debts
-
అప్పులపై బాబు సమాధానం చెప్పాల్సిందే.. ఆధారాలతో బయటపెట్టే దమ్ము మీకుందా..
-
ఏపీలో ఆర్థిక విధ్వంసం.. బాబు ‘మార్క్’ పాలన ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ తమ సంపద కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం సంపద సృష్టించకపోగా.. తన మనుషులకు ఆస్తులను అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, పోర్టులు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్.. రూ.1.45 లక్షల కోట్లు అప్పులు చేసింది.అయితే.. ఆస్తులు అమ్మి, అప్పులు చేసిన సొమ్మంతా ఏమౌతుందని ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఆస్తుల అమ్మకమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్నీ కూడా కూటమి సర్కార్ అమలు చేయడం లేదు. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే లక్షల కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు.ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. -
అబద్ధాల నుంచి అప్పుల వరకు.. బాబు మోసాలపై జగన్ పవర్ ఫుల్ ప్రజెంటేషన్
-
ఈ 9 నెలల్లో అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు అప్పు చేశారు
-
మరో 6వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు
-
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడికోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
అప్పులతో విజన్ 2047
-
‘జీఎస్డీపీ పెంపే సంపద సృష్టి!’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) పెంచడమే సంపద సృష్టి అని, దాన్ని చూపించి అప్పులు తేవడంతో పాటు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే తన విజన్ 2047 అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పెరిగే జీఎస్డీపీ అంచనాలతో అదనంగా ఎంత అప్పు చేసేది, తద్వారా అదనంగా వ్యయానికి ఎన్ని నిధులు వస్తాయనేది వివరిస్తూ.. ఇదే రీతిలో విజన్–2047 నాటికి ఏటా 15 శాతం వృద్ధితో (ఊహాజనిత) జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే, ఈ ఆర్థిక ఏడాది ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర స్తూల ఉత్పత్తి అదనంగా 4.03 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనాల మేరకు 2024–25 ఆర్థిక ఏడాది జీఎస్డీపీ 12.94 శాతం వృద్ధిగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి గత ఆర్థిక ఏడాది 7.42 శాతం ఉంటే, ఈ ఆర్థిక ఏడాది ముందస్తు అంచనా మేరకు 6.71 శాతంగా ఉందని చెప్పారు. 2025–26 నుంచి 2029–30 వరకు జీఎస్డీపీ పెంచడం ద్వారా అదనంగా రూ.4,35,867 కోట్ల అప్పు చేస్తానని, తద్వారా అదనంగా వ్యయం చేయడానికి రూ.1,58,987 కోట్లు వస్తాయని చెప్పారు. విజన్–2047 లక్ష్యం తలసరి ఆదాయం రూ.58 లక్షలకు పెంచడమేనని స్పష్టం చేశారు. పెరిగిన తలసరి ఆదాయాన్ని ప్రజలు ఖర్చు చేస్తారని, దాంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు.విజన్–2047పై 16 లక్షల అభిప్రాయాలుకేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్కు కూడా రాని రీతిలో రాష్ట్ర విజన్–2047పై ఏకంగా 16 లక్షల మంది అభిప్రాయాలను తెలిపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్డీపీ రూ.3.47 కోట్లకు చేరుతుందని, ఈ లెక్కన తలసరి ఆదాయం రూ.58.14 లక్షలకు చేరుతుందని వివరించారు. నిరంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇది సాధ్యమని, లేదంటే తలసరి ఆదాయం రూ.13 లక్షలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చితేనే తాను చెప్పిన రీతిలో జీఎస్డీపీ ఉంటుందని, లేదంటే అప్పులు చేయడమే మార్గమని అన్నారు. లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చకపోతే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుందన్నారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడం లేదని, బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ అప్పులు ఇవ్వాలంటే విశ్వసనీయత ప్రధానమని చెప్పారు. పీ–4లో భాగంగా రాష్ట్రంలో కుటుంబ సభ్యులందరినీ అనుసంధానం చేస్తూ, ప్రతి ఇంటిని జీయో ట్యాగింగ్ చేసి వారి అకౌంట్లను తీసుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తామని, తద్వారా సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు 150 సేవలు అందిస్తామని చెప్పారు. పీ–4లో జనాభాయే ఆస్తి అని చెప్పారు. పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామన్నారు. తాను పెన్షన్ పెంచడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటున్నారని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు పేదలను పైకి తీసుకురావడానికి ముందు రావాలన్నారు. ఎవరైనా ఒకరిని చంపితే వారికీ అదే గతిరాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్మార్టమ్కు కారణమైన వారికి కూడా పోస్ట్మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టబోమని, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలేనని, బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టామన్నారు. గంజాయి, డ్రగ్స్, లిక్కర్ దందాలను నిరోధిస్తున్నామని చెప్పారు. -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్
-
Magazine Story: 6 నెలలు అప్పు మీద అప్పు లక్షల కోట్లలో అప్పు..
-
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
అప్పుల్లో ఏపీ రికార్డు.. కొంప ముంచిన బాబు
-
Big Question: ఇది ముంచేసే ప్రభుత్వం.. ఆరు నెలల్లో లక్ష కోట్ల అప్పులు.. విజనరీ బాబు
-
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
కొత్త అప్పులకు తెర తీసిన కూటమి
-
భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీర్చాల్సి వస్తుంది: భట్టి
-
ఆర్థిక మంత్రి భట్టి అప్పు లపై చేసిన ప్రసంగాన్ని ఖండించిన కేటీఆర్...
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
-
అప్పు లు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు
-
మంగళవారం మరో అప్పు చేయనున్న చంద్రబాబు సర్కార్
-
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత ఘోరంగా అప్పులు
-
ఏపీ అప్పు లపై తప్పుడు ప్రచారం చేస్తోన్న చంద్రబాబు అండ్ కో
-
బొంకిందే బొంకుతున్న చంద్రబాబును ‘బొంకుల బాబు’ అని ఎందుకు అనకూడదు?... ఏపీ ముఖ్యమంత్రి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Big Question: నారా వారి అబద్ధాలు.. అప్పులపై అసలు నిజాలు..
