Adilabad District Latest News
-
ఇన్చార్జి ఈవో ఇంకెన్నాళ్లో..!
భైంసా: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర క్షేత్రంపై గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో బాసర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇచ్చి రూ. 42 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల క్రితం బాసరలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసర ఆలయ మాస్టర్ ప్లాన్పై వివరించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆలయ విస్తరణ, గర్భగుడి పునర్నిర్మాణం, గోదావరి స్నానఘట్టాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికీ ఇన్చార్జీ ఈవోనే.. బాసర ఆలయంలో గత కొన్నేళ్లుగా ఇన్చార్జీ ఈవోతోనే పాలన కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటన నాటికై నా రెగ్యూలర్ ఈవోను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయ పరిపాలనలో తీవ్ర లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయానికి ఏళ్ల తరబడి శాశ్వత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) నియామకం జరగలేదు. దీని వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ లోపించడంతో అక్రమాలకు అవకాశం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరత.. సిబ్బంది కొరత ఆలయ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లలో మొత్తం 6 పోస్టులకు గాను 4 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్లలో 10 పోస్టులకు నలుగురు, రికార్డ్ అసిస్టెంట్లు ముగ్గురు, సూపరింటెండెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక వాగ్దేవి సొసైటీ కింద 84 మంది పని చేస్తున్నారు. ఈ సిబ్బందిని లడ్డూ కౌంటర్లు, ఎలక్ట్రిషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేయిస్తున్నారు. ప్రత్యేక పర్వ దినాల్లో సిబ్బంది లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బాసర సరస్వతీ ఆలయం ఇంజినీరింగ్ విభాగంలో.. బాసర ఆలయంలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇక్కడ పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసం డీఈఈ, ఏఈ, జేఈ, వర్క్ఇన్స్స్పెక్టర్లు అవసరం. కానీ ఈ శాఖలో ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఇంజనీర్లు కూడా లేరు. వందల కోట్ల రూపాయలతో పనులు చేపడుతుంటే పర్యవేక్షించే అధికారులు లేక పోవడం గమన్హారం. ఇక బాసరలో ఉత్సవాల్లో కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తీరు, ఫిర్యాదులపై ఇప్పటికే దేవాదాయ శాఖ విచారణ కూడా చేపట్టింది. అయినప్పటికీ ఆలయంలో పూర్తిస్థాయి మార్పులైతే జరగడం లేదు. సీఎం పర్యటన బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.100 కోట్లతో సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పనుల శంకుస్థాపనలు సీఎం రేవంత్రెడ్డి చేయనున్నారు. ఇప్పటికే బాసర ఆలయ అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. బాసర అభివృద్ధిపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పలుమార్లు అసెంబ్లీలోనూ చర్చించారు. సీఎం రేవంత్రెడ్డితో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే బాసర అభివృద్ధిపై చర్చించారు. సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పది’ మూల్యాంకనం షురూ
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో స్పాట్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇదివరకు పది పరీక్షలు ముగిసిన తర్వాత మూల్యాంకనం జరిగేది. ఈ ఏడాది మార్చి 14 నుంచి మొదలై ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రతీ పరీక్షకు మూడు, నాలుగు రోజుల పాటు సమయం ఉంచారు. పరీక్షలు అయ్యేవరకు ఆలస్యం కానుండడంతో ప్రస్తుతం ముగిసిన పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకన కేంద్రానికి వచ్చాయి. మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాకు 2లక్షల 9వేల పేపర్లు.. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కో సం 15 జిల్లాలకు సంబంధించిన జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని కోడింగ్ చేసి అధికా రులు వాల్యూయేషన్కు ఇస్తున్నారు. తెలుగుకు సంబంధించి పేపర్లు 34,056, ఉర్దూ 4946, హిందీ 36,089, ఇంగ్లీష్ 15,321 పేపర్లు వచ్చాయి. వీటితో పాటు గణితం జవాబు పత్రాలు కూడా వచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి రోజు బుధవారం తెలుగు, ఇంగ్లిష్, హిందీ మూల్యాంకనం జరిగింది. గురువారం నుంచి గణితం షురూ కానుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. టీచర్ల నియామకం.. మూల్యాంకనం కోసం 42 మంది సీఈలను, 253 మంది ఏఈలను, 86 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. మొత్తం 381 మంది స్పాట్కు హాజరు కావాల్సి ఉండగా 295 మంది హాజరయ్యారు. వీరిలో 37 మంది సీఈలు, 221 మంది ఏఈలు, 37 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఐదుగురు సీఈలు, 32 మంది ఏఈలు, 49 మంది స్పెషల్ అసిస్టెంట్లు మొత్తం 86 మంది ఉపాధ్యాయులు స్పాట్కు హాజరు కావాల్సి ఉంది. కాగా మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 9 వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, రెండో విడత ఈనెల 10 నుంచి 17 వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రం, మూడో విడత ఈనెల 17 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం మూల్యాంకనం జరగనుంది. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా స్పాట్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ తెలిపారు. స్పాట్ను పకడ్బందీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఏజెన్సీ రక్షణ చట్టాలు అమలు చేయాలి
ఇంద్రవెల్లి: ఏజెన్సీ రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కులను పరిష్కరించాలనే డిమాండ్తో అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్వలో బుధవారం మండలంలోని గిన్నెర గ్రామపంచాయతీ ఆదివాసీలతో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడారు. ఏజెన్సీలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించాలని పేర్కొన్నారు. రిలే దీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహిస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, రాష్ట్ర నాయకుడు పుర్క బాపురావ్, జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి మండల అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, ఆదివాసీ నాయకులు ఆర్క ఖమ్ము, తుకారం, పుర్క చిత్రు, జుగ్నాక్ భరత్, సోయం రాందాస్, గేడం భారత్ ఉన్నారు. -
అనారోగ్యంతో బాలింత మృతి
● గత నెల 23న మగ శిశువుకు జననం ఉట్నూర్రూరల్: మండలంలోని హీరాపూర్ –జే గ్రామానికి చెందిన గిరిజన బాలింత కుంర జంగుబాయి (32) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంర చందు –జంగుబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మొదటి సంతానం 7 సంవత్సరాల పాప ఉంది. రెండో కాన్పు కోసం జంగుబాయి గత నెల 22న రిమ్స్లో చేరింది. మరుసటి రోజు మగ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రిమ్స్లో నయం కాకపోవడంతో వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. మంగళవారం హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి ప్రేమకు దూరం.. తల్లి జంగుబాయి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. జంగుబాయికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే బతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా సరైన వైద్యం అందలేదని వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నా చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
లొకేషన్ చేంజ్ చేస్తూ..
ఆదిలాబాద్టౌన్: బెట్టింగ్తో కొందరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గెలిచిన వారు అత్యాశతో మళ్లీ డబ్బులు పెడుతూ పొగొట్టుకుంటున్నారు. ఓడిన వారు అప్పుల్లో కూరుకుపోతున్నా రు. ముఖ్యంగా యువత ఈ మాయలో పడి జీవి తాలు నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఆన్లైన్లో గేమ్ నుంచి మొదలైన వ్యసనం తర్వాత బెట్టింగ్స్కు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమి తం కాగా ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. ప్రస్తు తం ఐపీఎల్ షురూ కావడంతో క్రేజ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దందాగా మార్చుకున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు బెట్టింగ్కు ఆకర్షితులవుతున్నారు. తెలి సీ తెలియని వయస్సులో ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. కూలీనాలి చేసుకునే వారు, ప్రైవేట్ ఉద్యోగులు సైతం బాధితులుగా మారుతుండడం గమనార్హం. పోలీసుల ఫోకస్.. ఆన్లైన్ బెట్టింగ్స్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సీసీఎస్ సిబ్బంది కన్నేసి ఉంచారు. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. వారిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం ఉంది. ఇటీవల ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు జిల్లాలో అవగాహన కార్యక్రమాలతో పాటు అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం ఉన్నప్పటికీ యాప్ల ద్వారా లొకేషన్ చేంజ్ చేస్తూ వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని యువత ఈ నిషేధిత యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యల్లో వెబ్సైట్లు, యాప్లలో ఇది నడుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఆటగాళ్ల తీరు, మ్యాచ్ గెలిచేదెవరు.. ఫోర్, సిక్స్.. ఇలా అన్నింటికి వేల రూపాయల్లో బెట్టింగ్ పెడుతున్నారు. యువకులతో పాటు పలు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. ఈ క్రేజ్ను దందాగా మలుచుకొని కొంత మంది బెట్టింగ్ యాప్ల ద్వారా తమ జేబులు నింపుకుంటున్నారు. -
ఏర్పాట్లు వేగవంతం చేయాలి
బజార్హత్నూర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న పిప్రి గ్రామంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఉంటుంద ని, ఈమేరకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్ట ర్ రాజర్షిషా అన్నారు. ఎస్పీ అఖిల్ మహజన్తో కలి సి సభాస్థలిని, హెలీప్యాడ్ను బుధవారం పరిశీలించారు. అనంతరం రైతువేదికలో జిల్లా, మండలస్థాయి అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. సభకు సుమారు 30వేల నుంచి 50వేల మంది హజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మండల అధ్యక్షులు జల్కే పాండురంగ్, అశ్విన్రెడ్డి, జంగుబాబు, భూమన్న, సర్పంచ్ కృష్ణకాంత్రెడ్డి, ఉపసర్పంచ్ విశాల్, లక్ష్మారెడ్డి, పోతన్న, సత్యనారాయణ, విఠల్, కిషన్, స్వామి, గణేశ్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చోడ: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని కామగిరిలో ఇందిరమ్మ ఇంటిని బుఽ దవారం ప్రారంభించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపీడీవో రవీందర్, జీపీవో కరుణకర్రెడ్డి, హౌసింగ్ ఏఈ హర్ష, సర్పంచ్ సుప్రియ, గ్రామస్తులు పాల్గొన్నారు. జనగణనకు సంసిద్ధులు కావాలి కై లాస్నగర్: జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధులు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జనగణన ప్రతీ దశను కచ్చితంగా సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. గృహ సముదాయాల గుర్తింపు, బ్లాకుల విభజన, డేటా నమోదు వంటి అంశాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని సూచించారు. ఫీల్డ్స్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులున్నారు. దివ్యాంగులకు మెరుగైన వైద్యసేవలు ఆదిలాబాద్టౌన్: దివ్యాంగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామ ని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్లో దివ్యాంగులు తమ వైకల్యాన్ని నిర్ధారించుకునేందుకు ఏర్పాటుచేసిన వైకల్య మూల్యాంకన కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఇప్పటివరకు వైక ల్య నిర్ధారణ పత్రాల కోసం దివ్యాంగులు అనే క ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలి పారు. ఇకపై ఆ ఇక్కట్లు తలెత్తకుండా రిమ్స్లోని క్రిటికల్ కేర్లో సెంటర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ముఖరా(కే)ను సందర్శించిన ఐఎస్వో ఆడిటర్
ఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె)ను ఐఎస్ వో ఆడిటర్ శివయ్య బుధవారం సందర్శించా రు. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయాల ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఇంకుడుగుంతలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈనెల 6నబజార్హత్నూ ర్ మండలంలోని పిప్రి గ్రామానికి సీఎం వస్తు న్న సందర్భంగా ఐఎస్వో సర్టిఫికెట్ జారీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీవో అతుల్ కుమార్, సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రూ.6 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
కై లాస్నగర్: ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రైతుబీమాతో పాటు రూ.6లక్షల నష్టపరిహారం చెల్లించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట దిగుబడి రాకపోవడం, రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బేల మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన గడ్డం రాంరెడ్డి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రైతు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మృతుడు తనకున్న 5ఎకరాల భూమితో పాటు 18 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, సోయబీన్ పంటలు సాగు చేశారన్నారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటట్ ఆవుల రాకేశ్, నారాయణ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు. -
లేబర్కోడ్లు రద్దు చేయాలని ధర్నా
కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు వీడనాడాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసం వందేళ్లకు పైగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా తీసుకువచ్చిందన్నారు. దీంతో కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదన్నారు. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇందులో వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
యజమాని ఇంట్లోనే దొంగతనం
ఆదిలాబాద్టౌన్: డబ్బుపై వ్యామోహంతో ఓ పని మనిషి కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడింది. ఈమేరకు ఇచ్చోడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దొంగలించిన 10 తులాల బంగారం, 10 తులాల వెండిని పోలీసులు రికవరీ చేశారు. బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇచ్చోడలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్సింగ్ ఇంట్లో పని మనిషిగా ఉన్న ఇచ్చోడ మండలం అడిగామకు చెందిన దేవ లక్ష్మి ఆమె కూతురుతో కలిసి యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. గత నెల 16న శుభకార్యానికి వెళ్లి వచ్చిన తర్వాత యజమాని కుటుంబం బంగారాన్ని ఇంట్లో భద్రపర్చారు. ఈ విషయాన్ని పని మనిషి లక్ష్మి గమనించి దొంగతనానికి కుట్ర పన్నింది. ఇంటి యజమాని లేని సమయంలో గత నెల 18న ఇంట్లో నుంచి బంగారం, వెండిని అపహరించింది. 26న మరో శుభకార్యానికి వెళ్లేందుకు యజమాని కుటుంబ సభ్యులు ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. 27న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. దొంగలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో ఇచ్చోడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. -
గాలివాన బీభత్సం
బజార్హత్నూర్లో నేలవాలిన మొక్కజొన్న పంటరాంనగర్లో ఎగిరిపడ్డ ఇంటిపైకప్పు రోడ్డుపై అడ్డుగా పడిన చెట్టు బజార్హత్నూర్ మండల కేంద్రంతోపాటు దేగామ, బోస్రా, జాతర్ల, గిర్నూర్, కొలారి, పిప్రి, కాండ్లీ, బోస్రా, ధరంపురి, టెంబి, రాంనగర్ గ్రామాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బోథ్, సొనాల మండలాల్లో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వడగళ్లతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. – బజార్హత్నూర్/బోథ్ -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
బోథ్: ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నియోజకవర్గానికి ఇటీవల మూడు కొత్త సబ్స్టేషన్లు మంజూ రైనట్లు తెలిపారు. బోథ్ మండలంలోని ధ న్నూర్ (బి), నేరడిగొండ మండలంలోని కు ప్టి, తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ధన్నూర్ (బి)లో బుధవారం ఆయన స్థల పరిశీలన చేశారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6న బ జార్హత్నూర్ మండలంలోని పిప్రిలో భూ మిపూజ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
ప్రగతి వివరణ.. ప్రణాళిక రూపకల్పన
కై లాస్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరిస్తూ గ్రామ, వార్డుల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈ సభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక నిధులు సైతం కేటాయించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. సంక్షేమ పథకాల ప్రగతిని తెలిపేలా... కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత చేరువచేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డుస్థాయిలో ప్రజలకు వివరిస్తారు. అలాగే త్వరలో కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటి తదితర పథకాలను ప్రజలకు వివరిస్తారు. దీంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారుల పేర్లను సభల్లో చదివి వినిపిస్తారు. వాటి అమలుపై పలువురి అభిప్రాయాలు స్వీకరిస్తారు. సమస్యల పరిష్కార ‘ప్రణాళిక’ ఆయా సభల్లో స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చిస్తారు. ప్రాధాన్యత ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలనే దానిపై తీర్మానాలు చేస్తారు. ఈ వివరాలన్నింటిని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించేలా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయస్తారు. సమస్యలను, స్థానికంగా ఉన్న పరిస్థతులను అధికారుల దృష్టికి తీసుకొచ్చేలా ప్రభుత్వం నుంచి వారు ఇంకా ఏమి ఆశిస్తున్నారనే వివరాలను తెలియజేసేలా ప్రతి జీపీ పరిధిలో ఫిర్యాదుల పెట్టెను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజల భాగస్వామ్యంతో .. ప్రత్యేక నిధుల విడుదల గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దశలవారీగా ప్రభుత్వం సభలను నిర్వహిస్తుంది. ఇందుకోసం జిల్లాకు రూ.166.20లక్షలను మంజూరు చేసింది. అయితే నేడు నిర్వహించే గ్రామ, వార్డు సభలకు రూ.10వేల చొప్పున కేటాయించింది. ఏప్రిల్ 16న నిర్వహించే మండల, మున్సిపల్ స్థాయిలో జరిగే సభలకు రూ.2లక్షల చొప్పున, నియోజకవర్గస్థాయిలో జరిగే కార్యక్రమానికి రూ.10లక్షలు, జిల్లా స్థాయి కార్యక్రమానికి రూ.50లక్షల చొప్పున నిధులను కేటాయించింది. జిల్లాలో.. గ్రామ పంచాయతీలు : 473 విడుదలైన నిధులు : రూ.47.30లక్షలు మున్సిపాలిటీలోని వార్డులు: 49 విడుదలైన నిధులు : రూ.4.90లక్షలు సర్పంచ్, కౌన్సిలర్ అధ్యక్షతన నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో రైతులు, యువత, స్వయం సహాయక మహిళా సంఘాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులను ఆహ్వానించనున్నారు. కలెక్టర్ రాజర్షి షా ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్ మేజర్ పంచాయతీలో నిర్వహించే గ్రామసభలో పాల్గొననున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం హాజరుకానున్నారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ తమ నియోజకవర్గాల్లోని ప్రధాన పంచాయతీల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. కాగా సభల ప్రాధాన్యత చాటేలా ముద్రించిన ప్రచార పోస్టర్లను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియోరూపంలో ప్రజలకు వివరించనున్నారు. అనంతరం సభ నిర్వహిస్తారు. -
శ్రీకాంత్ షిండేను కలిసిన ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వడూర్ వద్ద పెన్గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న ఆవశ్యకత గురించి ఆయనతో చర్చించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ షిండే త్వరలోనే అధి కారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ అంశాన్ని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్రావు ఉన్నారు. -
అకాల వర్షం.. పంట నష్టం
ఇంద్రవెల్లి/బోథ్: జిల్లాలో పలుచోట్ల సోమవారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూ డిన అకాలవర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. ఇంద్రవెల్లి మండలకేంద్రంతో పాటు మండలంలోని దనోరా(బి), ముత్నూర్, గౌరాపూర్, తెజాపూర్, కేస్లాపూర్, అంజీ తదితర గ్రామాల్లో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగి దెబ్బతిన్నాయి. ఈమేరకు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న పంట నష్టం పరిశీలించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే బోథ్, సొనాల మండలాల్లోనూ మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. -
● 2026–27 వార్షిక బడ్జెట్ ఖరారు ● గతేడాదితో పోల్చితే రూ.51.16 కోట్లు పెంపు ● ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
ప్రధాన కేటాయింపుల వివరాలు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు : రూ.13.70 కోట్లు పారిశుద్ధ్య, నీటి సరఫరా నిర్వహణ : రూ.4.07 కోట్లు విద్యుత్ చార్జీలు : రూ.5.06 కోట్లు 10శాతం గ్రీన్ బడ్జెట్ : రూ.2.37 కోట్లు వార్డుల వారీగా అభివృద్ధి పనులకు : రూ.2.60 కోట్లుసమావేశానికి హాజరైన కౌన్సిల్ సభ్యులు కై లాస్నగర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్ను రూ.157.56 కోట్లతో రూపొందించారు. గతేడాదితో పోల్చితే 10శాతం నిధులు అదనంగా పెంచారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఈ బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంచనాలతో కాకుండా వాస్తవికంగా జరిగే ఖర్చుల ప్రకారం కేటాయింపులు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ ఆదాయ అంచనాల వివరాలు నూతన ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల ద్వారా రూ.14కోట్ల 35లక్షల 25వేలు, పన్నేతర విభాగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల ద్వా రా రూ.16కోట్ల 71లక్షల 15వేలు సమకూరనున్నట్లుగా అంచనా వేశారు. అలాగే మున్సిపల్ సాధారణ నిధులు ఆస్తిపన్ను, వేకెండ్ల్యాండ్ ట్యాక్స్ సంబంధించిన పన్నుల ద్వారా రూ.30 కోట్లు, నాన్ ప్లాంట్స్ గ్రాంట్స్ కింద రూ.24కోట్లు, ప్లాన్ గ్రాంట్స్ కింద రూ.9కోట్లు ఇతర గ్రాంట్స్ ద్వారా రూ.9కోట్ల 50లక్షల ఆదాయం రానున్నట్లుగా అంచనా వేశారు. గతేడాదితో పోల్చితే .. గత బడ్జెట్ కేటాయింపులో పోల్చితే ఈ సారి పలు అంశాల్లో తగ్గించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం గతంలో రూ.14.30 కోట్లు కేటాయించగా ఈసారి కొంత కోత విధించారు. పారిశుద్ద్య, నీటి సరఫరా నిర్వహణకు గతంలో రూ.3.08 కోట్లు కేటాయించగా ఈ సారి కొంత పెంచారు. విద్యుత్ చార్జీల బడ్జెట్ గతేడాది రూ.3.81 కోట్లు ఉండగా బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఈసారి భారీగా పెంచారు. నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకపోవడంతో 10శాతం గ్రీన్ బడ్జెట్ను రూ.4.66 కోట్ల నుంచి సగానికి తగ్గించారు. వార్డుల వారీగా చేపట్టే అభివృద్ధి పనులకు రూ.3.15 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు తగ్గించారు. తప్పనిసరిగా చేయాల్సిన కేటాయింపుల్లో ... పట్టణంలో విలీనమైన ప్రాంతాలు, బీసీ, మైనార్టీల నివాసిత వార్డులు, ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేని ప్రాంతాల్లో అంచనా బడ్జెట్ మిగులు నిధుల్లో 1/3 కేటాయింపులు తప్పనిసరిగా చేయాలనే ని బంధనల మేరకు రూ.కోటి 30లక్షల 20వేలను ప్రతిపాదించారు. అలాగే రోడ్ల నిర్మాణం కోసం రూ.65.20లక్షలు, కాలువల నిర్మాణాలకు రూ.45లక్షలు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలకు రూ.15లక్షలు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం రూ.5లక్షల చొప్పున అదనంగా కేటాయింపులు చేశారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు.. మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం రసాభాసగా మారి ఆందోళన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పలువురు ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభం నుంచి ముగిసే వరకు వారంతా సమావేశ మందిరంలోనే ఉండి విధులు నిర్వహించడం గమనార్హం. -
విద్యుదాఘాతంతో ఆవు మృతి
ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టి) గ్రామానికి చెందిన చిందం చిన్న దేవన్నకు చెందిన ఆవు సోమవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి ఆవుపై పడ్డాయి. దీంతో షాక్ తగిలి ఆవు మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. కౌటాలలో తేనెటీగల దాడికౌటాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పలువురిపై మంగళవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేశాయి. సమీప చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. కార్యాలయం తలుపులు మూసుకుని అందులోనే ఉన్నారు. రామగిరి విజయ్, దివాకర్, తిరుమలేశ్, హన్మంతు తేనెటీగల దాడిలో గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించారు. అధికారులు స్పందించి తేనెటీగల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. డీఅడిక్షన్ సెంటర్కు బాలుడి తరలింపు చెన్నూర్: చెన్నూర్ పట్టణానికి చెందిన బాలుడు (17) గంజాయికి అలవాటు పడడంతో పోలీసులు డీఅడిక్షన్ సెంటర్కు తరలించారు. ఇందుకు సంబంధింని వివరాలను మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ బన్సీలాల్ వెల్లడించారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం.. బాధిత బాలుడు స్నేహితులతో కలిసి గంజాయికి బానిసయ్యాడు. మహా రాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తెచ్చుకుని తాగుతున్నాడు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయినా, అతడి ప్రవర్తలో ఎ లాంటి మార్పు రాలేదు. గంజాయి తరచూ సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడిని ప ట్టుకుని వైద్యాధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు రావడంతో కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టా రు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలుడిలో మార్పు రావడానికి వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాలలోని డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడిడితే వెంటనే ప్రవర్తన మా ర్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేసి డీ అడిక్షన్ సెంటర్కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు. సమాశంలో ఎస్సైలున్నారు. విహారయాత్రకు గిరిజన క్రీడాకారులుఖానాపూర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన క్రీడాకారులకు అరుదైన అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, క్రీడా పాఠశాలల విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు జూపార్క్, లుంబిని పార్క్ను సందర్శించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విహారయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో విద్యార్థులు ఫొటోలు దిగారు. కాగా, 2025–26 సంవత్సరానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఖో–ఖో, ఆర్చరీ, వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే. రైలు ఢీకొని వృద్ధుడి మృతితాండూర్: మండలంలోని ఐబీ ప్రాంతంలోగల శనివారం సంత సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని చంద్రపల్లి గ్రామానికి చెందిన కంబాల బక్కయ్య (78) మంగళవారం రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొ ని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, ఉద్యోగ, కార్మికులు వేతనాల పెంపు కోసం చలో హైదరాబాద్కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసులతో దాడులు చేయించడం దారుణమని అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఐకేపీ వీవోఏలు, భవన నిర్మాణ రంగాల కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సీపీఎం మద్దతు ఉంటుందని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలని, ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని చెప్పారు. అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాల వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాళేశ్వరం ముంపు సమస్యకు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయించాయో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ బహిర్గతం చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడంకి చందు, అశోక్, ప్రకాష్, ఉమారాణి, మల్లేశ్వరీ, లింగన్న, రంజిత్కుమార్, శ్రీనివాస్, ప్రేంకుమార్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ డీఆర్డీవోకు అరుదైన గౌరవం
నిర్మల్ఖిల్లా: ప్రపంచ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ గౌరవ్రత్నశ్రీ సమ్మాన్’ పురస్కారాల కార్యక్రమంలో నిర్మల్ డీఆర్డీవో కె.విజయలక్ష్మి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. తొమ్మిది దేశాలకు చెందిన హైకమిషనర్లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించగా, దేశవ్యాప్తంగా వందమందిని ఎంపికచేసి పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆమెను హ్యూమన్ రైట్స్ కమిషన్ శాశ్వత సభ్యురాలిగా కూడా నియమించారు. శ్రీలంకలో భారత హైకమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప మహిశిని, కాన్సులేట్ జనరల్ కేఎల్ గంజు తదితరులు పాల్గొని డాక్టరేట్తోపాటు, ఽశాశ్వతసభ్యురాలిగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
ఉరేసుకుని మహిళ మృతి
ముధోల్: మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన ముష్కు రజిత (26) ఉరేసుకుని మృతి చెందింది. ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త పోశెట్టి ఏడాది క్రితం దుబాయికి వెళ్లాడు. ఆరు నెలల క్రితం ఫోన్లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతడి అన్నదమ్ములు వచ్చి రజితను సముదాయించి వెళ్లారు. ఈ క్రమంలో పోశెట్టి రజితపై అనుమానం పెంచుకుని నువ్వు బతకొద్దని పదేపదే ఫోన్లో తిట్టేవాడు. దీంతో క్షణికావేశంలో రజిత మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి కొడుకు రిషితేజ, కూతుళ్లు తేజస్విని, వయశ్రీక ఉన్నారు. తల్లి చనిపోవడం, తండ్రి దుబాయిలో ఉండడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోఆప్షన్.. ఎప్పుడో?
