబడి కొనుగోలు చేస్తామని పరిమితి విధించింది. గతేడాది కందులకు మార్కె ట్లో మద్దతు ధర మించి మంచి ధర లభించింది. కొనుగో ళ్లు ప్రారంభం కాకముందు మార్కెట్లో కందులు క్వింటా లుకు రూ.8వేల నుంచి రూ.8,500 వరకు ధర లభించగా, సీజన్ మొదలు కాగానే ఈ ధర అమాంతం తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.7,200 వరకు మాత్రమే లభిస్తుంది. దీంతో కంది రైతులు ఇటు పరిమితి పెంపు కోసం నిరీక్షిస్తూనే మరోపక్క మార్కెట్లో కందులకు ధర పెరుగుతుందని ఆశతో దిగుబడులను ఇళ్లలోనే నిల్వ చేసేశారు. ఇదీ పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నాఫెడ్కు అనుబంధంగా మార్క్ఫెడ్ రాష్ట్రంలో కందులను కొనుగోలు చే స్తుంది. జిల్లాలో పది రోజుల క్రితం కొనుగోళ్లు ప్రా రంభించింది. అయితే ఇప్పటివరకు మార్కెట్లో నా మమాత్రంగానే రైతులు కందులను విక్రయించారు. ఇదిలా ఉంటే ఒక్కో రైతు నుంచి రోజుకు 40 క్వింటాళ్ల వరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అయి తే ఎకరానికి పరిమితి నిబంధన కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆదిలా బాద్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ శాఖమంత్రి తు మ్మల నాగేశ్వర్రావును ఫోన్లో సంప్రదించి ఎకరా నికి 8క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరా రు. త్వరలోనే ఈ పరిమితి పెంచుతామని మంత్రి భరోసానిచ్చారు. ఈనేపథ్యంలో ఆ పెంపు ఎప్పుడు జరుగుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ‘సాక్షి’ ఎఫెక్ట్.. జిల్లాలో పది రోజుల క్రితం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొదట నాలుగు కొనుగోలు కేంద్రాలు ఆదిలా బాద్, జైనథ్, ఇంద్రవెల్లి, బోథ్లో ఏర్పాటు చేసి కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే గతేడాది ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి సగానికి తగ్గించారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము మరో చోటికి వెళ్లి పంటను అమ్ముకోవడం ద్వారా దూరభారం, రవాణా ఖర్చు పెరుగుతుందని వారిలో ఆందోళన కనిపించింది. తిరిగి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ డిమాండ్కు తలొగ్గిన మార్క్ఫెడ్ గతేడాది మాదిరిగానే తిరిగి బేల, తాంసి, నార్నూర్, ఇచ్చోడ సెంటర్లను పునరుద్ధరించి కొనుగోళ్లను ప్రారంభించారు. ‘సాక్షి’ చొరవను అభినందిస్తూ పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో..కంది సాగు విస్తీర్ణం 57,258 ఎకరాలు సాగు చేసిన రైతులు 68,581దిగుబడి అంచనా 3,43,549 క్వింటాళ్లు మార్క్ఫెడ్ కొనుగోలు లక్ష్యం 1,85,000 క్వింటాళ్లు ఇప్పటివరకు కొనుగోలు చేసింది 3వేల క్వింటాళ్లు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,550 (క్వింటాలుకు) ప్రైవేట్ ధర రూ.7,200 (క్వింటాలుకు)పరిమితి పెంపుపై ప్రతిపాదనలు పంపించాం..రైతుల నుంచి ఎకరా నికి 6 క్వింటాళ్ల కందుల దిగుబడులను కొనుగోలు చేసే విధంగా పరిమితి పెంచాలని ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ -
పన్ను వసూళ్లపై దృష్టి
● ఫోకస్ పెంచిన పంచాయతీ సిబ్బంది ● ఇప్పటి వరకు 58.39 శాతమే వసూలు ● శతశాతం దిశగా శ్రమిస్తున్న కార్యదర్శులుజిల్లాలో.. గ్రామ పంచాయతీలు 468 ఆస్తి పన్ను బకాయిలు రూ.58,51,923 ఇందులో వసూలైంది రూ.17,44,264 ఈ సంవత్సర పన్ను లక్ష్యం రూ.6,26,56,411 ఇప్పటివరకు వసూలైంది రూ.3,82,54,836 వసూలు చేయాల్సింది రూ.2,85,09,234కై లాస్నగర్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో, పంచాయతీ ల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. గ్రామాల్లో స మస్యలు పరిష్కరించుకోవాలంటే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఉదయం 8గంటలకే గ్రామాలకు చేరుకుంటున్నారు. సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం (బకాయిలతో కలిపి) రూ.6కోట్ల 85లక్షల8వేల334. ఇందులో ఇప్పటి వరకు వసూలైంది రూ.3కో ట్ల 99లక్షల 99వేల100. ఇది 58.39 శాతం మాత్ర మే. ఆర్థిక సంవత్సరం మరో 43 రోజుల్లో ముగియనుంది. గడువులోపు శతశాతం లక్ష్యసాధన కోసం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్వేల ప్రభావం.. గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్ల సర్వేల్లో బీజీబీజీగా గడిపారు. ఫలితంగా పన్నుల వ సూళ్లపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే 80 శాతా నికి పైగా వసూలు కావాల్సి ఉండగా కేవలం 58 శా తానికి పరిమితం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సర్వేల్లో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. 