-
ఏపీ అప్పులపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ
-
Amarnath: అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టించారు
-
అసెంబ్లీ సాక్షిగా బాబు కుట్ర భగ్నం
-
అప్పులు చేయడంలో బిజీగా మారిన ఏపీ సర్కారు
-
3వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
చంద్రబాబు వ్యాఖ్యలు.. పేర్నినాని కౌంటర్
-
వారం వారం.. అప్పుల హారం
‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది... తల్లి కడుపులో ఉన్న శిశువుపై కూడా అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంకగా మార్చేసింది... నన్ను గెలిపించండి... సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్...’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు... అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలికొదిలేశారు. అప్పులు చేయడంపైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ క్రమంలో తొలి వంద రోజుల్లోనే ఏకంగా రూ.22,000 కోట్లు అప్పు చేశారు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం 7.14 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున అప్పును చంద్రబాబు ప్రభుత్వం చేసింది.మరోవైపు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద చంద్రబాబు సర్కారు మరో రూ.5,200 కోట్ల అప్పు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీతో పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు, మార్క్ఫెడ్ రూ.3,200 కోట్లు అప్పు చేశాయి. చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులను కలిపి రూ.27,200 కోట్లు చేసింది. – సాక్షి, అమరావతి -
రాకెట్ స్పీడ్లో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మంగళవారం వచ్చిందంటే చంద్రబాబు సర్కారు అప్పు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరుకు చంద్రబాబు సర్కార్ అప్పులు రూ. 31,000 కోట్ల చేరుతున్నాయి. ఇప్పటికే 80 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సర్కారు రూ. 19,000 కోట్లు అప్పు చేసింది. మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరో రూ.12,000 కోట్లు అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలిపింది. దీంతో ఆర్బీఐ నెలవారీ మంగళవారాల్లో బాబు సర్కారు చేసే అప్పుల క్యాలెండర్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భాగంగానే వచ్చే నెల 1వ తేదీన మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయనుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ అప్పును ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 14 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధిలో రూ.1,000 కోట్లు అప్పు పొందనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలు, అనుమతి మేరకు అప్పులు చేస్తే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అయితే ఇప్పుడు ప్రతీ మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ ఎల్లో మీడియా ఒక ముక్క కూడా ప్రజలకు చెప్పడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదాకా చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో తెలియడంలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీలేమీ అమలు చేయకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల్లోనే రూ. 19 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పు చేసి తెచ్చిన నిధులు ఏ అభివృద్ధి పనులకు వెచ్చి0చారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై ఉందంటున్నారు. అలాగే వచ్చే మూడు నెలల్లో చేసే రూ. 12 వేల కోట్లను ఏ అభివృద్ధికి వ్యయం చేస్తారో చెప్పాల్సి కూడా ఉందంటున్నారు. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
రాష్ట్రానికి సవాలుగా రుణ భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండిదేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని రేవంత్రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమా ర్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టితెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు. రూ.10 వేల కోట్లు అడిగాంరైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు. -
మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు సర్కారు
-
మంగళవారం అప్పుల వారం
-
అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానిది కొత్త రికార్డు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది వరకు 5వేల900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న "మార్పు" అని బుధవారం(ఆగస్టు14) ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు.‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ చురకంటించారు. -
Big Question: జగన్ పై అప్పుల దుష్ప్రచారం.. అడ్డంగా దొరికిన బాబు
-
కేంద్రంలో చంద్రబాబు తిప్పేది అప్పుల చక్రమే
-
అప్పుల సర్కారు
-
AP Debts: అప్పుల ద్వారా సంపద సృష్టి!
సాక్షి, అమరావతి: అప్పులు చేయడం ద్వారా కాకుండా, సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్దంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12,000 కోట్లు అప్పు చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పు చేసిన రోజల్లా ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదని తప్పు పడుతూ ఎల్లో మీడియా కథనాలను రాయడం, వాటి ఆధారంగా చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేవలం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12 వేల కోట్లు అప్పు చేసినా, మంగళవారాలు అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయడం లేదు ఎందుకో అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత నెల 25వ తేదీన రూ.2 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన ఒకేసారి రూ.5,000 కోట్లు అప్పు చేసింది. 16వ తేదీన మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం (నిన్న) సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో రూ.1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 20 సంవత్సరాల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34 శాతం వడ్డీతో అప్పు చేసింది. ఈ లెక్కన నెల ఐదు రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ఒక్క పెన్షన్ పెంపు తప్ప మిగతా హామీల్లోని ఏ ఒక్కదాని అమలు ప్రారంభించలేదు. మరి ఈ అప్పులన్నీ దేనికి వ్యయం చేసినట్లో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా చెప్పాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనల మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంక చేశారంటూ.. లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియా పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆర్థిక వేత్తలు ప్రశి్నస్తున్నారు. రూ.12 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడంలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులను ఏ అభివృద్ధి పనులకు వెచ్చించారో చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. -
వైఎస్ జగన్ హయాంలో పరిమితంగానే ఏపీ అప్పులు: SBI
-
అసెంబ్లీ సాక్షిగా బాబు తప్పుడు లెక్కలు
-
అసలు అప్పెంత? బాబు బొంకెంత?
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే. గవర్నర్తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీతో తప్పులు చెప్పించిన సీఎం చంద్రబాబును మందలించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాస్తా. 2019 మే 30 నాటికి మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని స్వయంగా చంద్రబాబు గెజిట్ ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12 నాటికి ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. నాడు రూ.వంద కోట్లే ఉన్నా రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు రూ.7–8 వేల కోట్ల నిధులున్నా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నది బాబు భయం. హామీల అమలుకు నిధులు కేటాయించకుండా తప్పించుకునేందుకే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదుఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ప్రకటించి మరీ డీబీటీ ద్వారా అర్హులందరికీ కులమతాలు, పారీ్టలు, ప్రాంతాలు చూడకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా వివక్ష లేకుండా అందించాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఇచ్చాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి బటన్ నొక్కి అందచేశాం. మరి మీరిచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలను ఉదహరిస్తూ అప్పులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలు రంగు తెలిసిపోతుందనే భయంతో.. గత 52 రోజులుగా రాష్ట్రం పురోగమిస్తోందో తిరోగమిస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అణిచివేసే పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే.. పూర్తి స్థాయి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ధైర్యం లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే మోసపూరిత హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, హామీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 ప్రకారం రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పు ఎంత? లాంటి అంశాలు వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నది చంద్రబాబు భయం. అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. వంచన.. దగా.. మోసమే చంద్రబాబు విధానంచంద్రబాబు మోడస్ ఆపరండీ ఏమిటంటే.. వంచన, గోబెల్స్ ప్రచారం! ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయాలనుకున్నా... హామీల అమలుపై తప్పించుకోవాలన్నా దాన్ని అమలు చేస్తారు. ముందుగా ఒక కథ సిద్ధం చేసి తాను చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిపై చర్చలు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అందరితో అవే మాటలు మాట్లాడిస్తారు. టీవీ చర్చల్లో అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మనుషులే. చివరికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు హామీలను అమలు చేసే పరిస్థితి లేదని తీర్మానం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. వేరు పడినప్పుడు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడూ ఇదే కథ! ఎన్నికల్లో హామీలు ఇచి్చనప్పుడు.. వాటిని ఎగ్గొట్టేటప్పుడు కూడా ఇదే విధానం! ఇప్పుడు మొదటి కథగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి రాష్ట్రం నిజంగా ఆర్ధికంగా ధ్వంసమైందా? లేదా అన్నది ఒక్కసారి గమనిద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాటిపై అందరూ ఆలోచించాలి. ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే మా హయాంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ను ప్రశంసించింది. ఎఫ్ఆర్బీఎం అనుమతించిన దానికంటే తక్కువ అప్పు తీసుకున్నారని అభినందించింది. నేరుగా నగదు బదిలీ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే దీనికి కారణం. ‘క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్’ అని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది. ధర్మం వైపు నిలవండి..చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జూన్ 12వతేదీకి రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.5,655 కోట్లు వచ్చాయి. రెండోసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటా డబ్బులు జమయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి కనీసం రూ.7–8 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. అంత డబ్బు ఉన్నా డ్రామాలాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన అంశాలను.. వాస్తవపత్రం పేరుతో నేను చెప్పిన వాటిని ఒక్కసారి బేరీజు వేసి పరిశీలించండి. మీరంతా ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. విపత్తులోనూ ఆచితూచి అప్పులు» కోవిడ్ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గణనీయంగా తగ్గింది. » కేంద్ర పన్నుల వసూళ్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019–20లో –3.38% తగ్గాయి. 2020–21లో ఆ పెరుగుదల 0.85 శాతం మాత్రమే ఉంది. » సాధారణంగా ఏటా కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లలో పెరుగుదల 18 నుంచి 19 శాతం ఉంటుంది. » కోవిడ్తో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా కూడా బాగా తగ్గింది. » కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని జీఎస్డీపీ నిష్పత్తిలో తీసుకుంటే చంద్రబాబు హయాంలో 3.72 శాతం వస్తే మా హయాంలో కోవిడ్ కారణంగా 2.92 శాతానికి పడిపోయింది. » కోవిడ్ వల్ల మనకు బాగా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు.. ప్రతి రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే అవకాశం కల్పించినా చంద్రబాబు హయాంతో పోలిస్తే తక్కువే తీసుకున్నాం. » చంద్రబాబు హయాంలో కాంపౌన్డ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబులిటీస్ 21.63 శాతం అయితే మా హయాంలో 12.90 శాతమే ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అప్పులు 18.15 శాతం పెరగ్గా 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో కేవలం 13.80 శాతమే పెరిగాయి. ఎక్కువ అప్పులు చేసిన బాబు గొప్పవాడా? తక్కువ చేసిన మేం ఆర్థిక విధ్వంసకారులమా? ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని దు్రష్ఫచారం చేస్తూనే.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్, సూపర్ టెన్ అంటూ చంద్రబాబు హామీలిచ్చారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రజలు అడుగుతుండటంతో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవు. బడ్జెట్లో చూపించలేక అధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రూ.14 లక్షల కోట్లు కాస్తా రూ.10 లక్షల కోట్లకు తగ్గించారు. పోనీ నిజాలు చెప్పించారా? అంటే అదీ లేదు! » చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.1,18,051 కోట్ల అప్పులు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి రూ.5.18 లక్షల కోట్లకు చేరాయి. » ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.5,744 కోట్లు ఉండగా ఆయన హయాం ముగిసే నాటికి రూ.50 వేల కోట్లకు ఎగబాకాయి. అనంతరం మా హయాం ప్రారంభమయ్యే నాటికి రూ.50 వేల కోట్లతో మొదలైన అప్పులు చివరకు రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి. » ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు.. అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు 2014 జూన్ 2 నాటికి రూ.26 వేల కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి రూ.86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. » మొత్తంగా అప్పులు ఎంత? అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్ 2 నాటికి రూ.1,23,343 కోట్లు ఉంటే ఆయన వైదొలగే నాటికి రూ.4.08 లక్షల కోట్లకు ఎగబాకాయి. » మేం అధికారం చేపట్టే నాటికి రూ.4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి రూ.7.48 లక్షల కోట్ల అప్పులున్నాయి. » చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 21.63 శాతం ఉంటే మా హయాంలో అది 12.93 శాతమే ఉంది. అంటే 21.63 శాతం అప్పులు చేసిన వాడు గొప్పవాడా? ఆరి్థక విధ్వంసకారుడా? 12.93 శాతమే అప్పులు చేసిన మేం ఆర్థికంగా ధ్వంసం చేసినట్లా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. » రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నట్లు రాజ్యసభకు తెలియచేశారు. నేను జూన్ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా. వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లో రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడ నుంచి వచి్చంది ఈ రూ.పది లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగానే చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? -
చంద్రబాబు బండారం లెక్కల తో బయటపెట్టిన వైఎస్ జగన్
-
Big Question: 21 మంది ఎంపీలున్నా.. బడ్జెట్ లో సాధించింది సున్నా..
-
చంద్రబాబు సర్కార్ లో మంగళవారం వచ్చిందంటే టెన్షన్..
-
అప్పులకు షూరిటీ.. మన భవిష్యత్తుకు నో గ్యారెంటీ 22 రోజులు, 9 వేల కోట్లు..
-
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్... గెలిచాక సూపర్ షాక్స్
-
ఒక్కరోజులోనే రూ.5,000 కోట్ల అప్పు..
-
బాబు అప్పులు.. ఎల్లో మీడియా తప్పులు
-
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే కార్పొరేషన్కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లుఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్బీఐ వద్ద షెడ్యూల్ అయి ఉంది. జూన్లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్బీఐకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎన్నికల వేళ అప్పుల మోతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే 7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్కుమార్రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్పై 2017లో చెన్నై సెండియం పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్స్టేషన్లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
అప్పులు తీర్చే మార్గం లేక...