బోథ్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు పడడం లేదు. సాధారణంగా నూతన పాలకవర్గం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ జీపీకి ముగ్గురు.. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి కోఆప్షన్ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, మూడో వ్యక్తిగా పంచాయతీకి స్థలం ఇచ్చిన దాత లేదా ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఐ) నియమించాలి. వీరికి వార్డు సభ్యులతో సమానమైన హోదా ఉంటుంది. అయితే సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటు హక్కు మాత్రం ఉండదు. జిల్లాలో 473 పంచాయతీలు.. జిల్లాలో గతేడాది డిసెంబర్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 473 గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు అందుబాటులోకి కూడా వచ్చాయి. నాలుగు నెలలవుతున్నా కోఆప్షన్ సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో ఉన్న జీపీల ప్రకారం మొత్తం 1,419 మందిని కో ఆప్ష న్ సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. గ్రామ అభివృద్ధిలో వీరి సలహాలు పంచాయతీ సభ్యులు తీసుకుంటారు. ప్రస్తుతానికి ఈ నియామకాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి మార్గదర్శకాలు అందలేదని తెలుస్తోంది. ఆదేశాలు రాగానే నియమిస్తాం ప్రతీ పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చాక ప్రక్రియ పూర్తి చేస్తాం. – రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
సీఎం సభ జయప్రదం చేయాలి
బజార్హత్నూర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పిప్రిలో ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ కోరారు. ఈ గ్రామాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత తీసుకు న్న విషయం తెలిసిందే. కాగా, సభాస్థలిని జి ల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పార్టీ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మండల అధ్యక్షు డు జల్కే పాండురంగ్, అశ్విన్రెడ్డి, జంగుబా బు, చిల్కూరి భూమన్న, సర్పంచ్ కృష్ణకాంత్రెడ్డి, ఉపసర్పంచ్ విశాల్, లక్ష్మారెడ్డి, పోతన్న, సత్యనారాయణ, విఠల్, కిషన్, స్వామి, గణేశ్ తదితరులు ఉన్నారు. -
బెల్లంపల్లి డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. డిగ్రీలో ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా మూడేళ్లపాటు చదివే అద్భుత అవకాశం విద్యార్థులకు దక్కబోతోంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సు విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని మల్టీజోన్–1 పరిధిలో ఈ కోర్సు కలిగిన ఏకై క కళాశాలగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత ఏర్పర్చుకుంది. ఉన్నత విద్యావ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేసి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన బీఏ హానర్స్ కోర్సు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బెల్లంపల్లి విద్యార్థులకు చేరువ కానుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. వీరికే ప్రవేశార్హత బీఏ హానర్స్ కోర్సులో చేరడానికి ఇంటర్ తత్సమా న కోర్సులతోపాటు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వి ద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్లో హెచ్ఈసీ, సీ ఈసీ, బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఒకేషనల్ చదవిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల కోర్సుల విద్యార్థులు చదవగలిగే సబ్జెక్ట్ను బీఏ హానర్స్ డిగ్రీలో ఎంచుకోవచ్చు. ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా తీసుకుని మూడేళ్లపాటు చదవడం ద్వారా ఆ సబ్జెక్ట్లో అత్యుతన్నతమైన పట్టు సాధించే అవకాశం కలగనుంది. అంతటి ప్రత్యేకమైన కో ర్సు కేవలం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద క్కించుకుని అరుదైన ఘనత సాధించడం విశేషం. -
అన్ని రంగాల్లో పట్టణాభివృద్ధి : కలెక్టర్
ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మున్సిపల్ పురోభివృద్ధిలో బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ, నూతన సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలి పారు. ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫ రా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అమృత పథకం కాలపరిమితి మరో ఏడాది పొడిగించబడిందని దీని ద్వారా పెండింగ్లో ఉన్న డ్రెయినేజీ, మంచినీటి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా కార్మికుల జీతాలు, వాహనాల నిర్వహణ కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించినట్లు వివరించారు. -
ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు
కై లాస్నగర్: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఈ నెల 2న గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 2 నుంచి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. గ్రామసభల్లో ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని వారికి వివరించాలన్నారు. ఈ సభలను సీఎం సందేశంతో ప్రారంభించి, వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్ల వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో చదివి వినిపించాలని, లబ్ధిదారుల అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని చెప్పారు. ఈ వీసీలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు వ్యసనాల నుంచి విముక్తి లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: మత్తు వ్యసనాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీ–అడిక్షన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు నాగరాజు, స్వామి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం తాంసి: జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్ర– మాండ్వికి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై పలుచోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. పొన్నారి వద్ద ఏర్పాటు చేసిన బోర్డును ఎస్పీ మంగళవారం ప్రారంభించారు. అరైవ్ అలైవ్ భాగంగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, రూరల్ సీఐ కే.ఫణిధర్, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, పొన్నారి సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ రాంరెడ్డి, తదితరులున్నారు. డ్రైవర్లకు నేత్రవైద్య పరీక్షలు ఉట్నూర్రూరల్: మండలకేంద్రంలో జిల్లా పోలీ సుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఉచి తంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం డ్రైవర్లకు వైద్యులు సంధ్య పుష్కర్ పరీక్షలు నిర్వహించారు. 30 మందికి ఉచితంగా అద్దాలు అందించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సైలు జి.విజయ్, సాయన్న, శ్రీ సాయి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సుందరమైన ‘దువ్వెన బాతు’
జన్నారం: ఈ చిత్రంలో కనిపించే బాతు గడ్డితో కూ డిన మంచినీటి కొలనులు, కుంటలు, నదుల్లో నివసించే వలస పక్షి. మగ బాతుల్లో ముక్కు మీద దు వ్వెన లాంటి నిర్మాణం ఉండడంతో వీటిని కోంబ్ డక్స్ లేదా నాబ్ బిల్డ్ డక్స్ అంటారు. దువ్వెన బా తు, జుట్టు చిలువ అని స్థానిక భాషలో పిలుస్తారు. ఇవి సుదూర ప్రయాణాలు చేస్తాయి. కొన్ని పక్షులు మూడున్నర వేల కిలో మీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. గడ్డి విత్తనాలు, నీటిలో పెరిగే మొక్కలు, కీటకాలు, చిన్న చేపలు, కప్పలు వీటి ఆహారం. ఇవి భారత ఉపఖండ దేశాలు, మియన్మార్లో వ్యాపించి ఉన్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. ఈ బాతులు కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం డివిజన్లోని కిష్టాపూర్ చెరువులో కనిపించగా ఎఫ్డీవో రామ్మోహన్ కెమెరాలో బంధించి వాటి వివరాలు తెలిపారు. -
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ఉట్నూర్రూరల్: ఉమ్మడిజిల్లాలో గిరిజన సహ కార సంస్థ ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపు వ్వు, ఇప్పగింజలు,చిల్లగింజలుమొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాల ని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీ ప్కుమార్ అన్నారు. గిరిజన సహకార సంస్థ ఉ ట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.డివిజన్ కార్యా లయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు,సిబ్బంది తో సోమవారం సమీక్ష నిర్వహించారు. గిరిజ నుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలన్నారు.నూతన డీఆర్డిపోల్లో బియ్యం తోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులోఉంచుతామన్నారు.ఇందులో సీనియర్ మేనే జర్లు సంతోష్కుమార్, తారాచంద్,రమేశ్, మ నోహర్, ఇస్తారి, లక్ష్మణ్, సిబ్బందిపాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: ఇటీవల జరిగిన సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సన్మానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి సత్కరించారు. టీఎంఎస్ఎస్ ఉట్నూర్, ఖానాపూర్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పతకాలతో సత్తా చాటారు. రా బోయే రోజుల్లో మరిన్ని వేదికల్లో సత్తా చాటాల ని ఆ కాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులకు నెహ్రూ జువాలజీకల్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శింపజేశారు. ఉత్సాహంగా గడిపిన ఎమ్మెల్యే వారితో డిన్నర్ చేశారు. సన్మానం పొందిన వారిలో పతకాలు సాధించిన ఎస్.నవీన్, యు.గణేశ్, ఎం.మారుతి, ఎమ్.నిఖిల్ కుమార్, ఎస్.శంకర్, కె.సురేందర్, ఆర్.శివసాయి, ఏ.యాదవ్ శావ్, పి.హనుమంతరావు, హెచ్ కె.నగేశ్ ఉన్నారు. క్రీడాకారులతోపాటు జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, నిర్మల్ డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, శిక్షకులు శివ, రాజకుమార్, హెచ్డబ్ల్యూఓ గంగారం తదితరులు ఉన్నారు. -
బల్దియా బడ్జెట్పై ఆశలు
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన 2026–27 బడ్జెట్ను మంగళవారం ఖరారు చేయనున్నారు. చైర్పర్స్న్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నూతన కౌన్సిల్ కొలువుదీరాక ప్రవేశపెడుతున్న తొలిబడ్జెట్ కావడంతో పట్టణ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పను లకు ఎలాంటి కేటాయింపులు చేయనున్నారనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రూ.100 కోట్లపైనే ఆశలు.. మున్సిపల్ ఎన్నికలకు ముందు టీయూఎఫ్ ఐడీసీ ద్వారా రూ.18.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా నిధులతో చేపట్టే పనులకు అధికారులు ప్రతి పాదనలు సైతం సిద్ధం చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జిమంత్రి సీతక్క భూమిపూజ కూడా చేశారు. అయితే ఆ పనులను ప్రారంభించకుండా అధికారులు మరోసారి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు మార్చారు. వాటికనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ నిధులను ప్రాధాన్యత ప్రకారం కేటా యిస్తారా, లేక మరోసారి ప్రతిపాదనలు రూపొందిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. ఇక చైర్పర్సన్ అనూష బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా ఇన్చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావును హైదరాబాద్లో ప్రత్యేకంగా కలిశారు. పట్టణాభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞ ప్తి చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆ దిశగా ప్రతి పాదనలు సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ రాజర్షి షాను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిధులు విడుదలైతే పట్టణ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి దోహదపడనుంది. లోపిస్తున్న సమతూకం .. ఈ మున్సిపాలిటీ గ్రేడ్–1 స్థాయికి ఎదిగినా అభివృద్ధిపరంగా వెనకబడి ఉందనే అభిప్రా యం వ్యక్తమవుతుంది.పట్టణంలోని విలీ న కాలనీల్లో ఇప్పటికీ తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి మౌలిక వసతుల్లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప ట్టణ ఆదాయ, వ్యయాల్లో ఉన్న వ్యత్యాసమే కారణంగా తెలుస్తోంది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు అందని పరిస్థితి. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి వచ్చే నిధులు కూడా ఆశించినంతగా ఉండడం లేదు. దీంతో నూతన అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. బల్దియాకు జనరల్ ఫండ్ ద్వారా సమకూరే ఆదాయంలో సింహభాగం మున్సిపల్ కార్మికుల వేతన చెల్లింపులకే పోతుంది. మిగిలిని కొద్ది పాటి నిధులను అత్యవసరమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల మరమ్మతులకు వినియోగిస్తున్నారు. ఇలా ఆదా య, వ్యయాల మధ్య సమతూకం లేకపోవడంతో బల్దియా సమస్యలు పరిష్కారానికి నోచుకోక అభివృద్ధికి అటంకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పట్టణంలో ప్రస్తుతం రూ.1.5 కోట్ల ట్రేడ్ లైసెన్స్ నిధులు పెండింగ్లో ఉండటం అధి కారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇకఆస్తిపన్ను, వీఎల్టీలను పూర్తిగా వసూలు చేయడం లేదని, ప్రచార హోర్డింగ్లతో వచ్చే ఆదా యం సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. చర్చిస్తారా .. లడాయికి దిగుతారా నేటి బడ్జెట్ సమావేశం సాఫీగా సాగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. గత నెలలో నిర్వహించిన కౌన్సిల్ తొలి సమావేశంలోనే అధికార, ప్రతి పక్ష కౌన్సిల్ సభ్యులు ఆరోప, ప్రత్యారోపణలతో రసాభాసాగా మారింది. ఈ సమావేశంలోనైనా సభ్యులు రాజకీయాలు చేస్తూ లడాయికి దిగుతారా లేక ప్రజలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సూచనలు, సలహాలు చేస్తారా వేచి చూడాల్సిందే. -
మా ట్రాక్ స్పీడ్ పెంచండి..
నిర్మల్: నాగ్పూర్–హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గించడంతోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక రైల్వేలైన్గా ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ నిలుస్తుందని, సంబంధిత రైల్వేలైన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసేలా చూడాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు, జిల్లావాసి సిర్గాపూర్ నిరంజన్రెడ్డి కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిశారు. ఆర్మూర్–నిర్మల్ మీదుగా కేవలం 137కి.మీ. రైల్వేలైన్ నిర్మించడంతో కలిగే ప్రయోజనాలు, నిర్మాణం చేపట్టాల్సిన అవశ్యకతపై పూర్తి వివరాలతో, వివరణాత్మకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వేలైన్ ఎందుకంటే.. ఏళ్లుగా ఎదురుచూపులు.. నిర్మల్ మీదుగా రైల్వేలైన్ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అని, ప్రతీసారి కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తూ వస్తోందని ఎంపీ వివరించారు. ప్రతీసారి బడ్జెట్లో సర్వే చేస్తున్నారని, ఏడాదికేడాది ప్రతిపాదిత వ్యయం పెరుగుతోందని చెప్పారు. తక్షణమే ప్రారంభించాలని కోరాం.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి తక్షణమే ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు, మొదటిదశకు రైల్వేబోర్డు నుంచి త్వరగా అనుమతి ఇవ్వడంతోపాటు బడ్జెట్ కేటాంచాలని ప్రజెంటేషన్లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం రైల్వేబోర్డు దగ్గర ఉందని, త్వరగా పూర్తయ్యేలా తాను చూస్తానని ఆయన చెప్పారు. – సిర్గాపూర్ నిరంజన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ -
స్టెప్పులేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
ఆదిలాబాద్టౌన్: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ‘ప్రజాపాలన– ప్రత్యేక ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శాంతినగర్లోని పుత్లీబౌలి అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం ప్రత్యే క వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం స్పెషలిస్టు వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో సాధన, కౌన్సిలర్ నజీర్, స్పెషలిస్ట్ వైద్యులు సందీప్ కుమార్, దీపక్, ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్ చంద్రకళ, సీవో నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్– ఈకో క్లబ్ ఆధ్వర్యంలో ఆహార ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ప్రిన్సిపాల్ డా.అతిక్ బేగం, వైస్ ప్రి న్సిపాల్ రఘు గణపతి, కోటయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్సెట్టిపేట: మున్సి పల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మార్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.జనగణన పకడ్బందీగా చేపట్టాలికై లాస్నగర్: జనగణన కా ర్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సెన్సస్–2027పై స్థానిక టీటీడీసీలో ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుకు జనగణన కీలకమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో ప్రతీ వ్యక్తి వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలన్నారు. ఇళ్ల జాబితా తయారీ, గృహగణనలో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్,ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, పర్యవేక్షకులు నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు కె.శ్రీహరి బాబు, యువరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్, ఆడ సంపత్, సలహాదారుగా పుర్క ఉద్దవ్, మడావి గంగారాం, పూసం ఆనంద్ రావు, ఎన్నికయ్యారు. 108 సిబ్బందికి ఉత్తమ పురస్కారాలు ఇచ్చోడ: మండలంలో 108 సిబ్బంది ఈఎంటీ ప్యాట అనిల్కుమార్, పైలట్ సింగారం వినోద్లకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు లభించాయి. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందజేసి సకాలంలో ఆస్పత్రులకు తరలించి పలువురు ప్రాణాలు కాపాడినందుకు హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారా లు అందజేశారు. రాష్ట్రస్థాయిలో ఇచ్చోడ సిబ్బంది పురస్కారాలు అందుకోవడంపై మండల ప్రజలు అభినందించారు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది అరెస్టుఇచ్చోడ: ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇచ్చోడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బండారి రాజు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎంప్లాయీస్ కాలనీకి చెందిన గొలుసుల విజయ్ తన స్నేహితులు మురళీ, జాదవ్ రాము, కాంబ్లే ఆకాష్, సిడాం రవి, కాంబ్లే రాజ్కుమార్, కాంబ్లే అరుణ్, దాసన్న దేవాల, కాంబ్లే శశికుమార్, సీపెల్లి శ్రీనివాస్ ద్వారా చిట్టీల రూపంలో బృందావన్కాలనీ ప్రాంతంలో సోమవారం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విజయ్తో పాటు బెట్టింగ్లో పాల్గొన్నవారిని అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 3 బైక్లు, 9 సెల్ఫోన్లు, రూ.4470 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కడుపునొప్పి భరించలేక వ్యక్తి.. సిర్పూర్(టి): కడుపునొప్పి భరించలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాగర్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని పాతట్లగూడ కాలనీకి చెందిన పర్శన శంకర్(59) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఓవరాల్ చాంపియన్గా ఆదిలాబాద్
కై లాస్నగర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్–2025 (సెకండ్ ఎడిషన్) పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, కోచ్లు, సిబ్బంది వారు సాఽధించిన కప్తో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిఽశారు. వారిని అభినందించారు. క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల విజయవంతంలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియ, మండల, జిల్లాస్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ విజయానికి క్రీడాకారులతోపాటు కోచ్లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: మండలంలోని గుండి శివారులో నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. సోమవారం హత్య కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. 2022లో పెంచికల్పేట్ మండలానికి చెందిన సాగర్ ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికివెళ్లే దారిలో శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును ఎస్పీ చొరవతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సాగర్ను కాగజ్నగర్కు రమ్మని పిలిచి, ఆటోలో ఎక్కించి ఆసిఫాబాద్ మండలం గుండి శివారు పంట పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసును హత్యగా నిర్ధారించారు. కౌటాల బాలుర వసతి గృహం కుక్ కొండూరి మల్లేశ్వరి, కాగజ్నగర్ ద్వారాకానగర్కు చెందిన ఎన్నం అశోక్, పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చెన్నూరి స్వామి నేరాన్ని ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, చెన్నూరి స్వామి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు, వీరిలో సీఐ బాలాజీ వరప్రసాద్, డీసీఆర్బీ సీఐ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌటాల ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఐటీకోర్ కానిస్టేబుల్ మహేశ్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
ఇక వీబీ – జీ రాంజీ
సాక్షి, ఆదిలాబాద్: నూతన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2005 నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రాంజీ) చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంది. కొత్త చట్టంలో మార్పులు, చేర్పుల అంశాలను కేంద్రం ఇది వరకే ప్రకటించింది. పాత చట్టానికి సంబంధించి కూలీలు చేపట్టిన పనులకు సంబంధించి వేతనాల చెల్లింపు కోసం పది రోజుల గడువు పొడిగించింది. తద్వారా ఈ నెల 31లోగా కూలీల పనులకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడమే కాకుండా ఆ వేతనాలను కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతుంది. జిల్లా ఇదీ పరిస్థితి.. జిల్లాలో లక్ష 75వేల జాబ్కార్డులు ఉండగా 3లక్షల 46వేల మంది కూలీలు ఉన్నారు. ఇందులో లక్ష 11 వేల కార్డులు యాక్టివ్గా ఉండగా వాటి పరిధిలో 2 లక్షల ఏడు వేల మంది కూలీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ముగింపునకు చేరువైన ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు సంబంధించి 44లక్షల 79వేల ప నిదినాలు మంజూరు ఉంది. ఈ కొత్త చట్టంలోనూ సుమారుగా అవే పనిదినాలు మంజూరయ్యే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. మెటీరియల్ కంపొనెంట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.50 కోట్ల వరకు వెచ్చిస్తుండగా, కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ అంతే మొత్తం ఉండే అవకాశం ఉండనుందని అభిప్రాయపడుతున్నారు. పనిదినాలు పెంపు.. కొత్త చట్టంలో జాబ్కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఏడాదికి హామీ ఇవ్వబడిన ఉపాధిని 100 నుంచి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రెండు రకాలుగా పనులు జరుగుతాయి. కూలీలకు పని కల్పించడం ద్వారా వారికి వేతనాలు చెల్లించడం ఒకటైతే, మెటీరియల్తో నిర్మాణం చేపట్టే పనులు మరొకటి. కూలీల వేతనాలను ఇది వరకు కేంద్రం వంద శాతం భరించేది. కొత్త చట్టంలో మాత్రం ఇందులో మార్పులు తీసుకువచ్చారు. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరించాల్సి ఉంటుంది. ఇక మెటీరియల్ కంపొనెంట్లో ఇది వరకు 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇందులో 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం భరించేలా మార్పులు తీసుకువచ్చారు. రాష్ట్రాల మీద భారం పెంచేలా ఉందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. వ్యవసాయ విరామం.. కొత్త చట్టంలో 60 రోజుల వ్యవసాయ విరామాన్ని ప్రకటించారు. సాగు పనులు ఉధృతంగా సాగే కాలంలో తప్పనిసరిగా 60 రోజుల విరామాన్ని విధిస్తారు. దీన్ని రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా ఎంచుకునే విధంగా నిబంధనలు పెట్టారు. విత్తనాలు విత్తే సమయంతో పాటు, పంట దిగుబడులు చేతికి వచ్చే వేళ కూలీల కొరత తలెత్తకుండా ఈ విరామం ద్వారా నివారించాలని ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. లక్ష్యం ఖరారు కావాల్సి ఉంది కొత్త చట్టం విధి విధానాలు ఇది వరకే ఖరారైనప్పటికీ జిల్లాకు సంబంధించి పనిదినాలు, ఇత ర లక్ష్యాలను ఖరారు చేయాల్సి ఉంది. దానికి కొద్ది రోజుల సమయం పట్టవచ్చు. కేంద్ర ప్ర భుత్వం దీనికి సంబంధించి పూర్తిస్థాయి డిజైన్ రూపొందిస్తుంది. తదనుగుణంగా ముందుకెళ్ల డం జరుగుతుంది. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉల్లాస్ కా ర్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాలలో చ దువు చేర్చుకున్న వారికి ఆదివారం ఎఫ్ఎల్ఎన్టీ, ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 522 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లలో ఈ పరీక్ష ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. 14,186 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,908 మంది (84 శాతం) హాజరైనట్లు వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారికి త్వరలో సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జైనథ్, బేల, భోరజ్ తదితర మండలాల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఓపెన్స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తదితరులు ఉన్నారు. పలు కేంద్రాలను పరిశీలించిన డీఆర్డీవో ఇంద్రవెల్లి: సెర్ప్ ఆధ్వర్యంలో మండలకేంద్రంతోపాటు పలు పంచాయతీ కార్యాలయాల్లో స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్య సభ్యులకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో మంజుల, సీసీలు మోతిరాం, శ్రీరాం, పరశురాం, బాలాజీ, విఠల్రావ్, సునీత, భీమవ్వ, ఆయా గ్రామాల సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
మిగిలింది రెండు రోజులే!
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ఆస్తి పన్ను ఎంతో కీలకం. సకాలంలో వసూలైతేనే మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికుల వేతన చెల్లింపులు చేసేది. అంతటి కీలకమైన ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం ఈ సారి చేరేలా కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అయితే సగం కూడా వసూలు కాకపోవడం గమనార్హం. లక్ష్య సాధన కోసం అధికారులు, సిబ్బంది చెమటోడ్చుతున్నా గడువు తక్కువగా ఉండటంతో చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. వసూలైంది సగమే.. గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను లక్ష్యం రూ.16.5 కోట్లుగా ఉంది. వీటిని వసూలు చేసేందుకు కోసం బల్దియా అధికారులు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఆర్ఐలతో కూడిన 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు మున్సిపల్ ఎన్నికల అనంతరం తమకు కేటాయించిన కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు రూ.8 కోట్ల వరకు వసూలు చేశారు. కాగా మొత్తం డిమాండ్లో రూ.5.50 కోట్ల పన్నుకు సంబంధించిన ఆస్తులు బ్యాంకుల ఆధీనంలో, వివిధ కోర్టు కేసుల్లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పన్నులు వసూలు కావడం అనుమానమే. వీటిని మినహాయిస్తే మరో రూ.3.50 కోట్ల వసూలు చేయాల్సి ఉంది. మరో రెండు రోజులే సమయమున్నందున వీటిని ఏ మేరకు వసూలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ బల్దియా అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. లక్ష్య సాధనలో వెనుకబడినట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల నిలిచిపోయే ప్రమాదముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది చూడాలి మరి. గతేడాది ఇలా .. గత ఆర్థిక సంవత్సరం 2024–25కు గాను పట్టణ ఆస్తి పన్ను లక్ష్యం రూ.15 కోట్లుగా ఉంది. అందులో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.7.30 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గతేడాది ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 90శాతం రాయితీ అవకాశం కల్పించింది. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ లక్ష్యం చేరుకోకపోవడం గమనార్హం. ఈ సారి కూడా ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుందని చాలా మంది వ్యాపారులు, ఇంటి యజమానులు ఎదురుచూశారు. కానీ అలాంటి అవకాశం లేకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది. ప్రధానంగా బకాయిలపై అధికారులు దృష్టి సారించకపోవడంతో అవి గుదిబండలా మారి పట్టణ అభివృద్ధికి అవరోధంగా నిలుస్తోంది. స్వచ్ఛందంగా చెల్లించాలి పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలంటే ఆస్తిపన్ను ఎంతో కీలకం. పట్టణ ప్రజలు విషయాన్ని గుర్తించి ఆస్తిపన్ను చెల్లింపును బాధ్యతగా భావించాలి. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు చూడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు చెల్లించాలి. – కళ్యాణ్, రెవెన్యూ అధికారి -
● అంగన్వాడీ కేంద్రాల్లో ‘బ్రేక్ఫాస్ట్’ ● పౌష్టికాహార లోపానికి చెక్ ● జిల్లాలో త్వరలోనే అమలు
ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రెక్ఫాస్ట్ అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిముద్ద పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. జిల్లాలో ఆరు నెలల పైబడిన చిన్నారులు చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. రిమ్స్లోని న్యూట్రీషియన్ సెంటర్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఈ పథకం దోహదపడనుంది. అల్పాహారం ఇలా.. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబర్తో వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడి, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తుంది. పోషకాహారం అందించడమే లక్ష్యంగా.. చిన్నారులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తొలిముద్ద కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉదయం పూట చిన్నారులు ఇంట్లో తినితినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడతారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహారం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా, చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు : 1,288 మూడేళ్లు పైబడిన చిన్నారులు: 22వేలు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహారం లోపం అధిగమించేందుకు తొలిముద్ద కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలోనే ప్రారంభిస్తాం. తద్వారా చిన్నారుల గైర్హాజరు శాతం తగ్గనుంది. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
వార్డెన్ను సస్పెండ్ చేయాలి
ఇచ్చోడ: మండలంలోని మేడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ను సస్పెండ్ చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, డివిజన్ కార్యదర్శి ఆత్రం మహేందర్, మాన్కపూర్ సర్పంచ్ మాడవి భీంరావు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి వారు మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా విద్యార్థులకు తాగునీరు అందించకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో విఫలమైనట్లు విమర్శించారు. ఈ క్రమంలో తాము ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. -
లోక్ అదాలత్కు భారీ స్పందన
ఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. జిల్లాలో ఈనెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 423 ఎఫ్ఐఆర్లు, 1017 ఈ–పెట్టి కేసులు, 3,812 డ్రంకెన్ డ్రైవ్ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. 49 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు కోర్టు ద్వారా రూ.9లక్షల 95వేల 846 తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 147 ఎకై ్సజ్ కేసులకు గాను రూ.7లక్షల 35వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఇందులో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. లోక్ అదాలత్ విజయవంతం కోసం కృషి చేసిన జిల్లా జడ్జి ప్రభాకర రావు, న్యాయ సేవాధికార సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
లెక్క చెప్పింది 239..
పోటీ చేసిన అభ్యర్థులు 314 కైలాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచార వ్యయం వివరాలు సమర్పించే గడువు ముగిసింది. అయినా పలువురు ఇంకా అందజేయలేదు. ఇందులో ఓడిన వారితో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు వారికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. గడువులోపు స్పందించని వారిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 75 మంది ఇంకా ఇవ్వలే.. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. పట్టణంలోని 49 వార్డులకు గాను 314 మంది పోటీ చేశారు. ఫలితాలను అదే నెల 13న ప్రకటించారు. ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఫలితాలు వెల్లడైన నుంచి 45 రోజుల్లోగా తమ ప్రచార వ్యయ వివరాలు విధిగా అందజేయాల్సి ఉంటుంది. గడువు ఈనెల 27తో ముగిసింది. ఇప్పటి వరకు 239 మంది మాత్రమే ఈసీ నిర్దేశిత ప్రొఫార్మాలో అందజేశారు. మరో 75 మంది అందజేయాల్సి ఉన్నట్లుగా మున్సిపల్ అధి కారులు చెబుతున్నారు. చర్యలపై సర్వత్రా ఆసక్తి పోటీ చేసిన అభ్యర్థులకు మున్సిపల్ అధికారులు ఈసీ నిర్దేశిత ప్రొఫార్మాను ఉచితంగా అందజేశారు. ఆ ప్రకారం వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా లెక్కలు రాసినా, గడువులోపు సమర్పించకున్నా పదవీలో ఉన్న వారు అనర్హతకు గురయ్యే అవకాశముంటుంది. ఓటమిపాలైన వారు భవిష్యత్తులో మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసే వీలుండదు. దీనిపై అధికారులు నామినేషన్ సమయంలోనే అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈసీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారా మరింత గడువు ఇస్తారా వేచి చూడాలి. ఈసీ ఆదేశానుసారం చర్యలు గడువులోపు ఎన్నికల ప్రచార వ్యయ వివరాలు సమర్పించని వారి నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాం. చర్యలు తీసుకుంటారా లేదా గడువు పొడగిస్తారా అనేది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తదుపరి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – జి.రాజు, మున్సిపల్ కమిషనర్ -
వడదెబ్బతో ఒకరి మృతి
నార్నూర్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని తాడిహత్నూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కలవలే విజయ్ (38) వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ గ్రామంలో వ్యవసా య కూలీగా పనిచేస్తున్నాడు. వారం క్రితం మరికొందరితో కలిసి చేను పనినిమిత్తం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి వెళ్లాడు. అక్కడ పనులు చేస్తుండగా.. ఎండవేడిమితో శనివారం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
యువకుడి దారుణహత్య
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ యు వకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్కు చెందిన మహ్మద్ అర్బాజ్(25) ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ వివాహితతో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం గతంలోనే ఇంట్లో తెలియడంతో పలుసార్లు అర్బాజ్ను మహిళ కుటుంబీకులు, భర్త మందలించారు. గతంలో కత్తితో దాడి చేసేందుకు వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కాలనీలో అర్బాజ్పై కర్రతో దాడి చేశారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి మహ్మద్ ఆరీఫ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునిల్కుమార్ను సంప్రదించగా.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు హిమతేజఆదిలాబాద్: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కొడిమెల హిమతేజ మరో అరుదైన ఘనత సాధించాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘హై– పెర్ఫార్మెన్స్ క్యాంప్ ఫర్ ఎమర్జింగ్ అండర్–25’శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ద్వారా హెచ్సీఏ నుంచి హిమతేజతోపాటు భువనగిరి పున్నయ్య అనే మరో క్రికెటర్ను ఎంపికై నట్లు బీసీసీఐ క్రికెట్ హెడ్ వీవీఎస్.లక్ష్మణ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 13 నుంచి మే 7 వరకు జరగనుండగా, ఎంపికై న వారు ఏప్రిల్ 12లోపు బెంగళూరులో రిపోర్ట్ చేయాలని బోర్డు సూచించింది. శిబిరంలో యో–యో టెస్ట్, స్ప్రింట్స్, డెక్సా స్కాన్ వంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. హిమతేజను కోచ్ జయేంద్ర పటాస్కర్, పలువురు సీనియర్ క్రికెటర్లు అభినందించారు. బైక్ను ఢీకొట్టిన లారీ: మహిళ మృతిగుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44 సీతా గొంది సమీపంలో బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ చెందిన అప్పర్ఖాన్, రుమాన బేగం (43) దంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న రుమానా బేగంను జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు శనివారం బైక్పై బయల్దేరారు. చింతగూడ కార్నర్ వద్ద భారీ కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రుమానా బేగం తలకు తీవ్రంగా, అప్పర్ఖాన్కు స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్కు తరలించగా అప్పటికే రుమానాబేగం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, రెండురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సాద్వి కుమారి అశ్విని మృతి చెందింది. పోలీసులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు, బాధితులు పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
కై లాస్నగర్: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకింగ్ విధానంలో మార్పు చేసింది. పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్లైన్లో కూపన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర వైస్చైర్మన్, ఎండీ భవేష్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 1నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. మ్యానువల్ విధానానికి స్వస్తి.. ప్రస్తుతం జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోంది. సమీప వాగులు, పెన్గంగ నుంచి గృహ నిర్మాణదారులు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రం ఒక్కో ట్రాక్టర్ ట్రిప్కు రూ.400 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ట్రాక్టర్ల యజమానులు జిల్లా మైనింగ్ శాఖ నిర్దేశించిన కలెక్టర్ అకౌంట్కు పంపిస్తారు. మీసేవ నుంచి ఆ నగదు చెల్లింపునకు సంబంధించిన ప్రింటౌట్ తీసుకుని సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తారు. వాటిని తహసీల్దార్ ధ్రువీకరించిన అనంతరం ఆర్ఐలు బుకింగ్ కూపన్లు జారీ చేస్తారు. వాటి ద్వారా ట్రాక్టర్ యజమానులు ఇసుక తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ కూపన్ల జారీలోనూ అక్రమాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం భావించింది. ఒక ట్రిప్పు అనుమతి తీసుకుని నాలుగైదు ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లుగా గుర్తించింది. ఇలాంటి వాటికి చెక్పెట్టేలా బుకింగ్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఆన్లైన్లోనే అనుమతులు ఇసుక బుకింగ్ విధానంలో మ్యానువల్ పద్ధతికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనే కూపన్లు జారీ చేయాలని కలెక్టర్లు, మైనింగ్ అధికారులను ఆదేశించింది. టీజీఎంఐవీ వెబ్సైట్లో మన ఇసుక వాహనం పేరిట ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచింది. ఈ అనుమతుల జారీ, పర్యవేక్షణ కోసం తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులను నోడల్ అధికారులుగా నియమించాలని ఆదేశించింది. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించిన వారికి అనుమతులు జారీ చేస్తారు. మండలాలు, గ్రామాల వారీగా ఎన్ని కూపన్లు జారీ అయ్యాయి, ఎన్ని ట్రాక్టర్ల ఇసుక తరలుతుందనే దానిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. తద్వారా ఇసుక అక్రమ రవాణాకు చెక్పడటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశముంది.ఆన్లైన్లోనే బుకింగ్ఇసుక బుకింగ్ విధానంలో ప్రభుత్వం మార్పు చేసింది. మ్యానువల్ సిస్టమ్ రద్దు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మైనింగ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. అమలుకు కసరత్తు చేస్తున్నాం. ఇసుక అవసరమైన వారు టీజీఎంఐవీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎస్.రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ -
లోక్ అదాలత్తో పెండింగ్ కేసులు పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించా రు. అనంతరం క్షకిదారులకు రాజీపత్రాలు అందించారు. న్యాయవాదులతోపాటు అధికార యంత్రాంగం రానున్న రోజుల్లోనూ ఇదే సహకారం అందిస్తూ కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఎస్పీ అఖిల్ మహాజన్, జడ్జిలు హుస్సేన్ నాయక్, దివ్యవాణి, తేజస్విని, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో 12వ స్థానం జిల్లాలో పరిష్కారం అయిన కేసుల్లో మొత్తం క్రి మినల్ కేసులు6,284, ఫ్రీలిటిగేషన్ కేసులు 22,614 ఉన్నాయి. కేసుల పరిష్కారంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి జిల్లాస్థాయి ఎంపిక పోటీలను శనివారం నిర్వహించారు. డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ ప్రా రంభించి మాట్లాడారు. జిల్లాస్థాయికి మొత్తం 67 మంది ఎంపికై నట్లు తెలిపారు. శనివారం 17 మంది బాలికలు, 33 మంది బాలురు హాజరైనట్లు వెల్లడించారు. వీరికి 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు, 6X10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 10మంది బాలికలు, 10మంది బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం మెడికల్ టెస్టులు సైతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం పలు కారణాలతో ఎంపిక పోటీలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు ఆదివా రం పోటీలు నిర్వహిస్తామని, అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడా పాఠశాల శిక్షకులు, రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, డీఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు. -
కుటుంబ నేపథ్యం..
