
కలెక్టర్ను కలిసిన ఆరోగ్య పాఠశాల బృందం
కై లాస్నగర్: జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమ పకడ్బందీ అమలుకు గాను కలెక్టర్ రాజ ర్షి షా ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య పాఠశాల బృందం ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ను తన క్యాంపు కా ర్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో టి.ప్రణీత, కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ అజయ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వైద్యులు వంశీ, శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రిసోర్సుపర్సన్లు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలోనూ జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని కలెక్టర్ వారికి సూచించారు. ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.