విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ

Sep 23 2025 7:55 AM | Updated on Sep 23 2025 7:55 AM

విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ

చింతపల్లి: చింతపల్లి డిగ్రీ విద్యార్దులకు విజ్ఞాన విహార యాత్రలో బాగంగా విశాఖపట్నం రైల్వే ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌ అఽధికారులు టికెట్‌ కన్సలేషన్‌ ఫామ్స్‌ మంజూరు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం విజయ భారతి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ కన్సోలేషన్‌ ఫామ్స్‌తో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా విద్యార్దులు విహార విజ్ఞాన యాత్రలు చేయవచ్చన్నారు.అదే విధంగా ఎస్‌.వి.ఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎల్‌.వెంకటరామిరెడ్డి విద్యార్థుల పోటీ పరీక్షలకు ఉపయోగపడే రూ.30వేలు విలువైన పుస్తకాలను కళాశాలకు వితరణగా అందించినట్టు తెలిపారు.ఈ పుస్తకాలను కళాశాల గ్రంథాలయంలో భద్రపరచడం జరిగిందన్నారు. ఈ పుస్తకాలను వ వినియోగించుకొని పోటీ పరిక్షలకు సన్నద్దమై మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు పోటీ పరిక్షలు పుస్తకాలను అందజేశారు. అద్యాపకులు రవీంద్రనాయక్‌, జగదీష్‌, రమణ, లీలాపావని ,కెజీయారాణి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement