
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 47,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా1,002 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,735 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,508 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 33 వేల 42 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,159యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి:Afghanistan: ‘అశ్రఫ్ ఘనీ డబ్బుతో పారిపోలేదు.. అది కట్టుకథ’
Comments
Please login to add a commentAdd a comment