28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్‌ | AP Assembly Budget Session to Start on February 24 and Budget on February 28 | Sakshi
Sakshi News home page

28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్‌

Published Sun, Feb 23 2025 6:00 AM | Last Updated on Sun, Feb 23 2025 6:12 AM

AP Assembly Budget Session to Start on February 24 and Budget on February 28

అదేరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

రేపు గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం 

సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్‌ను ఈ నెల 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్ట­నుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎం చంద్ర­బాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.

అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2025–26 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement