బాబు సంపద సృష్టి.. మంగళవారం మరోసారి అప్పు.. ఈసారి ఎంతంటే? | An additional Rs 20000 crore in debt beyond mentioned in budget | Sakshi
Sakshi News home page

బాబు సంపద సృష్టి.. మంగళవారం మరోసారి అప్పు.. ఈసారి ఎంతంటే?

Published Wed, Feb 26 2025 5:05 AM | Last Updated on Wed, Feb 26 2025 11:22 AM

An additional Rs 20000 crore in debt beyond mentioned in budget

7.20% వడ్డీతో మరో రూ.1,000 కోట్లు అప్పు తెచ్చిన బాబు సర్కారు

ఇప్పటివరకు బడ్జెట్‌ పరిధిలో, బడ్జెట్‌ బయట తెచ్చిన అప్పు రూ.1.35 లక్షల కోట్లు 

బడ్జెట్‌ పరిధిలో చెప్పిన దానికి మించి రూ.20 వేల కోట్లు అదనంగా అప్పు

సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న సంప­ద సృష్టి సున్నా. అప్పులు మాత్రం తెగ పెరిగి­పోతున్నాయి. వారం వారం, నెల నెలా తెస్తున్న అప్పులతో ఏడాది తిరగకుండానే బడ్జెట్‌ లోప­ల, బడ్జెట్‌ బయట ఏకంగా రూ.1,35,640 కో­ట్లు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూ­పర్‌ 6 హామీలు అమలు చేయడంలేదు. సూపర్‌­6 లో ప్రధాన హామీలైన రైతు భరో­సా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి ఊసే ఎత్తడంలేదు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా 7.20 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది.

దీంతో బడ్జెట్‌ పరిధిలోనే మార్కె­ట్‌ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు రూ.89,940 కోట్లకు చే­రాయి. బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరం రూ.­70 వేల కోట్ల అప్పు చేస్తామని చంద్రబాబు ప్రభు­త్వం తెలిపింది. కానీ, ఆర్థికఏడాది ముగియడానికి నెల రోజులుండగానే బడ్జెట్‌లో చెప్పిన దాని­­కన్నా అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేసింది. బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.­14,700 కోట్లు అప్పు చేశా­రు. 

రాజ­ధాని పేరు­తో ప్రభు­త్వం ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ.15 వేల కో­ట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.­5 వేల కోట్లు మొత్తం రూ. 31 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకు ఉత్తర్వుల­నూ జారీ చేసింది. రాజ­ధాని పేరు­తో, కార్పొరే­షన్లకు గ్యారెం­టీల ద్వా­రా రూ.­45,700 కోట్లు అప్పు చేస్తోంది. ఇవే కా­కుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. 

ఏ ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదు 
ఒక్క ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు బాబు బృందం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గగ్గో­లు పెట్టారు. ఇప్పుడు కూటమి భారీగా అప్పు­లు చేస్తున్నా ఎల్లో మీడియా నోరు మెదపడంలేదు. 

ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం జనవరికి రూ.10,853 కోట్లు మాత్రమేనని కాగ్‌ గణాంకాలు తెలిపా­యి. ఆస్తుల కల్పనకు ఖర్చు చేయకుండా, సూపర్‌ 6 హామీలూ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడంలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement