debts
-
అప్పులపై బాబు పిచ్చి కూతలు గుట్టు రట్టు చేసిన పయ్యావుల కేశవ్
-
ఏపీని అప్పుల్లో ముంచుతున్న బాబు
-
2 లక్షల కోట్లు.. కమింగ్ సూన్
-
రూ.11 వేల కోట్ల అప్పు కోసం హడ్కోతో CRDA ఒప్పందం
-
Astrological remedies రుణ బాధలా? పరిహారాలివిగో!
తాహతుకుమించి అప్పులు చేస్తే ఎవరికైనా అనర్థమే. కుటుంబ ఆర్థిక పరిస్థితిని, అవసరాలను అర్థం చేసుకొని అప్పులు తీసుకోవడం ఉత్తమం. గత్యంతరం లేక అప్పు చేసిన వెంటనే దాన్ని తిరిగి చెల్లించడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే కష్టాలు తప్పవు. అవమానాలు, తప్పవు. అందుకూ ఆచితూచి వ్యవహరించాలి.రుణ భారం నుంచి బయటపడాలంటే కొన్ని( Astrological remedies ) టిప్స్అప్పులు లేనివారు అధికసంపన్నులు అంటారు. అయితే అప్పులు కొందరికి తప్పదు. అలా తరచు అప్పుల పాలవుతూ ఉంటే... ప్రతినెలా పున్నమి, అమావాస్య రోజుల్లో శ్మశాన వాటికలకు చేరువలో ఉండే శివాలయాన్ని దర్శించుకుని అక్కడి శివలింగానికి పంచామృతాభిషేకం చేయించాలి. దశముఖ రుద్రాక్షను ధరించాలి.అష్టగంధాల మిశ్రమంతో 108 రావి ఆకులపై ‘శ్రీరామ’ అని రాసి, వాటిని మాలగా తయారు చేసి ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ ఆలయంలో స్వామికి అలంకరణగా సమర్పించాలి. రాహు కేతువుల శాంతికి హోమం చేయించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత హోమకుండం నుంచి సేకరించిన విభూదిని తెల్లని వస్త్రంలో మూటగా కట్టి, ఆ మూటను ఇంట్లో లేదా వ్యా΄ార ప్రదేశంలో డబ్బు భద్రపరచే చోట ఉంచాలి.వ్యాపారంలో తరచు సమస్యల కారణంగా రుణబాధ ఎదురవుతున్నట్లయితే, వ్యాపారం కోసం కొనే వస్తువులతో పాటు పిల్లల ఆట వస్తువులను కొన్ని కొని వాటిని చిన్నారులకు కానుకగా ఇవ్వండి.ఆకలితో ఉన్న వృద్ధులు, అంధులు, వికలాంగులు తారసపడినట్లయితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి. – సాంఖ్యాయన నోట్: ఇవి కేవలం ఆస్ట్రాలజీపరంగా, అవగాహన కోసం అందించిన టిప్స్ మాత్రమే నని గమనించగలరు. -
మంగళవారం అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు
-
‘అప్పు’డే.. మరో రూ.9,000 కోట్లు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా మరో రూ.9,000 కోట్ల అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిoది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో రూ.9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పు చేసేందుకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు.. సలహాదారు అండ్ మర్చంట్ బ్యాంకర్ను కూడా ఏపీఎండీసీ నియమించింది. అప్పు చేసిన నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు చేసే ఈ రూ.9,000 కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీఎండీసీ ద్వారా చేసిన అప్పులు రూ.14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం రూ.23,700 కోట్ల అప్పు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే. -
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
చంద్రబాబే అసలైన ఆర్థిక విధ్వంసకారుడు.. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు
-
కుట్రలు.. కుతంత్రాలు, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్
-
అబద్ధాల సృష్టికర్తకు.. తుప్పు వదిలింది
-
అప్పులపై కట్టుకథలు.. అసెంబ్లీలో బట్టబయలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలే చెప్పామని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ఒకసారి రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.10 లక్షల కోట్లంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ అసెంబ్లీలో, బయట నిస్సిగ్గుగా అవాస్తవాలు చెబుతున్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వర రాజు రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వకంగా సమాధానం చెబుతూ 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి మొత్తం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర అప్పులు 2023–24 మార్చి నాటికి బడ్జెట్లో రూ.4.91 లక్షల కోట్లు, గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు.. మొత్తంగా రూ.6.46 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు ఇంకా రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని అర్థమైందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దుష్ప్రచారమే లక్ష్యం కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో 2024 డిసెంబర్ నాటికే ఏకంగా రూ.71 వేల కోట్లకు పైగా అప్పు చేసినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. 2023–24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4,91,734.11 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు రూ.5,63,376.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు రూ.91,252.58 కోట్లు ఉన్నాయన్నారు. అన్నీ కలుపుకుంటే కూడా మొత్తం అప్పులు రూ.10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు పదే పదే రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని చెబుతుండటం వెనుక గత దుష్ప్రచారమే కారణం. అప్పుడు అలా చెప్పినందున, ఇప్పుడు మరో రకంగా చెబితే బాగోదనే ఇలా మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర అప్పులు రూ.6.46 కోట్లేనని అప్పటి సీఎం వైఎస్ జగన్తోపాటు, కాగ్, ఆర్బీఐ నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు మంత్రి కేశవ్ కూడా ఇదే చెప్పారు. ఇదంతా ప్రజలను నమ్మించాలనే మోసపూరిత వ్యవహారం తప్ప మరొకటి కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
అబద్ధాలలో చంద్రబాబు PHD చేశారు
-
అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై టీడీపీ అబద్ధాలు బట్టబయలు
-
అఫీషియల్: జగన్ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!
అమరావతి, సాక్షి: వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.2014 జూన్ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి 2023-24.. జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇదిపబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.అప్పులపై బాబు అబద్ధాలుచంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది. -
రాష్ట్ర ఆదాయాలు.. బాబు, వాళ్ల మనుషుల జేబుల్లోకే..
-
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. -
పొదుపులో కుదుపు..
సాక్షి, అమరావతి: దేశంలో అప్పుల అప్పారావులు పెరిగిపోతున్నారు. పాత తరం పొదుపు మంత్రాన్ని జపిస్తే.. నేటి తరం పొదుపు కంటే అప్పులే ముద్దంటోంది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత నుంచి పొదుపు తగ్గించి.. అప్పుచేసి మరీ వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ పెరుగుతోంది. తాగాజా బ్లూమే రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కుటుంబ పొదుపు భారీగా పతనమై.. ఆ స్థానంలో కన్సూ్యమర్ రుణాలు పెరుగుతున్నాయని పేర్కొంది. 2000 సంవత్సరంలో మొత్తం దేశీయ పొదుపు విలువలో కుటుంబ పొదుపు వాటా 84 శాతంగా ఉంటే.. అది 2022–23 సంవత్సరానికి 61 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశీయ కుటుంబ పొదుపు విలువ రూ.49 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా. వడ్డీ రేట్లు తగ్గిపోవడం, నవతరానికి సులభంగా రుణాలు అందించే సంస్థలు అందుబాటులోకి రావడంతో పొదుపు రేటు పడిపోవడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.2000 సంవత్సరంలో దేశ జీడీపీలో 10.1 శాతంగా ఉండే కుటుంబ పొదుపు విలువ ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో జీడీపీలో కుటుంబ రుణాల విలువ 2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగిపోయిందని బ్లూమే రీసెర్చ్ వెల్లడించింది.నచ్చితే కొనేయడమే..ప్రస్తుత తరం ఏదైనా ఒక వస్తువు నచ్చితే జేబులో డబ్బులు లేకపోయినా కొనేస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్స్ విరివిగా రుణాలు ఇస్తుండటంతో ప్రస్తుత తరం వాళ్లు ఖర్చుకు వెనకాడటం లేదు. 2015–16లో మొత్తం రుణాల్లో కన్సూ్యమర్ రుణాల వాటా 21 శాతంగా ఉంటే.. 2023–24 నాటికి 34 శాతానికి చేరిపోయింది. దీనికి విరుద్ధంగా పారిశ్రామిక రుణాలు 42 శాతం నుంచి 34 శాతానికి పడిపోయాయి. భారతీయులు చేస్తున్న అప్పుల్లో అత్యధికంగా గృహ రుణాలు కాకుండా ఇతర రుణాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పొదుపు–అప్పుల నిష్పత్తి చూస్తే కొంత ఆందోళన కలిగిస్తోందని, దీర్ఘకాలంలో దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని బ్లూమే రీసెర్చ్ నివేదిక పేర్కొంది. -
బాబు సంపద సృష్టి.. మంగళవారం మరోసారి అప్పు.. ఈసారి ఎంతంటే?
సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి సున్నా. అప్పులు మాత్రం తెగ పెరిగిపోతున్నాయి. వారం వారం, నెల నెలా తెస్తున్న అప్పులతో ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఏకంగా రూ.1,35,640 కోట్లు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలు అమలు చేయడంలేదు. సూపర్6 లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి ఊసే ఎత్తడంలేదు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా 7.20 శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది.దీంతో బడ్జెట్ పరిధిలోనే మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు రూ.89,940 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం రూ.70 వేల కోట్ల అప్పు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. కానీ, ఆర్థికఏడాది ముగియడానికి నెల రోజులుండగానే బడ్జెట్లో చెప్పిన దానికన్నా అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ బయట కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు మొత్తం రూ. 31 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకు ఉత్తర్వులనూ జారీ చేసింది. రాజధాని పేరుతో, కార్పొరేషన్లకు గ్యారెంటీల ద్వారా రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది. ఇవే కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఏ ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదు ఒక్క ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు బాబు బృందం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి భారీగా అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా నోరు మెదపడంలేదు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం జనవరికి రూ.10,853 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు తెలిపాయి. ఆస్తుల కల్పనకు ఖర్చు చేయకుండా, సూపర్ 6 హామీలూ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడంలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. -
అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు. చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఫిబ్రవరి 19 ఉదయం కోల్కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!అనేక అనుమానాలు, ప్రశ్నలుకోల్కతాలోనిఒక ఇంట్లో మైనర్బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి. అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు. పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?ఎయిర్బ్యాగ్లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు? -
అప్పులపై బాబు సమాధానం చెప్పాల్సిందే.. ఆధారాలతో బయటపెట్టే దమ్ము మీకుందా..
-
ఏపీలో ఆర్థిక విధ్వంసం.. బాబు ‘మార్క్’ పాలన ఇదే..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ తమ సంపద కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం సంపద సృష్టించకపోగా.. తన మనుషులకు ఆస్తులను అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, పోర్టులు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్.. రూ.1.45 లక్షల కోట్లు అప్పులు చేసింది.అయితే.. ఆస్తులు అమ్మి, అప్పులు చేసిన సొమ్మంతా ఏమౌతుందని ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఆస్తుల అమ్మకమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్నీ కూడా కూటమి సర్కార్ అమలు చేయడం లేదు. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే లక్షల కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు.ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. -
అబద్ధాల నుంచి అప్పుల వరకు.. బాబు మోసాలపై జగన్ పవర్ ఫుల్ ప్రజెంటేషన్
-
ఈ 9 నెలల్లో అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు అప్పు చేశారు
-
మరో 6వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?
సాక్షి, అమరావతి: అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది.కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనంచంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే రూ.1,26,527 కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్ర నుంచి తీసుకునే అప్పలు వీటికి అదనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం. -
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు
-
గాలి లెక్కలు.. గ్రాఫిక్స్ కబుర్లు!
రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ రాజకీయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పండిపోయారు. గోబెల్స్కు గురువుగా మారి సరికొత్త పాఠాలు చెబుతున్నారు. ఏడాదైనా పూర్తి కాకుండానే బడ్జెట్లో చెప్పినదానికి మించి అప్పులు చేస్తుండటం కళ్లెదుటే కనిపిస్తుంటే.. అదే సంపద సృష్టి అని సరికొత్త భాష్యం చెబుతున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరిగిపోవడం.. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి పడిపోవడం.. కేంద్ర గ్రాంట్లు తగ్గడం.. అప్పులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కలవర పెడుతుంటే, బాబు మాత్రం రాష్ట్రంలో వృద్ధి రేటు రయ్.. రయ్.. అని పరుగెడుతోందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాబడి తగ్గినా వృద్ధి రేటు పెరుగుతుందంటున్న ఈ కిటుకు మాటలేవో దావోస్లో ఎందుకు చెప్పలేదు చంద్రబాబూ..!సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను పెంచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతోందని, 2023 డిసెంబర్తో పోల్చి చూస్తే 2024 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయని వెల్లడించాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది (2023) డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేర కూడా ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది. బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్న అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది. మరో పక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ సీఎం చంద్రబాబు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షోభం లేకపోయినా తగ్గిన రాబడికోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాది ఏడాదికి రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు పాలనలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆర్థిక ఏడాది (2023) డిసెంబర్తో పోల్చితే ఈ ఏడాది (2024) డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులేక పోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో రూ.6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం రూ.993 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా రూ.12,598 కోట్లు తగ్గిపోయినట్లు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది (2024–25) మొత్తానికి రూ.68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రూ.73,875 కోట్లు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపింది.రాబడి తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది?రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. 2023 డిసెంబర్ నాటికి మించి, ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి.. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా పేర్కొనగా, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా రూ.64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, డిసెంబర్ నాటికే రూ.73,635 కోట్లకు చేరింది. ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతోందో ఒక్క చంద్రబాబుకే తెలుసని అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తేవడానికేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
అప్పులతో విజన్ 2047
-
‘జీఎస్డీపీ పెంపే సంపద సృష్టి!’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) పెంచడమే సంపద సృష్టి అని, దాన్ని చూపించి అప్పులు తేవడంతో పాటు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే తన విజన్ 2047 అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పెరిగే జీఎస్డీపీ అంచనాలతో అదనంగా ఎంత అప్పు చేసేది, తద్వారా అదనంగా వ్యయానికి ఎన్ని నిధులు వస్తాయనేది వివరిస్తూ.. ఇదే రీతిలో విజన్–2047 నాటికి ఏటా 15 శాతం వృద్ధితో (ఊహాజనిత) జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే, ఈ ఆర్థిక ఏడాది ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర స్తూల ఉత్పత్తి అదనంగా 4.03 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనాల మేరకు 2024–25 ఆర్థిక ఏడాది జీఎస్డీపీ 12.94 శాతం వృద్ధిగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి గత ఆర్థిక ఏడాది 7.42 శాతం ఉంటే, ఈ ఆర్థిక ఏడాది ముందస్తు అంచనా మేరకు 6.71 శాతంగా ఉందని చెప్పారు. 2025–26 నుంచి 2029–30 వరకు జీఎస్డీపీ పెంచడం ద్వారా అదనంగా రూ.4,35,867 కోట్ల అప్పు చేస్తానని, తద్వారా అదనంగా వ్యయం చేయడానికి రూ.1,58,987 కోట్లు వస్తాయని చెప్పారు. విజన్–2047 లక్ష్యం తలసరి ఆదాయం రూ.58 లక్షలకు పెంచడమేనని స్పష్టం చేశారు. పెరిగిన తలసరి ఆదాయాన్ని ప్రజలు ఖర్చు చేస్తారని, దాంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు.విజన్–2047పై 16 లక్షల అభిప్రాయాలుకేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్కు కూడా రాని రీతిలో రాష్ట్ర విజన్–2047పై ఏకంగా 16 లక్షల మంది అభిప్రాయాలను తెలిపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్డీపీ రూ.3.47 కోట్లకు చేరుతుందని, ఈ లెక్కన తలసరి ఆదాయం రూ.58.14 లక్షలకు చేరుతుందని వివరించారు. నిరంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇది సాధ్యమని, లేదంటే తలసరి ఆదాయం రూ.13 లక్షలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చితేనే తాను చెప్పిన రీతిలో జీఎస్డీపీ ఉంటుందని, లేదంటే అప్పులు చేయడమే మార్గమని అన్నారు. లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చకపోతే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుందన్నారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడం లేదని, బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ అప్పులు ఇవ్వాలంటే విశ్వసనీయత ప్రధానమని చెప్పారు. పీ–4లో భాగంగా రాష్ట్రంలో కుటుంబ సభ్యులందరినీ అనుసంధానం చేస్తూ, ప్రతి ఇంటిని జీయో ట్యాగింగ్ చేసి వారి అకౌంట్లను తీసుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తామని, తద్వారా సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు 150 సేవలు అందిస్తామని చెప్పారు. పీ–4లో జనాభాయే ఆస్తి అని చెప్పారు. పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామన్నారు. తాను పెన్షన్ పెంచడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటున్నారని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు పేదలను పైకి తీసుకురావడానికి ముందు రావాలన్నారు. ఎవరైనా ఒకరిని చంపితే వారికీ అదే గతిరాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్మార్టమ్కు కారణమైన వారికి కూడా పోస్ట్మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టబోమని, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలేనని, బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టామన్నారు. గంజాయి, డ్రగ్స్, లిక్కర్ దందాలను నిరోధిస్తున్నామని చెప్పారు. -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్
-
Magazine Story: 6 నెలలు అప్పు మీద అప్పు లక్షల కోట్లలో అప్పు..
-
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
అప్పుల్లో ఏపీ రికార్డు.. కొంప ముంచిన బాబు
-
Big Question: ఇది ముంచేసే ప్రభుత్వం.. ఆరు నెలల్లో లక్ష కోట్ల అప్పులు.. విజనరీ బాబు
-
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
కొత్త అప్పులకు తెర తీసిన కూటమి
-
భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీర్చాల్సి వస్తుంది: భట్టి
-
ఆర్థిక మంత్రి భట్టి అప్పు లపై చేసిన ప్రసంగాన్ని ఖండించిన కేటీఆర్...
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
-
అప్పు లు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు
-
మంగళవారం మరో అప్పు చేయనున్న చంద్రబాబు సర్కార్
-
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత ఘోరంగా అప్పులు
-
ఏపీ అప్పు లపై తప్పుడు ప్రచారం చేస్తోన్న చంద్రబాబు అండ్ కో
-
బొంకిందే బొంకుతున్న చంద్రబాబును ‘బొంకుల బాబు’ అని ఎందుకు అనకూడదు?... ఏపీ ముఖ్యమంత్రి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Big Question: నారా వారి అబద్ధాలు.. అప్పులపై అసలు నిజాలు..
-
ఏపీ అప్పులపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ
-
Amarnath: అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టించారు
-
అసెంబ్లీ సాక్షిగా బాబు కుట్ర భగ్నం
-
అప్పులు చేయడంలో బిజీగా మారిన ఏపీ సర్కారు
-
3వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
చంద్రబాబు వ్యాఖ్యలు.. పేర్నినాని కౌంటర్
-
వారం వారం.. అప్పుల హారం
‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది... తల్లి కడుపులో ఉన్న శిశువుపై కూడా అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ను మరో శ్రీలంకగా మార్చేసింది... నన్ను గెలిపించండి... సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్...’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు... అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలికొదిలేశారు. అప్పులు చేయడంపైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ క్రమంలో తొలి వంద రోజుల్లోనే ఏకంగా రూ.22,000 కోట్లు అప్పు చేశారు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం 7.14 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున అప్పును చంద్రబాబు ప్రభుత్వం చేసింది.మరోవైపు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద చంద్రబాబు సర్కారు మరో రూ.5,200 కోట్ల అప్పు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీతో పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు, మార్క్ఫెడ్ రూ.3,200 కోట్లు అప్పు చేశాయి. చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులను కలిపి రూ.27,200 కోట్లు చేసింది. – సాక్షి, అమరావతి -
రాకెట్ స్పీడ్లో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మంగళవారం వచ్చిందంటే చంద్రబాబు సర్కారు అప్పు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరుకు చంద్రబాబు సర్కార్ అప్పులు రూ. 31,000 కోట్ల చేరుతున్నాయి. ఇప్పటికే 80 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సర్కారు రూ. 19,000 కోట్లు అప్పు చేసింది. మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరో రూ.12,000 కోట్లు అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలిపింది. దీంతో ఆర్బీఐ నెలవారీ మంగళవారాల్లో బాబు సర్కారు చేసే అప్పుల క్యాలెండర్ను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భాగంగానే వచ్చే నెల 1వ తేదీన మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయనుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ అప్పును ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 14 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధిలో రూ.1,000 కోట్లు అప్పు పొందనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలు, అనుమతి మేరకు అప్పులు చేస్తే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అయితే ఇప్పుడు ప్రతీ మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ ఎల్లో మీడియా ఒక ముక్క కూడా ప్రజలకు చెప్పడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదాకా చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో తెలియడంలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీలేమీ అమలు చేయకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల్లోనే రూ. 19 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పు చేసి తెచ్చిన నిధులు ఏ అభివృద్ధి పనులకు వెచ్చి0చారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై ఉందంటున్నారు. అలాగే వచ్చే మూడు నెలల్లో చేసే రూ. 12 వేల కోట్లను ఏ అభివృద్ధికి వ్యయం చేస్తారో చెప్పాల్సి కూడా ఉందంటున్నారు. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
రాష్ట్రానికి సవాలుగా రుణ భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండిదేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని రేవంత్రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమా ర్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టితెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు. రూ.10 వేల కోట్లు అడిగాంరైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు. -
మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు సర్కారు
-
మంగళవారం అప్పుల వారం
-
అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానిది కొత్త రికార్డు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది వరకు 5వేల900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న "మార్పు" అని బుధవారం(ఆగస్టు14) ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు.‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ చురకంటించారు. -
Big Question: జగన్ పై అప్పుల దుష్ప్రచారం.. అడ్డంగా దొరికిన బాబు
-
కేంద్రంలో చంద్రబాబు తిప్పేది అప్పుల చక్రమే
-
అప్పుల సర్కారు
-
AP Debts: అప్పుల ద్వారా సంపద సృష్టి!
సాక్షి, అమరావతి: అప్పులు చేయడం ద్వారా కాకుండా, సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్దంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12,000 కోట్లు అప్పు చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పు చేసిన రోజల్లా ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదని తప్పు పడుతూ ఎల్లో మీడియా కథనాలను రాయడం, వాటి ఆధారంగా చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేవలం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12 వేల కోట్లు అప్పు చేసినా, మంగళవారాలు అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయడం లేదు ఎందుకో అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత నెల 25వ తేదీన రూ.2 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన ఒకేసారి రూ.5,000 కోట్లు అప్పు చేసింది. 16వ తేదీన మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం (నిన్న) సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో రూ.1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 20 సంవత్సరాల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34 శాతం వడ్డీతో అప్పు చేసింది. ఈ లెక్కన నెల ఐదు రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ఒక్క పెన్షన్ పెంపు తప్ప మిగతా హామీల్లోని ఏ ఒక్కదాని అమలు ప్రారంభించలేదు. మరి ఈ అప్పులన్నీ దేనికి వ్యయం చేసినట్లో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా చెప్పాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనల మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంక చేశారంటూ.. లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియా పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆర్థిక వేత్తలు ప్రశి్నస్తున్నారు. రూ.12 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడంలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులను ఏ అభివృద్ధి పనులకు వెచ్చించారో చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. -
వైఎస్ జగన్ హయాంలో పరిమితంగానే ఏపీ అప్పులు: SBI
-
అసెంబ్లీ సాక్షిగా బాబు తప్పుడు లెక్కలు
-
అసలు అప్పెంత? బాబు బొంకెంత?
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే. గవర్నర్తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీతో తప్పులు చెప్పించిన సీఎం చంద్రబాబును మందలించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాస్తా. 2019 మే 30 నాటికి మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని స్వయంగా చంద్రబాబు గెజిట్ ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12 నాటికి ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. నాడు రూ.వంద కోట్లే ఉన్నా రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు రూ.7–8 వేల కోట్ల నిధులున్నా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నది బాబు భయం. హామీల అమలుకు నిధులు కేటాయించకుండా తప్పించుకునేందుకే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదుఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ప్రకటించి మరీ డీబీటీ ద్వారా అర్హులందరికీ కులమతాలు, పారీ్టలు, ప్రాంతాలు చూడకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా వివక్ష లేకుండా అందించాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఇచ్చాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి బటన్ నొక్కి అందచేశాం. మరి మీరిచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలను ఉదహరిస్తూ అప్పులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలు రంగు తెలిసిపోతుందనే భయంతో.. గత 52 రోజులుగా రాష్ట్రం పురోగమిస్తోందో తిరోగమిస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అణిచివేసే పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే.. పూర్తి స్థాయి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ధైర్యం లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే మోసపూరిత హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, హామీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 ప్రకారం రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పు ఎంత? లాంటి అంశాలు వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నది చంద్రబాబు భయం. అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. వంచన.. దగా.. మోసమే చంద్రబాబు విధానంచంద్రబాబు మోడస్ ఆపరండీ ఏమిటంటే.. వంచన, గోబెల్స్ ప్రచారం! ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయాలనుకున్నా... హామీల అమలుపై తప్పించుకోవాలన్నా దాన్ని అమలు చేస్తారు. ముందుగా ఒక కథ సిద్ధం చేసి తాను చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిపై చర్చలు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అందరితో అవే మాటలు మాట్లాడిస్తారు. టీవీ చర్చల్లో అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మనుషులే. చివరికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు హామీలను అమలు చేసే పరిస్థితి లేదని తీర్మానం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. వేరు పడినప్పుడు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడూ ఇదే కథ! ఎన్నికల్లో హామీలు ఇచి్చనప్పుడు.. వాటిని ఎగ్గొట్టేటప్పుడు కూడా ఇదే విధానం! ఇప్పుడు మొదటి కథగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి రాష్ట్రం నిజంగా ఆర్ధికంగా ధ్వంసమైందా? లేదా అన్నది ఒక్కసారి గమనిద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాటిపై అందరూ ఆలోచించాలి. ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే మా హయాంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ను ప్రశంసించింది. ఎఫ్ఆర్బీఎం అనుమతించిన దానికంటే తక్కువ అప్పు తీసుకున్నారని అభినందించింది. నేరుగా నగదు బదిలీ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే దీనికి కారణం. ‘క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్’ అని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది. ధర్మం వైపు నిలవండి..చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జూన్ 12వతేదీకి రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.5,655 కోట్లు వచ్చాయి. రెండోసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటా డబ్బులు జమయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి కనీసం రూ.7–8 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. అంత డబ్బు ఉన్నా డ్రామాలాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన అంశాలను.. వాస్తవపత్రం పేరుతో నేను చెప్పిన వాటిని ఒక్కసారి బేరీజు వేసి పరిశీలించండి. మీరంతా ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. విపత్తులోనూ ఆచితూచి అప్పులు» కోవిడ్ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గణనీయంగా తగ్గింది. » కేంద్ర పన్నుల వసూళ్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019–20లో –3.38% తగ్గాయి. 2020–21లో ఆ పెరుగుదల 0.85 శాతం మాత్రమే ఉంది. » సాధారణంగా ఏటా కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లలో పెరుగుదల 18 నుంచి 19 శాతం ఉంటుంది. » కోవిడ్తో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా కూడా బాగా తగ్గింది. » కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని జీఎస్డీపీ నిష్పత్తిలో తీసుకుంటే చంద్రబాబు హయాంలో 3.72 శాతం వస్తే మా హయాంలో కోవిడ్ కారణంగా 2.92 శాతానికి పడిపోయింది. » కోవిడ్ వల్ల మనకు బాగా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు.. ప్రతి రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే అవకాశం కల్పించినా చంద్రబాబు హయాంతో పోలిస్తే తక్కువే తీసుకున్నాం. » చంద్రబాబు హయాంలో కాంపౌన్డ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబులిటీస్ 21.63 శాతం అయితే మా హయాంలో 12.90 శాతమే ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అప్పులు 18.15 శాతం పెరగ్గా 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో కేవలం 13.80 శాతమే పెరిగాయి. ఎక్కువ అప్పులు చేసిన బాబు గొప్పవాడా? తక్కువ చేసిన మేం ఆర్థిక విధ్వంసకారులమా? ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని దు్రష్ఫచారం చేస్తూనే.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్, సూపర్ టెన్ అంటూ చంద్రబాబు హామీలిచ్చారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రజలు అడుగుతుండటంతో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవు. బడ్జెట్లో చూపించలేక అధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రూ.14 లక్షల కోట్లు కాస్తా రూ.10 లక్షల కోట్లకు తగ్గించారు. పోనీ నిజాలు చెప్పించారా? అంటే అదీ లేదు! » చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.1,18,051 కోట్ల అప్పులు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి రూ.5.18 లక్షల కోట్లకు చేరాయి. » ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.5,744 కోట్లు ఉండగా ఆయన హయాం ముగిసే నాటికి రూ.50 వేల కోట్లకు ఎగబాకాయి. అనంతరం మా హయాం ప్రారంభమయ్యే నాటికి రూ.50 వేల కోట్లతో మొదలైన అప్పులు చివరకు రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి. » ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు.. అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు 2014 జూన్ 2 నాటికి రూ.26 వేల కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి రూ.86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. » మొత్తంగా అప్పులు ఎంత? అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్ 2 నాటికి రూ.1,23,343 కోట్లు ఉంటే ఆయన వైదొలగే నాటికి రూ.4.08 లక్షల కోట్లకు ఎగబాకాయి. » మేం అధికారం చేపట్టే నాటికి రూ.4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి రూ.7.48 లక్షల కోట్ల అప్పులున్నాయి. » చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 21.63 శాతం ఉంటే మా హయాంలో అది 12.93 శాతమే ఉంది. అంటే 21.63 శాతం అప్పులు చేసిన వాడు గొప్పవాడా? ఆరి్థక విధ్వంసకారుడా? 12.93 శాతమే అప్పులు చేసిన మేం ఆర్థికంగా ధ్వంసం చేసినట్లా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. » రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నట్లు రాజ్యసభకు తెలియచేశారు. నేను జూన్ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా. వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లో రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడ నుంచి వచి్చంది ఈ రూ.పది లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగానే చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? -
చంద్రబాబు బండారం లెక్కల తో బయటపెట్టిన వైఎస్ జగన్
-
Big Question: 21 మంది ఎంపీలున్నా.. బడ్జెట్ లో సాధించింది సున్నా..
-
చంద్రబాబు సర్కార్ లో మంగళవారం వచ్చిందంటే టెన్షన్..
-
అప్పులకు షూరిటీ.. మన భవిష్యత్తుకు నో గ్యారెంటీ 22 రోజులు, 9 వేల కోట్లు..
-
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్... గెలిచాక సూపర్ షాక్స్
-
ఒక్కరోజులోనే రూ.5,000 కోట్ల అప్పు..
-
బాబు అప్పులు.. ఎల్లో మీడియా తప్పులు
-
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే కార్పొరేషన్కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లుఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్బీఐ వద్ద షెడ్యూల్ అయి ఉంది. జూన్లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్బీఐకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎన్నికల వేళ అప్పుల మోతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే 7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్కుమార్రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్పై 2017లో చెన్నై సెండియం పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్స్టేషన్లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి. -
అప్పులు తీర్చే మార్గం లేక...
జనగామ: వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుల కుమారుడు తెలిపిన వివరాల మేర కు.. తమిళనాడుకు చెందిన రాజ్ సెల్వరాజ్ (55), భార్య భాగ్యలక్ష్మి (45)కి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. మూడు దశా బ్దాల క్రితం వ్యాపారం కోసం వచ్చి వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడి వివాహం చేశారు. అనంతరం వ్యా పారంలో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ మొత్తం రూ.50 లక్షల అప్పు చేశా రు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇద్దరు కుమా రులు వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటు న్నారు. రోజురోజుకూ సెల్వరాజ్ వ్యాపారం తగ్గిపోవడంతో అప్పులు తీర్చే మార్గాలు మూ సుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన వాచ్ మన్ చిన్న కుమారుడు చిన్నస్వామికి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే దంపతులు పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. -
ఏపీ అప్పులపై అసలు నిజం...CAG రిపోర్ట్
-
Fact Check: అడ్డగోలు అప్పులు దాచేసి ముష్టి లెక్కలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి స్వయంగా కేంద్రం ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా వివరణలూ ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందనీ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు తేల్చి చెప్పింది. రాష్ట్ర అప్పులపై ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా వివరంగా చెప్పారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల – వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల గురించి ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా తెలియచేశారు. ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం, ఆర్బీఐ చెబుతున్నా తలకెక్కదా? చట్టసభల్లో ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాలను కాదని తనకు తోచిన లెక్కలతో రామోజీ తప్పుడు రాతలు ఎలా రాస్తారు? రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో డప్పు కొట్టే గురివిందను ఏమనుకోవాలి? అసలు ఏ ప్రభుత్వాలకైనా తీసుకునే అప్పులను రహస్యంగా ఉంచడం సాధ్యం కాదనే ఇంగితం లేదా? పరిమితికి లోబడి తీసుకునే అప్పులను గ్రాఫిక్స్ ఆర్భాటాల కోసం కాకుండా వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చదువులను చక్కదిద్దేందుకు వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.73 వేల కోట్లకు పైచిలుకే! మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం పెత్తందారుల దృష్టిలో వృథానేనా? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అనవసరమా? సుదూర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగేందుకు ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయడం వృథానా? రాజధాని గుదిబండ రూ.5 వేల కోట్లు! అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు భవిష్యత్లో తప్పనిసరి ఆర్థిక బాధ్యతలుగా పరిణమించాయని కాగ్ స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల పేరుతో గత సర్కారు ఏకంగా 10 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీతో అప్పు చేసినట్లు పేర్కొంది. మార్కెట్ రుణాల ద్వారా రూ.5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా రూ.4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్లో మరో రూ.3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధాని నిజం కాలేదు గానీ తప్పనిసరి ఆర్ధిక బాధ్యతలు మాత్రం మోయాల్సి వస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ సర్కారు పేలవమైన ఆర్థిక నిబద్ధత చూపిందని తప్పుబట్టింది. ♦ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 2022–23కి సంబంధించి కాగ్ అకౌంట్స్ సమర్పించింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, జీఎస్డీపీలో అప్పులు ఉన్నాయని అందులో స్పష్టం చేసింది. సొంత లెక్కలు కాకుండా కాగ్ అకౌంట్స్ను పరిశీలిస్తే రామోజీకి ఆ విషయాలు తెలుస్తాయి. ♦ అప్పుల కోసం సచివాలయం, ఇంకా కనిపించినవన్నీ తాకట్టు పెడుతున్నారంటూ రామోజీ పచ్చి అవాస్తవాలను కుమ్మరించారు. వాస్తవానికి రాజధాని అంటూ అమరావతి భూములను తాకట్టు పెట్టి బాండ్లు పేరుతో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసింది చంద్రబాబు సర్కారే. కాగ్ నివేదికే ఆ విషయాన్ని ఎండగట్టింది. గ్రాఫిక్స్ బండారాన్ని బయట పెట్టింది. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు అప్పుల నిర్వాకంతో ఇప్పుడు వడ్డీల చెల్లింపులు భారంగా మారాయి. అత్యధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పు తెచ్చిన పరిమాణానికి దాదాపు సమానంగా వడ్డీ కూడా ఉండటాన్ని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ♦ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చించి ఉత్తమ మానవ వనరుల ద్వారా ఆస్తుల కల్పన చేయటాన్ని చూసి రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను రూ.16 వేల కోట్లతో నిర్మిస్తుంటే మంచం పట్టారు! రూ.24,000 కోట్లతో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమూ ఆయనకు మింగుడు పడటం లేదు! ఎందుకంటే తాను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే అనుకోవాలేమో! ♦ గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి, గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తే రామోజీ కిక్కురుమనలేదెందుకో? ♦ రాష్ట్ర అప్పులు బడ్జెట్ లోపల, బయట కలిపి ఏకంగా రూ.10.21 లక్షల కోట్లకు చేరాయంటూ పచ్చి అబద్ధాలను రామోజీ తన కరపత్రంలో గుమ్మరించారు. 2022–23 నాటికి కాగ్ అసెంబ్లీకి సమర్పించిన అకౌంట్స్ ప్రకారం బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట రాష్ట్రం అప్పులు రూ.5.68 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బడ్జెట్ లోపల అప్పులు రూ.4,29,526 కోట్లు కాగా బడ్జెట్ బయట అప్పులు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులను శాసనసభకు సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ పత్రం ద్వారా అందచేస్తూ ఎక్కడా దాపరికం లేకుండా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎఫ్ఆర్బీఎ నిబంధనల కన్నా తక్కువగానే అప్పులున్నట్లు 2022–23 కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. -
అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన 'కాగ్' నివేదిక
-
ఏపీ అప్పులపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఛాలెంజ్
-
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ బడ్జెట్ పై తుది కసరత్తులు
-
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
TS: భట్టి పదేపదే అదే చెప్తున్నారు.. జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇరవై రోజులుగా చెప్పిందే చెప్పుకుంటూ కాంగ్రెస్ నాయకులు కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ ఆగిపోతుంది అని ఇప్పటికే జనంలో చర్చ మొదలైందన్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని చెప్పటం సరికాదన్నారు. ‘కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జనం అనుకుంటున్నారు. చేతకాకపోతే చేతకాదు అని చెప్పాలి. అప్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారత దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదు. విద్యుత్ సంస్థల్లో కూడా అప్పులు లేని రాష్ట్రం లేదు. వీళ్లు పాలించిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ అప్పులున్నాయి. పదే పదే భట్టి విక్రమార్క అప్పులున్నాయని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వటం చేతకాక అప్పులు గురించి మాట్లాడుతున్నారు. 2014కు ముందు 20 వేల కోట్లు అప్పు చేసి 3నుంచి 4 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ మేము 60 వేల కోట్లు అప్పు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం’ అని జగదీష్రెడ్డి తెలిపారు. ఇదీచదవండి..మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్రెడ్డి -
అడ్డగోలుగా అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెబుతారా?
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన ఆస్తులు బావా, బావమరుదల స్వేదంతో సృష్టించినవా? ఆ సర్కారు హయాంలో చేసిన అప్పు లు చెల్లించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజల స్వేదం చిందించాల్సిందే కదా? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘ఏదో సాధించినట్టు స్వేదపత్రం విడుదల చేశారు. బావా బావమరుదులు కష్టపడి చెమటలు చిందించి సంపాదించినట్టు చెబుతున్నారు. అవి తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆస్తులు. అదే చెమటను చిందించి అప్పులను కట్టాల్సిందే. ఇందులో బీఆర్ఎస్ గొప్పతనమేముంది.?’అని నిలదీశారు. మంగళవారం ఢిల్లీ వెళ్లేందుకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ స్వేదపత్రంపై ఘాటై న విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7లక్షల కోట్లు అప్పులు చేసి ఆస్తులు సృష్టించామనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమో కాదో చెప్పాలన్నారు దోపిడీ సొమ్మును కక్కిస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతి సొమ్మును కక్కిస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ చెప్పినట్టుగానే గత ప్రభుత్వ అక్రమాలపై న్యాయ విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని భట్టి చెప్పారు. ఈ విచారణ తర్వాత లెక్కలు కట్టి దోపిడీ సొమ్మును కక్కిస్తామని వ్యాఖ్యానించారు. ధనవంతులు మరింత సంపన్నులయ్యారు బీఆర్ఎస్ పాలనలో పేదలు మరింత పేద లుగా మారితే ధనవంతులు మరింత సంపన్నులయ్యారని, దీనికి తామేదో తలసరి ఆదాయం పెంచామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని భట్టి విమర్శించారు. ‘హైదరాబాద్లో ఓ సంపన్నుడు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. గ్రామాల్లో పేదలు 40 చదరపు గజాల్లో ఉంటున్నారు. వారిద్దరి తలసరి ఆదాయం సగటును లెక్కించి గొప్పలు చెప్పుకోవడం సమంజసమేనా.?’అని నిలదీశారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్తగా పరిశ్రమలు తెచ్చారా? కోల్ ఇండస్ట్రీ నెలకొల్పారా? ప్రభుత్వరంగ సంస్థలేమైనా తెచ్చారా? వీళ్లు సృష్టించిన ఆస్తులేంటి? కళ్లకు కనపడవా?’అని ఎద్దేవా చేశారు. -
కొత్త ప్రభుత్వం అప్పులు రూ.1,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అప్పుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నిధులు సమీకరించుకుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మేర రుణ సమీక రణ చేసింది. ఆర్బీఐ ఆ«ధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ నెల 12న రూ.500 కోట్లు, ఈ నెల 19న రూ. 900 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. ఇందులో రూ. 500 కోట్ల అప్పును 7.70 శాతం వడ్డీకి 15 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించేలా, రూ. 900 కోట్లను 7.58 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా సమకూర్చుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే రుణ షెడ్యూల్.. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకొనే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి షెడ్యూల్ సమర్పిస్తాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి చెందిన షెడ్యూల్ను ఆర్బీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ మేరకు డిసెంబర్లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ. 1,400 కోట్లు సమకూర్చుకుందని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. -
Fact Check: అప్పులపాలైనా అభాండాలేనా!?
సాక్షి, అమరావతి/అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం క్రైం: భావప్రాప్తి కోసం ఈనాడు రామోజీరావు తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్నారు. ఎంత నీచానికి దిగజారకూడదో అంతకన్నా హీనంగా అథఃపాతాళంలోకి ఆయన రోజురోజుకీ కూరుకుపోతున్నారు. కారణం.. తన ఆత్మ చంద్రబాబుపై అంతులేని ప్రేమ.. సీఎం జగన్పై ఎక్కడాలేని అసూయ, విద్వేషం. దీంతో ఆయన సిగ్గూఎగ్గూ వదిలేసి తన విషపుత్రిక ఈనాడులో నిత్యం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగమే టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నం కథనం కూడా. వ్యక్తిగత కారణాలతో పాటు విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి అవి చెల్లించలేని దుస్థితిలో ఆత్మహత్యాయత్నానికి అతను పాల్పడితే రామోజీ ఆ ఉదంతాన్ని కూడా బాబు కోసం, తన పైశాచికానందం కోసం వాడేసుకున్నారు. ఈ ఘటనపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వ్యక్తిగత కారణాలతో టీచర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే ఆ ఘటనను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, సీపీఎస్కు ముడిపెట్టి రామోజీ వికృతానందం పొందారు. నిజానికి.. 2003లో సీపీఎస్ను కేంద్రం రద్దు చేసినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబే. అంతేకాదు.. నాటి కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. అందులో ఆయన మంత్రులు సైతం ఉన్నారు. అప్పట్లో ఈ రద్దు నిర్ణయాన్ని వీరెవరూ వ్యతిరేకించలేదు. పైగా.. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా సీపీఎస్కు సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట నిర్ణయం తీసుకోకుండా అలా గాలికి వదిలేశారు. ఈ వివరాలన్నింటినీ రామోజీ ఉద్దేశపూర్వకంగా తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీకి తోడు సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ చాలా తక్కువ వస్తోందని సీఎం వైఎస్ జగన్ గుర్తించి వారికి మెరుగైన పెన్షన్ కోసం.. అలాగే, దానికొక శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆలోచించి ఆయన గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్)కు రూపకల్పన చేశారు. దీని ప్రకారం.. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణకు ముందునెల పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్ను తీసుకొచ్చి సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేశారు. దీనిని ఉద్యోగ సంఘాలు సైతం స్వాగతించాయి. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయంలేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు. చివరికి కేంద్రం కూడా ఇప్పుడు దీనిని అధ్యయనం చేస్తుండడమే కాక అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్నే అనుసరించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. టీచర్ మల్లేష్ ఆత్మహత్యా యత్నానికి సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేయకపోవడమే కారణమంటూ రామోజీ గుడ్డిగా ఒక నిర్ణయానికొచ్చేసి బాబుకు మేలు జరిగేలా తనకు తోచింది రాసిపారేశారు. ఇందుకు టీడీపీ నేతలు సైతం తోకలూపుతూ నీచ రాజకీయాలకు దిగారు. జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పని.. ఇక 1996 నుంచి 2004 వరకు అప్పటి కేంద్రంలోని ఎన్డీఏలో తానే చక్రం తిప్పానని పదేపదే గొప్పలు చెప్పుకున్న బాబు.. ఆనాడు సీపీఎస్ను ఎందుకు వ్యతిరేకించలేదు? పైగా.. రాష్ట్రంలో అమలుచేసేందుకు 2003లో ఆమోదం కూడా తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఎస్ను రద్దుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సమయంలో సీపీఎస్ రద్దు సాధ్యంకాదని తెగేసి చెప్పారు. కానీ, 2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ రద్దు హామీ ఇవ్వడంతో ఇక గతిలేక ఎన్నికల ముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యప్రకాశ్ ఠక్కర్తో చంద్రబాబు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. నిజంగా చంద్రబాబుకు సీపీఎస్ ఉద్యోగులపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే తన ఐదేళ్ల పాలనలో మెరుగైన పెన్షన్ కోసం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? బాబు చేసిన ఈ మోసాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా సీపీఎస్ ఉద్యోగులకు మేలుచేసిన జగన్ సర్కారును అభాసుపాల్జేయడమే పనిగా ఈనాడు రామోజీ పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు నిజమే.. కానీ, ప్రభుత్వంపై అసంతృప్తిలేదు నా భర్త ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో తెలీదు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ, ఈ ఘటనను కొందరు పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మా ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డిప్రెషన్లో ఏమి రాశాడో, ఎవరికి పోస్ట్ చేశాడో మాకు తెలీడంలేదు. దయచేసి దీనిపై రాజకీయం చేయొద్దు. నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం మెసేజ్ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. నిజానికి.. మాకెవరికీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. జగన్ పాలనలోనే నాకు సచివాలయం ఏఎన్ఎంగా ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. నా భర్తను కాపాడుకునేందుకు అందరూ సహకరించాలి. – శివలక్ష్మి, టీచర్ మల్లేష్ భార్య రూ.25.60 లక్షల అప్పుల్లో మల్లేష్.. వాస్తవాలిలా ఉంటే.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు ఇటీవల బెట్టింగ్లో రూ.ఆరు లక్షలు కోల్పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం జగన్ సీపీఎస్ రద్దుచేయనందువల్లే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఈనాడు రామోజీ మసిపూసి మారేడుకాయ చేశారు. అంతేకాదు.. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీచర్ మల్లేష్ రూ.25.60 లక్షల అప్పుల్లో కూడా కూరుకుపోయిన నిజాన్ని ఈనాడు మరుగునపరిచి కేవలం సీపీఎస్ రద్దు చేయనందువల్లే అంటూ ఇష్టారాజ్యంగా రాసిపారేసింది. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనలకు సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టి రామోజీ, టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారు. మరోవైపు.. 35 ఏళ్ల టీచర్ మల్లేష్కు ఇంకా చాలా సర్వీసు ఉంది. అంత సర్వీసు ఉండగా సీపీఎస్ రద్దుచేయలేదని ఇప్పుడే ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడతారనే కనీస స్పృహ, ఇంగిత జ్ఞానం రామోజీకి కరువైంది. అప్పులున్నాయి.. అవి చెల్లించకపోవడంవల్లే.. మల్లేష్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రుణాలు తీసుకున్నాడు. అవి సక్రమంగా చెల్లించకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడేవాడు. అనవసరంగా ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలకు నా బావకూ ఎలాంటి సంబంధంలేదు. – ఆదినారాయణ, శివలక్ష్మి సోదరుడు వ్యక్తిగత ఇబ్బందులవల్లే ఆత్మహత్యాయత్నం వ్యక్తిగత ఇబ్బందుల నేపథ్యంలోనే టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. మల్లేష్ తన కుటుంబంతో పాటు సోదరి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆయన సుమారు రూ.26 లక్షలకు పైగా అప్పులుచేశాడు. వాటిని తీర్చేమార్గం కనిపించక ఇబ్బందులు పడేవాడు. దీనికితోడు బ్యాంకులు, చిట్ఫండ్ కంపెనీల్లో రుణాలు తీసుకోవడంతో అన్నింటికీ నెలవారీ చెల్లింపులు కష్టంగా మారింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. మల్లేష్ పూర్తిగా స్పృహలోకి రాగానే మరిన్ని విషయాలు తెలుస్తాయి. – మీడియాతో ఉరవకొండ సీఐ ఎం. తిమ్మయ్య జీతాలు సకాలంలోనే అందుతున్నాయి వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరం. మల్లేష్ ఘటనపై కొన్ని సంఘాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కావాలనే ప్రభుత్వానికి ఆపాదించి దుష్ప్రచారం చేస్తున్నాయి. మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు అసంబద్ధంగా ఉన్నాయి. మల్లేష్కు అనారోగ్య కారణాలు ఉన్నాయని, వీటికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయని ఆయన భార్య బహిరంగంగానే చెప్పారు. నిజానికి.. 2020–21 కరోనా సమయంలోనూ ప్రతినెలా 4న ఉపాధ్యాయుల వేతనాలు అందాయి. ఇప్పుడూ ప్రతినెలా 6వ తేదీ లోపలే అందుతున్నాయి. కావాలంటే పే స్లిప్పులు పరిశీలించాలి. పీఎఫ్, జీపీఎఫ్ లోన్లు ఈ ఏడాది ఏప్రిల్ వరకు క్లియర్ చేశారు. ప్రభుత్వోద్యోగులపై సీఎం వైఎస్ జగన్కు ఎలాంటి వ్యతిరేకతా లేకున్నా ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయాలని ప్రయత్నిస్తున్నారు. మల్లేష్ రాసినట్లు చెబుతున్న లేఖ కూడా ఆయన రాసింది కాదని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. – అశోక్కుమార్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శాఖల వారీగా శ్వేత పత్రం
-
అప్పులపై ఎల్లో బ్యాచ్ది తప్పుడు ప్రచారమే
సాక్షి, అమరావతి: అప్పులతో రాష్ట్రం మరో శ్రీలంకలాగ అయిపోతోందని కొండంత రాగాలు తీస్తున్న ఎల్లో బ్యాచ్కు షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎల్లో మీడియా నిత్యం చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. 2022–23 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి దేశంలోని ఏ రాష్ట్రానికి ఎన్ని అప్పులున్నాయి, ఎంత మేర అప్పులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ గ్యారెంటీ అప్పుల ఎన్ని? అనే వివరాలతో కూడిన నివేదికను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వాస్తవాలను చెప్పినప్పటికీ కూడా టీడీపీ, ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ పదే పదే దుష్ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ఆర్బీఐనే రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించడంతో వాస్తవాలు ప్రజలు తెలుసుకుని, ఎల్లో బ్యాచ్ది తప్పుడు ప్రచారం అని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపైనా తప్పుడు రాతలే.. ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులపై కూడా విపక్ష నేతలు దుష్ప్రచారం చేయడమే కాకుండా, ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. అప్పులను దాచేస్తున్నారంటూ వింత పోకడలు పోతున్నారు. ప్రభుత్వాల అప్పులు దాచడానికి అవకాశం ఉండదనే కనీస జ్ఞానం లేకుండా ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని నిపుణులు మండిపడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1,17,503 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు చేసిన అప్పులు రూ.1,35,282 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. చెప్పేవన్నీ అబద్ధాలే.. రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు అని ఓసారి, 11 లక్షల కోట్లు అని మరోసారి రోజుకో మాట మారుస్తూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైంది. 2022–23 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఇకనైనా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ‘అప్పు’డే ఎక్కువ రాష్ట్రాల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత వరుస స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అప్పులు ఎక్కువ చేస్తోదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి ఎక్కువ ఉందని స్పష్టమైంది. 2018–19లో చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి 15.3 శాతంగా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అది క్రమంగా తగ్గుతూ వస్తోందని, అప్పుల వృద్ధి 2020–21లో 14.7 శాతం, 2021–22లో 11.5 శాతం, 2022–23లో 12.4 శాతం ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2018–19లో చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వృద్ధి కన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పులు వృద్ధి తక్కువగా ఉందంటే అప్పులు తక్కువగా చేస్తున్నట్లేనని స్పష్టం అవుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
5 నెలల్లో ఏడాది అప్ప అంటూ గగ్గోలు
-
Fact Check: అప్పులపై తప్పుడు కథనం
సాక్షి, అమరావతి: ‘తప్పులెన్ను వాడు తన తప్పులెరుగడు’ అన్నది గతం. ఈనాడు రామోజీరావు విషయంలో ‘ఒప్పులన్నింటినీ తప్పులనే వాడు తన తప్పులెరుగడు’ అంటూ అన్వయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహరహం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తూనే అభివృద్ధికీ బాటలు వేస్తున్నారు. అందులో భాగంగా కొంతమేర అప్పులూ తెస్తున్నారు. ఈ అప్పులపై ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ.. రామోజీ గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను, వాటిని అవి ఏ విధంగా పక్కదారి పట్టించాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు ఐదు నెలల్లోనే అంటూ ఓ దిగజారుడు కథనాన్ని ఈనాడులో అచ్చేశారు. ఇదే రామోజీకి గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే చివరి ఏడాది చేసిన భారీ అప్పులు, వాటిని పక్కదారి పట్టించిన వైనం కనిపించలేదు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పు కూడా చంద్రబాబే చేశారని కాగ్ గణాంకాలు స్పష్టంగా చెప్పినా రామోజీ చూడనట్లే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉండాలనే కాంక్ష బలీయంగా ఉన్న రామోజీకి ఆ సీట్లో వైఎస్ జగన్ ఉండటం ససేమిరా ఓర్చుకోలేరు. అందుకే అవే కాగ్ గణాంకాల్లో కేపిటల్ వ్యయం, సామాజిక రంగ వ్యయం ఉన్నా సరే వాటిని మరుగున పరిచేసి కేవలం అప్పులపైనే కథనం అల్లారు. అదేదో మహా తప్పిదమైనట్లు రోత రాతలు రాశారు. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలకు లోబడి, కేంద్ర అనుమతుల మేరకే అప్పులు చేసినప్పటికీ ఈ రుణాలపై రామోజీ పదే పదే విష ప్రచారానికి దిగుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ24,205 కోట్లు అప్పు చేస్తామని చెప్పి ఏకంగా రూ.34,751 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్లో చెప్పిన దానికన్నా రూ.9,546 కోట్లు ఎక్కువగా (139 శాతం అదనంగా) అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలే తెలిపాయి. ఇది తప్పు అని రామోజీకి అనిపించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో చెప్పిన అప్పుల్లో ఆగస్టు నెలాఖరు వరకు 72.28 శాతమే అప్పు చేసింది. అదీ నిబంధనల మేరకే. అంతే కాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే సామాజిక రంగంపై ఏకంగా రూ.68,012 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ స్పష్టంగా లెక్కగట్టి చెప్పింది. గత చంద్రబాబు ప్రభుత్వం సహా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక రంగంపై ఇంతగా ఎప్పుడూ ఖర్చు చేయలేదని కాగ్ తేటతెల్లం చేసింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, తాగునీటి రంగాలపై చేసే ఖర్చు. ప్రజలకు అత్యంత అవసరమైన రంగాలివి. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న దృఢ సంకల్పానికి నిదర్శనమిది. మరో పక్క బడ్జెట్లో కేపిటల్ వ్యయానికి చేసిన కేటాయింపుల్లో కేవలం ఐదు నెలల్లోనే.. అంటే ఆగస్టు వరకు 40.79 శాతం ఖర్చు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కాగ్ వెల్లడించింది. ప్రజా సంక్షేమాన్ని, కేపిటల్ వ్యయాన్ని వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చే స్థాయికి ఈనాడు రామోజీ దిగజారారు. బాబు తెచ్చిన అప్పులు బండెడు చంద్రబాబు దిగిపోయే ఆర్థిక సంవత్సరంలో తరువాతి ప్రభుత్వానికి కూడా అప్పు పుట్టనంతగా ముందుగానే రుణాలు తెచ్చేసినా రామోజీ ఒక ముక్క కూడా రాయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులను తరువాతి సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అప్పుల నుంచి తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించినా రామోజీకి తప్పనిపించలేదు. కేవలం వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారని, ఆయన ప్రజా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న దుగ్ధే రామోజీలో కనిపిస్తోంది. -
పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం -
అప్పులు తీర్చేస్తున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు అనుకూలంగా తీసుకుంటున్న పలు రకాల చర్యల ఫలితంగా వ్యవసాయ రుణాల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని 223వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అజెండా పేర్కొంది. ఇది శుభ పరిణామంగా కమిటీ తెలిపింది. నిజానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా నిలుస్తుండడంతో రైతులు సంతోషంగా ఉంటున్నారు. దీంతో తాము తీసుకున్న అప్పులను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించేస్తున్నారు. ఫలితంగా మొండిబకాయిల శాతం ఏటేటా తగ్గుతోంది. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాల్లో భాగంగా రైతులకు వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నావడ్డీ వంటి అనేక పథకాలు ఏటా అమలుచేస్తుండడం.. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దీంతో నిర్ణీత గడువులోగా బాకీలు తీర్చడంలో రైతులు గతంలో ఎప్పుడూలేని విధంగా ముందుంటున్నారు. టీడీపీ తీరుతో అప్పుల ఊబిలోకి.. గత తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఆరకొర మాఫీతో రైతులను మోసగించడంతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. దీంతో వ్యవసాయ రుణాల మొండిబకాయిలు పెరిగిపోయాయి. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు వైఎస్సార్ రైతుభరోసా క్రమం తప్పకుండా ఇవ్వడంతోపాటు రైతులకు అండగా నిలబడే పలు కార్యక్రమాలు చేపట్టింది. ఫలితంగా.. వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు 2019–20లో 3.57 శాతం నుంచి 2022–23 నాటికి 2.60 శాతానికి తగ్గిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ రాయితీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుద్ధరించి అమలుచేయడమే. అంతేకాక.. గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని కూడా చెల్లించింది. దీంతో రైతులు పంట రుణాలతో పాటు వ్యవసాయ టర్మ్ రుణాలను కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. దీనికితోడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి వ్యయం కోసం వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏడాదికి రూ.13,500లను ఇస్తోంది. అలాగే, పంట నష్టపోయిన రైతులకు ఒకపక్క ఉచిత పంటల బీమాను వర్తింపజేస్తూనే మరోపక్క ఇన్పుట్ సబ్సిడీనీ ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. దీంతో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. పెరిగిన వ్యవసాయ రుణాలు.. మరోపక్క.. రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో గత నాలుగేళ్లుగా వారికి వ్యవసాయ రుణాల మంజూరు కూడా పెరిగింది. సకాలంలో అప్పులు చెల్లించిన రైతులకు ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73,87,602 మంది రైతులకు సున్నావడ్డీ రాయితీని చెల్లించిందని, గత టీడీపీ ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అజెండాస్పష్టంచేసింది. ఇక ఇప్పటివరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ కింద రూ.1,834 కోట్లను చెల్లించింది. ఈ నేపథ్యంలో.. వ్యవసాయ రంగంలో రైతులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు కూడా వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటేటా పెంచుతున్నాయి. ఉదా.. 2019 మార్చి నాటికి మొత్తం వ్యవసాయ రుణాలు రూ.1,40,034 కోట్లు ఉంటే.. 2022–23 నాటికి అవి రూ.2,34,124 కోట్లకు పెరిగాయి. ఇలా వ్యవసాయానికి అవసరమైన రుణాల మంజూరును బ్యాంకులు పెంచుతుండగా మరోపక్క ఆ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయంటే ప్రభుత్వ జోక్యమే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్ఫెడ్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్ఫెడ్లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్లో పెట్టడం రిస్క్తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్ఫెడ్లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్వర్క్ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్వర్క్లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
అప్పులపై కేంద్రం క్లారిటీ సరిపోలేదా? ఎందుకీ బురద మాటలు: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కొందరు బురద చల్లుతున్నారంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ అప్పులు చేసింది. గతంలో వీరెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు?’’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘‘ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించకూడదనేదే వీరి కుట్ర. ఏపీకి మంచి జరగకూడదన్నదే వీరి ఆలోచన. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీ అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఉండటం లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఆర్థికశాఖ చెప్పిన సమాధానాన్ని కూడా వీరు నమ్మరు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపడ్డాయి. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరందరూ బాధపడిపోతున్నారు’’ అని మంత్రి ధ్వజమెత్తారు. చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..! ‘‘వెయ్యి కోట్ల అప్పు అంటూ ఐదు సార్లు రాస్తే 5 వేల కోట్లు అవుతుందా?. ఏపీ అప్పులపై కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు ప్రచురించరు?. రాష్ట్ర అప్పులపై కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులపై ఎప్పుడైనా మాట్లాడారా?. నేను సింహాన్ని అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు?’’ అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. -
బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
ఆంధ్రప్రదేశ్ లో అప్పులకు సంబంధించి పార్లమెంటులో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుగుదేశం హయాంలోనే అధిక అప్పులు చేశారని తేలింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో 1.77 లక్షల కోట్ల అప్పు చేస్తే, టిడిపి హయాంలో 2.64 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో ఇంతకాలం ఎప్పుడు వీలైతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై రుణాలు అంటూ విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియాలకు తలతిరిగింది. దాంతో ఎల్లో మీడియా ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడం కోసం మద్యం పై అప్పులు చేశారని అంటూ మరుసటి రోజే బానర్ కధనాలు రాసి ఆత్మ వంచన చేసుకున్నారు. క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆయుధంగా మారింది. తమ హయాంలో కన్నా టిడిపి ప్రభుత్వమే ఇష్టారీతిన అప్పులు చేసిందని వైఎస్ఆర్సీపీ విమర్శించడానికి ఆస్కారం ఏర్పడింది. టిడిపి హయాంలో అప్పులు 2.64 లక్షల కోట్లు అయితే, ఆ రుణాలు ఈ ప్రభుత్వ టైమ్ లో 4.42 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే దాని అర్ధం టిడిపి ప్రభుత్వమే అధికంగా అప్పులు చేసిందని గణాంకాలతో వెల్లడైంది. ఇంతకాలం ఎపికి పది లక్షల కోట్ల అప్పు అంటూ దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి వాటికే కాకుండా కొద్ది రోజుల క్రితం అప్పులపై విమర్శలు చేసిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా కేంద్రం సమాధానం ఇచ్చినట్లయింది. (చదవండి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి రోజా సెటైర్లు) ఆర్థిక మంత్రి చెప్పాక కూడా మరో తప్పుడు స్టోరీ నిర్మలా సీతారామన్ సమాధానంతో వైఎస్ఆర్సీపీ పని సులువు అయింది. ప్రతిపక్షం, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద వేస్తోందని గట్టిగా చెప్పగలుగుతోంది. అంతేకాదు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా తీసుకున్న అప్పుల గురించి కూడా నిర్మలా సీతారామన్ వివరించారు. వాటిని చూసినా అవేమీ భారీగా లేవని అర్ధం అవుతుంది. ఇవన్ని కలిపితే మరో నలభై వేల కోట్ల వరకు ఆమె వివరాలు ఇచ్చారు. దీంతో తాము ఇంతకాలం రాసిందంతా అసత్యమని ప్రజలకు తెలిసిపోయిందని కంగారు పడ్డ ఎల్లో మీడియా వెంటనే మరో స్టోరీని వండేసింది. ఈనాడు పత్రిక అయితే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఏభైవేల కోట్ల రుణం అని అడ్డగోలు వార్త రాసింది. ఇందులో ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేదేమి ఉంటుంది. మద్యం అమ్మకాలు లేకపోతే అది వేరే విషయం. గత టిడిపి ప్రభుత్వం ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అంతా అద్భుతంగా ఉందని ఈనాడు భావన. అదే జగన్ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించి , పన్నులు పెంచి, మద్య సేవన అలవాటు తగ్గించడానికి యత్నిస్తుంటే అది ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమని ఈనాడు ప్రచారం చేస్తోంది. పాదయాత్రలో వైఎస్ జగన్ ఏదో చెప్పారని రాస్తూ, మద్యపానంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నా అప్పులు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈనాడు వ్యాఖ్యానించింది. మరి మద్యం అమ్మడమెందుకు? మద్యపానం వల్ల అన్ని నష్టాలు ఉన్నాయని గుర్తించబట్టే జగన్ బెల్టు షాపులు లేకుండా చేశారు. ప్రభుత్వమే మద్యం రిటైల్ షాపులు నిర్వహించి, తక్కువ వ్యవధిలో అందుబాటులో ఉండేలా చేశారు. మద్య నిషేధంపై ఉద్యమం చేసిన ఇదే ఈనాడు పత్రిక చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు ఏమి రాసింది. అసలు వీరికి చిత్తశుద్ది ఉందా? ఉంటే వారు నడిపే హోటళ్లలో, ఫిల్మ్ సిటీలలో మద్యం ఎందుకు విక్రయిస్తున్నారు? చెప్పేటందుకే నీతులు అన్నట్లు రామోజీరావు వ్యవహరిస్తున్నారని పదే, పదే బట్టబయలు అవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి కోరిక ఏమిటంటే ఏ రూపంలోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్దిక వనరులు సమకూరకూడదన్నదే. రాష్ట్రం నాశనం అవ్వాలన్నది వారి దురుద్దేశం. మద్యాన్ని ఎత్తివేస్తే, అప్పుడు అక్రమ రవాణా అంటూ వార్తలు రాయవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతే ఆయా సంక్షేమ పథకాలకు నిధుల సమస్య రావాలన్నది వారి దురుద్దేశం. (చదవండి: టీడీపీ నేత జయసుబ్బారెడ్డిపై కేసు నమోదు) కనీసం జగన్ ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాలలోకి వివిధ సంక్షేమ స్కీముల డబ్బులను జమచేస్తోంది. దాని వల్ల అవినీతి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం అయినా శక్తికి మించి అప్పులు చేయవద్దని వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కాని జగన్ ప్రభుత్వంపై బురద వేసే లక్ష్యంతో వార్తలు ఇవ్వడం వల్లే సమస్యలు వస్తున్నాయి. అప్పుడు గొప్ప.. ఇప్పుడు ఘోరం చంద్రబాబు టైమ్ లో చేసిన లక్షల కోట్ల అప్పులతో ఏమి చేశారో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారైనా రాశాయా? పైగా అమరావతిలో బాండ్లు విడుదల చేస్తే ఏడువేల కోట్ల రూపాయల రుణం వచ్చిందని, అదంతా చంద్రబాబు ముఖం చూసే బాండ్లు కొన్నారని ఇవే మీడియా ప్రచారం చేసింది. అంటే అప్పుడు అప్పులు చేస్తే గొప్ప, ఇప్పుడు అప్పులు చేస్తే ఘోరం అని చెబుతున్నాయి. ఇంత దుర్మార్గంగా మీడియా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మరి మోదీ ప్రభుత్వం కోటిన్నర లక్షల కోట్ల వరకు దేశం అప్పును తీసుకువెళ్లింది. మరి వాటి గురించి రాయడానికి వీరు ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అప్పుల గురించి నోరెత్తితే ఒట్టు. అది రామోజీ మార్కు జర్నలిజంగా మారింది. చంద్రబాబు టైమ్ లో ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా కార్పొరేషన్ ల ద్వారా అప్పులు చేసినా వీరంతా ఆహా.. ఓహో అన్నారే కాని, ఎందుకు ఇలా చేస్తున్నావని అక్షరం ముక్క రాయలేదు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేశాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి రాజకీయ రాబందుల్లా మారి ఎపి ప్రజలను పీక్కు తినాలని చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘నాకు వేరే దారిలేదు’.. విషం తాగుతూ సెల్ఫీ వీడియో
హుబ్లీ(బెంగళూరు): గతంలో అప్పు అంటే భయపడేవాళ్లు. కానీ ప్రస్తుత సమాజంలో అప్పు తీసుకోవడం సర్వ సాధరాణమైపోయింది. మధ్య తరగతి నుంచి లక్షలు సంపాదించే ఐటీ నిపుణులు కూడా అప్పు తీసుకుంటున్నావారే. అయితే ఇలా అప్పు తీసుకుంటున్న వీరిలో కొంతమంది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు పెడుతూ ఇబ్బందులు పాలవుతుండగా, మరికొందరు ఆరోగ్యం కోసమో, లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అనంతరం చేసిన అప్పుకు వడ్డీతో కలిపి చెల్లించేందుకు నానాతంటాలు పడుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటూ నూరేళ్లు జీవితానికి మధ్యలో ఫుల్స్టాప్ పెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ విషం తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధార్వాడ చైతన్య నగరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... చైతన్య నగర లింగరాజ సిద్దప్పన్నవర (36) ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పునకు సంబంధించి రూ. 18 లక్షల వడ్డీని చెల్లించాడు. అప్పు తీరకపోగా ఇంటిని కుదువ పెట్టాలని సదరు వ్యక్తి వేధించాడని ఆ వీడియోలో ‘ఎంత కష్టపడిన అప్పు తీర్చలేకపోతన్న.. నాకు వేరే దారిలేదంటూ’ తన ఆవేదనతో చెబుతూ లింగరాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ధార్వాడ ఉపనగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి : 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు పరుగెడుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి రెండు నెలల ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో మూడో వంతు అప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి మొత్తం రూ.31,699 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.9,266 కోట్లు అప్పులే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు పంపిన నివేదికలో వెల్లడైంది. ఇక వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం ఖర్చయిపోయింది. ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ.28,171 కోట్లు అని ఈ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయం రూ.20,097 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 13.18% తొలి రెండు నెలల్లో సమకూరింది. అన్ని రకాల పన్నులు కలిపి రూ.20,097 కోట్లు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ కింద రూ.7,430 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ.4,802 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.2,683 కోట్లు, ఇతర పన్నుల నుంచి రూ.1,327 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం అంచనాల్లో 4 శాతం అంటే రూ. 891.47 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి రెండు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వచ్చాయి. అందులో పన్నుల్లో వాటా కింద రూ.1,494 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,438 కోట్లు వచ్చాయి. వడ్డీలకు రూ.3,200 కోట్లు ఖర్చుల విషయానికి వస్తే వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల రూపంలో సింహభాగం ఖర్చయ్యాయి. వేతనాలకు రూ.6,784 కోట్లు, పింఛన్లకు రూ.2,779 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.3,205 కోట్లు చెల్లించారు. సబ్సిడీల రూపంలో రూ.1,923 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.6,692 కోట్లు ఖర్చయ్యాయి. అన్ని రంగాల్లో కలిపి మూలధన వ్యయం కింద రూ.6,800 కోట్ల వరకు ఖర్చయ్యాయి. -
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ పోస్టు.. నిమిషాలకే ప్రభుత్వ టీచర్కు షాక్!