66 పంచాయతీల్లో వందశాతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 66 జీపీలు ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. వీటిలో అత్యధికంగా నార్నూర్ మండలంలో 12 జీపీలుండగా, ఆదిలా బాద్ రూరల్లో 10, భీంపూర్లో ఏడు, ఇచ్చోడలో ఆరు, ఇంద్రవెల్లిలో ఐదు, బజార్హత్నూర్, బేలలో నాలుగు చొప్పున, నేరడిగొండ, ఉట్నూర్, గాదిగూడల్లో మూడుచొప్పున, బోథ్, తలమడుగు, సిరికొండల్లో రెండు చొప్పున, తాంసిలో ఒకటి ఉన్నాయి. ఇక పన్ను వసూళ్లలో అత్యంత వెనుకబడిన పంచాయతీలను పరి శీలిస్తే.. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్లో సున్న శాతం ఉండగా, ఇచ్చోడ మండలం బొరిగా మలో 9శాతం, ఇంద్రవెల్లి మండలం హీరాపూర్, సిరికొండ మండలంలోని ఖానాపూర్ 11 శాతంతో వెనుకబడి ఉన్నాయి. -
సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు
కై లాస్నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 14తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో పంచాయ తీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగానే సొసైటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనను అమలు చే స్తారనే చర్చ సాగింది. అయితే తమ పదవీకా లం పొడిగించాలంటూ రాష్ట్రంలోని డీసీసీబీ చై ర్మన్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణలో కి తీసుకున్న ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గా ల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొ డిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్లకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు 77 సహకార సంఘాల చై ర్మన్లు, డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని సనాత న హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ప్ర మోద్ కుమార్ ఖత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో ని కార్గిల్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనికులు, సమితి ఆధ్వర్యంలో శుక్రవా రం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా ఉంటుందంటే సైనికుల త్యాగాలే కారణమన్నారు. ఉగ్రవాదుల ఉనికిని తుద ముట్టించినప్పుడే అమరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మా జీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, ఉత్సవ సమితి సభ్యులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్టౌన్: రంగారెడ్డిలోని ఎల్బీనగర్ కోర్టులో జడ్జిపై నిందితుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శు క్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నగేశ్ మా ట్లాడుతూ, న్యాయమూర్తిపై ట్రయల్ నిందితు డు దాడి చేయడం పోలీసుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు కోర్టులో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చ ర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యులు చందుసింగ్, అమరేందర్రెడ్డి, ప్రదీప్, సుధీర్, మహేందర్, రవీందర్, గంగారెడ్డి, దిలీప్దేశ్ముఖ్, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
● కలెక్టర్ రాజర్షి షా ● ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ కై లాస్నగర్: స్థానిక సంస్థలైన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఈసీ షెడ్యూల్కు అనుగుణంగా ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేసి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అంతకుముందు ఆర్వోలు, ఏఆర్వోల విధులు, పాటించాల్సిన నిబంధనలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో జి.జితేందర్రెడ్డి, డీఎల్పీవో ఫణిందర్రావు, మాస్టర్ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకుంటే చర్యలు
