ప్రధాన వార్తలు

చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్ కావొచ్చు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్ చోరీ పేరిట ఇండియా బ్లాక్ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్ నాటికి-కౌంటిగ్ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్ అధిష్టానంతో చంద్రబాబు టచ్లో ఉన్నారు. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి టచ్లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్ గాంధీ మాట్లాడరేం?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్లైన్లో టచ్లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్మాల్పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన.

అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
సమాజ్వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్పై హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంట గలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయను కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేసింది. సింపుల్గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు
ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీం వ్యాఖ్యానించింది. దాసోజ్ శ్రవర్,సత్యానారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై గతంలో దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.

తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.అప్రమత్తమైన జీహెచ్ఎంసీభారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్హోల్స్ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది.

పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్రవాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!దేశానికి నమూనా మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది.

ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
కౌన్ బనేగా కరోడ్పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్లో 17వ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్ హీరోస్ పేరిట ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్ నటుడు తన లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్ ఓటీటీలో ఈ ఫుల్ ఎపిసోడ్ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్షిప్ తొలి కమాండ్గా గుర్తింపు దక్కించుకున్నారు.

IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై (CSK), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్కు చెందిన ప్రముఖ క్రికెటర్ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్లోకి రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్ అయ్యర్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్ స్టార్క్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్ కమిన్స్- సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు

నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దుఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తరలించడం జరగదు, చంపేస్తారా?తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ప్రోగ్రామ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.మా జేబులో నుంచి తీస్తున్నాంజంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. లోలోపలే చచ్చిపోతున్నా..ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) చదవండి: గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య!
ప్రాణదాతలకు సలాం!
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
వానాకాలం కదా.. మరి స్పెషల్ అలవెన్స్ ఉందా?
ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
నా సినిమా చూడండి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుపమ
ఆయన నా జీవితాన్ని మార్చేశారన్న బన్నీ.. ఆయన ఎవరు? విశేషాలివే
పంజరంలో బంధిస్తామంటే ఎలా?: రితికా భావోద్వేగం.. మనసు కరిగేలా..
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
ఏనుగులను పరిరక్షిద్దాం : సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్పై వేటు?
'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ప్రాణదాతలకు సలాం!
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
వానాకాలం కదా.. మరి స్పెషల్ అలవెన్స్ ఉందా?
ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
నా సినిమా చూడండి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుపమ
ఆయన నా జీవితాన్ని మార్చేశారన్న బన్నీ.. ఆయన ఎవరు? విశేషాలివే
పంజరంలో బంధిస్తామంటే ఎలా?: రితికా భావోద్వేగం.. మనసు కరిగేలా..
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
ఏనుగులను పరిరక్షిద్దాం : సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్పై వేటు?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నకిలీ నోట్ల ముఠానట! ఇక్కడికొచ్చి లొంగిపోతున్నాడు!
ఇంకొన్ని ఫిర్యాదులొచ్చే వరకూ ఆగుదాం సార్!!
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్కేనా?
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
ఈ రాశి వారు వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సినిమా

Coolie First Review: ‘కూలీ’పై డిప్యూటీ సీఎం రివ్యూ
మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) రజనీకాంత్ ‘కూలీ’(Coolie) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చాడు. ఇదొక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్కు ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ని బాగా ఎంజాయ్ చేశా. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని ఉదయనిధి ఎక్స్లో రాసుకొచ్చాడు.‘కూలీ’ విషయానికొస్తే..లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున విలన్గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. I am truly delighted to congratulate our Superstar @rajinikanth sir on completing 50 glorious years in the film industry.Had the opportunity to get an early glimpse of his much-awaited movie #Coolie, releasing tomorrow. I thoroughly enjoyed this power-packed mass entertainer… pic.twitter.com/qiZNOj5yKI— Udhay (@Udhaystalin) August 13, 2025

నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దుఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తరలించడం జరగదు, చంపేస్తారా?తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ప్రోగ్రామ్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.మా జేబులో నుంచి తీస్తున్నాంజంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. లోలోపలే చచ్చిపోతున్నా..ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) చదవండి: గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య!

'ఛావా' లాంటి సినిమా అస్సలు చేయను: స్టార్ హీరో
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఘోరంగానే ఉంది. స్టార్ హీరోలు వరసగా మూవీస్ చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటిది ఈ ఏడాది 'ఛావా' అనే చిత్రం అనుహ్యమైన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తన లైఫ్లో అస్సలు చేయనని, ఇలాంటి తీయడం సరికాదు అని బాలీవుడ్కి చెందిన హీరో జాన్ అబ్రహం చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా)జాన్ అబ్రహం లేటెస్ట్ సినిమా 'టెహ్రాన్'.. ఆగస్టు 14న నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్లో పాల్గొన్న జాన్.. ఓ ఇంగ్లీష్ వెబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఛావా', 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' తదితర చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితంలో అలాంటి చిత్రాలు చేయనని తెగేసి చెప్పాడు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు.'ప్రేక్షకులు మనతో మంచిగా ఉంటారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్పై ఉంది. నేను రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్కి చెందినవాడిని కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ నేను ఇప్పటివరకు 'ఛావా', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్ ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది' అని జాన్ అబ్రహం తన అభిప్రాయాన్ని చెప్పాడు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)

ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్లో సూపర్ హీరో జానర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?డీసీ యూనివర్స్లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.సూపర్ మ్యాన్తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్ప్రైజ్ స్ట్రీమింగ్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)
క్రీడలు

బాబర్ ఆజం రికార్డు బద్దలుకొట్టిన శుబ్మన్ గిల్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) బద్దలు కొట్టాడు. అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ICC Player Of The Month)’ అవార్డును గెలిచిన ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ను వెనక్కినెట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతీ నెలా ప్రకటించే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ జూలై నెలకు గానూ గిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన అతడిని జూలై నెల అవార్డుకు అర్హుడిగా మార్చింది. 754 పరుగులుఐదు టెస్టుల ఈ సిరీస్లో మొత్తం 754 పరుగులు చేసిన గిల్... అవార్డుకు పరిగణనలోకి తీసుకున్న జూలై నెలలో 3 టెస్టుల్లో కలిపి 567 పరుగులు సాధించాడు. ఇందులో బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో చేసిన 269, 161 (మొత్తం 430) పరుగుల ప్రదర్శన గిల్ కెరీర్లో హైలైట్గా నిలిచింది.ఐసీసీ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన గిల్... ఎడ్జ్బాస్టన్ మైదానంలో తాను ఆడిన 269 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు. ఎప్పటికీ మర్చిపోలేనిది‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కెప్టెన్గా తొలి టెస్టు సిరీస్లో ప్రదర్శనకుగాను నాకు గుర్తింపు దక్కడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చింది. బర్మింగ్హామ్లో చేసిన డబుల్ సెంచరీ ఎంతో ప్రత్యేకమైంది. ఎప్పటికీ మర్చిపోలేనిది.ఇంగ్లండ్తో సిరీస్ కెప్టెన్గా నేను ఎంతో నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇరు జట్లు చాలా బాగా ఆడాయి. ఆటగాళ్లందరికీ కూడా ఇది చిరస్మరణీయం. మున్ముందు ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తాను’ అని గిల్ స్పందించాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందడం గిల్కిది నాలుగోసారి. 2023 జనవరిలో, సెప్టెంబర్లో... 2025 జనవరిలో, జూలైలో గిల్కు ఈ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే అత్యధికసార్లు ఈ అవార్డు నెగ్గిన మేల్ క్రికెటర్గా.. అదే విధంగా.. ఒకే ఏడాదిలో రెండుసార్లు అవార్డు గెలిచిన తొలి ప్లేయర్గా గిల్ నిలిచాడు.అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన పురుష క్రికెటర్లు వీరే1. శుబ్మన్ గిల్- ఇండియా- నాలుగుసార్లు విజేత2. బాబర్ ఆజం- పాకిస్తాన్- మూడుసార్లు విజేత3. శ్రేయస్ అయ్యర్- ఇండియా- రెండుసార్లు విజేత4. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- రెండుసార్లు విజేత5. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- రెండుసార్లు విజేత6. కమిందు మెండిస్- శ్రీలంక- రెండుసార్లు విజేత7. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- రెండుసార్లు విజేత8. ముహమ్మద్ వసీం- యూఏఈ- రెండుసార్లు విజేత.చదవండి: IPL 2026: ‘ఈసారి వేలంలో ఖరీదైన ప్లేయర్గా అతడే’

వరల్డ్కప్ మ్యాచ్ల నిర్వహణ హక్కులను కోల్పోయిన ఆర్సీబీ హోం గ్రౌండ్
ఆర్సీబీ ఐపీఎల్ 2025 విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ స్డేడియం తాజాగా మహిళల వన్డే వరల్డ్కప్ మ్యాచ్ల నిర్వహణ హక్కులను కోల్పోయింది. షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే వరల్డ్కప్లో ఐదు మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది.అయితే ఈ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆర్సీబీ విజయోత్సవ తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ కున్హా కమిటీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ససేమిరా అన్నట్లు సమాచారం. స్టేడియం డిజైన్, స్ట్రక్చర్ భారీ సమూహాలు గుమి కూడేందుకు సేఫ్ కాదని కున్హా కమిటీ తేల్చినట్లు తెలుస్తుంది.దీంతో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్లను వేరే వేదికకు తరలించేందుకు బీసీసీఐ సిద్దమైంది. మ్యాచ్ల నిర్వహణ రేసులో తిరువనంతపురం ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తుంది.షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య ఇనాగురల్ మ్యాచ్ సహా మరో నాలుగు మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది. ఇందులో ఓ సెమీస్ సహా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్, ఇంగ్లండ్-సౌతాఫ్రికా మ్యాచ్లు ఉన్నాయి.మహిళల వన్డే వరల్డ్కప్ సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక దేశాల్లో పలు వేదికల్లో జరుగనుంది. కున్హా కమిటీ నివేదిక ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం డిజైన్ను పూర్తిగా మార్చే వరకు ఈ వేదకపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగవు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి హోం గ్రౌండ్గా చిన్నస్వామి స్టేడియం ఉండే అవకాశం లేనట్లే.కున్హా కమిటీ నివేదిక ఆధారంగా కొద్ది రోజుల కిందట కేఎస్సీఏ ఆథ్వర్యంలో జరిగే మహారాజా టీ20 టోర్నీని కూడా మైసూరుకు తరలించారు. మహిళల వన్డే వరల్డ్కప్కు ముందు జరగాల్సిన పలు ప్రాక్టీస్ మ్యాచ్లను కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించారు.

IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై (CSK), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్కు చెందిన ప్రముఖ క్రికెటర్ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్లోకి రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్ అయ్యర్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్ స్టార్క్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్ కమిన్స్- సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు

ఇషాన్ కిషన్ సేనకు భారీ షాక్.. టీమిండియా స్టార్ ఆటగాడు దూరం
దులీప్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్ కిషన్ నేతృత్వం వహిస్తున్న ఈస్ట్ జోన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కీలక పేసర్ ఆకాశ్దీప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏమో తెలీదు కాని, ఆకాశ్దీప్ స్థానంలో అస్సాం మీడియం పేసర్ ముక్తర్ హుసేన్ జట్టులోకి వచ్చాడు. ఎన్సీఏ ఆకాశ్దీప్ను విశ్రాంతి తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు పీటీఐ చెబుతుంది.ఆకాశ్దీప్ కొద్ది రోజుల కిందట ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టులో ఉన్నాడు. అతను టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్లతో కలిసి బంతిని పంచుకోవాల్సి ఉండింది. అయితే అతను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించబడ్డాడు.ఆకాశ్దీప్ తాజాగా ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. టీమిండియా గెలిచిన బర్మింగ్హమ్ టెస్ట్లో 10 వికెట్ల ప్రదర్శన సహా ఓవల్ టెస్ట్లో నైట్ వాచ్మన్గా కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. జట్టులో విధ్వంసకర ఆటగాడు రియాన్ పరాగ్ చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు.దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ముక్తార్ హుసేన్, మొహమ్మద్ షమీస్టాండ్బై ప్లేయర్లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్
బిజినెస్

రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు) గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 లక్షల కోట్ల మొండి రుణాలను (వసూలు కాని/ఎన్పీఏలు) మాఫీ (రద్దు) చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా రాజ్యసభకు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.91,260 కోట్లను మాఫీ చేసినట్టు చెప్పారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.అత్యధికంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2021–22లో రూ.1.16 లక్షల కోట్లు, 2022–23లో రూ.1.27 లక్షల కోట్ల చొప్పున మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇలా మాఫీ చేసిన మొత్తం నుంచి గత ఐదు సంవత్సరాల్లో వసూలైన మొత్తం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మాఫీ రుణాల్లో వసూలైంది 28 శాతమే. ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్పీఏలకు బ్యాంక్లు ప్రొవిజన్లు చేయాల్సి ఉంటుంది. ఇలా నూరు శాతం కేటాయింపుల తర్వాత నిబంధనల కింద పుస్తకాల్లో మాఫీ చేసినట్టు చూపిస్తాయి. అయినా, వాటి వసూలుకు బ్యాంకులు చర్యలు చేపడుతూనే ఉంటాయి. మాఫీ చేసినప్పటికీ రుణ గ్రహీతలపై చెల్లింపుల బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

స్వల్పంగా తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్1 నుంచి ఆగస్ట్ 11 వరకు) రూ.6.64 లక్షల కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.6.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 3.95 శాతం మేర తగ్గినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమవుతోంది. రిఫండ్లు పెరగడం ఇందుకు కారణం. వ్యక్తులు, కంపెనీలు, వ్యాపార సంస్థలు చెల్లించే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి.ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..కార్పొరేట్ సంస్థల నుంచి నికర పన్నుల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థల నుంచి వచ్చిన ఆదాయం 7 శాతానికి పైగా పెరిగి రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. రూ.22,362 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో వసూలైంది. ఇదే కాలంలో రిఫండ్లు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లకు ముందు స్థూల పన్ను వసూళ్లు రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి.

గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు పెరిగి 24,546కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 80,392 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..
భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సమగ్ర భూ సంస్కరణలను చేపట్టాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కీలక సూచనలు చేసింది. సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు, దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్య ఒకే స్టాంప్ డ్యూటీని అమలు చేసేందుందుకు వీలుగా జీఎస్టీ మాదిరి కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కోరింది.రక్షణాత్మక ధోరణి, వాణిజ్య యుద్ధాలు సవాలును విసురుతున్నాయంటూ.. భారత్లో స్థిరమైన విధానాలు, బలమైన పారిశ్రామిక సామర్థ్యాలు, దేశీయంగా అతిపెద్ద వినియోగ మార్కెట్, యువ శ్రామిక శక్తి, విశ్వసనీయ భాగస్వామిగా చాలా దేశాల్లో ఉన్న గుర్తింపు.. ఇవన్నీ భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చగలవని సీఐఐ తెలిపింది. ప్రతీ రాష్ట్రంలోనూ సమగ్ర భూ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, భూ వినియోగ మార్పిడిని పూర్తిగా డిజిటలైజ్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీని 3–5 శాతం మధ్య స్థిరీకరణ చేయాలని సూచించింది. స్పష్టమైన భూ యాజమాన్యం దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ చర్యల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేరువ కావొచ్చని అభిప్రాయపడింది.సమ్మిళిత వృద్ధి..భారత్లో తయారీకి ఊతమివ్వడమే కాకుండా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచే దిశగా బలమైన భూ సంస్కరణలు అమలు చేయాలని సీఐఐ కోరింది. గ్రామీణాభివృద్ధి సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించొచ్చంటూ కీలక సూచనలు చేసింది. భూ చట్టాల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉంది. కనుక కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారానికి వీలుగా జీఎస్టీ కౌన్సిల్ మాదిరి ఏర్పాటు చేయాలి. సమన్వయం, ఏకాభిప్రాయం ఆధారంగా ఈ సంస్థ సంస్కరణలు చేపట్టాలి.ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్బీ) ఏర్పాటు ప్రశంసనీయమేనంటూ, ఇందులో ఉన్న సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం ఇది కేవలం సమాచార సాధనంగానే పనిచేస్తోంది. రాష్ట్రాల మధ్య భూముల కేటాయింపు అధికారాలు సైతం ఉండాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి, భూముల సమీకరణ సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!రాష్ట్రాల స్థాయిల్లోనూ ఒకటికి మించిన అధికార యంత్రాంగాలు ఉండడాన్ని అవరోధంగా పేర్కొంది. దీన్ని అధిగమించేందుకు ఇంటెగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. భూములు కేటాయింపు, మార్పిడి, వివాదాల పరిష్కార అధికారాలు దీనికి ఉండాలి.భూ మార్పిడి విధానం డిజిటైజేషన్ చేయాలి. డిజిటల్ సంతకం పెట్టిన సర్టిఫికెట్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత మూడో పక్షం ధ్రువీకరణతో పారదర్శకత తీసుకురావచ్చు. అవినీతిని తొలగించొచ్చు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలు వేర్వేరుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్యలో ఏకే విధమైన రేటును అమలు చేయాలి.
ఫ్యామిలీ

జీఐ ఉత్పత్తులు, ప్రాధాన్యత
విలక్షణత, వారసత్వ గుర్తింపు కలిగి ఉన్న విశిష్ట ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంటే బాగుంటుంది. ఆ గుర్తింపును బట్టి ఆ ఉత్పత్తి ఏ భౌగోళిక ప్రాంతానికి చెందినదో తెలుస్తుంది. తద్వారా ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందు కోసమే భౌగోళిక సూచిక (జాగ్రఫికల్ ఇండికేషన్స్–జీఐ..Geographical Indication (GI)లు కేటాయించే ప్రక్రియ అంతర్జాతీయంగా అమల్లో ఉంది. జీఐ ఉన్న ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. భారత్లో 2004 నుంచి జీఐల కేటాయింపు మొదలైంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన ఎక్కువగా ఉన్న అధికాదాయ, ఉన్నత మధ్యతరహా ఆదాయ దేశాల్లో ఎక్కువ జీఐలు నమోదవుతున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే వేల కొలదీ ఉత్పత్తులకు జీఐలు ఇచ్చాయి. జీఐ జాబితాలో వైన్స్, స్పిరిట్స్ది అగ్రస్థానం. తర్వాతే వ్యవసాయ, ఆహారోత్పత్తులు. 2024 నాటికి మన 643 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ తక్కువ. చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మన దేశంలో ఎక్కువగా జీఐ గుర్తింపు ΄పొందాయి. ఇతర రంగాల్లో విలక్షణ ఉత్పత్తులపై మనం ఇంకా దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ప్రాంతీయ వారసత్వ సుసంపన్నతను పరిరక్షించుకోవటానికి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి జీఐ గుర్తింపును సోపానంగా మార్చుకోవాలి. జీఐ గుర్తింపు ΄ పొందిన ఉత్పత్తులను ప్రధాన మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చే మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.. ఈ ఏఐ యుగంలో జీఐ లోకంలో అభివృద్ధి మార్గాలేమిటో తొంగి చూద్దాం రండి..! మేధో సంపత్తి (ఇంటల్లెక్చువల్ ప్రాపర్టీ– ఐపీ) హక్కులు అనేవి మానవ మేధస్సు నుంచి వెలువడే ఉత్పత్తులను, వాటి సృష్టికర్తల ప్రయోజనాలను కాపాడే ప్రపంచవ్యాప్త చట్టబద్ధత కలిగిన ఒక వ్యవస్థలో భాగం. ఈ మేధో ఆస్తులను ఉపయోగించుకునే హక్కు, నియంత్రించే హక్కు ఎవరికి ఉంది? ఎవరి నుంచి అనుమతి ఎలా పొందవచ్చో జీఐ తెలియజేస్తుంది. ట్రేడ్మార్క్లు, భౌగోళిక సూచికలు.. రెండూ ఐటెంటిఫయ్యర్లుగా, డిఫరెన్షియేషన్ టూల్స్గా పనిచేస్తాయి. ట్రేడ్మార్క్లు ఉత్పత్తి వ్యాపార మూలాన్ని సూచిస్తాయి. అయితే జీఐలు దాని భౌగోళిక మూలాన్ని సూచిస్తాయి. భౌగోళిక సూచికలు (జీఐలు) నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన ఉత్పత్తులకు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ఉత్పత్తుల ప్రత్యేక లక్షణాలను, వారసత్వాన్ని జీఐలు ఎత్తి చూపుతాయి. సాంప్రదాయ ఉత్పత్తులను రక్షించడానికి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, మార్కెట్లో ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి సాధనాలుగా పనిచేస్తున్నందున జీఐల ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వైన్లు, స్పిరిట్లు జీఐలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో జీఐ రంగంలో వ్యవసాయ వస్తువులు, హస్తకళల ఉత్పత్తులదే పైచేయి. భారతదేశ మేధో సంపత్తి చట్టం నాలుగో షెడ్యూల్ ప్రకారం, వస్తువులను 34 తరగతులుగా వర్గీకరించారు. దీనిలో 31వ తరగతి వ్యవసాయ, ఉద్యానవన, అటవీ ఉత్పత్తులు, ఇతర తరగతులలో చేర్చని ధాన్యాలు, జంతువులు, తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కలు, పువ్వులు, జంతువుల ఆహార పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు, మాల్ట్ ఉన్నాయి. పర్మిజియానో రెగ్జియానో, షాంపైన్ వంటి మద్యం ఉత్పత్తులతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) జీఐ వ్యవస్థలో ముందంజలో ఉంది. పూర్వం నుంచి ఫ్రాన్స్ ఇటలీ, స్పెయిన్ జీఐ ఉత్పత్తుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, చైనా, భారత్ వంటి దేశాలు జీఐలను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించటంలో, ఉపయోగించడంలో ఇటీవల కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. పెద్దగా ప్రసిద్ధి చెందని వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు ప్రపంచ ఖ్యాతిని తేవటంలో, ΄ోటీని పెంచటంలో జీఐలు ఉపయోగపడతాయి. వియత్నాం, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ప్రపంచ మార్కెట్లలో తమ ఉత్పత్తుల విలక్షణతను చాటి చెప్పటానికి జీఐలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. వియత్నాంలో స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి జీఐలు సానుకూలంగా దోహదపడ్డాయి. 1999 చట్టంతో శ్రీకారంప్రపంచవ్యాప్తంగా సమాజాల సాంస్కృతిక పరిరక్షణ, ఆర్థిక వృద్ధికి జీఐలు కీలకమైన సాధనాలుగా మారాయి. మన దేశ జీఐ ప్రయాణం భౌగోళిక వస్తువుల సూచికలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం– 1999తో ప్రారంభమైంది. ఇది 2004లో 20 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. మొదటి జీఐ ట్యాగ్ డార్జిలింగ్ టీకి లభించింది. అప్పటి నుండి భారతదేశం జీఐ రిజిస్ట్రేషన్లలో వేగవంతమైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా సాంప్రదాయ వస్తువులను రక్షించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెం΄÷ందించడం జీఐ ట్యాగ్ల ద్వారా కొంతమేరకు సాధ్యపడుతోంది. స్థానిక సమాజాలు తరచుగా పర్యావరణ అనుకూలమైన సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించటంపై దృష్టి సారించడంతో జీఐ గుర్తింపు అటువంటి ఉత్పత్తి పద్ధతులను వెలుగులోకి తెస్తోంది.సవాళ్లెన్నో..జీఐ వ్యవస్థకు ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఉత్పత్తిదారులు, వినియోగదారులలో జీఐలపై అవగాహన, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువగా ఉంది. జీఐలను నమోదు చేయడం, అమలు చేయడం సంక్లిష్టంగా ఉండటంతో పాటు ఇది ఖరీదైన వ్యవహారంగా మారిపోవటం చిన్న ఉత్పత్తిదారులకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ఆశావహ భవిష్యత్తు కూడా కనిపిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, సుస్థిరతను ప్రోత్సహించడంలో జీఐ పాత్రకు గుర్తింపు పెరుగుతోంది. అంతేకాకుండా, భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తుల ట్రేసబిలిటీ, ధృవీకరణను పెంపొందించడానికి డిజిటల్ టెక్నాలజీలను వాడుకుంటే.. అది మార్కెట్ విస్తరణకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.వాణిజ్య ఒప్పందాల్లో రక్షణ అవసరంమన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు పొందటంలో ముందంజలో ఉన్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చితే జీఐల నమోదు ప్రక్రియ మన దేశంలో ఊపందుకోలేదని చెప్పచ్చు. చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు సులువుగా అర్థమై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలిగేలా జీఐ ప్రక్రియను సరళీకృతం చేయాలన్న వాదన ఉంది. అయితే, జీఐ గుర్తింపు ఇవ్వటంతోనే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. రిజిస్ట్రేషన్ తర్వాత మద్దతు అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన ఒక విషయమేమిటంటే.. జీఐ గుర్తింపులు ΄ పొందటగుత్తాధిపత్యానికి దారితీసే పరిస్థితులను ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే, ఆ ధోరణి చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టదాయక పరిస్థితులకు దారితీసే ముప్పు ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో జీఐ ఉత్పత్తులకు తగిన రక్షణ ఉండేలా పాలకులు రక్షణాత్మక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లలో మన జీఐ ఉత్పత్తులు రాణించగలుగుతాయి. చిన్నస్థాయి ఉత్పత్తిదారుల సవాళ్లను అంతర్జాతీయ, జాతీయ శక్తులు పరిష్కరించి, సాంకేతిక అభివృద్ధిని జోడించినప్పుడే జీఐ ద్వారా ఆర్థికాభివృద్ధిని అందిపుచ్చుకోవటం సాధ్యమవుతుంది. ఆర్థికాభివృద్ధితో నాటు ప్రాంతీయ విలక్షణ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన మన సంప్రదాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రాభవం లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే ఔషధ గుణాలున్న దేశీ పంట ఉత్పత్తులకు జీఐ ఇచ్చి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే మన రైతులకు, దేశానికి మంచి ఆదాయం చేకూరుతుంది. -పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్.

ధనం వద్దు.. ఆహారం ఇద్దాం!
దానం చేస్తే పుణ్యం వస్తుందంటారు. చిన్నపిల్లలను ఎండలో మాడ్చి, వానలో తడిపి చేయించే భిక్షాటనలో దానం చేస్తే వచ్చేది పాపమా పుణ్యమా?చంటిపిల్లలతో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చేయించేది భిక్షాటన కాదు బెగ్గింగ్మాఫియా అంటారు స్ట్రీట్ ఆర్టిస్ట్ స్వాతి.సంవత్సర రోజులుగా ‘చైల్డ్ బెగ్గింగ్’ నిరోధానికి ఆమె తన భర్త విజయ్తో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోమ్యూరల్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా చైతన్యం తెస్తున్నారు.హైదరాబాద్లో జరిగిన ‘ఆగస్ట్ ఫెస్ట్’లోవీరి పోస్టర్ ప్రదర్శన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ను ఆకట్టుకుంది. డబ్బు దానానికి బదులు ఆహారం ఇవ్వడమే ఈ మాఫియాకు విరుగుడు అంటున్న స్వాతితో సంభాషణ... ‘మేము ఒక అబ్జర్వేషన్ చేశాం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ, విప్రో సర్కిల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఒక బిచ్చగాడు చిల్లర లేదంటే క్యూఆర్ కోడ్ చూపించాడు. అక్కర కొద్దీ అడుక్కునేవారు క్యూఆర్ కోడ్ వాడరు. దీనినో బిజినెస్గా మార్చినవారే వాడతారు. భిక్షాటన చుట్టూ ఎన్నో విషయాలు ఉన్నాయి. కాని వాటిలో పసిపిల్లల్ని బాధ్యులను చేయడం పట్లే మా అభ్యంతరం. 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో, విద్యా హక్కుతో ఉండాలి. అలా లేక΄ోతే వారి గురించి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉంది. ఈ దేశ ΄పౌరులుగా మేము ప్రశ్నిస్తున్నాం’ అంటారు స్ట్రీట్ ఆర్టిస్ట్ స్వాతి. View this post on Instagram A post shared by Swathi Vijay (@swathiandvijay)"> ఖమ్మంకు చెందిన స్వాతి స్ట్రీట్ ఆర్ట్, మ్యూరల్స్లో పారిస్లో శిక్షణ పొందారు. భర్త విజయ్తో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్నో వాల్ మ్యూరల్స్ వేశారు. ఆడపిల్లల విద్య కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు ‘ఐయామ్ నాట్ యాన్ ఆబ్జెక్ట్ ఫర్ బెగ్గింగ్’ (భిక్షాటనకు నేనొక వాహకాన్ని కాదు) పేరుతో పసిపిల్లలతో చేసే భిక్షాటనను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం కోసం సంవత్సరం రోజులుగా స్ట్రీట్ ఆర్ట్తో, ΄ోస్టర్స్తో క్యాంపెయిన్ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లలో వాల్ మ్యూరల్స్ వేశారు. v వాళ్లు ఎందుకు నిద్ర పోతుంటారు?‘పిల్లల్ని మనం ఎంతో శ్రద్ధతో సంరక్షణ చేస్తాం. వారికి మంచి ఆహారం, నీరు అందేలా చూస్తాం. కాని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు ఎంత ప్రమాదకరంగా ఉంటారో మనం చూసి కూడా స్పందించం. వాహనాల మధ్య పిల్లలు తిరుగుతుంటారు... కొందరు స్త్రీలు నెలల బిడ్డలను చంకన వేసుకుని వారిని చూపించి బిచ్చం అడుగుతుంటారు. కాని గమనించి చూస్తే వీరిలో చాలామంది ఎండైనా, వానైనా నిద్ర పోతుంటారు. వారెందుకు నిద్ర పోతుంటారు? వారికి కెమికెల్స్ ఏవో ఇస్తారు నిద్ర పోవడానికి. వైటనర్స్ వాడతారు. డ్రగ్స్ ఇస్తారు. ఇలాంటి పిల్లలు పెద్దయ్యి తిరిగి డ్రగ్స్ అమ్మే స్థితికి చేరుతారు. దేశంలో మిస్సవుతున్న పిల్లలు భిక్షాటనకు పావులుగా మారుతున్నారు. ఆంధ్రా పిల్లల్ని మరో రాష్ట్రంలో, మరో రాష్ట్రంలోని వారిని తెలంగాణలో ఇలా గ్రూపులుగా చేసి వ్యవస్థీకృతంగా భిక్షాటన చేయిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో ఎందుకు కనుక్కోరు? ప్రభుత్వాలు, పౌరులు ఎందుకు పట్టించుకోరు? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎండలో చంటి పిల్లలు మాడుతుంటే మనం 100కు డయల్ చేస్తే అలా నలుగురు ఫోన్ చేసినా పోలీసులు పట్టుకెళతారు. ఆ పనీ చేయం. వేల మంది పిల్లలు మన దేశంలో ఇలా ఎంతకాలం బిచ్చమెత్తుకోవాలి. అందుకే మా వంతు బాధ్యతగా ఈ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఆగస్టు 9 హైదరాబాద్లో జరిగిన ఆగస్ట్ ఫెస్ట్లో క్రియేటివ్ ఫోరమ్ కింద మా పోస్టర్స్ ప్రదర్శన చేశాం. మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు స్వాతి. రోజుకు 60 వేలు‘హైదరాబాద్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక గ్రూప్ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు భిక్షాటన చేస్తే ఎంత సంపాదిస్తారో తెలుసా? 60 వేలు. అవును... ఒకసారి సిగ్నల్ పడితే 300 వాహనాలు ఆగుతాయి. అలా పీక్ అవర్స్లో రోజుకు 250 సార్లు సిగ్నల్స్ పడతాయి. ఒక రోజులో ఒక సిగ్నల్ పాయింట్ నుంచి 60 వేల వాహనాలు వెళతాయి. రూపాయి రెండ్రూపాయలు ఇప్పుడు ఎవరి దగ్గరాలేవు. పది రూపాయల లెక్కన వీరిలో పది శాతం మంది దానం చేసినా రోజులో 60 వేల రూపాయలు వస్తాయి. ఇలా సిటీలోని అన్ని సిగ్నల్ పాయింట్స్ దగ్గరి నుంచి ఎంత వసూలవుతుందో... ఇది ఎంత పెద్ద వ్యాపారమో ఊహించుకుంటే భయం వేస్తుంది. ఇంత పెద్ద వ్యాపారాన్ని చేయించడానికి పసిపిల్లల కోసం ఎన్నెన్ని దారుణాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ మాఫియాను ఆపాలి’ అంటారు స్వాతి.డబ్బును దానం చేయవద్దు‘నిజంగా దానం చేయాలంటే ఆహారాన్ని దానం చేయాలి. అదే కదా అవసరం. డబ్బు దానం చేస్తే డబ్బుతో ఏదైనా చేయొచ్చు. మత్తు పదార్థాలు, మద్యం కొనొచ్చు. డబ్బు కోసం దారుణాలు చేయొచ్చు. ఆహారాన్ని డబ్బుగా మార్చలేరు. అందుకే దానం చేస్తే ఆహారం ఇవ్వాలి. అలాగే చంటి పిల్లలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనపడితే పోలీసులకు చెప్పాలి. ఇంత వరకూ సిటీలో కనిపించే గ్యాంగులు ఇప్పుడు టౌన్ల వరకూ వెళ్లాయి. ఇంకా ఎంత దూరం వెళతాయో చెప్పలేము. కాబట్టి పిల్లల్ని కాపడటానికి పౌరులుగా మనమంతా ముందుకు రావాలి. మేము మా సొంత నిధులతో చేయదగ్గది చేస్తున్నాం. సపోర్ట్ చేస్తామని వాళ్లు వీళ్లు అడుగుతున్నారు. దాని కంటే కూడా ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లగలగడమే మాకు ఇవ్వగల సపోర్ట్’ అని తెలిపారు స్వాతి.

డీఆర్టీలో వేలానికి వచ్చిన ఇల్లు కొనచ్చా?
ఇటీవలే ఒక జాతీయ బ్యాంకు వారు జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఇల్లు వేలంపాట ద్వారా అమ్మకానికి పెడుతున్నట్లు చూశాను. అందులో ఏవేవో కేసు నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్లి చూడగా మాకు బాగా నచ్చింది. ఆ ఇంటి పూర్వ యజమాని లోను కట్టలేకపోవటం వలన బ్యాంకు వారు డీఆర్టీలో కేసు వేయడం ద్వారా ఇల్లు వేలానికి వచ్చిందని తెలిసింది. ఇలాంటి ఇంటిని వేలంపాటలో కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? – కిషోర్ కుమార్, వరంగల్ మీరు చూసిన ప్రకటన డీఆర్.టీ (డెట్ రికవరీ ట్రిబ్యునల్) కేసుకు సంబంధించి అయి ఉండవచ్చు. ఎవరైనా ఇంటి లోను/ఆస్తిపై లోను తీసుకొని తిరిగి కట్టలేని పక్షంలో దశలవారీగా బ్యాంకు వారు తగిన నోటీసులు జారీ చేసి, అప్పటికి కూడా బకాయిలు చెల్లించకపోతే ఆస్తి/ఇంటి పొజిషన్ తీసుకోవడానికి చర్యలు చేపడతారు. అక్కడ చట్టం ప్రకారం పొజిషన్ తీసుకోవడానికి సైతం బ్యాంకు వారికి ఎటువంటి కోర్టు ఆర్డర్ అవసరం లేదు. పొజిషన్ పొందిన బ్యాంకు వారు వేలంపాట వరకు వస్తే, అలాంటి ఆస్తిని/ఇంటిని వేలంపాటలో పాల్గొని, కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను, కోర్టు ఉత్తర్వులను, బ్యాంకు వారి పొజిషన్ విధానం మొదలైన వాటిని క్షుణ్ణంగా చూసుకొని కొనుక్కున్నవారికి సాధారణంగా ఎటువంటి ఆటంకాలు రాకపోవచ్చు. వేలంపాట సమయంలోనే మీరు బ్యాంకు సూచించినంత (సుమారు 25%) డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. మిగతా డబ్బులు చెల్లించడానికి మీకు గరిష్టంగా మూడు నెలల సమయం వరకు ఇవ్వవచ్చు. అయితే ఇలాంటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన కొన్ని అంశాలు...1) ఇంకా ఏమైనా కోర్టు కేసులు – ముఖ్యంగా డీ.ఆర్.టీ. లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా 2) బ్యాంకు వారికి పూర్తి పొజిషన్ ఉందా లేక సింబాలిక్ పొజిషన్ ఉందా 3) కొనుగోలు దారునికి పొజిషన్ ఎన్నాళ్ళకు ఇవ్వవచ్చు?4) ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా సదరు ఆస్తిపై ఇంకెవరికైనా హక్కులు ఉన్నాయా లేదా 5) ఏదైనా సంస్థకు ఆస్తి పన్ను, బిల్లులు వంటివి ఏమైనా బకాయిలు ఉన్నాయా 6) ఆస్తి/ఇంటి పై అనుమతులు లేని కట్టడాలు / మార్పులు ఏమైనా చేశారా? (చేస్తే బ్యాంకు వారి తగిన మార్పులు, సవరణలు చేసి ఇవ్వాలి) పైన సూచించిన అంశాలు మాత్రమే కాకుండా ఇంటి పత్రాలను, కోర్టుపత్రాలను, బ్యాంకు లావాదేవీ పత్రాలను, పత్రికా ప్రకటనలను కూడా మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన ఒక లాయర్ గారి దగ్గరికి తీసుకువెళ్లి అభిప్రాయం తీసుకుంటే మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు వారిని అదనపు పత్రాలు ఇవ్వవలసిందిగా కోరవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాద మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýSకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..)

నారీ స్వారీ!
శారీరక దృఢత్వం భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోగల మానసిక బలాన్నిపెంచి... కరిగిపోని కాన్ఫిడెన్స్ను ఇస్తుంది! అది జీవన దృక్పథాన్నే మార్చేస్తుంది! ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేసే కొలువులున్నాయి.. వాటిల్లో రాణించే అమ్మాయిలున్నారు! ఆ ఫోర్సే.. మౌంటెడ్ పోలీస్.. పదిమంది నారీమణులతో కూడిన ఆ అశ్వదళం హైదరాబాద్ను పహారా కాస్తోంది.. సెల్ఫ్ ప్రోటెక్షనే కాదు.. శాంతిభద్రతల పర్యవేక్షణలోనూ స్త్రీ శక్తిని చాటుతోంది!ఇంట్లో ఆడపిల్ల వీథి చివరన ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలన్నా తమ్ముణ్ణి తోడు ఇచ్చే పంపే కాలానికిక చెల్లు ఏమో అనిపిస్తోంది.. హైదరాబాద్లోని కీలక్రపాంతాల్లో గుర్రాల మీద గస్తీ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న అశ్వదళ మహిళా పోలీసులను చూస్తుంటే! నిజానికి వాళ్లను మహిళా పోలీస్ అంటే వాళ్లనలా తీర్చిదిద్దిన వాళ్ల దళాధిపతులు .. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితామూర్తి ఒప్పుకోరు.‘జాబ్కి జెండర్ ఏంటీ.. శక్తిసామర్థ్యాలు ప్రామాణికం కానీ..’ అంటారు. అందుకే తొలిసారిగా.. ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) పోలీస్లోని పదిమంది అమ్మాయిలను అశ్వదళంలోకి ఆహ్వానించి.. వారికి గుర్రపు స్వారీలో శిక్షణనిప్పించి విధులను అప్పగించారు. వీళ్లు ప్రతి శుక్రవారం మక్కా మసీదు, చార్మినార్ దగ్గర, రోజు విడిచి రోజు లేక్ డ్యూటీలు చేస్తున్నారు. ర్యాలీలు, పండగలు, గణేశ నవరాత్రులు, శోభాయాత్రలు వంటి సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.శక్తి చూపించింది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.. ఈ దళంలోని పదిమంది అమ్మాయిలది భిన్న నేపథ్యం. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినప్పటికీ మౌంటెడ్ పోలీస్ అంటే వాళ్లెవరికీ తెలియదు.. ఆ ఫోర్స్ గురించి నోటీస్ వచ్చేదాకా. ఏఆర్ పోలీస్లో రెండువందల మందికి పైగా మహిళలుంటే మౌంటెడ్ పోలీస్లో చేరడానికి పదిమంది మాత్రమే ముందుకు వచ్చారు. మౌంటెడ్ పోలీస్ అంటే ఏంటో రీసెర్చ్ చేశారు. ‘ట్రైనింగ్ టఫ్గా ఉంటుంది.. ఫిట్నెస్ చాలా అవసరం.. ఆసక్తి ఉంటేనే రండి’ అని ట్రైనర్ చెప్పాక దాన్నో సవాలుగా తీసుకున్నారు. శిక్షణలో గుర్రాల మీద నుంచి పడ్డారు. దెబ్బలు తగిలాయి. అయినా వెనుకడుగు వేయలేదు.గుర్రాలను మాలిమి చేసుకోవడంలో కొన్ని మెళకువలను కనుగొన్నారు. గుర్రాలు చెప్పినట్టు వినడం మొదలెట్టాయి. అలా శిక్షణలోని ఆంతర్యాన్ని పసిగట్టి.. తదనుగుణంగా ముందుకు సాగారు. ఆ ట్రైనింగ్ వాళ్ల ఆత్మస్థయిర్యాన్నే కాదు.. ఫిజికల్ ఫిట్నెస్నూ పెంచింది. జీవన దృక్పథాన్నే మార్చింది. విధి నిర్వహణలో వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకోవడం దగ్గర్నుంచి, తమ కమాండ్స్తో వాటిని చెప్పుచేతల్లో పెట్టుకోవడం మొదలు.. జనసమ్మర్ధంలో పరిస్థితిని అదుపు తప్పకుండా చూసుకోవడం వరకు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు. ఈ దళంలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్ అఖిల కూడా ఉన్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సభ్యులు సుభద్ర, హవంతిక ఈ కొత్త కొలువు గురించి వివరించారు. మగవాళ్లకే పరిమితమైన కొలువుల్లోకి మహిళలు వస్తే.. పనిప్రదేశం లో విమెన్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని ఈ అశ్వదళం నిరూపించింది.– సరస్వతి రమ – ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది.. ఎస్సై కావాలని, గృహ హింస మీద మహిళలకు అవగాహన కల్పించాలనేది నా లక్ష్యం. దానికోసమే రీసెంట్గా డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడేసరికి ఇందులో చేరిపోయాను. కొత్త పనులు చేయడమన్నా, నేర్చుకోవడమన్నా చాలా ఇష్టం. అందుకే మౌంటెడ్ పోలీస్ గురించి చెప్పగానే అందులో చేరడానికి అందరికన్నా ముందుగా నేను చెయ్యెత్తాను.అయితే నాకు రెండు డెలివరీలూ సిజేరియనే అవడంతో మౌంటెడ్ పోలీస్కి కావల్సినంత ఫిజికల్ ఫిట్నెస్ లేక ట్రైనింగ్ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. వెనక్కి వెళ్లిపోతే మిగిలిన అమ్మాయిలు నిరుత్సాహపడతారేమో అనిపించింది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్ పట్ల అప్పటిదాకా నాకున్న దృక్పథమే మారిపోయింది. లేనిదాని గురించి దిగులుపడే బదులు ఉన్నదాని గురించి పాజిటివ్గా ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాను. జీవితంలోని కష్టాలు, సవాళ్లంటే గౌరవం ఏర్పడింది – అఖిలఉత్సాహం.. ప్రోత్సాహం.. చిన్నప్పటి నుంచీ విలక్షణంగా... విభిన్నంగా ఉండాలనే తపన. అందుకే ఈ పోలీస్ జాబ్లోకి వచ్చాను. అది రొటీన్ అయిపోతోందనుకుంటున్నప్పుడే మౌంటెడ్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. గుర్రపు స్వారీ కష్టమని మా నాన్న వద్దన్నారు. కానీ ఆయన్ని ఒప్పించి ట్రైనింగ్లో చేరాను. నన్ను డ్యూటీలో చూసిన మా బంధువులు ‘నీ బిడ్డ ఠీవిగా భలే డ్యూటీ చేస్తోంద’ని తనతో చెబుతున్నారని మా నాన్న నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించే గర్వం చెప్పలేని సంతోషాన్నిస్తుంది. ఐపీఎస్ కావాలనే నా లక్ష్యానికి తగిన ప్రోత్సాహన్నిస్తుంది. – మర్రి హవంతికబ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను..చిన్నప్పటి నుంచీ నాకు టఫ్ టాస్క్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే, టైక్వాండో నేర్చుకున్నాను. స్పోర్ట్స్లో కూడా ముందుండేదాన్ని. ఆ స్పిరిటే నన్ను పోలీస్ జాబ్ వైపు, మౌంటెడ్ పోలీస్ వైపు మళ్లేలా చేసింది. ఈ కొలువు నాకో కొత్త చాలెంజ్. గుర్రపు స్వారీతో లైఫ్ బ్యాలెన్సింగ్ను నేర్చుకున్నాను. నా భవిష్యత్ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్. – సుభద్ర
ఫొటోలు
అంతర్జాతీయం

నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.

భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) కేవలం రెండు నెలల్లో రూ. 1,240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తరువాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయడం తెలిసిందే. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితం అయ్యాయన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఓవర్ఫ్లైయింగ్ ఛార్జీల నుంచి పీఏఏ ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత విమానాలకు తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పాక్ పొడిగించింది.

తుర్కియేలో శక్తివంతమైన భూకంపం
ఇస్లాంబుల్: తుర్కియే పశ్చిమప్రాంతాన్ని శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఇస్లాంబుల్కు 206 కిలోమీటర్ల దూరంలో భూమిలో సుమారు 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇస్లాంబుల్, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇజి్మర్లోనూ దీని ప్రభావంతో ప్రకంపనలు సంభవించాయి. షిండిర్గిలో ఒక భవనం కూలినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తుర్కియే తరచూ భూకంపాల ప్రభావానికి గురవుతోంది.
జాతీయం

‘భారత్కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్ తాటాకు చప్పుళ్లు
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. కాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్.. పాకిస్తాన్ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.

Bihar: ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్.. ఈసీకి వార్నింగ్
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.బీహార్లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది.

సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచి్చంది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్రావు 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్లు వాదనలు వినిపించారు. నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్రావు అదే ఏడాది సెపె్టంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది. చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది.వామన్రావు కేసులో దోషులను శిక్షించాలి: మంత్రి శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే వామన్రావు కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.

భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్తో భారత్లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్లో నిందితుడి అకౌంట్పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్పై ఫిర్యాదు చేసింది.పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు..రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు.

రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్పై వేటు పడింది. పోలీసు స్టేషన్కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్ను వీఆర్కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్లో ఉన్న జయరాంనాయక్ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..

30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్
కర్ణాటక: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒకరు స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చిచ్చు రేగింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు హత్య కేసులో ఇరుక్కున్నాడు.విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవర్ కాగా, విజయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువతిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ కల్లోలం రేపాడు. విజయ్ భార్య ఆశతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో విజయ్ తన కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధనంజయ ఎఫైర్ కొనసాగించడంతో పంచాయితీ పోలీసులకు వద్దకు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.మరోవైపు తన సంసారంలో నిప్పులు పోసిన ధనంజయ్ని చంపేస్తానని విజయ్కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అతడు అన్నంత పని చేస్తాడనే భయంతో విజయ్కుమార్ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి విజయ్కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విజయ్కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్, అతడి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.∙

ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్కు తరలిస్తామని వెల్లడించారు. లంచం అడిగితే 1064 కాల్ చేయండి.. అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.