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్ అయ్యారు.చిత్రదుర్గ జిల్లాలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు సీఎం సిద్ధరామయ్యను, ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే క్యాప్షన్తో పోస్టు చేసిన తన ఫేస్బుక్ పోస్ట్లో వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను శాతమూర్తి ప్రస్తావించాడు. ‘మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ హయాంలో రూ.3,590 కోట్లు.. ధరమ్సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ 13,464 కోట్లు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ. 2,42,000 కోట్లు’ అని తన పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాక ఉచితాలు అధికంగా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుందంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా హయాం నుంచి శెట్టర్ వరకు రాష్ట్రం చేసిన రుణాలు రూ.71,331 కోట్లు కాగా.. కేవలం సిద్ధరామయ్య హయాంలోనే (2013-2018) అప్పులు రూ.2,42,000 కోట్లకు చేరాయని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాధికారి ఎల్ జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
అప్పుల్లేని ముఖ్యమంత్రి.. టాప్ 1లో నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన మంత్రి మండలి సభ్యుల ఆస్తుల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ అందరి కంటే అధిక ధనవంతుడిగా స్పష్టమవుతోంది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ ఆస్తులు స్వల్పంగా వృద్ధి చెందగా, రుణ భారం లేకపోవడం విశేషం. మంత్రి మండలిలో అత్యంత అల్ప ఆస్తిపరుడిగా గనులు – ఉక్కు శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడ ఆయన అందరి కంటే తక్కువ ఆస్తిపరుడుగా నిలిచారు. నవీన్ మంత్రి మండలిలో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2022లో ముఖ్యమంత్రి ఆస్తుల వృద్ధి విలువ రూ.42,86,069 పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఆయన ఆస్తుల విలువ రూ.65,40,79,694 కాగా, అంతకుముందు సంవత్సరం ఆస్తుల విలువ రూ.64.97 కోట్లకు పరిమితమైంది. అధికారిక పోర్టల్లోని ప్రకటన ప్రకారం, వివిధ బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో డిపాజిట్లు మరియు వివిధ బాండ్ల పరంగా నవీన్ పొదుపు (నగదు) ఆస్తుల విలువ రూ.42,86,069లు పెరిగింది. ముఖ్యమంత్రి చరాస్తుల విలువ రూ.12.52 కోట్లు. వీటిలో న్యూఢిల్లీ, భువనేశ్వర్, హింజిలికట్, బర్గడ్ బ్యాంకు ఖాతాల్లో నగదు, నగలు, నాలుగు చక్రాల వాహనం ఇమిడి ఉన్నాయి. బంగారు ఆభరణాల విలువ రూ. 3.49 లక్షలు కాగా, 1980 మోడల్కు చెందిన పాత అంబాసిడర్ కారు విలువ రూ.6,434గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని జన్పథ్ శాఖ బ్యాంకులో రూ.70.11 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్ శాఖలో రూ.20.87 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రూ.52.88 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇవన్నీ అతని తల్లిదండ్రులు బిజు పట్నాయక్ మరియు జ్ఞాన్ పట్నాయక్ నుంచి సంక్రమించినవిగా పేర్కొన్నారు. ఈ స్థిరాస్తుల్లో భువనేశ్వర్లో నవీన్ నివాస్లో మూడింట రెండు వంతుల వాటా విలువ సుమారుగా రూ.9,52,46,190 కాగా, న్యూఢిల్లీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్–3లో ఉన్న ఆస్తిలో 50% వాటా విలువ దాదాపు రూ.43,36,18,000గా ప్రకటించారు. -
రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు: దువ్వూరి కృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమెయిన్లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం. రుణాలు.. నాడు–నేడు: రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్ డెట్)తో.. పబ్లిక్ ఎక్కౌంట్ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో: విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో: ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు: ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. గ్యారెంటీ లేని రుణాలు: ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్ రంగంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. డిస్కమ్లు–బకాయిలు: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే: మొత్తం మీద పబ్లిక్ డెట్ టు పబ్లిక్ ఎక్కౌంట్ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్ మాత్రమే పెరిగింది. రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం: నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?. అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం. టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది: 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే.. (డెట్ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు: మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్ వ్యయం కాగా, పిల్లలను స్కూల్కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. పథకాలు–ప్రయోజనాలు: విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది. 👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 👉 కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం కోల్పోయాం: కోవిడ్ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అప్పటి కంటే తక్కువ ఫైన్లు: వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు. మూలధన వ్యయమూ ఎక్కువే: కాగ్ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండీచర్) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు.. -
కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు
ఈనాడు దినపత్రిక అసూయ, అక్కసు, అసహనం వంటి సమస్యలతో రగిలిపోతుంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతోందో ఏమో తెలియదు కానీ, నిత్యం అసత్యాల, అర్థం ,పర్థం లేని వార్తలతో పత్రికను నింపేస్తోంది. టీవీలలో గంటల కొద్ది తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది. వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని. ఏదో అయిపోతోందని అంటూ చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. ఎవరో ఒకరిని మేధావి అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారు కుహానా మేధావులో, నిజంగానో మేధావులో కానీ, ఈనాడు, తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఆ మధ్య ఒక మహిళా మేధావి అంటూ అప్పులపై మాట్లాడించారు. తాజాగా ఎవరో జీవీ రావు గారట.. ఆయనను పట్టుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారనిపిస్తుంది. వీరు నిజమైన మేధావులే అయితే, రాష్ట్రానికి ఎంత అప్పు ఉండాలి? ఎంత ఉంది? ఎందుకు పెరిగింది? కరోనా వంటి సంక్షోభాలలో అప్పులు చేయాలా? వద్దా? ప్రజలకు వివిధ స్కీముల ద్వారా డబ్బు ఇవ్వడం వల్ల జీఎస్డీపీ పెరిగే అవకాశం ఉందా? లేదా? నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ స్కీములపై ఏమి చెప్పారు. ప్రమాదకర పరిస్థితిలో అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. రుణాలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధి,విధానాలను అమలు చేస్తోంది. వాటిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఉదాహరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం మితిమీరి అప్పులు చేసిందని చెప్పి, ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదిహేడు వేల కోట్ల రుణంపై కోత విధించింది. గత ప్రభుత్వం సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పుడు కూడా బడ్జెట్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారు. అప్పుడేమో రాష్ట్రం సిరిసంపదలతో తులతూగినట్లు, ఇప్పుడేమో శ్రీలంక అయిపోయినట్లు ఈ కుహానా మేధావులు చిత్రీకరించే యత్నం చేయడం దారుణంగా ఉంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ మేధావులంతా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను రైతులకు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేస్తానని చెబితే ఆహా,ఓహో అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న సీనియారిటీతో అది సాధ్యమేనని టీవీలలో కూర్చుని మరీ వాదించేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక నాలుక మడతేసినా వీరు కూడా కిమ్మనలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ మహిళలకు ,రైతులకు డబ్బు పంచితే , ఇంకేముంది వీరంతా చంద్రబాబుకు ఓటు వేసేస్తారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు అని డబ్బా కొట్టారు. వీరికన్నా రైతులు, మహిళలకే ఎక్కువ విజ్ఞత ఉంది కనుక ఈ మేధావుల అసత్య ప్రచారాన్ని నమ్మలేదు. అయినా వారు మళ్లీ ఎన్నికల ముందు బయల్దేరినట్లుగా ఉంది. జీవీ రావు అనే మేధావి విశ్లేషించదలిస్తే, రెండు ప్రభుత్వాల తీరును పోల్చి మంచి సలహాలు ఇస్తే బాగుండేది. ఆయన అలా చేయలేదు. పైగా చిత్రమైన వాదన చేశారు. ప్రజల జేబుల్లో పది రూపాయలు పెట్టి, వారి నుంచి వంద రూపాయలు తీసుకుంటోందని ఈయన అన్నారని ఈనాడు రాసింది. ఆయన నిజంగానే అలా అని ఉంటే ఆర్దిక నిపుణుడు ఎలా అవుతారో అర్థం కాదు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజుకుంటే అసలు అప్పులు చేయవలసిన అవసరం ఏమి వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది కనీస ఇంగితం కాదా! ఉచితంగా ఇచ్చే మొత్తాలకన్నా అధికంగానే ప్రజల నుంచి తీసుకుంటోందని ఆయన చెప్పారట. అది ఏ రకంగానో వివరించాలి కదా? తెలుగుదేశం నేతల అర్థరహిత ప్రచారానికి ,ఈయన అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా? ఒక ప్రైవేటు సంస్థ అయిన మార్గదర్శి అక్రమంగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లను తీసుకుంది. అదంతా అప్పు గానే పరిగణించాలి కదా? గతంలో 1800 కోట్ల నష్టాలలో ఉన్నా డిపాజిట్ల సేకరణ ఆపలేదు కదా! మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాత కదా తన టీవీచానళ్లను అమ్మి దానినుంచి బయటపడింది. అయినా మరోరూపంలో డిపాజిట్లు తీసుకుంటే అదేమో పారదర్శకమట. ప్రభుత్వం అదేమిటని అడిగితే కక్ష అట. ఇలా మాట్లాడే మేధావులంతా ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి అమ్మో అప్పా? అంటూ గుండెలు బాదుకుంటూ నటిస్తుంటారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో ఈ రావుగారు పోల్చి మాట్లాడడం కూడా విడ్డూరమే. నిజంగానే ఏ రాష్ట్రం అయినా అలా సంక్షోభంలోకి వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?పోనీ ఈ ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం తప్పు అని ఈ మేధావి భావిస్తే, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత అధికంగా అమలు చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా! ఆయనను ఎందుకు విమర్శించడం లేదు. అంటే చంద్రబాబు 2019 నాటికి ప్రభుత్వంలో వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయినా, వీరి దృష్టిలో ఆయన మంచి ఆర్దికవేత, విజనరీ.ఇప్పుడు జగన్ కన్నా అధికంగా స్కీములు ఇస్తామని చెబుతుంటే అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ ల లా గా మారదట. ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరట. ఏపి వేరట. తెలంగాణ అప్పులపై ఈనాడు ఏనాడన్నా ఒక్క కథనాన్ని అయినా ఇచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు ఈనాడు రామోజీ అంత భయపడుతున్నారు. అదే టైమ్ లో ఏపీలో మాత్రం పనికట్టుకుని ఇలాంటి అప్పుల తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు. వెలుగు దినపత్రిక ఇచ్చిన ఒక కథనంలో తెలంగాణ ప్రభుత్వం 2.12 లక్షల కోట్ల అప్పును బడ్జెట్లో చూపకుండా చేసిందని తెలిపింది. ఈనాడులో ఎప్పుడైనా ఈ వార్తను ఇచ్చారా! గతంలో ఈనాడు రాసింది కనుక, తెలుగుదేశం ఆరోపించింది కనుక జి.వి.రావు అనే మేధావి కూడా ఏపిలో పది లక్షల కోట్ల అప్పు ఉందని చె్ప్పారని అర్థం అవుతూనే ఉంది. ఆయన దగ్గర అప్పులు సమాచారం ఉంటే ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఉండేవారు కదా? ఈనాడులో వచ్చిన వార్తలనే మళ్లీ తాను కూడా చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు? ఏదో ఈనాడులో మేధావిగానో,నిపుణుడుగానో ఉచిత ప్రచారం చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఇంటర్వ్యూ. 'గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేేస్తే అభివృద్ది కాదట. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పితే అది ప్రజలకు నష్టమట. స్కూళ్లకు వేల కోట్ల వ్యయం చేసి బాగు చేసి పేదలకు విద్యాబుద్దులు నేర్పడం మంచిది కాదట. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వరాదట... కేంద్రం నాలుగు లక్షల కోట్ల అప్పే ఏపీకి ఉందని చెప్పినా ఒప్పుకోరట. ఈనాడులో రాశారు కనుక మరో ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పాల్సిందేనట." ఆ మేధావి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆయనకు అభివృద్ది కనిపించలేదుగతంలో ఎప్పుడూ రోజువారి అప్పులు చేయలేదా? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది! అందుకూ ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు ఏడుపే. కేంద్రంలో కొందరు అదికారులు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అప్పుడు రాశారు. పోనీ ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయవద్దని రాస్తారా?అంటే అది రాయరు. ఇంకా అదనంగా ఇవ్వాలంటారు. వారికి కావల్సినప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాస్తారు. ఇప్పుడు కూడా ఈ మేధావి ఎవరో జీవీ రావు గారు కూడా పది రూపాయలు ఇచ్చి పంద రూపాయలు తీసుకుంటే , ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ఎందుకు వస్తాయో వివరించి ఉండాలి కదా? కేవలం తెలుగుదేశం కోసమో, ఈనాడు మీడియా కోసమో ఇలాంటి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సోకాల్డ్ మేధావులు అప్రతిష్టపాలు కాకుండా ఉంటే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ (చదవండి: మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం) -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 మార్చి 31 నాటికి తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,64,725 కోట్లే అని వెల్లడించారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు. “ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31 లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా, నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు. టీడీపీ నాయకులలో రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సరైన అవగాహన లేక నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దుష్ప్రచారాలతో రాష్ట్ర ప్రజలలో ఒక రకమైన గందగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని విఫల యత్నంచేస్తున్నారు. వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే. అప్పు పెరుగుదలని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు CAGR 19.02 % పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో (జూన్ 2019 నుంచి మార్చి 2023) కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37% పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే..ప్రజలను కాపాడుకోవడానికే. తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం. సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్ జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ చూస్తే 2022 - 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు లేవని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, యువత భవిష్యత్తు నాశనమైనా మాకేం పోదు, పేదవారు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మాకు సంబంధం లేదు, మాకు కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అసత్యాలతో, అనుకూల మీడియాతో భయాందోళనలోకి ప్రజలను నెట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ పన్నిన దుష్ట పన్నాగం కాక మరేమిటి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ని, ఓవర్ డ్రాఫ్ట్ (O.D) ని అప్పులలో కలిపి యనమల గారు కుతంత్రాలను జొప్పించి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న కుయుక్తే. భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు రోజు వారీ నగదు నిర్వహణకు గాను, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అనేవి తాత్కాలిక అప్పు మాత్రమే. ‘వేస్ అండ్ మీన్స్’ మరియు ‘ఓవర్ డ్రాఫ్ట్’ కింద మన రాష్ట్ర అప్పు సున్నా. టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ గా పొందడం వాస్తవం కాదా? అందులో రూ. 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా? అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకుంది. ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే తొలిసారి చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఉదాహరణకు కోవిడ్ పరిస్థితుల్లో పేద వాడిని కష్టాల నుండి కాపాడుకోవడం కోసం నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చూడడానికి విడ్డూరంగా ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్షాలలో (SDG) 13వ స్థానంలో ఉందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనే ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాదు. ఎక్కడ నుండి ఈ తప్పుడు సమాచారాన్ని కనిపెడతారో, కావాలనే ఈ కాకి లెక్కలు ఎలా సృష్టిస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాను. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21నాటికి ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబమన్న అసలు నిజం ప్రజలకు తెలియాలి. పైగా ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని నీతిఆయోగ్ గణాంకాలే తేల్చాయి. చంద్రబాబు నాయుడు గారు 2022-23 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే చాల వెనుకపడి ఉందంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ. 2,09,848/- ఉంటే మరీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ. 1,54,031/- ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నాయుడు పాతకకృత్యాలే. ఓటుకు నోటు కేసు , ఇబ్బడిముబ్బడిగా అప్పులు,వడ్డీలతో ఆర్ధిక విధ్వంసం. ఇవే ఏపీ వెనకబాటుతనానికి కారణం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి పోయి హైదరాబాద్ ని రాత్రి రాత్రికి తరలి వచ్చి విజయవాడలో చేరడం, టీడీపీ వాళ్ళు అవినీతి ఊబిలో కూరుకుపోయి చేసిన ఆర్థిక అనర్థాలేనని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE). భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,72,000/- (2022-23 AE). అంటే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో మెరుగ్గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి పైసా ప్రజలకు అవినీతి లేకుండా వారి ఖాతాలకు జమ అయింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద ,మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ 2,05,109 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న అనుకూల వర్గాల వారినే లబ్ధిదారులుగా ఎంచుకున్నారు. వారి లక్ష్యం స్వార్థపూరితం.. కావడం వల్ల అర్హత ఉన్నా కూడా ఫలాలు అందని పేద ప్రజలెందరో నాటి ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి కుల,మత, ప్రాంత,వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హతే ప్రామాణికం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డీ.బీ.టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు , చంద్ర బాబు నాయుడు గారి దుష్ప్రచారంలో చెప్పే లెక్కలు వేరు. పత్రికా ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధం. అప్పులు, వడ్డీలు, తలసరి ఆదాయం, SDG, DBT లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లెక్కలన్నీ పూర్తిగా కల్పితం. ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు స్వార్థంతో చేసిన కపట నాటకాలనడానికి.. పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ. అని మంత్రి బుగ్గన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే -
AP: 2021-22లో భారీగా తగ్గిన అప్పులు.. కాగ్ నివేదిక చెప్పింది ఇదే..
సాక్షి, అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన అకౌంట్స్ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు. మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. చదవండి: అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం -
బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. నిపుణుల పేరుతో అంతులేని అబద్ధాలు అచ్చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరా నిపుణులు? పేర్లు వెల్లడించే ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ లెక్కలను గణాంకాల సహితంగా వెల్లడిస్తోందని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నివేదికలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ఉన్నట్లు తప్పుడు గణాంకాలు ఎలా ప్రచురిస్తారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ రూ. 9.16 లక్షల కోట్లు అంటూ ఏ గణాంకాలు, ఆధారాలు ప్రకారం ఈనాడు కథనాలను ప్రచురించింది? వాటిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు? బడ్జెట్ లోపల అప్పులతో పాటు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కార్పొరేషన్ అప్పుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజెంటేషన్తో సవివరంగా తెలియచేసినా ఈనాడు ఊహాగానాలతో, నిపుణులు అంచనాల పేరుతో అవాస్తవ కథనాలను ఎలా ప్రచురిస్తుంది? రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవే తప్పుడు వార్తలను పథకం ప్రకారం పదేపదే ప్రచారం చేస్తోంది. ♦ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు రెట్టింపు అయినట్లుగా ఇప్పుడు అందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. రాష్ట్ర అప్పులపై టీడీపీ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరి్థక శాఖ ‘‘స్టేట్ ఫైనాన్సెస్– ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బడ్జెట్’’ అర్బీఐ నివేదికతో స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. ♦ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అప్పులు 62.78 శాతం మాత్రమే పెరిగాయి. అప్పులు రెట్టింపు కావాలంటే ఒక్క 2023–24లోనే రూ.1,01,150 కోట్ల మేర అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.5 శాతానికి సమానం. కేంద్ర నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత సర్కారు పాలనలో మాదిరిగా అప్పులు రెట్టింపు అయ్యేందుకు ఆస్కారమే లేదు. ♦చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇప్పటి మాదిరిగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకున్నా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు లేనప్పటికీ అప్పులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కోవిడ్తో ఆరి్థక ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా అధిగమించి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లను పేదలకు నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకుంది. ♦విభజన తర్వాత 2014 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2019 మే నాటికి రూ.2,71,797.56 కోట్లకు ఎగబాకాయి. టీడీపీ పాలనలో అప్పులు ఏకంగా 138.84 శాతం అంటే 2.38 రెట్లు పెరిగాయి. సగటున ఏటా అప్పుల్లో 19.02 శాతం వృద్ధి నమోదైంది. ♦వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,71,797.56 కోట్లుగా ఉన్న అప్పులు 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లలో అప్పుల్లో 62.78 శాతం వృద్ధి నమోదైంది. అంటే సగటున 13.55 శాతమే. ఇది టీడీపీ సర్కారు సగటు 19.02 శాతంతో పోలిస్తే తక్కువే. ♦గత సర్కారు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో ఓట్ల కోసం భారీగా అప్పులు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా 2019 ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పులు చేసింది. నాడు నోరు మెదపని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు విషం చిమ్ముతున్నాయి. వీటిని పట్టుకుని విషయంపై అవగాహన లేని పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ♦వాస్తవానికి టీడీపీ సర్కారు నిబంధనలకు మించి ఐదేళ్లలో రూ.48,128.70 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. దీనిపై ఈనాడు కలం కదల్లేదు ఎందుకో మరి? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో నిబంధనలకు లోబడి రూ.2,696.76 కోట్లు తక్కువ అప్పులు చేసినా, ఇంత మెరుగ్గా ద్రవ్య నిర్వహణ చేస్తున్నా ప్రశంసించకపోగా బురద చల్లడం ఏమిటి? ♦పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు పచ్చి అబద్ధాలను ప్రచురించింది. వీటికి ఆధారాలున్నాయా? మొత్తం పెండింగ్ బిల్లుల వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా? పెండింగ్ బిల్లులపై గత ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన అసెంబ్లీ వేదికగా ఆరి్థక మంత్రి స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సరికి పెండింగ్ బిల్లులు రూ.40,172 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.21,673 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. గత సర్కారు పెండింగ్ బిల్లుల గురించి ఒక్క ముక్క రాయకుండా తప్పుడు వార్తలు ఎందుకు? ఇదేనా ఈనాడు పాటించే జర్నలిజం, మీడియా విలువలు? ♦ రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు రాష్ట్ర అప్పులు ఎలా అవుతాయి? నాన్ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు అంటూ ఈనాడు ప్రచురించిన కథనం అవాస్తవం. ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రుణాలు ప్రభుత్వ అప్పుల కిందకు రావు. ఆమాత్రం కనీస అవగాహన లేకుండా కథనాలు ప్రచురించారు. ఉదాహరణకు ఎన్టీపీసీ తీసుకునే రుణాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కిందకు రావు. టీటీపీ హయాంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు రూ.55,108.94 కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు తీసుకుంటే వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? నాన్ గ్యారెంటీ రుణాలను కేంద్రం అప్పులుగా ఎప్పుడైనా చూపించిందా? ♦ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పుల్లో ఎక్కడా దాపరికం లేకుండా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం అసెంబ్లీకి వెల్లడించాం. 2021 డిసెంబర్ 31 నాటికి పూచీకత్తు రుణాలు రూ.1.17,730 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి వెల్లడించాం. 2022లో మరికొన్ని గ్యారెంటీ రుణాలు పెరిగినా రూ.1.27 లక్షల కోట్లకు మించదు. అలాంటిది రూ.1.78 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు ఏ ఆధారాలతో రాసింది? ♦ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే గ్యారెంటీ రుణాలున్నాయి. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం నిర్థారించిన మేరకే రాష్ట్ర అప్పులున్నాయి. కంపెనీల యాక్ట్ కింద ఆడిట్ లేకుండా లెక్కలను ఎవరైనా రిలీజ్ చేస్తారా? ఆడిట్ పూర్తయ్యాక వాటిని వెల్లడిస్తారు. ఈలోగా తమ ఇష్టానుసారంగా లెక్కలు గట్టి రాసుకుంటామనే ధోరణిలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ♦నిపుణుల అంచనాల పేరుతో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. నా బ్యాంకు ఖాతాల్లో ఎన్ని డబ్బులున్నాయో నిపుణులకు ఎలా తెలుస్తుంది? ఊహాగానాలతో, ఇష్టం వచి్చన అంకెలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
తెలంగాణాలో భారీగా పెరిగిన అప్పులు
-
తెలంగాణ భారీ అప్పులపై కేంద్రం ప్రకటన
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పూర్తి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్ధిక శాఖ. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన నాటికి అప్పు రూ. రూ. 75,577 కోట్లు. 2021-22 నాటికి అవి రూ. 2,83,452 కోట్లకు చేరాయి. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు.. రూ. 4,33,817.6 కోట్లు ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి చేసిన అప్పుగా పేర్కొంది కేంద్రం. సంవత్సరాల వారీగా తెలంగాణ అప్పులు 2014-15లో రూ. 8,121 కోట్లు 2015-16లో రూ. 15,515 కోట్లు 2016-17లో రూ. 30,319 కోట్లు 2017-18లో రూ. 22,658 కోట్లు 2018-19లో రూ. 23,091 కోట్లు 2019-20లో రూ. 30,577 కోట్లు 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు ఇవి కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,50,365.60 కోట్లు తీసుకున్నట్లు వివరాల్లో పేర్కొంది కేంద్రం. దాదాపు 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రూ. 1,30,365.60 కోట్లు. రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా.. రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్న కేంద్రం. వేర్ హౌస్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా.. రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా.. రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని నాబార్డ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ అసిస్టెన్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు?
ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాష్ట్రంపై విషం కక్కుతున్న ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ఎలా అబద్దాలు ఆడుతున్నాయో కేంద్ర ప్రభుత్వ సమాచారం వెల్లడి చేసింది. ఈ మూడున్నరేళ్లలో బహుశా ఈనాడు పత్రిక రాష్ట్ర అప్పులపై రాసినన్ని కథనాలు మరే రాష్ట్రంలోను, ఏ పత్రిక రాసి ఉండదు. ప్రజలలో ఏదో రకంగా అనుమానం క్రియేట్ చేయడానికి, రాష్ట్రం అప్పులపాలైపోయిందని ప్రచారం చేయడానికి ఈనాడు ఎంత నిస్సిగ్గుగా పనిచేసింది ఈ సమాచారం విశ్లేషిస్తే అర్థం అవుతుంది. ఇంతకాలం ఏమని రాశారు! రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల కోట్లు దాటిపోయిందని, ఇంకోసారి అది పది లక్షల కోట్లకు చేరిందని ఇలా తప్పుడు వార్తలు రాశారు. వీరికి తోడుగా టీడీపీ ఎంపీలు తరచుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రశ్నలు వేయడం, వారేమో వీరు ఆశించినంతగా భారీ అప్పులు ఉన్నట్లు చెప్పకపోవడం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్న వీరి ఆశ నిరాశ అవుతోంది. టీడీపీ నేతలకంటే ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు మరీ బాధగా ఉంటోంది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఉన్నవి, లేనివి కలిపి వండి మొదటి పేజీలలో ప్రచురిస్తున్నాయి. పెద్ద ఎత్తున టివీలలో ప్రసారం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అంతా 4.42 లక్షల కోట్ల రూపాయలని తెలిపింది. దాంతో నిరుత్సాహానికి గురైన ఈనాడు పత్రిక ఈ వార్తను లోపలి పేజీకే పరిమితం చేసింది. అదే నిజంగానే ఏ ఎనిమిది లక్షల కోట్లు అయి ఉంటే, అదే సమాచారం కేంద్రం ఇచ్చి ఉంటే, నానా రచ్చ చేస్తూ బానర్ కథనాలుగా ఇచ్చి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం దొరకలేదు. నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ విషయం మాత్రం టీడీపీ మీడియా వారు కప్పిపెడుతుంటారు. పోని పొరుగు రాష్ట్రాల అప్పుల గురించి, కేంద్రం అప్పు గురించి రాస్తారా అంటే అదేమీ చేయరు. వారంటే అంత భయం. కాని ఏపీకి వచ్చేసరికి ఎక్కడ లేనంతగా బురద చల్లుడులో బిజీగా ఉంటున్నారు. గతంలో పది లక్షల కోట్లు అని ప్రచారం చేశాం కదా.. కాని అది నాలుగున్నర లక్షల కోట్లే ఉందని, తప్పు రాశామని వివరణ కూడా ఇవ్వరు. ఏదో మొక్కుబడిగా వార్త ఇస్తారు. మరో సంగతి ఏమిటంటే ఈ 4.2 లక్షల కోట్ల అప్పులో 2.64 లక్షల కోట్ల అప్పు గత తెలుగుదేశం ప్రభుత్వం పాలన ముగిసేనాటికి ఉంది. రాష్ట్ర విభజన జరిగేనాటికి ఏపీ అప్పు సుమారు లక్ష కోట్ల వరకు ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర రెట్ల మేర అప్పు చేసిందన్నమాట. ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా ఈనాడు మీడియా చెప్పదు. కాని జగన్ ప్రభుత్వం చాలా అప్పు చేసిందన్న భ్రమ కల్పించడానికి యత్నిస్తుంటుంది. కార్పొరేషన్లు ద్వారా, ఇతరత్రా బడ్జెట్తో సంబంధం లేకుండా వేల కోట్ల అప్పులు చేస్తున్నారని ఈనాడు కొంతకాలం గగ్గోలు పెట్టింది. అవి కూడా రాష్ట్ర బడ్జెట్ అప్పులగానే చూస్తామని కేంద్రం చెప్పింది. దాంతో వీరికి సంతోషం కలిగింది. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అప్పులను పేద ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగించిందని లెక్కలు చెబుతున్నాయి. మరి టీడీపీ పాలనలో అంత అప్పు తెచ్చి ఏమి చేశారో చెప్పలేని దయనీయ పరిస్థితి. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. ఈ విషయాలు ప్రజలు మర్చిపోయారని వారి విశ్వాసం. చదవండి: ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్సీపీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పుట్టకుండా పోతాయని టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు భావించాయి. కాని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం వీరికి జీర్ణం కావడం లేదు. అందువల్లే కొద్ది రోజుల క్రితం కూడా ఈనాడు పత్రిక రాష్ట్రం అప్పులు అంటూ మొదటి పేజీలో వార్త ఇచ్చింది. కాని ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సమాచారాన్ని మాత్రం లోపలిపేజీలోనే ప్రచురించింది. అప్పుల గురించి వార్తా కథనాలు ఇవ్వదలిస్తే, గత ప్రభుత్వం ఎలా అప్పులు చేసింది.. ఈ ప్రభుత్వం ఎలా తీసుకు వచ్చింది. అప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి. మధ్యలో కరోనా వంటి సంక్షోభాలు మొదలైనవాటిని విశ్లేషించాలి. కాని అప్పట్లో విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అందువల్ల అప్పులు చేయక గత్యంతరం లేకుండా పోయిందని టీడీపీ పాలన టైమ్లో సమర్ధించారు. ప్రస్తుతం మాత్రం అప్పులు చేయడానికి వీలు లేదన్నట్లుగా వార్తలు రాస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడప్పుడు అయినా టీడీపీ మీడియా వాస్తవాలు ప్రచారం చేస్తే వారికే మంచిది. లేకుంటే ప్రజలువారిని అసలు నమ్మరు. -హితైషి -
పరారీలో ఫిజియోథెరపిస్ట్.. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ!
సాక్షి, అనంతపురం: అప్పులు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఫిజియోథెరపిస్ట్ పరారైన ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్లో ఫిజియోథెరపిస్ట్ రఘువీరప్రసాద్ ఫిజియోథెరపీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తనవద్దకు ఫిజియో థెరపీ కోసం వచ్చే వారితో పాటు స్నేహితులు, సన్నిహితుల నుంచి అప్పులు తీసుకున్నాడు. మంచివాడని, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ డబ్బు ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యంతో అందరూ ధర్మ వడ్డీకి ఇచ్చారు. అలా రూ.3 కోట్ల వరకు అప్పులు చేసిన రఘువీర ప్రసాద్ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ తనవద్ద డబ్బులు లేవని, అప్పు చెల్లించే పరిస్థితిలో లేనని ఐపీ నోటీసులు పంపాడు. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు, తల్లితో కలిసి పరారయ్యాడు. ధర్మ వడ్డీ పేరుతో తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు నోటీసులు పంపితే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎగ్గొట్టే చర్యలకు పాల్పడుతున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) -
చెల్లింపుల వైఫల్యంలో జేపీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్) రుణ చెల్లింపుల్లో విఫలమైంది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 4,059 కోట్ల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. జేపీ అసోసియేట్స్ దాఖలు చేసిన వివరాల ప్రకారం డిసెంబర్ 31న రూ. 1,713 కోట్ల అసలు, రూ. 2,346 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. వివిధ బ్యాంకులకు చెందిన రుణాలున్నట్లు పేర్కొంది. 2018 సెప్టెంబర్లో జేఏఎల్కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. ఈ అంశం జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ వద్ద పెండింగ్లో ఉంది. ఇక పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గతేడాది(2022) సెప్టెంబర్లో జేఏఎల్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. సెప్టెంబర్ 15కల్లా రూ. 6,893 కోట్లు చెల్లింపుల్లో విఫలమైనట్లు ఫిర్యాదులో ఎస్బీఐ పేర్కొంది. కాగా.. 2022 డిసెంబర్లో జేఏఎల్సహా గ్రూప్లోని ఇతర కంపెనీలు మిగిలిన సిమెంట్ ఆస్తులను దాల్మియా భారత్కు విక్రయిస్తున్నట్లు వెల్లడించాయి. రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకున్నాయి. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఆర్టీసీకి 600 కోట్ల అప్పు కావాలి
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఆదాయం పెరుగుతున్నా.. మరోవైపు గుట్టలా పేరుకుపోయి ఉన్న పాత బకాయిలు తీర్చటం ఆర్టీసీకి పెద్ద సవాల్గా మారింది. వీటిని తీర్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సాయం లేకపోవటంతో అనివార్యంగా అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రూ.2270 కోట్ల బ్యాంకు అప్పులు పేరుకుపోయాయి. మళ్లీ కొన్ని ఇతర బకాయిలు తీర్చేందుకు మరోసారి అప్పు తీసుకోబోతోంది. తాజాగా రూ.600 కోట్ల అప్పుల కోసం రెండు బ్యాంకులతో ఆర్టీసీ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇందులో ఎంత అప్పు మంజూరవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మంజూరైతే కనుక ఆర్టీసీ అప్పులు దాదాపు మూడు వేల రూ.కోట్లకు చేరువవుతాయి. హైకోర్టు ఆదేశంతో.... ఆర్టీసీలో ఉద్యోగుల సహకార పరపతి సంఘా(సీసీఎస్)నిది ప్రత్యేక స్థానం. ఆర్టీసీ నిధులతో ఏమాత్రం సంబంధం లేని ఈ సంస్థ పూర్తిగా ఉద్యోగుల జీతాల నుంచి కేటాయించే మొత్తంతో నడుస్తుంది. వేల రూ.కోట్ల నిధులతో ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పరపతి సంఘాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే ఆ తర్వాత నష్టాలు, అప్పులతో కునారిల్లుతున్న ఆర్టీసీ ఆ నిధిని సొంతానికి వాడేసుకోవటంతో ఆ పరపతి సంఘం కాస్తా కొరగాకుండా పోయింది. ఇప్పుడు దానికి వడ్డీతో కలుపుకొంటే దాదాపు రూ.900 కోట్లను ఆర్టీసీ బకాయిపడింది. ఎన్నిసార్లు కోరినా ఆ మొత్తం ఇవ్వకపోవటంతో ఇటీవల ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మొత్తం బకాయిల్లో రూ.200 కోట్లను ఎనిమిది వారాల్లో చెల్లించాలని మధ్యంతర తీర్పు వెలువరించింది. ఇందులో తొలి వంద రూ.కోట్లు తొలి నాలుగు వారాల్లో చెల్లించాల్సి ఉండగా, తాజాగా ఆ గడువు పూర్తయింది. కానీ డబ్బు మాత్రం చెల్లించలేదు. త్వరలో ఈ కేసు మళ్లీ కోర్టు పరిశీలనకు రాబోతోంది. ఈలోపు డబ్బు చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కారం అవుతుంది. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీకి నెలకొంది. వేతన సవరణ బకాయిలు రూ.280కోట్లు మరోవైపు, 2015లో ప్రకటించిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తం ఇంకా చెల్లించలేదు. వాటికోసం చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ బకాయి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లించనున్నట్టు మంత్రులు పేర్కొన్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఉప ఎన్నిక అయిపోయినా ఆ బకాయి అలాగే ఉండటంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బకాయి మొత్తం రూ. 280 కోట్లు కూడా చెల్లించాలని సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికి సంబంధించి నిధులు ఆర్టీసీ వద్ద లేకపోవటంతో మరోసారి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త బస్సులకు అప్పులు ఇచ్చిన బ్యాంకులపైనే ఆశ ఇటీవలే కొత్త బస్సులు కొనేందుకు బ్యాంకుల సాయాన్ని తీసుకున్న ఆర్టీసీ మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుంది. ఓ ఏడాది క్రితం వరకు ఆర్టీసీకి అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు జంకే పరిస్థితి వచ్చింది. కానీ ఎండీ సజ్జనార్ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలతో ఆర్టీసీ ఆదాయం మెరుగుపడింది. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం సగటు రూ.14.50 కోట్లుగా ఉంటోంది. ఆర్టీసీ లాజిస్టిక్ ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఆర్టీసీపై బ్యాంకులకు మళ్లీ నమ్మకం పెరిగింది. కొత్త బస్సుల కోసం అడిగిన వెంటనే లోన్ ఇచ్చిన బ్యాంకులు ఈసారి కూడా సానుకూలతనే వ్యక్తం చేసినట్టు సమాచారం. -
Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో..
సాక్షి, ఢిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై ఓ స్పష్టత వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆరో స్థానంలో కర్ణాటక అప్పు రూ. 4,61,832 కోట్లతో నిలిచింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. ఏపీ అప్పుల పెరుగుదల 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. తెలంగాణ మాత్రం 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. -
అప్పుల పాలైన బిగ్బాస్ బ్యూటీ? ఆర్థిక పరిస్థితి బాలేదంటూ నటి ఆవేదన
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే బిగ్బాస్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ రియాలిటీ షో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డానంటోంది. చదవండి: ‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరీ? ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన ఆమె ఎనిమిదేళ్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యింది. ‘8 సంవత్సరాలుగా పీకల్లోతూ అప్పుల్లో కురుకపోయాను. కనీసం బిగ్బాస్ ఓటీటీ షోకి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు కూడా లేకుంటే. షో వేసుకునేందుకు కావాల్సిన దుస్తులను కూడా అప్పు చేసి కొన్నాను. అంత కష్టపడి బిగ్బాస్ హౌజ్లో అడుగుపెడితే కనీసం అవసరాలు తీర్చే డబ్బు కూడా రాలేదు. మొదటి వారంలోనే బయటకు వచ్చాను. దీంతో నా ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికీ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అంటూ ఆమె భావోద్యేగానికి లోనయ్యింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. -
కేసీఆర్కు నిర్మలా సీతారామన్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మునుపెన్నడూ లేని విధంగా మోదీ సర్కార్లో రూపాయి దారుణంగా పతనమైందని, అప్పులు.. ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్దేనని ఆమె ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారు. ఆ రాష్ట్రంలో ప్రతీ శిశువుపై రూ. 1.25 లక్షల అప్పు ఉంది. తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్ బద్నాం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు. పైగా నేనే ప్రధాని అంటూ కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతీ ఒక్కటి అమల్లోకి రావాలి. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది అంటూ ఆమె కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? -
బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవహారాల్లో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా పరిణమించాయి. అప్పట్లో బాబు ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక అవసరాలకు అడ్డు పడుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోకుండా చివరి మూడేళ్లు ఆ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు తెచ్చింది. అప్పట్లో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు, ఆయన తానా అంటే తందానా అనే దుష్ట చతుష్టయం అప్పులపై గగ్గోలు పెడుతున్నాయి. వీరి వ్యవహారంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చిన అనుమతికి మించి అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి ఏకంగా రూ.17,932.94 కోట్లు ఎక్కువగా అప్పు చేసింది. బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదని 14వ ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ 3 శాతానికి లోపు అప్పులను పరిమితం చేయలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.95 శాతం నుంచి 4.52 శాతం వరకు ఎక్కువగా అప్పులు చేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పరిమితికి మించి ఏకంగా రూ.8,204.13 కోట్లు అప్పు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనేక సమయాల్లో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని చెప్పడం కూడా అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సర్దుబాటు చేస్తామని, ఆ మేర ఇప్పుడు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అప్పులను తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనల మేరకు, అనుమతి మేరకు తీసుకోవాల్సిన అప్పుల్లో కోతపడుతోంది. దీని ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. బాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులను ఇప్పటి అప్పుల్లో మినహాయిస్తే బడ్జెట్ వ్యయానికి కూడా నిధులు తగ్గిపోతాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన అప్పులను 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధిలోనే క్రమబద్ధీకరించాలని, 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.5 శాతం మేర అప్పులు చేయడానికి అనుమతి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు సర్కారు చేసిన అధిక అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారాయి. -
ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది: విజయసాయిరెడ్డి
-
మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్ జగన్ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రం సీఎం జగన్ లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. సెస్, సర్ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. 2014-19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయి. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేతలది తప్పుడు ప్రచారం: మిథున్ రెడ్డి జాతీయ రహదారుల విషయంలో ఏ రాష్ట్రానికి రాని నిధులు ఏపీకి వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు, వాలంటరీ వ్యవస్త ను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నాం. అయినా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి పేర్కొన్నారు. -
దురుద్దేశంతోనే రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం: మంత్రి బుగ్గన
న్యూఢిల్లీ: ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే.. అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే అడిగినట్టుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పులు ఎక్కువగా చేశారని గుర్తు చేశారు మంత్రి. అనవసర అప్పులు ఆ కాలంలోనే ఎక్కువగా జరిగాయన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో అప్పులు చేశాము. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంతో పోల్చితే మేము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ. కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు, తమిళనాడులో రూ.1 లక్ష కోట్ల అప్పు పెరిగింది. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఏపీ అప్పుల తీరు చాలా తక్కువ. స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? నిజానికి మా హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువే. ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగింది. ద్రవ్యలోటు 2014లో 3.95% ఉంటే, 2021-22లో 3% కి తగ్గించాము. పొరుగు రాష్ట్రాలు 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు కలిగి ఉన్నాయి. ఒక్క ఏపీ మాత్రమే అప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. యావద్దేశ అప్పు శాతం పెరిగింది. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇలా జరిగింది.’ అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఇదీ చదవండి: మంత్రి బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? -
పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు
-
తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్లు.. తమిళనాడు టాప్
సాక్షి, న్యూఢిల్లీ: ‘స్టేట్ ఫైనాన్స్లు: 2021–22 బడ్జెట్ల అధ్యయనం’పేరుతో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో బీజేపీ ఎంపీ కిషన్కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు. తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ) ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ల నుంచి అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ రకమైన రుణాల ద్వారా రాష్ట్రాల ఎన్బీసీని దాటడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాల లెక్కలను నిర్ణయించి రాష్ట్రాలకు తెలియచేశామన్నారు. విచ్చలవిడి అప్పులతో రాష్ట్రం దివాలా: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: విచ్చలవిడి అప్పులతో తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థికంగా సర్వనాశనం చేశారని దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్ల ఎనిమిదేళ్లలో తలసరి అప్పు ఐదు రెట్లు పెరిగిందని దుయ్యబట్టారు. ‘తెలంగాణ ఏర్పడే నాటికి 2014 జూన్లో రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు. అది 2018 నాటికి 1.60 లక్షల కోట్లు, 2019 నాటికి రూ.1.90 లక్షల కోట్లు, 2020 నాటికి రూ.2.25 లక్షల కోట్లు, 2021 మార్చి నాటికి రూ.2.67 లక్షల కోట్లు ఉంటే 2022 మార్చి నాటికి అప్పు రూ.3.12 లక్షల కోట్లకు చేరింది’ అని వెల్లడించారు. సహేతుకం కాని ప్రాజెక్టుల పేరిట అప్పులు చేసి, ప్రజలను తాకట్టుపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఘాటైన విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్సభలో రాష్ట్రాల అప్పులపై తానడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తలసరి అప్పు పెరిగింది.. తెలంగాణ ఏర్పడేనాటికి తలసరి అప్పు రూ.18,157గా ఉంటే అది ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ. 82,155కు చేరిందని ఉత్తమ్కుమార్ అన్నారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా సేకరించిన రుణాలనూ పరిగణనలోకి తీసుకుంటే, తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4 లక్షల కోట్లకు ఉన్నాయని, తలసరి అప్పు రూ.లక్షకు పైగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణాలను సైతం ఆదాయంగా చూపుతోందని కాగ్ చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలను, ఆర్బీఐని, రుణ సంస్థలను మోసం చేశారని దుయ్యబట్టారు. -
ఎక్కువ అప్పులు చేశారంటూ జగన్ సర్కార్పై ఎల్లో మీడియా విషం
-
ఏపీ సర్కార్పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు
సాక్షి, ఢిల్లీ: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్.. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రం బెంగాల్. రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్. జనాభా తక్కువ ఉన్న కేరళ అప్పులు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, అప్పుల్లో తమిళనాడు నంబర్వన్గా ఉంది. చదవండి: మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్ తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా.. రెండు, మూడు స్థానాల్లో యూపీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. బీజేపీ పాలిత యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, బీజేపీ పాలిత గుజరాత్ అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. తృణమూల్ అధికారంలో ఉన్న బెంగాల్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేశారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు అస్సాం: 1,07,719 లక్షల కోట్లు బీహార్: 2,46,413 లక్షల కోట్లు చత్తీస్గఢ్: 1,14,200 లక్షల కోట్లు గోవా: 28,509 వేలకోట్లు గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు హర్యానా: 2,79,022 లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు కేరళ: 3,35,989 లక్షల కోట్లు మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు మణిపూర్: 13,510 వేల కోట్లు మేఘాలయ: 15,125 వేల కోట్లు మిజోరాం: 11,830 వేల కోట్లు నాగాలాండ్: 15,125 వేల కోట్లు ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు సిక్కిం: 11,285 వేల కోట్లు తమిళనాడు: 6.59 లక్షల కోట్లు తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు త్రిపుర: 23,624 వేల కోట్లు ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు -
బాబు చేసిన పాపాలు
చంద్రబాబు సర్కారు 2016–17, 2017–18లో 7.6 శాతం.. 2018–19లో ఏకంగా 8.3 శాతం వడ్డీతో మార్కెట్ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7.2%, 2020–21లో 6.5% వడ్డీతో మాత్రమే మార్కెట్ రుణాలు తీసుకుంది. క్రమంగా అప్పులు కూడా తగ్గిస్తోంది. – ఆర్బీఐ నివేదిక సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసినట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) నిబంధనలను పాటించలేదని కుండబద్దలు కొట్టింది. 2014–15 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ, అప్పులు, అప్పులపై వడ్డీలు, వ్యయాల తీరు తెన్నులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు ఎక్కువ అప్పులు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ఈనాడు, టీడీపీ బృందానికి.. బాబు గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణపై ఆర్బీఐ వెల్లడించిన అధ్యయన నివేదిక కనిపించడం లేదు. ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం మార్కెట్ అప్పులను ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. స్టేట్ డెవలప్మెంట్ రుణాల కింద మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న అప్పులకు సాధారణం కన్నా 45 బేసెస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ పడినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటి ప్రభుత్వం క్రమంగా అప్పులను కూడా తగ్గిస్తోందని తెలిపింది. 2020–21 బడ్జెట్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.5 శాతం ఉంటాయని అంచనా వేయగా, వాస్తవానికి సవరించిన అంచనాల్లో అవి 32.5 శాతానికే పరిమితం అయినట్లు వెల్లడించింది. ఆ అప్పులు కూడా తక్కువ వడ్డీకే తెచ్చిందని తెలిపింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు ద్రవ్యలోటు 4 శాతం పైగానే ఉందని.. ఒక ఏడాది ఏకంగా 6 శాతానికి చేరిందని తెలిపే ఆర్బీఐ నివేదికలోని ఓ భాగం బాబు జమానాలో ఎఫ్ఆర్బీఎంను మించి అప్పులు బాబు హయాంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం అప్పట్లో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరపతి దిగజారినప్పుడే ఎక్కువ వడ్డీలకు గానీ అప్పులు పుట్టవని ఆర్బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మరో పక్క 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం కూడా ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) నిబంధనలను పాటించలేదని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు మూడు శాతం దాటకూడదని, అయితే బాబు ఐదేళ్ల పాలనలో ఒక ఏడాది ఏకంగా ఆరు శాతం, మిగతా నాలుగేళ్లు నాలుగు శాతంపైనే ఉందని నివేదిక వెల్లడిచింది. వీటన్నింటి వల్ల ఆర్థిక సూచికల ర్యాంకులో రాష్ట్రం దిగజారినట్లు నివేదిక స్పష్టం చేసింది. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
AP: అప్పులపై తప్పుడు రాతలు.. దువ్వూరి కృష్ణ క్లారిటీ
సాక్షి, అమరావతి: కేంద్ర నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో రాలేదన్నారు. చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని దువ్వూరి కృష్ణ తెలిపారు. -
లక్షల కోట్లకు లెక్క చెప్పని బాబు
-
విషాదం: పైసా పైసా కూడబెట్టి.. కలల గూడు కట్టుకుంటే..
సాక్షి, మంచిర్యాల క్రైం: పైసా పైసా కూడబెట్టి, బ్యాంకులో అప్పు చేసి కలల గూడు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు వరద నీరు ఇంటిని ముంచెత్తింది. ముంపు నష్టాన్ని తట్టుకోలేక మహిళ ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాలలో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన సిద్ది వీరయ్య, జమున(55) దంపతులు మంచిర్యాల మార్కెట్లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు సురేష్ రబ్బర్ స్టాంపులు తయారు చేస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. మిగతా ఇద్దరు కుమారులు నవీన్, జగదీష్ మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. సొంతిల్లు లేకపోవడంతో ఏడాది కిందట ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు బ్యాంకులో రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. ఇంటికి ఇంకా చిన్నచిన్న పనులు చేయించాల్సి ఉన్నా.. 15రోజుల కిందట గృహ ప్రవేశం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు వెయ్యి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమైంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య ను పెద్ద కుమారుడు సురేష్ వరదలకు ముందే హైదరాబాద్కు తీసుకెళ్లాడు. వరదలు ఇంటిని ముంచెత్తడంతో జమునను ఒక స్నేహితుని ఇంట్లో ఉంచి, నవీన్, జగదీష్లు మరో స్నేహితుని ఇంట్లో తలదాచుకున్నారు. అప్పటివరకు ఒకేచోట ఉన్న కుటుంబం చెల్లాచెదురైంది. కొత్త ఇల్లు కట్టుకున్నామనే ఆనందం వరదలతో ఆవిరైంది. ఓ వైపు బ్యాంకు రుణం, రూ.4 లక్షల విలువైన ఇల్లు వరదలో పాడైపోవడం, వీటన్నింటికి తోడు భర్త అనారోగ్యంతో జమున మనస్తాపం చెందింది. ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అంజన్న తెలిపారు. -
ఏపీ అప్పులపై టీడీపీ & ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం బట్టబయలు చేసిన కాగ్ నివేదిక
-
అప్పు తీర్చే మార్గం కనిపించడంలేదు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!
జోగిపేట(అందోల్): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధి కంసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు. రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది కన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. – రాజు, మేనేజర్ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్ -
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్
Kamal Haasan Says He Will Repay All Loans Vikram Earns 300 Cr Worldwide: సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్బ్లస్టర్ హిట్గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్తోపాటు విజయ్సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో జరిగిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు కావాలి. గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్ బాక్సాఫీస్ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్ల సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ పేర్కొన్నాడు. చదవండి:👇 ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. -
ఆన్లైన్లో దానికి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు..
సాక్షి, చెన్నై: ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఓ వివాహిత అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడింది. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ బారిన పడి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. ఇందులో అత్యధిక శాతం మంది పురుషులే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ రమ్మీకి బానిసై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అప్పు చేసి మరీ.. చెన్నై తిరువొత్తియూరు మనలి పుదునగర్ చెందిన భాగ్యరాజ్ కందన్ చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మెగ్రటిక్ (3), నోబల్ గ్రిస్(01) అనే పిల్లలున్నారు. ఏడాది కాలంగా భవాని ఆన్లైన్ రమ్మీకి ఆకర్షితురాలైంది. దీంతో భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న నగదును బ్యాంక్లో జమ చేసి ఆ గేమ్లో మునిగింది. ఇంట్లో ఉన్న 20 సవర్ల నగలను విక్రయించి మరీ గేమ్ ఆడింది. చివరకు తన చెల్లెలు భారతి, కవిత వద్ద నుంచి రూ.3 లక్షల మేరకు అత్యవసరం పేరిట డబ్బు తీసుకుని రమ్మీపై దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం భాగ్యరాజ్ దృష్టికి చేరింది. ఆయన మందలించినా ఫలితం శూన్యం. రెండు రోజులుగా తన సోదరికి ఫోన్ చేసి కొందరి వద్ద తాను అప్పలు చేసినట్టుగా భవాని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తన గదిలో భవాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో పోలీసు లు రంగంలోకి దిగి విచారించారు. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఏడాది కాలంలో రూ. 20 లక్షల మేర కు నగదు జమ కావడం, ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీకి వాడి ఉండటం వెలుగు చూసింది. చదవండి: Amnesia Pub Case: రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి -
అభివృద్ధి పనులంటేనే హడల్!
కూలి పనికి వెళ్తున్న సర్పంచ్ ఈమె పేరు బానోతు బుజ్జి ఖాసీం నాయక్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా సర్పంచ్. గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ప్రహరీ నిర్మాణం, ఇతరత్రా పనులకు రూ.18 లక్షలు వెచ్చించారు. పూర్తయి ఏడాదైనా బిల్లులు రాలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఆమె కూలి పనులకు వెళ్తోంది. ►నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి గతంలో ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.1.35 లక్షలు వచ్చేవి. కానీ ఇప్పుడవి రూ.89 వేలకు తగ్గిపోయాయి. ఇందులో రూ.25 వేలు కరెంటు బిల్లు, రూ.25 వేలు కార్మికుల వేతనాలు, రూ.10 వేలు ట్రాక్టర్ ఈఎంఐ, రూ.10 వేలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు పోతోంది. ఇవి కాకుండా పేపరు బిల్లులు, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతే మరమ్మతులు చేయించడం, పైపు లైన్లు పగిలితే వేయించడం, పల్లె వనాలు, పంచాయతీ స్థలాలకు ఫెన్సింగ్ వేయించడం, డ్రైనేజీల నిర్వహణ పనులు కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ►చాలా గ్రామాల్లో సర్పంచ్లే ముందస్తుగా వైకుంఠధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, డంపింగ్ యార్డులు, వాటిల్లో సెగ్రిగేషన్ (చెత్తను విభజించే) షెడ్లు నిర్మించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) మెటీరియల్ కాంపోనెంట్ కింద వీటికి నిధులు రావలసి ఉంది. కానీ రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలా ఒక్కో గ్రామంలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీల్లో నెలవారీ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదు. దీంతో సర్పంచ్లు అప్పులు చేసి అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి వస్తోంది. రెగ్యులర్గా రావాల్సిన నిధులు సకాలంలో రాకపోగా, అదనంగా వెచ్చించినవి నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు పెండింగ్లో పెట్టడంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డు వంటి నిర్మాణాలు ఏడాది, రెండేళ్ల కిందటే పూర్తయినా బిల్లులు రాలేదు. ఆరు నెలలుగా పైసా విడుదల కాలేదు. ఇవే రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్లు రావాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన సర్పంచ్లు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్నారు. ఈ కారణంతోనే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట సర్పంచ్ బండి ఎల్లయ్య ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది సర్పంచ్లు అప్పులు తీర్చేందుకు కూలి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తాము మళ్లీ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎక్కడ అప్పులు చేయాలని సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనుల కోసం మరోసారి అప్పు అంటేనే వారు హడలెత్తిపోతున్నారు. బిల్లులు విడుదల చేయమంటే బెదిరింపులు తాము చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని, లేదంటే పల్లె ప్రగతిలో పాల్గొనబోమని ఇటీవల స్పష్టం చేసిన సర్పంచ్లను అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాలకు చెందిన సర్పంచ్లను నిధులు రాలేదని బహిరంగంగా ఎలా విమర్శిస్తారని ఆ మండల ఎంపీడీఓలు బెదిరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను నోటీసు బోర్డు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదీ జిల్లాల్లో పరిస్థితి.. ►ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ.43 కోట్లకు పైగా బకాయిలున్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.49.82 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ట్రెజరీలో 200కు పైగా గ్రామపంచాయతీల చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు డబ్బులు రావాల్సి ఉంది. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.150 కోట్లకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా రావాల్సిన బిల్లులు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.98 కోట్లు పెండింగ్ ఉన్నాయి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఇతర పనులవి కోట్ల రూపాయల బిల్లులు ఐదారు నెలలుగా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ కావటం లేదు. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రావాల్సినవి రూ.62 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు రూ.95 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలకు రూ.60 కోట్లు, మెదక్ జిల్లాలో 445 గ్రామ పంచాయతీలకు రూ.40 కోట్లు రావాల్సి ఉంది. ►జనగామ జిల్లాలో రూ.3.10 కోట్లు పెండింగ్లో ఉండగా, ములుగు జిల్లాలో రూ.2 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.6 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.7 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. రూ.7 లక్షల అప్పు.. తీర్చలేక ఆత్మహత్యాయత్నం సీసీ రోడ్లు, శ్మశానవాటిక, పారిశుధ్య పనులకు రూ.11 లక్షలు ఖర్చు చేశా. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలే వచ్చాయి. రెండేళ్లుగా రూ.9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అందులో రూ.7 లక్షలు అప్పు చేసినవే. అవి చెల్లించలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశా. – బండి ఎల్లయ్య, సర్పంచ్, అవుసలికుంట, లింగాల మండలం, నాగర్కర్నూల్ జిల్లా వడ్డీలు పెరిగిపోతున్నాయి రూ.5 లక్షలు అప్పు చేసి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించా. పూర్తయి ఏడాది దాటింది. మరో రూ.4 లక్షలు ఇతర పనులు చేశా. రూ.9 లక్షలు రావాలి. ఆలస్యం అవుతుండటంతో వడ్డీలు పెరుగుతున్నాయి. –బానోత్ రాందాస్, చుంచుపల్లి మండలం ధన్బాధ్, భద్రాద్రి కొత్తగూడెం బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది రూ.18 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, రైతు వేదిక, స్మశానవాటిక నిర్మించా. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది అవుతోంది. –తోట సుజాత, నెన్నెల సర్పంచ్, మంచిర్యాల -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ.. రెండు బ్యాంకులు.. నడుమ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఉద్యోగుల్లో టెన్షన్కు దారితీసింది. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటామంటూ బ్యాంకు తాఖీదులు పంపుతోంది. ఇది చట్టపరంగా ఇబ్బందులు తెచ్చి పెడుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ సంగతి... ఆర్టీసీకి సంబంధించి స్టేట్ బ్యాంకులో ఖాతాలు ఉండేవి. ఉద్యోగుల జీతాల ఖాతాలు కూడా అదే బ్యాంకు శాఖల్లో ఉండేవి. ఆ ఖాతాల ఆధారంగా ఉద్యోగులకు బ్యాంకు రుణాలిచ్చింది. ప్రతినెలా ఈఎంఐలను ఆ ఖాతాల నుంచే బ్యాంకు మినహాయించుకుంటోంది. కొంతకాలంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారి జీతాలనూ చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో, బ్యాంకు నుంచి ఓవర్డ్రాఫ్టు తీసుకుని జీతాలు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. కానీ, ఆర్టీసీ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) స్థితికి చేరటంతో ఓడీ ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మరో బ్యాంకుతో సంప్రదింపులు జరిపారు. జీతాల ఖాతాలను తమ బ్యాంకులోకి మారిస్తే ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమని యూనియన్ బ్యాంకు ముందుకొచ్చింది. దీంతో ఇటీవల సిబ్బంది జీతాల ఖాతాలను యూనియన్ బ్యాంకులోకి మార్పించారు. ఇప్పుడు ఇదే స్టేట్ బ్యాంకు కోపానికి కారణమైంది. ప్రతినెలా కిస్తీల మొత్తాన్ని జీతం ఖాతా నుంచి మినహాయించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుణాలను తిరిగి చెల్లించమని స్టేట్ బ్యాంకు నోటీసులు పంపుతోంది. వ్యక్తిగత రుణం తీసుకున్న సమయంలో జీతాల ఖాతాలను స్టేట్బ్యాంకులోనే ఉంచుతామన్న విషయంలో ఆర్టీసీ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఖాతాలను మరో బ్యాంకుకి మార్చడంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ బ్యాంకు నోటీసులు జారీ చేస్తోంది. రుణాలు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దీంతో ఉద్యోగులు భయపడిపోయి డిపో మేనేజర్లను ఆశ్రయిస్తున్నారు. డిపో మేనేజర్లు ఏం చేయాలంటూ ఉన్నతాధికారులను అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అంశం ఆర్టీసీలో పెద్ద చర్చకు దారితీసింది. -
మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు
సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు): భార్యా పిల్లలతో హాయిగా జీవిస్తున్న వ్యాపారిని నష్టాలు చుట్టుముట్టాయి. అప్పులు కొండగా పేరుకుపోయాయి. బాకీ చెల్లించాలంటూ రుణదాతల నుంచి ఒత్తిడి తీవ్రమవడం, ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితిలో ఆ వ్యాపారి మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు నలుగురూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము తలదాచుకున్న లాడ్జీలో పురుగుమందు తాగారు. ప్రస్తుతం వ్యాపారి కుటుంబం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కొజ్జిలి పేటకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు(55) పప్పుధాన్యాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రాధారాణి (48), కుమార్తెలు భవాని (28), శ్రావణి (27) ఉన్నారు. భవాని మానసిక దివ్యాంగురాలు. శ్రావణి బీటెక్ పూర్తి చేసింది. కొన్ని సంవత్సరాలుగా పప్పుధాన్యాల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వరరావుకు సుమారు కోటి రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో వెంకటేశ్వరరావు అప్పులపాలయ్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడం, అప్పులు తీర్చే దారి కనిపించక కుటుంబంతో కలిసి నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చదవండి: (కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి) ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నలుగురు కలిసి ఈ నెల ఎనిమిదో తేదీన విజయవాడ వచ్చి బస్స్టేషన్ సమీపంలోని బాలాజీ డార్మెటరీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మనస్తాపం చెంది నలుగురూ చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుమందు తాగారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తాము చనిపోతున్నామని, తమ గురించి ఎవరూ వెతకవద్దని, తమను ఎవరూ కాపాడొద్దని మచిలీపట్నంలో ఉంటున్న మామయ్య దేవత శ్రీనివాస్ ఫోన్కు శ్రావణి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే శ్రీనివాస్ స్పందించి డార్మెటరీ యజమానికి ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. డార్మెటరీ సిబ్బంది వెంటనే వ్యాపారి ఉంటున్న గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా శ్రావణి తలుపు తీసి కింద పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వ్యాపారి కుటుంబ సభ్యులు నలుగురూ పురుగు మందు తాగినట్లు గుర్తించారు. ఆ గదిలో పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాల గురించి పోలీసులు శ్రావణిని అడిగి వివరాలు సేకరించారు. నలుగురినీ అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు ఆరోగ్యం విషమంగా, మిగిలిన ముగ్గురు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్) -
Sri Lanka Economic Crisis: బ్రోచేవారెవరురా!
అనుకున్నంతా అయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ సింహళ నూతన సంవత్సరాదికి ఒక రోజు ముందర అధికారికంగా చేతులెత్తేసింది. చేతిలో డబ్బులు లేవు గనక విదేశీ రుణాలను వెనక్కి చెల్లించడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఉన్న అరకొర విదేశీ మారకద్రవ్య నిల్వలు ముడి చమురు లాంటి అత్యవసరాల దిగుమతులకు అవసరం. అందుకనే అప్పులు తీర్చడం ఆపేస్తోందన్న మాట. దీంతో, కనివిని ఎరుగని ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అంతర్జాతీయ యవనికపై తమ కష్టనష్టాలను చెప్పుకున్నట్టూ, ఒప్పుకున్నట్టూ అయింది. ఈ కష్టాలను కడతేర్చేందుకు ప్రభుత్వం అహరహం శ్రమిస్తోందనీ, ప్రజలు వీధికెక్కి నిరసన తెలిపే ప్రతి నిమిషం దేశానికి మరిన్ని డాలర్ల నష్టం తెస్తుందనీ ఆ దేశ ప్రధాని మహిందా రాజపక్స చేసిన అభ్యర్థన బేలతనానికి పరాకాష్ఠ. దేశ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేస్తోందని ఆయన నమ్మబలుకుతున్నారు. కానీ, కష్టాల కడలి నుంచి ఈ ద్వీపదేశం బయటపడేదెట్లా? శ్రీలంక చరిత్రలోనే తొలిసారిగా 2020 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స కుటుంబీకులు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. ఎన్నడూ లేనంతటి బలమైన ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేపింది. ఆచరణలో మాత్రం దేశాధ్యక్షుడు గొటబయ, ఆయన అన్నయ్య ప్రధాని మహిందా, మంత్రులుగా కుటుంబ సభ్యులు – ఇలా రాజపక్స కుటుంబం దేశాన్ని సొంత జాగీరులా నడిపింది. అవినీతి, బంధుప్రీతి, ఇష్టారాజ్యపు ప్రభుత్వ ఆర్థిక విధానాలు – అన్నీ కలసి దేశానికి అశనిపాత మయ్యాయి. గమనిస్తే, కోవిడ్ తలెత్తినప్పటి నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగ జారుతూ వచ్చింది. ఆహార, ఇంధన కొరత సహా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో రుణాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి పక్కనపెట్టేయాల్సి వచ్చిందంటే, ఆర్థికంగా దేశం నిండా మునిగిందన్న మాట! ఆహారం, ఇంధనం, విద్యుత్ – ఇలా అన్నీ ఇప్పుడు కొరతే. అధ్యక్షుడు, మంత్రుల నివాసాలకు తప్ప దేశవాసులందరికీ కరెంట్ కష్టాలు, రేషన్ క్యూలు. గమనిస్తే, 2021–22లో శ్రీలంకలో వరి ఉత్పత్తి 13.9 శాతం మేర పడిపోయింది. గత అయిదేళ్ళలో ఎన్నడూ లేనంతగా దిగుమతులు హెచ్చాయి. ఇదీ స్వయంకృతమే. గొటబయ ప్రభుత్వం నిరుడు మే మొదట్లో సేంద్రియేతర ఎరువులు, ఆగ్రో– కెమికల్స్ దిగుమతిని నిషేధించింది. ఆరు నెలల పైచిలుకు తర్వాత నవంబర్ చివరలో నిషేధం ఎత్తేసింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుత ఆహార కొరతకు ఇదీ ఓ కారణమైంది. దక్షిణాసియా మిత్రదేశాలు భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల వైపు ద్వీపదేశం ఆశగా చూస్తున్నదందుకే. రెండు, మూడేళ్ళలో తిరిగి చెల్లించే పద్ధతిలో ఆహార ధాన్యాలను అప్పుగానైనా తీసుకోవాలన్న ప్రతిపాదనలు వస్తున్నదీ అందుకే. పొరుగుదేశం శ్రీలంకను ఆదుకొనేందుకు ఇప్పటికే భారత్ తన వంతుగా ముందుకొచ్చింది. గడచిన ఒక్క వారంలోనే 16 వేల ఎం.టీల బియ్యం అందించింది. అది ఏ మూలకు అన్నది వేరే చర్చ. శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే సూచించినట్టు, ఐఎంఎఫ్తో చర్చలు ముగిసి, అప్పుల ఊబి నుంచి ఆ దేశాన్ని బయటపడేసే పని ఆచరణలోకి వచ్చే వరకు భారత్ – జపాన్ – చైనా – దక్షిణ కొరియా – ఐరోపా సమాజాల కన్సార్టియమ్ సాయం తీసుకోవడం మేలు. ఇప్పటికే భారత, చైనాల నుంచి కొలంబో రుణాలు తీసుకుంది. అది చాలదు. ఈ జూలైలో కాలపరిమితి తీరే 100 కోట్ల డాలర్ల అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లతో సహా దాదాపు 400 కోట్ల డాలర్ల రుణాలను ఈ ఏడాదే కొలంబో తీర్చాల్సి ఉంది. అది వల్ల కాదని గ్రహించే, ఇప్పుడు హ్యాండ్సప్ అన్నది. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలను సైతం ఆపేసిన దేశంలో రానున్న రోజుల్లో ఆరోగ్య సంక్షోభం తలెత్తనుందని వార్త. కుటుంబ అవినీతి, అపసవ్య ప్రభుత్వ విధానాలు, అనేకానేక తప్పిదాలతో శ్రీలంక ఇలా వీధిన పడింది. నిజమే. ఆ పాత కథను పక్కనపెట్టి, నూతన ఉషోదయానికి బాటలు వేయడమే ఇప్పుడు ఎవరైనా తక్షణం చేయాల్సిన పని. ఆర్థికంగా దివాళా తీసినట్టు ప్రకటించినంత మాత్రాన శ్రీలంకలో సహజ వనరులు, మానవ వనరులు మృగ్యమయ్యాయని కాదు కదా! వాటి సవ్యమైన వినియోగంతో, దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే ఇప్పుడు కావాల్సింది. అనేక రంగాల్లో సత్తా ఉన్నా, చతికిలబడ్డ సాటి దేశాన్ని ఆదుకోవడమే అంతర్జాతీయ సమాజ కర్తవ్యం. అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకుంటామంటూ చైనా మంగళవారం పునరుద్ఘాటిం చింది. కానీ, రుణాల రీషెడ్యూలింగ్కి కొలంబో చేసిన అభ్యర్థనపై మాత్రం నోరు మెదపలేదు. ఇస్తా మని మాట ఇచ్చిన 250 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం పైనా పెదవి విప్పలేదు. పొరపాటునో, గ్రహపాటునో ఎప్పుడైనా సరే వీధినపడ్డ పొరుగు దేశాలను ఆదుకొనేందుకు నిర్దిష్ట పరస్పర సహకార విధాన రూపకల్పన అవసరం అనిపిస్తోంది. ఐఎంఎఫ్ లాంటి వేదికలే ఇప్పుడు శ్రీలంకకు మిగిలిన ఆశలు. గతంలో 16 సార్లు ఐఎంఎఫ్ సాయంతో బయటపడినా, ఈసారి అత్యంత కీలకం. ఎల్టీటీఈతో 30 ఏళ్ళ యుద్ధం నుంచి బయటకొచ్చినట్టే, తాజా ఆర్థిక సంక్షోభం నుంచీ తేరుకుంటా మని శ్రీలంక పెద్దలు చెబుతున్నారు కానీ, అది మాటలు చెప్పినంత సులభం కాదు. కఠోరమైన రాజకీయ, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ద్రవ్య స్వీయ క్రమశిక్షణతో పాటు అంతర్జాతీయ ఆపన్న హస్తాలూ తక్షణ అవసరమే. ప్రస్తుతం కొలంబోకు కావాల్సింది సానుభూతి కాదు... సహాయం! -
Sri Lanka Crisis: శ్రీ లంక సంచలన ప్రకటన
ఊహించిన స్థాయిలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. దేశం దాదాపుగా దివాళా తీసిందని సూత్రప్రాయంగా సంకేతాలు పంపింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టే పరిస్థితి ఎదురయ్యిందని మంగళవారం ఆ దేశ ఆర్థిక శాఖ ఒక ప్రకటన లో పేర్కొంది. తీసుకున్న అప్పులను సమయంలోగా చెల్లించలేని స్థితిలో ఉన్నాం(డిఫాల్ట్). సుమారు 51 బిలియన్ డాలర్ల అప్పులను కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టం చేసింది శ్రీ లంక ఆర్థిక శాఖ. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని తేల్చి చెప్పారు. కారణం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టే, అప్పులను కట్టలేమని లంక పేర్కొంది. అలాగే తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే.. దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా వసూలు చేసుకోవచ్చని, లేదంటే.. శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. ట్విస్ట్.. అయితే అప్పుల ఎగవేతపై శ్రీలంక ఆర్థిక శాఖ కాసేపటికే మరో ప్రకటన చేసింది. అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసుకున్నామని సెంట్రల్ బ్యాంక్ అధికారులు అంటున్నారు. మార్చి చివరినాటికి కేవలం $1.9 బిలియన్ల నిల్వలు ఉండగా, ఈ సంవత్సరం తన రుణ భారాన్ని తీర్చుకోవడానికి శ్రీలంకకు $7 బిలియన్లు అవసరమని అంచనాలు ఉన్నాయి. కడితే.. పెను సంక్షోభమే! ఇప్పుడున్న మిగులు విదేశీ నిధులతో.. అప్పులు గనుక కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అంటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలోనే అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో పయనిస్తోంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలకు సుదీర్ఘమైన విద్యుత్ కోతలతో పాటు తీవ్రమైన ఆహారం, ఇంధన కొరతలు విస్తృతమైన బాధలను తెచ్చిపెట్టాయి. సంబంధిత వార్త: తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
ముగ్గురు రైతులను మింగిన అప్పులు
గార్ల/భూపాలపల్లి రూరల్/నార్నూర్: పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు చివరికి ఆ రైతులనే కబళించాయి. పంటల దిగుబడి ఆశించిన మేర రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక మహబూబాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం పంచాయతీ వేదనాయక పురం గ్రామానికి చెందిన కుడితెట్టి ఉపేందర్(32) ఎకరంలో మిర్చితోట సాగు చేశాడు. రూ.1.50 లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. పూత కాత రాక మిర్చి పంట ఎండిపోయింది. సోమవారం ఉదయం తోటకు వెళ్లి కంటనీరు పెట్టుకొని అప్పులెలా తీర్చాలని మధనపడుతుండగా ఉపేందర్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు గార్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు న్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని కాసింపల్లికి చెందిన ఎల కంటి ఈశ్వరయ్య (45) తనకున్న మూడెక రాలలో మిర్చి సాగు చేశాడు. తామర పురుగు సోకడంతో దిగుబడి రాలేదు. పంటకు చేసిన రూ.4.50 లక్షలతోపాటు బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కుప్పలవడంతో మనస్తాపానికి గురై ఆదివారంరాత్రి తోటలోకి వెళ్లి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రమేశ్(40)తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి సరిగా రాలేదు. యాసంగిలో జొన్నపంట సాగు చేయగా, ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. పంటల సాగు కోసం రెండేళ్లలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. కూతురు పెళ్లికి ఎదగడం, వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో సోమవారం ఉదయం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్కు భార్య బిక్కుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. -
క్షణికావేశంలో వేటకొడవలితో భార్యపై దాడి చేసి.. ఆపై..
శివమొగ్గ(బెంగళూరు): లక్షల్లో పేరుకు పోయిన అప్పులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. శివమొగ్గ తాలూకా కుంచెనహళ్లి గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ (38), సుమిత్ర దంపతులు. లోకేశ్ పంటల కోసం సహకార బ్యాంకుతో పాటు ఇతరుల వద్ద రూ. లక్షల్లో అప్పులు తెచ్చాడు. పంట చేతికి రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దంపతులు తరచూ గొడవలు పడేవారు. శనివారం రాత్రి కూడా ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశంలో లోకేశ్ భార్యపై వేటకొడవలితో తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హోలీ వేడుకలు.. ఫ్రెండ్ భార్యపై రంగు చల్లిన దోస్త్.. ఇంతలో భర్త వచ్చి.. ) మరో ఘటనలో.. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. : శివమొగ్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానసిక రోగి రోడ్డుపై శవంగా పడి ఉన్న ఘటన సాగర నగరంలో చోటు చేసుకుంది. తాలూకాలోని గొరగద్దె గ్రామానికి చెందిన బంగారప్ప (35) ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. రాత్రి తల్లికి ఫోన్, పొద్దున్న వచ్చేసరికి..
సాక్షి, చెన్నై: భర్త చేసిన అప్పులు భార్యను మనోవేదనకు గురిచేసింది. అప్పులు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచుతుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకుంటే పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో వారిని హతమార్చి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన శీర్గాలిలో మంగళవారం వెలుగు చూసింది. మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని మూలనాయనూరుకు చెందిన కార్తిక్ (27) మూడేళ్ల క్రితం భారతి(21)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు కౌశిక్(3), కుమార్తె భవధరణి(1) ఉన్నారు. కంటైనర్ డ్రైవర్ అయిన కార్తిక్ తరచూ పుణె, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లేవాడు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అప్పులు క్రమంగా పెరగడంతో తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్లు తరచూ ఇంటి రావడంతో భారతి మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లి చిత్రకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి కట్ చేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పిల్లలు, భారతి ఉరికి వేలాడుతూ కనిపించడంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మంగళవారం వేకువజామున సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శీర్గాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుజరాత్కు వెళ్లిన కార్తిక్కు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దిగుబడి రాక దిగులుతో..
మల్హర్: వ్యవసాయా నికి చేసిన అప్పులు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుపల్లి గ్రామానికి చెందిన పోటు రమేష్ రెడ్డి (35) అనే రైతు ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సాగుకు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతునికి పాప, బాబు ఉన్నారు. -
సాగు రుణాలు రూ.లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది. ఇందులో పంట రుణాలను రూ. 67,863 కోట్లుగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళికను రూ. 1,66,384.90 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫోకస్ పేపర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునం దన్రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం వైకే రావు, ఎస్ఎల్బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొందరు, మరికొందరు నేరుగా పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలి: మంత్రి నిరంజన్రెడ్డి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రం గానికి రుణ పరపతి పెంచాలని బ్యాంకర్లను కోరారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని, నాబార్డు సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఈ పథకాల వల్ల తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోందన్నారు. అయితే సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని నిరంజన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతోపాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలన్నారు. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా... రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ స్టేట్ ఫోకస్ పేపర్లో వ్యవసాయం, ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్లో సాంకేతిక ఆవిష్కరణల వంటి అంశాలపై దృష్టిసారించినట్లు నాబార్డు తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి పాడిపరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలు అందించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని సూచించింది. ఒక జిల్లా–ఒక పంట పథకం కింద ఉద్యాన పంటల క్లస్టర్ ఆధారిత ఉత్పత్తిని ప్రోత్సహించాలని నాబార్డు భావిస్తోంది. 2024–25 నాటికి తొమ్మిది జిల్లాల్లో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ చేపట్టింది. దానికి అవసరమైన ఊతం ఇవ్వాలని నాబార్డు బ్యాంకర్లకు సూచించింది. కాగా, 2021–22లో వ్యవసాయ రుణాలు రూ. 83,368 కోట్లు ఉండగా 2022–23లో అవి రూ. లక్ష కోట్లు దాటనుండటం విశేషం. -
కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండక..
సాక్షి, హాలియా (నల్గొండ): అప్పుల బాధతో పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలంలోని వీర్లగడ్డతండాకు చెందిన దేపావత్ జబ్బర్నాయక్, లక్ష్మి దంపతుల మూడో సంతానం దేపావత్ లక్ష్మణ్(27) డిగ్రీ పూర్తిచేశాడు. జబ్బర్నాయక్కి పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉండటంతో లక్ష్మణ్ చదువు మానేసి తమకున్న ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టబడి కోసం సుమారు రూ.5 లక్షలు వరకు అప్పులు చేశాడు. చదవండి: (గేమ్స్, చాటింగ్.. తల్లిదండ్రులు మందలించడంతో..) కాలం కలిసిరాక.. పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక లక్ష్మణ్ మంగళవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మణ్ను గమనించిన అతడి తల్లి లక్ష్మి ఇరుగు పొరుగు వారి సహాయంతో నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. చదవండి: (మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..) -
ఎంత పనిచేశావ్.. వెంకట్రావ్..! నమ్మించి..
సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్ అడ్రస్ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) నాలుగు నెలలుగా విధులకు డుమ్మా మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకట్రావ్ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్ 23వ తేదీన రెండు రోజులు సీఎల్ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలను ఆదుకున్నాం: మంత్రి బుగ్గన
అమరావతి: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గినా, మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,130.19 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని తెలిపారు. పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నాం తప్ప పరిమితికి మించి కాదని చెప్పారు. చదువే పిల్లలకి అతి పెద్ద ఆస్తి అంటూ రూ.25,914.13 కోట్లు, అవ్వాతాతలకు ఇంటి ఇంటికి రూ.37,461.89 కోట్ల పెన్షన్లు పంపిణీ, అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత.. ఇలా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్నామన్నారు. అయితే అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. చదవండి: Lakshmi Parvathi-Nara Lokesh: లోకేశ్.. తాటతీస్తాం జాగ్రత్త!