Adilabad District Latest News
-
సీసీఐ పునరుద్ధరణపై ప్రకటన చేయించాలి
కై లాస్నగర్: జిల్లా అభివృద్ధిపై స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీసీఐ పునరుద్ధరణపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర పరి శ్రమలశాఖ మంత్రితో స్పష్టమైన ప్రకటన చేయించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశా రు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, అలాగే యంత్రాలను తుక్కు కింద విక్రయించే ఈ టెండర్ ప్రక్రియను వెనక్కి తీ సుకోవాలనే డిమాండ్తో సీసీఐ సాధనకమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలు చే పట్టారు. ఈ సందర్భంగా ఆయ న హాజరై దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణకు అన్ని విధాలా ప్రయత్నం చేశానన్నారు. ప్రస్తుత ఎంపీ నగేశ్తో కలిసి ఢిల్లీ వెళ్లి అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి అనంత్ గితేను ప లుమార్లు కలిసి విన్నవించానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీసీఐ అంశాన్ని ప్ర స్తావించాలని డిమాండ్ చేశారు. ఇందులో టీఎన్జీ వోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, సాధన కమిటీ సభ్యులు నారాయణ,ప్రభాకర్రెడ్డి,మల్లేశ్, దేవేందర్, పో శెట్టి, రామయ్య, ప్రేమల,మహేందర్ పాల్గొన్నారు. -
బుర్కి గ్రామాభివృద్ధికి కృషి
● కలెక్టర్ రాజర్షి షాఆదిలాబాద్రూరల్: మండలంలోని బుర్కి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. తొలుత అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని లబ్ధిదారులకు అందిస్తున్న పోషకాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులకు దుప్ప ట్లు, విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంకోలి నుంచి గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులు మార్చి చివరిలోగా పూర్తయ్యేలా చూడాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈని, అలాగే ఓపెన్ వెల్కు రిటర్నింగ్ వా ల్వ్ త్వరగా పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికా రులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సాయి మహేశ్, పీఆర్ ఏఈ సంతోష్, ఏవో నగేష్రెడ్డి, ఎంపీవో స్వప్నశీల, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గంగేశ్వర్, ఎంసీ సభ్యులు విజయ్బాబు, కోఆర్డినేటర్లు రూపేష్ రెడ్డి, కిషన్, కిరణ్ కుమార్రెడ్డి, తదితరులున్నారు. నాణ్యమైన వైద్యసేవలందించాలి ఆదిలాబాద్టౌన్: రిమ్స్కు వచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలందించేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా వైద్యులను ఆదేశించారు. పట్టణంలోని రిమ్స్లో బుధవారం సాయంత్రం వైద్యులు, ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే వారంతా పేదలేనని వారిని దృష్టిలో ఉంచుకుని సేవలు మెరుగుపరచాలన్నారు. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో అన్ని రకాల డెలివరీలు చేయాలన్నారు. రిఫరల్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్ఎంవోల బాధ్యతల నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్లు అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా..
● రాష్ట్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన ● సంక్షేమానికి పెద్దపీట అంటున్న కాంగ్రెస్ ● ఆరు గ్యారంటీల అమలేదంటున్న విపక్షాలు ● జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు మహిళ, శిశు సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేస్తున్నారు. తొలివిడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు కాగా జిల్లాకు దాదాపు 8000 ఇళ్లకు సంబంధించిన నిధులు మంజూరు కానున్నాయి. అలాగే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు ఉచిత ఐఐటీ, నీట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. శ్రీహస్తంశ్రీ పార్టీ నాయకులు ఇది అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన పద్దుగా కితాబు ఇచ్చుకుంటుండగా, ఆరు గ్యారెంటీల అమలు ఏదని బీఆర్ఎస్, బీజేపీలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలోని ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్ నిర్మాణంలో కమ్ముకున్న నీలినీడలు ఇకనైన తొలుగుతాయా చూడాల్సిందే. ప్రధానంగా భూసేకరణ వేగిరంగా జరగాల్సి ఉంది. అలాగే కుప్టి ప్రాజెక్టుకు స్వల్పంగా నిధులు కేటాయించారు. గత బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించినా ఆచరణలో మాత్రం విడుదల చేయలేదు. అలాగే సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్ల కోసం కూడా నిధుల కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రెండోసారి బడ్జెట్ను బుధవారం ప్రవేశపెట్టారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025–26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పద్దును చదివారు. శాఖల వారీగా కేటాయింపులను వివరించారు. ఆయా రంగాల్లో జిల్లాకు దక్కిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. రైతు సంక్షేమం కోసం.. రైతు భరోసా కోసం అన్నదాతకు ఏడాదికి ఎకరానికి రూ.12వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలోని లక్షకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్ యార్డుల్లో ఆధునిక వసతులు, నూతన సదుపాయాలకు నిధులు కేటాయించనున్నట్లు వివరించారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రత్యేక సబ్సిడీ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ పరంగా కేటాయించిన నిధులతో లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలు అందేందుకు అవకాశం ఉంది. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధుల్లో జిల్లాలోని పలు ప్రాజెక్టులకు కూడా దక్కనున్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూ ళ్లు రాష్ట్రంలో 58 చోట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. రానున్న రోజుల్లో ని యోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని నిర్మించనున్నట్లు వివరించారు. సంక్షేమ వసతిగృహాల్లో కామ న్డైట్ స్కీమ్ అమలుపర్చనున్నట్లు తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా రూపాంత రం చేయనుండగా, జిల్లాలోని ఐటీఐలు కూడా ఈ రకంగా మారనున్నాయి. రోడ్లు బాగుపడేనా.. రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే హైబ్రిడ్ మోడల్లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేట్ నుంచి నిధులు సేకరించి రోడ్ల నిర్మాణానికి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. పంచాయతీరాజ్ శాఖకు కేటాయింపులతో పీఆర్ పరిధిలోని రోడ్లకు కూడా మహర్దశ కలగనుంది. గతేడాది వర్షాకాలంలో కురిసిన అధిక వర్షాలతో జిల్లాలో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు నిధులు వెచ్చించనున్నారు. మహిళల సంక్షేమం కోసం..ప్రాజెక్ట్ నిధుల కేటాయింపు (రూ. కోట్లలో) లోయర్ పెన్గంగ (కొరటా–చనాఖ) 179 కుప్టి ప్రాజెక్ట్ 0.50 సాత్నాల ఆధునికీకరణకు.. 85 మత్తడివాగు 30 -
స్కూళ్లలో స్కౌట్ యూనిట్లు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని అన్ని యాజ మాన్యాలకు చెందిన పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చే పడతామని డీఈవో ప్రణిత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన శిబిరా నికి హాజరై మాట్లాడారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే స్కౌట్ ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్కౌట్ అండ్ గైడ్స్ కార్యాలయ క్యాంపు సైట్ ప్రహరీ నిర్మాణానికి కృషి చే స్తానని చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు వకుళాభరణం ఆదినాథ్, కాంచనవల్లి రత్నాకర్, కార్యదర్శి ఎన్.స్వామి, కోశాధికారి కన్నం మోహన్బా బు, సంయుక్త కార్యదర్శి లక్ష్మి, శిక్షణ కమిషనర్ నాగిరెడ్డి, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు దత్తు, లక్ష్మి, జీవిత తదితరులున్నారు. -
రిమ్స్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ వైద్యుల పోస్టుల నియామకానికి మంగళవారం డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇంటర్వ్యూ నిర్వహించగా 33 మంది హాజరయ్యారు. సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్ పోస్టుకు ఒకరు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్కు ఒక్కొక్కరు చొప్పున హాజరైనట్లు డైరెక్టర్ తెలిపారు. పీడియాట్రిక్ విభాగంలో ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు, ఆప్తాల్మిక్లో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు ట్యూటర్లు, అనస్తీషియాలో ఒకరు అసోసియేట్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీబీసీడీలో ఒక సీనియర్ రెసిడెంట్, రేడియాలజీ విభాగంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరైనట్లు పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెడికల్ గ్యాస్ట్రాలజీలో ఒకరు అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రాలజీలో నలుగురు, జనరల్ మెడిసిన్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హాజరైనట్లు వివరించారు. -
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కై లాస్నగర్: బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం, జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంచడాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాసేవ భవన్లో పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి మా ట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత జీవి తాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపా రు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టును సాధిస్తామని ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. ఇది జిల్లా అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. నాయకులు భూ పెల్లి శ్రీధర్, చరణ్గౌడ్, పవన్, శ్రీనివాస్, సతీశ్, నర్సింగ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చూడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రూ.18వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ ఐ, పింఛన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసి న వారికి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5లక్షలు చెల్లించాలని కోరారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుంటే ఉద్యమం ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, లత, ఆశ, అనిత తదితరులున్నారు. -
కలెక్టర్కు స్కోచ్ పురస్కారం
కై లాస్నగర్: క లెక్టర్ రాజర్షి షాకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలోని లోధి రోడ్లో గల ఇండియా హ్యబిటేట్ సెంటర్లో కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. బాలల ది నోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గతేడాది నవంబర్ 14న ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం ప్రార్థన సమయంలో ఆరోగ్య సంరక్షణకు అనుసారించాల్సిన విధానాలపై ఉపాధ్యాయులు, వైద్యు ల ద్వారా వారికి అవగాహన కల్పించారు. ప్రతీ వారం మండలానికి రెండు పాఠశాలల చొప్పు న గైడ్ టీచర్లు, స్టూడెంట్ లీడర్లతో కలెక్టరేట్లో సమీక్షించి వారంలో పాఠశాలలో జరిగిన మా ర్పులను తెలుసుకుని మరింత పకడ్బందీగా అమలు చేసేలా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ నిర్వహణతో విద్యార్థుల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలో మార్పులు వచ్చాయి. కలెక్టర్కు ఈ అవార్డు రావడంపై పలువురు అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ‘సీఎం ప్రజావాణి’ అమలుపై సమీక్షకై లాస్నగర్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ తీరుపై కలెక్టర్ రాజర్షి మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఫిర్యాదుల పరి ష్కార అధికారులు, ఐఎఫ్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో శిక్షణ, సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా అందిన దరఖాస్తులు.. వాటి డా టా ఎంట్రీ, పరిష్కారానికి చేపట్టిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. పైలెట్ ప్ర జావాణిలో అందిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెనీ కలెక్టర్ అభిగ్యాన్, జెడ్పీ సీఈవో జి తేందర్రెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్, తహసీ ల్దార్లు, ఉపాఽధిహామీ ఏపీవోలు పాల్గొన్నారు. -
● నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ‘భట్టి’ ● గతేడాది కేటాయింపులు అంతంతే ● ఈ బడ్జెట్పైనే జిల్లావాసుల ఆశలు ● ప్రతిపాదనలు పంపిన ఎమ్మెల్యేలు ● జిల్లాపై వరాల జల్లు కురిపించేనా?
పొలాలకు రోడ్లు వేయాలి వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించి ప్రతిపాదనలూ అందజేశాం. బీటీ రోడ్లకు మరమ్మతు చేయాలి. వానాకాలం కంటే ముందే లోతట్టు ప్రాంతాల వద్ద బ్రిడ్జీలు నిర్మించాలి. కొరాట–చనాకాకు నిధులు విడుదల చేసి ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి. సాత్నాల ఆయకట్టు కెనాల్ లైనింగ్ పనులు చేపట్టాలి. ఇందుకు నిధులు కేటాయించాలి. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే బడుల్లో వసతులు కల్పించాలి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు లేక పలు పాఠశాలల్లో కింద పడుకుంటున్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలి. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ సర్కారు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ పద్దు చదవనున్నారు. బడ్జెట్లో జిల్లాకు ఒనగూరే చర్యలు ఏవైన ఉంటాయా.. అని జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. గతేడాది బడ్జెట్లో నామమాత్రంగా జిల్లాకు కేటాయింపులు జరిగినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నేటి బడ్జెట్లో జిల్లాకు స్వాంతన లభించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేయూత ఉంటుందో.. లేదో చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్ట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటికి నిధులు కేటాయిస్తారా.. అనేది చూడాల్సిందే. కొన్ని ప్రాజెక్ట్లు అసంపూర్తిగా ఉండగా, మరికొన్ని ప్రారంభించాల్సి ఉంది. రహదారులు, బ్రిడ్జీల నిర్మాణంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాల్సిందే. వీటిపై ముందడుగు పడేనా?● తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరట గ్రామం వద్ద సరిహద్దు మహారాష్ట్రలోని చనాక మధ్యలో పెన్గంగా నదిపై ఇదివరకే బ్యారేజ్ నిర్మించారు. దీనికి సంబంధించి పంప్హౌస్, ఎల్పీపీ కెనాల్ పనులు కూడా పూర్తయ్యాయి. నీటి ఎత్తిపోతలకు సంబంధించి ప్ర యోగాత్మకంగా డ్రైరన్, వెట్రన్ కూడా నిర్వహించారు. ఇక ప్రధాన కెనాల్ నుంచి కాలువలు, ఉప కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి భూసేకరణతో పాటు నిర్మాణానికి సంబంధించి మరో రూ.250 కోట్లు అవసరమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఎల్పీపీ కాలువ ద్వారా 37,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. పిప్పల్కోటి రిజర్వాయర్ ని ర్మాణం కోసం మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీని నుంచి కొరాట–చనాకా కెనాల్ నిర్మించాల్సి ఉంది. తద్వారా లక్ష్యంలోని 13,500 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించేందుకు దోహదపడుతుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్పై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నా యి. ప్రభుత్వం దీనికి నిధులు కేటాయిస్తుందా.. లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ● నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. 2018లో రూ.794 కోట్ల వ్యయంతో నిర్మించాలని అంచనా వేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పలుసార్లు ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అంచనా వ్యయాన్ని అధికారులు సవరిస్తూ వచ్చారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,323 కోట్లకు చేరింది. త్వరలో నూతన ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఈ అంచనా వ్యయం మరింత పెరగనుంది. 5.30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించనుండగా, కడెం ప్రాజెక్ట్ కింద స్థిరీకరణకు నోచుకోని 25,267 ఎకరాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో దీనిని నిర్మించతలపె ట్టారు. అయితే ఇప్పటివరకు ఒక్క అడుగు కూ డా ముందుకు పడలేదు. అంతే కాకుండా ఇక్కడ నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రానున్న రోజుల్లో బోథ్ నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చనే ఆలోచన ఉంది. అలాగే కుంటాల జలపాతానికి ఏడాది పొడవునా నీటి కళ ఉండేలా ప్రణాళిక చేశారు. ● జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మధ్యలో ఈ పనులు వివిధ కారణాలతో ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ ప్రాజెక్ట్కు రూ.27 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వాటికి సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులుంటాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలుబడ్జెట్కు ముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అందజేశారు. వాటికి బడ్జెట్లో మోక్షం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, బోథ్, ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో కేటాయింపులపై సంబంధిత ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతేకాకుండా స్వల్పంగా నిధులు కేటాయించినా అవి కూడా విడుదల చేయకపోవడంతో వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది. -
తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్షకై లాస్నగర్: జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, భూగర్భ జలాల పెరుగుదలకు చేపట్టా ల్సిన చర్యలపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. పంపుహౌస్, బోర్వెల్స్, బావులు, మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతు చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలు, మున్సి పాలిటీల్లో నీటి సమస్యను గుర్తించి వెంటనే నివేదిక అందించాలని తెలిపారు. ఆదిలాబాద్ రూరల్, ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నూర్ మండలాల్లోని సమస్యాత్మక హ్యాబిటేషన్లలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధిహామీ కింద ప్రతీ గ్రామీణ పేద కుటుంబానికి 100 రోజుల పని కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఉదయం 6నుంచి 11గంటలలోపే పనులు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడకుండా పని ప్రదేశంలో కూలీలు గంటకోసారి నీరు తాగేలా చూడాలని సూచించారు. వేసవికాలం ముగిసే దాకా కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎల్పీవో ఫణీందర్రా వు, గ్రౌండ్ వాటర్ ఏడీ శ్రీవల్లి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈలు, ఈసీలు పాల్గొన్నారు. -
గుక్కెడు నీటికి అరిగోస
● మూడు గూడేలకు ఒకే చేతిపంపు ● సరఫరా కాని మిషన్ భగీరథ నీరు ● అధికారులకు పట్టని నీటి సమస్య ● గిరిజన బిడ్డలకు తప్పని నీళ్ల గోస నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా తాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. దీంతో బిందెడు నీటి కోసం ఇప్పటికీ ఆదివాసీలు కాలినడకన కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. నీటి సమస్య ఉన్న గ్రామాల యువకులకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదని ఆయా గ్రామాల గిరిజనులు ఆందోళన్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులకు సమస్య తెలిపినా పరిష్కరించడంలేదని ఆ రోపిస్తున్నారు. ఓట్లప్పుడే హామీలు ఇస్తూ ఆ తర్వాత కనిపించడంలేదని వాపోతున్నారు. 40 ఏళ్లుగా నీటి కోసం అరిగోస పడుతున్నామని, ఇంకెన్నాళ్లు ఈ బాధలు పడాలని ప్రశ్నిస్తున్నారు. నార్నూ ర్ మండలం సుంగాపూర్ పంచాయతీ పరిధిలో మూడు అనుబంధ గ్రామాలైన లంబాడీతండా, కొలాంగూడ, గొండుగూడకు తాగునీటి సమస్య తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం వెళ్లింది. ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. గొండుగూడవాసుల గోస తీరేనా? సుంగాపూర్ పంచాయతీ పరిధిలో 250 కుటుంబాలుండగా 1,500 మంది జనాభా ఉన్నారు. గొండుగూడలో 100 కుటుంబాలుండగా 400 జనాభా ఉంది. గొండుగూడలో గతేడాది ఐటీడీఏ ద్వారా బో రు వేసినా నీళ్లు అడుగంటాయి. మిషన్ భగీరథ నీ రు సరఫరా అంతంతే. దీంతో బిందెడు నీటి కోసం ఉదయం 4గంటలకే చిన్నాపెద్దా లేచి రెండు కిలో మీటర్ల దూరం నడిచి చేతిపంపు, బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కొందరు నీటి కోసం ఎడ్లబండిని వినియోగిస్తున్నారు. వేసవిలో వీరి బా ధలు నిత్యకృత్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. కొలాంగూడ కష్టాలు గట్టెక్కేనా? కొలాంగూడలో 70 కొలాం గిరిజన కుటుంబాలు ని వాసముంటున్నాయి. పీటీజీల సంక్షేమానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు తీ సుకోవాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వారికి శా పంగా మారుతోంది. మిషన్ భగీరథ నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా గ్రామంలోని ఏకైక చేతిపంపు నీటితోనే మూడు గూడేల ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. లంబాడీతండా.. సమస్యల అడ్డా లంబాడీ తండాలో 100 గిరిజన కుటుంబాలుండగా, 400కు పైగా జనాభా ఉంది. గ్రామంలో మిష న్ భగీరథ నీళ్ల ట్యాంకున్నా ఉపయోగం లేదు. చేతి లో బిందెలు పట్టుకుని కొలాంగూడకు లేదా సమీ పంలోని బావి వద్దకు వెళ్లాల్సిన దుస్థితి. గ్రామంలో ఎలాంటి నీటి సౌకర్యం లేదు. వేసవి ప్రారంభంలోనే గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. పరిష్కారం చూపుతాం సుంగాపూర్లో నీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. సమస్యను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రతిపాదనలు కూడా పంపించాం. నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నం. త్వరలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. – రోడ్డ శ్రీనివాస్, డీఈఈ, ఉట్నూర్ -
నిధులు కేటాయించాలి
ఆదిలాబాద్టౌన్: పార్లమెంట్ సమావేశాల్లో సీసీఐ పునఃప్రారంభానికి నిధులు కేటా యించాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐ పునఃప్రారంభానికి ప్రయత్నించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీ నిపై కలెక్టరేట్ ఎదటు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కమిటీ కోకన్వీ నర్లు విజ్జగిరి నారాయణ, వెంకట్ నారాయణ, లంక రాఘవులు, అరుణ్కుమార్, లోకా రి పోశెట్టి, జగన్సింగ్, ఈశ్వరిదాస్, ఆర్.రమేశ్, అగ్గిమల్ల గణేశ్ తదితరులున్నారు. -
కుష్ఠు నివారణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: కుష్ఠును ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే అంగవైకల్యం రాదని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ పీహెచ్సీ పరిధిలో సోమవారం కుష్ఠు గుర్తింపు సర్వే ప్రారంభించారు. ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కుష్ఠు పోస్టర్లు, అవగాహన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి 15 రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజ లు సహకరించాలని కోరారు. సర్వే నిమిత్తం జిల్లాలోని 22 పీహెచ్సీ, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1002 బృందాలను ఏర్పాటు చేశామని, వీరిని పర్యవేక్షించడానికి 200 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి గజానన్, అర్బన్ పీహెచ్సీ వైద్యులు వినోద్, డీపీఎంవో వామన్రావు తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు నివారణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: కుష్ఠును ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే అంగవైకల్యం రాదని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ పీహెచ్సీ పరిధిలో సోమవారం కుష్ఠు గుర్తింపు సర్వే ప్రారంభించారు. ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కుష్ఠు పోస్టర్లు, అవగాహన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి 15 రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజ లు సహకరించాలని కోరారు. సర్వే నిమిత్తం జిల్లాలోని 22 పీహెచ్సీ, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1002 బృందాలను ఏర్పాటు చేశామని, వీరిని పర్యవేక్షించడానికి 200 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి గజానన్, అర్బన్ పీహెచ్సీ వైద్యులు వినోద్, డీపీఎంవో వామన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో అభ్యసన సామర్థ్యాల పెంపు
● కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్టౌన్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడనున్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని పిప్పర్వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యాబోధన కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ కార్నర్ను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు విజయోత్సవ లేఖలతో పాటు హాల్టికెట్లు అందజేసి ఆల్ది బెస్ట్ చెప్పారు. ఇందులో డీఈవో ప్రణీత, హెచ్ఎం శశికళ, నవనీత, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణు, ఎంఈవో శ్రీనివాస్, ప్రఽశాంత్ రెడ్డి, సంతోష్రెడ్డి, యువనేస్తం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జైనథ్ మార్కెట్లో గందరగోళం
ఆదిలాబాద్టౌన్(జైనథ్): జైనథ్ వ్యవసాయ మా ర్కెట్ యార్డులో సోమవారం గందరగోళం నెలకొంది. హమాలీలు, మార్కెట్ కార్యదర్శి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగడంతో శనగ కొనుగోళ్లు నిలి చిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొ చ్చారు. యార్డులో ఉదయం 10గంటలకు ప్రా రంభం కావాల్సిన కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు ఎండలోనే బారులు తీరాల్సిన పరి స్థితి. మార్కెట్ అధికారుల అలసత్వం కారణంగా ఈ వ్యవహారం రచ్చకెక్కింది. పాతవారితో తూ కం సాఫీగా సాగుతున్నా కొత్త వారిని రంగంలోకి దింపడంపై ఆగ్రహం వ్యక్తమైంది. గొడవ ఇలా.. బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు కొన్నేళ్లుగా హమాలీలుగా పనిచేస్తున్నారు. వీరిని గుత్తేదారు మనోజ్ తీసుకొచ్చి ఏటా సోయా, కందులు, శన గ పంట లోడింగ్, అన్లోడింగ్, తూకం చేయించ డం వంటి పనులు చేయిస్తున్నాడు. అయితే జైన థ్ మండలంలోని ఓ పార్టీకి చెందిన నాయకుడు లేబర్ లైసెన్స్ తీసుకుని కూలీలను సోమవారం యార్డుకు తీసుకువచ్చాడు. దీంతో బిహార్కు చెందిన హమాలీలు, కొత్త గుత్తేదారు మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. 15ఏళ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని వాహనాల నుంచి లోడింగ్, ఆన్లోడింగ్ చేస్తున్నామని బిహార్కు చెందిన గుత్తేదారు పేర్కొన్నాడు. తమ పొట్టకొట్టి కొత్త వారిని ఎలా తీసుకుంటా రని ప్రశ్నించాడు. ప్రస్తుత హమాలీలకు ముఖ ద్దాంగా ఉన్న తాను కొన్నేళ్లుగా కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్లు పేర్కొన్నాడు. మా ర్కెట్ కమిటీ చైర్మన్, కార్యదర్శి తనను డబ్బులు డిమాండ్ చేశారని తెలిపాడు. ఇటీవల చేపట్టిన సోయా, కందుల కొనుగోళ్ల సమయంలో మా హమాలీలు కొనసాగాలంటే రూ.4లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని అన్నాడు. తాను అంతగా ఇవ్వలేనని రూ.1.50 లక్షలు ఇస్తానని చె ప్పాడు. ఈక్రమంలో చైర్మన్ కుమారుడికి ఆన్లైన్ ద్వారా రూ.1.20 లక్షలు, అలాగే మరో రూ.30 వేలు నగదు అందించినట్లు పేర్కొన్నాడు.మిగతా డబ్బుల కోసమే తనను తొలగించేందుకు కుట్ర పన్నారని వాపోయాడు. మార్కెట్ కార్యదర్శి సై తం తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆరో పించాడు. కాగా శనగలు విక్రయించేందుకు వచ్చి న రైతులు పాత గుత్తేదారు, హమాలీలతోనే తాము తూకం చేయించుకుంటామని వారికి మ ద్దతుగా నిలిచారు. కొత్త ముఖద్దాం తెచ్చిన హ మాలీలతో తమ శనగలను తూకం వేయించమని భీష్మించారు. కాగా కొత్త ముఖద్దాం తాను మండలానికి చెందిన వ్యక్తి అని బిహార్కు చెందిన ము ఖద్దాంకు కాకుండా తాను తెచ్చిన కూలీలతోనే తూకం వేయించాలని పేర్కొన్నాడు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత మార్క్ఫెడ్, నాఫెడ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై మార్కెట్ కార్యదర్శి దేవన్నను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్లో యత్నించగా స్పందించలేదు. తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా బిహార్ రాష్ట్రానికి చెందిన గుత్తేదారు సక్రమంగా పనులు చేపట్టడం లేదని, ఇదివరకే ఆయనను చెప్పామన్నారు. తాను డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదని స్ప ష్టం చేశాడు. మార్కెట్ కమిటీ తీర్మానం చేసి ఆ గుత్తేదారుడిని తొలగిస్తామని పేర్కొన్నాడు. మధ్యాహ్నం వరకు నిలిచిన శనగ కొనుగోళ్లు ఆందోళనకు దిగిన హమాలీలు పాత వారి తొలగింపుపై ఆగ్రహం మార్కెట్ చైర్మన్ రూ.4లక్షలు డిమాండ్ చేశారని గుత్తేదారు ఆరోపణ పాత హమాలీలకే రైతుల మద్దతు -
అంగన్వాడీల ఆందోళన
కై లాస్నగర్: ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకం, మోబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చే యాలనే డిమాండ్తో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట 48గంటల మహాధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీలు, ఆయాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం అమలైతే అంగన్వాడీ కేంద్రాల మనుగడే ఉండదన్నారు. ఈ చ ట్టా న్ని నిలిపివేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి అక్కడే వంటావార్పు నిర్వహించిన అంగన్వాడీలు నిరసన శిబిరంలోనే నిద్రించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీ త, జయలక్ష్మి, మంగ, వెంకటమ్మ, పాల్గొన్నారు. -
‘హస్తం’లో గ్రేడ్లు!
● కాంగ్రెస్లో పాత, కొత్త నాయకుల గుర్తింపు ● ఏ,బీ,సీ గ్రేడ్లుగా విభజన ● పార్టీలో మారుతున్న సమీకరణాలు ● స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలో హాట్టాపిక్ సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్లో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలో పాత, కొత్త నాయకుల పరంగా గ్రేడ్లు చేపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గాంధీభవన్లో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత అనే సంకేతాలు ఇచ్చేలా ప్రక్రియ నడుస్తున్నట్లు సమాచారం. మొత్తంగా త్వరలో జిల్లా పరంగా ప్రత్యేక కమిటీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ను అధిష్టానం నియమించిన తర్వాత అనేక సంచనాలకు కేంద్ర బిందువవుతున్నారు. ప్రధానంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, మధ్యలో వచ్చిన వారికి ఇది మింగుడుపడని వ్యవహారంలా మారింది. దీంతో ఏం జరుగుతుందో చూద్దామనే భావనలో వారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ప్రధానంగా క్షేత్రస్థాయిలో పాత , కొత్త నాయకులకు టికెట్ల విషయంలో ఇప్పటికే వివాదం నెలకొంది. ఈ గ్రేడ్ల విభజన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గ్రేడ్లుగా విభజన.. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని ‘ఏ గ్రేడ్గా, ఎన్నికల ముందు వచ్చిన వారిని ‘బి’ గ్రేడ్గా, అధికారంలోకి వచ్చాక వచ్చిన వారిని ‘సి’ గ్రేడ్లో చేర్చనున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ పార్లమెంట్కు సంబంధించి సమావేశం గాంధీభవన్లో నిర్వహించగా వాడీవేడిగా సాగినట్లు ఆ రోజు నుంచి నాయకులు, కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఏ విషయాన్నైనా దాగుడుమూతలు లేకుండా సమావేశంలో స్పష్టంగా చెప్పాలని సూచించడం నాయకులకు ధైర్యాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశంలో అనేక అంశాల పరంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఇవే కారణాలంటూ పలువురు నాయకులు ఆమె ఎదుట ఓపెన్గా పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఆమె ఏకంగా నియోజకవర్గం వారీగా కమిటీలను నియమిస్తూ, జిల్లాకు మరో ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొనడం సంచలనం కలిగించింది. మొత్తంగా త్వరలో జిల్లాలో పర్యటించే ఆ కమిటీలో పలు విధాన పరమైన నిర్ణయాలు అమలులోకి వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. -
● మోడల్ ఇళ్లకే పరిమితమైన ఇందిరమ్మ నిర్మాణాలు ● తొమ్మిది మండలాల్లో ఇంకా ముగ్గుపోయని వైనం ● అధికారుల కొరతతో నెమ్మదిగా ప్రక్రియ
తలమడుగు మండలం లక్ష్మిపూర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోస్తున్న హౌసింగ్ ఏఈ తలమడుగు మండలం లక్ష్మీపూర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోస్తున్న హౌసింగ్ ఏఈ కై లాస్నగర్: ఇంటిస్థలం కలిగిన నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు ఆరంభంలోనే జాప్యం జాప్యమవుతున్నా యి. పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేశారు. జనవరి 26న అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి మంజూరు పత్రాలు అందజేశారు. రెండు నెలలవుతున్నా ఇప్పటికీ పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోయడం (మార్కవుట్) షురూ చేయలేదు. కొన్నిచోట్ల ముగ్గు పోసినా పునాదులు తవ్వుకున్నారే తప్ప నిర్మాణాలు ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు కేవలం మోడల్ ఇళ్లకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిర్మాణాలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన హౌసింగ్శాఖకు అధికారులు లేకపోవడం గమనార్హం. ఐటీడీఏ, పీఆర్ శాఖలకు బాధ్యతలు అప్పగించినా వారు వాటిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థతి నెలకొంది. ఆరంభంలోనే ఇలా ఉంటే నిర్మాణాలు ఏ విధంగా పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 216 చోట్ల మాత్రమే ముగ్గు.. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఒక్కో గ్రామంలో తొలుత ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు చేపట్టాలని సంకల్పించారు. ఆదిలాబా ద్ మున్సిపాలిటీ మినహా 17 మండలాల్లోని 17 గ్రా మాల్లో అర్హులైన వారిని గుర్తించారు. వాటి పరిధిలో 2,148 మందికి ఇళ్లను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా నిర్మాణాల్లో మాత్రం వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఎనిమిది గ్రామాల్లో 216 ఇళ్లకు మాత్రమే ముగ్గు పోశారు. ఇందులో కొన్ని చోట్ల పునాదులు తవ్వుకున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగని పరిస్థితి. మరో తొమ్మిది గ్రామాల్లో ఇప్పటి వరకు ముగ్గు సైతం పోయకపోవడం గమనార్హం. కొరవడిన పర్యవేక్షణ ముగ్గు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు హౌసింగ్శాఖలో లేరు. ఆ శాఖలో పీడీ, డీఈతో పాటు కేవలం ఒకే ఒక ఏఈ మాత్రమే ఉన్నారు. దీంతో 17 మండలా ల్లోని ఇళ్లను పర్యవేక్షించడం వీరికి కత్తిమీద సాములా మారింది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖకు ఆరు మండలాలు, ఐటీడీఏకు నాలుగు మండలాల బాధ్యతలు అప్పగించగా హౌసింగ్లోని ఆ ముగ్గురు అధికారులు ఏడు మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం లేకపోవడం, పీఆర్, ఐటీడీఏ అధికారులు ఇందిరమ్మ ఇళ్లను ప ట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే నిర్మాణాలు ఊపందుకుంటే పరిస్థితి ఏంటనే అభిప్రా యం సర్వత్రా వ్యక్తమవుతుంది. స్థలం నిబంధనల సడలింపు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం, పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవాటిగా చూపి బిల్లులు లేపుకో వడం, ఉపాధి నిధులు కావడంతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్పెట్టాలని భావించిన ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. సర్వే సమయంలో చూపిన స్థలంలోనే ఇళ్లను నిర్మించుకునేలా దానికి జియో పెన్సింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆన్లైన్ విధానంలో యాప్లో లబ్ధిదారు వివరాలు, ఇంటి స్థలం వంటి సమాచారం నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో పలుచోట్ల నెట్వర్క్ లేకపోవడం, సర్వర్ సమ స్య తలెత్తడం వంటి కారణాలతో ఆవివరాలు నమో దు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో నిర్మాణ స్థలంలో మార్కవుట్ ఇచ్చేందుకు సమ స్య తలెత్తింది. దీన్ని గమనించిన అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థలం క్యాప్చర్ నిబంధనలో సడలింపునిచ్చింది. సర్వే సమయంలో చూపిన స్థలమే కాకుండా లబ్ధి దారు తమకు నచ్చిన చోట ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో మార్కవుట్ను గౌండ్రింగ్ చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు మండలం గ్రామం మంజూరైన మార్కవుట్ ఇళ్లు ఇచ్చినవి ఆదిలాబాద్రూరల్ పిప్పల్దరి 145 00 బజార్హత్నూర్ అందుగూడ 134 20 బేల డోప్టాల 83 20 భీంపూర్ బెల్సారిరాంపూర్ 133 57 బోథ్ కుచులాపూర్ 232 35 గాదిగూడ సావిరి 117 00 గుడిహత్నూర్ వైజాపూర్ 149 00 ఇచ్చోడ నవేగావ్ 118 00 ఇంద్రవెల్లి గట్టేపల్లి 126 00 జైనథ్ పిప్పర్వాడ 101 23 మావల వాగాపూర్ 152 45 నార్నూర్ బాబేఝరి 160 00 నేరడిగొండ వాంకిడి 53 00 సిరికొండ రిమ్మ 153 00 తలమడుగు లక్ష్మిపూర్ 69 10 తాంసి హస్నాపూర్ 67 06 ఉట్నూర్ మత్తడిగూడ 156 00వేగవంతమయ్యేలా చర్యలు స్థలం క్యాప్చర్లో జియోపెన్సింగ్ నిబంధన ఉండటంతో నెట్వర్క్ లేకపోవడం, సర్వర్ సమస్యతో యాప్లో వివరాల నమోదుకు అంతరాయం ఏర్పడేది. దీంతో ఇళ్ల నిర్మాణాల మార్కవుట్లో ఆలస్యమైంది. ప్రభుత్వం తాజాగా ఆ నిబంధనలు సడలించడంతో పాటు పీఆర్, ఐటీడీఏ అధికారులకు కూడా కొన్ని మండలాల బాధ్యతలు అప్పగించాం. దీంతో మార్కవుట్ను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేసి పనులు వేగంగా సాగేలా దృష్టి సారిస్తాం. – నసీర్, హౌసింగ్ ఏఈ -
ప్రపంచ వినియోగదారుల దినోత్సవానికి సంతోష్కుమార్
ఆదిలాబాద్: హైదరాబాద్లోని బిర్లా ప్లాని టోరియంలో ఆదివారం నిర్వహించిన ప్ర పంచ వినియోగదారుల దినోత్సవానికి జి ల్లా నుంచి రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, క్యాట్కో సంస్థలు సంయుక్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్స వం నిర్వహించాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు మీనా రామనాథం హాజరైనట్లు తెలిపారు. అలాగే జిల్లా నుంచి శేఖర్, నిర్మల్ జిల్లా నుంచి కూన గంగాధర్ హాజరైనట్లు పేర్కొన్నారు. -
సర్కారు బడుల్లో ‘ఏఐ’
● విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం ● 3,4,5 తరగతుల వారికి ప్రత్యేక బోధన ● జిల్లాలో 8 పాఠశాలలు ఎంపిక ● ఇదివరకే నాలుగు చోట్ల ప్రారంభం ● నేడు మరో నాలుగు బడుల్లో షురూ ఆదిలాబాద్టౌన్: సర్కారు పాఠశాలల్లో విద్యా ప్ర మాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించింది. ఈ మేరకు 3,4,5 తరగతు ల విద్యార్థులకు సాంకేతిక పద్ధతిలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ పద్ధతుల్లో విద్యాబోధన చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లా ఎంపికై ంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో పది మంది విద్యార్థులను ఎంపిక చేసి బోధించనున్నా రు. వారిలో ప్రగతి ఆధారంగా మిగతా వారికి బోధ న కొనసాగించనున్నారు. శనివారం నాలుగు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు మరో నాలుగు పాఠశాలల్లో కలెక్టర్ ప్రారంభించనున్నారు. చతుర్విద ప్రక్రియలతో పాటు మెరుగైన సా మర్థ్యాలను అందుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈకే, స్టెప్ ఫౌండేషన్ సహకారంతో సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించారు. ఉన్నత పాఠశాలల్లోని ఆవరణలో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి కృత్రిమ మేద ద్వారా తరగతులను బోధించనున్నారు. సాంకేతిక విద్యా విధానాలే లక్ష్యంగా.. పాఠశాల విద్యా శాఖ ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పనిచేసే స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ ఫౌండేషన్ విద్యా రంగంలో డిజిటల్ పరిష్కారాలను అందిస్తూ గుజ రాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో కలిసి ఇప్పటికే పని చేస్తుంది. ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా విధానాలు, పాఠశాల విద్యలో నూతన అభ్యాస పద్ధతులు, డేటా ఆధారిత అధ్యయన విశ్లేషణలు, ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. జిల్లాలోనూ ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో భోరజ్ మండలంలోని పిప్పర్వాడ, బాలాపూర్, జైనథ్ మండలంలోని అడ, ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్, తాటిగూడ, తలమడుగు మండలంలోని ఖోడద్, దేవాపూర్ తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. నాలుగు పాఠశాలల్లో శనివారం ప్రారంభించగా, మరో నాలుగు పాఠశాలల్లో సోమవారం నుంచి షురూ చేయనున్నారు. ఏఐతో విద్యాబోధన.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎనిమిది ఎంపికై న విషయం తెలిసిందే. 3,4,5 తరగతుల విద్యార్థులకు ఈ విధానం ద్వారా బోధన చేపట్టనున్నారు. ఈ మూడు తరగతుల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారానికి రెండు రోజుల పాటు తెలుగు, మరో రెండు రోజుల పాటు గణితం బోధించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యాబోధన చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తారు. విద్యార్థి పాఠాలను అర్థం చేసుకుంటున్నారా.. లేదా అనేది ఏఐ గుర్తి స్తుంది. విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థం కానట్లయితే సరళమైన మార్గంలో ఏఐ బోధన చేస్తుంది. ఇలా ప్రతీ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయనుంది. అనంతరం విద్యార్థులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. పకడ్బందీగా అమలు .. జిల్లాలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యా యి. నాలుగు చోట్ల ఇప్పటికే కార్యక్రమం ప్రా రంభం కాగా, మిగతా నాలుగు పాఠశాలల్లో కలెక్టర్ సోమవారం ప్రారంభించనున్నారు. టెక్నాలజీ ద్వారా విద్యాబోధనతో విద్యార్థుల సామర్థ్యాలు పెరుగుతాయి. ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ అందించాం. పైలెట్ ప్రాజెక్ట్గా జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – ప్రణీత, డీఈవో -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆదిలాబాద్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్ కాలనీలో నిర్మించనున్న శ్రీ సీ తారామచంద్రస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సనాతన ధర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ భావితరాలకు తెలపాలన్నారు. అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణానికి పునాదులు పడుతాయన్నారు. కార్యక్రమంలో విజ్జగిరి నారాయణ, కోవ రవి, దమ్మ పాల్, కొండ గణేశ్, నల్ల మహేందర్, రామేశ్వర్, చిందం శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ సద్వినియోగం చేసుకోండి
కై లాస్నగర్: ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ఈ నెల 31లోపు ఫీజు చెల్లించి 25శాతం రాయితీ పొందాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు అన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆదివారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రత్యేక మేళా నిర్వహించారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన పలువురికి అప్పటికప్పుడు ప్రొసీడింగ్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమ లేఅవట్లోని ప్లాట్లను సక్రమం చేసుకోవడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు సులభంగా పొందవచ్చన్నారు. తక్కువ ఫీజుతోనే ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. ఇందులో టీపీఓ సుమలత, వార్డు ఆఫీసర్లు అక్షయ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, కుమ్ర లక్ష్మణ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతులను చైతన్యపర్చి ఉద్యమిస్తాం
ఆదిలాబాద్టౌన్: కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని, ఈ మేరకు రైతులను చైతన్యపరిచి ఉద్యమ కా ర్యాచరణ ప్రకటిస్తామని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షు డు హన్మంత్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏఐకేఎస్ జిల్లా 7వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ ఈ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు గతంలో మూడు నల్ల చ ట్టాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా రైతులు ఉద్యమించినట్లు పేర్కొన్నారు. 764 మంది రైతులు చనిపోవడంతో మోదీ సర్కా రు దిగివచ్చి వాటిని రద్దు చేసినట్లు తెలిపారు. మళ్లీ దొడ్డిదారిన అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్, దేవిదాస్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి, సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, పోశెట్టి, భాస్కర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.● ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్రావు -
సెల్టవర్ పనులు నిలిపివేయాలి
కై లాస్నగర్: అనుమతుల్లేకుండా చేపట్టిన సెల్టవర్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని పట్టణంలోని న్యూహౌసింగ్బోర్డు పరిధి లోని జూబ్లీహిల్స్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. శనివారం టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో పిల్లలతో కలిసి మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ, టవర్ నిర్మాణంతో ఆరోగ్యపరంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయన్నారు. పనులు వెంటనే నిలిపివేయాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. పనులు ఆపేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. -
పండిద్దాం పొగాకు..
● చెన్నూర్ చేలల్లో సాగు.. ● పంట మార్పిడికి ముందుకు వస్తున్న రైతులు ● తక్కువ నీటి వసతి.. ఎక్కువ దిగుబడి ● పంటను ఆశించని తెగుళ్లు చెన్నూర్రూరల్: ఎప్పుడూ ఒకే రకం పంటల సాగుతో భూమిలో సారం దెబ్బతింటుంది. పంట మార్పిడి విధానం పాటించాలని వ్యవసాయాధికారులు కూడా తరచూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు దీనిని పట్టించుకోరు. కానీ, చెన్నూరు మండలంలో కొందరు రైతులు అధికారుల సూచనలతో పంట మార్పిడి విధానంతో లాభాలు గడిస్తున్నారు. మిర్చి పంట సాగు చేసి పురుగు ఆశించడం, సరైన దిగుబడి రాకపోవడం, మద్దతు ధర లేకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. కొందరు మిర్చి పంటకు బదులుగా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ పంటకు తక్కువ నీరు, తెగుళ్ల బెడద లేకపోవడంతో సాగుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. చెన్నూర్ మండలంలో గతేడాది కేవలం రెండెకరాల్లో పొగాకు సాగు కాగా, ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 20 ఎకరాల వరకు సాగు చేశారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, శివలింగాపూర్లో మాత్రమే సాగవుతుంది. మిర్చి, పత్తి పంట పెట్టుబడి తరహాలోనే పొగాకు పంటకు పెట్టుబడి అవుతుందని, లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయని రైతులు పేర్కొంటున్నారు. చీడ, పీడలు, తక్కువే..పొగాకు పంటలో కలుపు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక లద్దె పురుగు, తేనె మంచు మాత్రమే ఆశిస్తుంది. దీని నివారణకు లామ్డాసైహలోత్రిన్, ఇమిడాక్లోప్రిడ్ మందును ఎకరాకు 120 ఎంఎల్ పిచికారీ చేస్తే సరిపోతుంది. లేదా క్లోరాంధ్రనిలిప్రోల్ 60 ఎంఎల్ పిచికారీ చేయాలి. ఈ పంటకు కోతులు, అడవి పందులు, పశువుల బెడద ఉండదు. ఆరబెట్టే విధానం..పంట వేసిన ఐదు నెలలకు దిగుబడి చేతికి వస్తుంది. ఆకులను తెంపి సోలార్ కవర్ ఉన్నట్లయితే 8 నుంచి 10 రోజులు ఆరబెడితే సరిపోతుంది. లేదంటే తోరణాలుగా తయారు చేసి 20 రోజుల నుంచి 25 రోజులు ఆరబెట్టాలి. మార్కెట్కు తీసుకువెళ్లే సమయంలో బేల్లుగా తయారు చేసి తేమశాతం లేకుండా చూసుకోవాలి. క్వింటాల్ ధర రూ.15 వేల వరకు వస్తుంది. జనగామ జిల్లా ములకనూరులో పొగాకు మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఆంధ్రకు వెళ్లాల్సి వస్తుంది. రైతులు ఒకే రకం పంట సాగు చేయకుండా ఇలా పంట మార్పిడి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. రైతులు ముందుకు రావాలి పంట మార్పిడిని అవలంబించేందుకు రైతులు ముందుకు రావాలి. అక్కెపల్లి, శివలింగాపూర్ గ్రామాల రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. పశువులు, ఆడవిపందులు, కోతుల బెడద ఉండదు. నీటి తడులు కూడా తక్కువగా ఉంటాయి. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. – యామిని, ఏవో, చెన్నూర్ పంట మార్పిడి చేయాలి ఎప్పటికీ ఒకే రకం పంటలు కాకుండా పంట మార్పిడి చేస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. మా క్లస్టర్లో కొందరు రైతులు పొగాకు సాగు చేశారు. పంట దిగుబడి కూడా బాగానే వస్తుంది. రైతులు ఆలోచించాలి. – రాజశేఖర్, ఏఈవో, అక్కెపల్లి, క్లస్టర్ సాగు విధానంపొగాకు ఐదు నెలల పంట. ఆగస్టు, సెప్టెంబర్లో సాగుచేయాలి. ఇక్కడి రైతులకు నారు ఆలస్యంగా రావడంతో నవంబర్లో మొక్కలు పెట్టా రు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొత్తూరులోని జీపీఏ కంపెనీ వారు నారును అందించారు. ఒక్కో మొక్కకు రూ.1 చొప్పున పడుతుంది. ఎకరాకు 10 వేల మొక్కలు నాటుతారు. జీపీఏ కంపెనీ వారే పండిన పంటను కొనుగోలు చేస్తారు. ఇక్కడ సాగు చేసే పొగాకు రకం వైట్బెర్లీ రకం. ఎకరాకు రూ.70 వేలు ఖర్చవుతుంది. మొక్కలు నాటుపెట్టే సమయంలో ఆఖరి దుబ్బులో 15 కిలోల యూరియా, ఒక డీఏపీ 50 కిలోల బస్తా వేస్తారు. నాటుపెట్టి ఆకులు వచ్చే సమయంలో 50 కిలోల పొటాష్ని వేస్తారు. నీటితడులు మూడుసార్లు మాత్రమే అందిస్తారు. 25 రోజుల్లో అందించాల్సి ఉంటుంది. నాటు పెట్టిన 50 రోజుల్లో ఒక అమ్మోనియా వేస్తారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. -
సరిహద్దులో నిఘా పెంచాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్తాంసి: ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రను ఆనుకుని ఉన్నందున అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో నిఘా పెంచాలని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆవరణలో మొక్క నాటారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె.ఫణిందర్, ఎస్సై రాధిక, ఉన్నారు. తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన ఎస్పీని గ్రామస్తులు సన్మానించారు. తలమడుగు పోలీస్స్టేషన్ తనిఖీ..తలమడుగు: మండలకేంద్రంలోని పోలీస్ స్టే షన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట ఎస్సై అంజమ్మ, సిబ్బంది ఉన్నారు. ఏప్రిల్ 20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలుఆదిలాబాద్టౌన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. ఉద యం 9 నుంచి మ ధ్యాహ్న 12 గంటల వర కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విషయాన్ని అభ్యాసకులు గమనించాలని సూచించారు. -
అన్నదాతకు అండగా ప్రభుత్వం
తాంసి: రైతులు సాగు చేస్తున్న ప్రతీ పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంట దిగుబడులను విక్రయించుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో కేశవ్, ఏవో రవీందర్, రైతులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన పలు వురు లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి శనివారం కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. తాంసి ఎంపీడీవో కార్యాలయంలో 35 మందికి, భీంపూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 57 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, నలందప్రియ, ఎంపీడీవోలు మోహన్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవో 3ను పునరుద్ధరించాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం జీవో 3ను పునరుద్ధరించి ఆదివాసీలకు ఉద్యోగాలు దక్కేలా చూడాలని టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. బెంగుళూర్లో నిర్వహిస్తున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో ఆయన రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. జీవో 3ను పునరుద్ధరణ చేసే అధికారం, అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా కేంద్రం స్పందించి 5వ షెడ్యూల్లో ఆదివాసీ యువతకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
● వరంగల్కు తెచ్చింది నేనే.. ఆదిలాబాద్కూ సాధిస్తా ● అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ● జిల్లాలో చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు
‘ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తెస్తా.. ఆ బాధ్యత నాది.. ఆ మంచి పేరు కూడా నేనే తీసుకుంటా.. మొదటి విడతలో వరంగల్కు తెచ్చా.. రెండో విడతలో ఆదిలాబాద్కు తీసుకొస్తా.. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఎయిర్పోర్టుల కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు.. అదే పక్క రాష్ట్రాలను చూడండి.. ఎన్ని ఉన్నాయి.. మన దగ్గర కూడా పెంచేందుకు కృషి చేస్తున్నా.. పెండింగ్ ప్రాజెక్ట్లను సాధించేందుకే ఢిల్లీ వెళుతున్నా.. కేంద్ర మంత్రులను కలుస్తున్నా.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి కేంద్రంలో ఉన్నవారితో ఇక్కడి బీజేపీ నేతలకు ఉన్న సంబంధాలను ఉపయోగించుకుందాం.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు’ ఇది సీఎం రేవంత్రెడ్డి శనివారం శాసనసభలో అన్న మాటలు. ●రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో చర్చ సా గింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్.. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి చర్చ లేవనెత్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో ఆదిలాబాద్ విషయంలో ముందడుగు పడటం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంతవాసుల మనోభావా లకు అనుగుణంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సాక్షి’ ప్రత్యేక చొరవ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరంగల్లోని మామూనూరులో ఎయిర్పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వరంగల్కు ఎయిర్పోర్టు తానే తీసుకొ చ్చానని చెప్పుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్లో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయు డు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దేశంలో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసే విషయంలో మోదీ సర్కారు చొరవ చూపుతుందని పేర్కొన్నా రు. అలాగే రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్లోని జక్రాన్పల్లిలో కూడా ఏర్పాటు చేసే విషయంలో ముందుంటామని స్పష్టం చేశారు. అయితే ఆదిలాబాద్ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో ఈ ప్రాంతవాసుల్లో నిరాశ వ్యక్తమైంది. ప్రధానంగా ఇక్కడ మౌలిక వసతులు అందుబాటులో ఉండడం, దశాబ్దాలుగా విమానాశ్రయం ఏర్పా టు డిమాండ్ ఉన్నా విస్మరించడంపై ఒకింత నారా జ్ అయ్యారు. ఈ క్రమంలో ‘సాక్షి ’ సామాజిక బా ధ్యతగా చొరవ తీసుకుంది. ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ‘ఆదిలాబాద్ ఎయిర్పోర్టు సాధన కోసం’ చర్చా వేదిక నిర్వహించింది. కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పట్ట ణానికి చెందిన మేధావులు, ప్రముఖులు పాల్గొని ఆదిలాబాద్కు విమానాశ్రయం ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఎయిర్పోర్టు సాధన కోసం అప్పటికప్పుడే అడహక్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో రాజకీయాలకతీతంగా ఐక్య ఉద్యమానికి సిద్ధమని ప్రకటించడంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. అదే రోజు ఎంపీ గోడం నగేశ్, ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎయిర్పోర్టు సాధన కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాంతా నికి విమానాశ్రయం వస్తే కలిగే ప్రయోజనాలు.. అందుబాటులో ఉన్న వనరులు.. తదితర అంశాల ను ప్రస్తావిస్తూ ‘సాక్షి’ ఈనెల 9న తెలంగాణ యాసలో సండే స్పెషల్గా ‘మామ.. ఎయిర్పోర్టస్తే మనకేమస్తది’ శీర్షికన మరో కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించగా సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రం పాజిటివ్గా ఉంది ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసే అంశంలో కేంద్రం పాజిటివ్గా ఉంది. రాష్ట్రం నుంచి గతంలో బీఆర్ఎస్ సర్కారు సహకరించకపోవడంతో అనేక ప్రాజెక్ట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి సాధన విషయంలోనే మేము ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను తరచూ కలుస్తున్నాం. అందుకే అసెంబ్లీలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. ముఖ్యమంత్రి పాజిటివ్గా స్పందించారు. నేను అనేది ఒకటే..‘ పేరు మీకొచ్చినా .. మా ఆదిలాబాద్కు మాత్రం ఎయిర్పోర్టు కావాలి.. అనేదే మా నినాదం’. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ఈనెల 9న ‘సాక్షి’లో సండే స్పెషల్ స్టోరీఈనెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
తండ్రిపై దాడికి సుపారీ..
