మలేరియా నిర్మూలనకు చర్యలు
డీఎంవో తులసి
రంపచోడవరం: జిల్లాలో పూర్తిస్థాయిలో మలేరియాను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎంవో తులసి తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో శుక్రవారం పీవో కట్టా సింహాచలంతో కలిసి పీహెచ్సీ వైద్యులు,ఎంపీడీవోలు, ఎంఈవోలు,సీడీపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు చెప్పారు.ఎక్కడైనా జర్వాలు ప్రబలితే ఆ ప్రాంత వాసులకు వెంటనే రక్తపరీక్షలు నిర్వహించాలన్నారు.దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా మలేరియా మందు స్ప్రేయింగ్, పాగింగ్ వంటివి చేయాలన్నారు.


