
వేసవి శిక్షణశిబిరానికి ఎంపిక
బజార్హత్నూర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల క్రీడా మైదానంలో ఇన్చార్జి హెచ్ఎం లింగన్న పర్యవేక్షణలో సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. 150 మంది పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఈ నెల 25నుంచి నేరడిగొండలో నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరానికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్, పీడీ అఖిల్, తిరుపతి, నాగరాజ్, అఖిల, షబ్బీర్, జబ్బర్ఖాన్, శైలజ, కిరణ్, శ్యాం, బాపురావ్, రమేశ్ పాల్గొన్నారు.