● స్నేహితుడికి రూ.50 వేలు ఇచ్చిన కొడుకు ● దాడిచేసి గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు ● 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): తండ్రి, కొడుకు మధ్య కొన్ని రోజులుగా తలెత్తిన గొడవ చివరకు దాడి దారితీసింది. తండ్రి గొడవతో విసిగిపోయిన కొడుకు దాడి చేయించేందుకు స్నేహితుడికి సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న స్నేహితుడు దుండగులతో దాడి చేయించడంతోపాటు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై సురేశ్ హాజీపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించారు. వేంపల్లికి చెందిన నాగిరెడ్డి సత్యానందం–సరస్వతి దంపతులకు కొడుకు రమేశ్ ఉన్నాడు. దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా తండ్రి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రమేశ్ తండ్రిపై దాడి చేయించేందుక అతని స్నేహితుడు సొల్లు అవినాశ్కు రూ.50 వేల సుపారీ ఇచ్చాడు. దీంతో అవినాష్ గర్మిళ్లకు చెందిన అందె అశోక్, అట్ల సంతోష్, ఎన్టీఆర్ నగర్కు చెందిన మామిడిపల్లి చందు, చింతల కృష్ణతో కలిసి దాడికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సత్యానందర్ ఇంట్లో ఉండగా దాడి చేయించాడు. అంతేకాకుండా అతని మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాధితుడు సాయంత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొడుకుపై అనుమానంతో..ఈ క్రమంలో కొడుకుపై అనుమానం రావడంతో అతడిని విచారణ చేశారు. దీంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అవినాశ్తోపాటు అశోక్, సంతోష్, చందు, కృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లో దాడి కేసును ఛేదించారు. అయితే విచారణలో రమేశ్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్కు గురయ్యారు. కేవలం కుటుంబ కలహాలతో కన్న తండ్రిపైనే దాడికి సుపారి ఇచ్చినట్లు రమేశ్ పోలీసులకు తెలిపాడు. నిందితుల నుంచి తులం బంగారు గొలుసు, సుపారీ కింద ఇచ్చిన రూ.30,670 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు ఛేదించిన మంచిర్యాల రూరల్ సీఐ ఆశోక్, హాజీపూర్ ఎస్సై సురేశ్, సీసీసీ ఎస్సై సుగుణాకర్, ఏఎస్సై ఎజాజ్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, నరేందర్, ఎస్కే.పాషాను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ అభినందించారు. -
ఏఐతో నాణ్యమైన విద్యాబోధన
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన వి ద్యాబోధన అందుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్–ఏఎక్సల్ ల్యాబ్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ ఎంతగానో దోహద పడుతుందన్నారు. స్టెప్ ఫౌండేషన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్గౌడ్, హెచ్ఎం నారాయణ, శిక్షకుడు గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంల గోడౌన్ పరిశీలనకై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ఈవీఎంల గోడౌన్ను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివి ధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. స్ట్రాంగ్ రూం సీల్ తీయించి అందులో భద్రపర్చిన ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీ లించారు. అనంతరం యథావిధిగా సీల్ వేయించా రు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి జిల్లా ఓటర్లకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల కు వివరించారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మాత్రలు వేసుకోవాలిఆదిలాబాద్రూరల్: క్షయ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వంద రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంకోలి పీహెచ్సీలో టీబీ పెషెంట్స్కు నిక్షయ పోషణ్ కిట్స్ను శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, గ్లాండ్ఫార్మా ప్రతినిధులు రఘురామన్, గిరీష్, సుబ్బరాజు, లోక భారతి ట్రస్టు ప్రతినిధి కుమారన్, డిప్యూటీ డీఎంహెచ్వోలు మనోహర్, సాధన, డీటీసీవో సుమలత, ఎన్సీడీ పీవో శ్రీధర్, డీఎల్వో గజానంద్, మండల వైద్యాధికారులు ఆశాకిరణ్, సర్ఫరాజ్, టీబీ ఎంవో సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ‘యూడీఐడీ’
● స్మార్ట్కార్డుల దరఖాస్తుకు ప్రత్యేకపోర్టల్ ● కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల లబ్ధికి దోహదం ● ఒకే కార్డుతో అనేక ప్రయోజనాలు కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలతో పాటు కేంద్ర పథకాలను పొందేందుకు వీలుగా దివ్యాంగులకు యూనిక్ డిజ బెలిటి ఐడెంటిఫికేషన్ నంబర్ (యూడీఐడీ) స్మార్ట్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వారి వైకల్య ధ్రువీకరణపత్రాన్ని సదరం శిబిరాల్లో కాగితం రూపంలో అందిస్తున్నా రు. అందుకు నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. కార్డు పునరుద్ధరణ, కొత్త కార్డుల జారీ కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆధార్ తరహా ప్రత్యేక నంబర్తో కూడిన స్మార్ట్కార్డులను జారీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఈ నెల 8న జిల్లాలోని దివ్యాంగుల ప్రతినిధులు, డీఆర్డీఏ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి స్మార్ట్కార్డుల జారీపై దిశానిర్దేశం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ యూడీఐడీ కార్డులకు దరఖాస్తు చేసుకునేందు కోసం కేంద్ర ప్రభుత్వం http://www. swavlambancard.gov. in ప్రత్యేక ఫోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఆన్లైన్లో ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీసేవ కేంద్రాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో అడిగిన వివరాలు నింపడంతో పాటు పాస్పోర్టుసైజ్ ఫొటో, సంతకం, ఆధార్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకోగానే ఎన్రోల్మెంట్ నంబర్ సెల్ఫోన్కు మేసేజ్ రూపంలో అందుతుంది. 31.10.2023 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లు కలిగిన వారందరికీ యూడీఐడీ స్మార్టు కార్డు, సర్టిఫికెట్లు ప్రభుత్వం జనరేట్ చేసి ఉంచింది. కొంతమందికి ఆ కార్డులను నేరుగా వారు సూచించిన చిరుమానాకు పోస్టల్ ద్వారా పంపించగా మరికొందరి కార్డులను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి పంపించింది. కార్డు రానటువంటి వారెవరైనా ఉంటే యుడీఐడీ పోర్టల్లో ఆధార్కార్డు, మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును సైతం కల్పించింది. జిల్లాలోని దివ్యాంగుల వివరాలు కేటగిరీ దివ్యాంగులు ఆర్థోపెడిక్ 6,535 దృష్టిలోపం 1,266 వినికిడి లోపం 1,315 మానసిక వైకల్యం 1,295దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలిజిల్లాలోని దివ్యాంగులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయనున్న యుడీఐడీ స్మార్ట్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు అవగాహన కల్పించేలా వీవోఏలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు పంచాయతీ కార్యదర్శులు విస్తృత ప్రచారం కల్పించాలి. సదరం సర్టిఫికెట్ కలిగిన వారికి కూడా ఈ స్మార్ట్కార్డులు నేరుగా వారి ఇంటి వద్దకే రానున్నాయి. ఏమైనా సందేహాలుంటే ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
అంగన్వాడీ టీచర్పై దాడి
కడెం: మండలంలోని లింగాపూర్తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ ధరంసోత్ శ్రీలతపై అదే తండాకు చెందిన సురేందర్, కమల, సరోజ దాడి చేశారు. శనివారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన సరుకులు తీసుకునేందుకు శ్రీలత వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన శ్రీలతను ఖానాపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ టీచర్ శ్రీలతను సీడీపీవో సరిత, సూపర్వైజర్లు పరామర్శించారు. హోలీ పండుగ రోజున జరిగిన గొడవ కారణంగానే అంగన్వాడీ టీచర్పై దాడి జరిగినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భుక్యా రమేశ్ డిమాండ్ చేశారు. విద్యుత్ కంచెకు తగిలి రైతు దుర్మరణం నర్సాపూర్ (జి): పంటను అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్న రైతుకు అదే కంచె మృత్యుపాశమై కాటేసిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్ అనుబంధ నసీరాబాద్ గ్రామానికి చెందిన బొందుగుల మల్లయ్య (54) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా డు. పంటను అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చుట్టూ జీఐ వైర్ చుట్టి కరెంట్ కనెక్షన్ ఇస్తుండేవాడు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం వరకు మల్లయ్య ఇంటికి రాకపోయేసరికి అతడి భార్య చిన్నక్క వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడగా కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో ఒకరి ఆత్మహత్య ఇంద్రవెల్లి: మద్యం మత్తులో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బుర్సన్పటర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సోన్కాంబ్లే విద్యాసాగర్(57) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం హోలీ సంబరాల్లో భాగంగా అతిగా మద్యం తాగాడు. అదే మత్తులో సాయంత్రం చేనుకు వెళ్లి అక్కడ గుర్తు తెలియని పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించి 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై మరొకరు..బజార్హత్నూర్: మద్యానికి బానిసైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై అప్పారావ్ తెలిపిన వివరాల ప్రకారం.. జాతర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామానికి చెందిన గొడం గంగారాం(54) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం తన పంట పొలంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య కడెం: మండలంలోని పెద్దబెల్లాల్ పంచా యతీ పరిధి మొర్రిగూడెం గ్రామానికి చెందిన ఆకుల సత్తెన్న (42) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం వివాహమైన సత్తెన్నకు సంతానం కలగకపోవడం, రెండేళ్ల క్రితం భార్య అ నారోగ్యంతో మరణించడంతో మద్యానికి బానిసయ్యాడు. ఒంట రిజీవితం గడుపుతున్న అతడు మనస్తాపంతో గతంలో పలు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈక్రమంలో ఈనెల 14న మద్యం సేవించి బాత్రూంలో టవల్తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు ఆకుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘కుపి’్ట ముందడుగు పడేనా..!
● గత బడ్జెట్లో నిధులు కేటాయించినా పైసా విదల్చని వైనం ● భూసేకరణలో పురోగతి నిల్ ● పెరుగుతున్న అంచనా వ్యయం ● తాజాగా మళ్లీ సవరించేందుకు సిద్ధం ● ఇకనైనా అడ్డంకులు తొలిగేనాసాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతిపాదిత కుప్టి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బడ్జెట్లో నిధులు కేటాయించినా ఆ తర్వాత ఒక్క పైసా కూడా విదల్చలేదు. భూసేకరణలోనూ అడుగు కూడా ముందుకు పడలేదు. ఏటా ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం పెరుగుతూనే పోతోంది. తాజాగా మళ్లీ సవరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికై నా ఆటంకాలు తొలుగుతాయా అనేది వేచి చూడాల్సిందే. మళ్లీ సవరణ..? నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ముందడుగు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గతేడాది బడ్జెట్లో రూ.234 కోట్లు మంజూరు ఇచ్చింది. దీంతో అప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగు పడినట్టేనని అంతా భావించారు. తదనుగుణంగా సాగునీటి, రెవెన్యూ అధికారులు రంగంలోకి కూడా దిగారు. ప్రాజెక్టు అమరిక కోసం భూమిని పరిశీలించారు. అప్పట్లో ముంపు భూములకు పరిహారం తేల్చిన తర్వాతే ఏదైనా అని నిర్వాసితులు స్పష్టం చేయడంతో కొంత వివాదం తలెత్తింది. నేరడిగొండ మండలంలోని కుమారి, గాజిలి, గాంధారి, కుప్టి గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురికానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదట 2018లో రూ.794 కోట్ల వ్యయంతో నిర్మించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ అంచన వేసింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తర్వాత పలుమార్లు ప్రాజెక్టు అంచనా వ్యయం సవరించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడుగు వేస్తుందనేదే ఆసక్తికరం. ఇదిలా ఉంటే వచ్చే జూలైలో దీనికి సంబంధించి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం మరోసారి అంచనా వ్యయం పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. పూర్తి ఆయకట్టు స్థిరీకరించేందుకు.. బచావత్ అవార్డు ప్రకారం కడెం రిజర్వాయర్కు 68,150 ఎకరాల ఆయకట్టుకు 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని ఉంది. అయితే ఈ ప్రాజెక్టు వానాకాలంలో మాత్రమే నీటిని స్వీకరిస్తుంది. అది కూడా 7.20 టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది. ఆయకట్టుకు నీటి డిమాండ్ ప్రధానంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ప్రతీ పంట కాలం ముగిసే సమయానికి నీటి కొరత ఏర్పడుతుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 42,883 ఎకరాలకు మాత్రమే కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మిగతా 25,267 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ ప్రాజెక్టు ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతమైన కుప్టి వద్ద ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని పదేళ్ల కిందట.. అంటే 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కడెం ఆయకట్టుకు అనుబంధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటుంది. బహుళార్థసాధక ప్రాజెక్ట్.. కడెం ప్రాజెక్టును 1958 సంవత్సరంలో నిర్మించా రు. 7.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ జి ల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్యలో ఉన్న కుప్టి గ్రామం నుంచి నీటి పరీవాహకం ఉంది. ఈ నీరే కడెం ప్రాజెక్టుకు చేరుతుంది. బచావత్ అవా ర్డు ప్రకారం 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కడెం వద్ద అటవీ సంపద దృష్ట్యా ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచే అవకా శాలు లేవు. దీంతోనే ప్రభుత్వం ఎగువన ఉన్న కుప్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి బీజం వేసింది. ఇందులో భాగంగానే కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఆయకట్టు స్థిరీకరణ, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సదుపాయం అందించడం వంటి ప్రయోజనాలతో దీన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా రానున్న రోజుల్లో కుప్టి ప్రా జెక్టుకు అనుసంధానంగా చుట్టుపక్కలా గ్రామాల కు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయకట్టుకు కూడా సాగునీరు అందించవచ్చనే ఆలోచన ఉంది.కుప్టి ప్రాజెక్టు స్వరూపం ఇలా..నీటి నిల్వ సామర్థ్యం:5.30 టీఎంసీలు నీటిమట్టం : 394.00 మీటర్లు జలమార్గం : 7 రేడియల్ గేట్లు సిల్ప్వేతో నిర్మాణంసంవత్సరం డీపీఆర్ అంచనా వ్యయం2020–21 రూ.846.737 కోట్లు 2021–22 రూ.900 కోట్లు 2022–23 రూ.1100 కోట్లు 2023–24 రూ.1323 కోట్లుప్రధాన ప్రయోజనాలు.. మూడు మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి బోథ్ నియోజకవర్గంలో భవిష్యత్తులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా కొత్త నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించేందుకు అవకాశాలు నీటి ప్రవాహం కొనసాగడంతో కుంటాల జలపాతం సహజ సౌందర్యం చాలా కాలం పాటు ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి పర్యాటకుల ద్వారా ఆదాయం లభిస్తుంది. కడెం ఆయకట్టు నుంచి గోదావరినదిలో పునరుత్పత్తి నీటి కారణంగా గూడెం, ధర్మపురి వద్ద గోదావరి నదికి నీరు చేరడం ద్వారా సమీపంలో ఉన్న దేవాలయాలకు ఎక్కువ మంది యాత్రికులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.నిధులు మంజూరైతే భూసేకరణ చేస్తాం..ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన పక్షంలో భూసేకరణ చేపడతాం. నాలుగు గ్రామాల్లో 2500 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటా సవరించడం జరుగుతుంది. ఆ ప్రకారం త్వరలో మళ్లీ కొత్త వ్యయం రూపొందించనున్నాం. – భీంరావు, మైనర్ ఇరిగేషన్ డీఈ, ఇచ్చోడ డివిజన్ -
● అవగాహనతోనే హక్కుల రక్షణ ● ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ మోసాలే ● అప్రమత్తతే శ్రీరామరక్ష ● నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం
● ఇచ్చోడ మండలంలోని అడెగామకు చెందిన అల్లూరి వెంకట్రెడ్డి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో రూ.10లక్షల విలువ గల ఇన్సూరెన్స్కు సంబంధించి రూ.33,866 చెల్లించాడు. తన భార్య భుజానికి గాయమైంది. ఈ మేరకు సదరు ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా న్యాయం జరగలేదు. దీంతో ఆయన కన్జుమర్ కమిషన్ను ఆశ్రయించాడు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష 81వేలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని, అలాగే రూ.10వేల పరిహారం, రూ.5వేలు ఖర్చులకు ఇప్పించారు.నష్టపోతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలివినియోగదారులకు న్యాయం చేయడమే కన్జుమర్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లు తీసుకోవాలి. 2018 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 1100 కేసులను పరిష్కరించడం జరిగింది. కన్జుమర్ కమిషన్ ద్వారా రియల్ ఎస్టేట్ కేసులు, ఇన్సూరెన్స్, మెడికల్ లీగల్ కేసులు, విద్యుత్ శాఖ, చిట్ఫండ్స్, సీడ్స్, వస్తువులు తదితర వాటికి సంబంధించి మోసపోతే నేరుగా సంప్రదించవచ్చు. 90 రోజుల్లో కేసుల పరిష్కారం కోసం చర్యలు చేపడతాం. నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించేలా చూస్తాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేసుల పరిష్కారం కోసం బెంచ్ నిర్వహించడం జరుగుతుంది. – జాబేజ్ శ్యాముల్, డీసీడీఆర్సీ ప్రెసిడెంట్ ఆదిలాబాద్టౌన్: కష్టపడి సంపాదించిన డబ్బు తో కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోవడం, సంస్థలు అందించే సేవల్లో లోపాలతో వినియోగదారులు తీ వ్రంగా నష్టపోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నా యి. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసాలకు గురవ్వాల్సి వస్తోంది. చాలా సంస్థలు నైతిక విలువలు వదిలేసి నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీన్ని నివారించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జుమర్ కమిషన్ కీలకపాత్ర పోషి స్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అవగాహనే శ్రీరామ రక్ష.. ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్ర స్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీ సం ఫిర్యాదుసైతం చేయకుండా పోతున్నారు. నచ్చి న వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వాటి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అభిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు విని యోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆ ధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. నష్టపోయిన వినియోగదారులకోసం ఉమ్మ డి జిల్లా పరిధిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టుఆవరణలో జిల్లా వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్ (డీసీడీఆర్సీ) ఉంది. అయి తే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వీటిపై అవగా హన కల్పిస్తే వినియోగదారులకు మరింతన్యాయం జరగనుంది. కేసులను 90 రోజుల్లో పరిష్కరించా లని చట్టం చెబు తోంది. చాలా కారణాలతో తీర్పుల్లో జాప్యం అవుతోంది. అయితే బాధితులు ఆన్లైన్, ఆఫ్లైన్లో మోసాలకు గురైతే నేరుగా ఫిర్యా దు చేసే అవకాశం ఉంది. ఒక్క రూపాయి నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా న్యాయం పొందవచ్చు.వినియోగదారుల కోర్టులో కేసుల వివరాలు..ఉమ్మడి జిల్లా పరిధిలో 1988 నుంచి ఇప్పటివరకు నమోదైనవి 7,408పరిష్కారమైనవి 7,237పెండింగ్లో ఉన్నవి 1712023 నుంచి ఇలా.. సంవత్సరం నమోదైనవి పరిష్కారం అయినవి 2023 256 228 2024 163 29 2025 50 43 -
అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై ఉంటూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లను శుక్రవా రం ఆయన పరిశీలించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్ర జలంతా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. పట్టణంలోని వినాయక చౌక్, అబ్దుల్లా చౌక్, గాంధీచౌక్ అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అందరి సహకారంతో శాశ్వ త పరిష్కారం దిశగా చొరవచూపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు సునీల్, శ్రీ నివాస్, రిజర్వ్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.బీఆర్ఎస్ నిరసనఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తడి ఆరిపోయి ఎండుతున్న పంట పొలాల రైతులను ఆదుకోవాలని అడిగిన పాపానికి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, మాజీ కౌన్సిలర్లు కొండ గణేశ్, దమ్మాపాల్, అశోక్ స్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాజీ ఎంపీపీ గోవర్ధన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్రే మిషన్ అందజేత
ఆదిలాబాద్టౌన్: క్షయ నియంత్రణ కేంద్రానికి అవసరమైన హ్యాండిల్ ఎక్స్రే మిషన్ను సుశోధన స్వచ్ఛంద సంస్థ సభ్యులు గురువారం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్కు అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలో వంద రోజుల క్షయ గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితుల నమూనాల సేకరించి, ఎక్స్రే తీసి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రెండు ఎక్స్రే మిషన్లు మాత్రమే ఉన్న విషయాన్ని సుశోధన స్వచ్ఛంద సంస్థ ఎండీకి తెలుపగా ఆయన నెలపాటు వినియోగించుకునేందుకు హ్యాండిల్ ఎక్స్రే మిషన్ ఇచ్చారని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లినపుడు అనుమానితులకు అప్పటికప్పుడే ఎక్స్రే తీసి వ్యాధి నిర్ధారించే అవకాశముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీబీ అధికారిణి సుమలత, సమియొద్దీన్ పాల్గొన్నారు. -
కేసుల నమోదులో జాప్యం వద్దు
బోథ్: కేసుల నమోదులో జాప్యం చేయొద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం బోథ్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాల ను పరిశీలించారు. కేసుల వివరాలు తెలుసుకుని ప లు సూచనలు చేశారు. సొనాల మండలంలోని ఘ న్పూర్ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు గమనించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, పీఎస్సై రాజశేఖర్రెడ్డి సిబ్బంది ఉన్నారు. బజార్హత్నూర్ ఠాణా తనిఖీ బజార్హత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పలు సూచనలు చేశారు. డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ, ఎస్సై ఉన్నారు -
లింగనిర్ధారణ చేస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలను తనిఖీ చేశా రు. స్కానింగ్, ఇతర పరీక్షలకు సబంధించి న ధరల పట్టికను ఆస్పత్రిలో ప్రదర్శించాల ని పేర్కొన్నారు. పోలీస్, తహసీల్దార్, స్వ చ్ఛంద సంస్థ, ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ని త్యం డయాగ్నోస్టిక్ కేంద్రాలను తనిఖీ చేస్తామని వివరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, సిబ్బంది ఉన్నారు. -
ఏఐ పరిజ్ఞానంతో విద్యాబోధన
కైలాస్నగర్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆ ధారిత పరిజ్ఞానంతో విద్యాబోధన చేసేందుకు జి ల్లాలోని తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ అంశంపై గురువారం కలెక్టర్లు, వి ద్యాధికారులతో విద్యాశాఖ కార్యదర్శి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. 3నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో చదువులో వెనుకబడినవారికి ఏఐ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న నాలుగు పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఎంఈవోలు మనోహర్, వెంకట్రావ్, క్వాలిటీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి, కార్మిక ఉపాఽధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. -
● పూర్తికాని కొరాట–చనాకా పనులు ● సర్కారు మారగా నిలిచిన నిధులు ● దృష్టి సారించని కాంగ్రెస్ ప్రభుత్వం ● పదేళ్లుగా నిరీక్షిస్తున్న అన్నదాతలు ● బడ్జెట్లో కేటాయింపులపైనే ఆశలు ● పూర్తయితే 51వేల ఎకరాలకు నీరు
కొరాట–చనాకా బ్యారేజ్ (ఫైల్) సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో దిగువ పెన్గంగానదిపై నిర్మిస్తున్న చనాకా–కొరాట బ్యారేజీ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు దృష్టి సారిస్తేనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. నిర్మాణ పనులు తుది దశలో ఉన్న సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇది పూర్తయితే జిల్లాలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్ట్గా నిలుస్తుంది. కాగా, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిధుల కేటాయింపులో పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నా.. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో వివక్ష చూపుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించింది. దీంట్లో కొరాట–చనాకా బ్యారేజ్ కూడా ఉండగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ స్వరూపం ఇలా.. లోయర్ పెన్గంగపై తెలంగాణ–మహారాష్ట్ర నది భూభాగాన్ని కలుపుతూ కొరాట–చనాకా బ్యారేజ్ నిర్మాణానికి రూ.1,227 కోట్ల అంచనా వ్యయంతో 2015–16లో పరిపాలన అనుమతి ఇచ్చారు. ఆది లాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాలు, బోథ్ నియోజకవర్గంలో ఒక మండలం కలుపుకొని మొత్తంగా 51 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం దీని అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లకు చేరింది. ఇవీ.. పెండింగ్ పనులు చనాకా–కొరాట బ్యారేజీ నిర్మాణంలో భాగంగా బ్యారేజ్, దానికి కొద్ది దూరంలో పంప్హౌస్, కాలు వల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ, పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలి. ఇందులో బ్యారే జ్, పంపుహౌస్, ఎల్పీపీ కెనాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ, దాని కింద మైనర్స్, సబ్ మైనర్స్ నిర్మించాలి. వీటికి సంబంధించి పనులే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ సంబంధించి భూసేకరణ, నిర్మాణ వ్యయం అంచనా వేసిన అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన పక్షంలో మిగతా పనులు పూర్తి కానున్నాయి. కాగా, ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పంప్హౌస్ వద్ద ఇది వరకే డ్రైరన్, వెట్రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్పీపీ కెనాల్లోకి నీళ్లు ఎత్తిపోయడాన్ని పరిశీలించారు. అయితే ఎల్పీపీ ప్రధాన కెనాల్ పనులు పూర్తయినా డిస్ట్రిబ్యూటరీ, మైనర్స్, సబ్ మైనర్స్ పనులు పెండింగ్లో ఉండటంతో నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేస్తే ఎల్పీపీ కెనాల్ ద్వారా 37,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కొరాట–చనాకా బ్యారేజ్ వివరాలు అంచనా వ్యయం : రూ.1,227 కోట్లు ప్రస్తుత అంచనా.. : రూ.2 వేల కోట్లు ఆయకట్టు లక్ష్యం: 51 వేల ఎకరాలు నిధులు కేటాయిస్తేనే.. డిస్ట్రిబ్యూటరీ సిస్టంను డీ–14 నుంచి డీ–19 వర కు నిర్మించాలి. దీనికి సంబంధించి ఇంకా 800 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి సుమారు రూ.100 కోట్ల వరకు అవసరమని పేర్కొంటున్నారు. డిస్ట్రిబ్యూటరీ సిస్టం నిర్మాణానికి రూ.150 కోట్లు అవసరమని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు పూ ర్తయితే ఎల్పీపీ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు అందించే వీలుంటుంది. ఇక పిప్పల్కోటి రి జర్వాయర్ నిర్మాణం కోసం మరో వెయ్యి ఎకరా లు సేకరించాల్సి ఉంది. దాని నుంచి కొరాట–చనాకా కెనాల్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా మరో 13,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. -
