
వచ్చే నెలలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
● లోగో ఆవిష్కరించిన నేతలు
అనకాపల్లి : రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట అని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మహాసభల లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకూ తిరుపతిలో జరుగుతాయని తెలిపారు. దేశంలో చదువుకున్న చదువుకి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత పెరుగుతుందని, ఏమీ పట్టనట్టు పాలకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. కులగణన పేరుతో మతాల మధ్య గొడవలు సృష్టించి నేటి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజల్లో విద్వేషాలను నింపుతూ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించకుండా వారి దృష్టిని మళ్లించి మరో వైపు దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, జిల్లా కార్యదర్శి వియ్యపురాజు, అధ్యక్షుడు వేమల కన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు డొక్కరి హరీష్, సభ్యులు బొందు బాబ్జి, పెంటకోట, సంతోష్, విత్తనాల పోతురాజు, సాయి పాల్గొన్నారు.