జనగామ: వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుల కుమారుడు తెలిపిన వివరాల మేర కు.. తమిళనాడుకు చెందిన రాజ్ సెల్వరాజ్ (55), భార్య భాగ్యలక్ష్మి (45)కి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. మూడు దశా బ్దాల క్రితం వ్యాపారం కోసం వచ్చి వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడి వివాహం చేశారు. అనంతరం వ్యా పారంలో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ మొత్తం రూ.50 లక్షల అప్పు చేశా రు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇద్దరు కుమా రులు వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటు న్నారు. రోజురోజుకూ సెల్వరాజ్ వ్యాపారం తగ్గిపోవడంతో అప్పులు తీర్చే మార్గాలు మూ సుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన వాచ్ మన్ చిన్న కుమారుడు చిన్నస్వామికి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే దంపతులు పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. -
ఏపీ అప్పులపై అసలు నిజం...CAG రిపోర్ట్
-
Fact Check: అడ్డగోలు అప్పులు దాచేసి ముష్టి లెక్కలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి స్వయంగా కేంద్రం ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా వివరణలూ ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందనీ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు తేల్చి చెప్పింది. రాష్ట్ర అప్పులపై ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా వివరంగా చెప్పారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల – వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల గురించి ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా తెలియచేశారు. ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం, ఆర్బీఐ చెబుతున్నా తలకెక్కదా? చట్టసభల్లో ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాలను కాదని తనకు తోచిన లెక్కలతో రామోజీ తప్పుడు రాతలు ఎలా రాస్తారు? రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో డప్పు కొట్టే గురివిందను ఏమనుకోవాలి? అసలు ఏ ప్రభుత్వాలకైనా తీసుకునే అప్పులను రహస్యంగా ఉంచడం సాధ్యం కాదనే ఇంగితం లేదా? పరిమితికి లోబడి తీసుకునే అప్పులను గ్రాఫిక్స్ ఆర్భాటాల కోసం కాకుండా వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చదువులను చక్కదిద్దేందుకు వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.73 వేల కోట్లకు పైచిలుకే! మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం పెత్తందారుల దృష్టిలో వృథానేనా? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అనవసరమా? సుదూర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగేందుకు ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయడం వృథానా? రాజధాని గుదిబండ రూ.5 వేల కోట్లు! అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు భవిష్యత్లో తప్పనిసరి ఆర్థిక బాధ్యతలుగా పరిణమించాయని కాగ్ స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల పేరుతో గత సర్కారు ఏకంగా 10 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీతో అప్పు చేసినట్లు పేర్కొంది. మార్కెట్ రుణాల ద్వారా రూ.5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా రూ.4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్లో మరో రూ.3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధాని నిజం కాలేదు గానీ తప్పనిసరి ఆర్ధిక బాధ్యతలు మాత్రం మోయాల్సి వస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ సర్కారు పేలవమైన ఆర్థిక నిబద్ధత చూపిందని తప్పుబట్టింది. ♦ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 2022–23కి సంబంధించి కాగ్ అకౌంట్స్ సమర్పించింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, జీఎస్డీపీలో అప్పులు ఉన్నాయని అందులో స్పష్టం చేసింది. సొంత లెక్కలు కాకుండా కాగ్ అకౌంట్స్ను పరిశీలిస్తే రామోజీకి ఆ విషయాలు తెలుస్తాయి. ♦ అప్పుల కోసం సచివాలయం, ఇంకా కనిపించినవన్నీ తాకట్టు పెడుతున్నారంటూ రామోజీ పచ్చి అవాస్తవాలను కుమ్మరించారు. వాస్తవానికి రాజధాని అంటూ అమరావతి భూములను తాకట్టు పెట్టి బాండ్లు పేరుతో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసింది చంద్రబాబు సర్కారే. కాగ్ నివేదికే ఆ విషయాన్ని ఎండగట్టింది. గ్రాఫిక్స్ బండారాన్ని బయట పెట్టింది. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు అప్పుల నిర్వాకంతో ఇప్పుడు వడ్డీల చెల్లింపులు భారంగా మారాయి. అత్యధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పు తెచ్చిన పరిమాణానికి దాదాపు సమానంగా వడ్డీ కూడా ఉండటాన్ని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ♦ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చించి ఉత్తమ మానవ వనరుల ద్వారా ఆస్తుల కల్పన చేయటాన్ని చూసి రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను రూ.16 వేల కోట్లతో నిర్మిస్తుంటే మంచం పట్టారు! రూ.24,000 కోట్లతో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమూ ఆయనకు మింగుడు పడటం లేదు! ఎందుకంటే తాను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే అనుకోవాలేమో! ♦ గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి, గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తే రామోజీ కిక్కురుమనలేదెందుకో? ♦ రాష్ట్ర అప్పులు బడ్జెట్ లోపల, బయట కలిపి ఏకంగా రూ.10.21 లక్షల కోట్లకు చేరాయంటూ పచ్చి అబద్ధాలను రామోజీ తన కరపత్రంలో గుమ్మరించారు. 2022–23 నాటికి కాగ్ అసెంబ్లీకి సమర్పించిన అకౌంట్స్ ప్రకారం బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట రాష్ట్రం అప్పులు రూ.5.68 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బడ్జెట్ లోపల అప్పులు రూ.4,29,526 కోట్లు కాగా బడ్జెట్ బయట అప్పులు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులను శాసనసభకు సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ పత్రం ద్వారా అందచేస్తూ ఎక్కడా దాపరికం లేకుండా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎఫ్ఆర్బీఎ నిబంధనల కన్నా తక్కువగానే అప్పులున్నట్లు 2022–23 కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. -
అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన 'కాగ్' నివేదిక
-
ఏపీ అప్పులపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఛాలెంజ్
-
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ బడ్జెట్ పై తుది కసరత్తులు
-
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
TS: భట్టి పదేపదే అదే చెప్తున్నారు.. జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇరవై రోజులుగా చెప్పిందే చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ ఆగిపోతుంది అని ఇప్పటికే జనంలో చర్చ మొదలైందన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పటం సరికాదన్నారు. ‘కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేతకాకపోతే చేతకాదు అని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారత దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్లు పాలించిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ అప్పులున్నాయి. పదే పదే భట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకాక అప్పులు గురించి మాట్లాడుతున్నారు. 2014కు ముందు 20 వేల కోట్లు అప్పు చేసి 3నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60 వేల కోట్లు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం’ అని జగదీష్రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్రెడ్డి -
అడ్డగోలుగా అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెబుతారా?
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన ఆస్తులు బావా, బావమరుదల స్వేదంతో సృష్టించినవా? ఆ సర్కారు హయాంలో చేసిన అప్పు లు చెల్లించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజల స్వేదం చిందించాల్సిందే కదా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘ఏదో సాధించినట్టు స్వేదపత్రం విడుదల చేశారు. బావా బావమరుదులు కష్టపడి చెమటలు చిందించి సంపాదించినట్టు చెబుతున్నారు. అవి తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆస్తులు. అదే చెమటను చిందించి అప్పులను కట్టాల్సిందే. ఇందులో బీఆర్ఎస్ గొప్పతనమేముంది.?’అని నిలదీశారు. మంగళవారం ఢిల్లీ వెళ్లేందుకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ స్వేదపత్రంపై ఘాటై న విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7లక్షల కోట్లు అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమో కాదో చెప్పాలన్నారు దోపిడీ సొమ్మును కక్కిస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతి సొమ్మును కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ చెప్పినట్టుగానే గత ప్రభుత్వ అక్రమాలపై న్యాయ విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని భట్టి చెప్పారు. ఈ విచారణ తర్వాత లెక్కలు కట్టి దోపిడీ సొమ్మును కక్కిస్తామని వ్యాఖ్యానించారు. ధనవంతులు మరింత సంపన్నులయ్యారు బీఆర్ఎస్ పాలనలో పేదలు మరింత పేద లుగా మారితే ధనవంతులు మరింత సంపన్నులయ్యారని, దీనికి తామేదో తలసరి ఆదాయం పెంచామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని భట్టి విమర్శించారు. ‘హైదరాబాద్లో ఓ సంపన్నుడు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. గ్రామాల్లో పేదలు 40 చదరపు గజాల్లో ఉంటున్నారు. వారిద్దరి తలసరి ఆదాయం సగటును లెక్కించి గొప్పలు చెప్పుకోవడం సమంజసమేనా.?’అని నిలదీశారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్తగా పరిశ్రమలు తెచ్చారా? కోల్ ఇండస్ట్రీ నెలకొల్పారా? ప్రభుత్వరంగ సంస్థలేమైనా తెచ్చారా? వీళ్లు సృష్టించిన ఆస్తులేంటి? కళ్లకు కనపడవా?’అని ఎద్దేవా చేశారు. -
కొత్త ప్రభుత్వం అప్పులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అప్పుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నిధులు సమీకరించుకుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మేర రుణ సమీక రణ చేసింది. ఆర్బీఐ ఆ«ధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ నెల 12న రూ.500 కోట్లు, ఈ నెల 19న రూ. 900 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. ఇందులో రూ. 500 కోట్ల అప్పును 7.70 శాతం వడ్డీకి 15 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించేలా, రూ. 900 కోట్లను 7.58 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా సమకూర్చుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే రుణ షెడ్యూల్.. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకొనే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి షెడ్యూల్ సమర్పిస్తాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి చెందిన షెడ్యూల్ను ఆర్బీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ మేరకు డిసెంబర్లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ. 1,400 కోట్లు సమకూర్చుకుందని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. -
Fact Check: అప్పులపాలైనా అభాండాలేనా!?
సాక్షి, అమరావతి/అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం క్రైం: భావప్రాప్తి కోసం ఈనాడు రామోజీరావు తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్నారు. ఎంత నీచానికి దిగజారకూడదో అంతకన్నా హీనంగా అథఃపాతాళంలోకి ఆయన రోజురోజుకీ కూరుకుపోతున్నారు. కారణం.. తన ఆత్మ చంద్రబాబుపై అంతులేని ప్రేమ.. సీఎం జగన్పై ఎక్కడాలేని అసూయ, విద్వేషం. దీంతో ఆయన సిగ్గూఎగ్గూ వదిలేసి తన విషపుత్రిక ఈనాడులో నిత్యం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగమే టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నం కథనం కూడా. వ్యక్తిగత కారణాలతో పాటు విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి అవి చెల్లించలేని దుస్థితిలో ఆత్మహత్యాయత్నానికి అతను పాల్పడితే రామోజీ ఆ ఉదంతాన్ని కూడా బాబు కోసం, తన పైశాచికానందం కోసం వాడేసుకున్నారు. ఈ ఘటనపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వ్యక్తిగత కారణాలతో టీచర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే ఆ ఘటనను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, సీపీఎస్కు ముడిపెట్టి రామోజీ వికృతానందం పొందారు. నిజానికి.. 2003లో సీపీఎస్ను కేంద్రం రద్దు చేసినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబే. అంతేకాదు.. నాటి కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. అందులో ఆయన మంత్రులు సైతం ఉన్నారు. అప్పట్లో ఈ రద్దు నిర్ణయాన్ని వీరెవరూ వ్యతిరేకించలేదు. పైగా.. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా సీపీఎస్కు సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట నిర్ణయం తీసుకోకుండా అలా గాలికి వదిలేశారు. ఈ వివరాలన్నింటినీ రామోజీ ఉద్దేశపూర్వకంగా తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీకి తోడు సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ చాలా తక్కువ వస్తోందని సీఎం వైఎస్ జగన్ గుర్తించి వారికి మెరుగైన పెన్షన్ కోసం.. అలాగే, దానికొక శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచించి ఆయన గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్)కు రూపకల్పన చేశారు. దీని ప్రకారం.. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణకు ముందునెల పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్ను తీసుకొచ్చి సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేశారు. దీనిని ఉద్యోగ సంఘాలు సైతం స్వాగతించాయి. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయంలేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు. చివరికి కేంద్రం కూడా ఇప్పుడు దీనిని అధ్యయనం చేస్తుండడమే కాక అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్నే అనుసరించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నానికి సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేయకపోవడమే కారణమంటూ రామోజీ గుడ్డిగా ఒక నిర్ణయానికొచ్చేసి బాబుకు మేలు జరిగేలా తనకు తోచింది రాసిపారేశారు. ఇందుకు టీడీపీ నేతలు సైతం తోకలూపుతూ నీచ రాజకీయాలకు దిగారు. జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పని.. ఇక 1996 నుంచి 2004 వరకు అప్పటి కేంద్రంలోని ఎన్డీఏలో తానే చక్రం తిప్పానని పదేపదే గొప్పలు చెప్పుకున్న బాబు.. ఆనాడు సీపీఎస్ను ఎందుకు వ్యతిరేకించలేదు? పైగా.. రాష్ట్రంలో అమలుచేసేందుకు 2003లో ఆమోదం కూడా తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఎస్ను రద్దుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సమయంలో సీపీఎస్ రద్దు సాధ్యంకాదని తెగేసి చెప్పారు. కానీ, 2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దు హామీ ఇవ్వడంతో ఇక గతిలేక ఎన్నికల ముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యప్రకాశ్ ఠక్కర్తో చంద్రబాబు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. నిజంగా చంద్రబాబుకు సీపీఎస్ ఉద్యోగులపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే తన ఐదేళ్ల పాలనలో మెరుగైన పెన్షన్ కోసం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? బాబు చేసిన ఈ మోసాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసిన జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పనిగా ఈనాడు రామోజీ పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు నిజమే.. కానీ, ప్రభుత్వంపై అసంతృప్తిలేదు నా భర్త ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో తెలీదు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ, ఈ ఘటనను కొందరు పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డిప్రెషన్లో ఏమి రాశాడో, ఎవరికి పోస్ట్ చేశాడో మాకు తెలీడంలేదు. దయచేసి దీనిపై రాజకీయం చేయొద్దు. నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం మెసేజ్ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. నిజానికి.. మాకెవరికీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. జగన్ పాలనలోనే నాకు సచివాలయం ఏఎన్ఎంగా ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. నా భర్తను కాపాడుకునేందుకు అందరూ సహకరించాలి. – శివలక్ష్మి, టీచర్ మల్లేష్ భార్య రూ.25.60 లక్షల అప్పుల్లో మల్లేష్.. వాస్తవాలిలా ఉంటే.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఇటీవల బెట్టింగ్లో రూ.ఆరు లక్షలు కోల్పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం జగన్ సీపీఎస్ రద్దుచేయనందువల్లే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఈనాడు రామోజీ మసిపూసి మారేడుకాయ చేశారు. అంతేకాదు.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీచర్ మల్లేష్ రూ.25.60 లక్షల అప్పుల్లో కూడా కూరుకుపోయిన నిజాన్ని ఈనాడు మరుగునపరిచి కేవలం సీపీఎస్ రద్దు చేయనందువల్లే అంటూ ఇష్టారాజ్యంగా రాసిపారేసింది. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనలకు సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టి రామోజీ, టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారు. మరోవైపు.. 35 ఏళ్ల టీచర్ మల్లేష్కు ఇంకా చాలా సర్వీసు ఉంది. అంత సర్వీసు ఉండగా సీపీఎస్ రద్దుచేయలేదని ఇప్పుడే ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడతారనే కనీస స్పృహ, ఇంగిత జ్ఞానం రామోజీకి కరువైంది. అప్పులున్నాయి.. అవి చెల్లించకపోవడంవల్లే.. మల్లేష్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రుణాలు తీసుకున్నాడు. అవి సక్రమంగా చెల్లించకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడేవాడు. అనవసరంగా ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలకు నా బావకూ ఎలాంటి సంబంధంలేదు. – ఆదినారాయణ, శివలక్ష్మి సోదరుడు వ్యక్తిగత ఇబ్బందులవల్లే ఆత్మహత్యాయత్నం వ్యక్తిగత ఇబ్బందుల నేపథ్యంలోనే టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మల్లేష్ తన కుటుంబంతో పాటు సోదరి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆయన సుమారు రూ.26 లక్షలకు పైగా అప్పులుచేశాడు. వాటిని తీర్చేమార్గం కనిపించక ఇబ్బందులు పడేవాడు. దీనికితోడు బ్యాంకులు, చిట్ఫండ్ కంపెనీల్లో రుణాలు తీసుకోవడంతో అన్నింటికీ నెలవారీ చెల్లింపులు కష్టంగా మారింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. మల్లేష్ పూర్తిగా స్పృహలోకి రాగానే మరిన్ని విషయాలు తెలుస్తాయి. – మీడియాతో ఉరవకొండ సీఐ ఎం. తిమ్మయ్య జీతాలు సకాలంలోనే అందుతున్నాయి వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరం. మల్లేష్ ఘటనపై కొన్ని సంఘాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కావాలనే ప్రభుత్వానికి ఆపాదించి దుష్ప్రచారం చేస్తున్నాయి. మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు అసంబద్ధంగా ఉన్నాయి. మల్లేష్కు అనారోగ్య కారణాలు ఉన్నాయని, వీటికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయని ఆయన భార్య బహిరంగంగానే చెప్పారు. నిజానికి.. 2020–21 కరోనా సమయంలోనూ ప్రతినెలా 4న ఉపాధ్యాయుల వేతనాలు అందాయి. ఇప్పుడూ ప్రతినెలా 6వ తేదీ లోపలే అందుతున్నాయి. కావాలంటే పే స్లిప్పులు పరిశీలించాలి. పీఎఫ్, జీపీఎఫ్ లోన్లు ఈ ఏడాది ఏప్రిల్ వరకు క్లియర్ చేశారు. ప్రభుత్వోద్యోగులపై సీఎం వైఎస్ జగన్కు ఎలాంటి వ్యతిరేకతా లేకున్నా ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయాలని ప్రయత్నిస్తున్నారు. మల్లేష్ రాసినట్లు చెబుతున్న లేఖ కూడా ఆయన రాసింది కాదని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. – అశోక్కుమార్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శాఖల వారీగా శ్వేత పత్రం
-
అప్పులపై ఎల్లో బ్యాచ్ది తప్పుడు ప్రచారమే
సాక్షి, అమరావతి: అప్పులతో రాష్ట్రం మరో శ్రీలంకలాగ అయిపోతోందని కొండంత రాగాలు తీస్తున్న ఎల్లో బ్యాచ్కు షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎల్లో మీడియా నిత్యం చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. 2022–23 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి దేశంలోని ఏ రాష్ట్రానికి ఎన్ని అప్పులున్నాయి, ఎంత మేర అప్పులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ గ్యారెంటీ అప్పుల ఎన్ని? అనే వివరాలతో కూడిన నివేదికను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వాస్తవాలను చెప్పినప్పటికీ కూడా టీడీపీ, ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ పదే పదే దుష్ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ఆర్బీఐనే రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించడంతో వాస్తవాలు ప్రజలు తెలుసుకుని, ఎల్లో బ్యాచ్ది తప్పుడు ప్రచారం అని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపైనా తప్పుడు రాతలే.. ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులపై కూడా విపక్ష నేతలు దుష్ప్రచారం చేయడమే కాకుండా, ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. అప్పులను దాచేస్తున్నారంటూ వింత పోకడలు పోతున్నారు. ప్రభుత్వాల అప్పులు దాచడానికి అవకాశం ఉండదనే కనీస జ్ఞానం లేకుండా ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని నిపుణులు మండిపడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1,17,503 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు చేసిన అప్పులు రూ.1,35,282 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. చెప్పేవన్నీ అబద్ధాలే.. రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు అని ఓసారి, 11 లక్షల కోట్లు అని మరోసారి రోజుకో మాట మారుస్తూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైంది. 2022–23 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఇకనైనా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ‘అప్పు’డే ఎక్కువ రాష్ట్రాల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత వరుస స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అప్పులు ఎక్కువ చేస్తోదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి ఎక్కువ ఉందని స్పష్టమైంది. 2018–19లో చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి 15.3 శాతంగా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అది క్రమంగా తగ్గుతూ వస్తోందని, అప్పుల వృద్ధి 2020–21లో 14.7 శాతం, 2021–22లో 11.5 శాతం, 2022–23లో 12.4 శాతం ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2018–19లో చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వృద్ధి కన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పులు వృద్ధి తక్కువగా ఉందంటే అప్పులు తక్కువగా చేస్తున్నట్లేనని స్పష్టం అవుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
5 నెలల్లో ఏడాది అప్ప అంటూ గగ్గోలు
-
Fact Check: అప్పులపై తప్పుడు కథనం
సాక్షి, అమరావతి: ‘తప్పులెన్ను వాడు తన తప్పులెరుగడు’ అన్నది గతం. ఈనాడు రామోజీరావు విషయంలో ‘ఒప్పులన్నింటినీ తప్పులనే వాడు తన తప్పులెరుగడు’ అంటూ అన్వయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహరహం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తూనే అభివృద్ధికీ బాటలు వేస్తున్నారు. అందులో భాగంగా కొంతమేర అప్పులూ తెస్తున్నారు. ఈ అప్పులపై ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ.. రామోజీ గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను, వాటిని అవి ఏ విధంగా పక్కదారి పట్టించాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు ఐదు నెలల్లోనే అంటూ ఓ దిగజారుడు కథనాన్ని ఈనాడులో అచ్చేశారు. ఇదే రామోజీకి గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే చివరి ఏడాది చేసిన భారీ అప్పులు, వాటిని పక్కదారి పట్టించిన వైనం కనిపించలేదు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పు కూడా చంద్రబాబే చేశారని కాగ్ గణాంకాలు స్పష్టంగా చెప్పినా రామోజీ చూడనట్లే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉండాలనే కాంక్ష బలీయంగా ఉన్న రామోజీకి ఆ సీట్లో వైఎస్ జగన్ ఉండటం ససేమిరా ఓర్చుకోలేరు. అందుకే అవే కాగ్ గణాంకాల్లో కేపిటల్ వ్యయం, సామాజిక రంగ వ్యయం ఉన్నా సరే వాటిని మరుగున పరిచేసి కేవలం అప్పులపైనే కథనం అల్లారు. అదేదో మహా తప్పిదమైనట్లు రోత రాతలు రాశారు. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలకు లోబడి, కేంద్ర అనుమతుల మేరకే అప్పులు చేసినప్పటికీ ఈ రుణాలపై రామోజీ పదే పదే విష ప్రచారానికి దిగుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ24,205 కోట్లు అప్పు చేస్తామని చెప్పి ఏకంగా రూ.34,751 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్లో చెప్పిన దానికన్నా రూ.9,546 కోట్లు ఎక్కువగా (139 శాతం అదనంగా) అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలే తెలిపాయి. ఇది తప్పు అని రామోజీకి అనిపించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో చెప్పిన అప్పుల్లో ఆగస్టు నెలాఖరు వరకు 72.28 శాతమే అప్పు చేసింది. అదీ నిబంధనల మేరకే. అంతే కాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే సామాజిక రంగంపై ఏకంగా రూ.68,012 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ స్పష్టంగా లెక్కగట్టి చెప్పింది. గత చంద్రబాబు ప్రభుత్వం సహా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక రంగంపై ఇంతగా ఎప్పుడూ ఖర్చు చేయలేదని కాగ్ తేటతెల్లం చేసింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, తాగునీటి రంగాలపై చేసే ఖర్చు. ప్రజలకు అత్యంత అవసరమైన రంగాలివి. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న దృఢ సంకల్పానికి నిదర్శనమిది. మరో పక్క బడ్జెట్లో కేపిటల్ వ్యయానికి చేసిన కేటాయింపుల్లో కేవలం ఐదు నెలల్లోనే.. అంటే ఆగస్టు వరకు 40.79 శాతం ఖర్చు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కాగ్ వెల్లడించింది. ప్రజా సంక్షేమాన్ని, కేపిటల్ వ్యయాన్ని వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చే స్థాయికి ఈనాడు రామోజీ దిగజారారు. బాబు తెచ్చిన అప్పులు బండెడు చంద్రబాబు దిగిపోయే ఆర్థిక సంవత్సరంలో తరువాతి ప్రభుత్వానికి కూడా అప్పు పుట్టనంతగా ముందుగానే రుణాలు తెచ్చేసినా రామోజీ ఒక ముక్క కూడా రాయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులను తరువాతి సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అప్పుల నుంచి తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించినా రామోజీకి తప్పనిపించలేదు. కేవలం వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారని, ఆయన ప్రజా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న దుగ్ధే రామోజీలో కనిపిస్తోంది. -
పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం -
అప్పులు తీర్చేస్తున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు అనుకూలంగా తీసుకుంటున్న పలు రకాల చర్యల ఫలితంగా వ్యవసాయ రుణాల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని 223వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అజెండా పేర్కొంది. ఇది శుభ పరిణామంగా కమిటీ తెలిపింది. నిజానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా నిలుస్తుండడంతో రైతులు సంతోషంగా ఉంటున్నారు. దీంతో తాము తీసుకున్న అప్పులను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించేస్తున్నారు. ఫలితంగా మొండిబకాయిల శాతం ఏటేటా తగ్గుతోంది. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాల్లో భాగంగా రైతులకు వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నావడ్డీ వంటి అనేక పథకాలు ఏటా అమలుచేస్తుండడం.. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దీంతో నిర్ణీత గడువులోగా బాకీలు తీర్చడంలో రైతులు గతంలో ఎప్పుడూలేని విధంగా ముందుంటున్నారు. టీడీపీ తీరుతో అప్పుల ఊబిలోకి.. గత తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఆరకొర మాఫీతో రైతులను మోసగించడంతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. దీంతో వ్యవసాయ రుణాల మొండిబకాయిలు పెరిగిపోయాయి. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు వైఎస్సార్ రైతుభరోసా క్రమం తప్పకుండా ఇవ్వడంతోపాటు రైతులకు అండగా నిలబడే పలు కార్యక్రమాలు చేపట్టింది. ఫలితంగా.. వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు 2019–20లో 3.57 శాతం నుంచి 2022–23 నాటికి 2.60 శాతానికి తగ్గిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ రాయితీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుద్ధరించి అమలుచేయడమే. అంతేకాక.. గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని కూడా చెల్లించింది. దీంతో రైతులు పంట రుణాలతో పాటు వ్యవసాయ టర్మ్ రుణాలను కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. దీనికితోడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి వ్యయం కోసం వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏడాదికి రూ.13,500లను ఇస్తోంది. అలాగే, పంట నష్టపోయిన రైతులకు ఒకపక్క ఉచిత పంటల బీమాను వర్తింపజేస్తూనే మరోపక్క ఇన్పుట్ సబ్సిడీనీ ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. దీంతో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. పెరిగిన వ్యవసాయ రుణాలు.. మరోపక్క.. రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో గత నాలుగేళ్లుగా వారికి వ్యవసాయ రుణాల మంజూరు కూడా పెరిగింది. సకాలంలో అప్పులు చెల్లించిన రైతులకు ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73,87,602 మంది రైతులకు సున్నావడ్డీ రాయితీని చెల్లించిందని, గత టీడీపీ ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అజెండాస్పష్టంచేసింది. ఇక ఇప్పటివరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ కింద రూ.1,834 కోట్లను చెల్లించింది. ఈ నేపథ్యంలో.. వ్యవసాయ రంగంలో రైతులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు కూడా వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటేటా పెంచుతున్నాయి. ఉదా.. 2019 మార్చి నాటికి మొత్తం వ్యవసాయ రుణాలు రూ.1,40,034 కోట్లు ఉంటే.. 2022–23 నాటికి అవి రూ.2,34,124 కోట్లకు పెరిగాయి. ఇలా వ్యవసాయానికి అవసరమైన రుణాల మంజూరును బ్యాంకులు పెంచుతుండగా మరోపక్క ఆ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయంటే ప్రభుత్వ జోక్యమే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్ఫెడ్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్ఫెడ్లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్లో పెట్టడం రిస్క్తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్ఫెడ్లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్వర్క్ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్వర్క్లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
అప్పులపై కేంద్రం క్లారిటీ సరిపోలేదా? ఎందుకీ బురద మాటలు: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు బురద చల్లుతున్నారంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ అప్పులు చేసింది. గతంలో వీరెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు?’’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘‘ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకూడదనేదే వీరి కుట్ర. ఏపీకి మంచి జరగకూడదన్నదే వీరి ఆలోచన. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఉండటం లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆర్థికశాఖ చెప్పిన సమాధానాన్ని కూడా వీరు నమ్మరు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపడ్డాయి. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరందరూ బాధపడిపోతున్నారు’’ అని మంత్రి ధ్వజమెత్తారు. చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..! ‘‘వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదు సార్లు రాస్తే 5 వేల కోట్లు అవుతుందా?. ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు ప్రచురించరు?. రాష్ట్ర అప్పులపై కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులపై ఎప్పుడైనా మాట్లాడారా?. నేను సింహాన్ని అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు?’’ అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. -
బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
ఆంధ్రప్రదేశ్ లో అప్పులకు సంబంధించి పార్లమెంటులో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుగుదేశం హయాంలోనే అధిక అప్పులు చేశారని తేలింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో 1.77 లక్షల కోట్ల అప్పు చేస్తే, టిడిపి హయాంలో 2.64 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో ఇంతకాలం ఎప్పుడు వీలైతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై రుణాలు అంటూ విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియాలకు తలతిరిగింది. దాంతో ఎల్లో మీడియా ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడం కోసం మద్యం పై అప్పులు చేశారని అంటూ మరుసటి రోజే బానర్ కధనాలు రాసి ఆత్మ వంచన చేసుకున్నారు. క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆయుధంగా మారింది. తమ హయాంలో కన్నా టిడిపి ప్రభుత్వమే ఇష్టారీతిన అప్పులు చేసిందని వైఎస్ఆర్సీపీ విమర్శించడానికి ఆస్కారం ఏర్పడింది. టిడిపి హయాంలో అప్పులు 2.64 లక్షల కోట్లు అయితే, ఆ రుణాలు ఈ ప్రభుత్వ టైమ్ లో 4.42 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే దాని అర్ధం టిడిపి ప్రభుత్వమే అధికంగా అప్పులు చేసిందని గణాంకాలతో వెల్లడైంది. ఇంతకాలం ఎపికి పది లక్షల కోట్ల అప్పు అంటూ దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి వాటికే కాకుండా కొద్ది రోజుల క్రితం అప్పులపై విమర్శలు చేసిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా కేంద్రం సమాధానం ఇచ్చినట్లయింది. (చదవండి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి రోజా సెటైర్లు) ఆర్థిక మంత్రి చెప్పాక కూడా మరో తప్పుడు స్టోరీ నిర్మలా సీతారామన్ సమాధానంతో వైఎస్ఆర్సీపీ పని సులువు అయింది. ప్రతిపక్షం, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద వేస్తోందని గట్టిగా చెప్పగలుగుతోంది. అంతేకాదు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా తీసుకున్న అప్పుల గురించి కూడా నిర్మలా సీతారామన్ వివరించారు. వాటిని చూసినా అవేమీ భారీగా లేవని అర్ధం అవుతుంది. ఇవన్ని కలిపితే మరో నలభై వేల కోట్ల వరకు ఆమె వివరాలు ఇచ్చారు. దీంతో తాము ఇంతకాలం రాసిందంతా అసత్యమని ప్రజలకు తెలిసిపోయిందని కంగారు పడ్డ ఎల్లో మీడియా వెంటనే మరో స్టోరీని వండేసింది. ఈనాడు పత్రిక అయితే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఏభైవేల కోట్ల రుణం అని అడ్డగోలు వార్త రాసింది. ఇందులో ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేదేమి ఉంటుంది. మద్యం అమ్మకాలు లేకపోతే అది వేరే విషయం. గత టిడిపి ప్రభుత్వం ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అంతా అద్భుతంగా ఉందని ఈనాడు భావన. అదే జగన్ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించి , పన్నులు పెంచి, మద్య సేవన అలవాటు తగ్గించడానికి యత్నిస్తుంటే అది ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమని ఈనాడు ప్రచారం చేస్తోంది. పాదయాత్రలో వైఎస్ జగన్ ఏదో చెప్పారని రాస్తూ, మద్యపానంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నా అప్పులు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈనాడు వ్యాఖ్యానించింది. మరి మద్యం అమ్మడమెందుకు? మద్యపానం వల్ల అన్ని నష్టాలు ఉన్నాయని గుర్తించబట్టే జగన్ బెల్టు షాపులు లేకుండా చేశారు. ప్రభుత్వమే మద్యం రిటైల్ షాపులు నిర్వహించి, తక్కువ వ్యవధిలో అందుబాటులో ఉండేలా చేశారు. మద్య నిషేధంపై ఉద్యమం చేసిన ఇదే ఈనాడు పత్రిక చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు ఏమి రాసింది. అసలు వీరికి చిత్తశుద్ది ఉందా? ఉంటే వారు నడిపే హోటళ్లలో, ఫిల్మ్ సిటీలలో మద్యం ఎందుకు విక్రయిస్తున్నారు? చెప్పేటందుకే నీతులు అన్నట్లు రామోజీరావు వ్యవహరిస్తున్నారని పదే, పదే బట్టబయలు అవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి కోరిక ఏమిటంటే ఏ రూపంలోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్దిక వనరులు సమకూరకూడదన్నదే. రాష్ట్రం నాశనం అవ్వాలన్నది వారి దురుద్దేశం. మద్యాన్ని ఎత్తివేస్తే, అప్పుడు అక్రమ రవాణా అంటూ వార్తలు రాయవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతే ఆయా సంక్షేమ పథకాలకు నిధుల సమస్య రావాలన్నది వారి దురుద్దేశం. (చదవండి: టీడీపీ నేత జయసుబ్బారెడ్డిపై కేసు నమోదు) కనీసం జగన్ ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాలలోకి వివిధ సంక్షేమ స్కీముల డబ్బులను జమచేస్తోంది. దాని వల్ల అవినీతి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం అయినా శక్తికి మించి అప్పులు చేయవద్దని వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కాని జగన్ ప్రభుత్వంపై బురద వేసే లక్ష్యంతో వార్తలు ఇవ్వడం వల్లే సమస్యలు వస్తున్నాయి. అప్పుడు గొప్ప.. ఇప్పుడు ఘోరం చంద్రబాబు టైమ్ లో చేసిన లక్షల కోట్ల అప్పులతో ఏమి చేశారో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారైనా రాశాయా? పైగా అమరావతిలో బాండ్లు విడుదల చేస్తే ఏడువేల కోట్ల రూపాయల రుణం వచ్చిందని, అదంతా చంద్రబాబు ముఖం చూసే బాండ్లు కొన్నారని ఇవే మీడియా ప్రచారం చేసింది. అంటే అప్పుడు అప్పులు చేస్తే గొప్ప, ఇప్పుడు అప్పులు చేస్తే ఘోరం అని చెబుతున్నాయి. ఇంత దుర్మార్గంగా మీడియా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మరి మోదీ ప్రభుత్వం కోటిన్నర లక్షల కోట్ల వరకు దేశం అప్పును తీసుకువెళ్లింది. మరి వాటి గురించి రాయడానికి వీరు ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అప్పుల గురించి నోరెత్తితే ఒట్టు. అది రామోజీ మార్కు జర్నలిజంగా మారింది. చంద్రబాబు టైమ్ లో ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా కార్పొరేషన్ ల ద్వారా అప్పులు చేసినా వీరంతా ఆహా.. ఓహో అన్నారే కాని, ఎందుకు ఇలా చేస్తున్నావని అక్షరం ముక్క రాయలేదు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేశాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి రాజకీయ రాబందుల్లా మారి ఎపి ప్రజలను పీక్కు తినాలని చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్