● రిమ్స్ డైరెక్టర్ను వివరణ కోరిన కలెక్టర్ ● ‘సాక్షి’ కథనంపై ఆరా..ఆదిలాబాద్టౌన్: రిమ్స్ వైద్యులు, సిబ్బంది సమ య పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఈనెల 13న ‘వీళ్లింతే.. మారరంతే..!’ ‘సాక్షి’లో శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. రిమ్స్ డైరెక్టర్ను వివరణ కోరారు. వైద్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ మే రకు రిమ్స్ డైరెక్టర్ ఆస్పత్రిలోని ప్రొఫెసర్లు, ఆయా విభాగాల హెచ్వోడీలు, అసోసియేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రిమ్స్కు వచ్చేది పేదలే అధికమని, జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆదివాసీ, గిరిజనులు ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఈ ఆర్థిక సంవత్సరంలో మండలాల వారీగా పన్నుల వసూళ్ల తీరు ఇలా..
మండలం పంచాయతీలు లక్ష్యం వసూలైంది వసూలు కావాల్సింది (రూ.లక్షల్లో)ఆదిలాబాద్రూరల్ 34 39,00,752 27,47,405 11,53,347 బజార్హత్నూర్ 30 31,24,169 22,13,678 9,10,491 బేల 37 43,61,373 32,40,931 11,20,442 భీంపూర్ 26 23,40,456 18,31,241 5,09,215 బోథ్ 33 76,96,465 46,15,491 30,80,974 గుడిహత్నూర్ 26 31,03,667 18,02,037 13,01,630 ఇచ్చోడ 32 56,51,388 38,64,119 17,87,269 జైనథ్ 42 41,96,433 27,09,594 14,86,839 మావల 03 9,36,005 6,08,506 3,27,499 నేరడిగొండ 32 41,24,531 25,15,680 16,08,851 సిరికొండ 19 18,81,664 10,79,090 8,02,574 తలమడుగు 28 31,94,463 17,13,528 14,80,935 తాంసి 13 28,57,117 16,96,202 11,60,915 గాదిగూడ 25 17,57,474 12,66,000 4,91,474 ఇంద్రవెల్లి 28 55,23,969 30,88,389 24,35,580 నార్నూర్ 23 29,11,741 17,17,011 11,94,730 ఉట్నూర్ 37 109,46,667 32,90,198 76,56,469 -
కష్టపడి చదవాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ శ్యామలాదే వి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందు కు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నా రు. ముందుగా విద్యార్థులు రక్తదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. అ నంతరం పూర్వ ప్రిన్సిపాళ్లు నారాయణరావు, సంతోష్ కుమార్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ రఘు, ఎన్సీసీ కేర్టేకర్ చంద్రకాంత్, ప్రోగ్రాం అధికారులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆక్రమణలా.. డయల్ చేయండి
● ఫిర్యాదుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ 94921 64153 ● భూ కబ్జాల కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ● సద్వినియోగం చేసుకోవాలంటున్న కలెక్టర్ కై లాస్నగర్: ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఎవరైనా కబ్జా చేశారా.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వాటిని విక్రయించేస్తున్నారా.. ఇలాంటి వాటిపై ఎ వరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇకపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు టోల్ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంను సైతం నియమించారు. కలెక్టర్ రాజర్షి షా ఆ దేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలపై సర్వత్రా హ ర్షం వ్యక్తమవుతుంది. అయితే భూ ఆక్రమణలకు ఇ ప్పటికై నా అడ్డుకట్ట పడుతుందా.. లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాత పరిస్థితే పునరావృతమవుతుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణంలో స్థిర నివాసం ఏ ర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. తదనుగుణంగా రియల్ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మంది అక్రమార్కులు అసైన్డ్, ఇ నాం, ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. పట్టణంతో పాటు బట్టిసావర్గాం, మావల గ్రామాల్లోని మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే చా లు అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమార్కులు