‘హలో.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి’
కై లాస్నగర్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను ఈ నెల 31లోపు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు. గడువులోపు చెల్లిస్తే ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా వారికి ఫోన్ చేసి ఫీజు చెల్లించాలని కోరుతున్నారు. బల్దియా వార్డు ఆఫీసర్లకు ఈ బాధ్యతలు అప్పగించగా, వారు రెండు రోజులుగా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైతన్యపరుస్తున్నారు. వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నాలు గేళ్లుగా పెండింగ్లో ఉంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసేదిశగా చర్యలు చేపట్టింది. అక్రమ లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లను అమ్ముకుని, అమ్ముడుపోకుండా మిగిలినవాటన్నింటికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసుకోనివారికి కూడా అ వకాశం కల్పించింది. 25శాతం రిబేట్ కూడా ప్రకటించడంతో అధికారులు రెగ్యులర్గా ఎల్ఆర్ఎస్పై సమీక్షిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి 14,580 దరఖాస్తులను ఆమోదించారు. వారంతా ఫీజు చెల్లించేలా చూడాలని 30 మంది బల్దియా వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 500 దరఖాస్తులు ఇచ్చి వాటి యజమానులు ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వార్డు ఆఫీసర్లు రెండు రోజులుగా కౌన్సిల్ సమావేశ మందిరం నుంచి దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారు. కాగా, వందకు పైగా దరఖాస్తులు ఎల్టీపీలు, మీ సేవ కేంద్రాల నిర్వాహకుల పేరిట ఉన్నట్లు తెలిసింది. దీంతో చేసినవారికే పదేపదే ఫోన్లు చేయాల్సి వస్తోందని, ఇప్పటికే కొందరు ప్లాట్లు అమ్ముకున్నట్లు సమాధానామిస్తున్నారని, మరికొందరికి ఫోన్లు కలవడంలేదని వార్డు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 370 మందే.. బల్దియా అధికారుల ఫోన్లకు దరఖాస్తుదారులు స్పందిస్తున్నారు. తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బల్దియా కార్యాలయానికి వచ్చి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. దీంతో పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగం సందడిగా మారుతోంది. ఇప్పటివరకు 370 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఈ లెక్కన బల్దియాకు రూ.కోటి వరకు ఆదా యం సమకూరినట్లు సమాచారం. చెల్లింపు గడువు ఇంకా 16 రోజులు ఉండగా మిగతా 14 వేల దరఖాస్తుదారుల్లో ఎంతమంది ఫీజు చెల్లిస్తారోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దిగువ, మధ్యతరగతి వారితో పాటు కూలీ పనులు చేసుకునేవారూ తక్కువ ధరలో చిన్నపాటి ప్లాట్లు కొన్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు చేతిలో డబ్బుల్లేక ఆవేదనకు గురవుతున్నారు. 31లోపు చెల్లించి రాయితీ పొందండి దరఖాస్తుదారులకు అధికారుల ఫోన్లు ఫీజు వసూళ్లలో వార్డు ఆఫీసర్లు బిజీ సందడి సందడిగా మున్సిపల్ ఆఫీస్ గడువులోపు ప్రక్రియ పూర్తయ్యేనా..? ముందుకు వస్తున్నారు అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ఈ నెల 31లోపు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేవారికి ప్రభుత్వం 25శాతం రాయితీ ఇస్తోంది. దీనిని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ముందుకువస్తున్నారు. – నవీన్కుమార్, బల్దియా టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ -
వాటర్ సప్లయ్ సిబ్బందితో సమీక్షా సమావేశం
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలో పైపులైన్ లీకేజీల ద్వారా నిత్యం ఎనిమిది ఎంఎల్డీల నీరు వృథాగా పోతున్న వైనాన్ని ‘వృథా అరికట్టకుంటే వ్యథే’ శీర్షికన ఈ నెల 12న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజు స్పందించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో వాటర్సప్లయ్ విభాగం వర్క్ ఇన్స్పెక్టర్లు, పంపు ఆపరేటర్లు, లీకేజీ నియంత్రణ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలు, నీటి సమస్య ఎదుర్కొంటున్న కాలనీల గురించి ఆరా తీశారు. పైపులైన్ లీకేజీల వివరాలు తెలుసుకున్నారు. లీకేజీలను నియంత్రించి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ము గ్గురితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. కాలనీల్లోని చేతిపంపులు, బోరుబావుల విద్యుత్ మో టర్లు పనిచేయకుంటే సత్వరమే సమాచా రం ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా లీకే జీ ఏర్పడితే యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టి నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఇందుకు రూ.కోటి అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డీఈలు తిరుపతి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. -
17 నుంచి కష్ఠు గుర్తింపు సర్వే
ఆదిలాబాద్టౌన్: ఈనెల 17 నుంచి జిల్లాలో నిర్వహించే కుష్ఠు గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నా రు. డీఎంహెచ్వో సమావేశ మందిరంలో ఎల్సీడీసీ సర్వేపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలు ఈనెల 17 నుంచి 30వరకు తమకు కేటాయించిన ఇళ్లను సందర్శించి కుష్ఠు అనుమానితులను గుర్తించాలన్నారు. సమావేశంలో జిల్లా కుష్ఠు నివారణ అధికారి గజానంద్, టీబీ నియంత్రణ అధికారి సుమలత, డీపీఎంవోలు రమేశ్, వామన్రావు, వైద్యాధికారులు, లెప్రసీ నోడల్ పర్సన్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. శిబిరం పరిశీలన ఆదిలాబాద్రూరల్: మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బంగారుగూడలో బుధవారం నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ పరిశీలించారు. -
‘అక్రమ అరెస్టులపై తిరుగుబాటు తప్పదు’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీల అక్రమ అరెస్టులపై తిరుగుబాటు తప్పదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ హెచ్చరిచారు. మావల మండలం బట్టిసావర్గాం శివారు లో గల కుమురంభీం గూడలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం రింగారిట్ గ్రామంలో వారం క్రితం గ్రామ పటేల్ కోవ జంగు, కోవ రాములను చెట్లు నరికారనే నేపంతో అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. అలాగే టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గ్రామాలను తరలించే కుట్రలను ఆపాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, ఉపాధ్యక్షురాలు ఇందిరా, డివిజన్ అధ్యక్షురాలు లలిత, నాయకులు నాగోరావ్, ఆనంద్రావ్, పార్వతిబాయి, తదితరులున్నారు. -
‘సహజ’ హోలీ.. సంతోషాల కేళి
ఆదివాసీలు హోలీ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. మోదుగుపూలతో తయారు చేసిన రంగులనే వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. 8లోu ఇచ్చోడలోని సుభాష్నగర్కు చెందిన లక్ష్మి ఇంట్లో బోరుబావిలో నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి బోరు ఆన్ చేస్తే రెండు మూడు బిందెల నీళ్లు మాత్రమే వస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే మళ్లీ అదే పరిస్థితి. ఒక్క ఈ ఇంట్లోనే కాదు.. ఇచ్చోడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి. -
ప్రైవేటుకు దీటుగా బోధన
ఆదిలాబాద్టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సా గుతుందని డీఈవో ప్రణీత అన్నారు. సాత్నాల మండలం జామిని ప్రాథమికో న్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల చదువు కోసం గ్రామస్తులు రూ.60వేల విలువైన టీవీని అందించడం అభినందనీ యమని కొనియాడారు. మారుతున్న కా లానికి అనుకూలంగా డిజిటల్ తరగతులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గంగుల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శరత్ యాదవ్, ఎస్ఎంసీ చైర్మన్ దేవ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి
● కలెక్టర్ రాజర్షి షా తాంసి: వేసవిలో సాగునీటి ఎద్దడిని నివారించేందుకు రైతులు వ్యవసాయ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలంలో భూ గర్భజలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పలు పంటలు నీరందక ఎండిపోతున్నట్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. తొలుత మండల కేంద్రంలోని సబ్స్టేష న్కు వెళ్లి విద్యుత్ సరఫరా వివరాలను ఎస్ఈ, డీఈలను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సరఫరాలో సమస్య తలెత్తకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. అనంతరం హస్నాపూర్ శివారు మత్తడివాగు సమీపంలో ఎండిపోతున్న జొన్న పంటను పరిశీలించారు. రైతు రవి కిరణ్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. మత్తడివాగు కుడికాలువ పూర్తయినా తమ పంటలకు మా త్రం సాగునీరు అందడం లేదని రైతులు పేర్కొన్నారు. వెంటనే ఈఈ విఠల్తో ఫోన్లో మా ట్లాడి సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ రైతు బోరుబావి వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్, డీఈ హరికృష్ణ, ఏడీ శ్రావణ్, ఎంపీడీవో మో హన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్, ఏఈవోలు శివ, నిఖిత, రైతులు ఉన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు ఆదిలాబాద్టౌన్(జైనథ్): గ్రామాల్లో నీటి ఎద్ద డి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సాత్నాల మండలంలో ని అడ్డగుట్ట గ్రామ పరిధిలోని మిషన్ భగీరథ పంప్హౌస్ను బుధవారం పరిశీలించారు. గిరి గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం మండలపంచాయ తీ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఇందులో డివిజనల్ పంచాయతీ అధికారి ఫ ణిందర్రావు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జైనథ్ పోలీస్ స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో వచ్చే గ్రామాలు, మహారాష్ట్ర సరి హద్దుతో ఉన్న స్టేషన్ల వివరాలు, నమోదవుతున్న కేసుల వివరాలపై ఆరా తీశారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మాట్లాడారు. సరిహద్దులో మహారాష్ట్ర ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలా పాలకు తావివ్వకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నా రు. అనంతరం జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా పిప్పర్వాడ టోల్ ప్లాజా, పెన్గంగ సరిహద్దుతో పాటు భోరజ్ చెక్ పోస్ట్లను ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు. -
● అప్పుడే భానుడి భగభగలు ● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● మొదలైన ఉక్కపోత ఇక్కట్లు ● దాహంతో అల్లాడుతున్న మూగజీవాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోత షురూ కావడంతో జనం ఇ బ్బందులకు గురవుతున్నారు. ఉదయం 11 దాటిందంటే ఎండ తీవ్రత తట్టుకోలేక పోతున్నారు. పగ టి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్కు చేరువైంది. బేలలో బుధవారం 39.9 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ ల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత పెరగడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగా ణచౌక్, అంబేడ్కర్,గాంధీచౌక్ ప్రాంతాలు బోసి పో యి దర్శనమిస్తున్నాయి. చిరువ్యాపారులు, ఉపాధిహామీకూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలర్లకు అతుక్కుపోయి.. ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎండవేడిమి తట్టుకునేందుకు వ్యాపారులు, ఇతర పనులకు వెళ్లేవారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు దాహార్తి తో మూగజీవాలు అల్లాడుతున్నాయి. వడదెబ్బతో అప్రమత్తం.. జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ తదితర లక్షణాలు బయట పడతాయని చెబుతున్నారు. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని పేర్కొంటున్నారు. శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని వివరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఎండ కారణంగా నిర్మానుష్యంగా బస్టాండ్ రహదారి జిల్లాలో ఆరు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో) తేదీ కనిష్టం గరిష్టం 7న 11.7 34.8 8న 13.2 36.3 9న 15.7 38.3 10న 20.7 38.0 11న 20.7 37.8 12న 39.9 19.2 జాగ్రత్తలు పాటించాలి ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎండ బారిన పడకుండా చూడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం శ్రేయస్కరం. – డాక్టర్ రమ, గైనకాలజిస్ట్ -
భర్తీ ఎప్పుడో..?
● అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల నిరీక్షణ ● జిల్లాలో 129 టీచర్, 523 ఆయా పోస్టులు ఖాళీ ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ పోస్టుల భర్తీకి మోక్షం లభించడం లేదు. ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ మహిళలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రకటించడంతో వారంతా నిరీక్షిస్తున్నారు. దీనికితోడు ఇటీవల జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొందడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయాలు ఉన్న చోట టీచర్లు లేరు. మరికొన్ని చోట్ల ఆయాలు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల క్రితం కొంత మంది అంగన్వాడీ ఆయాలకు పదోన్నతి కల్పించారు. మిగతా వారి జాబితాను సిద్ధం చేసినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో పదోన్నతులు కల్పించలేదని చెబుతున్నారు. ఆయాల పదోన్నతులు, బదిలీ ప్రక్రియ తర్వాతే పోస్టుల భర్తీకి మోక్షం లభిస్తుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఖాళీలతో తంటాలు.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. జైనథ్, నార్నూర్, ఉట్నూర్, బోథ్, ఆదిలాబాద్ అర్బన్లో ఉండగా వీటి పరిధిలో 1256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 129 టీచర్ పోస్టులు, 523 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా యి. చాలా కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేకుండానే కేంద్రాలను నడుపుతున్నారు. ఆయాలు లేకపోవడంతో పిల్లలను ఇంటి నుంచి తీసుకురా వడం, కేంద్రంలో వంట చేయడం తదితర సమస్యలు ఏర్పడుతున్నాయి. టీచర్లు లేకపోవడంతో విద్యాబోధన సాగడం లేదు. కొన్ని కేంద్రాల్లో పౌష్టికాహారం అందించి ఇంటికి పంపుతున్నారు. పిల్లల ఎత్తు, బరువు కొలతలు తదితర వివరాలు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఏడుగురికే పదోన్నతి.. మిగతా వారి సంగతేంటి? జిల్లాలో ఇటీవల 65 ఏళ్లుపైబడిన 50 మంది అంగన్వాడీ టీచర్లు, 146 మంది ఆయాలు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. అర్హతలు గల ఆయాలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐసీడీఎస్ అధికారులు ఆదరాబాదరగా కొంత మందికే పదోన్నతులు కల్పించి మిగతా అర్హులైన వారిని విస్మరించారు. కేవలం ఏడుగురికి పదోన్నతి కల్పించారు. మరోపది మందికిపైగా అర్హత గల ఆయాలు దరఖాస్తులు చేసుకున్నారు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వీరి పదోన్నతులు జరిగితే ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో.. అంగన్వాడీ కేంద్రాలు 1,256 పనిచేస్తున్న టీచర్లు 1,127 టీచర్ పోస్టు ఖాళీలు 129 పనిచేస్తున్న ఆయాలు 733 ఆయా పోస్టు ఖాళీలు 523 ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. సర్కారు ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ప్రస్తుతం టీచర్ల పదోన్నతి ప్రక్రియ జరగాల్సి ఉంది. రోస్టర్ ప్రక్రియ తయారు చేయాలి. ఇదివరకు బదిలీ అయిన టీచర్ల స్థానంలో అర్హత గల ఏడుగురు ఆయాలకు పదోన్నతి కల్పించాం. మిగతా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం. త్వరలో వారికి పదోన్నతి ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో 129 అంగన్వాడీ టీచర్లు, 523 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. – మిల్కా, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు. -
భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్పేట్ బీట్లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్జోన్ ఎఫ్ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
● రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ ● బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష డిమాండ్ ఆదిలాబాద్రూరల్: ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదిలాబాద్లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నాంవార్ శంకర్ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. టీజీఐడీసీ డిప్యూటీ ఈఈ శంకర్ ఇటీవల కాంట్రాక్టర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేఆర్కే కాలనీ సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కాంట్రాక్ట్ను కరుణాకర్రావు దక్కించుకున్నాడు. రూ.14.36 కోట్లతో జిల్లా కేంద్రానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసుకుని పనులు చేపడుతున్నాడు. విడతల వారీగా పూర్తయిన పనులకు సంబంధించి రూ.2 కోట్లు విడుదలయ్యాయి. మంజూరైన ఈ బిల్లులను డీఈఈ శంకర్ మరో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్కు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. విష యం తెలుసుకున్న నారాయణరెడ్డి మంగళవారం డిప్యూటీ ఈఈని కార్యాలయంలో కలిశాడు. తాను చేసిన పనులకు గాను మంజూరైన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. 0.5 శాతం ఇవ్వాలని సదరు అధికారి సూచించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ సమయ ంలోనే అధికారి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. తాను నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రావాలని పేర్కొన్నాడు. మంగళవారం రూ.50వేలు, మిగతా రూ. 50వేలు బుధవారం ఇవ్వాలని కాంట్రాక్టర్తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లులు విడుదలైన ప్రతీసారి కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సదరు అధికారి నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రాగా కాంట్రాక్టర్ ఆయనకు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అధికారిని కరీంనగర్కు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు కిరణ్రెడ్డి, స్వామి ఉన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. గురువారం: 5:10బుధవారం: 6:21ఇంటింటా డ్రమ్ములతో కూడిన ఈ చిత్రం పట్టణంలోని సర్వేనంబర్ 170 కాలనీలోనిది. ఈ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో పైపులైన్ పగిలి నీటి సరఫరా నిలిచింది. దీంతో కాలనీకి ట్యాంకర్ నీరే దిక్కయింది. నిత్యం రెండు ట్యాంకర్లతో 18 ట్రిప్పుల్లో సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని స్థానికులు డ్రమ్ముల్లో నిలువ చేసుకుంటున్నారు. -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. గురుజలో ఆరు నెలల పిండం కడుపులోనే చంపి.. వాగులో పడేసి.. విచారణ జరుపుతున్న పోలీసులు... -
‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి సారించండి
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీత క్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలతో మంత్రి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న స్థాని క సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కా ర్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజవర్గాల్లో పార్టీని పటిష్టం చే యాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్ద కు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ పంచా యతీ, మండల, జిల్లా పరిషత్, మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూ చించారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలా చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, పార్టీ నేతలు విఠల్రెడ్డి, రేఖానాయక్, సత్తు మల్లేశ్, ఆత్రం సుగుణ, శ్రీహరిరావు, గజేందర్, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. -
వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిభైంసారూరల్: మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు. -
‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ను ఎస్పీ అభినందించారు. ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
గ్రూప్–2లో మెరిసిన మనోళ్లు
టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.250 ర్యాంక్ సాధించిన అశోక్కుమార్● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ర్యాంకులు191 ర్యాంకు సాయిరాం కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ గ్రూప్–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–4లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ కావడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించాడు. 97వ ర్యాంక్ లెక్కల శ్రావణ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులు సాధించాడు. మెరిసిన ‘బజార్హత్నూర్’ యువకులు బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్కుమార్ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ గ్రూప్–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్ అందించిన సహకారంతో గ్రూప్–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్ కుమార్ పేర్కొటున్నాడు.337వ ర్యాంకు సాధించిన వెంకటేశ్ నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. 19వ ర్యాంక్ శివకృష్ణ ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సత్తా చాటిన యువకులు నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్, ఉష దంపతుల కుమారుడు సుమంత్ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.188వ ర్యాంకు సాయికృష్ణ సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్ హైదరబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు. గ్రూప్–1 ఫలితాల్లో సత్తా నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్లోని గురుకులంలో, ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీలో, బీటెక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.గోలేటివాసికి 229వ ర్యాంకు రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్లైన్లో కోచింగ్, సొంత ప్రిపరేషన్తో గ్రూప్–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్ అంటున్నాడు. భాస్కర్శ్రావణ్కుమార్ -
‘ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’
ఆదిలాబాద్టౌన్: సీసీఐ ఫ్యాక్టరీ, ఎయిర్పో ర్టు విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, చేతకాకపోతే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ పరిశ్రమను తుక్కు కింద అమ్మేయడానికి టెండర్లు ప్రకటించిన విషయాన్ని బయట పెట్టడంతో దానిపై వారిద్దరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎయిర్పోర్టు విషయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు నిజమైతే తన స్వగ్రామమైన జాతర్లలోని శివాలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు. తాను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అభివృద్ధి చేశానే తప్ప మోసపూరిత మాటలు చెప్పలేదని గుర్తు చేశారు. పరిశ్రమల విషయంలో యు వతతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నా రు. అబద్దాలతో కాలయాపన చేసే బదులు రాజీనామా చేయడం ఉత్తమమని హితబోధ చేశారు. 11 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధి కారంలో ఉన్నా సీసీఐ పరిశ్రమను పునః ప్రారంభించకపోవడం వారి అసమర్థతే కారణమన్నారు. వాటి సాధన కోసం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నా రు. ఇందులో నాయకులు నారాయణ, అజ య్, ప్రహ్లాద్, రాజు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆదిలాబాద్: ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. 100 రోజుల్లోనే అన్నింటిని అమలు చేస్తామని శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం వాటికి నిధుల కేటాయింపులో సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో హామీల అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. విమానాశ్రయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ఎన్ఓసీ ఇవ్వడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. మరోవైపు సీసీఐ విషయంలో సైతం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనల విషయంలో తాను ప్రజాప్రతినిధిగా లేకపోయినా ఎంతగానో కృషి చేశానన్నారు. ఇవన్నీ మర్చిపోయి వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం సబబు కాదన్నారు. తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల సంక్షేమానికి పెద్దపీట
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మ హిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల ఆరోగ్యంపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆడ పిల్లల చదువును ప్రోత్సహించాలన్నారు. పని ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. మహిళలు ఆర్థిక స్వా లంబన దిశగా ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడ సమాజం సంతో షంగా ఉంటుందన్నారు. అనంతరం పలు స్వచ్ఛంద సంస్థలు, జిల్లా అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ మిల్కా, డీఈవో ప్రణీత, టీబీ నివారణ అధికారి డాక్టర్ సుమలత, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, నాగమణి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీ కేర్..‘సెల్’!
ఆదిలాబాద్టౌన్: చెడిపోయిన ఫోనే కదా.. ఇంట్లో నిరుపయోగంగా ఉండడం కంటే స్క్రాప్లో విక్రయిస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయి.. లేదా ఇంట్లో పనికొచ్చే గిన్నెలు, ప్లాస్టిక్ డబ్బాలతో ఏదైనా ఉపయోగం ఉంటుందని జనం అనుకుంటుంటారు. అయితే ఆ పాత ఫోన్లే కొంప ముంచుతున్నాయి. వాటిని విక్రయించిన వారికి సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడినప్పుడు ఫోన్ విక్రయించిన వారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తీరా మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పల్లెల్లో చిక్కు వెంట్రుకలకు గిన్నెలు, డబ్బాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహా వ్యాపారానికి బిహార్కు చెందిన ఓ ముఠా తెరలేపింది. గ్రామాల్లో మోటార్సైకిల్పై డబ్బాలు కట్టుకొని పాత సెల్ఫోన్లు కొంటాం.. అంటూ తిరుగుతున్నారు. విషయం తెలియని అమాయకులు వారికి ఎంతో కొంతకు విక్రయిస్తున్నారు. లేదా వస్తువులు తీసుకొని ఇచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలో బిహార్ ముఠా ఏకంగా 2వేలకు పైగా పాత సెల్ఫోన్లను కొనుగోలు చేసి ఆ రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండగా, జిల్లా పోలీసులు పసిగట్టి వారి గుట్టురట్టు చేశారు. సైబర్ కేటుగాళ్ల ప్లాన్ ఇలా.. ● బిహార్కు చెందిన ముఠా ద్విచక్ర వాహనాలపై పల్లె, పట్టణాల్లో తిరుగుతూ చెడిపోయిన సెల్ఫోన్లతో పాటు పనిచేసే వాటిని తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెలు అందజేస్తారు. ఇలా సేకరించిన వాటిని ఢిల్లీకి చెందిన డీలర్లకు ఒక్కోటి రూ.100 చొప్పున విక్రయిస్తారు. వారు వాటిని కాంబోడియా, ఫిలిప్పైన్స్, లాంగోస్, సౌత్ఈస్ట్ ఏసియా దేశాలకు తరలించి సైబర్ నేరాలకు పాల్పడే వారికి విక్రయిస్తారు. అక్కడ వాటికి రిపేర్లు చేసి అందులో ఐఎంఈ నంబర్తో సెల్ఫోన్ వినియోగదారు సమాచారం సేకరిస్తారు. మరోవైపు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఆయా దేశాలకు చెందిన సైబర్మోసగాళ్లు వల విసురుతారు. ఇక్కడి నుంచి సింగాపూర్కు తీసుకెళ్లి వారి వీసాను లాక్కుంటారు. తిరిగి వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది సైబర్ మోసగాళ్లు చెప్పే పనులకు బలవుతుంటారు. ఆయా భాషల్లో నైపుణ్యం సాధించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బ్యా ంకు ఉద్యోగులు, పోలీసు అధికారులుగా, పార్ట్టైమ్ జాబ్ కల్పిస్తామని వారితో ఫోన్లు చేయిస్తారు. లింకులు, ఓటీపీల ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బును కాజేస్తారు. అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు సైతం వీరి వలలో పడుతున్నారు. రూ.లక్షల్లో మోసపోతున్నారు. ఇటీవల పెరుగుతున్న కేసులు.. జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులు వారి ఉచ్చులోపడి నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 200 వరకు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 86 కేసులున్నాయి. బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1 కోటి 50లక్షల వరకు దోచుకున్నారు. అయితే కొన్ని డబ్బులను బ్యాంకుల్లో సైబర్ పోలీసులు ఫ్రీజింగ్ చేశారు. గతేడాది మూడు లోక్ అదాలత్లలో రూ.17లక్షల 60వేలను బాధితులకు అందజేశారు. ఈ ఏడాది 15 కేసుల వరకు నమోదయ్యాయి. రూ.5లక్షల వరకు సైబర్ మోసగాళ్ల చేతిలో నష్టపోయారు. ఖాతా మాయమే.. బ్యాంకు ఖాతా మనదే అయినప్పటికీ మనం విక్రయించే ఫోన్లు, ఇతర వివరాలు తెలుపడంతో అందులో ఉన్న డబ్బులను మనకు తెలియకుండగానే కాజేస్తున్నారు. ఫోన్లను హ్యాక్ చేసి ఓటీపీలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా బాధితులు నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మన మెయిల్, ఫేస్బుక్లను హ్యాక్ చేసి సందేశాలను పంపుతూ కొల్లగొడుతున్నారు. ఇటీవలే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలా అని, మీ పిల్లలు మత్తు పదార్థాల కేసుల్లో ఇరుక్కుపోయారని, పోలీసులమని బెదిరింపులకు పాల్పడుతూ మోసగాళ్లు బాధితుల ఖాతాల్లో నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. పాత మొబైల్స్ ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త మరమ్మతులు చేసి వాటి ద్వారానే సైబర్ మోసాలు లబోదిబోమంటున్న బాధితులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు‘పాత ఫోన్లకు.. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం’ అంటూ వీధుల్లో తిరిగే వారికి పాడైపోయిన మీ సెల్ఫోన్లు ఇస్తున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. లేకుంటే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అందులోని డేటాతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో తాజాగా ఈ ముఠా గుట్టు రట్టయింది. అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొందరు గ్రామాలకు వచ్చి పాత సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. పని చేయని మొబైల్స్ను ఎవరికీ విక్రయించొద్దు. ఎవరికై న ఫోన్లు విక్రయించినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కొంత మంది అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు కూడా నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే టోల్ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. www. cybercrime. comలో ఫిర్యాదు చేయాలి. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
● బల్దియా పరిధిలో ‘భగీరథ’ లీకేజీలు ● నిత్యం 8ఎంఎల్డీల వరకు నీరు వృథా ● మూడు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా ● స్పందించకుంటే నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం
ఇక్కడ కనిపిస్తున్నవి పట్టణంలోని ఆర్టీవో కార్యాలయ సమీపంలో గల మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ దృశ్యాలు. ఫలితంగా నీరంతా ఇలా రోడ్డుపై వృథాగా పోతోంది. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లా కేంద్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.●ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఇప్పటికై తే పట్టణంలో నీటి సమస్య అంతగా లేదు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఏప్రిల్ 15 నాటికి లాండసాంగ్వీ పంప్హౌస్లో సమస్య తలెత్తే అవకాశముంది. దీనిని అధిగమించేందుకు ట్యాంకర్లను పెంచేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. లీకేజీలను అరికట్టేందుకు దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని తగు చర్యలు తీసుకుంటాం. – పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్ కై లాస్నగర్: గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్, వాల్వ్ల లీకేజీల కారణంగా నిత్యం వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. సకాలంలో గుర్తించకపోవడం, మరమ్మతు పనుల్లో జాప్యం అవుతుండడంతో పలు కాలనీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా మార్చిలోనే నీటి గోస మొదలైంది. ప్రస్తుతం పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్ది భూగర్భజలాల మట్టం తగ్గి నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. బల్దియా అధికారులు మేల్కొని ప్రత్యేక దృష్టి సారించకుంటే ఈ వేసవిలో పట్టణవాసులకు నీటి తిప్పలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పలుచోట్ల ట్యాంకర్ల ద్వారా.. బల్దియా పరిధిలో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ కేఆర్కే కాలనీ, భగత్సింగ్నగర్, ఖర్షీద్నగర్ వంటి కాలనీల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. దీంతో ఆయా చోట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బల్దియాకు సంబంధించి ఆరు ట్యాంకర్లు ఉండగా మరో మూడింటిని అద్దె ప్రాతిపాదికన తీసుకున్నారు. ప్రస్తుతం 170 సర్వేనంబర్ కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. అక్కడ సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపడుతుండటంతో భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో ఆ కాలనీలకు ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఒక్కో ట్యాంకర్ రోజుకు తొమ్మిది ట్రిప్పుల చొప్పున సరఫరా చేస్తున్నాయి. మిగతా కాలనీల్లోనూ సమస్య తలెత్తితే మరిన్ని ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజు విడిచి రోజు సరఫరా ఆదిలాబాద్ పట్టణానికి రోజుకు 31.90 ఎంఎల్డీల నీరు అవసరం. ప్రస్తుతం 24ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఇందులో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాటేగాం సమీపంలోని ఫిల్టర్బెడ్ నుంచి రోజుకు 18ఎంఎల్డీల నీరు మిషన్ భగీరథ ద్వారా అందుతోంది. అయితే కొన్ని కాలనీల కు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వీ పంప్హౌస్ నుంచి 6ఎంఎల్డీలు సరఫరా అవుతుండగా ఇక్కడి నుంచి 17 వార్డులకు నీటిని అందిస్తున్నారు. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మావల చెరువు నుంచి 1.5 ఎంఎల్డీల నీరు ఫిల్టర్బెడ్కు అందుతుంది. ఇక్కడి నుంచి ఏడు వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణంలోని 24 వార్డులకు నిత్యం నీటిని సరఫరా చేస్తుండగా మరో 25 వార్డులకు మాత్రం రోజు విడిచి రోజు అందిస్తున్నారు. -
బాడీబిల్డింగ్ ఓవరాల్ చాంపియన్ వెంకటేశ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీబిల్డంగ్ ఓవరాల్ చాంపియన్గా మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన మాసు వెంకటేశ్ నిలిచాడు. సీసీసీలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ జూనియర్, సీనియర్, మాస్టర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. మాసు వెంకటేశ్ అన్ని కేజీల విభాగాల్లో మంచిర్యాల జిల్లా చాంపియన్గా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చాంపియన్ ఆఫ్ ద చాంపియన్ పోటీల్లోనూ విజేతగా నిలిచాడు. -
శాశ్వత నిద్రలోకి..
● ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి ● ఇచ్చోడలో ఘటన ఇచ్చోడ/బోథ్/నార్నూర్/ఉట్నూర్రూరల్: ఏమైందో ఏమో కాని నిద్రలోనే ఆ విద్యార్థి తిరిగి రాని లోకాలకు చేరింది. ఈ ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బజార్హత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన చిక్రం లాలిత్య (14) పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం తోటి విద్యార్థులతో కలిసి మొదటి అంతస్తులో నిద్రకు ఉపక్రమించింది. సోమవారం ఉదయం 6 గంటలకు విద్యార్థులంతా నిద్రలేచారు. ఆమె మాత్రం పడుకుని ఉండగా స్నేహితులు వచ్చి లేపేందుకు యత్నించగా స్పందించలేదు. నోటి నుంచి తెల్లటి నురుగు ఉండగా వెంటనే వసతి గృహ సిబ్బందికి తెలిపారు. హెచ్ఎం కాత్లె ఉత్తం దాస్ అక్కడికి చేరుకుని విద్యార్థినిని పరిశీలించి మృతిచెందినట్లుగా గుర్తించాడు. వెంటనే పోలీసులతోపాటు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గత ఆదివారమే తమ బిడ్డను కలిసివెళ్లినట్లు వారు విలపిస్తూ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు యత్నించగా విద్యార్థిని తండ్రి రాజేశ్వర్ తమ బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అడ్డుకున్నాడు. పక్కనే పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగచేయవద్దని సూచించి రాజేశ్వర్ను అక్కడి నుంచి మృతదేహం వెంట బోథ్కు తరలించారు. పంచనామా అనంతరం మృతదేహన్ని వారికి అప్పగించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం రూ.10 వేలు కుటుంబానికి అందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బాలిక మృతిచెందిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కాగా, విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ అన్నెల లక్ష్మణ్, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట, ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టాయి. ధర్మసమాజ్ పార్టీ, సీపీఐ నాయకులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ విషయమై నాయకులు ఐటీడీఏ డీడీ వివరణ కోరగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. మృతిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖష్బుగుప్తాకు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం నగేశ్ వినతిపత్రం అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
నాలుగు గంటల సాధన
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన రాజశేఖర్–సుగుణ దంపతుల కుమార్తె బి.స్వాతి. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, జావెలిన్ త్రో ఈవెంట్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటలు సాధన చేస్తున్నానని చెబుతోంది. మరిన్ని క్రీడా ఈవెంట్లలో సత్తా చాటడానికి, నిరంతరం క్రీడా నైపుణ్యాలు అలవర్చుకుంటానని తెలుపుతోంది. – స్వాతి -
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమే లక్ష్యం
నిర్మల్ జిల్లా చిట్యాలకు చెందిన రాజు–సరోజ దంపతుల కుమార్తె దివిటి అరుణ. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) సెకండియర్ చదువుతోంది. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హ్యమర్ త్రో, డిస్కస్ త్రో ఈవెంట్లలో మొత్తం ఐదు పతకాలు సాధించింది. హ్యమర్ త్రోలో రెండు రజతం, 2 కాంస్య, డిస్కస్ త్రోలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తానని ధీమాగా చెబుతోంది. – అరుణ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేరడిగొండ: మండలంలోని బోరిగాం బస్టాండ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బొడిగే గణేశ్ (26) ఆదివారం రాత్రి నిర్మల్లో ఉంటున్న ఆయన భార్య వద్దకు బైక్పై వెళ్తున్నాడు. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. గోడ మీదపడి కూలీ.. రెబ్బెన: మండలంలోని నవేగాంలో కూలీపై గోడపడి మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవేగాం గ్రామానికి చెందిన కొద్దెన లస్మయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామానికి చెందిన బొల్లు తిరుపతి ఇంటి పనుల కోసం సోమవారం లస్మయ్యను కూలీని పిలిచారు. పని నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా లస్మయ్యపై గోడ కూలి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కాగజ్నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న రాజయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరు.. ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన పిండి విజయ్ (36) ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. విజయ్ ఇంటి అవసరం నిమిత్తం కట్టెలు ఏరేందుకు మండలంలోని కామాయిపేట అటవీ ప్రాంతానికి ఆదివారం వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేయగా గ్రామ సమీపంలోని కుంటలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. ఆదివారం రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం కుంట వద్ద చెప్పులు చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వడంతో స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదంగా యువకుడు.. ఆదిలాబాద్రూరల్: మావల శివారు ప్రాంతంలో గల ఎర్రకుంటలో ఒకరు అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మావల గ్రామానికి చెందిన షేక్ ఫర్వేజ్ అదే గ్రామంలోని పెట్రోల్ పంపులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం ఎర్రకుంట ప్రాంతం వైపు వెళ్లిన మావలకు చెందిన సతీశ్.. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి రెహనా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అథ్లెటిక్స్లో మెరిశారు..
● ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పతకాలతో సత్తాచాటుతూ.. ● అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వారందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అయినప్పటికీ భవిష్యత్లో ఉన్నతంగా ఎదగాలని చదువును కొనసాగిస్తూనే క్రీడారంగాన్ని ఎంచుకున్నారు. అథ్లెటిక్స్లో నిరంతరం సాధన చేసి ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు దేశం తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – ఆదిలాబాద్శిక్షకుల ప్రోత్సాహంతోనే.. బేల మండలం సిర్సన్నకు చెందిన ఎస్కే ఫిరోజ్– షరీఫా దంపతుల కుమార్తె ముస్కాన్. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డీ.పెడ్ కోర్సు చేస్తున్న ఆమె హ్యామర్త్రో ఈవెంట్లో మూడు పతకాలు సాధించింది. హైదరాబాద్, హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, రజతం, ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో కాంస్య పతకాలతో మెరిసింది. శిక్షకులు రేణుక, వీజీఎస్ రాకేశ్ ప్రోత్సాహంతో రాగలిగింది. జాతీయ అథ్లెటిక్స్ శిక్షకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. – ముస్కాన్ అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఇచ్చోడ మండలం దేవుల్ నాయక్ తండాకు చెందిన రమేశ్ రాథోడ్–లక్ష్మీబాయి దంపతులకు కుమారుడు రాథోడ్ వంశీ. గతేడాది జూలైలో నేపాల్లో జరిగిన టార్గెట్ బాల్పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భారత్ రెండో స్థానంలో నిలువగా, వెండి పతకం నిలబెట్టుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో హామర్ త్రో ఈవెంట్లో రెండుసార్లు రజత పతకాలు సాధించగా, ఓసారి కాంస్య పతకంతో విజేతగా నిలిచాడు. కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రాతినిధ్యం వహించి రాణించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా కావడమే లక్ష్యంగా ప్రతీరోజు నాలుగు గంటలు మైదానంలో శ్రమిస్తున్నాడు. – వంశీ గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యం.. ఆదిలాబాద్కు చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్రసిద్ధార్థ.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఐదో తరగతి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తున్నాడు. అథ్లెటిక్స్లో రేస్వాక్ ఈవెంట్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం గెలుపొందాడు. 2022లో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించాడు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూనే, తన చిన్ననాటి కల అయిన గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. – డి.చంద్రసిద్ధార్థ ఎన్ఐఎస్ శిక్షకుడినవుతా బజార్హత్నూర్ మండలం మంజారం తండాకు చెందిన గురుదయాల్ సింగ్–శారదబాయి దంపతుల కుమారుడు అజాడే అనిల్. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈయన అథ్లెటిక్స్లో హేమర్ త్రో, స్టీపుల్ చేజ్, ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు. 2019 పూణెలో జరిగిన స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఒక వెండి, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్గా వ్యవహరించడమే తన లక్ష్యమని, ఇందుకోసం శిక్షకులు వీజీఎస్ రాకేశ్, వీజీఎస్ జోల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నా. – అజాడే అనిల్ -
అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకం
ఉట్నూర్రూరల్: అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు..ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులకు లంచ్ బాక్స్లు అందజేశారు. నారీశక్తి పురస్కారాల ప్రదానంనిర్మల్ఖిల్లా: అన్నిరంగాల్లో మహిళలు రాణించడం శుభ పరిణామమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం ‘పాటే మా ప్రాణం’సంగీత ఆకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ’నారీశక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్లు రజిని, చంద్రిక, న్యాయవాది నివేదిత, సుగుణ, ఎస్సై రోహిణి, ఎఫ్ఆర్వో శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాణి, కేజీబీవీ ఎస్ఓ లతాదేవి, విజయలక్ష్మి, స్వాతి, లక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మి పురస్కార గ్రహీతలు ఉన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ప్రముఖవైద్యులు యు.కృష్ణంరాజు, సంగీత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య, కార్యదర్శి శ్రీకాంత్ సభ్యులు వాణిశ్రీ, కవిత, మమత, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
తాంసి: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్నాగాపూర్కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి..తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు. -
వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను
నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిన్నయ్య–చిన్నక్క దంపతుల కుమార్తె సీహెచ్. వసంత. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటుతోంది. పోటీల్లోని ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో ఈవెంట్లలో ఇప్పటివరకు 8 పతకాలు సాధించింది. యూనివర్సిటీ లెవల్లో హ్యామర్ త్రో ఈవెంట్లో కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్న ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ఎంచుకుంటా అంటోంది. – సీహెచ్. వసంత -
వేధింపులా..‘181’కు కాల్ చేయండి
కైలాస్నగర్: వేధింపులకు గురయ్యే మహిళలు హెల్ప్లైన్ 181కు కాల్ చేసి లేదా www. shebox. nic. in వెబ్సైట్ ద్వారా లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక పరిష్కార చట్టం–2013పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఈ చట్టంపై ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు. వేధింపులను నియంత్రించడంలో భాగంగా ఫిర్యాదు చేసేందుకు ప్రతీ కార్యాలయంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్టం ఆవశ్యకతను తెలిపే పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఫ్రీడం పార్కులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టన్ అభిగ్యాన్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్కు హాజరైన కలెక్టర్.. రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్ఠలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్వో వాజిద్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో కలెక్టర్ పా ల్గొని మాట్లాడారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎల్పీవో ఫణింద్రరావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘స్పాట్’ రెమ్యూనరేషన్ చెల్లించాలి
ఆదిలాబాద్టౌన్: 2024లో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్కు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు రామగిరి శివకుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో జిల్లా వి ద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెమ్యూనరేషన్ చెల్లించని పక్షంలో ఈ సారి స్పాట్ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇందులో సంఘం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి విద్యాసాగర్రెడ్డి ఉన్నారు. -
నేరాల నియంత్రణపై ఫోకస్
● ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతలపై నిఘా ● సంఘవిద్రోహ శక్తుల కట్టడికి చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: జిల్లాలో నేరాల అదుపు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపా దం మోపుతానని జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. సాక్షి: సర్, గుడ్మార్నింగ్.. వెల్కం ఆదిలాబా ద్. మీ నేపథ్యం, ఐపీఎస్ శిక్షణ.. ఇప్పటివర కు ఏయేప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు? ఎస్పీ: స్వస్థలం వచ్చి కశ్మీర్. పాఠశాల విద్య అక్కడే సాగింది. ఆ తర్వాత హైదరాబాద్లో ని జేఎన్టీయూలో పట్టభద్రుడిని అయ్యా ను. అమ్మ ఊర్మిళ గృహిణి. నాన్న రాకేశ్ వ్యా పారి. భార్య దివ్యాన్షి డాక్టర్. నాది 2017 ఐపీఎస్ బ్యాచ్. మొదటగా సిద్దిపేటలో శిక్షణ పూర్తి చేశాను. తర్వాత మంచిర్యాల ఏసీపీ, డీసీపీగా పెద్దపల్లి, రామగుండం డీసీపీగా, సిరిసిల్ల ఎస్పీగా పనిచేశాను. సాక్షి:జిల్లాలో మాదకద్రవ్యాలు, పేకాట నిర్మూ లనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? ఎస్పీ: మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండా లి.విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తే స మాచారం అందించాలి. క్రైమ్ రేట్ను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. గుట్కా, మట్కా, పేకాటపై దృష్టి సారిస్తాం. సాక్షి: మీ ప్రాధాన్యత అంశాలు..? ఎస్పీ: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటాం. నేరాలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తాం. అసాంఘిక కార్యకలాపాల కు తావు లేకుండా చూస్తాం. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాతో పాటు సంఘ విద్రోహ శక్తుల కట్టడికి కృషి చేస్తాం. రౌడీ షీటర్లపై నిఘాతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు..? ఎస్పీ: విషయం నా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక చర్యలు చేపడతాం. అంతేకా కుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారి స్తాం. బ్లాక్స్పాట్లను గుర్తించి అవసరమైన చర్యలు చేపడతాం. సాక్షి: మహిళల భద్రత కోసం ఎలా ముందుకెళ్తారు..? ఎస్పీ: మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. షీటీంల ద్వారా మహిళలు, యు వతులు, విద్యార్థినులకు అవగాహన కల్పి స్తాం. అవసరమైతే అదనంగా బృందాలను ఏర్పాటు చేస్తాం. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరా లు పనిచేయట్లేదు. దొంగతనాలు, ప్రమాదా లు జరిగిన సమయంలో గుర్తించలేని పరిస్థి తి ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: జిల్లాకేంద్రంలోని అన్ని చౌక్లు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూస్తాం. అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తాం. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయి. ప్రజలు, వ్యాపారులు వీటి ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. సంఘటనలు జరిగినప్పుడు పోలీసు దర్యాప్తు సులువు అవ్వడంతో పాటు ఫుటేజీ ఆధారంగా ఉంటుంది. సాక్షి: మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు..? ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ వారి కదలికలపై చర్యలు చేపడతాం.అమాయక గిరిజన యు వత అటువైపు ఆకర్షితులు కాకుండా అవగా హన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడడంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం.బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ..నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు పోలీసులు గౌ రవ వందనం చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసి కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న గౌస్ ఆలం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయమన్నారు. ఇందులో అదనపు ఎస్పీ సురేంద్రరావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్రెడ్డి,నాగేందర్,హసీబుల్లా తదితరులున్నారు. -
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కై లాస్నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిషాన్ఘాట్లోని సర్వేనంబర్ 38లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, కాలనీలో ఎనిమిదేళ్లుగా నిరుపేదలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచా రకరమన్నారు. కలెక్టర్ చొరవ చూపి కాలనీ లో విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు క ల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ నాయకులు గంగారెడ్డి, దేవిదాస్, కేశవ్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పూలే దంపతులను భారతరత్నతో గౌరవించాలి
● మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే ఆదిలాబాద్రూరల్: సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న ప్రకటించి గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా విద్య కోసం జ్యోతిరావు పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి భారతరత్నతో గౌరవించాలన్నారు. ఇందులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న, కోశాధికారి సతీశ్ గురుణులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్రావు డోలే, మాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు అనిల్, శ్రీను ఆచారి, హరీశ్, భాస్కర్ నందిని, తదితరులున్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
ఆదిలాబాద్టౌన్: వైకల్యం గల పిల్లలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో అలింకో, విద్యశాఖ ద్వారా దివ్యాంగులకు సోమవారం ఉపకరణాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 123 మంది చిన్నారులకు సీపీ చైర్, కృత్రిమ అవయవాలు, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, రోలేటర్ తదితర పరికరాలను అందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ,దివ్యాంగులు సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, శ్రీకాంత్గౌడ్, ఎంఈవోలు సోమయ్య, శ్రీనివాస్,హెచ్ఎంలు లచ్చిరాం, లక్ష్మణ్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
● నిర్వాహకులు, అధికారులకు కల్పతరువులా ‘ఔట్సోర్సింగ్’ ● కొత్త ఎంప్యానల్మెంట్ను మరిచిన యంత్రాంగం ● ఐదేళ్లుగా పాత వాటికే వర్క్ఆర్డర్ల రెన్యూవల్ ● కొత్త పోస్టులు మంజూరైనా వాటికే అప్పగింత!