జిల్లాకు చెందిన ఈ యువ క్రికెటర్ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే జాతీయస్థాయి వేదికలపై మెరుస్తున్నాడు. సాధారణ కుటుంబ నేపథ్యమైనా అసామాన్య ప్రతిభతో లక్ష్యం దిశగా సాగుతున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటిన జిల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ శిబిరానికి ఎంపిక అయ్యాడు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికవగా, అందులో ఇతడిని బ్యాటర్గా ఎంపిక చేస్తూ మాజీ ఇండియన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. – ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన మధుసూదన్–కామేశ్వరి దంపతుల కుమారుడు హిమతేజ. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి హిమతేజ ఆసక్తిని గమనించి క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.రంజీ ట్రోఫీలో ప్రతిభ ఆధారంగా సీవోఈకి ఎంపిక చేశారు. ఏప్రిల్ నుంచి మే వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఇందులో మరిన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆట తీరును మరింత నైపుణ్యవంతంగా ప్రదర్శించేలా ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం. – హిమతేజసత్తా చాటుతున్నాడిలా..జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యం.. -
6న జిల్లాకు సీఎం
కైలాస్నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పా దయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న బజార్హత్నూర్ మండలం పిప్పిరి లో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈసభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీహాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పీపుల్స్మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధి కారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయా త్ర మూడేళ్లు పూర్తి చే సుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూ జలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటల కు పిప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ యోగితా రాణా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్టౌన్: హజ్యాత్రకు వెళ్లే వారు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రికులకు వైద్యశిబిరంతో పాటు టీకాల పంపణీ శనివారం చే పట్టారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ, 60 ఏళ్లు దాటిన యాత్రికులు బీపీ, షుగర్ వంటి సమస్యలుంటే మందులు వెంట తీసుకెళ్లాలని సూ చించారు. జిల్లా నుంచి 68 మంది యాత్రకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకోగా, శిబిరంలో పరీక్షలు నిర్వహించి మందులతో పాటు టీకాలు అందించామన్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ వైద్యుల సూచనలు పాటిస్తూ యాత్రను విజయవంతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్, డీఐవో వైసీ శ్రీనివాస్, వైద్యులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బోథ్లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి
బోథ్: నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ హాలులో శనివారం కలిసి విన్నవించారు. మంత్రి అధ్యక్షతన ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బోథ్లో డిపో ఏర్పాటుతో పాటు గిరి గ్రామాలకు పూర్తిస్థాయి ఆర్టీసీ కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇచ్చోడ బస్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్కు వినతి తాంసి: మండలంలోని కప్పర్ల నుంచి పొచ్చెర వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షాను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. అసెంబ్లీ హాలులో సమీక్షకు హాజరైన కలెక్టర్ను ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. కప్పర్ల రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కప్పర్ల మాజీ ఎంపీటీసీ కౌడాల మహేందర్, నాయకులు వినోద్ రెడ్డి,ముఖేష్, శ్రీనివాస్, అరుణ్, సాయినాథ్ ఉన్నారు. -
నీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దు
కైలాస్నగర్: పట్టణంలో పారిశుద్ధ్యనిర్వహణ, తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కార్యాలయానికి చేరుకుని శానిటేషన్ వ ర్కర్స్, వాటర్ సెక్ష న్లో రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఎంతమంది సెలవులో ఉన్నారనే విషయంపై ఆరాతీశారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శా నిటేషన్ కార్మికుల పాత్ర కీలకమన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించా రు. ఆమె వెంట మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ సతీశ్ తదితరులున్నారు. -
అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. తద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల బోధన పనితీరు, తదితర అంశాలు వెలుగులోకి రానున్నాయి. గతంలో న్యాస్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే)లో ప్రాథమిక స్థాయిలో జిల్లా వెనుకబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర విద్యా శాఖ అధికారులు జిల్లాపై ప్రత్యేక చొరవ చూపి సామర్థ్యాలను పెంచారు. ఇటీవల 2వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. తాజాగా మూడో తరగతి విద్యార్థులకు రేపు, ఎల్లుండి నిర్వహించనున్నారు. 21 పాఠశాలలు ఎంపిక.. జిల్లాలో 500 ప్రాథమిక, 119 ప్రాథమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈనెల 30,31 తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 12 చొప్పున మొత్తం 252 మంది హాజరుకానున్నారు. మొదటి రోజు ఒక్కో పాఠశాలలో ఆరుగురు చొప్పున, మరుసటి రోజు ఆరుగురు చొప్పున పరీక్ష ఉండనుంది. తెలుగు, గణితం, ఇంగ్లీష్ విభాగాల్లో సామర్థ్యాలను పరిశీలించనున్నారు. ఇన్విజిలేటర్లుగా ఛాత్రోపాధ్యాయులు.. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు ఫీల్డ్ ఇన్విజిలేటర్లుగా డైట్ ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26, 28 తేదీల్లో 21 మందికి శిక్షణ కల్పించారు. వీరు ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. ట్యాబ్ల ద్వారా విద్యార్థులు చెప్పిన సమాధానాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయనేది తేలనుంది. ఉపాధ్యాయుల పనితీరు కూడా దీనిపైనే ఆధారపడనుంది. ఆ తర్వాత విద్యా శాఖ అవసరమైన చర్యలు చేపట్టనుంది. -
బుకింగ్ కౌంటర్ ప్రారంభం
ఆదిలాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆదిలా బాద్ ఆర్టీసీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక తలంబ్రాల బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలో గల శ్రీకోదండ రామాలయంలో శుక్రవారం ఈ కౌంటర్ను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఒక్కో ప్యాకెట్కు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే, రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాల ప్రసాదాన్ని భక్తుల ఇంటికే నేరుగా చేరవేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో కౌన్సిలర్లు ఈ.సుష్మ, లాలామున్నా, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారులను విస్తరించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులను విస్తరించాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. లోక్సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న జాతీయ రహదారి–44ను ఆరు వరుసలకు విస్తరించాలని కోరారు. ఇది మహారాష్ట్రలోని వార్ధా, యావత్మాల్, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మల్కాజిగిరి మీదుగా వెళ్లే అత్యంత కీలకమైన మార్గమని పేర్కొన్నారు. గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్, అల్లపల్లి వరకు, అలాగే భోరజ్ నుంచి మాహూర్, మాండవి, కరంజి మీదుగా ఉన్న రహదారుల అభివృద్ధిని చేపట్టాలని కోరారు. అలాగే కళ్యాణ్ నుంచి నిర్మల్ వరకు ఉన్న జాతీయ రహదారి–63ని సైతం విస్తరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆదిలాబాద్ ప్రాంత రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని విన్నవించారు. -
పటిష్ట బందోబస్తు..
ఆదిలాబాద్టౌన్: పట్టణంలో నిర్వహించిన శోభా యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక టీ ఎన్జీవో గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. సుమారు 300 మంది సి బ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ర్యాలీ మార్గాల్లో డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా ని ఘా కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. అనంత రం శోభాయాత్రను డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఇందులో అదనపు ఎస్పీ బి. సు రేందర్ రావు, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు, ఇతర పోలీస్అధికారులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఆదిలాబాద్: జిల్లాలో శుక్రవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ గాలులతో కూడిన అ కాల వర్షం కురిసింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏ ర్పడింది. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ని ప్పురవ్వలు ఎగిసిపడగా నవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన టెంట్పూర్తిగా కాలిపోయింది. స్థాని కులు అప్రమత్తమై ఆర్పివేయడంతో పెను ప్రమా దం తప్పింది. అలాగే గాలివాన ధాటికి కలెక్టరేట్ చౌరస్తాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గాలులు వీచడం ఆగిన తర్వాత తేలికపాటి వర్షం కురిసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. -
ప్రజల గుండెల్లో సీఆర్ఆర్ది చెరగని ముద్ర
కై లాస్నగర్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చిల్కూరి రామచంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అ నూష అన్నారు. మాజీ మంత్రి సీఆర్ఆర్ జ యంతిని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సీఆర్ఆర్ చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు. కార్యక్రమంలో సీఆర్ఆర్ సోదరుడు చిల్కూరి లక్ష్మారెడ్డి, నాయకులు సంజీవ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలల బియ్యం
బోథ్: పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతినెల ఇచ్చే రేషన్ బియ్యంను ఈసారి మూడు నెలల కోటా కలిపి ఒకేసారి ఏప్రిల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటం, రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లబ్ధిదారులు ఎండలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కార్డులోని ఒక్కో సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొత్త కార్డుల జారీ ప్రక్రియ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు కేంద్రం సూచనల మేరకు మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రవాణా ఖర్చులు, డీలర్లకు హమాలీ కూలీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. నిల్వ సామర్థ్యమే అసలు సవాలు.. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియలో కొన్ని క్షేత్రస్థాయి సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల కోటా ఇచ్చినప్పుడు నిల్వ సామర్థ్యం లేక రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని భద్రపరచడం డీలర్లకు సవాలుగా మారింది. దీనికి తోడు దొడ్డు బియ్యం ఇప్పటికే డీలర్ల వద్ద నిల్వ ఉంది. మరోవైపు సాంకేతిక పరంగా ఒక్కో కార్డుకు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, సర్వర్ నెమ్మదించడం వంటి కారణాల వల్ల ఒక్కో లబ్ధిదారునికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. ఈ సాంకేతిక ఇబ్బందులను పరిష్కరిస్తేనే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు చేరువవుతుంది.జిల్లాలో రేషన్ దుకాణాలు: 492 రేషన్ దుకాణాలు : 2,26,048 యూనిట్లు : 7,40,622 మూడు నెలల కోటా: 14,100 మెట్రిక్ టన్నులు -
హరే రామ.. హరే కృష్ణ
శోభాయాత్రలో నృత్యం చేస్తున్న చిన్నారులుమంగళహారతులతో మహిళలుహరే రామ.. హరే కృష్ణ నామస్మరణతో గురువారం జిల్లా కేంద్రంలోని వీధులన్నీ మార్మోగాయి. భజన, కీర్తనలు, భక్తి గీతాలాపన, నృత్యాలతో పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మధుర జిన్నింగ్ మిల్లు నుంచి ప్రారంభమైన పల్లకి శోభాయాత్ర రాంపూర్లోని ఇస్కాన్ ఆలయం వరకు కన్నుల పండువగా సాగింది. సీతారాములు పల్లకీ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శోభా యాత్రలో భాగంగా భక్తులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష పూజలు చేశారు. ప్రణవానందస్వామి, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్ -
అర్హులైన రైతులకు అన్యాయం జరగనివ్వం
సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేసింది. దీని ప్రకారం భూమి విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలు చేసిన వ్యక్తి సెల్ఫ్ అఫిడవిట్ అందిస్తే సరిపోతుంది. అందులో ఏమైనా తప్పని తేలితే వారినే బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసేదిశగా ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిబంధనల ప్రకారం కబ్జాలో ఉండి భూములు కాస్తూ చేస్తున్న అర్హులైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వం. వారికి తప్పనిసరిగా భూహక్కు కల్పిస్తాం. – ఎస్.రాజేశ్వర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) -
డీసీసీబీ అభివృద్ధికి కృషి చేయాలి
● కలెక్టర్, బ్యాంకు ప్రత్యేకాధికారి రాజర్షి షా కై లాస్నగర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్, బ్యాంకు ప్రత్యేకాధికారి రాజర్షి షా అన్నారు. పట్టణంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన 98వ మహాజన సభ నిర్వహించారు. బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్ అంచనాలు, ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్యాక్స్ పరిధిలో రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేనిచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రికవరీ రేటును పెంచడం ద్వారానే బ్యాంకు బలోపేతం అవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో డీసీసీబీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సహకార సంఘాల బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో రవి కుమార్, జీఎం సూర్య ప్రకాష్, డీఆర్ ఓఎస్డీ సింహాచలం పాల్గొన్నారు. -
ఆర్ఐ కుటుంబానికి పరామర్శ
తాంసి: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్ఐ సంతోష్ కుటుంబాన్ని కలెక్టర్ రాజర్షిషా గురువారం పరామర్శించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తు న్న సంతోష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గా యపడి చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కాగా, భీంపూర్ మండలంలోని క రంజి(టి) గ్రామానికి జిల్లా అధికారులతో వెళ్లి సంతోష్ కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించా రు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, భీంపూర్, తాంసి తహసీల్దార్లు రమేశ్, లక్ష్మి, కలెక్టరేట్ ఏవో వర్ణ, రెవెన్యూ అధికారులు కార్తిక్, రాజేశ్వర్, కుటుంబ సభ్యులు సంగీత, చంద్రశేఖర్, రుతిక్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాద్వి కుమారి మృతి
గుడిహత్నూర్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన సాద్వి కుమారి అశ్విని కాగ్నే (19) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మరాఠీ వార్కరీ సంప్రదాయానికి చెందిన అశ్విని కాగ్నే మహారాష్ట్రలోని ఖందార్ తాలుకా కల్లారీ గ్రామంలో నిర్వహిస్తున్న సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం పెదనాన్న వసంత్ కాగ్నే, తల్లి అయోధ్యాబాయితో కలిసి ఆటోలో బయలు దేరారు. సీతాగోంది సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో అశ్విని, వసంత్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలించగా అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వసంత్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. చోరీ కేసులో ఆరునెలల జైలుజైనథ్: చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు ఎస్సై పవర్ గౌతమ్ తెలిపారు. మండలంలోని దీపాయిగూడలో గతేడాది అక్టోబర్ 11న దురల రాజలింగు ఇంట్లో చోరీకి పాల్పడిన మడావి సోనేరావును గురువారం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి ఆరు నెలల జైలు, రూ.100 జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బుగ్గిపాలైన వలస బతుకులులక్ష్మణచాంద: బతుకు దెరువు కోసం వచ్చి పని నిమిత్తం ఇంటికి వెళ్లే క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించడంతో మంటల్లోనే వలస బతుకులు బుగ్గిపాలైన విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలంలోని అంకభూపాలపురానికి చెందిన బండారు వెంకటరమణయ్య, పద్మ (35) దంపతులు నాలుగేళ్లక్రితం, ఇదే గ్రామానికి చెందిన మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు వచ్చి తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో.... బుధవారం బండారు పద్మ, మణి, ఆమె బావ కుమారుడైన రోహన్ ముగ్గురూ కలిసి ఆర్మూర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. గురువారం ఉదయం ఏపీలోని మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 33 మందిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి కోమాలోకి వెళ్లగా రోహాన్కు స్వల్పగాయాలయ్యాయి. బతుకు దెరువుకోసం వచ్చి ఇంటికి వెళ్లే క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. -
మహిళలకు అండగా ‘పోలీస్ అక్కా’
ఆదిలాబాద్టౌన్: మహిళలకు అండగా ‘పోలీస్ అక్కా’ వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజ న్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘పోలీస్ అక్కా’ సిబ్బందితో సమావేశమై మా ట్లాడారు. ఈ సంవత్సరం 17 బాల్య వివాహా లు నిలిపివేసినట్లు తెలిపారు. నెల వ్యవధిలో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ట్లు, 60 గ్రామాలను సందర్శించినట్లు వివరించారు. మహిళలు వేధింపులకు గురైతే ‘డయల్ 100’ లేదా షీటీమ్ను 87126 59953 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉత్తమ ప్ర తిభ కనబర్చిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, షీటీమ్ బృందం ఏఎస్సై సుశీల, హెడ్కానిస్టేబుల్ వాణిశ్రీ ఉన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ‘అరైవ్.. అలైవ్’లో భాగంగా ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్టు ధరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు నాకాబందీ నేరాల నియంత్రణకు బుధవారం రాత్రి 9నుంచి 12గంటల వరకు నాకాబందీ నిర్వహించిన ట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలో ని సరిహద్దు ప్రాంతాల్లో ఏకకాలంలో 28 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లా వ్యాప్తంగా 41 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 13 నంబర్ ప్లే ట్లు లేని వాహనాలు, మూడు ధ్రువపత్రాలు లే ని ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు, ఒక కంటైనర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జైనథ్లోని పిప్పర్వాడ చెక్పో స్టు వద్ద అక్రమంగా రెండు వాహనాల్లో పశువులను తరలిస్తుండగా సీజ్ చేసినట్లు తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, మావల ఎస్హెచ్వో రాహు ల్ కాంత్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
క్రీడాశాఖకు కాంట్రాక్టర్ షాక్
ఆదిలాబాద్: జిల్లా క్రీడా శాఖను (డీఎస్ఏ) నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు అందుతుండడంతో స్థానిక వనరుల ద్వా రా నిధులు సమీకరిస్తూ అధికారులు నెట్టుకొస్తున్నారు. వచ్చే నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం కోసం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం పరిధిలో ఉన్న షాపులను, స్విమ్మింగ్ పూల్ను టెండర్ల ద్వా రా లీజుకు ఇస్తున్నారు. గతేడాది మార్చి లో ఓ కాంట్రాక్టర్ రూ.21 లక్షలకు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ హక్కులు దక్కించుకున్నాడు. కానీ సకాలంలో రుసుము చెల్లించకపోవడంతో క్రీడాశాఖ ఆదాయానికి గండిపడుతోంది. 3 నెలలుగా నిలిచిన చెల్లింపులు.. గతేడాది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్కు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం ప్రకారం ప్రతీనెల లీజు రుసుమును జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఖాతాలో జమ చేయాలి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. పర్యవేక్షణ లోపంపై విమర్శలు స్విమ్మింగ్ పూల్ నిర్వహణను లీజుకు ఇచ్చినప్పటి నుండి ఆదాయంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నా సదరు కాంట్రాక్టర్కు కనీసం నోటీసులు కూ డా ఇవ్వకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని బయటకు రానీ యకుండా అధికారులు మౌనం వహించడంపై క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా లీజు ధరను రూ.16.60 లక్షల వరకు తగ్గించాలని సదరు కాంట్రాక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఉన్నతాధికారులు వివరాలను కోరగా, రెండవ లీజు దారుడు ఎంతవరకు కోట్ చేశారనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జిల్లా క్రీడాశాఖ అధికారులు నివేదికను సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పెంపు.. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ 12 సంవత్సరాల లోపు చిన్నారులకు అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.500 తీసుకోవాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలవారీ ఫీజు రూ.1000 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ 10 ఏళ్లలోపు వారికి నెలవారీ ఫీజు రూ.1000, ఆపై వారికి రూ.1500, స్పెషల్ బ్యాచ్ పేరిట రూ.2వేల నెలవారీ ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రికవరీ చేస్తారా?.. తగ్గిస్తారా? బకాయి మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి అధికారులు రికవరీ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంట్రాక్టర్ పెట్టుకున్న అర్జీని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం లీజు మొత్తాన్ని తగ్గిస్తుందా? లేక పాత ఒప్పందం ప్రకారమే వసూలు చేస్తుందా అనేది ఉన్నతాధికారులు నిర్ణయించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే లీజు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచే అవకాశాలు లేకపోలేదు.మూడు నెలల బకాయిలను పరిశీలిస్తే రూ.5.25 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతీనెల 15లోగా లీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే రోజుకు రూ.2,500 పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 15 నుంచి 30 వరకు మూడు నెలల్లో 45 రోజులకు లెక్కించినా, పెనాల్టీ మొత్తంగా రూ.1,12,500 అవుతుంది. లీజు రుసుము పెనాల్టీ మొత్తాన్ని కలిపితే సుమారుగా రూ.6,37,500 అవుతుంది. -
పుకార్లతో .. బారులు
ఇంధన కొరత కారణంగా నిర్మానుష్యంగా పెట్రోల్ బంక్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తూ.. జిల్లా కేంద్రంలోని ఓ బంకులో వాహనదారుల రద్దీ ఇంధన కొరత రానుందనే పుకార్లతో వాహనదారులు బుధవారం పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. ఉదయం పది గంటల వరకు బాగానే ఉండగా తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రూ.100, రూ.150 పెట్రోల్ పోయించుకునే వారు సైతం ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. కొంతమంది క్యాన్లలో నింపుకుని మరీ తీసుకెళ్లారు. దీంతో జిల్లాలోని పలు బంకుల్లో నిల్వలు నిండుకుని నిర్మానుష్యంగా మారాయి. కొన్ని బంకుల్లో ఇంధనం ఉండటంతో వాహనదారులందరికీ అందించాలనే ఉద్దేశంతో సరఫరాపై పరిమితి విధించారు. ఒక్కో వాహనదారుడికి రూ.200 నుంచి రూ.300 పెట్రోల్ మాత్రమే విక్రయించారు. నిర్వాహకులు ఎలాంటి ఇంధన కొరత లేదని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ వాహనదారుల రద్దీ మాత్రం రాత్రి వరకు కొనసాగింది. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, పోలీసులు బంకుల వద్దకు చేరుకుని పర్యవేక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. ఇందుకోసం ప్రత్యేక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. భోరజ్ మండలంలోని పలు బంకుల్లోనూ వాహనదారులు బారులు తీరి కనిపించారు. – కై లాస్నగర్/సాత్నాల -
పరిమితి లేకుండా శనగ కొనుగోళ్లు చేపట్టాలి
కై లాస్నగర్: ఎలాంటి పరిమితి లేకుండా శనగ పంట కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కమి టీ సభ్యురాలు సుహాసినిరెడ్డి కోరారు. కలెక్టర్ రాజర్షిషాను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ, గ్రామాల్లో ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాములు లేక, ఇళ్లలో పె ట్టలేక, అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి రూ.10వేలు పరిహారం అందించాలని కోరా రు. వరికి మాదిరిగా అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని విన్నవించారు. -
గంజాయి రహిత జిల్లాగా మార్చాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. టూటౌన్ పోలీస్ స్టేష న్ను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల ని యంత్రణలో, నిందితులను త్వరితగతిన పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నా రు. ఈమేరకు ప్రతీ వార్డులో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, ఎస్సైలు పీర్సింగ్, అఖిల్, విష్ణు ప్రకాశ్, డీసీఆర్బీ ఎస్సై దివ్యభారతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో అక్రమంగా పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోల్ కొరత ఉందంటూ వ స్తున్న పుకార్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బహిరంగ విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఒకరిపై కేసు నమోదు.. మరోవైపు ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తున్న ఫైజల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఖాన్ బేకరీలో అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 30 లీటర్ల పెట్రోల్ను, నిల్వ ఉంచిన డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ తనిఖీ ఇచ్చోడ: జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేసి నమోదైన కేసుల పురోగతిని సమీక్షించారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా సాధికారత దిశగా అడుగులు
