పనికెళ్లిన నాలుగు రోజులకే..
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు. బాణసంచా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అశువులుబాశాడు. అతని తండ్రి మెడిసి సత్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి లేరు. అక్క స్వర్ణకల ఉన్నారు. తన కొడుకు ఇంటికి ఆధారంగా ఉంటాడని భావించామని.. త్వరలో వివాహం కూడా చేయాలని అనుకున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో సరదాగా ఉండే హేమంత్ ఇకలేడన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విషాదం మునిగిపోయారు.