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు.. ఎంప్యానల్మెంట్ గుర్తించిన సంవత్సరం : 2019–20 ఎంప్యానల్మెంట్లో ఉన్న ఏజెన్సీలు : 17 యాక్టీవ్గా ఉన్న ఏజెన్సీలు : 09 వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ పోస్టులు : (సుమారు) 1250సాక్షి,ఆదిలాబాద్: ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు.. ఇటు నిర్వాహకులకు, అటు అధికారులకు ఎనీ టైమ్ మనీలా మారిపోయాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వాటిని ఆ శాఖలు వదులుకోవడం లేదు. ఐదేళ్లుగా వాటికే వర్క్ ఆర్డర్లు ఇస్తూ రెన్యూవల్ చేస్తున్నారు. కొత్త పోస్టులు మంజూరైనా వాటికే పంచేస్తున్నారు. సాధారణంగా ఏటా లేనిపక్షంలో రెండేళ్లకోసారి ఏజెన్సీల మార్పు చేపట్టాలి. ఇందుకోసం కొత్త ఎంప్యానల్మెంట్ రూపొందించాలి. అయితే ఈ ప్రక్రియకు ఐదేళ్లుగా బ్రేక్ పడడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఏర్పాటైనవే.. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సర్వీసులను ఏజెన్సీలు చేపడతాయి. ఆ ఏజెన్సీలకు వీటి నియామక ప్రక్రియ అప్పగించేందుకు ముందుగా అవి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి. దాన్నే ఎంప్యానల్మెంట్ అంటారు. 2019–20 సంవత్సరంలో దీనికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఏజెన్సీలను గుర్తించారు. ఆ తర్వాత ఏటా వాటి గడువు పొడగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఐదేళ్లవుతుంది. ఔట్సోర్సింగ్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్కు ఈ టెండర్ల నిర్వహణకు సంబంధించి విచక్షణ అధికారాలు ఉంటాయి. జిల్లాలో ఎంప్యానల్మెంట్ నుంచి మొదలుకొని వర్క్ ఆర్డర్.. ఇలా ప్రతీ అంశంలో గతంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎంప్యానల్మెంట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు చేపట్టి దీన్ని గాడిలో పెట్టేందుకు ఏవైన చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిందే. అడ్డూ అదుపులేని ఏజెన్సీల అక్రమాలు.. గతంలో బీసీ సంక్షేమ శాఖలో అక్షర ఏజెన్సీకి సంబంధించి అక్రమం వెలుగు చూసింది. ఇందులో కింది స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగులైన కుక్, వాచ్మెన్, తదితర ఉద్యోగులకు సంబంధించి ఈ ఏజెన్సీ నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా, అటు వారికి సంబంధించి పీఎఫ్ కట్టకుండా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల బిల్లులను డ్రా చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో శ్రీసాక్షిశ్రీ వెలుగులోకి తెచ్చింది. అయితే విస్తుపోవాల్సిన అంశం ఏమిటంటే.. ఆ అక్షర ఏజెన్సీ అసలు ఎంప్యానల్మెంట్ జాబితాలోనే లేదు. ఇకపోతే ఇటీవల రిమ్స్లోనూ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల విషయంలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత ఏజెన్సీల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అప్పట్లో ఎంప్యానల్మెంట్లో 17 ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను గుర్తించారు. వాటికి మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. మధ్యలో వీటి సంఖ్య 20కి పెరిగినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటయ్యే వరకు పాత వాటిలో ముందుగా గుర్తించిన ఏజెన్సీలను మినహాయిస్తే మిగతా వాటిని చేర్చేందుకు ఆస్కారం ఉండదు. అయితే జిల్లాలో గతంలో ఉపాధికల్పన శాఖ అధికారులుగా చేసిన వారు పలు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఇలా అదనంగా ఏజెన్సీలు ఎలా పుట్టుకొచ్చాయన్నది జిల్లా ఔట్సోర్సింగ్ కమిటీకి తెలిసే జరిగిందా.. తెలియక జరిగిందా.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఏసీబీ దాడుల్లో ఉపాధికల్పన శాఖ అధికారులు పట్టుబడ్డారు. ఓ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చే విషయంలో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అప్పటినుంచే జిల్లాలో ఉన్న ఎంప్యానల్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో అస్తవ్యస్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ తీరును కమిటీ గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా ఉన్న ఈ ఎంప్యానల్మెంట్ను రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పనలో అర్హులైన నిరుద్యోగులకు ఆసరగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు చర్యలు.. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. విధివిధానాలు రూపొందిస్తున్నాం. పాత దాని గడువు ఈ మార్చి 31తో ముగిసిపోతుంది. సాధారణంగా ఎంప్యానల్మెంట్ గడువు కొన్ని జిల్లాల్లో ఏడాది, మరికొన్ని జిల్లాలో రెండేళ్ల పాటు ఉంటుంది. జిల్లాలో కొన్నేళ్లుగా పాత ఎంప్యానల్మెంటే కొనసాగుతుంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రక్రియ చేపడతాం. –మిల్కా, ఉపాధికల్పనశాఖ ఇన్చార్జి అధికారి -
జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేను
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేనని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా పోలీ సు అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గజమాలతో సత్కరించారు. ప్రత్యేకంగా అలంకరించిన జీపులో ఉన్న ఎస్పీ కుటుంబీకులపై పూల వర్షం కురిపించారు. అనంతరం పోలీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెడ్క్వార్టర్స్ వరకు తాడుతో లాగి తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాను, ఇక్కడి సిబ్బందిని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. 14 నెలల పాటు చేసిన సేవలు, పోలీసులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్, హసీబుల్లా, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బదిలీ వీడ్కోలు సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం పూల వర్షం కురిపించిన పోలీస్ అధికారులు -
‘మోడల్’ స్కూల్ టీచర్లపై వేటు
బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కు చెందిన ముగ్గురు టీచర్లపై వేటు పడింది. కాంట్రాక్ట్ ఒకేషనల్ ఉపాధ్యాయుడు అజయ్, అవర్లీ బెస్డ్ టీచర్లు జ్ఞానేశ్వర్, ఉమేష్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఈ మోడల్ స్కూల్ విద్యార్థులను విజ్ఞాన యా త్రకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రాజర్షిషా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి బాధ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.‘సీఎం ప్రజావాణి’ సద్వినియోగం చేసుకోండికై లాస్నగర్: సీఎం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరికొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆయా మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నిబంధనలు తూచ్..
● అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ ● ప్రభుత్వానికి పన్ను చెల్లించని నిర్వాహకులు ● కార్మికులకు కరువైన వసతులు ● అయినా పట్టించుకోని అధికారులుఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇటుక బట్టీల దందా జోరుగా సాగుతోంది. నిర్వాహకులు నిబంధనలు పాటించకున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటుక బట్టీ వ్యాపారం చేసే ముందు గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్, మైనింగ్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే జిల్లాలో ఏ వ్యాపారి కూడా ఈ అనుమతులు తీసుకోకుండా దందా నిర్వహిస్తుండడం గమనార్హం. వీరంతా రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నా సర్కారుకు రూపాయి పన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఇందులో పనిచేసే కార్మికులకు సైతం కనీస సౌకర్యాలు అందని పరిస్థితి. వారి పిల్లల బాల్యం సైతం బట్టిల్లోనే మగ్గుతోంది. చిరుప్రాయంలోనే ఆ పసి మొగ్గలు బాల కార్మికులుగా మారుతున్న దుస్థితి. కార్మికులకు సౌకర్యాలు కరువు జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. అయితే నిర్వాహకులు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. మావల మండల కేంద్రం, బట్టిసావర్గాం, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ, అంకోలి, తంతోలి, బంగారుగూడ, తలమడుగు మండలంలోని కజ్జర్ల, ఉండం, తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో ఈ బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పనిచేసేందుకు కార్మికులను జిల్లాతో పాటు మహా రాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నిర్వాహకులు తీసుకొస్తున్నారు. ఊరికి దూరంగా, అటవీ ప్రాంతాలు, పంట పొలాల్లో బట్టీలను నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు ఉండవు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళలో విషకీటకాల బారిన పడిన ఘటనలు సైతం ఉన్నాయి. బట్టీల్లోనే బాల్యం.. వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్ల లు సైతం ఇటుక బట్టీల్లోనే పనులు చేస్తున్నారు. ని బంధనల ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు వారు ఎ లాంటి పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఏ బట్టీ వద్ద చూసినా బాలకార్మికులు దర్శనమిస్తుండడం గమనార్హం. బడిలో గడపాల్సిన బాల్యం బట్టీల్లో మగ్గుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నోటీసులు జారీ చేస్తాం..నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతాం. వ్యాపారులు సంబంధిత గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్ అనుమతి పొందిన తర్వాత మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సర్టిఫికెట్ జారీ చేస్తాం. పంచాయతీ శాఖ అధికారుల నుంచి ఏయే జీపీల్లో ఇటుక బట్టీలు ఉన్నాయో వివరాలు సేకరిస్తాం. – రవీందర్, మైనింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
బదిలీపై వెళ్తున్న ఎస్పీకి సన్మానం
ఆదిలాబాద్టౌన్: కరీంనగర్ సీపీగా బదిలీ పై వెళ్తున్న ఎస్పీ గౌస్ ఆలంను సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు శనివా రం మర్యాదపూర్వకంగా కలిశా రు. అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్ర జల సహకారం తనకు పూర్తిగా లభించిందని పేర్కొన్నారు. ఇందులో సమితి ప్రతి నిధులు సూ ర్యకాంత్, రవీందర్, సుభాష్, నర్సింలు, కిషన్రావు తదితరులున్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో... యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు. ఇందులో నాగరాజు రాకేశ్, ఫిరోజ్, జితేందర్, రవీందర్ తదితరులున్నారు. -
రాజీమార్గం రాజమార్గం
ఆదిలాబాద్టౌన్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుని కక్షిదారులు ప్రశాంతమైన జీవనం గడపాలని జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కుదుర్చుకున్న పలు కేసులను పరిష్కరించి క్షకిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతోనే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రాజీపడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల సమ్మతితో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులపై ఎలాంటి భయం, ఒత్తిడి పెట్టబోమన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై అప్పీల్కు వెళ్లే అవకాశం కూడా ఉండదన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, జడ్జిలు ప్రమీళజైన్, కలిందే తులసి, దుర్గారాణి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయమూర్తులకు సన్మానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, ప్రతి ఒక్కరూ వారికి సముచిత గౌరవం ఇవ్వాలని జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఉద్యోగులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● జడ్జి శివరాం ప్రసాద్ -
ఈఎస్ఐ ధీమా!
● ఆదిలాబాద్, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబా లకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్ఐ(కార్మి క రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ పట్టణం శాంతినగర్లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్, పేపర్ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి. ఈఎస్ఐ కార్డు ఉంటే.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ.21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరా బాద్తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వైద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్ఐ చెల్లిస్తున్న కార్మి కులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్ఐ చెల్లించేలా చూసుకోవాల్సి న అవసరం ఉంది. అవగాహన లేక సేవలకు దూరం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగా ల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారో గ్య సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, రవాణా, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీ సం పది మంది పని చేసే చోట ఆయా యాజ మాన్యాలు ఈఎస్ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జ్జితం వైద్యానికే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో విని యోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
అక్రమంగా ఇంటినంబర్లిస్తే కఠిన చర్యలు
● బల్దియా సమీక్షలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కై లాస్నగర్: మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇంటినంబర్లు జారీ చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ము న్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సి పల్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, శానిటేషన్, మెప్మా, టౌన్ప్లానింగ్ విభాగాల వారీగా సమీక్షించిన ఆయన అందులోని అక్రమాలను ప్రస్తావిస్తూ అధికారుల తీ రుపై మండిపడ్డారు. అక్రమంగా ఇంటి నంబర్లు జా రీ చేయడంతోనే కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లి రూ.కోట్ల విలు వైన భూములు బల్దియాకు దక్కకుండా చేస్తున్నారన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేయించేదాకా వదలమని హెచ్చరించారు. పట్టణంలో ఆక్రమణల ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబ ర్పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అ లాగే ఇంటి అనుమతుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో జారీ చేయాలన్నా రు. బయోమైనింగ్ కాంట్రాక్టర్కు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా రూ.1.5కోట్లు ఎలా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, డీజిల్ బిల్లుల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, అయితే ఈ సమావేశంలో వాటిని ప్రస్తావించడం లేదన్నారు. ఇప్పటికై నా సదరు అధి కారులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. నిధుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదని మండిపడ్డా రు. వార్డు ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్ అధికా రులు సంయుక్తంగా ప్రతీ వార్డులో క్షేత్రస్థాయిలో జియోట్యాగింగ్ ద్వారా నీటి ఎద్దడిని పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు.షెల్టర్ హోంల నిర్వహణ పేరిట అక్రమంగా బిల్లులు తీసుకుంటున్నారని మెప్మా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఈఈ పెరిరాజు, డీఈలు తిరుపతి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా హాజరై విద్యార్థినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్దాలుగా సంస్కృతి, సంప్రదాయాలు మహిళలను ఆరాదిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. చదువును డిగ్రీతో ఆపేయకుండా కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో వారియర్లుగా దైర్య సాహసాలు ప్రదర్శించాలన్నారు. గతంలో త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నానని పీవో పేర్కొన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అభినవ్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత
ఇచ్చోడ: మండల కేంద్రంలోని ఎస్బీఐ సిరిచెల్మ ఎక్స్రోడ్డు బ్రాంచిలో బంగారు ఆభరణాలు పో గొట్టుకున్న వ్యక్తికి మేనేజర్ సునీల్ మనోహర్ శుక్రవారం అప్పగించారు. వి వరాలు ఇలా ఉన్నాయి.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన అనిల్ మండల కేంద్రంలో ముత్తుట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన తులం బంగారాన్ని డబ్బులు కట్టి విడిపించుకున్నాడు. అక్కడి నుంచి మరో పనిమీద సిరిచెల్మ ఎక్స్రోడ్డులో ఎస్బీఐ బ్రాంచికి వె ళ్లాడు. చెక్కు రాస్తుండగా క వరులో ఉన్న బంగారం నగలు కౌంటర్ వద్ద మరిచి బయట కు వెళ్లిపోయాడు. కౌ ంటర్ వద్ద కేశవపట్నానికి కలీం గ మనించి బ్రాంచి మేనేజర్కు అందించాడు. బంగారు నగలు పోగొట్టుకున్న సదరు వ్యక్తి మేనేజర్ను సంప్రదించాడు. బంగారం నగలను అప్పగించారు. -
ఆమె లేకపోతే సృష్టి లేదు
ఆదిలాబాద్: మహిళ తన జీవితంలో కుటుంబం నుంచి మొదలుకొని సమాజం వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఆడపిల్ల పుట్టుకనే కాదనుకుంటున్న ప్రస్తుత సొసైటీలో వారి ఉనికిని వారే చాటుకుంటూ, ఆడపిల్లల భాగస్వామ్యం సమాజానికి ఎంత అవసరమో అనే విషయాన్ని చాటి చెబుతున్నారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న వ్యవస్థలో ఆమె లేకపోతే సృష్టి లేదనే విషయాన్ని మరిచిపోతుండడం శోచనీయం. నవమాసాలు కడుపులో పిండాన్ని మోసి, ఒక జీవానికి ప్రాణం పోస్తున్న అమ్మతనం ప్రతీ సీ్త్రలో ఉంటుంది. సమాజ పురోగతిలో వారి పాత్ర ఎనలేనిది. అటువంటి అతివను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది. – కళ్లెం జీవిత వెంకట్రెడ్డి, గైనకాలజిస్ట్, ఆదిలాబాద్ -
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది. -
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్టౌన్(జైనథ్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జైనథ్ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. బోరజ్ మండల కేంద్రం జాతీయ రహదారి–44పై బస్టాండ్ వద్ద ఓ లారీని తనిఖీ చేయగా అందులో 290 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని బాలగట్కు తరలిస్తున్నట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.16 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి చేరుకుని వివరాలను అడిగి తెలుకున్నారు. అక్రమంగా బియ్యం, ఇసుక రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. లారీడ్రైవర్ తాహిర్ను అదుపులో తీసుకుని, ఆయనతోపాటు లారీ యజమాని ఎండీ.నజీమ్, బియ్యం సరఫరా చేస్తున్న నిందితులు నాగనాథ్, షఫీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. జైనథ్ ఎస్సై పురుషోత్తం, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
బస్టాప్ల్లో ఇబ్బందే..!
చెప్పలేను 59ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంలేదు 204సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్లతో 72మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరుమీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..తెలియని వారు 204తెలిసిన వారే.. 146బస్టాప్లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
హెచ్ఎం ఆలస్యంగా వస్తున్నారని..
● ఆయన వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థులు ● ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఘటన బోథ్: పాఠశాలకు హెచ్ఎం తరచూ ఆలస్యంగా వస్తున్నారని, హాల్టికెట్లు ఇవ్వమని భయపెడుతున్నారని విద్యార్థులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. మండలంలోని ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్ఎం రాజు చోప్డే వాహనాన్ని పాఠశాల గేటు వద్ద శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. పదో తరగతి గది బయట విద్యార్థులు భైఠాయించారు. హెచ్ఎం ప్రతీరోజు పాఠశాలకు ఆలస్యంగా రావడం సరికాదన్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి తరచూ పాఠశాలకు వస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఆ వ్యక్తి పాఠశాలకు మద్యం తాగి వచ్చి హంగామా చేయడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉండటంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వారితో మాట్లాడారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మహమూద్, ఎంపీడీవో రమేశ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. -
పల్లె నుంచి ఢిల్లీ వరకు.. సుశీల
బోథ్: మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన బాబెరకు చెందిన ఆత్రం సుశీల గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించారు. ప్రతీ ఇంట్లో మొక్కలు నాటించే ప్రయత్నం చేశారు. అలాగే ఆదివాసీ గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈమె సేవలకు గుర్తింపుగా 2020లో అప్పటి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకున్నారు. అలాగే 2022లో ఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీల వర్క్షాప్నకు హాజరయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసీ మహిళ ఇలా ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. -
● కరీంనగర్ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్
ఎస్పీ గౌస్ ఆలం బదిలీఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా అఖిల్ మహజన్ జిల్లాకు బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేస్తున్న గౌస్ ఆలం 2024 జనవరి 4న జిల్లాకు వచ్చారు. ఈయన గతంలో ములుగు ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. జిల్లాలో 14 నెలల పాటు విధులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించిన క్రమంలో ఎన్నికల సంఘం నుంచి ప్రశంసలు పొందారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూశారు. పక్కనున్న మహారాష్ట్ర నుంచి దేశీదారు సరఫరా కాకుండా చర్యలు చేపట్టారు. ఈయన పనిచేసినకాలంలో 1200 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అలాగే మట్కా, గుట్కా నిర్మూలనకు చర్యలు తీసుకున్నా రు. ఏజెన్సీప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. జైనూర్ ఘటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గతనెల 6న ఎస్పీ వివాహం జరిగింది. జిల్లాలో పనిచేసిన కాలంలో మంచి గుర్తింపు పొందారు. జిల్లాకు అఖిల్ మహాజన్ రాక.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీపై రానున్నా రు. 2017 బ్యాచ్కు చెందిన ఈయన ఇదివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల డీసీపీగా పనిచేశారు. అఖిల్ మహాజన్ జమ్మూ కశ్మీ ర్కు చెందినవారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) నుంచి పట్టభద్రులయ్యారు. కాగా ఈయన సిద్దిపేటలో శిక్షణ పొందగా, మంచిర్యాలలో ఏసీపీగా, తర్వాత రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లిలలో డీసీపీగా పనిచేశారు. -
ఆ ఆడపడుచుల కొత్త ఆనవాయితీ
ఇచ్చోడ: ఆ ఊరి అమ్మాయి వివాహానికి గ్రామంలోని అన్ని కుటుంబాలకు చెందిన పెళ్లయిన ఆడపడుచులు కానుకలు సమర్పించడం ఆనవాయి తీ. ఇందులో భాగంగా స్టీల్, ఇత్తడి సామగ్రి అందించేవారు. అయితే వీటితో ఎక్కువగా ఉపయో గం ఉండడం లేదు. అలాగే పెళ్లి ఖర్చులు కూడా పెరిగిన నేపథ్యంలో ఆ వధువు తల్లిదండ్రులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ ఆడపడుచులు కానుకలకు బదులు నగదు అందజేయాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని కుల పెద్దలకు వివరించగా వారు సైతం ఒప్పుకున్నారు. దీంతో నూతన ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు నేరడిగొండ మండలం తర్నం పంచాయతీ పరిధి అనుబంధ గ్రామమైన మంగల్మోట్కు చెందిన ఆడపడుచులు. గ్రామంలో ఈ నెల 3న పెందూర్ వసంత వివాహం జరిగింది. గ్రామానికి చెందిన పెళ్లయిన ఆడపడుచులంతా కలిసి సుమారు 60 మంది వరకు రూ.12వేల నగదు జమ చేసి అందజేశారు. వీరు తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీ పెద్దలు హర్షం వ్యక్తం చేశా రు. సంప్రదాయాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. -
‘పువ్వు’ను ఉపాధిగా మలిచి
ఆమె అడుగు ప్రగతి బాటన పడింది. సంఘటితమై ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. ప్రకృతి నీడన స్వశక్తితో ఎదుగుతున్న వారు కొందరైతే.. సామాజిక బాధ్యతగా అండగా నిలుస్తున్న వారు ఇంకొందరు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏజెన్సీకే పరిమితమైన ఆదివాసీ మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ● ఉట్నూర్, ఖైర్డాట్వాలో ఇప్ప లడ్డూ తయారీ కేంద్రాలుఖైర్డాట్వాలో.. నార్నూర్: మండలంలోని ఖైర్డాట్వా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు 12మంది ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. మండల సమాఖ్య సహకారంతో రూ.3.50 లక్షలు రుణం తీసుకుని గ్రామంలోనే ఇప్పపువ్వు లడ్డూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 4న కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 60వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. వీటిని స్వయంగా వీరే మార్కెటింగ్ చేస్తున్నారు. నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలు, స్వీట్ హౌస్ల్లో రూ.300 నుంచి రూ.350 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇవి రక్తహీనత నివారణకు దోహదపడుతుండడంతో ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నా రు. అన్ని ఖర్చులు పోనూ గత నెలలో రూ.40వేల వరకు ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతఇంద్రవెల్లి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మండలకేంద్రంలోని ఇంద్రా యి మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ బిస్కెట్ తయారీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నా రు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని మహిళలు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఇందులో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్, రాష్ట్ర మహిళా కమి షన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీ ల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఏపీఎం రామారావ్ తదితరులున్నారు.ఖైర్డాట్వా గ్రామంలో లడ్డ్డూ తయారు చేస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలుఉపాధి మార్గం దొరికింది.. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని మేమంతా ఓ గ్రూపుగా ఏర్పడ్డాం. ఇప్పపువ్వు లడ్డూ తయారీని ఎంచుకున్నాం. ఐటీడీఏ సహకారంతో సామగ్రి కొనుగోలు చేసి యూనిట్ ప్రారంభించాం. ఇందులో పోషకవిలువలు ఎక్కువగా ఉండడంతో అధికారులు వీటిని గుర్తించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులతో పాటు వసతిగృహ విద్యార్థులకు అందిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.15వేల నుంచి రూ.20 వేలకు మిగులుతున్నాయి. – కుమ్రబాయి, ఆదివాసీ భీంబాయి సంఘం అధ్యక్షురాలు ఆదాయం పెరుగుతుంది గ్రామానికి చెందిన 12 మంది మహిళలం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాం. మండల సమాఖ్య ద్వారా రూ.3.50 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పపువ్వు లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టాం. నెల రోజుల్లోనే 60వేల లడ్డూలు తయారు చేశాం. మార్కెటింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం నెలకు రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. మున్ముందు మరింత పెరగనుంది. – ఆత్రం కౌసల్యబాయి, గ్రూప్ అధ్యక్షురాలు, ఖైర్డాట్వా వారంతా అడవి తల్లి ఒడిలో సేదతీరే గిరిజనులు. సంఘంగా ఏర్పడి ప్రభుత్వ చేయూతతో ముందడుగు వేశారు. ప్రకృతి ప్రసాదించే ఇప్పపువ్వునే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. వారే ఉట్నూర్, నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వాకు చెందిన ఆదివాసీ మహిళలు. ఉట్నూర్రూరల్: ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ మహిళలు సంఘటితమై స్వశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉట్నూర్కు చెందిన 12 మంది భీంబాయి సంఘంగా ఏర్పడ్డారు. నాటి కాలంలో ఆదివాసీ లు రక్తహీనత నివారణకు ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను తినేవారని గుర్తించి వాటి తయారీకి పూనుకున్నారు. విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లడ్డూల తయారీతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్, పీవో ప్రత్యేక చొరవ చూపారు. వీటిని గర్భిణులు, పిల్లలకు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్లారు. ఐటీడీఏ సహకారంతో రూ.14 లక్షలతో 2019లో తయారీ యూనిట్ ప్రారంభించారు. అప్పటి నుంచి లడ్డూలు తయారు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు ఈ సంఘం సభ్యులు. ఆర్డర్ ప్రకా రం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. -
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అతివలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు సమానంగా సత్తా చాటుతున్నారు. క్రీడా, విద్య, స్వయం ఉపాధి, తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చి శెభాశ్ అనిపించుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలోని పలువురు నారీమణులు. కొందరు పలువురికి ఉపాధి చూపుతున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చెన్నూర్రూరల్: గతంలో సర్పంచ్గా పని చేసింది. ఆ పదవీ కాలం పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. మండలంలోని అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ సువర్ణ. తాండూరు మండలం తంగళ్లపల్లికి చెందిన ఈమెకు చెన్నూర్ మండలం అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ శ్రీనివాస్తో 2003లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అప్పటికే బీఎస్సీ ఫస్టియర్ చదివింది. మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీ.. పిల్లల ఆలపాలన చూసుకుంటూ ఐదేళ్లు పట్టింది. 2010లో ఎంఎస్సీ, 2012లో బీఈడీ పూర్తి చేసింది. 2013లో సర్పంచ్కు బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందింది. ఐదేళ్లవరకు ప్రజలకు సేవలందించింది. 2019లో చెన్నూర్లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో గణిత టీచర్గా ఎంపికై విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. భర్త ప్రోత్సాహంతో సాధ్యమైందని అంటోంది. స్విట్జర్లాండ్లో సాఫ్ట్వేర్ జాబ్ కోటపల్లి: మా స్వగ్రామం కోటపల్లి. మే ము నలుగురు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు బాగా చదివించారు. అందరూ వివిధ రంగాల్లో స్థిరపడ్డాం. తాను స్విట్టర్లాండ్లో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యో గం చేస్తున్నా. ఏటా రెండు నెలలు అమ్మానాన్నలను స్విట్టర్లాండ్కు తీసుకెళ్తున్నా. – లక్ష్మీప్రసన్నతల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే.. ఖానాపూర్: మా తల్లిదండ్రులు రవి–లావణ్య. మేము చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి వడ్రంగి వృత్తి చేస్తూ కష్టపడి చదివించారు. మేం ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఉద్యోగా లు సాధించారు. ఒకరు ఎస్జీటీ టీచర్గా పెంబి మండలం నాగాపూర్లో, మ రొ కరు నిర్మల్ మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్గా పనిచేస్తోంది. – రక్షిత–మాధురి ఒక్క బిడ్డ చాలనుకున్నం నిర్మల్: ‘ఆడబిడ్డయితే ఏంటి.. తను వారసురాలే కదా. తనకు ఉత్తమ చదువును, ఉన్నత జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకే మాకు ఒక్కబిడ్డనే చాలనుకున్నాం..’అంటున్నారు నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఆదర్శనగర్కు చెందిన తిరుపతి సుస్మిత, ప్రమోద్రావు దంపతులు. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినావారు అనుకున్నట్లుగానే ఒక్కబిడ్డకే జన్మనిచ్చారు. తన ఆకాంక్షలకు తగ్గట్లుగానే చదివించారు. తల్లిదండ్రుల ఆశయాలను ఆకళింపు చేసుకున్న ఆ బిడ్డ శరదితన్వి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటోంది. స్థానిక దీక్ష జూనియర్ కళాశాల కరస్పాండెంట్గా చేస్తున్న ప్రమోద్రావు ముందు నుంచి కొంత సామాజిక స్పృహతో ఆలోచిస్తుంటారు. శరదితన్వి ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఆక్సెంచర్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తోంది. తండ్రిలాగే సామాజికస్పృహతో తన స్థాయిలో సేవలందిస్తోంది. స్వ‘శక్తి’తో ముందుకు.. ఆదిలాబాద్: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళ ప్రైవేట్ ఉద్యోగానికి మొగ్గు చూపింది జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన ముదిగొండ కల్పన. ఇంటర్ తర్వాత వివాహం కాగా, అటు కుటుంబ బాధ్యతలు మోస్తూనే 2007లో డిగ్రీ పూర్తి చేసింది. భర్త ప్రోత్సాహంతో 2010లో జిరాక్స్, ఆన్లైన్ సెంటర్, బుక్స్టాల్ ప్రారంభించింది. టైలరింగ్ చేస్తోంది. ఇటీవల బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. ఓ వైపు ఇంటిని చక్కదిద్దుతూనే బుక్సెంటర్ నడుపుతోంది. కుమారుడు, కుమార్తెలను చదివించి ప్రయోజకులుగా చేయాలనే తనవంతుగా శ్రమిస్తోంది.ఆడబిడ్డపై ఆలోచన మారాలి నిర్మల్:‘ఆడబిడ్డయినా.. మగబిడ్డయినా ఒకటే. ఒ కప్పుడు మగపిల్లాడుంటే చాలు అనుకునేది. కా నీ.. ఈరోజుల్లో ఎవరైనా మంచి చదువు, ఉ ద్యో గం ఉంటేనే విలువ. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీ ల నుంచి మొదలు పెళ్లి సంబంధాల దాకా ఆడ, మగ అనే తేడాలు చూడటం లేదు. వారి చదువు, హోదా, సంస్కారాన్ని గుర్తిస్తున్నారు. అందుకే మాకు ఒక్క ఆడబిడ్డనే అని ఏరోజూ ఆలోచించలేదు..’అని చెబుతున్నారు నిర్మల్కు చెందిన వైద్యదంపతులు చిటికేశి రంజిత, సంతోష్రాజ్. తమ బిడ్డ ఇషితారాజ్ ఎంత చదివితే అంత చదివిస్తామంటున్నారు. ప్రస్తుతం తాను ఎంబీబీఎస్ చదువుతోంది. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న పీడియాట్రిక్ వైద్యుడు.వీరిద్దరూ బిడ్డకు గైడ్ చేస్తున్నామే తప్పా .. ఇది చదువు, అది చేయు అని చెప్పడం లేదంటున్నారు. అన్నిరంగాల్లో సీ్త్ర, పురుషులు సమానంగా పనిచేస్తున్నారని, ఇకపై ఆడ,మగ అనే ఆలోచనను మానుకోవాల్సిందేనని అంటున్నారు.చిన్నచూపు పోవాలి ఆసిఫాబాద్అర్బన్: మా స్వగ్రామం మంచిర్యాల. నాన్న ఓ సంస్థలో చిరుద్యోగి. ఇద్దరం ఆడపిల్లలం అయినా ఎవరిపైనా ఆధారపడొద్దని ఉన్నత చదువులు చదివించారు. నేను ప్రస్తుతం ఆసిఫాబాద్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీవో)గా పనిచేస్తుండగా, మా చెల్లెలు ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. నాకు ముగ్గురు, మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలే. వారిని అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాం. చదువుతోనే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి. సమాజంలో మహిళలనే చిన్నచూపు పోవాలి.– భానుమతి గోమాస, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్వైద్య వృత్తిని వదిలి.. ప్రజాసేవకు కదిలి బోథ్: ఎంబీబీఎస్ పూర్తి చేసి.. వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవకు కదిలారు బోథ్కు చెందిన డాక్టర్ సంధ్యారాణి. జెడ్పీటీసీగా గెలుపొంది మహిళా శక్తిని నిరూపించారు. బోథ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు. జెడ్పీ సమావేశాల్లో తనగొంతు విని పించారు. ఆమె వైద్యురాలు కావడంతో బోథ్ ఆసుపత్రిని అభివృద్ధి పర్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి రూ.10 కోట్ల నిధులు తేవడంలో కృషిచేశారు. మాజీ జెడ్పీటీసీగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. – డా.సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ, బోథ్ఇతరులపై ఆధారపడకుండా.. ఆసిఫాబాద్అర్బన్: ఇతరులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నా. ఇంటి వద్దే 20 ఏళ్ల క్రితమే టిఫిన్స్ సెంటర్ ప్రారంభించా. ప్రస్తుతం ఇంటి వద్ద 15 మంది ఉపాధి కల్పిస్తూ.. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరా క్యాంటీన్ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రారంభించాం. అక్కడ కూడా మరో ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. – మార స్వరూప, మహిళా సమాఖ్య సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్ ●తేడా ఉండొద్దు ఆసిఫాబాద్రూరల్: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమాజంలో అందరం ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది తల్లిదండ్రులు కుమార్తె కంటే కుమారుడినే ఎక్కువ ఇష్టపడుతారు. అలా సంతానాన్ని సమానంగా చూడాలి. వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. – శ్రీదేవి, బీజెడ్సీ సెకండియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ కఠిన చట్టాలు రావాలి ఆసిఫాబాద్రూరల్: మహిళలకు కొన్నిచోట్ల రక్షణ లేకుండా పోయింది. యువతులు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. సమాజంలో మహిళల రక్షణకు కఠిన చట్టాలు రావాలి. – అశ్విని, ఎంపీసీఎస్ ఫైనలియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ మహిళలకు అవకాశాలు పెరిగాయి భైంసాటౌన్: నేటి కాలంలో మహిళలకు అవకాశాలు పెరిగాయి. ఏ రంగంలోనైనా వివక్ష ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. పెరుగుతున్న ఖర్చులకు ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి. – సిరం సుష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షురాలు, భైంసా -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
బజార్హత్నూర్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్ర శాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి మండలంలోని గిర్నూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతి ష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆలయాల అ భివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు రాజారాం, భూమయ్య, సకేశ్, మారుతి, నాన రమణ, అల్కె గణేశ్, నాన రమణ, పోరెడ్డి శ్రీనివాస్, కొత్త శంకర్ పాల్గొన్నారు. -
మరిన్ని ఎస్హెచ్జీలు
కై లాస్నగర్: తెల్లరేషన్ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన వివాహితులందరినీ స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్తగా 115 సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి గత నెల 24వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టిన మెప్మా సిబ్బంది స్వయం సహా యక సంఘాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తున్నారు. వార్డుస్థాయిలోని మహిళలతో ప్రత్యేక సమావేఽశాలు నిర్వహిస్తూ ఎస్హెచ్జీల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఇప్పటివరకు కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేయించారు. ఈ నెలాఖరునాటికి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుంచి మ హిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోంది. స్వ యం సహాయాక సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు వివిధ రకాల 13 అంశాల్లో వారు స్వయం ఉపాధిని పొందడంతో పాటు ఆర్థికంగా ముందుకు సాగేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద రూ.20 లక్షల నుంచి రూ.5కోట్ల వరకు రుణాలు ఇస్తూ వ్యాపారంలోనూ ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది. ఇంతలా ప్రోత్సాహం అందిస్తున్నా ఇప్పటికీ అనేక మంది మహిళలు సంఘాల్లో లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ప్రయోజనాలకు దూరంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించాలని భావించి వారినీ ఎస్హెచ్జీల్లో సభ్యులుగా చేర్చాలని సంకల్పించింది. ఆ దిశగా మెప్మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. కొత్త సంఘాల లక్ష్యం 115 ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని తెల్ల రేషన్కార్డులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా 115 ఎస్హెచ్జీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. 18 ఏళ్లు దాటిన, పెళ్లి చేసుకుని కొత్తగా మెట్టినింటికి వచ్చిన మహిళలను సంఘంలో నమోదు చేయించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన మెప్మా సిబ్బంది లక్ష్యాన్ని సాధించేదిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతీ సీవో పరిధిలోని రిసోర్స్పర్సన్లు తమమ వార్డుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పి స్తున్న రాయితీలు, భీమా సౌకర్యం తదితర ప్ర యోజనాలను వారికి వివరిస్తూ సంఘంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే జిల్లాలో కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 10 మంది మహిళలను సభ్యులుగా నమోదు చేయిస్తున్నారు. ఇలా 690 మంది మహిళలను కొత్తగా సంఘాల్లో సభ్యులుగా చే ర్పించారు. ఇంకా 46 సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతున్నారు. సంఘాల్లో చేరిన మహిళల ఆధార్కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారు. పొదుపు చేయడం రుణాలు పొందే విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే కలిగే ప్రయోజనాల గురించి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఏర్పాటుకు ఆదేశించిన ప్రభుత్వం ఆదిలాబాద్ బల్దియా లక్ష్యం.. 115 ఇప్పటికే 69 సంఘాల ఏర్పాటు లక్ష్యసాధన దిశగా మెప్మా సిబ్బంది ఈ నెలాఖరు వరకే గడువు విధింపు ఆదిలాబాద్లోని వార్డులు : 49 తెల్ల రేషన్కార్డులు : 29,346 ప్రస్తుత ఎస్హెచ్జీలు : 2,567 సంఘాల్లోని సభ్యులు : 26,042 గడువులోపు లక్ష్యం సాధిస్తాం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలందరినీ సంఘాల్లోకి తీసుకురావాలని, తద్వారా కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపాలిటీకి లక్ష్యాన్ని నిర్దేశించింది. సీవోలు తమ పరిధిలోని రిసోర్స్ పర్సన్లతో వార్డుల వారీగా మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఆరు నెలలు సక్రమంగా పొదుపు చేసే సంఘాలు రూ.5లక్షల రుణం పొందవచ్చు. రుణ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే రూ.10లక్షల వరకూ రుణం ఇస్తారు. ఈ అవకాఽశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మార్చి నెలాఖరునాటికి లక్ష్యాన్ని సాధిస్తాం. – శ్రీనివాస్, మెప్మా డీఎంసీ, ఆదిలాబాద్ -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
కైలాస్నగర్: ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో రెగ్యులర్ వి ద్యార్థులు 10,051, ప్రైవేట్గా 55 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పా టు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పరీక్ష సమయాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీకి సూచించారు. కేంద్రాలను తనిఖీ చే సేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు ప్ర త్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మహిళా కానిస్టేబుల్ ఉండేలా చూసుకోవాలని, అ ధికారులంతా సమన్వయంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. డీఈవో ప్ర ణిత, సీఎస్లు, డిపార్ట్మెంట్ అధికారులున్నారు. -
‘నీట్’ నిర్వహణకు కేంద్రాలు గుర్తించాలి
● కలెక్టర్ రాజర్షి షా ఆదేశం ● కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష కై లాస్నగర్: మే 4వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణకు జిల్లాలో పరీక్షాకేంద్రాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీట్ అర్హత పరీక్ష కోసం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్కూళ్లు, ఆర్మీ స్కూ ళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, సీబీఎస్ఈ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలను సందర్శించి అందులో మౌలిక వసతులు కల్పించాలని, ఆ తర్వాతే నివేదిక అందించాలని సూచించారు. పరీక్షాకేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు పర్యవేక్షించాలని సూచించారు. వీటిపై అధికారులందించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ గదిలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్కుమార్, జిల్లా విద్యాధికారి ప్రణిత, కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు. -
‘మా భూములు మాకివ్వాలి’
ఆదిలాబాద్: సీసీఐ కోసం సేకరించిన భూములను తిరిగి తమకు అప్పగించాలని సీసీఐ భూనిర్వాసితుల సంఘం నాయకుడు అరవింద్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఆయన గురువారం సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీఐ పరిశ్రమ ఏర్పాటు సమయంలో స్థానిక రైతుల నుంచి 779 ఎకరాల సాగు భూమిని నాటి కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పరిహారమిచ్చి సేకరించిందని ఆరోపించారు. పరిశ్రమలో వందేళ్ల దాకా రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమను 1998లో మూసివేయడంతో భూములు కో ల్పోవడమే కాకుండా ఉద్యోగాలనూ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. 30 ఏళ్లుగా ఈ పరిశ్రమ ప్రారంభం కోసం పాలకులు ఎన్నికల్లో హామీ ఇస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిశ్రమను స్క్రాప్ కింద అమ్ముకోవడానికి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం అనుమతితో టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఇంతవరకు పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నామని, ప్రస్తుతం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ పునరుద్ధరణకు ప్రయత్నించాలని, లేని పక్షంలో తీసుకున్న పరిహారం సొమ్ము తిరిగి ఇస్తామని, తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజన్న, ఈశ్వర్ దాస్, రామ్రెడ్డి, కృష్ణ, విఠల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి నిధులు కేటాయించండి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుఉట్నూర్రూరల్: అభివృద్ధి పనులకు నిధులు కేటా యించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి శరత్కు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గురువారం ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ.15 కోట్లు, నూతన స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.2 కోట్లు, రాజ్గోండు సేవా సమితి గుస్సాడీ గుట్ట వద్ద నూతన భవన నిర్మాణానికి రూ.కోటి, ఉట్నూర్ నుంచి కొమ్ముగూడ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. -
ప్రమాదాలు నియంత్రించాలి
కైలాస్నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని యంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడా రు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రంబుల్ స్టెప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాయంత్రం డ్రంకెన్డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, ఆర్డీవో వినోద్కుమార్, ఆర్అండ్బీ, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి
కై లాస్నగర్: మాదక ద్రవ్యాలు, గంజాయిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో పోలీస్, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు ప్రతీ వారం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా గంజాయి లేదా మాదకద్రవ్యాల బారిన పడితే స్థానిక డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించి బాగు చేయాలని సూచించారు. ఎస్పీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, పోలీస్, వైద్యారోగ్య, ట్రాన్స్పోర్టు, ఎకై ్సజ్ శాఖల అధికారులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ కూలీలందరికీ పనులు కల్పించాలి
తలమడుగు: దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఉ పాధి కూలీకి పని కల్పించాలని డీఆర్డీవో ర వీందర్ రాథోడ్ సూచించారు. గురువారం మండలంలోని సుంకిడి, కుచులాపూర్ గ్రా మాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పనుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలు ప్రతీరోజు రెండుసార్లు ఫొటో తీసుకుని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం వేగవంతం చేయాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్కుమార్, సిబ్బంది ఉన్నారు. -
121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలు నిలిపివేత
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్సైట్లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు. -
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్బంక్ వద్దకు బైక్పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పట్టే క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్షాక్తో యువకుడు మృతి
సిరికొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్పాడ్ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ వైరుకు తగలడంతో షాక్కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. గోండుగూడలో ఒకరు..కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంలక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధుడు ఆత్మహత్యదండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. అధికారి ఇంట్లో చోరీకి విఫలయత్నంభైంసాటౌన్: పట్టణంలోని సాయికాటన్ ఏరియాలో ఉంటున్న ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్అండ్బీ డీఈఈ సునీల్ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు. అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలుపెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కృష్ణ, పైలెట్ అజర్ ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● ఎంపీ గోడం నగేష్ -
విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి
● ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని బాసర ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడితే అపజయాలు ఆహ్వానిస్తాయని, ధైర్యంగా ముందుకెళ్తే విజయ సోపానం అవుతుందన్నారు. ఎస్ఈఐఎఫ్ ఫౌండర్ శామ్యూల్రెడ్డి, డైరెక్టర్ జ్యోతిర్మయి విద్యార్థులకు తమ సలహాలు అందించారు. సినీ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతూ ప్రేరణ కల్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. -
‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం
నిర్మల్ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంనర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. తిమ్మాపూర్లో 800 కోళ్లు మృతిభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్లో పునేంధర్కు చెందిన ఫామ్లో బుధవారం 800 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి విఠల్ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. కోళ్లు తాగే నీటిలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ల్యాబ్ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పునేంధర్ వాపోయాడు. గంజాయి సేవిస్తున్న పలువురి అరెస్టుచెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అడహక్ కమిటీ ఏర్పాటు..
ఆదిలాబాద్లో విమానాశ్రయ సాధన కోసం సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవచూపింది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికకు విశేష స్పందన లభించింది. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద, యువజన, విద్యార్థి సంఘాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు. తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తే తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. దశాబ్దాల కల సాకారం కావాలంటే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. కేంద్రంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అడహక్ కమిటీ ద్వారా ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బీఆర్ఎస్, కాంగ్రె స్, వామపక్షాలు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, వృకోధర్, అల్లూరి భూమన్న, దేవిదాస్ దేశ్పాండే, కిష్టయ్య, బుట్టి శివ, దాసరి రమేశ్, రూపేష్ రెడ్డి, రత్నం రమేశ్, కుంటాల రాములు, ఎస్.అరుణ్ కుమార్, లంకా రాఘవులు, అశోక్, రవీంద్ర, కందుల రవీందర్, ఆశన్న, దయానంద్రెడ్డి, కె.నర్సింలు, రాజు, అన్నదానం జగదీశ్వర్, ప్రమోద్ కుమార్ ఖత్రి, సతీష్, ధమ్మపాల్, ఆసిఫ్, ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయ సాధన కోసం ఉద్యమించేలా ప్రత్యేకంగా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ వర్గాలతో కూడిన ప్రతినిధులను ఇందులో భాగస్వాములుగా చేర్చారు. కన్వీనర్గా సంద అశోక్, కోకన్వీనర్లుగా విజ్జగిరి నారాయణ, బండి దత్తాత్రి, కె.లక్ష్మారెడ్డి, ముడుపు ప్రభాకర్రెడ్డి, మల్లేశ్, సభ్యులుగా సోగల సుదర్శన్, పూసం ఆనంద్రావు, దాసరి రమేశ్, సిర్ర దేవేందర్, నిమ్మల ప్రశాంత్, నిమ్మల నరేందర్, బండారి సతీశ్, బి.శివకుమార్, వాగ్మారే ప్రశాంత్, బొజ్జ ఆశన్న, ఎంఏ హఖ్, పి.కిష్టయ్య, దేవిదాస్ దేశ్పాండే యమితులయ్యారు. -
పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్వైడ్ లైఫ్ఫండ్ ఆధ్వర్యంలో సర్వే జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్లోని 40 అటవీ బీట్లలో సర్వే చేశారు. డివిజన్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 201 రకాల పక్షులు జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులపై అవగాహన ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఆర్నెల్లకోసారి.. ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్లుగా నియమిస్తాం. – శివ్ఆశిష్సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల -
ఇంటర్ పరీక్షలు షురూ
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ పరీక్షలు షురూ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి నిమిషం ని బంధనను సడలించి 5 నిమిషాల వరకు పెంచారు. అయితే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి పరీక్ష కావడంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. విద్యార్థులను అధి కారులు పూర్తిగా తనిఖీ చేసి లోనికి అనుమతించా రు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజున నిర్వహించిన లాంగ్వేజ్ పరీక్షకు 9,814 మందికి గాను 9,154 మంది హాజరైనట్లు డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలతో పాటు పలు కేంద్రాలను పరిశీ లించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. -
మహారాష్ట్రలో ట్రాలీ బోల్తా..
● గుడిహత్నూర్ వాసులకు గాయాలు గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్తో పాటు పలువురు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ● ముగ్గురికే 92.52 శాతం ఓట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి:కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చి న్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూ డా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరా హోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జర గ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిఫ్టు ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54 మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రా ధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52 శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం(2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండోప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్లు కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి అధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్కి 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,972 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రసన్నహరికృష్ణను ఎలిమినేషన్ చేసిన అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది. -
ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ వేగవంతం చేయాలి
కైలాస్నగర్: జిల్లాలో 17 గ్రామాల్లో ఎంపిక చే సిన 2,148 ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత శాఖ అధి కారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబంధించిన పరిశీలన ప్రక్రియ ఈనెల 7లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే 15 మంది అమరవీరుల కుటుంబాలకు ముత్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాస స్థలాలను వారి అభిప్రాయం మేరకు కేటాయించామన్నారు. ఆ నివాస స్థలాల అభివృద్ధి పను ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అలాగే నీటి ఎద్దడి ఉన్న ఏడు క్రిటికల్ మండలాలైన ఆదిలాబాద్ రూర ల్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఉట్నూర్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, హౌసింగ్ పీడీ బసవేశ్వర్, ఎంిపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తాపీమేసీ్త్రలకు కిట్ల పంపిణీ అంతకు ముందు నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా తాపీమేసీ్త్రలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అంది స్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించా రు. వారికి నిర్మాణ సామగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు. -
‘రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే’
ఆదిలాబాద్: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. అదిలాబాద్– కరీంనగర్–నిజామాబాద్– మెద క్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్యాయాన్ని బీజేపీ ప్రశ్నించిందని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు గుర్తించి పట్టం కట్టారన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ఓటర్లలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నాయకులు జ్యోతి రెడ్డి, నగేష్, జోగు రవి, రఘుపతి, లాలామున్నా, ప్రవీణ్, కృష్ణ యాద వ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ చొరవ అభినందనీయం
సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లా వాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ఎయిర్ కనెక్టివిటి పెరిగి నాగ్పూర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాణిజ్యపరంగాను ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయి. తెలంగాణ ఉద్యమం టీఎన్జీవోస్ భవనం నుంచే ప్రొఫెసర్ జయశంకర్ సార్ నాడు ప్రారంభించారు. ‘సాక్షి’ కూడా ఎయిర్పోర్టు సాధనకు ఇక్కడే బీజం వేయడం శుభసూచికం. పత్రిక సామాజిక చొరవ అభినందనీయం. – కోల కిరణ్ కుమార్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ -
మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
ఆదిలాబాద్రూరల్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రగతిశీల భవన, ఇతర కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డికి పలు డిమాండ్లతో కూడి వినతి పత్రం అందజేశారు. ఇందులో భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, నారాయణ, తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నర్సింగ్, దేవిదాస్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సుభాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తౌఫీక్, అజీమ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకాంక్ష చాటేలా.. ప్రజల గొంతుకగా నిలిచేలా
● ‘సాక్షి’ ఆధ్వర్యంలో నేడు చర్చా వేదిక అడవుల జిల్లా ఆకాంక్షను ఈ ప్రాంతవాసుల గొంతుక గా వినిపించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ ఏర్పాటు అంశం ఆచరణలోకి రావాల్సిందే అని బలంగా కాంక్షిస్తోంది. కొత్త ఎయిర్పోర్టుల విషయంలో తెలంగాణలోని పలు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం విదితమే. మామునూరులో నిధులు సైతం మంజూరు కాగా.. కొత్తగూడెంలోనూ కదలిక మొదలైంది. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ప్రస్తావన కూడా వచ్చేసింది. అయితే ‘మేమేం పాపం చేశాం.. మా కెందుకు మంజూరు చేయరు..’ అంటూ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా ఎందుకు ఈ చిన్నచూపు అంటూ మౌనంగా నిట్టూరుస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ సామాజిక బాధ్యతగా ముందడుగు వేసింది. ‘ఆదిలాబాద్ విమానాశ్రయ సాధన’ పేరిట ప్రత్యేక చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేలా ఆహ్వానం పలుకుతోంది. అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చాలని ఆకాంక్షిస్తోంది. మీ భావాలకు అక్షర రూపం కల్పించి పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు సదా మీ వెంటే అంటూ ‘సాక్షి’ విన్నవిస్తోంది. – కైలాస్నగర్స్థలం : టీఎన్జీవోస్ భవన్, ఆదిలాబాద్ సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు -
నాణ్యమైన విద్యుత్ అందించేలా పనిచేయాలి
ఆదిలాబాద్టౌన్: వినియోగదారులకు నా ణ్యమైన విద్యుత్ అందించడంలో క్షేత్రస్థా యి ఉద్యోగుల పాత్ర కీలకమని ట్రాన్స్కో సీఈ జేఆర్.చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో మంగళవారం లైన్మెన్ దినోత్సవం నిర్వహించారు. జూనియర్ లైన్మెన్, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు, ఫోర్మెన్ను ఆయన శాలు వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడలో.. ఇచ్చోడ: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఈ జేఆర్ చౌహాన్ హాజరయ్యారు. ఇందులో డీఈలు హరికృష్ణ, ఎడ్డ న్న, ఏడీఏ లక్ష్మణ్, ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులను నామినేట్ చేయాలి
ఆదిలాబాద్: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ను నామినేట్ చేయాలని దివ్యాంగుల హ క్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మె స్రం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ నగర్లో వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ డిసేబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్ర కారం రాష్ట్రంలో 43.02 లక్షల మంది ది వ్యాంగులు ఉన్నారన్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో ఇద్దరు దివ్యాంగులను నా మినేట్ చేస్తే ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో వేదిక కార్యదర్శి ఆరిఫా, ఉపాధ్యక్షుడు ఆశన్న, పోచన్న రేణు క తదితరులు పాల్గొన్నారు. -
● ఎలిమినేషన్ ప్రక్రియతోనే ఖరారు కానున్న ఎమ్మెల్సీ విజేత ● ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడికరీంనగర్– ఆదిలాబాద్– మె దక్– నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలి తం ఉత్కంఠ రేపుతుంది. మంగళవారం అర్ధరాత్రి వర కు జరిగిన కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. ట్రయాంగిల్ పోరు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56మంది అభ్యర్థులు పోటీ పడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎీస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చా యి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనే దానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే..1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కు వ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వ చ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వర కు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్రెడ్డి సెకండ్ ప్లేస్లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందికౌంటింగ్ వివరాలు: మొత్తం ఓట్లు(పోస్టల్తో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు : 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల్లో సాంకేతిక ప రిజ్ఞానం పెంపొందించాలని డీఈవో ప్రణీ త అన్నారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ట్యాబ్లు, ల్యాప్టాప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, అటల్ ఇన్నోవేషన్ పథకం కింద ప్రభుత్వం 19 పాఠశాలలకు ల్యాప్టాప్లు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఐసీటీ పీఎంశ్రీ పథకం కింద 24 పాఠశాలలు ఎంపిక కాగా, పైలెట్ ప్రాజెక్ట్ కింద 13 పాఠశాలల కు ట్యాబ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నా రు. వీటిని అకాడమిక్ పాఠ్యంశాల కోసం ఉపయోగించాలని సూచించారు. ఇందులో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, సెక్టోరియల్ అధికారులు సుజాత్ఖాన్, నారాయణ, భాస్కర్, ఆయా పాఠశాలల ప్రధానో పాధ్యాయులు పాల్గొన్నారు. -
పకడ్బందీ బందోబస్తు..