కై లాస్నగర్: మహిళా సాధికారత దిశగా జిల్లా మరో ముందడుగు వేసిందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా మహిళా సమాఖ్య, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ మహిళా మార్ట్ను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోని మహిళా సంఘాలు తయారు చేస్తున్న సుమారు 30 రకాలకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు ఇందులో లభ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, వార్డ్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, మహిళా సమాఖ్య సభ్యులు లక్ష్మి, బృందన, మంజుల తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి ఇంద్రవెల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలకేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రవీణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రేఖారాణి, డీఈ శివప్రసాద్, తదితరులున్నారు. అప్రమత్తంగా ఉండాలి కై లాస్నగర్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో బుధవారం జూమ్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వినియోగదారులు అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి రాకుండా అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. చమురు సంస్థల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ జిల్లాకు అవసరమైన ఇంధన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 1800 425 1939లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నందిని, తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
శోభాయాత్రకు తరలిరండి
ఆదిలాబాద్: శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర మఠం నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న శ్రీ భవ్య రామ శోభాయాత్రను జయప్రదం చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేంద్ర కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పడానికి, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు మహేందర్, సురేందర్, మనోజ్ పవర్, సచిన్, చాణక్య, అభియాదవ్, స్వప్నిల్, కిరణ్, సంతోష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలు బాధ్యతాయుతంగా నడపాలి
ఆదిలాబాద్టౌన్: రోడ్లపై బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. అరైవ్ అలైవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు బుధవారం ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, డ్రైవర్ సీటు పక్కన ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అలాగే పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దన్నారు. అనంతరం సుమారు 100 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు బి.సునీల్ కుమార్, కె. నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
చేరువైన చేయూత
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సినల్లో విలీనమైనప్పటికీ ఏడేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతూ వచ్చిన వారి కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడంతో పింఛన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది. లబ్ధిదారులకు తప్పిన తిప్పలు.. మున్సిపల్ వార్డుల పునర్విభజనలో భాగంగా మావల మేజర్ గ్రా మ పంచాయతీలో కొనసాగిన దస్నాపూర్, దోబి కాలనీ, దుర్గానగర్, హన్మాన్నగర్), కై లాస్నగర్, పిట్టలవాడ, రాంనగర్ర్, షాద్నగర్, సుభాష్నగర్ర్,, టీచర్స్కాలనీ, కేఆర్కే కాలనీతోపాటు బట్టిసావర్గాం పంచాయతీలో కొనసాగిన టైలర్స్కాలనీ, న్యూహౌసింగ్బోర్డుకాలనీతో పాటు అనుకుంట, రాంపూర్ పంచాయతీలను 2019లో మున్సిపల్ పరిధిలోకి చేర్చారు. పట్టణపరిధిలోని చేయూత పించన్దారులకు డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండగా.. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ కాలనీలు ము న్సిపల్లో విలీనమై ఏడే ళ్లు గడిచినా వీరికి మా త్రం పోస్టాఫీసుల ద్వా రానే చెల్లిస్తూ వచ్చారు. దీంతో పింఛన్ తీసుకునేందుకు లబ్ధిదారులు ప్రతి నెలా దస్నాపూర్, మావల మండలకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఈక్రమంలో వారి ఇక్కట్లను ప లువురు కలెక్టర్ రాజర్షిషాకు దృష్ట కి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తా జాగా వారికి మున్సిపల్ ద్వారానే పింఛన్ అందేలా చూడాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టకేలకు బ్యాంకు ఖాతాల్లోనే ... కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన సిబ్బంది ఈ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ జమ చేస్తున్నారు. మొత్తం 1856 మంది ఉండగా ఇందులో 1,797 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 59 మంది పూర్తికాకపోవడంతో వారికి వచ్చే నెలలో రెండు నెలలది కలిపి జమ చేస్తామని డీఆర్డీవో అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ పరిధిలో చేరిన లబ్ధిదారుల వివరాలు.. కాలనీ లబ్ధిదారుల సంఖ్య దస్నాపూర్ 305 దోబీకాలనీ 104 దుర్గానగర్ 64 హన్మాన్నగర్ 58 న్యూహౌసింగ్బోర్డు 82 కై లాస్నగర్ 50 పిట్టలవాడ 187 రాంనగర్ 450 షాద్నగర్ 27 సుభాష్నగర్ 151 టైలర్స్కాలనీ 50 టీచర్స్కాలనీ 58 శ్రీరాంకాలనీ, కేఆర్కే,దుర్గానగర్ 150 అనుకుంట 120బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం పట్టణ పరిధిలోని 13 కాలనీల పెన్షన్దారులకిచ్చే సొమ్మును నేరుగా మున్సిపాలిటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించాం. వాటితో పాటు అనుకుంట, రాంపూర్ కాలనీలను సైతం దీని పరిధిలోకి తీసుకువచ్చాం. అయితే ఇంకా 59 మంది పెన్షన్దారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోలేదు. వారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. మిగతా లబ్దిదారుల పెన్షన్ మాత్రం ఈ నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల ద్వారానే జమ చేస్తున్నాం. – జాదవ్ శేష్రావు, ఏపీఎం మావల, బట్టిసావర్గాం పంచాయతీల పరిధిలోని కాలనీల్లోని పింఛన్దారులకు మాత్రమే బ్యాంకు అకౌంట్లో పింఛన్ జమ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి 4వ వార్డులో విలీనమైన అనుకుంట, అదే మండలంలోని 17వ వార్డులో విలీనమైన రాంపూర్ గ్రామాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో గతేడాది అక్టోబర్ 8న ప్రచురితమైన కథనంలో ప్రస్తావించడం జరిగింది. స్పందించిన అధికారులు తాజాగా ఈ రెండు కాలనీల్లోని లబ్ధిదారులను సైతం పట్టణ పరిధిలోకి తీసుకువచ్చారు. తాజా నిర్ణయంపై సదరు లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
తాంసి: ఆదిలాబాద్ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు కళావతి పౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్లు పంపిణీ చేశారు. వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 24 గ్రామాలను టీబీ రహితంగా ప్రకటించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని గ్రామాలు ఈ జాబితాలో చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారులు సాధన, మనోహర్, టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి సుమలత, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు రంజన, కేశవ్, లక్ష్మి, మండల వైద్యాధికారి నిఖిల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ మండలంలోని అందర్బంద్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేశ్,వైద్యసిబ్బంది, తదితరులు ఉన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు
ఆదిలాబాద్టౌన్: వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఆ శాఖ ఆపరేషన్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్ఈ శేషారావు, డీఈ రాంసుబ్బారెడ్డి, శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, శ్రావణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవ లక్ష్యం ఖరారు
కై లాస్నగర్: గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ఆ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా 9లక్షల 83వేల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా పంచాయతీల్లో నర్సరీల్లో విత్తనాలు నాటేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. బ్యాగుల్లో మట్టి నింపే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చితే తగ్గిన లక్ష్యం గ్రామ పంచాయతీలు, నాటాల్సిన మొక్కలకనుగుణంగా లక్ష్యాలను నిర్ణయించారు. అయితే గతేడాది పొల్చితే లక్ష్యాన్ని భారీగా తగ్గించారు. గతంలో ఒక్కో మండలానికి 3లక్షల వరకు నాటాలనే టార్గెట్ ఉండగా, ఈసారి 25వేల నుంచి లక్షకు తగ్గించారు. తదనుగుణంగా రానున్న జూన్, జూలై మాసాల్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. సిద్ధమవుతున్న నర్సరీలు లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సరఫరా చేసేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 473 గ్రామపంచాయతీలు ఉండగా, 237 నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు నర్సరీల్లో సంచుల్లో మట్టి నింపే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వన మహోత్సవంలో భాగంగా వేప, మర్రి, రావి, చింతతో పాటు గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. కొన్నిచోట్ల విత్తనాలు నాటే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నర్సరీ పనులకు ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లించనున్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు.. రానున్న వార్షిక సంవత్సరానికి సంబంధించి 9లక్షల 83వేల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ మేరకు జిల్లాలోని ఆయా గ్రామాల్లో 237 నర్సరీలను ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేశాం. ఇప్పటికే బ్యాగుల్లో మట్టి నింపే పనులు పూర్తయ్యాయి. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాథోడ్ రవీదర్, డీఆర్డీవో -
అసెంబ్లీ స్థానాలు..15!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ, లోక్సభ స్థా నాల పునర్విభజన(డీ లిమిటేషన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం మొదలైన జనగణన ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో 2011 జనాభా ప్రాతిపదికనే కొత్త స్థానాలు పెంచేందుకు ప్రణాళికలు సాగుతున్నా యి. నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మరో ప్రస్తు తం ఉన్న 119 శాసనసభ స్థానాలకు మరో సగం శాతం అంటే 60వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రస్తు తం ఉన్న పది శాసనసభ స్థానాలకు మరో ఐదు స్థానాలు పెరిగి మొత్తం 15 స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ్యుల సంఖ్య పెరగనుంది. రిజర్వు స్థానాల్లో మార్పులు కొత్త స్థానాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుంది. 2009 చివరలో నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం సర్దుబాటు చేయగా, రిజర్వేషన్లు మాత్రమే మారాయి. కానీ సంఖ్యలో మార్పు రాలేదు. తాజాగా 15 స్థానాలకు చేరితే చట్టసభలకు ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది. ఇక కొత్తగా ఏర్పాటయ్యే స్థానాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంది. జిల్లా యూనిట్గా ఎస్టీ జనాభా ఆ వర్గాలకు స్థానాల రిజర్వు జరగనుంది. ఎస్సీ స్థానాలకు రాష్ట్ర యూనిట్గా రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ రాష్ట్ర, జిల్లా జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేక లాటరీ ప్రాతిపదికన కేటాయిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ కొత్తవి? ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా కేంద్రాలైన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక జనాభాతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధి మండలాలను కలుపుతూ మళ్లీ కొత్తగా స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్తోపాటు విస్తీర్ణంలో పెద్దదైన బోథ్ స్థానం, ఖానాపూర్ పరిధి ఏజెన్సీ ఉట్నూర్లో మార్పు జరగనుంది. మంచిర్యాల నియోజకవర్గ పరిధి నగర ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలైన లక్సెట్టిపేట, ఇక ఆసిఫాబాద్, సిర్పూర్ రెండు నియోజకవర్గాల పరిధి మండలాల్లోనూ కొత్తగా ఒక స్థానం ఏర్పడనుంది. రాష్ట్రం యూనిట్గా లోక్సభ స్థానాలు మరో వైపు రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, మరో తొమ్మిది పెరగనున్నాయి. అయితే రాష్ట్ర స్థాయి జనాభా యూనిట్గా లోక్సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్(ఎస్టీ), పెద్దపల్లి(ఎస్సీ) ఎంపీ స్థానాలతోపాటు మరోస్థానం కొత్తగా ఏర్పాటవుతుందా? లేదా? అనేది డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతేనే స్పష్టత రానుంది. కొత్త జిల్లాల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాలు వేర్వేరు జిలాల్లో కాకుండా ఒకే జిల్లాలోనే ఉండనున్నాయి. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలు అటు ఇటుగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పూర్తిగా స్థాయి ఆదిలాబాద్, బోథ్లు ఉండగా, ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్ ఉండగా, పాక్షికంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, దస్తూరాబాద్, కడెం మండలాలు ఉన్నాయి. మిగతా ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో, జన్నారం మండలం ఒక్కటి మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇక మంచిర్యాల జిల్లా పరిఽధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు సైతం పక్క జిల్లాల్లో ఉన్నాయి. దీంతో పాలనలో ఇబ్బందులు రాకుండా ఒకే జిల్లా పురిధిలోనే నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యేలా కసరత్తు జరుగుతన్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి జిల్లా అసెంబ్లీ స్థానాలు జిల్లా 2011 జనాభా పాతవి కొత్తగా ఏర్పడేవి ఆదిలాబాద్ 7,08,972 02 02 కుమురంభీం 5,15,812 02 01 మంచిర్యాల 8,07,037 03 01 నిర్మల్ 7,09,418 03 01 -
నేర పరిశోధనలో సీసీ నిఘా కీలకం
ఆదిలాబాద్టౌన్: నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతీ గ్రామానికి కేటాయించిన వీపీవో ద్వారా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. గంజాయి, గుడుంబా, మాదకద్రవ్యాలు, గ్యాంబ్లింగ్ వంటివి జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆన్సైడ్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, స్టేషన్లో నెలరోజుల పరిధిలో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిందితులకు కోర్టులో శిక్ష పడేలా చూడాలన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, రుత్విక్ సాయి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నియంత్రణలో భేష్
● రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం ● అవార్డు అందుకున్న డీఎంహెచ్వో ఆదిలాబాద్టౌన్: క్షయ నియంత్రణలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణలో ముందు వరుసలో నిలిచింది. 2025 సంవత్సరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ను పకడ్బందీగా అమలు చేశారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రజుమంలో వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చేతుల మీదుగా డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఫ్యామిలీ అవార్డు అందుకున్నారు. వైద్యాధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: మహిళా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని పాల్ యాక్షన్ యాక్ట్ ప్రోగ్రాం అధికారి వందన అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో రిమ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెడికోలు, నర్సింగ్ విద్యార్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధులు నిర్వహించే చోట వేధింపులు, ఇబ్బందులకు గురైతే రిమ్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుష ఉద్యోగులు మహిళలపై మర్యాదపూర్వకంగా మెదలాలని, స్నేహపూర్వకంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురిచేస్తే నమోదు చేసే చట్టాలు, కే సుల వివరాలను వివరించారు. ఇందులో రి మ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ చైర్ ప ర్సన్ బండారి అనూష, వైస్ ప్రిన్సిపాల్ సరోజ, విద్యావిల్సన్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.మండలాల వారీగా లక్ష్యం వివరాలిలా... మండలం జీపీలు నాటాల్సిన నర్సరీలు ఆదిలాబాద్ రూరల్ 34 55,000 16 బజార్హత్నూర్ 30 52,000 15 బేల 37 50,000 28 భీంపూర్ 26 86,000 26 భోరజ్ 17 21,000 07 బోథ్ 33 50,000 06 ఇచ్చోడ 32 52,000 17 గాదిగూడ 25 57,500 25 గుడిహత్నూర్ 26 50,000 22 ఇంద్రవెల్లి 28 75,000 06 జైనథ్ 42 25,200 05 మావల 03 25,000 02 నార్నూర్ 23 56,000 08 నేరడిగొండ 32 50,000 10 సాత్నాల 17 25,000 05 సిరికొండ 19 26,300 06 సొనాల 11 27,000 04 తలమడుగు 28 50,000 11 తాంసి 14 50,000 13 ఉట్నూర్ 38 1,00,000 05 -
‘అడెల్లి’ ఆదాయం రూ.53.97 లక్షలు
సారంగపూర్: ఉత్తర తెలంగాణ ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ ఆధ్వర్యంలో లెక్కించారు. అమ్మవారికి భక్తులు నగదు రూపేణా సమర్పించిన రూ.53, 97,520 నగదు, 125.49 గ్రాముల మిశ్రమ బంగారం, 3 వేల గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కె.భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దండు సాయన్న, ఎస్సై శ్రీకాంత్, పాల్గొన్నారు. గూడెం ఆలయ హుండీ లెక్కింపుదండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి 2025 డిసెంబర్ 20 నుంచి 2026 మార్చి 23 హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 94 రోజులకు రూ.6,67,205 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నవీన్ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిరాశే నిర్మల్ఖిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్)జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి విజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కేవలం 26 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని గుర్తుచేశారు. దానికి భిన్నంగా కేవలం 8 శాతం మాత్రమే కేటాయింపులు జరపడం ఆక్షేపణీయమన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు క్షీణిస్తోందని, విద్యా ప్రమాణాలు సైతం పడిపోతున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, సౌకర్యాల కల్పనకు క్షేత్రస్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలు, రిటైర్ అయిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తుచేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం కేటాయింపులు చేయాలన్నారు. విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగదు రహిత వైద్య సదుపాయాన్ని ఉపాధ్యాయులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. -
ఆదిలాబాద్ జట్టుకు చాంపియన్షిప్
ఆదిలాబాద్: సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అన్ని అంశాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జట్టు చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన వేడుకలో జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చాంపియన్ ట్రోఫీ అందజేశారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్రచారం, నిర్వహణ, పతకాల్లో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మంగళవారం డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఇంద్రవెల్లి/బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలోని ఇన్కార్గూడలో షేక్ జాకీర్, రేఖాబాయి, అనిల్రెడ్డితో పాటు పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్యార్డులో కంది పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బజార్హత్నూర్లో సల్ల ముత్తన్న, సల్ల సాయికి చెందిన మొక్కజొన్నపంట నేలకొరిగింది. కొలారిలో బుర్కులే నిర్మల, సల్ల రాములు, షెడ్కే మంతబాయి, షెడ్కె గంగా, తొర్కడే శకుంతల, బిస్సే సంగీత, డోలే అంజనాబాయి, దేశముక్ రుక్మబాయి, టార్పే వనిత, రేకేవాడ్ కుష్మాలకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగరిపడ్డాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
రైలు ఢీకొని మహిళ మృతి
తాండూర్: మండలంలోని తాండూర్ ఐబీ చౌరస్తా సమీపంలోని రైల్వేట్రాక్పై రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలి పిన వివరాల ప్రకారం... బెల్లంపల్లిలోని సుభాష్నగర్కు చెందిన ఫర్హానా(29) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. మంగళవారం రైల్వేట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు..కుభీర్: మండలంలోని హల్దా గ్రామానికి చెందిన కె.మారుతి(40) మంగళవారం గ్రామ సమీపంలోని సుద్దవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు..లక్ష్మణచాంద: ట్రాక్టర్ పైనుంచి కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని పాక్పట్లలో మంగళవారం చోటు చేసుకుంది. సోన్ మండలంలోని పాక్పట్లకు చెందిన ఓల్లెపు మహేష్ (36) కట్టెలు కొట్టడానికి వెళ్లి ట్రాక్టర్ పైన ముందుభాగంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఫిట్స్ రావడంతో కిందపడ్డాడు. గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఓల్లెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. -
షార్ట్సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
తాంసి: మండలంలోని పొన్నారిలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. దేవల్ల ఓమక్క ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడంతో కుటుంబసభ్యులు బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. స్థానికులు బిందెలతో నీళ్లుచల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఫ్రిజ్తో పాటు ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయి. ఘటనలో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతోంది. -
దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నెలవారీ పెన్షన్ను పెంచాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దివ్యాంగుల సంఘం రాష్ట్ర నాయకులు ముస్తాపూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణ.. దేశ రక్షణ
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీ కిష్టాపూర్ తండాకు చెందిన బానోత్ రాజు నాయక్, లత దంపతుల ఇద్దరు కుమారులు వంశీ కృష్ణ, సాయికృష్ణ 2018లో ఒకేసారి ఆర్మీలో చేరా రు. వంశీకృష్ణ జవాన్గా సాయికృష్ణ పూణేలోని ఆర్మీ మెడికల్ డిపార్టుమెంటులో రేడియాలజీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఇంటిని విడిచి వెళ్ల డం ఇష్టంలేని తల్లిదండ్రులు పెద్దకుమారుడిని తిరి గి రావాలని కోరగా వంశీకృష్ణ ఉద్యోగం వదిలి ఇంటికి వచ్చాడు. ఖాళీగా ఉండడం ఇష్టంలేక 2023 లో ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న పరిసర గ్రామాల్లోని పది మంది యువకులకు గ్రామంలోనే శిక్షణ ఇచ్చా డు. అందులో నలుగురు ఆర్మీకి ఎంపికయ్యారు. ఉచితంగా శిక్షణ ఇక్కడితో శిక్షణ ఆపకూడదనే సంకల్పంతో ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా డు. శిక్షణలో చేరిన కొందరు నగదు రూపేనా ఇవ్వడంతో వాటితో నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులకు శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించాడు. సెలవులపై ఇంటికి వచ్చిన సాయికృష్ణ ఖా ళీగా ఉండకుండా ఫిజికల్ ఈవెంట్లో వారికి మెలకువలు నేర్పించాడు. మూడేళ్లలో అతని వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలో ఉద్యోగం సాధించారు. దేశానికి సేవ చేసేందుకు వెళ్లి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి వచ్చిన యువకుడు తనలాంటి ఎందరినో దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ ఇచ్చి దేశ సేవ కోసం పంపిస్తున్నాడు. జన్నారం మండలానికి చెందిన ఈ యువకుడి వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలలో ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 26 నుంచి మరో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కథనం. -
● గత డిసెంబర్లో మృతి చెందిన విద్యార్థిని ● తండ్రి ఫిర్యాదుతో పోస్టుమార్టం ● ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ఘటన
మూడునెలల తర్వాత పోస్టుమార్టం తాంసి: గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని సాయినిఖిత మృతదేహనికి మూడు నెలల తర్వాత మంగళవారం తాంసిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన దేవునూరి లింగన్న కుమార్తె సాయినిఖిత (14) నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతి చెందింది. మృతదేహనికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించే వరకూ తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి లింగన్న రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బందిపై మెండోరా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం తాంసిలోని శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో వైద్యులు అంకిత్రావు, అరవింద్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక రావడానికి దాదాపు నెలరోజులు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, వేం నరేందర్రెడ్డిలను కాంగ్రెస్ ని యోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. చనాఖా–కొరటా నుంచి తాగునీటి సరఫరా కోసం రూ.54కోట్లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు, బీటీరోడ్ల నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాల ని కలెక్టర్ రాజర్షి షాను ఇన్చార్జి మంత్రి ఆదేశించా రు. ఈనేపథ్యంలో చైర్పర్సన్ సోమవారం మున్సి పల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో కార్యాలయ చాంబర్లో సమావేశం నిర్వహించారు. అధి కారులు మంగళవారం నుంచి పట్టణంలోని వార్డు ల వారీగా పర్యటించి అవసరమైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.100 కోట్లు నాలుగు విడతలుగా మంజూరు చేసేలా మంత్రి హా మీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఇందులో వైస్ చైర్మ న్ రోహిత్, కమిషనర్ జి.రాజు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్, నాయకులు సతీశ్ తదితరులున్నారు. -
● స్పందించిన చైల్డ్హెల్ప్లైన్ ● చిన్నారిని శిశుగృహకు తరలింపు
శిశువును వదిలేసిన తల్లి ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఓ తల్లి తన రెండు నెలల శిశువును వదిలేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పాపను గమనించిన వన్టౌన్ కానిస్టేబుల్ రాజేశ్ 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్లైన్ కేస్ వర్కర్లు శ్రీకాంత్, రామకృష్ణ స్పందించి బాల రక్షక్ వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం శిశువును శిశు గృహ ఆయా లక్ష్మమ్మకు అప్పగించారు. ప్రస్తుతం శిశువు శిశు గృహలో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత ఆదిలాబాద్టౌన్: అటవీతో పాటు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ విశ్వనాథ చిన్నబూసరెడ్డి అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం బైక్ ర్యాలీ చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద ర్యాలీని ఎఫ్డీవో జెండా ఊపి ప్రారంభించారు. అటవీ సంరక్షణలో ఉద్యోగుల కృషి అభినందనీయమని కొనియాడారు. అటవీ రక్షణలో ప్రజల సహకారంతో పాటు నూతన సర్పంచులు భాగస్వామ్యం అందిస్తున్నారని వివరించారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోట్పల్లి (ఎం) గ్రామానికి చెందిన కల్యాబాయి –వినాయక్రావుల కూతరు లిఖిత కొంత కాలంగా అనారోగ్యంతో పెళ్లి చేసుకోకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి నయం కాలేదు. ఈక్రమంలో ఆదివారం రాత్రి అన్నం తినకుండానే పడుకుంది. సోమవారం ఉదయం చూసే సరికి లిఖిత మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలు సోదరి అర్చన అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, మహిళ సంఘ భవనం నిర్మించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా నియమించాలని, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందించాలని కోరారు. స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. డిజిటలైజ్ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ..ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్ చేసినట్లు పీవో అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ప్రతీ ఫిర్యాదుదారునికి ఒక ’ఎలక్ట్రానిక్ ఫిర్యాదు కార్డు’ జారీ చేస్తామన్నారు. ఈ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి తన ఫిర్యాదు ప్రస్తుత స్థితిని నేరుగా తెలుసుకోవచ్చన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ దొంగతనం.. నిందితుడి అరెస్ట్
తాండూర్: మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న తంగళ్లపల్లికి చెందిన గోగు బాలకృష్ణ కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయమూర్తి ముందు హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్సెట్టిపేట జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి కోర్టు వాయిదాలకు నిందితులు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. -
బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ
ఆదిలాబాద్టౌన్: బాధితులకు పోలీసు వ్యవస్థ అండగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు విధులు ఆటంకపర్చిన వారిపై చర్యలు పోలీసుల విధులు ఆటంకపర్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు పోలీసులు ప్రజా రక్షణలో విధులు నిర్వహిస్తున్నారని తెలి పారు. సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం, విధులు అడ్డుకునే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీసు స్టేషన్ల పరిధిలో వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులను ఆటంకపర్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలపై సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. -
ఉపాధికి దూరం
సాక్షి,ఆదిలాబాద్: ఉపాధి హామీ పథకంలో గడిచిన మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని కొత్త ఏడాదిలో లక్ష్యాన్ని నిర్ధారిస్తారు. అయితే జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్కార్డు ఉన్నప్పటికీ పనులకు దూరంగా ఉంటున్నారు. నామ్కే వాస్తేగా కార్డును మెయింటేన్ చేస్తున్నారు. ఇక ఏడాదిలో వంద రోజుల పనులు కొన్ని కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. సగటున కుటుంబానికి 48 పనిదినాలు మాత్రమే నమోదవుతున్నాయి. మరో వైపు వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువవుతోంది. జిల్లాలో వేలాది కుటుంబాలు జాబ్కార్డు ఉన్నప్పటికీ ఉపాధి పనులకు దూరంగా ఉండడం గమనార్హం. వందల రకాల పనులు.. ఉపాధిహామీ పథకం కింద 230 రకాల పనులను ప్రభుత్వం చేపడుతోంది. ముఖ్యంగా కందకాలు తవ్వడం, మట్టి రోడ్ల నిర్మాణం, రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల రాళ్లు ఏరడం, ఫిష్పాండ్స్, చెక్డ్యాంలు, పశువుల పాకల నిర్మాణం, పాఠశాలలకు ప్రహరీలు, భోజన గదులు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం వంటివి ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు. గ్రామాల్లో జాబ్కార్డు ఉన్నవారు పనులు నిర్వహిస్తుండగా వారికి రూ.307 వేతనం అందుతుంది. వివిధ కారణాలతో... వివిధ కారణాలతో పలువురు జాబ్కార్డు దారులు ఉపాధిహామీ పనులకు దూరంగా ఉన్నారు. ప్రతీ మూడు సంవత్సరాల పని దినాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త ఏడాదిలో లక్ష్యం నిర్దేశిస్తుంది. – రవీందర్, డీఆర్డీవోఇదీ పరిస్థితి.. జిల్లాలో .. మొత్తం జాబ్కార్డులు : లక్ష 75వేలు యాక్టీవ్గా ఉన్నవి : లక్ష 11వేలు ఉపాధి కూలీలు : 3లక్షల 46వేలు యాక్టీవ్గా ఉన్నవారు : 2లక్షల 7వేలుజిల్లాలో 2025–26 వార్షిక సంవత్సరంలో మొత్తం 44లక్షల 79వేల పని దినాలు మంజూరయ్యాయి. దీని కింద రూ.119 కోట్ల 70లక్షల వేతనాలు చెల్లించాలి. వార్షిక సంవత్సరం ముగింపునకు చేరువ కాగా, ఇప్పటివరకు 95 శాతం లక్ష్యం పూర్తయింది. కూలీల వేతనాల కింద ఇప్పటివరకు రూ.113 కోట్ల 94లక్షలు చెల్లించారు. మరో రూ.5.76 కోట్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో లక్ష్యం పూర్తి చేసే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వేలాది మంది కుటుంబాలు ఉపాధి హామీకి దూరంగా ఉండడంతో ఈ పనులు చేపట్టేందుకు అనాసక్తి కనబర్చుతున్నారనేది స్పష్టమవుతుంది. -
ఆర్యూబీ పనులు చేపట్టాలి
ఆదిలాబాద్టౌన్: రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న సోమవారం పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజ కీయాలు మాని ప్రజల పక్షాన నిలవాలన్నారు. ఫిబ్రవరి 13న ఎంపీ, ఎమ్మెల్యేలు భూమిపూజ చేసి రైల్వే అండర్బ్రిడ్జి పనులు ప్రారంభించారని, ప్రస్తుతం పనులు ఆగిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకొని గుంతలు పూడ్చి రాకపోకలు జరిగేలా చూడాలన్నారు. లేనిపక్షంలో సొంత ఖర్చుతో గుంతలను పూడ్చుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యాసం నర్సింగ్రావు, నారాయణ, ప్రహ్లాద్, సాజిదొద్దీన్, ప్రకాశ్, వెంకటేశ్, ధమ్మపాల్, ఇమ్రాన్, గణేశ్, రమేశ్, ప్రేమల, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండోలో ‘రాణి’ంపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరానికి చెందిన రాము –జయంతి దంపతుల కూతురు అస్మిత తైక్వాండోలో రాణించి స్పోర్ట్స్ కోటాలో వరంగల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించి బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచే క్రీడల్లో మక్కువ ఉన్న అస్మిత మూడేళ్లుగా తైక్వాండోలో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో పసిడి పతకం, రాష్ట్రస్థాయిలో తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో రజత పతకం, జెఎన్టీయూహెచ్ ఎంపిక పోటీల్లో బంగారు పతకం సాధించి, తన సత్తా చాటుతోంది. ఆసక్తితో పట్టు..మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ –లతల కుమార్తె కార్ల శ్రీజ తైక్వాండోపై ఉన్న ఆసక్తితో క్రీడలో పట్టు సాధించింది. మూడో తరగతిలో ఉండగానే శిక్షకుడు మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తాను చాటి, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. 2016లో జాతీయస్థాయిలో పాల్గొని తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ తరువాత కేరళలో నిర్వహించిన సౌత్జోన్ నేషనల్స్లో ఆడి మొదటిసారిగా బంగారు పతకాన్ని సాధించింది. ఎస్జీఎఫ్ పోటీల్లోనూ పాల్గొని రెండుసార్లు కాంస్య పతకాన్ని సాధించింది. స్పోర్ట్స్ కోటాలో కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సీటు పొందింది. -
‘గుర్తింపు సంఘం విఫలం’
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం నాయకులు విఫలమయ్యారని ఐఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. సోమవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు వారు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రాతినిధ్య సంఘంగా తాము కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, యజమాన్యంతో తమ యూనియన్ నేత జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ డి మాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. సింగరేణిని అధోగతి పాలు చేసిన టీబీజీకేఎస్కు తమను విమర్శించే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్, నాయకులు భీంరావు, గరిగే స్వామి, తిరుపతిరాజు, బాపు, సత్యనారాయణ, భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్లో రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగం
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. అండర్ 15, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జిల్లాస్థాయిలో ప్రాతినిధ్యం వహించి, పురుషుల విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేందుకు మూడుసార్లు ఎంపికయ్యాడు. ప్రస్తుతం మాస్టర్స్ 35 ప్లస్ విభాగంలో పోటీ పడుతూ గత రెండేళ్లుగా వరుసగా మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలుస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్లో విధులను నిర్వహిస్తూనే ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే అఖిల భారత రక్షణ ఖాతాల విభాగం బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొని తన సత్తా చాటుతున్నాడు. -
ఆటల్లో మెరికలు..!
బజార్హత్నూర్: పేద కుటుంబ నేపథ్యం ఉన్న ఆదివాసీ గిరిజన బిడ్డ కోట్నాక్ జాకేష్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జాకేష్ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం. తండ్రి కొట్నాక్ జంగు ఆటో డ్రైవర్ కాగా, తల్లి రేణుక వ్యవసాయ కూలీ. జాకేష్ సొంత గ్రామంలోనే గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాల ఉంది. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ తన స్వగ్రామం జాతర్లలో 2016లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ఆదర్శ క్రీడల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయించారు. దీంతో మారుమూల గిరిజన విద్యార్థులకు క్రీడల్లో రాణించేందుకు అవకాశం దక్కింది. స్థానికంగా ఉన్న క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుతూ క్రీడా అవకాశాలను జాకేష్ సద్వినియోగం చేసుకున్నాడు. జాకేష్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ సాహుల్ అతన్ని క్రీడల్లో శిక్షణ ఇచ్చి సానబెట్టారు. మంచిర్యాలఅర్బన్: పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తోంది గోలేటికి చెందిన తిమ్మయ్య– స్వరూప దంపతుల కుమార్తె శ్రీవాణి. ఆమె మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే మృతి చెందినా తల్లి వ్యవసాయ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గోలేటి సింగరేణి పాఠశాలలో పరుగు పందెం, ఖోఖోలో శ్రీవాణి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు బ్యాడ్మింటన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే స్కూల్ గేమ్ ఫెడరేషన్, జిల్లా బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ తరఫున జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభ చాటింది. కష్టాలు అధిగమిస్తూ..సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీవాణి డిగ్రీ చదువుతూనే పార్ట్టైంగా బ్యాంకులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇప్పటి వరకు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెమొంటోలతో పాటు ప్రశంసలు అందుకుంది. శ్రీవాణి ప్రతిభను గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి ప్రోత్సహించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెరిసింది. నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో నైపుణ్యత ప్రదర్శించి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇండోనేషియాలో బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 19వ వరకు నిర్వహించిన పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి దేశానికే వన్నె తెచ్చింది. దేవల్ల శ్రీవాణి ప్రభుత్వం సహకారం అందించాలి కోచ్ సాహుల్ శిక్షణ, ప్రధానోపాధ్యాయులు కిషన్రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేశ్, వార్డెన్ కృష్ణరావుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాను. తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలు నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి ఆటుపోటులు లేకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పట్టుదలతో కృషి చేస్తా. – కోట్నాక్ జాకేష్, క్రీడాకారుడు సాధించిన ఘనతలు.. -
సుద్దవాగులో పడి ఒకరి మృతి
కుభీర్: మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాదవ్ మోహన్(45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని కోల్గాం గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా నిగ్వాలో ఉండి పాలేరుగా పనులు చేస్తున్నాడు. ఆదివారం గేదెలు మేపడానికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయం సుద్దవాగులో వెతకగా వాగు గట్టున చెప్పులు, నీళ్లలో మృతదేహం లభ్యమైంది. భార్య దేవికాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నారు. ఉరేసుకొని వృద్ధురాలి ఆత్మహత్య నస్పూర్: ఒంటరి జీవితాన్ని భరించలేక మానసిక ఒత్తిడికి గురైన ఓ వృద్ధురాలు ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బల్లార్షకు చెందిన పల్లపు సుబ్బమ్మ(70) బతుకు దెరువు కోసం సీసీసీలోని ఆర్టీసీ కాలనీలో ఓ హోటల్లో పని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు సోమవారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఇంటిలో ఉరేసుకోగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. సుమారు మూడు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. బైక్ కొనివ్వలేదని యువకుడు.. కడెం: బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయి కిరణ్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సారంగాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు రాకేశ్ (27) తన తండ్రి రమేశ్ను పొలాలకు వెళ్లడానికి బైక్ కొనివ్వాలని కోరాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా బైక్ కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తానని చెప్పి గోదావరి ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
క్రీడల్లో మాస్టారు అదరహో!
దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు. ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నాడు. మూడేళ్లుగా సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 2018లో చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్లో నిర్వహించిన ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ పోటీల్లో ఐదోస్థానంలో నిలిచాడు. గత సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్ది వారిని సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
బీజేపీ వర్సెస్ పోలీసులు
గృహ నిర్బంధం పిరికిపంద చర్య ఆదిలాబాద్: బీజేపీ నాయకులను నిర్బంధించడం పిరికిపంద చర్య అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘటిక క్రాంతి కుమార్ అన్నారు. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సోమవారం పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి టూటౌన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కౌన్సిలర్లు పద్మవార్ రాకేశ్, గంట జీవన్ తదితరులున్నారు. గుడిహత్నూర్: బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ సహా పలు వురు నాయకులు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు సీఐలతో పాటు స్థానిక ఎస్సై శ్రీకాంత్ సుమారు 20 మంది సిబ్బందితో బ్రహ్మానంద్ ఇంటికి చేరుకున్నారు. ఆయనను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లిన బ్రహ్మానంద్ తప్పించుకొని బయటకు వెళ్లి పోయాడు. ఎంతకీ రాకపోవడంతో పోలీసులు చేసేది లేక బయట ఉన్న ఆయన కారు టైర్లకు చువ్వ గుచ్చి గాలి తీసి వెనుదిరిగారు. అంతకు ముందే పార్టీ మండలాధ్యక్షుడు కేంద్రే శివాజీని, బీజేవైఎం అధ్యక్షుడు రాజేందర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఉదయం స్టేషన్కు చేరుకున్న బ్రహ్మానంద్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన కారు టైర్లను పాడు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మానంద్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనపై పోలీసులు అత్యుత్సాహంతో నిర్భందించడం సరికాదని ఆయన విలేకరులకు తెలిపారు. పోలీసులు కారు టైర్ల నుంచి గాలి తీసేశారిలా.. -
రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
నేరడిగొండ: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బోథ్ ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ప్రధానరోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బోథ్లో బీటీ రోడ్లు, సీసీ రింగ్ రోడ్డు, వీధిదీపాల నిర్మాణానికి రూ.5 కోట్లు, పొచ్చర ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ పట్టణం వరకు ఫోర్ లేన్, సెంట్రల్ లైటింగ్, మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.38 కోట్లు, ఇచ్చోడలో ఫోర్లేన్ పనుల్లో భాగంగా సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదించిన రోడ్ల పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈఎన్సీకి సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి అజారుద్దీన్ను కలిసిన ఎమ్మెల్యే ఇచ్చోడ: మంత్రి అజారుద్దీన్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో షాదీఖానా కోసం రూ.3 కోట్ల 65లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. -
సీఎం కప్ విజేతలకు కలెక్టర్ అభినందన
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పారామీటర్ల ఆధారంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యధికంగా 82 పాయింట్లు సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానం కై వసం చేసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రీడాకారులకు కలెక్టర్ రాజర్షిషా మెడల్స్ అందజేసి అభినందించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నెలరోజుల్లోపు పరిష్కరించాలి
కై లాస్నగర్: ప్రజావాణి పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతితో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ 30 రోజుల్లోపు పరిష్కరించాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. పదేపదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు అందాయి. వాటిలో కొందరి నివేదన.. రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో ఎంఎస్ నంబర్ 3 ప్రకారం 17 వెనుకబడిన కులాలను గుర్తించింది. ఇందులో 13 కులాలను బీసీ(ఏ)లో, నాలుగు కులాలను బీసీ(బి)లో చేర్చింది. బీసీ(ఏ)లో సీరియల్ నంబర్ 64లో ఉన్న ఓడ్ కులస్తులైన మేము అన్నింటిలో వెనుకబడి ఉన్నాం. కేంద్ర జాబితాలో గల ఓబీసీలో మా కులం లేనందున సైనిక్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో మా పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విషయాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం. – ఓడ్ కులస్తులు, ఆదిలాబాద్ -
అడవుల్లో శివంగులు
చెన్నూర్రూరల్: ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమతం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. టీచర్లు, పోలీసులు, అటవీశాఖ, ఎకై ్సజ్శాఖ ఇలా అనేక రంగాలలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించారు. అటవీశాఖలో మహిళలు మగవారికి తీసిపోకుండా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ డివిజన్, చెన్నూర్ రేంజ్ పరిధిలో ఏడుగురు మహిళలు వివిధ పోస్టుల్లో చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీవైఆర్వో (డిప్యూటీ రేంజ్ అధికారులు), ఒక్కరు ఎఫ్ఎస్వో(ఫారెస్టు సెక్షన్ అధికారి), నలుగురు ఎఫ్బీవో (ఫారెస్టు బీట్ అధికారులు)లు ఉన్నారు. విధులు, బాధ్యతలు.. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరేడ్ చేయడంతోపాటు పురుషులతో సమానంగా ప్రతీరోజు అడవుల్లో కనీసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ లైన్లను గమనించడంతో పాటు వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు, ఉరులు, ఉచ్చులు పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అడవిలో స్మగ్లర్లు కలప దొంగతనం చేయకుండా అప్రమత్తంగా ఉండడం, వన్యప్రాణుల మేత కోసం గడ్డి, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తొట్లు, కుంటలు ఏర్పాటు చేయడం, అడవిని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల మొక్కల ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అటవీ సంపద కాపాడేందుకు రాత్రి పెట్రోలింగ్ చేయడం, అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టడం, అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల, అడవుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారు గోదావరి నదిలో మొసళ్ల కేంద్రం సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. జంతుగణన, బర్డ్వాచ్, బటర్ఫ్లై వాచ్లో పాల్గొంటున్నారు. అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద, ఆకుల కల్లాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. -
‘సుందిళ్లకు నీటి తరలింపు మరో విపత్తు’
పాతమంచిర్యాల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు కాళేశ్వరం వంటి మరో విపత్తుగానే పరిగణించాలని వామ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్స్క్ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే క్రమంలో సంభవించే పరిణామాలు, విపత్తులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా సుందిళ్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ ప్రతులు దహనం
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించలేదని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కే టాయిస్తామని హామీ ఇచ్చి వివక్ష చూపిస్తుందన్నా రు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అశోక్, రాజన్న, చారి, అలేఖ్య, నటేశ్వర్, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ గొడవ.. స్నేహితుడి హత్య
మంచిర్యాలక్రైం: సెల్ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. సంబంధిత వివరాలను సీఐ ప్రమోద్ రావు ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన దీపక్(35), భీమిని సంజీవ్, కాసిపేట మండలం సిడం దీపక్లు జిల్లా కేంద్రంలోని చిందం శ్రీనివాస్ అనే బిల్డర్ వద్ద కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో దీపక్, సంజీవ్, సిడం దీపక్లు రాత్రి మద్యం తాగుతుండగా సెల్ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. ఈక్రమంలో సంజీవ్, సిడం దీపక్లు దీపక్ను రాడుతో తలపై మోదీ హత్య చేశారు. నిందితులు సంజీవ్, సిడం దీపక్లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి 14 రోజుల రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
సాహిత్య ఫెస్టివల్కు ఆహ్వానం
ఆదిలాబాద్రూరల్: న్యూఢిల్లీలో ఈ నెల 25, 26వ తేదీలలో నిర్వహించనున్న 10వ రాష్ట్రీయ జనజాతీయ, లోక్ సంస్కృతి సాహిత్య ఫెస్టివల్కు తనకు ఆహ్వానం అందినట్లు మావల మండలంలోని వాఘాపూర్ గ్రామానికి చెందిన గోండి భాష రచయిత తొడసం కై లాష్ తెలిపారు. మానవహక్కుల చైర్మన్కు ఘన స్వాగతంజన్నారం: మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం జన్నారం చేరుకున్నారు. జన్నారం హరిత రిసార్ట్కు వచ్చిన ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం సఫారీ ద్వారా అడవిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గిరిజనులను కలిసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోనున్నారు. ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో గిరిజనులు చేస్తున్న వెదురు కళావృత్తులను పరిశీలించనున్నారు. కలెక్టర్తో పాటు సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎఫ్డీపీటీ శాంతారాం, జిల్లా అటవీ అధికారి శివ్ఆషిశ్ సింగ్, జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. -
గోదావరిలో మృతదేహాల కలకలం
బాసర: గోదావరి నదిలో బాసర వద్ద ఆదివారం రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు బాసర బ్రిడ్జి కింద గోదావరిలో తేలియాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఒక మృతదేహం నిజామాబాద్ జిల్లా కేంద్రం గాజులపేటకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. లభ్యమైన మహిళ మృతదేహం వివరాలు ఇంకా తెలియరాలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామ శివారులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోన్ ఎస్సై గోపి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ పట్టణానికి చెందిన ఎలుగు సుధాకర్ జనవరిలో తన బైక్ని కడ్తాల్ గ్రామ శివారులో పార్క్ చేసి పని నిమిత్తం వెళ్లగా కుచంపల్లి లక్ష్మణ్ బైక్ని దొంగతనం చేశాడు. ఎలుగు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లక్ష్మణ్ని ఆదివారం గంజల్ టోల్ప్లాజా వద్ద పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పు కున్నాడు. అతని వద్ద నుంచి మూడు మో టార్ సైకిల్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ఆరు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఏఎస్సై దేవన్న, పీసీలు రాజు, వినోద్ ఉన్నారు. -
‘ఎన్నికల హామీలు నెరవేర్చాలి’
శ్రీరాంపూర్: ఎన్నికల్లో ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుందన్నారు. కార్మికులకు సాధారణ ఎన్నికల్లో, గు ర్తింపు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, వంగ తిరుపతి, బాకం నగేశ్, గుంట జగ్గయ్య, జనార్ధన్, కాటం రాజు, పొగాకు రమేశ్, ఆకునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
కాసిపేట: సింగరేణి యాజమాన్యం పనులు ప్రారంభించకముందు ఇచ్చిన హామీల మేరకు ఓపెన్కాస్ట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత యువకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని కోమటిచేను, పల్లంగూడ, సోమగూడం ప్రాంతాలలో ఇంటికో ఉద్యోగం, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి రైతుల వద్ద భూమిని యాజమాన్యం కాసిపేట –2 ఓపెన్కాస్ట్లకు సేకరించి నేడు నిర్వాసితులకు మొండి చేయి చూపించిందన్నారు. ఓపెన్కాస్ట్లో గత పదేళ్లుగా దుర్గ, ఆర్వీఆర్ కంపెనీలలో డంపర్ ఆపరేటర్లుగా పని చేసిన తమను మరిచి ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్ప్రెస్వే కంపెనీ కార్మికులను తీసుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజా సంఘాల నాయకులు దుర్గం గోపాల్, బాధిత యువకులు కుమ్మరి శ్రీకాంత్, కుడిమెత చంద్రమౌళి, వెడ్మ కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు. -
శిక్షణ సరే.. మరి విధులేవి?