పలువు రు అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు ధ్రువీ కరణపత్రాలు సృష్టిస్తున్నారు. వాటి ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతూ బోగస్ డాక్యుమెంట్స్తోనే రిజిస్ట్రేషన్లు చేసి అమాయకులకు విక్రయించేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న సర్వే నంబర్ 170, ఇందిరమ్మ కాలనీ, కేఆర్కే కాలనీ, బట్టిసావర్గాం, మావలల్లో ఈ దందా య థేచ్ఛగా సాగుతోంది. కొంతమంది మాజీ కౌన్సిలర్ల బంధువులు, దళారులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో లీనమవుతున్నారంటే ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలంటే... కలెక్టర్ ఆదేశాల మేరకు భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందు కోసం 94291 64153తో ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును ఇన్చార్జిగా నియమించారు. ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు టౌన్ప్లానింగ్ అధికారి, కమిషనర్కు చేరవేస్తారు. వారు వాటిపై విచారించి చర్యల నిమిత్తం టాస్క్ఫోర్స్ బృందానికి సమాచారమందిస్తారు. 12 మందితో టాస్క్ఫోర్స్ ప్రజా ఫిర్యాదుల ఆధారంగా సత్వర చర్యలు చేపట్టేందుకోసం మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల కు సంబంధించి 12మంది సభ్యులతో కూడిన ప్ర త్యేక టాస్క్ఫోర్స్టీం ఏర్పాటు చేశారు. ఈ టీంకు ప్రత్యేక వాహనం సైతం కేటాయించనున్నారు. టో ల్ ఫ్రీకి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మున్సి పల్ కమిషనర్, టీపీవో సూచనలకనుగుణంగా టా స్క్ఫోర్స్ టీం క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలిస్తుంది. విచారణ చేపట్టి ఆక్రమణలు నిజమని నిర్ధారణ అయితే వాటిపై సత్వరమే చర్యలు చేపడుతుంది. ఫిర్యాదులను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ డీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా ఇది ఎంతవరకు అమలుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఆక్రమణలను ఉపేక్షించబోం..భూ ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఆది లాబాద్ మున్సిపల్ పరి ధిలో వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధి కారులతో టాస్క్ఫోర్స్టీంను నియమించాం. అలాగే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజర్షి షా, కలెక్టర్ -
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కై లాస్నగర్: పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న 24 పాఠశాలలకు మంజూరైన నిధులను వసతుల కల్పన కోసం సత్వరమే వినియోగించాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, కిచెన్గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్ఈడీ లైటింగ్, తదితర పనులకు వినియోగించుకోవాలన్నారు. సమగ్ర శిక్ష, పీఎంశ్రీ ఫండ్స్పై విద్యాశాఖ కార్యదర్శి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు. -
ఎంపీ, ఎమ్మెల్యేలతోనే అప్రతిష్ట పాలు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలతోనే ఆదిలాబాద్ పత్తి మార్కెట్ అప్రతిష్ట పాలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే పత్తి కొనుగోళ్లలో రెండవ ప్రాధాన్యం ఉన్న ఆదిలాబాద్ మార్కెట్కు మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమన్నారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా, భారీగా అవినీతి జరగడం, మార్కెట్ సెక్రెటరీని సస్పెండ్ చేసే పరిస్థితికి కారణమేంటని ప్రశ్నించారు. కొనుగోళ్ల విషయంలో కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో కనీసం ఒక్క సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. గత పదేళ్లలో ఇంతకంటే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, మార్శెట్టి గోవర్ధన్, ధమ్మపాల్, కొండ గణేశ్, బట్టు సతీశ్, గంగయ్య, దాసరి రమేశ్, బుట్టి శివకుమార్, దేవిదాస్, అడప తిరుపతి, శ్రీనివాస్, ఉగ్గే విఠల్, కలీమ్, తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం రోజంతా ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. చలి ప్రభావం తగ్గుతుంది.
పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి నిజమైన ప్రేమ మనల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేయదు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల ఆశయాలను వమ్ముచేయొద్దు. వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. – మమత, డైట్ కళాశాల సూపరింటెండెంట్ నమ్మకం అనే పునాది పైన.. జీవితం అనేది నమ్మకం అనే పునాదిపై ఉంటుంది. ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే ఏ పెళ్లయినా సాఫీగా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. యుక్త వయస్సులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణే. దీనివల్ల భవిష్యత్ నాశనం అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – ఎం.ప్రజ్ఞవి సంస్కృతిని మరువొద్దు చాలా మంది మన సంస్కృతిని మర్చిపోయి పాశ్యాత్య సంస్కృతికి అలవాటుపడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది ప్రేమ. పెళ్లికి ముందు ఉండేది కాదు.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటే వారి జీవితం సాఫీగా ఉంటుంది. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. జీవితంలో ఓ స్థాయికి ఎదిగిన తర్వాతే ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా చేసుకోవడం మంచిది. – ప్రణిత, జిల్లా విద్యాశాఖాధికారి -
● జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమైనా.. పెళ్లయినా ● కుటుంబ సభ్యులను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచిదే ● యుక్త వయస్సులో ఆకర్షణకు గురికావొద్దు ● ఆన్లైన్ ప్రేమలోపడి మోసపోవద్దు ● నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా డైట్ ఛాత్రోపాధ్యాయులతో ‘సాక్షి’ డిబేట్
నేటి యువత ప్రేమ ముసుగులో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోంది. టీనేజ్లో చదువుపై శ్రద్ధపెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాల్సిన సమయంలో ఆకర్షణకు గురై పక్కదారి పడుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడుతున్నారు.. అయితే చాలా మంది ప్రేమ పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడలేక పోతున్నారు.. జీవితంలో స్థిరపడ్డాక పెద్దలు నిశ్చయించిన పెళ్లయినా.. ప్రేమ వివాహమైనా మంచిదని డైట్ ఛాత్రోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో డిబెట్ నిర్వహించింది. ఇందులో డైట్ ఛాత్రోపాధ్యాయులు ‘అరేంజ్ మ్యారేజ్.. లవ్ మ్యారేజ్’ గురించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరి జీవితాల్లో ప్రేమ ఆనందాన్ని నింపుతుండగా, మరికొందరి జీవితాల్లో విషాదం నెలకొంటోంది. ప్రేమించాలని వేధిస్తూ కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే జీవితంలో స్థిరపడ్డాకే ‘ప్రేమ’కు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని, పెద్దలు కుదిర్చిన పెళ్లి తర్వాతే జీవితం బాగుంటుందని చెబుతున్నారు. డిబేట్లో ఛాత్రోపాధ్యాయుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్టౌన్ -
అర్థం చేసుకుంటేనే ఆనందం
పెద్దలు కుదిర్చిందయినా ప్రేమ వివాహమైనా జీవి త భాగస్వామిని అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉండవచ్చు. లవ్ మ్యారేజ్లో పరస్పర ప్రేమ, ఆకర్షణ, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్లో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం అనే ల క్షణాలు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు. – రితిక్ చౌదరి లక్ష్యం నెరవేర్చాలి ఆర్థికంగా స్థిరపడ్డాక ప్రేమ పెళ్లయినా, పెద్దలు నిశ్చయించిన పెళ్లయిన చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ముందుగా కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చాలి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కలకాలం నిలిచి ఉంటున్నాయి. – ప్రియాంక, లెక్చరర్, డైట్ కళాశాల