ఆదిలాబాద్టౌన్: ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఇక పరీక్షలకు హాజరుకానున్నారు. నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ఆందోళన వీడి పరీక్ష రా యాలని సూచిస్తున్నారు. బుధవారం ప్రథమ సంవత్సరం, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదివరకు నిమిషం ఆలస్యం నిబంధన ఉండగా, కొంతమంది విద్యార్థులు సమయానికి కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్షలకు దూరమయ్యారు. దీంతో ఇంటర్మీడియెట్ బోర్డు ఈసారి 5 నిమిషాల వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రంలోనికి విద్యార్థులను అనుమతించరు. 31 కేంద్రాలు ఏర్పాటు.. ఇంటర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 13 ప్రభు త్వ జూనియర్ కళాశాలలు,ఐదు సాంఘిక సంక్షేమ, రెండు ట్రైబల్ వెల్ఫేర్, తొమ్మిది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు,ఒక మోడల్ స్కూల్,ఒక మైనార్టీ స్కూ ల్ ఉన్నాయి. పరీక్షలకు 18,880 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 8,093 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,013,సెకండియర్ జనరల్విద్యార్థులు8,754 మంది, ఒకేషనల్ విద్యార్థులు1,020మంది ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోకుండా ఫర్నిచర్ సమకూర్చినట్లుగా పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి నేటి నుంచి ఇంటర్ పరీక్షలు జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హాజరుకానున్న 18,880 మంది విద్యార్థులుజిల్లాలో.. మొత్తం పరీక్ష కేంద్రాలు : 31 ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 9,106 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 9,774 స్క్వాడ్లు : 4( సిట్టింగ్ 2, ఫ్లయింగ్ 2) హెల్ప్డెస్క్ నంబర్లు : 08732– 297115, 9848781808ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టంలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీలైనంత త్వరగా సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు బాగా రాయాలని శుభాకాంక్షలు తెలిపారు. కై లాస్నగర్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయ న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవా లని సూచించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారుల ను ఆదేశించారు. సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అలాగే కాపీయింగ్కు ఆస్కా రం లేకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని వారికి అల్ ది బెస్ట్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఐఈవో గణేశ్, డీఈవో ప్రణీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీలో జోష్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలు శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచా రం చేపట్టారు. వచ్చే స్థానిక సంస్థల్లోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషా య పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చింద ని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్లో ఉత్సాహం మరో సీటుపై ఉత్కంఠ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. -
మేడం మీనాక్షి.. ఏం చెబుతారో
● కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ● నేడు పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశం ● గాంధీభవన్లో రాష్ట్ర ఇన్చార్జి ఆధ్వర్యంలో.. ● పార్టీ పరిస్థితిపై ఇప్పటికే నివేదిక ● తదనుగుణంగా ముందుకెళ్తారనే చర్చ సాక్షి,ఆదిలాబాద్: మేడం మీనాక్షి.. ఇప్పుడు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తల నోటిలో నానుతున్న పేరు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. తాజాగా ఆమె గాంధీ భవన్లో మాట్లాడుతూ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు జెండా మోసిన కార్యకర్తలకు పూర్తి న్యాయం చేయడమే తన ధర్మమని ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో గాంధీ భవన్లో బుధవారం ఆమె సమావేశం కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశాలు కూడా ఇదే రోజు ఉండడంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆమె దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా జిల్లా స్థాయిలో అనేక నామినేటెడ్ పదవులు, జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉండగా, రాష్ట్ర ఇన్చార్జి నిశితంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి సారించడంతో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన, ద్వితీయశ్రేణి నేతలు, నాయకులు కూడా హస్తం పార్టీలో చేరారు. దీంతో క్షేత్రస్థాయిలో పాత, కొత్త నాయకుల మధ్య కొంత వైరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మాటలు ప్రధానంగా పాత నాయకుల్లో ఉత్తేజం కలిగిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న నిరుత్సాహం వారిలో కనిపిస్తుండగా, రాష్ట్ర ఇన్చార్జి ఈ పరిస్థితులను పూర్తిస్థాయిలో చక్కదిద్ది తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావం వారిలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి పార్టీ పరిస్థితులపై ఆమె సొంత సర్వే ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగానే పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు చెబుతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు రాష్ట్ర ఇన్చార్జి ఉమ్మడి జిల్లా నేతలతో ఎలాంటి సూచనలు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేయాలని పలువురు ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలకు రావడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు ఉన్నచోట వారికి కొత్త నాయకులతో టికెట్ పరంగా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తమకు న్యాయం చేయాలని పాత నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొత్త నాయకులు రావడంతో పార్టీలో తమ ప్రభావం పూర్తిగా తగ్గిందన్న అభద్రతాభావం కూడా వారిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఉద్దీపన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. మొత్తంగా నేడు జరిగే పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది చూడాల్సిందే.కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయొద్దు బేల: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయవద్దని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, స్థాయికి మించి వైద్యం చేయవద్దన్నారు. నిబంధనలు అతి క్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు రక్త పరీక్ష ల్యాబ్లను సీజ్ చేశారు. ఆయన వెంట నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం జిల్లా అధికారి వంశీకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మమ్మల్ని ఆదుకోండి
మేమంతా ఏళ్లుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్కు చెందిన ఓ గిరిజన రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేయడంలో భాగంగా చేలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. సదరు రైతు అనుమతితోనే వాటిని తొలగించి లారీలో లోడ్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు వచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. మైనింగ్ అధికారులకు అప్పగించారు. బండరాళ్లను కొడితే తప్ప ఉపాధి పొందలేని పరిస్థితి మాది. బండరాళ్లతో ఉన్న లారీని విడిపించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఒడ్డెర కులస్తులు, పిట్టలవాడ, ఆదిలాబాద్ నాకు ఇచ్చోడ ఎస్బీఐలో ఖాతా ఉంది. పంట సాగు కోసం ఆ బ్యాంకు నుంచి రూ.1,50,696లను రుణంగా తీసుకున్నాను. అయితే నా బ్యాంకు ఖాతా నంబర్కు నా భార్య ఆధార్ నంబర్ను కూడా ఆఫీసర్లు మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకే బ్యాంకు ఖాతాకు రెండు ఆధార్నంబర్లు మ్యాపింగ్ కావడంతో నాకు రావాల్సిన రుణమాఫీ అందలేదు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదంతో నష్టపోయిన నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. – అందెరి చంద్రకాంత్, జున్ని, ఇచ్చోడ రుణమాఫీ కాలేదు -
‘సీసీఐపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి’●
ఆదిలాబాద్టౌన్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వారి వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 నుంచి సీసీఐ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు ప్రస్తుతం సీసీఐని స్క్రాప్ కింద విక్రయించేందుకు టెండర్లు పిలిచారని తెలి పారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐని తుక్కు కింద విక్రయించే విషయం వీరికి తెలియదా అ ని ప్రశ్నించారు. సీసీఐ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ పరిశ్రమలకు రాయితీ ఇస్తామని, లేక రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. రూ.43 కోట్లతో స్క్రాప్ కింద అమ్మేందుకు మార్చి 6 వరకు టెండర్లు పిలిచారని అన్నారు. సమావేశంలో నారా యణ, సాజిదొద్దిన్, రాజు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలపై అపోహలు వద్దు
కై లాస్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ వ్యయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా హౌసింగ్ పీడీ బసవేశ్వర్ అన్నారు. రూ.5లక్షల వ్యయంతో నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన 14మండలాల్లోని 35 మంది తాపీమేసీ్త్రలకు స్థానిక జిల్లా పరిషత్లోని పంచాయతీ వనరుల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 మండలాల్లోని 17 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్లైయాష్ బ్రిక్స్, సిమెంట్ ఇటుకలతో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వారికి శిక్షణ మెటీరియల్తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఐదు రోజుల శిక్షణలో భాగంగా ఉచిత భోజనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున ఉపకారవేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, హౌసింగ్ ఏఈ నసీర్, న్యాక్ ఏడీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ పీడీకి అస్వస్థత
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సబిత ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా చె మటలు పట్టి నోటిమాట రాకపోవడంతో అధికా రులు, ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యా రు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా ఆమెను పరామర్శించి కుటుంబీకులతో మాట్లాడగా రోజువారి మాత్రలు వేసుకోకపోవడంతో అలా జరిగి ఉంటుందని వివరించారు. అప్పటికే ఆమె తేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సూచనతో ఆమెను విశ్రాంతి కోసం ఇంటికి పంపించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరికై లాస్నగర్: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవ ని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజుతో కలిసి ఫ్లెక్సీ షాపు యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇందులో సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఫణిదర్ పాల్గొన్నారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
● ‘ప్రజావాణి’కి 64 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ కై లాస్నగర్: తమ గోడు ఆలకించి సమస్యలు పరి ష్కరించాలని పలువురు బాధితులు గ్రీవెన్స్లో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికా రులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీ, విద్య, వైద్యం, ఇరిగేషన్, రెవెన్యు తదితర శాఖలకు సంబంధించి ఈ వారం మొత్తం 64 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.. -
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలి
ఆదిలాబాద్ పట్టణం వార్డునంబర్ 23 తాటిగూడలో గల ఓల్డ్ ప్రగతి స్కూల్ సమీపంలో గల నాలాను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అధికారికంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా దారుల్ఉలుమ్ మదర్సా పనులను రాత్రికిరాత్రి ప్రారంభించారు. ఆ పనులు నిలిపివేసి స్థలాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. – హిందూవాహిని నాయకులు, ఆదిలాబాద్ 2024 డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. అర్హత లేని ఒకరిని మరాఠీ మీడియం ఎస్జీటీగా నియమించారు. అలాగే మరో అభ్యర్థిని స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో కుచులాపూర్ ప్రాథమిక పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చి పక్షం తర్వాత విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మరాఠీ మీడియంలో ఒకరు ఎస్జీటీకి ఎంపిక కాగా ఆ అభ్యర్థి సర్టిఫికెట్లపై మరొకరు ఫిర్యాదు చేయడంతో ఆ పోస్టింగ్ను అబయాన్స్లో పెట్టారు. వీటిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, టీఎస్యూటీఎఫ్, జిల్లా అధ్యక్షుడు మేమంతా దళితబస్తీ కింద గత ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నాం. మా భూముల్లో బోరుబావులు వేసేందుకు అధికారులు మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ఏడాది దాటినా ఇంకా బోరుబావులు మాత్రం తవ్వడం లేదు. వాటిని వేసి విద్యుత్ సౌకర్యం కల్పించినట్లయితే రెండో పంట కూడా సాగు చేసుకునేందుకు అవకాశముంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుని మాకు మేలు చేయాలని కోరుతున్నాం. – దళితబస్తీ లబ్ధిదారులు, పిప్పల్కోఠి, భీంపూర్ -
పార్టీ కోసం కష్టపడే వారికే ‘నామినేటెడ్’
కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపునిచ్చి, తగిన గౌరవం కల్పిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ కా ర్యాలయాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. ఆమెకు పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి నామి నేటెడ్ పదవులిచ్చి గౌరవిస్తామన్నారు. మరికొందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అవకాశం కల్పిస్తామన్నారు. పదవులిస్తేనే పనిచేస్తామనడం సరికాద ని, పనిచేసిన వారికే పదవులందుతాయని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల్లోనూ పార్టీ విజ యానికి కృషి చేయాలన్నారు. ఇందులో పార్లమెంట్ ఇన్చార్జి సుగుణ, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క -
‘టీచర్’లో కమలం పాగా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య ఆ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రానికి ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చా యి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది. బండి అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మి గిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరో పణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవా రం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. తొలి ప్రాధాన్యతతోనే గెలిచిన మల్క కొమురయ్య కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల వడబోత నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రి -
ఎకై ్సజ్ సీఐ విజేందర్కు నగదు పురస్కారం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్ను నగదు పురస్కారం వరించింది. దేశీదారు కట్టడితో పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈమేరకు హైదరా బాద్లోని ఎకై ్సజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, జాయింట్ కమిషనర్ ఖురేషీ చేతుల మీదుగా ఆయన రూ.12వేల నగదు పురస్కారం అందుకున్నారు. పలువురు అధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
‘భూసార’ంతో అధిక దిగుబడి
● ఏటా వేసవిలో మట్టి నమూనా పరీక్షలు ● అవగాహన లేమితో దృష్టి సారించని రైతులు ● వినియోగించుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు బోథ్: వ్యవసాయ పొలాలు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.. భూమిలోని పోషకాల స్థాయి.. ఎలాంటి ఎరువులు ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు తోడవడంతో అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు తగిన పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది రైతులు ఈ పరీక్షలు చేయించడం లేదు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో.. అదిలాబాద్ జిల్లాలో 101 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, సోయా, పెసర, మినుము, జొన్న, మొక్క జొన్న, శెనగ, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియకపోవడంతో సాగులో పెట్టుబడి పెరిగి ఆశించిన దిగుబడి రాని పరిస్థితి. ఫలితంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేమితో వెనుకంజ.. రైతులు పంటల సాగులో విరివిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోవైపు భూసార పరీక్షల ఫలితాలను సైతం అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితాల ఆధారంగా.. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాలను అనుసరించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువులు వినియోగించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఆశ్రయించి వారు సూచించిన వంగడాలను ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. రైతులు వినియోగించుకోవాలి రైతులు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. దీంతో భూసారం తెలుస్తుంది. అవసరమైన పోషకాలు అందించి దిగుబడి పెంచుకోవచ్చు. ఏప్రిల్,మే నెలలో ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఇవి పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టు అందేలా చర్యలు చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయధికారి -
నిమిషం నిబంధన సడలించాలి
ఆదిలాబాద్రూరల్: త్వరలో ప్రారంభం కా నున్న ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ విజ్ఞప్తి చే శారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ మాదిగ జేఏసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని సీఎం రేవంత్రెడ్డి, ఉన్నత విద్యాశా ఖ అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. గతేడాది ఈ నిబంధనతో కొంతమంది దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు సకాలంలో కేంద్రానికి చేరుకోలేకపోయారన్నారు. పరీక్ష రాయలేని క్రమంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయన్నారు. ఈ విషయమై పునరాలోచించి కనీ సం15 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆదివాసీ కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడ ప సోనేరావు, లహుజీ శక్తి సేన జిల్లా అధ్యక్షుడు గొడకేమధుకర్, నాయకులు సంజయ్ తదితరులున్నారు. -
అధికారికంగా శ్రీపాదరావు జయంతి●
కై లాస్నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ పాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీపాదరావు జీవితం నేటితరానికి ఆదర్శనీయమని కొని యాడారు. స్పీకర్గా అసెంబ్లీని నడిపించిన తీరు మరువలేనిది వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రాథోడ్ పంచపూల, శైలజ తదితరులు పాలొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
మహిళా సంఘాలకు ‘సౌరశక్తి’
● జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ● నాలుగు గ్రామ సమాఖ్యల ఎంపిక ● స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లో(ఎస్హెచ్జీ)ని మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో సోలార్ (సౌరశక్తి) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉ త్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో పది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు ఏ ర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. వాటికి సంబంధించిన డీపీఆ ర్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రెండు ప్లాంట్లు ఇలా.. జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్ప్లాంట్లను ఇంద్రవెల్లి, తలమడుగులో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆసక్తి, ఉత్సాహంగా పనిచేసే ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్, పిట్టబొంగరంతో పాటు తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్ ఎస్హెచ్జీలను ఎంపిక చేశారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు దస్నాపూర్లోని సర్వేనంబర్ 255లో గల నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. తలమడుగు మండలానికి సంబంధించి కజ్జర్ల శివారు సర్వేనంబర్ 141లోని ఎనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్డీఏ, విద్యుత్, రెడ్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ(రిజిస్ట్రేషన్) నంబర్లను కేటాయించారు. అలాగే ప్లాంట్ నుంచి సమీపంలోని సబ్స్టేషన్ వరకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సబ్స్టేషన్కు మళ్లించి రైతులకు అందజేయనున్నారు. 25ఏళ్ల పాటు ప్రాజెక్ట్ నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ఏటా ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. ప్రభుత్వానిదే ప్రత్యేక చేయూత ఒక్కో ప్లాంట్ను రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం 30శాతం సబ్సిడీ అందజేయనుంది. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్లకు లబ్ధిదారు వాటాగా రూ.70లక్షలను ఆ సమాఖ్య సంఘాలు తొలుత చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా పేదరికంతో పాటు వెనుకబడినది కావడంతో ప్రభుత్వం ప్రత్యేక చేయూత అందించాలని నిర్ణయించింది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సీఐఎఫ్) నుంచి ప్రభుత్వమే ఆయా సంఘాలకు రుణ ప్రతిపాదికన వాటిని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. అది పూర్తయ్యాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 8న పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ డీపీఆర్ సిద్ధం కానట్లైతే ప్రారంభంలో జాప్యమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక భారం తగ్గించేలా... జిల్లాలో ప్రాజెక్టులు, కాలువలు అంతగా లేకపోవడంతో వ్యవసాయ ఆధారితంగానే పంటల సాగు జరుగుతుంది. ఇందుకు యాసంగిలో సాగు చేసే రైతులు విద్యుత్ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు నీటినందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్ సరఫరా ఉచితంగా అందజేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతినెల రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతుంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూతనందించేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే యూనిట్కు రూ.3.13పైసల చొప్పున ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గనుండటంతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది. తొలివిడతలో రెండు ఏర్పాటు జిల్లాలో పది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతగా రెండు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న గ్రామ సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశాం. అయితే ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ అందాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుంగా పనులు ప్రారంభిస్తాం. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
కోచింగ్.. ఇక భారమే!
● స్విమ్మింగ్పూల్ నిర్వహణ ప్రైవేట్కు.. ● టెండర్ ద్వారా అప్పగించేందుకు రంగం సిద్ధం ● ఇకపై వారు నిర్ణయించేదే ఫీజు ● స్విమ్మర్లపై పడనున్న ఆర్థిక భారంత్వరలో టెండర్ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్విమ్మింగ్పూల్ నిర్వహణకు సంబంధించి టెండర్ నిర్వహణ ఉంటుంది. ఓపెన్ యాక్షన్ పద్ధతిలో సాగే ఈ టెండర్లో ఏడాదికి రూ.10.89లక్షలు అంచనా వ్యయం రూపొందించడం జరిగింది. రూ.2లక్షల ఈఎండీ చెల్లించి టెండర్లో పాల్గొనాలి. పూర్తి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తాం. – తిరుపతి, డీఈ, మున్సిపాలిటీ అనుభవజ్ఞులతో కోచింగ్ ఇచ్చేలా చూస్తాం ప్రైవేట్ వ్యక్తులకు స్విమ్మింగ్పూల్ నిర్వహణను అప్పగిస్తున్నా అనుభవజ్ఞులైన స్విమ్మింగ్ కోచ్ల ద్వారా శిక్షణ ఇచ్చేలా చూస్తాం. ఇవీ టెండర్ నిబంధనలో ఉన్నాయో లేవో తెలియవు. అయితే మున్సిపాలిటీ నుంచి టెండర్లు నిర్వహించి సక్సెస్పుల్ బిడ్డర్ ఎవరనేది మాకు తెలియపరుస్తారు. హైజనిక్ పద్ధతిలో ఈత కొలను నిర్వహణను చేసేలా చూస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో సాక్షి, ఆదిలాబాద్: వేసవి వచ్చిందంటే జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గల స్విమ్మింగ్పూల్ సందడిగా మారుతోంది. సెలవుల్లో చిన్నారులు ఈత నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటారు. పెద్దలు సైతం వేసవి తాపం నుంచి సేదతీరేందుకు స్విమ్మింగ్ వైపు ఆసక్తి కనబరుస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్విమ్మింగ్పూల్ నిర్వహణ ఉంటే ఫీజులు అదుపులో ఉండేవి. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. అధికారికంగా టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ చేతిలో పెట్టనున్నారు. దానికి రంగం సిద్ధమైంది. ఆ కాంట్రాక్టర్ ఇష్టారీతిన ఫీజులు నిర్దేశించే అవకాశముంది. దీంతో స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే అనేక మంది చిన్నారులకు ఇది ప్రతిబంధకంగా మారే పరిస్థితి లేకపోలేదు. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నాలుగు దశాబ్దాలుగా స్విమ్మింగ్పూల్ ని ర్వహణ కొనసాగుతుంది. మొదట్లో కోచ్ను నియమించి చిన్నారులకు శిక్షణ ఇచ్చేవారు. ఏటా వేసవి వచ్చిందంటే సెలవుల్లో వందలాది చిన్నారులు కోచింగ్ కోసం బారులు తీరేవారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో పలువురు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనబరిచారు. జిల్లాకు వన్నె తెచ్చారు. ఇదంతా ఒకప్పటి మాట. గడిచిన దశాబ్దన్నరగా ఈ స్విమ్మింగ్ పూల్ పూర్తిగా నిరాదరణకు గురవుతోంది. సరైన కోచ్లను నియమించకపోవడం, దాని నిర్వహణను అంతగా పట్టించుకోకపోవడంతో చిన్నారులు కోచింగ్లా కాకుండా ఏదో వేసవిలో ఆట విడుపుగా మాత్రమే ఇక్కడ స్విమ్మింగ్ పరిమితంగా మారింది. అంతే కాకుండా ఈత మంచి ఎక్సర్సైజ్గా భావించి పలు వురు యువకులు, పెద్ద వయ స్సు వారు ఇందులో స్విమ్మింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహారం మారుతోంది. టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్పూల్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుండటంతో ఇకపై నామమాత్రపు ఫీజులు ఉండవు. అలాగే దీని ద్వారా ఆదాయం ఆశించే కాంట్రాక్టర్ కోచ్లను నియమించి శిక్షణ ఇస్తాడనుకోవడం పొరపాటే అవుతోంది. మొత్తంగా ఆదిలాబాద్ స్విమ్మింగ్పూల్ కల తప్పిపోనుంది. టెండర్కు రంగం సిద్ధం ఈ స్విమ్మింగ్పూల్ను రెండేళ్ల క్రితం ఇందులో శిక్షణ ఇచ్చే ఓ ప్రైవేట్ కోచ్కు లీజుకు ఇచ్చారు. అప్పుడు టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి స్విమ్మింగ్ కోచ్ కావడంతో అంతగా విమర్శలు రాలేదు. అంతే కాకుండా గతం నుంచి చిన్నారులకు కొనసాగుతు న్న శిక్షణను కొనసాగించడంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అప్పట్లో ఏడాదికి రూ.9.90లక్షలు చెల్లించేలా ఈ కోచ్కు స్విమ్మింగ్పూల్ నిర్వహణను అప్పగించారు. అయితే తాజాగా దీని నిర్వహణను తొలిసారి అధికారికంగా టెండర్ నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు ఏడాది పాటు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ టెండర్ విధానంలో ఏడాదికి రూ.10.89లక్షలు దీని అంచనా వ్యయంగా రూపొందించారు. అంత కంటే అధికంగా కోట్ చేసిన వారికి నిర్వహణను అప్పగిస్తామన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్ చేస్తుండగా ఈ బాధ్యతను మున్సిపాలిటీకి అప్పగించారు. ప్రమాణాలే లేవు ఓపెన్ టెండర్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనప్పటికీ ఈ పద్ధతిలో ఏమైన ప్రమాణాలు, నిబంధనలు పెట్టారా అంటే అలాంటివి లేనేలేవు. ఎవరు ఎక్కువ ధర కోట్ చేస్తే ఆ కాంట్రాక్టర్కు నిర్వహణను అప్పగించనున్నారు. తద్వారా ఇది పూర్తిగా వ్యాపార ధోరణిగా మార్చేస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఒకప్పుడు కలెక్టర్గా కొనసాగిన వారు ఇక్కడ స్విమ్మింగ్ శిక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఫలితాలు కూడా తదనుగుణంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారించాలనే అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతుంది.