
వాకపల్లి మెట్ట వద్ద ఆటో బోల్తా
ఐదేళ్ల బాలుడితో సహా ఇద్దరికి గాయాలు
దేవరాపల్లి: వాకపల్లి మెట్ట దగ్గర వై జంక్షన్ సమీపంలో గల మలుపు వద్ద ఆదివారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడితో సహా ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు స్పందించి బాధితులను 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. ప్రమాదంలో పెదనందిపల్లి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు పట్నాల భార్గవ్ కాలికి తీవ్ర గాయమైంది. గొండి ఈశ్వరమ్మ తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రుల బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చీడికాడ నుంచి ఐదుగురు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. వాకపల్లి వై జంక్షన్ దగ్గరకు రాగానే అదుపు తప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి బలమైన గాయాలు కాగా, మిగిలిన వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వాకపల్లి మెట్ట వద్ద ఆటో బోల్తా

వాకపల్లి మెట్ట వద్ద ఆటో బోల్తా