కై లాస్నగర్: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమాత పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. భూ సర్వే ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ రైతులకు సమస్యల్లేకుండా చూడాలనే ఉద్దేశంతో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో రెండు విడతల్లో 110 మందిని ఎంపిక చేసి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియామకపత్రాలను అందజేశారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై విధి విధానాలు ఖరారు చేయకపోవడం, ఎలాంటి సర్వే పనులు అప్పగించకపోవడంతో వాటి కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. తమకు విధులు కేటాయించాలంటూ అధికారులను కలిసి వేడుకుంటున్నారు. రెండు విడతల్లో ఎంపిక .. వ్యవసాయ భూముల సర్వే చేయాల్సిన మండల సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని 21 మండలాలకు గానూ కేవలం పది మంది సర్వేయ ర్లు మాత్రమే ఉన్నారు. భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా వారి చేలవైపు చూసే పరిస్థితి లేదు. దీంతో రైతులు వారి చు ట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనికాని పరిస్థితి ఉంది. ఇ లాంటి పరిస్థితిని దూరం చేసి భూ సర్వేలో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి బ్యాచ్కు మే 26 నుంచి జూలై 25 వరకు, రెండో బ్యాచ్కు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత పరీక్షతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ చాటిన వారిని సర్వేయర్లుగా ఎంపిక చేసి వారికి లైసెన్స్లు జారీ చేశారు. జిల్లాలో రెండు విడతలుగా 110 మందిని ఎంపిక చేసి వారికి హైదరాబాద్ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. తొలి విడతలో 44 మందికి లైసెన్స్లను జారీ చేయగా మలి విడతలో 65 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్లో శిక్షణ పొందినప్పటికీ జిల్లా వాసి కావడంతో ఒకరిని మన జిల్లాకు కేటాయించారు. నెలలు గడుస్తున్నా .. తొలి విడతలో ఎంపికై న వారికి గతేడాది అక్టోబర్ 19న, రెండో విడతలో ఎంపికై న వారికి ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై ఎలాంటి విధివిధానాలు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. వారికి ఎలాంటి సర్వే పనులు కూడా అప్పగించడం లేదు. అయితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాపును ప్రభుత్వం తప్పనిసరి చేసినట్లుగా తెలి సింది. ఇందుకోసం లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా రై తులు తమ భూములను సర్వే చేయించి నిర్దిష్ట ఫీజు లను చెల్లించాల్సి ఉంటుంది. రెండెకరాల్లోపూ విస్తీర్ణాన్ని సర్వే చేసి మ్యాప్ అందించడానికి గానూ రై తులు రూ.1000 ఫీజుగా చెల్లించాలి. ఇందులో 5 శాతం ప్రభుత్వం మినహాయించుకుని 95 శాతం సర్వేయర్లకు చెల్లించాలని భావించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడం, విధులు కేటా యించకపోవడంతో లైసె న్స్ పొందిన సర్వేయర్లు తమకు విధులు కేటాయించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు అర్హులైన వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణనిచ్చాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్స్లను జారీ చేశాం. తదుపరిగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం. – ఎల్.ప్రభాకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఇంద్రవెల్లి: గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప టేల్ అన్నారు. డీసీసీ కార్యదర్శులుగా ఎంపికై న ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఎండీ మ సూద్, మెస్రం నాగ్నాథ్ను ఆదివారం ఉట్నూర్లోని క్యాంప్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్కు, ఎమ్మెల్యే బొజ్జుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులు రాథోడ్ మోహన్సింగ్, రాథోడ్ రోహిదాస్, కుంర రాజేశ్వర్, నాయకులు జహీర్, కొమురయ్య పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతం చేయాలి ఉట్నూర్రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి దాసండ్ల ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆర్టీఐ జిల్లా మెంబర్ దూట రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్
కై లాస్నగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలోని దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా నిధుల కేటాయింపులు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లపాలనలో నిరాదరణకు గురైన సీఆర్ఆర్ కొరట–చెనక బ్యారేజీని పూర్తిచేసి 50వేల ఎకరాల ఆయకట్టుకు నిరందించడమే లక్ష్యంగా రూ.177.54 కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఇందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించారన్నారు. సాత్నాల ప్రాజెక్ట్కు రూ.కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్కు రూ.4.62 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రేషన్ కార్డు గల ప్రతీ పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా ప్రకటించి యావత్ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏటీసీలను అభివృద్ధి చేసి విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించాలనే ఉద్దేశంతో రూ.5వేల కోట్లు కేటాయించారన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు రూ.5వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి దేవదాస్ చారి, గౌలి సంజయ్ కుమార్, నాయకులు సిరాజ్, రవి, పరమేశ్వర్, మొయిన్, ఇర్షద్, రాజ్ మొహమ్మద్, తదితరుల పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ ప్రజావాణి
ఆదిలాబాద్టౌన్: వినియోగదారుల వి ద్యుత్ సమస్యల పరి ష్కారానికి ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆర్.శేషారావు తెలి పారు. సర్కిల్, డివిజన్, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. వినియోగదారులు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం లభిస్తుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ సోమవారం డివి జన్ ఆఫీసులు, ఈఆర్వో, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సర్కిల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇప్పటి వరకు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1,469 సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సమీప కార్యాలయంలో నమోదు చేసుకొని పరిష్కారం పొందాలని కోరారు. -
● జిల్లాలో పెరిగిన కొత్తకార్డులు ● అందుబాటులో లేని చౌక దుకాణాలు ● ఉచిత బియ్యం కోసం తప్పని తిప్పలు
కై లాస్నగర్: జిల్లాలో కొత్త గ్రామపంచాయతీలు ఏ ర్పడి ఎనిమిదేళ్లవుతోంది. ఆయా జీపీల్లో ఇంకా చౌకధరల దుకాణాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రేషన్ లబ్ధిదారులు బియ్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేక ఆదివాసీల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తమ గ్రామాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు ఏళ్లుగా విన్నవిస్తూనే ఉన్నారు. కార్డుల సంఖ్య పెరిగినా .. రేషన్కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తోంది. జిల్లాలో కొత్తగా పెరిగిన 33,905 కార్డులతో కలిసి ఈ సంఖ్య 2,26,048కి చేరింది. అయితే కార్డుల సంఖ్యకు అనుగుణంగా చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. జిల్లాలో 356 రేషన్ షాపులు మాత్రమే ఉన్నాయి. ఈలెక్కన ఒక్కో షాపు పరిధిలో సగటున 631 కార్డులున్నాయి. అయితే 350 కార్డుల వరకే ఒక దుకాణం ఉండాలని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. అదనంగా కార్డులు ఉండటం ద్వారా బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కార్డుదా రులు దేశంలో ఎక్కడైన బియ్యం తీసుకోవచ్చనే నిబంధన తమకు అదనపు భారంగా మారుతుందని చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అవే తిప్పలు .. గూడేలు, తండాలను రాష్ట్ర ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 227 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ఇప్పటికి ఆయా గ్రామాల్లో రేషన్ షాపులను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఈ గ్రామాలన్నీ గతంలో అనుబంధ గ్రామాలుగా ఉన్నవే కావడం, స్థానికంగా షాపులు ఏర్పాటు చేయకపోవడంతో కార్డుదారులు సమీపంలోని గ్రామాలకు ఆటోలు, ద్విచక్రవాహనాలపై వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు కిలోమీటర్ల మేర కాలినడకనే వెళ్లి నెత్తిన బియ్యం మూటలతో తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వారు కోరుతున్నారు. రాళ్లదారిలో బియ్యం మూటలు ఎత్తుకుని వెళ్తున్న ఆదిలాబాద్ రూరల్ మండలం మాంగ్లీ గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఇటీవలే నేను రెవెన్యూ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఏయే గ్రామాల్లో రేషన్షాపులు లేవనే వివరాలను డీఎస్వో నుంచి తెలుసుకుంటాను. వారిచ్చే నివేదిక ఆధారంగా కొత్త షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం. – ఎస్.రాజేశ్వర్, రెవెన్యూ ఇన్చార్జి అదనపు కలెక్టర్ ‘రేషన్ షాపులు లేని గ్రామాల్లో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా కార్డుదారులకు స్థానికంగానే బియ్యం అందించవచ్చు..’ ఇవి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 6న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో జిల్లా అధికారులకు చేసిన ఆదేశం.జిల్లాలో.. రేషన్ కార్డులు : 2,26,048 రేషన్ దుకాణాలు :356 ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో : 53గ్రామీణ మండలాల పరిధిలో : 303 -
‘నేటి ర్యాలీ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్టౌన్: భగత్సింగ్ స్ఫూర్తితో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సీఐటీయూ, టీఏవీఎస్, ఐద్వా, తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా కార్యాలయం నుంచి భగత్సింగ్చౌక్ వరకు నిర్వహించనున్న ర్యాలీ విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 22 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుల ని కొనియాడారు. వారి 95వ వర్ధంతిని పురస్కరించుకుని సమసమాజ నిర్మాణం, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఐ ద్వా జిల్లా కార్యదర్శి మంజుల, టీఏవీఎస్ జిల్లా కా ర్యదర్శి ఆత్రం కిష్టు, తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా నిధులు విడుదల
ఆదిలాబాద్టౌన్: కొంతకాలంగా రైతుభరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఆదివారం సిద్ది పేటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవ ంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. సోమవారం నుంచి ఎకరాకు రూ.6 వేలకు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇదివరకు మొదటి విడతలో ఎకరం వరకు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసేవారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టాపాస్బుక్ ఉన్న ప్రతీ రైతుకు ఎకరంతో సంబంధం లేకుండా ఒక ఎకరానికి సంబంధించి డబ్బులు జమ చేయనున్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు రైతులందరికీ ఈ డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆదివారం వ్యవసాయ అధికారులు, రైతులు రైతు వేదికల్లో సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు. జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా, వీరందరికీ ఒక ఎకరం డబ్బులు జమ కానున్నాయి. వీరితో పాటు ఫిబ్రవరి 28 వరకు పట్టాపాస్ బుక్ తీసుకున్న రైతులకు సైతం రైతుభరోసా నిధులు జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో లక్షా 63వేల మంది రైతులు ఉండగా ఇందుకు గానూ రూ.3.20 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. ఎకరం నుంచి 5 ఎకరాల్లోపు రైతులు లక్షా 28వేల 650 మంది ఉండగా, 5 నుంచి 10 ఎకరాల్లోపు 30,607 మంది రైతులు, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832 మంది, 20 ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులు ఉన్నారు. -
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం
బోథ్లో ఫైర్స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ప్రతీ అసెంబ్లీ సమావేశాల్లో బోథ్లో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రస్తావించా. పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశా. ప్రభుత్వం దిగివచ్చి ఫైర్స్టేషన్ మంజూరు చేసింది. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ కాంగ్రెస్ ప్రభుత్వంవల్లే మంజూరు కాంగ్రెస్ పార్టీ వల్లే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరైంది. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని ఫైర్స్టేషన్ మంజూరు చేసింది. ఫైర్స్టేషన్ మంజూరుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి సైతం కృషి చేశారు. – ఆడె గజేందర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
బోథ్: జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. మహిళా సి బ్బంది కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని మహిళా కానిస్టేబుళ్ల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్ కేసులు పరిష్కరించి చార్జి షీట్లు దాఖలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు పురుషోత్తం, సంజయ్ తదితరులున్నారు. -
మెరుగ్గానే ఉపాధిహామీ
గ్రామీణులకు పని కల్పించే ఉపాధిహామీ పథకంలో కూలీల పని దినాలు నమోదు మెరుగ్గానే ఉంది. రాష్ట్రంలో పలు జిల్లాలతో పోలిస్తే అధికంగా ఉంది. గతేడాది వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వేతో పరిశీలిస్తే 89.2శాతం అత్యధికంగా ఉండగా, ఈసారి అంతకంటే మెరుగ్గానే నాలుగు జిల్లాలు నమోదయ్యాయి.ఉపాధి కూలీ పని దినాలు (లక్షల్లో..)జిల్లా లక్ష్యం నమోదు సాధించిన శాతం ఆదిలాబాద్ 44.8 41.2 92.00 ఆసిఫాబాద్ 28.3 25.1 91.80 మంచిర్యాల 21.0 18.8 89.40 నిర్మల్ 32.0 28.0 87.40 -
నిరంతర శ్రమతోనే లక్ష్యసాధన
నేరడిగొండ: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధి రోహించాలంటే నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ యన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి నులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం అంబారావ్, సర్పంచ్ రాథోడ్ సావిత్రి బాయి, రాజు, రైల్వే బోర్డు డైరెక్టర్ జీవీ రమణ, నాయకులు రమేశ్, శంకర్, రాజశేఖర్, ధనరాజ్, చందర్సింగ్, మార్కండేయ, నారాయణ, వంశీ, అర్జున్, జీవన్, సోమన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగతంగా అధిక విస్తీర్ణంలో..
1,33,051వ్యవసాయ భూములు, వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి, సంస్థల వారీగా ఉన్న సాగులో యూనిట్లుగా ఉన్న పరిధిని పరిశీలిస్తే ఏజెన్సీ అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో వ్యక్తుల చేతులో అధిక మొత్తంలో భూములున్నాయి. మొత్తంగా వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థల పరిధిలో భూమిని చూసినప్పుడు రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ముందువరుసలో ఉంది. 1,85,262.041,84,8961,61,314.381,16,4781,52,964.561,65,277 -
సంస్థాగత ప్రక్షాళన
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్లో సంస్థాగత ప్రక్షాళన మొదలైంది. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులకు వికారాబాద్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పేర్కొన్న విధంగా క్షేత్రస్థాయిలో పార్టీలో సమూల మార్పులకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఉండగా, ప్రస్తుతం జిల్లా స్థాయిలోనూ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన ప్రక్రియ తాజాగా మొదలైంది. రాహుల్గాంధీ సూచన మేరకు.. జిల్లాలో పలు నామినేటేడ్ పదవులు ఉన్నాయి. వాటిని పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ఇవ్వాలి. అలా కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు తాము సూచించిన వ్యక్తులకు ఆ పదవీని ఇవ్వ డం,ఆ విషయంలో ఇతర ముఖ్య నాయకులు వ్యతి రేకించినా చెల్లకపోవడం వంటివి సామాన్యంగా చూస్తాం. ఒక నామినేటెడ్ పదవుల విషయం అనే కాకుండా పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమష్టి నిర్ణయం కోసమే ఏర్పాటు చేస్తున్నది జిల్లా పొలిటికల్ ఎఫైర్ కమిటీ. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా ఇటీవల వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పాల్గొని పార్టీలో తీసుకువస్తున్న సంస్థాగత ప్రక్షాళన విషయంలో దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగా పొలిటికల్ ఎఫైర్ కమిటీ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తుండగా ఆదిలాబాద్లోనూ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కమిటీలో ఎవరెవరూ.. డీసీసీ అధ్యక్షుడు చైర్మన్గా వ్యవహరించే ఈ కమి టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. జిల్లాలో కమిటీ ఏర్పాటుకు సంబంధించి వివిధపేర్లతో అధిష్టానానికి ప్రతిపాదన పంపించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తెలి పా రు. పార్టీలో ఒకరి పెత్తనం కాకుండా ఏదైనా సమష్టిగా నిర్ణయం తీసుకుని అధిష్టానానికి తెలియజేయడం, దాని విషయంలో ఎలాంటి అభ్యంతరా లు తలెత్తకుండా చూడటమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథ కాలను ప్రవేశపెట్టడం, అవి ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అనే విషయంలో రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలోనూ ఈ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమన్వయం చేసే విధంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచే వచ్చిందని అభిప్రాయపడుతున్నా రు. ఇదిలా ఉంటే ఇందులో సభ్యులుగా ఎవరెవ రూ ఉంటారనేది ప్రస్తుతం పార్టీలో ఆసక్తికరంగా మారింది. -
కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనంౖ’పె హర్షం
ఆదిలాబాద్టౌన్: జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడంపై లెక్చరర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ మాట్లాడు తూ, పథకం అమలుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నా రు. ఇందులో చట్ల ప్రవీణ్కుమార్, గోవర్ధన్, అశోక్, రవికాంత్, నరేశ్, సురేశ్, నరేందర్రెడ్డి, ఐలయ్య, అనిల్, రమేశ్ పాల్గొన్నారు. -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్: జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధి కారులను ఆదేశించారు. సెన్సస్–2027 నిర్వహణ పై టెక్నికల్ అసిస్టెంట్లు, చార్జ్క్లర్కులకు స్థానిక టీటీడీసీలో మూడు రోజుల శిక్షణ తరగతులను శు క్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేక యాప్ లు, పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కింద ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపా రు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కింద మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ చేపడతారని అ న్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్, శ్రీహరి పాల్గొన్నారు. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్,నాన్–టెక్నికల్ కో ర్సుల్లో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీఎం రవి, టాస్క్మేనేజర్ సాయి, బోధన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భా గంగా పట్టణంలోని 33వ వార్డులో ఇందిరమ్మ ఇంటి ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. రొడ్డ వాసవి–రవి దంపతులు నిర్మించుకున్న ఇంటిని ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పాల్గొన్నారు. ‘ఉపాధి’లక్ష్యాలు గడువులోపు పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావే శ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ వ్య యం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ రాథోడ్ శివరాం, ఏఈఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆదిలాబాద్టౌన్: మెడికల్ క్యాంపుల్లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతినగర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు మౌనిక, సయ్యద్ మెహబూబ్, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సగం మంది లెక్క చెప్పలే!
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖ ర్చుల వివరాలు విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటంది. నిబంధనల మేరకు వాటిని సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. గడువులోపు సమర్పించని పక్షంలో పదవి లో ఉన్న వారు అనర్హతకు గురికానున్నారు. ఓటమి పాలైన వారు భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఏ ఎ న్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఈమేరకు మరో వారం రోజుల్లో గడువు ముగియనుంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన వారిలో సగం మంది ఇప్పటికీ వివరాలు సమర్పించనేలేదు. అధికారులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పలువురు నుంచి స్పందన లేదు. ఇందులో ఓటమి పాలైన వారితోపాటు గెలిచిన వారు కూడా ఉండటం గమనార్హం. వివరాలు ఇవ్వాల్సిందే.. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవ రి 11న జరిగాయి. అదే నెల 13న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల్లోపు తమ ప్రచార వ్యయ నివేదికలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో తెరిచిన బ్యాంక్ ఖాతా ఆధారంగా వారు చేసిన వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంది. 27తో ముగియనున్న గడువు.. మున్సిపల్ పరిధిలోని 49వార్డులకు గాను 314 మంది పోటీ చేశారు. వారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యయం వివరాలు సమర్పించేందుకు ఈనెల 27వరకు అవకాశముంది. ఇప్పటి వరకు కేవలం 161మంది మాత్రమే వివరాలు అందజేశారు. ఇంకా 153 మంది సమర్పించాల్సి ఉంది. గడువు ఇంకా వారమే ఉండగా ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు మరోసారి జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గడువులోపు అందజేయాలి కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తమ ప్రచార వ్యయ వివరాలను నిర్ణీత ప్రొఫార్మా ప్రకారం విధిగా సమర్పించాల్సిందే. ఈసీ నిబంధనల మేరకు ఈ నెల 27వరకు అవకాశముంది. లేకుంటే గెలిచిన వారు పదవి కోల్పోవడంతో పాటు ఓడిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉంటుంది. – జి.రాజు, మున్సిపల్ కమిషనర్ -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కై లాస్నగర్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండే ళ్లు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ గోడం నగేశ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను అమలు చేయాలనే డిమాండ్తో పార్టీ రా ష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎ దుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజ ర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రైతు భరోసా ఇవ్వని కారణంగా అన్నదాతలు పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ అంశమే లేదు..
వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.. ఆదిలాబాద్ విమానాశ్రయ మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉందని భట్టి వివరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ అంశం ఇప్పట్లో లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్టర్ ప్లాన్ తర్వాతే ఈ అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు కొరటా–చనాఖా బ్యారేజ్, పిప్పల్కోటి రిజర్వాయర్లకు సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాలేదు. ఇక కుప్టి ప్రాజెక్ట్కు సంబంధించి నామమాత్రంగా నిధులు కేటాయించడం గమనార్హం. సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రత్యక్ష కేటా యింపుల్లో మొండి చెయ్యి ఎదురైందన్న అభిప్రా యం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే వివిధ పథకాల ద్వారా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కనుండడం కొంత ఊరటనిచ్చే అంశం. మరోవైపు ఈ బ డ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అధి కార కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతుండగా.. అంకెల గారెడీగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నిధుల కేటాయింపుపై నిరాశ 2026–27 బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్టు భూసేకరణకు నిధుల కేటాయింపు విషయంలో అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించింది. పెండింగ్ ప్రాజెక్టులకు స్వల్ప నిధుల కేటాయింపులు జరిపారు. దీంతో ఆ పథకాలు నిర్మాణం పూర్తి దాల్చడం అనుమానంగానే కనిపిస్తోంది. రాష్ట్ర పథకాల ద్వారా ప్రయోజనం.. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రూ.5లక్షల వరకు బీమా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ అమలు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇది జిల్లాలోని అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చనుంది. ఇక ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. కొత్తగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అందజేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాకు నిధులు కేటాయించారు. ఈనెల 22 నుంచి అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యానికి బోనస్, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు కేటాయించింది. ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 274 మొబైల్ అంగన్వాడీలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో పొందుపర్చింది. రాష్ట్ర పథకాల్లో జిల్లాకు ప్రయోజనం ఇలా.. పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్: 58,943 మంది విద్యార్థులకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం : 6,050 మంది విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో : 800 మంది విద్యార్థులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా : 1,56,683 (2011 జనాభా లెక్కల ప్రకారం)ప్రాజెక్టులకు కేటాయింపులు.. కుప్టి : రూ.50 లక్షలు లోయర్ పెన్గంగ : రూ.177.54 కోట్లు -
నేడే రంజాన్
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఆదిలాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్ట బందోబస్తు..: ఎస్పీ అఖిల్ మహాజన్ రంజాన్ పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈద్గా మైదానా న్ని శుక్రవారం సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన ఈద్గాతో పాటు అన్ని మసీదులు, ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేక పికెట్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శుక్రవారం రాత్రి నుంచే నిఘా పెంచుతున్నామని తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శనివారం ఉదయం ఈద్గా మైదానం వద్ద ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, పట్టణ ప్రజలు అంతర్గత రోడ్లను, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకు కలెక్టర్ శుభాకాంక్షలు కైలాస్నగర్: పవిత్ర రంజాన్ పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. -
ఎట్టకేలకు ‘భరోసా’
ఆదిలాబాద్టౌన్: రైతు భరోసాపై ఎట్టకేలకు ప్ర భుత్వం తీపి కబురు అందించింది. ఈనెల 22న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈనెల 22న ఆదివారం సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలివిడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి అన్నదాతల ఖా తాల్లో జమ కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ మఽ ద్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత నిధులు జమ చేయనున్నారు. జిల్లాలో 1.63లక్షల మంది రైతులుండగా వారి ఖాతాల్లో రూ.3.20 కోట్లు జమ కానున్నాయి. ఎకరం నుంచి ఐదెకరాల్లోపు 1,28,650 మంది, ఐదు నుంచి పదెకరాల్లోపు 30,607 మంది, 10 నుంచి 20 ఎకరాల వరకు 3,832మంది, 20ఎకరాలకు పైగా 250 మంది వరకు రైతులున్నారు. కాగా, కొద్ది నెలలుగా రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. నష్టపోయిన రైతులకు ఊరట కొందరు రైతులు రైతుభరోసా నిధులు జమ కాకపోవడంతో అప్పులు తెచ్చి రబీలో పంటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోయారు. ప్రస్తుతం రైతుభరోసా నిధులు జమ కానుండగా వీరికి కొంత ఊరట లభించనుంది. రబీ సీజన్ ముగిసినప్పటికీ వచ్చే వానాకాలం సాగుకు సంబంధించి ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశముంది. కొత్త మార్గదర్శకాలు ఇలా.. ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ రైతును సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఎకరం లోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమయ్యేవి. ఈ సారి ఎకరానికి కంటే ఎక్కువ ఉన్న రైతులకూ మొదటి విడతలో ముందుగా రూ.6వేలు జమ చేయనుంది. అయితే, కొత్త పట్టాపాస్బుక్ కలిగిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి28 వరకు కటాఫ్ డేట్గా ప్రకటించి అప్పటివరకు పట్టాపాస్బుక్లు పొందిన రైతులు ఏఈవోలకు పాస్బుక్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులు అందజేయాల్సి ఉంటుంది. -
అడుగు ముందుకు పడని ‘కుప్టి’
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టువిక్రమార్క నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నా రు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్ట నున్న ఈ బడ్జెట్లో భట్టి జిల్లాపై వరాలు కురిపిస్తారా..? లేదా.. మొండి చెయ్యి చూపుతారా? అనేది శుక్రవారం తేలిపోనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శు క్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుల నిర్మాణ పనులు వేగిరం చేస్తామని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ కోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. పెండింగ్లో ‘కొరాటా–చనాకా’ పనులు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగా నదీ భూభాగంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులు.. కొరా టా–చనాకా గ్రామాల మధ్య నిర్మించిన బ్యారేజ్ పూర్తయింది. దీని కింద పంప్హౌస్, ఎల్పీపీ కెనాళ్ల నిర్మాణాలూ పూర్తయ్యాయి. ఇక పంటచేల వరకు సాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఈ బ్యారేజ్ నుంచి నీళ్లను ఎత్తిపోసి ప్ర ధాన కెనాల్లోకి పారేలా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వు కూడా పర్యటించి కొరాటా–చనాకా బ్యారేజ్ ప నులపై సమీక్షించారు. మిగులు పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం భూసేకరణ, నిర్మాణ పనులన్నింటికీ కలిపి సుమారు రూ.800 కోట్ల వరకు ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన పక్షంలో ఎల్పీపీ కెనాల్ ద్వారా సుమారు 37వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది. మొదటిదశలోనే నిలిచిన ‘పిప్పల్కోటి’ కొరాటా–చనాకా బ్యారేజ్ కిందనే పిప్పల్కోటి రి జర్వాయర్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. గ తంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించి నా మొదటి దశలోనే నిలిచిపోయాయి. బ్యారేజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడం ద్వారా పిప్పల్కోటి రిజర్వాయర్ను నింపుతున్నారు. అక్కడి నుంచి మరో 10వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా దీని డీపీఆర్ రూపొందించారు. ఎల్పీపీ, కొరాటా–చనాకా కెనాళ్లు కలిపి 50వేల ఎకరాల వరకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో ఉంది. అయితే, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆటంకంగా మారింది. ఆదిలాబాద్లోని విమానాశ్రయ మైదానం (ఫైల్) కుప్టి ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలం (ఫైల్)కొరాటా–చనాకా బ్యారేజ్ (ఫైల్)బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్ట్ నిర్మించాలని 2018లో జీవో జారీ చేశారు. అప్పట్లో రూ.700కోట్ల అంచనా వ్యయం, 5.3 టీఎంసీలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఒక్క అడుగు కూడా దీంట్లో ముందుకు పడలేదు. ఏటా దీని ఎస్ఎస్ఆర్ రేట్లు మారుతూ వచ్చాయి. 2024–25 అంచనా వ్యయం రూ.1,700 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరగాల్సి ఉంది. ఇప్పటికై నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అడుగు పడుతుందా..? లేదా..? అనేది చూడాల్సిందే. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క బజార్హత్నూర్ మండలం నుంచి ప్రారంభించారు. 8వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అప్పట్లో పిప్రి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రతిపాదన చేశారు. అయితే, దానికి ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ బడ్జెట్లోనైనా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలవుతాయో.. లేదో.. చూడాల్సిందే. -
పదవుల పందేరం షురూ
కైలాస్నగర్: అధికార కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలైంది. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులనూ త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించిన పార్టీ అధిష్టానం ఆ దిశగానే ముందుకు సాగుతోంది. తాజాగా 61 మందితో కూడిన జంబో జిల్లా కార్యవర్గాన్ని ఖరారు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్ పంపించిన పేర్లను ఆమోదిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాను పరి శీలిస్తే జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నాయకు ల ముఖ్య అనుచరులుగా ఉన్న వారందరినీ పదవులు వరించడమే ఇందుకు నిదర్శనం. వారితో పాటు పలువురు సీనియర్ నాయకులకూ ప్రాధాన్యతని స్తూ జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు. దీంతో పదవులు దక్కిన నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంతుంది. కొద్దికాలంగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడింది. కాగా, మండలాధ్యక్షులతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాలనూ త్వరలో ప్రకటించనున్నట్లు, ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నూతన కార్యవర్గం ఉపాధ్యక్షులుగా సుధాకర్గౌడ్, లింగంపల్లి చంద్ర య్య, బ్రిజులాల్, బొల్లారం బాబన్న, మాధవ్రావు పటేల్, ఎ.దీపక్రావు, ప్రధాన కార్యదర్శులుగా సోయం తులసీదాస్, రాందాస్ నాక్లే, రజినీకాంత్, ఎన్.సుమ, సయ్యద్ ఇక్బాల్, బానోత్ ప్రణీత, ఎం. కరుణాకర్, ఆడె వసంత్, లక్ష్మారెడ్డి, ఎ.లక్ష్మణ్, రా మన్న యాదవ్, ఆత్రం సుశీల, ఉయికె అనసూయ, గౌళి సంజయ్, దరంపూరి చంద్రశేఖర్, బండి దేవి దాస్చారి, మహ్మద్ ముజాహిద్, బి.వెంకటి, అను పటేల్, అఖ్తర్ అలీ, కోశాధికారిగా ఎ.హిమాభిషేక్ రెడ్డి, అధికార ప్రతినిధులుగా బాలూరి గోవర్ధన్రె డ్డి, కుమ్రం కోటేశ్, పసుల చంటి, కార్యదర్శులుగా శ్రీకాంత్, ఎన్.ప్రమోద్రెడ్డి, మహ్మద్ రఫీక్, మిర్జా ఇమ్రాన్ బేగ్, ఎండీ సిరాజొద్దీన్, మంచికట్ల ఆశ మ్మ, మహ్మద్ అఫ్రోజ్, ఖాడె సంతోష్, కన్నె ప్రభాకర్, ఫైజుల్లాఖాన్, దాసరి రమేశ్, చిందం రఘువంశీ, భగత్ సంగీత, అన్నపూర్ణ, ఎ.మందాకిని, సామ ప్రభాకర్రెడ్డి, మెస్రం భాగ్యలక్ష్మి, జాదవ్ జగదీశ్, మెస్రం నాగనాథ్, ఎండీ.మసూద్, రాయిసిడాం ఎత్మారావ్, మెస్రం జైతు, ఎల్మ వినయ్రెడ్డి, చౌహాన్ హరిసింగ్, మేకల గంగాకిషన్, షేక్ ఇమ్రాన్, కృష్ణవేణి, వెన్నెల నరేశ్, ఎ.రమేశ్, పురుషోత్తంరెడ్డి, లోలపు పోశెట్టి నియమితులయ్యారు. -
‘శ్రీపరాభవ’ వేడుక
వ్యర్థాలతో ఆదాయం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య సభ్యులు వ్యర్థాలతోనూ ఆదాయం ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు. డంప్యార్డులో యూనిట్ నెలకొల్పి ఆదర్శంగా నిలిచారు. బుల్లిపిట్ట.. కనుమరుగైతే ఎట్టా? ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు పెరటిలోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేయగా నేడు మచ్చుకై నా కనిపించడంలేదు.ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది. శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026పచ్చడి పంపిణీ చేస్తున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్పంచాంగ పఠనం చేస్తున్న వేదాంతి రిమ్స్ మహాగణపతి గుడిలో పూజలు చేస్తున్న భక్తులువిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి జిల్లా ప్రజలు గురువారం ఘనస్వాగతం పలికారు. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి ఇంటిల్లిపాది సేవించారు. పిండివంటలు చేసుకుని ఆరగించారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో పంచాంగ పఠనం నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని భక్తులకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మఠాధిపతి శ్రీశ్రీయోగానంద సరస్వతీస్వామి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్కుమార్ కత్రి పాల్గొన్నారు. – ఆదిలాబాద్ -
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఆదిలాబాద్రూరల్: పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యు వతి ఆత్రం సమ్మక్క హత్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నింది తులను కఠినంగా శిక్షించాలని ఆదివాసీ హక్కు ల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశా రు. గురువారం మావల మండలం కుమురంభీంగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సమ్మక్కను ప్రేమ పేరిట మోసగించి హత్య చేసిన నిందితుడితోపాటు అతడికి సహకరించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సులు నమోదు చేయాలని కోరారు. బాధిత కు టుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా, కు టుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంది ర, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత, తు డుం దెబ్బ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండలాధ్యక్షుడు వేడమ ముకుంద్రావ్, నాయకులు గోవిందరావ్, నాగోరావ్, వెట్టి బొజ్జు, సోము తదితరులున్నారు. -
రెవెన్యూ ఆపరేటర్ల సేవలకు మంగళం!
కై లాస్నగర్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇక నుంచి జూని యర్ అసిస్టెంట్లు, జీపీవోలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆపరేటర్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి తమను కొనసాగించేలా చూడాలని వే డుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రెండురోజులుగా వారు విధులకు దూరంగా ఉండగా కుల, ఆదాయ, నివా సం తదితర ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచింది. ఏళ్ల తరబడి విధులు నిర్వహించినా.. కాంట్రాక్ట్ పద్ధతిన రెవెన్యూ శాఖలో మీసేవ ఆపరేటర్లుగా నియామకమైన 20మంది కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి ఒకరు చొప్పున 18మంది పనిచేస్తుండగా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ప్రభుత్వం నెలకు రూ.20వేల వే తనాన్ని చెల్లిస్తోంది. అయితే, ప్రభుత్వం ఇటీవల గ్రూప్–3లో ఎంపికై న వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది. వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారిని గ్రామ పాలన అధికారులు (జీపీవో) గాను తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకువచ్చింది. వీరిలో ఉన్నత విద్యావంతులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు అందిస్తున్న సేవలను ఇక నుంచి వీరికే అప్పగించా లని నిర్ణయించిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతి పది కన పనిచేస్తున్న వారినితొలగిస్తూ జీవోజారీచేసింది. ఆందోళనలో ఆపరేటర్లు ప్రభుత్వ నిర్ణయంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్లుగా విధులు నిర్వహించిన తమను ఒక్కసారిగా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అయితే, ప్ర భుత్వం వారిని తొలగి స్తూ జీవో జారీ చేయడంతో జిల్లా అధికారులూ ఏమి చేయలేని ప రిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రస్థాయి నాయకత్వం ఆధ్వర్యంలో ప్ర భుత్వ పెద్దలను కలిసి తమ గోడు వెల్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటిని కలిసి ఆవేదన వెలిబుచ్చేందుకు నిర్ణయించారు. -
సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఎస్పీ అఖి ల్ మహాజన్ గురువారం ప్రారంభించారు. గ్రా మంలోని ఆదర్శ యువ రైతులను శాలువాలతో సన్మానించి బహుమతులు ప్రదానం చేశా రు. ఉగాదిని పురస్కరించుకుని స్థానిక రామాలయంలో పూజలు చేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పండు గ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆది లాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై రాధిక, అగ్రికల్చర్ ఏడీ నర్సయ్య, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, నాయకులు చితలపెల్లి దేవరెడ్డి, గణేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
అధ్యక్షా.. నిధులు మంజూరు చేయండి
● అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చోడ :బోథ్ నియోజకవర్గ అభి వృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పీకర్ ద్వారా అసెంబ్లీలో కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పలు సమస్యలను బుధవారం సభ దృష్టికి తీసుకెళ్లారు. దేగామ ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 200 కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. బోథ్లో ఫైర్స్టేషన్ లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను వివరించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని, ఆసుపత్రి భవన నిర్మాణ బిల్లులందక పనులు నిలిచిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బోథ్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఇచ్చోడలో షాదీఖానా నిర్మాణానికి రూ.3 కోట్ల ఫైనాన్స్ అనుమతి ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో పత్తి, సోయా పంటలు పండిస్తున్న రైతులకు బోనస్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రైతులకు ఆశాజనకం
ఈ సంవత్సరం నవనాయకులలో ఏడు శుభ గ్రహాలే ఉన్నాయి. ఇది దేశానికి, ప్రజలకు ఎంతో శుభసూచకం. రాజా, నీరసాధిపతి గురుడు కావడం వల్ల ప్రభుత్వ పాలన ప్రజా రంజకంగా ఉంటుంది. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. మంత్రి కుజుడు కావడం వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఐటీ రంగా లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయి. భూముల ధరలు పెరుగుతాయి. నాలుగు కుంచాల వర్షం వల్ల జలాశయాలు నిండుతాయి. వరి, పత్తి, మిర్చి, వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తా యి. శత్రువుల పన్నాగాలను మన సైన్యం తిప్పికొడుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ విజయం మనదే అవుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉంది. వేసవిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. – శివశ్రీ సాయికుమార్, వేద పండితులు, ఆదిలాబాద్ -
శ్రీపరాభవ.. ఆగమనం
షడ్రుచుల పండుగ వచ్చేసింది. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం షురూ కానుంది. ఉగాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. రైతులు తమ పొలాలకు వేకువజా మున వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు ఆరుకోవడం ఆనవా యితీ. ప్రతీ ఇంటా షడ్రుచుల పచ్చడితో పాటు భక్షాలను స్వీకరిస్తారు. సనాతన హిందూ ఉత్సవ సమితితో పాటు రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉదయం ఉగాది పచ్చడితో పాటు గుడాలు పంపిణీ చేపట్టనున్నారు. సాయంత్రం గోపాలకృష్ణ మఠంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నా రు. ఈమేరకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. – ఆదిలాబాద్ -
‘ఈ–ఆఫీస్’తో ఫైళ్ల పరిష్కారం వేగవంతం
ఉట్నూర్రూరల్: ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ–ఆఫీస్ వినియోగించడం ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ద్వారా కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాలయ పనితీరు మెరుగుపడుతుందన్నారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులు, సిబ్బంది ఈ–ఆఫీస్ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. -
యువకుడిపై అడవిపంది దాడి
ఉట్నూర్రూరల్: ఇంటి ముందు నిలబడి ఉన్న యువకుడిపై అడవిపంది దాడి చేసిన ఘటన బుధవారం మండలంలోని హస్నాపూర్లో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రవీణ్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా పంట పొలాల నుంచి వచ్చిన అడవిపంది దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో కు టుంబ సభ్యులు వచ్చే సరికి అక్కడి నుంచి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. జనావాసాల్లో అడవిపంది వచ్చి దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ నావాసాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారుల త గు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ఆదిలాబాద్టౌన్: బాధిత కుటుంబాలకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు లక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం రాంనగర్లోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయార్థం రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. హోంగార్డు ఇన్చార్జి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ చరణ్గౌడ్, హోంగార్డులు పాల్గొన్నారు. విద్యుత్ తీగ తగిలి రైతుకు గాయాలుదహెగాం: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి రైతుకు గాయాలైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన మొరె సాయిప్రభు పంబాపూర్ శివారులోని పొలానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. పంబాపూర్ గ్రామానికి చెందిన కొడిపె శ్రీను అడవి జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్ తీగలకు తగలడంతో గాయాలయ్యాయి. బుధవారం సాయిప్రభును చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తమ్ముడు సాయిదేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. స్కూల్ బస్సు, లారీ ఢీ భైంసారూరల్: మండల పరిధిలోని నిర్మల్–భైంసా జాతీయ రహదారిపై మాటేగాం వద్ద బుధవారం స్కూల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఎగ్గాం నుంచి సుమారు 15 మంది విద్యార్థులతో భైంసా వైపు వెళ్తున్న బ్రిలియన్స్ స్కూల్ బస్సు మాటేగాం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సుభాష్, ఎస్సై సుప్రియ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ


