AP Assembly Sessions
-
ఏపీ అసెంబ్లీ: బెల్టు షాపులపై వాడీవేడి చర్చ.. బొత్స కౌంటర్
AP Assembly Sessions Updates..👉ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పలు అంశాలపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నేతలు. ఈరోజు సమావేశాల్లో భాగంగా మద్యం బెల్టు షాపులపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అంగీకరించారు.శాసన మండలి..మండలిలో మద్యం బెల్టు షాపులపై వాడి వేడి చర్చమద్యం బెల్టు షాపులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు ఆగ్రహం 👉ఎమ్మెల్సీ బొత్స కామెంట్స్..గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయిమరి ఈ పది నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదుగతంలో ఉన్న బ్రాండ్లే ఇప్పుడూ అమ్ముతున్నారుఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదు?సభలో మాట్లాడటానికి మాకు హక్కు లేదని మంత్రి అచ్చెన్న మాట్లాడటం సరికాదుఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారుమద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరు?.సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడారురాత్రి 9 నుంచి ఉదయం 10 వరకూ అమ్ముకోవడానికి వేలం పెట్టారు👉ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మద్యం బెల్టు షాపులు వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయిమద్యం అమ్మకాలు బెల్టు షాపులు వల్ల విపరీతంగా పెరిగాయిచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు 18 శాతం, బీర్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయిస్కూల్స్, కాలేజీల దగ్గర లోనే బెల్టు షాపులు పెట్టారుబెల్టు షాపులు పెడితే 5 లక్షలు జరిమానా అన్నారు.మరి ఎంత మందికి వేశారు?బెల్టు షాపులు పెడితే మద్యం షాపులు రద్దు చేస్తామన్నారు..ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారు?.👉ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్సీఎం చంద్రబాబు బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం అన్నారుఎంతమందికి బెల్టు తీశారు చెప్పండిమద్యం బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఐదు లక్షల ఫైన్ వేస్తామన్నారుఎన్ని బెల్టు షాపులకు ఐదు లక్షలు ఫైన్ వేశారుఎన్ని బెల్ట్ షాపులు మూయించారు 👉పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలలో ప్రభుత్వం ఉందిమద్యాన్ని నియంత్రించాలని ఆలోచన చేయడం లేదు -
బొత్స Vs అచ్చెన్న: ‘రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయలేదా?’
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదని ఘాటు విమర్శలు చేశారు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. రైతులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ అని తెలిపారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, బొత్స మాట్లాడుతూ..‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రతీ అంశానికి ఆవు కథ చెప్పడం అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమని మేం అడిగాం. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్లో మేం కోరాం. రైతుల పట్ల మాకు అంకితభావం ఉంది.గత ఐదేళ్లలో రైతులకు మేం చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించింది. రైతుకు, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్ని రైతు భరోసా కేంద్రంలో మేం అందుబాటులో ఉంచాం. కావాలంటే రికార్డులు చూసుకోండి. రైతుభరోసా కేంద్రాలకు ఈ ప్రభుత్వం తాళాలేసింది. గత ఐదేళ్లలో రైతులకు మేం ఏమీ చేయలేదని రివ్యూ చేసి నిరూపించండి.మేం మొత్తం 53 లక్షల మందికి రైతుభరోసా అందించాం. అంత మందికీ మీరు ఇస్తామన్నారు.. ఆ మాటకు కట్టుబడి ఉండండి. బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా రైతులకు సాయం చేయండి.. మేం కోరుకునేది కూడా అదే. రైతులకు మంచి జరగాలన్నదే మా డిమాండ్. రైతుకు ఇన్స్యూరెన్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వండి. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు?. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. అధికార పార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ ప్రశ్నకు సభనుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. -
మండలిలో లోకేష్ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. -
AP Assembly: పోలవరంపై చర్చ.. టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో పోలవరంపై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వాళ్ల(కూటమి నేతలు) గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? మాకు స్పష్టమైన సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నాం. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పోలవరం గురించి మాట్లాడాలంటే వైఎస్సార్సీపీనే మాట్లాడాలన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. -
Payyavula Keshav: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు బడ్జెట్
-
సంక్షేమం, అభివృద్ధి ఆ తరువాతే..!: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి. అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. -
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్కుమార్రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్రెడ్డి దుయ్యబట్టారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updatesమంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స ఆగ్రహం👉వీసీలను ఒకేసారి రాజీనామా చేయించారు👉బలవంతంగా చేయించకపోతే దాని మీద లోకేష్ విచారణ కు సిద్ధమా👉విచారణ జరిపిస్తే.. మేము నిరూపిస్తాం👉విచారణ వేయడానికి ఎందుకు భయ పడుతున్నారుశాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదుఏపీ శాసన మండలి:వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.👉రైతులను మోసం చేశారు👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు👉సాఫ్ట్వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలుప్రారంభమైన శాసన మండలి సమావేశాలు👉వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశంఅసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. -
‘రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా ’
తాడేపల్లి : ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా(RK Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు ఆర్ కే రోజా. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్ కే రోజా.. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్(YS Jagan) కే సాధ్యమన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఎదురుగా కూర్చొని ప్రశ్నించాలని రోజా సూచించారు. అసలు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీ(AP Assembly Sessions)లో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు ఆడించారు సూపర్ సిక్స్ తోపాటు 143 హామీలను చంద్రబాబు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా 2047 గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన సిండికేట్ అయి లిక్కర్ మీద రేట్లు పెంచారు.. జలగల్లాగ పీల్చుతున్నారు. విద్యత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. కానీ గవర్నర్ తో అసలు ఛార్జీలే పెంచలేదన్నట్టుగా మాట్లాడించారు. తల్లికివందనం కింద రూ.15 వేలు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల గురించి మాట్లాడటం లేదు.చంద్రబాబు, కరువు కవల పిల్లలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్నవాటినే తొలగించారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఏమీ లేకుండా పోయాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోనే తేల్చుకుంటాం . ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఏసీ పదవిని కూడా ఇవ్వలేదు. అంటే వారు చేసే అవినీతిని బయటకు రానీయకుండా చేసే కుట్ర చేశారు. టీవీ ఛానళ్లను కూడా అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వటం లేదు? , కూటమికి భజన చేసే ఛానళ్లకే అనుమతులు ఇస్తారా?, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు గ్రూపు-2 అభ్యర్థులు రోడ్డు మీద చెప్పులతో కొట్టుకున్నారు. ప్రజలతో కలిసే పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. మిర్చి రైతులను జగన్ కలిసేదాకా ప్రభుత్వం స్పందించలేదు. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొఙత డబ్బా కొట్టుకుంటున్నారు . అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం కూటమికే చెల్లింది’ అని రోజా ధ్వజమెత్తారు. -
మీడియాపై పక్షపాత ధోరణి సమంజసం కాదు: ఏపీయూడబ్యూజే
విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొన్ని పత్రికలు, చానెళ్లపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విదించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్యూజే) తప్పుబట్టింది. మీడియాపై ఆంక్షలు, పక్షపాత ధోరణి సరికాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ కవరేజీకి అందరికీ అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పీకర్, ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొంది. కొన్ని పత్రికలు, చానెళ్లను అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు అనుమతించకపోవడం సరికాదని తెలిపింది, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్యూజే పేర్కొంది.‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలుఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది. -
‘ ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయం?’
కాకినాడ: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Sessions)ల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యడం లేదు. ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమీలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలువిజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది. చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది! -
ప్రజా సమస్యలపై పోరాటం దిశగా వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మార్చి19 వరకు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Day-1 లైవ్ అప్డేట్స్అసెంబ్లీ రేపటికి వాయిదాగవర్నర్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయంమార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే: బొత్సఅసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం.సభలో రెండే పక్షాలు.. ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికారపక్షం.రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది. రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు.మరి ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి.కూటమి గ్యారెంటీ అంటేనే మోసం.అందుకే ప్రజల కష్టాలు చెప్పేందుకే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం.రైతుల కష్టాలు, సమస్యలపై పోరాడితే మాపై కేసులు పెడుతున్నారు.రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవు.ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూశాకే మా తదుపరి చర్య ఉంటుంది.ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం.మిర్చీకి వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుందిమ్యూజికల్ నైట్ లకు ఎన్నికల కోడ్ వర్తించదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా?: చంద్రశేఖర్అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర్ కామెంట్స్..కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ప్రతిపక్షం ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లే.అధికార మదంతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్న చేస్తున్నారు.అధికార పక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా?.మీరు చేసే దోపిడీని బయటపెడతామాని భయమా?.మా 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా?దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మీడియాపై నిషేధం విధించారు.41 ఓటింగ్ ఇచ్చారు ప్రజలు.. అంటే ప్రతిపక్షం అంటే ఇదేగా..6 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టుకున్నారు..ప్రజా పద్దుల కమిటీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పార్టీ వల్లే అనుమభవిస్తున్నారు..కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రధాన ఛానల్స్ పై ఆంక్షలు పెట్టడమేంటిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా నాలుగు ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..దేశ చరిత్రలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటుందా?.ఎందుకు ఏపీలోనే ప్రతిపక్షాన్ని గుర్తించడం లేదు.కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తామనే కూటమికి భయం పట్టుకుంది.ఆ భయంతో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదాఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదునిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాంప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి: పెద్దిరెడ్డివైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.కూటమి ప్రభుత్వానికి, తాలిబన్ల పాలనకు తేడా లేదు. ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిష్కరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ నేతల నిరసనఅసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు👉ప్రారంభమైన గవర్నర్ ప్రసంగంఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంప్రసంగం చదువుతున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎస్సార్సీపీ సభ్యులుఅసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనఅసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి.ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన👉 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ జగన్కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ప్రధాన ప్రతిపక్ష హోదాపై స్పీకర్ను గట్టిగా నిలదీయాలని వైఎస్సార్సీపీ నిర్ణయంప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరనున్న జగన్ఆ సమయాన్ని హక్కుగా ఇవ్వాలని డిమాండ్👉కాసేపట్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతరం సభ వాయిదా పడనుంది. 👉అసెంబ్లీకి చేరుకున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీని తాకిన రెడ్బుడ్ రాజ్యాంగందేశం ఎన్నడూ, ఎక్కడా, ఏ అసెంబ్లీలోనూ లేని విధంగా మీడియా కవరేజీపై ఆంక్షలు.అసెంబ్లీ సమావేశాలకు నాలుగు టీవీ చానెల్స్పై ఆంక్షలు విధింపు.సాక్షితో పాటుగా మరో మూడు టీవీ చానెళ్లకు అనుమతి నిరాకరించారు.ఎలాంటి నోటీసులు లేకుండా టీవీ చానెళ్లపై ఆంక్షలు 👉 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.👉25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.👉ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది. ⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్ను ఈ నెల 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025–26 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. -
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్(Legislative Assembly budget) సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోజు వీలుకాని పక్షంలో వచ్చే నెల 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వీటి ప్రారంభానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోమవారం ఢిల్లీ వెళ్లారు. శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించినట్లు వారు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. -
పీఏసీ ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
ఫ్లాష్బ్యాక్ గుర్తుందా చంద్రబాబూ?
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.పీఏసీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి. అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్ వద్ద పెద్దడ్రామానే నడిచింది. ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్సీపీ 1) వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.వైఎస్సార్సీపీ హయాంలో గుర్తుందా?2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్ జగన్. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు... అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
కూటమి సర్కార్కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
22 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలను బడ్జెట్ ప్రసంగం తర్వాత వాయిదా వేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొని పది రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు ఉన్నప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహిద్దామని స్పీకర్ చెప్పారు. మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మంగళవారం చీఫ్ విప్, విప్లను ఖరారు చేస్తామని సీఎం చెప్పారు. బీఏసీలోనూ జగన్ జపమే బీఏసీ సమావేశంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ గురించే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారనే దానిపై సీఎం, స్పీకర్ పలు విమర్శలు చేసినట్లు సమాచారం -
వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..⇒ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ స్పీకర్ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు. ⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ హైకోర్టులో మనం వేసిన పిటిషన్పై కౌంటర్ వేయడానికి కూడా స్పీకర్ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. ⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి. ⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు. ⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. ⇒ వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా. ⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. -
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
ఏపీ బడ్జెట్ సమావేశాలు..
-
AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఎన్నికల సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం జూన్లోనే అధికారంలోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు అంటే.. నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేసింది.సూపర్ సిక్స్ వంటి పథకాల అమలు నుంచి తప్పించుకోవడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఖర్చులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024–25 ఆర్థిక ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
అసెంబ్లీ సమావేశాలపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
-
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను మరో గంట అదనంగా స్పీకర్ కొనసాగించారు. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. -
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్పై వ్యాట్ను తగ్గించి ప్రత్యేక మార్జిన్గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమిది: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ గళం విప్పింది. సోమవారం నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు బయటకు రావాలంటే బయటపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి’’ అని అన్నారు.ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి‘‘ ఏపీలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఘటన జరిగితే ఏపీలో దిశా చట్టాన్ని రూపొంచించాం. కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, 36 మందిని హత్య చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... ప్రజలగొంతుకగా వైఎస్సార్సీపీ ఉంటుంది. ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తాం. దేశ వ్యాప్తంగా ఏపీలో ఏం జరుహుతుందో చెబుతాం. హోంమంత్రి అనిత ఫ్రస్టేషన్లో ఉన్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక అమ్మాయి దారుణ హత్య జరిగింది. ముచ్చుమర్రిలో ఒక బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు’’ అని ఆమె మండిపడ్డారు.ప్రజల మధ్యనే మా నిరసనఅప్పులు చేయటానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ‘‘శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. హత్యలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టింపులేనందునే బాయ్ కట్ చేశాం. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి కామెడీ చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాం. ఒక వర్గం మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రజల మధ్యనే మా నిరసన తెలుపుతున్నాం’’ అని అన్నారు. -
అసెంబ్లీలో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక.. ఇదీ చదవండి: ‘రెడ్బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలనరషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై అజెండాను ఖరారు చేయనుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న హత్యా రాజకీయాలు, దాడులు, దౌర్జన్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీయనున్నారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా నరికి చంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని, ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం హామీలకు కేటాయింపుల చేయకుండా తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్కు సభలో ఆమోదం పొందడం ద్వారా కాలయాపన చేయాలని నిర్ణయించింది. కాలయాపన చేసే ఎత్తుగడఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెడతాయి. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపుల్లేకుండా కాలయాపన చేసే ఎత్తుగడకు పాల్పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంపై ఆరోపణలకు, నిందలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల ఎత్తుగడకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం లేకుండా ఆర్థిక, ఎక్సైజ్, శాంతిభద్రతల పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీని ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు అసెంబ్లీలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే యోచనలో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని పార్టీ సూచించింది. ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24 లేదా 25వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్తో భేటీ (ఫొటోలు)
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
-
ముగిసిన ఎమ్మెల్యేల ప్రమాణం.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
అమరావతి, సాక్షి: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో 172 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మిగిలిన ముగ్గురి ప్రమాణ స్వీకారంతో పాటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రొటెం స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం ముగిశాక.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్తో భేటీ (ఫొటోలు)ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక.. స్పీకర్గా అయ్యన్నపాత్రుడి నామినేషన్ కార్యక్రమం జరిగింది. కూటమి నేతలు నామినేషన్కు మద్దతు ఇవ్వగా.. మెజారిటీ ఉండడంతో అయ్యన్నపాత్రుడి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు.. ఈ ఉదయం అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు.. భావోద్వేగానిని లోనయ్యారు. అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలకు వచ్చారాయన. ఇక పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసేందుకు ఆయన సోదరుడు, జనసేన రాష్ట్రకార్యదర్శి నాగబాబు వచ్చారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలుఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులుఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్లుశ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
పొత్తు.. టీడీపీ సీనియర్లు చిత్తు
సాక్షి, అమరావతి : ప్రజల్లో ఆదరణ కోల్పోయినా, పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల్లా మారాయి. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలా మంది సీనియర్ల మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి ఆరు ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ, జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అయినా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకుల రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర కకావికలం ఈ పొత్తులు ఖరారైతే ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గౌతు శిరీష, బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జి, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద్, పల్లా శ్రీనివాసరావు తదితర నేతల పేర్లు గల్లంతవనున్నాయి. ఎచ్చెర్లపై ఎన్నో అశలు పెట్టుకున్న కళా వెంకట్రావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. విశాఖలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సీటు ఎగిరిపోనుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అశోక్గజపతిరాజు వంటి సీనియర్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకోలేక సతమతమవుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు తప్పని పొత్తు పోట్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కీలకమైన సీనియర్లకు పొత్తు పోట్లు తప్పేలా లేవు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావులను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడనుంది. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెనాలిలో ఆలపాటి రాజా, నక్కా ఆనంద్బాబు వంటి నేతలకు షాక్ తగలనుంది. ఆలపాటి రాజా ఇప్పటికే తన సీటు పోతే ఒప్పుకునేది లేదని అనుచరులను ముందుపెట్టి హడావుడి చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియకు టాటా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో పలువురు కీలక నాయకులు పొత్తుతో రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, నగరిలో గాలి భానుప్రకాష్, తిరుపతిలో సుగుణమ్మ, శ్రీకాళహస్తిలో బొజ్జల సుదీర్రెడ్డి, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, జమ్మలమడుగులో భూపే‹Ùరెడ్డి వంటి నేతలు పోటీ నుంచి తప్పుకోక తప్పదంటున్నారు. పొత్తులో బీజేపీ విశాఖ, విజయవాడ, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి గత ఎన్నికల్లో లోకేశ్ తోడల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఆ సీటు బీజేపీకి పోతే ఆయన భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. విజయవాడ సీటును సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాదని ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులో అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో కేశినేని చిన్నికి సీటు పోయినట్లేనని భావిస్తున్నారు. జనసేన కోరుతున్న నియోజకవర్గాలు ♦ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ♦ ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ♦ ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట. ♦ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు. ♦ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు : దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం. గోదావరి జిల్లాల్లో సీనియర్ల సీట్లు గల్లంతే గోదావరి జిల్లాల్లోనూ చాలా మంది ముఖ్య నాయకుల మెడపై కత్తి వేలాడుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట సీతారామలక్ష్మి, కేఎస్ జవహర్, ఎస్వీఎస్ వర్మ వంటి వారు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. బుచ్చయ్యచౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తన సీటు ఉంటుందని చెప్పుకుంటున్నా దానికి గ్యారంటీ లేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీటు ఇప్పటికే ఎగిరి పోయింది. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం సీటును నిరాకరిస్తుండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం సీటు జనసేనకు పోతుండడంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఇప్పటికే తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వీరు కాకుండా నర్సాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ పిల్లి అనంతక్ష్మి, ఐతాబత్తుల ఆనందరావు, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు వంటి నేతలకు టికెట్లు గల్లంతవనున్నాయి. -
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సభలో చర్చ
-
Live: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates.. ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా ►9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే. మాది సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్సీ రవీంద్రబాబు ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు.. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదు ►శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా హాజరైన వంశీకృష్ణ యాదవ్. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరు మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు, ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం శాసన మండలి పదినిమిషాలు వాయిదా పెద్దల సభలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చైర్మన్ వారించినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు దీంతో, శాసన మండలి వాయిదా అంతకముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన మండలి చైర్మన్ ►సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం ►కాసేపు శాసనసభ వాయిదా ►అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన సీఎం జగన్ ►ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపిన అసెంబ్లీ ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ►ఈరోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు ►టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ ►టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. ►నేడు ఏపీ అసెంబ్లీలో చివరి రోజు(నాలుగో రోజు) బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించనుంది. ►ఎన్నికల నేపథ్యంలో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఏప్రిల్ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలుపునుంది. ►అలాగే, నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై విచారణ జరుగనుంది. ►పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై విచారణ. వ్యక్తిగతంగా విచారించనున్న శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్లకు నోటీసులు ఇచ్చారు. -
స్పీకర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
-
కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అమర్నాథ్
-
మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంలా భావించారు
-
Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024
-
AP Budget: ఏపీ బడ్జెట్ ప్రసంగం ఇదే..
Updates.. ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఏపీ శాసనసభ రేపటికి వాయిదా. ►శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ►శాసన మండలి రేపటికి వాయిదా. ►అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు. మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు. ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత గ్రంధంగా భావించారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర సుపరిపాలన.. గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు. 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు ప్రతీ జిల్లాలో దిశ పీఎస్లను ఏర్పాటు చేశాం. భద్రత, మౌళిక సదుపాయాలను పెంచాం. 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం. రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక 47లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్టు ఇది ఎక్కువ సంపూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు. ఉచితంగా విద్యార్థులకు 9.52,925 ట్యాబ్స్ 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం. రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు. విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు. నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ వ్యాధులను 3257కు పెంచాం. 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి. కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం,. ఏపీలో 192 స్కిల్ హబ్లు, 27 స్కిల్ కాలేజీలు నైపుణ్య శిక్షణ ద్వారా 95 శాతం మందికి ఉద్యోగాలు. విద్యార్థుల శిక్షణ కోసం వర్చువల్ ల్యాబ్లు 201 పాఠశాలల్లో వర్చువల్ ల్యాబ్స్ అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలను మహరాణులను చేశాం. అమ్మఒడి కింద రూ.26,067కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు ఖర్చు. వ్యవసాయం రంగం.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697కోట్లు. 29 దిశా పోలీసు స్టేష్లను ఏర్పాటు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు. రైతులకే నేరుగా సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సిడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1277 కోట్లు అందించాం. వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటు యంత్ర సేవల పథకం కింద రైతులకు యంత్రాలు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు. ఆక్వా రంగం.. వైఎస్సార్ మత్య్సకార భరోసా 2లక్షల 43వేల కుటుంబాలకు మేలు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4వేల నుంచి 10వేలకు పెంపు. అంతర్జాతీయ ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు. ఆక్వాకల్చర్ కింద 12వేల హెక్టార్ల విస్తీర్ణం. 16లక్షల 5వేల మందికి జీవనోపాధి. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం ఐదేళ్లలో 30.65లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం. వైఎస్సార్ పెన్షన్ను మూడు వేలకు పెంచాం. 66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లకు ఐదేళ్లలో 84731 కోట్లు ఖర్చు చేశాం. 9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిస్తున్నాం. వైఎస్సార్ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ. ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు పంపిణీ. నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు. జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు. వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5కోట్లు. బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు. పోర్టులు, పరిశ్రమలు... ఏపీ పారిశ్రామిక విధానం 2019-27ను తీసుకొచ్చాం. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం. పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి. రూ.3800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ఫైబర్ గ్రిడ్తో ప్రతీ గ్రామం అనుసంధానం. 55వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటు. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం. అవుకు రెండో టన్నెల్ పూర్తి. 1079కోట్లతో మూడో టన్నెల్. 77చెరువులతో అనుసంధాన ప్రాజెక్ట్ను ప్రారంభించాం వర్షాలపై ఆధారపడిన రైతులకు ఎంతో మేలు. ప్రాధన్య ప్రాజెక్ట్ల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. రాష్ట్ర స్థాల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం. జాతీయ ఆహార భద్రతలో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దానీ చీరకు బంగారు బహుమతి. చేనేత ఉత్పత్తులకు ఏపీకి మరో నాలుగు అవార్డులు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక జాబితాలో ఏపీకి మూడో స్థానం. 311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు. మెగా పరిశ్రమల ద్వారా 1.30లక్షల మందికి ఉపాధి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి. పెట్టుబడులు.. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానం. వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 నుంచి ఆరో స్థానానికి. రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసిన ప్రభుత్వం మనదే. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి. 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 14 ఎలక్ట్రానిక్ కంపెనీల స్థాపన ద్వారా 34,750 మందికి ఉపాధి. 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు. 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు. తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాం. పురోగతిలో 13 న్యాయ భవన నిర్మాణాలు. 10893 గ్రామ పంచాయతీ భవనాలు. 8299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు. 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. ఆడుదాం ఆంధ్ర.. ఐదు అంచెల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. విజేతలకు 12కోట్ల 21లక్షల విలువైన బహుమతులు. 41 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి, పురోగతిలో 65 క్రీడా వికాస కేంద్రాలు జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం. నగరతోరణం కింద పట్టణ, శివార్లలో పచ్చదనం. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం. 17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు. నాలుగు లక్షల 80వేల మ్యుటేషన్లలకు పరిష్కారం. ఉద్యోగాలు.. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 213662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. పోలీసు వ్యవస్థలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం. నాన్ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. కేబినెట్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ►2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. ►నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం. ►డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల. ►నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ►ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ►ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. ►అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. ► టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. ►మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు: బుగ్గన సభను అడ్డుకోవడానికి టీడీపీ సభ్యులు వచ్చారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ►అసెంబ్లీలో మళ్లీ గందరగోళం ►తీరుమార్చుకోని టీడీపీ సభ్యులు ►ఈరోజు కూడా స్పీకర్ తమ్మినేని వెల్లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు ►సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు. ►సభా మర్యాదలు పాటించని టీడీపీ సభ్యులు. ►రెడ్లైన్ దాటి స్పీకర్ వెల్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు. ►ఈరోజు కూడా పేపర్లు చింపి స్పీకర్పై వేసిన టీడీపీ సభ్యులు. ►సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యుల తీరు. ►స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం ►బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ►తొలిమూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ►సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం ►సెక్రటేరియట్కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కేబినెట్ సమావేశానికి హాజరు బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్: బుగ్గన రాజేంద్రనాథ్ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత గత ఐదేళ్ల బడ్జెట్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం. ►మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు ►సెక్రటేరియట్కు చేరుకున్న మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు. ►సెక్రటేరియట్కు బయల్దేరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు ►మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధికశాఖ అధికారులు ►మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్కు బయల్దేరనున్న మంత్రి బుగ్గన, అధికారులు ►అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు ►ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్ధిక శాఖ అధికారులు ►ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీకి సమర్పించనుంది. ►రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బుధవారం ఉదయం 11.02 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ►ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ►అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను చదువుతారు. ►అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది -
మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్
రాష్ట్ర విభజన నుంచి ఇప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. మనం కలసికట్టుగా 60 ఏళ్లపాటు ఉమ్మడిగా హైదరాబాద్ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నగరాల్లోనే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం వాగ్దానాలను ఈ ఐదేళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా సరే కచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొంది మళ్లీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు, చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పెరిగిన ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి లాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు, కేంద్ర నిధుల తగ్గుదలను గణాంకాలతో సహా వివరించారు. టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వైఎస్సార్సీపీ వచ్చాక ఎలా ఉందో వెల్లడిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ► గత ప్రభుత్వ విధానాలతో కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిన విడుదల చేసిన నివేదికను గమనిస్తే విద్యారంగంలో జీఈఆర్ రేషియో జాతీయ స్థాయిలో 96.91 శాతం ఉంటే మన రాష్ట్రంలో 83.29 శాతమే ఉంది. ఆ డేటా చూస్తే అమ్మ ఒడి పథకం ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుంది. గత సర్కారు హయాంలో ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల ఎన్రోల్లో రాష్ట్రం చివరిన మూడో స్థానంలో ఉంది. దాన్ని మనం ఏ స్థాయికి తీసుకొచ్చామో గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ► చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. మనం వచ్చాక రైతు భరోసా పథకం అందించి తోడుగా నిలిచాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తానని దగా చేశారు. మనం అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు జీవం పోశాం. ► ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది అత్యంత ప్రధానం. పెద్ద పెద్ద సిటీల్లో ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. జాతీయ స్థాయిలో జీడీపీ గమనిస్తే వ్యవసాయ రంగం నుంచి 18 శాతం ఉంటే తెలంగాణలో 17 శాతం ఉంది. మన రాష్ట్రంలో 34 శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది. మనది రైతులతో కూడిన ఎకానమీ. దీని వల్ల ఎబిలిటీ టూ జనరేట్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గుతుంది. హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం, విభజన వల్ల రాష్ట్రం ఏటా రూ.13 వేల కోట్లను ఆదాయపరంగా నష్టపోతున్నాం. ఈ పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు నష్టపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలోనైనా ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే మనం కోర్టుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. చట్టంలో చేర్చకపోవడంతో ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయింది. కేంద్రంలో అధికార పారీ్టకి పూర్తి మెజారిటీ లేకపోతే, మన మద్దతు అడిగిన వారిని మనం గట్టిగా డిమాండ్ చేయగలిగేవాళ్లం. ► ఇన్ని ఇబ్బందులు, సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను 56 నెలలుగా సమర్థంగా నడుపుతూ ముందడుగులు వేస్తున్నాం. ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేశాం. మన ప్రభుత్వం రాకముందు నిధులు అవినీతి లేకుండా ప్రజలకు చేరేవి కాదు. ఈరోజు బటన్ నొక్కడం ద్వారా నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తున్నాం. ఎక్కడ లంచాలు, వివక్ష లేదు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. నాన్ డీబీటీ స్కీమ్స్ ద్వారా మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. (ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ కూడా తీసుకుంటే దాదాపు రూ.1.76 లక్షల కోట్లు ఉంటుంది) ► మన ప్రభుత్వానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెబుతూ గోల చేస్తోంది. మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువ, మూలధన వ్యయం తక్కువ అని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ బటన్ నొక్కుతున్నాడని ఆరోపిస్తున్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చంద్రబాబు హయాంలో సగటున రూ.15,227 కోట్లు కాగా మన ప్రభుత్వ పాలనలో రూ.17,757 కోట్లుగా ఉంది. నాడు– నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం. అదనంగా మూడు పోర్టులు నిర్మిస్తున్నాం. ► ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని గర్వంగా చెబుతున్నా. ఇచ్చిన హామీలను ఏకంగా 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం. ► చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. మొదటిసారి సీఎం అయి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. మూడు సార్లు సీఎం అయ్యారు. ఇన్నేళ్ల తరువాత కూడా ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి... అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు. మరోసారి అవకాశం ఇస్తే ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. చంద్రబాబు ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు. ఏ గ్రామంలోనైనా చంద్రబాబు ఫలానిది చేశారని చెప్పేందుకు ఒక్క బిల్డింగ్ కనిపించదు. స్కూళ్లన్నీ నిర్వీర్యం చేశారు. మరోసారి కొత్త ఎరలతో ఆ పెద్ద మనిషి బయలుదేరారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. హైదరాబాద్లో కూర్చొని అరడజను వాగ్ధానాలతో కిచిడి చేసి మేనిఫెస్టో రూపంలో తెచ్చారు. మేనిఫెస్టోలో వందల హామీలు ఇస్తారు. ఎన్నికల తరువాత చెత్తబుట్టలో వేస్తారు. ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడిని 2014 ఎన్నికల్లో మనకు 45 శాతం ఓట్లు వస్తే మనకంటే దాదాపుగా ఒక్క శాతం ఓట్లు అధికంగా పొంది చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనకు చంద్రబాబుకు తేడా ఒక్క శాతం మాత్రమే. నాడు మనం కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలా మంది నాకు చెప్పారు. చేయలేనిది చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు నేను చెప్పా. ఆ రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడిని. కానీ ఈ రోజు కూడా నాకు రిగ్రేట్ లేదు. వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పను. నా నోట్లో నుంచి అబద్ధాలు రావు. నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చు. కానీ విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని గర్వంగా చెబుతున్నాను. కరోనా విపత్తు వల్ల రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం వివరాలు రాష్ట్ర ఆదాయం తగ్గినా... ► జఠిల పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. కోవిడ్తో రాష్ట్ర ఆదాయం తగ్గింది. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. సాధారణంగా ఏటా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ గత ఐదేళ్లలో అనూహ్య పరిస్థితులు చూశాం. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా బాగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని నడిపించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనతో వచ్చిన ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. రెవెన్యూ లోటును అధిగమిస్తూ గొప్ప పాలన అందించాం. ► 2015– 2019లో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ 13.29 శాతం పెరిగింది. ఆ ప్రకారం గ్రోత్ రేట్ ఉంటే మనకు 2019–24 మధ్య రూ.2,24,603 కోట్లు రావాలి. కానీ రాష్ట్రానికి కేవలం రూ.1,15,552 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12.76 శాతం ఉండటంతో అనుకున్న మేర మనకు నిధులు ఇవ్వలేకపోయింది. ఈ రకంగా కూడా రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చింది. ఆదాయం కోల్పోవడం, ఖర్చుల భారం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో కుదుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు గమనిస్తే 2013– 14లో జీడీపీ రేషియో 50 శాతం ఉంది. వారు అనుసరించిన విధానాల వల్ల 2018 నాటికి డెట్ జీడీపీ రేషియోను 48 శాతానికి తగ్గించారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇది 61 శాతానికి పెరిగింది. ఇవాళ 57 శాతం ఉంది. ► 2015–2019 మధ్య కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే 35 శాతం ఇచ్చింది. చంద్రబాబు సర్కారుకు ఆ మాత్రమైనా లబ్ధి కలిగింది. కేంద్రం రాను రాను సెస్లు, సర్చార్జ్ల పేరుతో వాటాను తగ్గించింది. మన ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో 31 శాతం వాటా మాత్రమే ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి పన్నుల వాటా గమనిస్తే జీఎస్డీపీ 2018– 19లో రూ.32 వేల కోట్లు ఉండగా 2019–20లో రూ.28 వేల కోట్లుకు తగ్గింది. 2022– 2023లో రూ.24 వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల అప్పుల వివరాలు అప్పులపై పదే పదే అబద్ధాలు ► అబద్ధాల బ్యాచ్ చేసే మరో ఆరోపణ.. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందట! నోటికి హద్దుపద్దు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు చెబుతున్నారు. విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే నాటికి మొత్తంగా రూ.4,12,288 కోట్లు అప్పులున్నాయి. రూ. 4,12,288 కోట్లు అప్పు నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు రూ.7.03 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల రేటు 21.78 శాతం ఉంటే మన హయాంలో కేవలం 12.13 శాతమే ఉంది. చంద్రబాబు సమయంలో బటన్లు లేవు, స్కీమ్లు లేవు. అప్పుడు ఉన్నది దోచుకో..పంచుకో..తినుకో మాత్రమే. ► పరిమితి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని కౌరవ సైన్యం ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారు. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రూ.366 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది వాస్తవం కాదా? ► టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 7.5 శాతం ఉన్నాయి. అదే సమయంలో కేంద్రం అప్పులు 3.6 శాతమే ఉన్నాయి. మన హయాంలో కేంద్రం అప్పులు 6.5 శాతం ఉంటే మనం అప్పు చేసింది 5.6 శాతం మాత్రమే. అప్పుల పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ ఎలా చూసినా సరే గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని గర్వంగా చెబుతున్నా. ► మన ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఒకడు రూ.13 లక్షల కోట్లు అంటారు. మరొకడు రూ.10 లక్షల కోట్లు అంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క కుటుంబానికీ మంచి చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎవరి బ్యాంకు ఖాతాలో ఎంత వేశారు? మన ప్రభుత్వం వచ్చాక ఎంత వేశాం? ఇంటింటికీ వెళ్లి చూడమని చెబుతున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్.. మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేట్ అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయలేకపోయారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కూడా ఆలోచించాలి. మా హయాంలో ప్రతి రూపాయికీ లెక్క ఉంది. ఆధార్ నంబర్లతో సహా బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తాం. ఎవరికి ఎంత ఇచ్చామో మేం చెప్పగలం. మరి టీడీపీ హయాంలో నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? ఆ నిధుల్లో చంద్రబాబు తిన్నది ఎంత? దత్తపుత్రుడికి ఇచ్చింది ఎంత? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన ఎల్లో మీడియాకు ఇచ్చింది ఎంత? చంద్రబాబు పాలనాకాలంలో పెరిగిన రెవెన్యూ లోటు వివరాలు (పింక్ కలర్లో) బాబు పాలనంతా రెవెన్యూ లోటే ► మనం వెచ్చిస్తున్న రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్నారే.. మరి రూ.1.24 లక్షల కోట్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే చంద్రబాబు సంపద సృష్టిస్తారంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. చంద్రబాబు ట్రాక్ రికార్డు గమనిస్తే ఆయన సీఎం కాకమునుపు రెవెన్యూ మిగులు ఉండేది. చంద్రబాబు సీఎం అయ్యాక ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ లోటే కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మిగులు ఉంది. చంద్రబాబు ప్రజలకు ఏ స్కీమ్ కూడా అమలు చేయలేదు. మరి ఎక్కడ సంపద సృష్టించారో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు విజనరీ అయితే.. ఆయన పాలనలో రాష్ట్రం మెరుగుపడి ఉంటే జీడీపీలో మన జీఎస్డీపీ వాటా ఎంత అని గమనించాలి. 2014–19లో రాష్ట్రం దేశానికి పన్నుల కింద 4.47 శాతం వాటా ఆదాయం ఇస్తే.. మన హయాంలో ఈ ఐదేళ్లలో 4.82 శాతం వాటా ఆదాయాన్ని కేంద్రానికి ఇచ్చాం. దీనిని బట్టి ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ ఉన్నా, ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా, ఇన్ని పథకాలు అమలు చేస్తూనే ఈ స్థాయిలో జీఎస్డీపీ కేంద్రానికి ఇచ్చాం. ► మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తాడు. మనసున్న ప్రభుత్వం, అమలు చేసే నిజాలు చెబుతుంది. ఇదీ ఆయనకు, మనకు ఉన్న తేడా. చంద్రబాబుకు వాగ్ధానాలు అమలు చేసే ఉద్దేశం లేదు. అమలు చేసిన చరిత్ర అంత కన్నా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే! ► చంద్రబాబు రకరకాల మోసాలు చేశారు కాబట్టే ఆ పార్టీని 23 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే 151 స్థానాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్సార్ సీపీని గెలిపించారు. విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. ఫలానా వ్యక్తి నమ్మకస్తుడనే గుర్తింపు సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్సార్ సీపీ సంపాదించుకోగలిగిందని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు కూడా చెబుతున్నా.. వైఎస్సార్ సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా కూడా కచ్చితంగా మాట మీద నిలబడుతుందని వంద శాతం చెబుతున్నాను. టీడీపీ ఇప్పుడు ఇస్తున్న కొన్ని ఎన్నికల హామీలు అమలు చేయాలంటే అయ్యే ఖర్చు వివరాల అంచనా అధికారం కోసం అడ్డగోలు హామీలు జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు! సంక్షేమ పథకాలతో అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుంది అని చంద్రబాబు ఇన్నాళ్లూ మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అవే రాతలు రాశాయి. ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఇంతేనా ఇచ్చేది? నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి, నిబద్ధత ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజలను మోసం చేసేందుకు, దోచుకుని పంచుకునేందుకే వీళ్లకు అధికారం కావాలి. చంద్రబాబు మేనిఫెస్టో ఏది చూసినా ఇవే మోసాలు కనిపిస్తాయి. 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మేనిఫెస్టోల్లో 650 వాగ్దానాలు చేశారు. వాటిలో 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ప్రజలను మరోసారి మోసగించేందుకే చంద్రబాబు ఆరు వాగ్దానాల పేరుతో వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేనా? అని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబును నమ్మితే... బంగారు కడియం ఇస్తానని చెప్పి అమాంతంగా తినేసే పులిని నమ్మినట్టే. ► ఇవాళ 66.34 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీనికి ఏడాదికి రూ.36 వేల కోట్లు అవుతుంది. ఉచిత విద్యుత్కు రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుంది. సబ్సిడీ కింద బియ్యం రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108కు రూ.4,400 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి 8 పథకాలకు ఏటా రూ.53 వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటిని ఎవరూ రద్దు చేయలేరు. ► వాటికి చంద్రబాబు చెప్పిన 6 హామీలు అదనంగా చేరిస్తే.. మహాశక్తి పథకానికి రూ.36 వేల కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.12,400 కోట్లు, యువగళం పథకానికి రూ.7,200 కోట్లు, దీపం పథకానికి రూ.4,634 కోట్లు, అన్నదాత పథకానికి రూ,10,706 కోట్లు కలిపి రూ.73 వేల కోట్లు అవుతుంది. కచ్చితంగా అమలు చేయాల్సిన 8 పథకాలకు అయ్యే రూ.53 వేల కోట్లకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే రూ.1.26 లక్షల కోట్లు ఏటా ఖర్చు చేయాల్సి వస్తుంది. దుర్భుద్ధితో ప్రజలను దగా చేయడం చంద్రబాబుకు ధర్మమేనా? -
చెయ్యలేనిది చెప్పకూడదు...మాట ఇస్తే తప్పకూడదు: సీఎం జగన్
-
చంద్రబాబు పేరు చెప్తే ఇప్పటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే
-
ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది
-
2024 జూన్ లో మళ్లీ మన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుంది
-
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం
-
‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
అసెంబ్లీలో టీడీపీ అరాచకాలు..!
-
టీడీపీ పాలనలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు?: సుధాకర్ బాబు
-
రెడ్ లైన్ దాటి స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు
-
మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీలో సంతాపం..!
-
మమ్మల్ని రెచ్చగొడుతున్నారు.. జాగ్రత్త టీడీపీ నేతలకు అంబటి వార్నింగ్
-
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
-
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
-
అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానం ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు. టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు. -
సంక్షేమం, అభివృద్ధి మేళవింపు.. 'ప్రగతికి ప్రణామం'
సాక్షి, అమరావతి: సంక్షేమాన్ని–అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరులనే చుక్కానిగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. నవరత్నాల పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. నీతిఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015–16లో 11.77% ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. గత నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.4.23 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం వినూత్న విధానాలకు అంకురార్పణ చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతోపాటు సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిబద్ధతను గవర్నర్ అభినందించారు. ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద గవర్నర్కు ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. తన ప్రసంగంలో గవర్నర్ ఏమన్నారంటే.. విద్యా సంస్కరణలు.. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. విద్యా రంగ సంస్కరణల కోసం ఇప్పటివరకు రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. ‘జగనన్న అమ్మ ఒడి’ ద్వారా రూ.26,067 కోట్లు వెచ్చించింది. ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు పథకంతో లబ్ధి పొందుతున్నారు. 56,703 ప్రభుత్వ విద్యా సంస్థలను మూడు దశల్లో ఆధునీకరించేంందుకు ‘మన బడి – నాడు నేడు’ చేపట్టింది. ఇప్పటివరకు రూ.7,163 కోట్లు వెచ్చించింది. 44,800 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను నియమించింది. విద్యార్థుల్లో పోషకాహార సమస్యను నివారించేందుకు 16 రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా ‘జగనన్న గోరుముద్ద’ చేపట్టింది. 43.27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏటా రూ.1,910 కోట్లు చొప్పున రూ.4,417 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా ఏటా 47 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.3,367 కోట్లు ఖర్చు చేసింది. బైజూస్ కంటెంట్తో 8వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేసింది. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు 62 వేల ఇంటరాక్టివ్ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ను 2026 నుంచి ప్రవేశపెడుతోంది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి పీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ.11,901 కోట్లను చెల్లించింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం రూ.4,276 కోట్లను పంపిణీ చేసింది.పేద విద్యార్థుల కలను నిజం చేస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. అత్యున్నత 50 విదేశీ విద్యా సంస్థల్లో 21 ఫ్యాకల్టీలలో విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తూ రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లిస్తోంది. పథకం కింద ఇప్పటివరకు రూ.107.08 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. వర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గిపోయాయి. వైద్య విప్లవం వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వైద్య విద్య విధానాన్ని ప్రభుత్వం సంస్కరించింది. 11 వైద్య కళాశాలలను బలోపేతం చేయడంతోపాటు 17 కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను ఇటీవలే ప్రారంభించాం. వైద్య, ఆరోగ్య రంగంలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ప్రివెంటివ్ కేర్లో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 3.03 కోట్ల ఓపీ సేవలను అందించాం. 104, 108 అంబులెన్స్ సేవల కోసం రూ.1,208 కోట్లు వెచ్చించి 1,704 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇటీవలే రూ.25 లక్షలకు పెంచాం. 2,315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స లాంటి ఖరీదైన ప్రొసీజర్లు, క్యాన్సర్ చికిత్సతో సహా 3,257 ప్రొసీజర్లకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. 2019 నుంచి ఇప్పటివరకు 36 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. అందుకోసం ప్రభుత్వం రూ.12,150 కోట్లు వెచ్చించింది. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు గరిష్ట పరిమితితో రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. సాగు.. బాగు సొంత భూములు సాగు చేసుకునే రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, ఎండోన్మెంట్ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.53.53 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్లు పంపిణీ చేసింది. వన్స్టాప్ సెంటర్లుగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పింది. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 54.75 లక్షల మంది రైతుల క్లైమ్లను పరిష్కరించి రూ.7,802.05 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,835 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 22.85 లక్షల మంది వ్యవసాయ, ఉద్యాన రైతలకు రూ.1,977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసింది. దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల వద్దే ధాన్యాన్ని సేకరిస్తూ గోనె సంచుల వినియోగ చార్జీలు, రవాణా ఖర్చులను కూడా రైతులకు చెల్లిస్తోంది. రూ.63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎంఎస్పీ పరిధిలోకి రాని పంటలకు కూడా గిట్టుబాటు ధర అందించేందుకు ఇప్పటివరకు రూ.7,751 కోట్లు వెచ్చించింది. మిచాంగ్ తుపాను సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు రూ.347.55 కోట్లను వెచ్చించింది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ నాలుగేళ్లలో 5,83,240 ఎకరాలను ఉద్యాన పంటల సాగులోకి తెచ్చింది. అరటి, పసుపు, ఉల్లి, మిర్చి లాంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం కంటే అధికంగా కనీస మద్దతు ధర అందిస్తోంది. సూక్ష్మ సేద్యం కింద 12.74 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 35.85 లక్షల ఎకరాల విస్తీర్ణానికి వర్తింపజేసింది. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోకి ఆక్వా కల్చర్ను తెచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 2,43,394 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తూ రూ.540 కోట్లు పంపిణీ చేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 20,034 ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కింద రూ.128.27 కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కి పెంచింది. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,186.36 కోట్లను వెచ్చించి 61,682 మందికి ప్రయోజనం కలిగించింది. రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్లను నెలకొల్పింది. మహిళా సాధికారికతకు పెద్దపీట రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తూ 64 లక్షల మంది గర్భిణులు, బాలింతలతోపాటు 28.62 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,688 కోట్లు వెచ్చించడంతో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌష్టికాహార లోపాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు రూ.21.82 కోట్లు వెచ్చించి గ్రోత్ మానిటరింగ్ పరికరాలను కొనుగోలు చేసింది. రూ.71 కోట్లు వెచ్చించి 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సమకూర్చడంతో 3,27,289 మంది ప్రయోజనం పొందారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలు బకాయి పడిన రూ.25,571 కోట్లను నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించింది. దాంతో 7,98,395 స్వయం సహాయక సంఘాల్లోని 78.84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటివరకు 9,76,119 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతల్లో రూ.4,969.05 పంపిణీ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందచేస్తోంది. పథకం ద్వారా 26.39 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ చేసింది. నాలుగో విడత ఈ నెలలోనే పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మంది మహిళలకు రూ.2,029 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4,39,068 మంది మహిళలకు రూ.1,257.04 కోట్లు అందించింది. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తూ దిశ యాప్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 1.46 కోట్ల మంది యాప్ డౌన్లోడ్ చేసుకోగా 3,040 కేసులను నమోదు చేశారు. ‘సామాజిక’ నవశకం పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 17,005 లే అవుట్లలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళలకు పంపిణీ చేశారు. 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. వైఎస్సార్ పింఛన్ కానుక కింద 66.34 లక్షల మందికి ప్రతి నెలా టంచన్గా పింఛన్లు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచడంతో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.1,961 కోట్లకు పెరిగింది. వార్షిక బడ్జెట్ దాదాపు రూ.23,476 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు రూ.86,692 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున 2,78,961 మందికి రూ.1,305 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు చొప్పున 81,783 మంది లబ్ధిదారులకు రూ.983 కోట్లు అందచేసింది. వైఎస్సార్ లా నేస్తం కింద కింద జూనియర్ న్యాయవాదులకు ఆర్నెళ్లకు రూ.30 వేలు చొప్పున మూడేళ్ల కాలానికి స్టైఫండ్ అందిస్తోంది. ఇప్పటివరకు 2,564 మందికి రూ.11.83 కోట్లు అందించింది. జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు పంపిణీ చేసింది. 19.52 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.521.73 కోట్లు వెచ్చించింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఏడాదికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఇప్పటివరకు 15.87 లక్షల మందికి రూ.88.33 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేసింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.1,582 కోట్లు అందచేసింది. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటివరకు 46,329మందికి రూ.350.89 కోట్లు అందించింది. ఉపాథి హామీ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలోఉంది. సగటున 25 కోట్ల పనిదినాలు సృష్టించడంలో దేశంలో టాప్ 3 స్థానాల్లో నిలిచింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2 వేల ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేస్తోంది. మచిలీపట్నం, మార్కాపురం, ప్రొద్దుటూరు, కమలాపురం, నరసాపురం, అమలాపురంలో ఈ ఏడాది రూ.327.38 కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. జగనన్న టౌన్ షిప్ల కింద 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్టులను చేపట్టింది. రహదారులు.. కొత్త బస్సులు రాష్ట్రంలో ఇప్పటివరకు 53,481 కి.మీ. మేర రహదారుల పనులను చేపట్టింది. 2023–24లో 268 కి.మీ. మేర 58 బీటీ రోడ్లు వేసింది. ప్రధానమంత్రి గ్రామ్సడక్ యోజన కింద రూ.261 కోట్లు ఖర్చు చేసింది. గుంతలులేని రహదారులే లక్ష్యంగా రూ.490.80 కోట్లతో 1,221 కి.మీ. మేర పనులు మంజూరు చేసింది. రూ.1,121.85 కోట్ల తో 4,635 కి.మీ. మేర 1,877 బీటీ రోడ్లను పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత పాత బస్సుల స్థానంలో 880 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. సాగునీటికి ప్రాధాన్యం జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆర్ అండ్ ఆర్ పనులకు వేగవంతం చేసింది. సంగం ప్రాజెక్ట్, బ్యారేజీలను పూర్తి చేసి పెన్నార్ డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కనుపూరు కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. బ్రహ్మం సాగర్ లీకేజీ సమస్యను ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం పరిష్కరించింది. చిత్రావతి భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను రూ.280 కోట్లతో పూర్తి చేసి 10 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం రూ.925 కోట్లు ఖర్చు చేసి 27 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. అవుకు రెండో టన్నెల్ పూర్తి చేయడం ద్వారా ఎస్ఆర్బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ టన్నెల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో పనులను పూర్తి చేయడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ పంప్ ప్రాజెక్ట్ నుంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చిన్నతరహా సాగునీటి చెరువులను నీటితో నింపింది. వెలిగొండ మొదటి టన్నెల్ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో టన్నెల్ కూడా కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యిందని త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. 2024 సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ వర్షాలతో నల్లమల సాగర్ నీటిని నిల్వ చేసేందుకు వీలవుతుంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచి కెనాల్ను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆర్ అండ్ ఆర్ సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతలలో పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీల నీటి నిల్వ చేసింది. జల్ జీవన్ మిషన్ కింద రూ.15,61.30 కోట్లతో 60.55 లక్షల కుటుంబాలకు ఎఫ్టీసీలతో తాగునీటిని అందించింది. శ్రీకాకుళం, వైఎస్సార్, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో రూ.10, 137 కోట్లతో 9 తాగునీటి ప్రాజెక్ట్లను మంజూరు చేసింది. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంతో విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. పారిశ్రామిక పురోభివృద్ధి విశాఖ జీఐఎస్ సదస్సులో కుదుర్చుకున్న 386 ఒప్పందాల ద్వారా 6,07,388 మందికి ఉపాధి కల్పించే రూ.13.11 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. గత 56 నెలల్లో 1.30 లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 311కుపైగా భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లుగా రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్ను అభివృద్ధి చేసింది. హబ్ ద్వారా 75 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులను పెంపొందిస్తోంది. వీసీఐసీ కారిడార్లో రూ.లక్ష కోట్లు అదనపు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి ద్వారా లక్ష మందికిపైగా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించనుంది. రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 110 మిలియన్ టన్నులకు పెంచి 75 వేలమందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. వరల్డ్ లాజిస్టిక్స్ – సప్లయ్ చైన్ కాంగ్రెస్.. ఏపీ మారిటైమ్ బోర్డ్ను ‘మారిటైమ్ బోర్డ్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 నెలల్లో అందుబాటులోకి రానుంది. గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలను విస్తరిస్తోంది. విశాఖప మధురవాడలో రూ.14,634 కోట్లతో 200 ఎండబ్లూ డేటా సెంటర్, కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో 100 ఎండబ్లూ డేటా సెంటర్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 7,290 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.3,685 కోట్ల పెట్టుబడితో 17 పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కోవిడ్ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది. 2023–24లో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ఉండవచ్చని నివేదికలు సూచించాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2022–23లో రూ.2,19,518 ఉండగా 2023–24లో రూ.2,42,479కు పెరిగి 1043 శాతం వృద్ధి రేటు సాధించింది. గడప వద్దకే సుపరిపాలన పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. 2.6 లక్షల మంది వలంటీర్ల నియామకం ద్వారా గడప వద్దకే పరిపాలను తెచ్చాం. 540 రకాల సేవలకు సంబంధించి 9.84 కోట్ల అర్జీలను సకాలంలో పరిష్కరించాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలకు తగ్గకుండా పనులు మంజూరు చేశాం. భూవివాదాల పరిష్కారం భూవివాదాల పరిష్కారానికి వందేళ్ల తరువాత వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా రెండు దశల్లో 4 వేల గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వేను పూర్తి చేశాం. 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత పట్టాలు, 4.8 లక్షల మార్పిడి సమస్యలకు పరిష్కారం, 10.21 లక్షల కొత్త సబ్ డివిజన్లకు అవకాశం కల్పించాం. 20,24,709 మంది భూమిలేని పేదలకు 35,44,866 ఎకరాలను పంపిణీ చేశాం. -
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
Updates.. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ముగిసిన బీఏసీ సమావేశం ఈనెల 8వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి ఎల్ఏ అండ్ ఆర్ ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం 2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం రూ. 71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కొనుగోలు దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం 2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్ అందిస్తున్నాం నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ. 1961 కోట్లకు పెరిగింది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ వైఎస్సార్ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్లు ఏర్పాటు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ఇం డియాగా ఏపీ మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం రైతులు రాష్ట్రానికి వెన్నుమక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మిచాంగ్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాం ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్లు పంపిణీ చేశాం వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.. హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడు పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి ►అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ►గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ►అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్న బీఏసీ ►ఈనెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ►మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి బుగ్గన ►కాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ►ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ►అనంతరం సమావేశాలు ప్రారంభం ►అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. ►అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
AP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
AP: 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఫిబ్రవరి 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈనెల ఐదో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా, 8వ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. -
ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-
ఉద్యోగులకు మేలు చేసే జీపీఎస్
-
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
అసెంబ్లీ నిరవధిక వాయిదా..!
-
అమరావతిలోని అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు: మంత్రి సురేష్
-
రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు: పేర్నినాని
-
రికార్డులు మాయం.. టీడీపీ అవినీతి చిట్టా..
-
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
ఈ ఆరుగురు పండితులు.. A2 నారాయణ, A14 లోకేష్ బండారం బయటపెట్టిన పేర్నినాని
-
నారాయణ వంకర తెలివి.. భారీ షాక్కు గురైన CRDA
-
నన్నొక్కడినే కాదు.. మా బ్యాచ్ని కూడా జైల్లో వేయండి..
-
తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి అవకతవకలకు పాల్పడ్డారు
-
లింగమనేని రమేశ్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్రోడ్ వచ్చేలా ప్లాన్ మార్చారు
-
పెన్షన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన
-
బిల్లులు పాస్..
-
బాబు, నారయణ, లోకేష్ పారాయణం..!
-
లింగమనేని పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్: పేర్ని నాని ఫైర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. హెరిటేజ్, నారాయణ కాలేజ్ కోసం ప్లాన్ మార్పు.. కాగా, అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి. దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారు. హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ మార్చారు. ఏ-14గా ఉన్న లోకేష్ ఐఆర్ఆర్తో నాకేం సంబంధం అంటున్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ సంస్థకు లోకేష్ డైరెక్టర్గా ఉన్నారు. లోకేష్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. నారా భువనేశ్వరి సూక్తులు.. చంద్రబాబు, నారాయణ దళితుల పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నారు. చట్టం ప్రకారం అసైన్డ్ భూములు లాక్కోవడం సాధ్యం కాదని చెప్పినా వినలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో-41 విడుదల చేశారు. దొంగలు రెక్కీ చేసినట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్నవారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ?. ఇక్కడ యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు?. ఎకరం భూమి తక్కువకు కొనుగోలు.. ఇన్నర్ రింగ్ రోడ్డును అటు తిప్పి.. ఇటు తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్టు లింగమనేని హైకోర్టులో చెప్పారు. సీఎం పదవి పోయిన వెంటనే రూ.27లక్షలు లింగమనేనికి అద్దె ఇచ్చారు. రూ.27లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుంగలో తొక్కారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్కు ఒప్పుకోని వారిని ఏ-2, ఏ-14 బెదిరించారు. ప్రభుత్వ భూమిని గవర్నమెంట్ లాక్కుంటుదని భయపెట్టారు. ఎకరం భూమిని రెండు నుంచి ఐదు లక్షలకే రాయించుకున్నారు. ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అన్నారు. ఇది కూడా చదవండి: ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ -
ఎన్పీఎస్ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన
-
ఎన్పీఎస్ నిర్ణయం.. హడావుడిగా తీసుకోలేదు: మంత్రి బుగ్గన
-
హామీ ఇచ్చిన మేరకు ప్రతీ విభాగానికీ మేలు చేకూర్చాం: మంత్రి బుగ్గన
-
పెన్షన్లపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
-
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేను మంత్రిని అయ్యాను..
-
విద్యారంగంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు
-
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెండు ప్రశ్నలు
-
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
AP Assembly Live Updates ► ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ఇవే.. ►1.ఆంధ్ర ప్రదేశ్ సివిల్ కోర్ట్స్ (అమెండ్మెంట్) బిల్లు-2023 ►2. ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు- 2023 ►3. ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్లు -2023 ►4. ఆంధ్రప్రదేశ్ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు-2023 ►5. ఆంధ్ర ప్రదేశ్ అప్రాప్రియేషన్ నెంబర్ -3 బిల్లు -2023. TIME: 03:20PM అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై సభలో చర్చ ► చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►అవినీతి అనే చాలా చిన్న పదం ►అమరావతి గ్రాఫిక్స్తో గారడి చేసిన వ్యక్తి చంద్రబాబు ►అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు ►ఐఆర్ఆర్ మలుపులు తిరిగి కొంతమంది భూముల్లోకి వెళ్లింది ►ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ను ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు. ►ఈ స్కామ్కు డైరెక్షన్ చంద్రబాబు.. పర్యవేక్షణ లోకేష్ ►అమరావతి అనేది అంతర్జాతీయ స్కాం ►ఐఆర్ఆర్ అక్రమాలన్నింటికీ స్పష్టమైన ఆధారాలున్నాయి TIME: 03:10PM ►అమరావతిలోని అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు: మంత్రి ధర్మాన ప్రసాద రావు ►రికార్డులను మాయం చేసి పేదలను బెదిరించి భూములు లాక్కున్నారు. ►ఒక్కరి ప్రయోజనం కోసం అప్పటి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది ►హైదరాబాద్లో అభివృద్ధి ఫలాలను తనవాళ్లకే దక్కేలా చేశారు. ►హైదరాబాద్లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని బాబుప్లాన్ TIME: 03:00PM శాసనమండలిలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు కామెంట్స్ ►రాష్ట్రంలో 40 సంవత్సరాల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ►చంద్రబాబు 40 ప్రదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని 3611 కోట్లతో సీమెన్ ,డిజైన్ టెక్ స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నారు. ►సీమన్ సంస్థ 90% పెట్టుబడులు పెడుతుందని 2017 జూన్ 30న జీవో నెంబర్ 4 విడుదల చేశారు. ►చంద్రబాబు చేసుకున్న అగ్రిమెంటుకు ఇచ్చిన జీవో కి సంబంధమే లేదు. ►స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్ సీఈఓ లక్ష్మీనారాయణ ఎండి గంట సుబ్బారావు కీలక భూమిక పోషించారు. ►100 రూపాయల బాండ్ పేపర్ పై 3611 కోట్ల కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తేదీలు వేయకుండా చేసుకున్నారు. ►361 కోట్ల ఒప్పందానికి తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీలో ఉన్న సీమన్స్ కంపెనీ తెలిపింది. ►పది శాతం వాటా తో 370 కోట్లు జీఎస్టీ తో సహా ఎందుకు చెల్లించేశారో చెప్పాలి... ►371 కోట్లు కొల్ల గొట్టడానికే షెల్ కంపెనీలను సృష్టించారు ►ఢిల్లీ కేంద్రంగా స్కిల్లర్ అనే కంపెనీని సృష్టించారు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కోసం 241 కోట్లు సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. ►90 శాతంఉన్న కంపెనీకి 70 కోట్లే ఖర్చయిందని చెప్పారు అప్పుడు 3611 కోట్లు ఎందుకు చూపలేదు. ►సీఐడీ, ఈడీ షెల్ కంపెనీలకు డబ్బు పంపారని ఆధారాలతో సహా చూపాయి. ►2018లో పూణేలో జీఎస్టీ ఎగవేసిన కంపెనీలను తనిఖీలలో 220 షెల్ కంపెనీల బాగోతం బయటపడింది. ►స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్లర్ ఏసీ అనే కంపెనీలు షెల్ కంపెనీలుగా 2018లో గుర్తించారు. ►నాడు చంద్రబాబు సచివాలయంలో ఉన్న ఈ కాంట్రాక్టు ఒప్పందాలను మాయం చేశారు. ►స్కిల్ డెవలప్మెంట్లో 90% వాటా ఉన్న సీమన్స్ కంపెనీ 3300 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు వాస్తవాన్ని చూపారని అది తమ సంస్థకు సంబంధం లేదని జర్మనీలోని సీమన్స్ ఎండీ మెయిల్ ద్వారా తెలిపారు. ►ఈ కేసులో చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్ కీలక భూమిక పోషించాడు. ►ఈడీ ఇప్పటికే 112 మందిని విచారించి అందులో నలుగురు నారెస్టు చేశారు. ►చంద్రబాబు ఈ కేసులో తనకు ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. ►40 సంవత్సరాల రాజకీయ అనుభవం 14 ఏళ్ళు సీఎం గా ఉన్న వ్యక్తి గుర్తులేదు నాకు ఏదీ తెలియదు అంటున్నాడు. ► విశాఖలో భూముల కుంభకోణాన్ని చేసిన వ్యక్తి చంద్రబాబు. ►రాజధాని అంశంలో తన బినామీలతో వేల కోట్లు కొల్లగొట్టాడు. ► క్విక్ ప్రోకో ద్వారా రాజధానిపై లీకులిఇచ్చి 25 వేల ఎకరాలను తన ఆనుంగుజుల తో కొనిపించారు. ►34,390 కోట్లు నీరు చెట్టులో దోచుకున్నారు. ►21 వేల కోట్లు విద్యుత్ కొనుగోలులో దోచుకున్నాడు. ►పుష్కరాలు, చివరకు మజ్జిగ కొనుగోలులో సైతం దోచుకున్న వ్యక్తి చంద్రబాబు. ►1151 కోట్లు తాత్కాలిక సచివాలయ భవనాల పేరుతో దోచుకున్నాడు అందులో భవన నిర్మాణాలకు 120 కోట్లే ఖర్చు చేశారు. ►పక్క రాష్ట్రంలో కెసిఆర్ ఎనిమిది వందల కోట్లకే సచివాలయం కట్టారు. ►ప్రధాని మోడీ 1200 కోట్లకే పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ►రాజధాని భూ కుంభకోణంలో లక్ష కోట్లు దోచుకున్నారు. ►1200 కోట్లు హెరిటేజ్ కుంభకోణంలో దోచేశారు. ►పుష్కరాలలో 736 కోట్లు దోచేశారు. ►వరల్డ్ బ్యాంక్ నిధులు సైతం చంద్రబాబు వదిలిపెట్టలేదు. ►జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను నిలువునా దోపిడీ చేశారు. TIME: 02:40PM అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై సభలో చర్చ ►హైదరాబాద్లో చేసిన మాదిరిగానే అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు ప్లాన్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►హైదరాబాద్లో ప్రభుత్వ డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు ►అభివృద్ధి ఫలాలను తన వర్గానికి దక్కేలా చేశారు. ►అమరావతిలోనూ అదే అమలు చేయాలని చూశారు ►బినామీ పేర్లతో ఎన్నిక వందల ఎకరాలు కొనుగోలు చేశారో తెలీదు ►అమరవాతిలోహెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. ►తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి అవకతవకలకు పాల్పడ్డారు. TIME: 02:00PM అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్పై సభలో చర్చ ►రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు: మాజీ మంత్రి పేర్ని నాని ►చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి ►దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. ►ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు ►మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. ►లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా ప్లాన్ మార్చారు. ►హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్ మార్చారు ►ఏ-14గా ఉన్న లోకేష్ ఐఆర్ఆర్తో నాకేం సంబంధం అంటున్నారు ►2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు ►లోకేష్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నప్పుడే అమరావతిలోభూములు కొనాలని నిర్ణయించారు. TIME: 01:20PM ►ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఎన్పీఎస్ ప్రయోజనాలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన ►ఎన్నోసార్లు ఆలోచించే ఉద్యోగుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ►అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు ►సీఎం జగన్ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ►ఉద్యోగుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యం ►ఎన్పీఎస్ హడావిడీగా తీసుకున్న నిర్ణయం కాదు ►గత కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్ స్కీమ్ను అధ్యయం చేశాం ►ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదే మెరుగైన స్కీమ్ ►ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు పట్టించుకోలేదు ►గత ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూర్చాం. TIME: 12:40PM ►జీపీఎస్తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ►ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు. ►ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం. ►108 డ్రైవర్లకు జీతాలు పెంచాం. ►హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం. ►ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ► ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది. ►పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం ►కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం ►ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ►ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ►ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. ►ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచాం. ►2014 నాటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాం. ►ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ►విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం ► శాసనమండలిలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై స్వల్పకాలిక చర్చ. TIME: 12:20PM ►చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ►పలు బిల్లులకు సభ ఆమోదం ►కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం ►అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ TIME: 12:00PM శాసనమండలి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ► ప్రభుత్వం నాణ్యమైన పోర్టి ఫైడ్ రైసును పేదలకు చెరువచేస్తుంది: ►ఈ రైస్లో ఐరన్ పోలీక్ ఆమ్లం, విటమిన్ B12 ఉన్నాయి. ►ఇది ప్లాస్టిక్ రైస్ అని కొంతమంది విషయ ప్రచారం చేస్తున్నారు. ►ఇప్పటికే సాటెక్స్ బియ్యం పేదలకు చేరువ చేసేందుకు 300 కోట్లు ఖర్చు చేస్తున్నాము. ►ఈ రైస్ను కడిగినా, ఉడికించినా, గంజి వారపెట్టినా పోషకాలు పోవు. ►ప్లాస్టిక్ రైస్ అని ట్రోల్ చేస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నాం. ►26 జిల్లాలలో రెండు లక్షల 9 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు అందిస్తున్నాం. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►గత ప్రభుత్వ హయాంలో సన్నా వడ్డీ పథకాన్ని నీరు కార్చారు: ►డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారు. ►3వేల 36 కోట్లను ఎగ్గొట్టారు. ►పాదయాత్రలోసీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల కష్టాలను చూసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ►గతంలో డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీ 13 శాతం గా ఉండేది. ►సీఎం జగన్ బ్యాంకర్లతో మాట్లాడి ఆ వడ్డీని ఏడు శాతానికి తగ్గించారు. ►చంద్రబాబు డ్వాక్రా మహిళలను పూర్తిగా కష్టాల్లో ముంచారు. ►25,571 కోట్ల బకాయిలు పెట్టారు. ►వైఎస్ అధికారం చేపట్టాక ఆసరా పథకాన్ని తీసుకువచ్చి వారికి అండగా నిలిచారు. ►మూడు విడతల్లో 19 వేల 178 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. TIME: 11:40 AM శాసనమండలిలో మంత్రి విడదలరజినీ కామెంట్స్ ►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాము. ►105 రకాల మందులు 14 రకాల టెస్టులు చేస్తున్నారు. ►పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక డాక్టర్ విధులు నిర్వహిస్తూ మరొక డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో పాల్గొంటున్నారు. ►జీరో వేకెన్సీ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ►రాష్ట్రంలో 53 వేల 190 మంది మెడికల్ స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేశాము. ►పేదవారికి ఆరోగ్య సమస్యలు వస్తే గతంలో వైద్యం అందని పరిస్థితి ఉండేది, టెస్టులో పరికరాలు కొరతగా ఉండేవి. ►సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రామస్థాయిలోనే వైద్య సేవలను మెరుగుపరిచారు. ►ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రెండు కోట్ల 30 లక్షల మంది ఈ సేవలనువినియోగించుకున్నారు. ►సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. ►8500 కోట్లతో ఈ కళాశాలలో ఏర్పడనున్నాయి. ►ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండా లన్నది సీఎం ఆకాంక్ష. ►ఈ విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు ,మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ►150 మెడికల్ సీట్లతో ఐదు మెడికల్ కాలేజీలలో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ►రానున్న విద్యాసంవత్సరాల్లో మరిన్ని మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ►భారత దేశ చరిత్రలోనే నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. TIME: 11:20AM ►కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం ►రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకోవడం అందరి బాధ్యత ►అన్ని వర్గాలనూ సమానంగా చూసేవాడే నాయకుడు ►సీఎం జగన్ సామాజిక న్యాయం అమలు చేస్తున్నారు ►కోనసీమ ముఖద్వారంలో అంబేద్కర్ విగ్రహం పెడతాం TIME: 10:45AM ►రాజ్యాంగ నిర్మాత విగ్రహ నిర్మాణం చేపట్టడం అభినందనీయం: గూడురు ఎమ్మెల్యే వరప్రసాదరావు ►బీఆర్ అంబేద్కర్కు మనమిచ్చే నివాళి ఇదే ►సమాజంలో అందరూ సమానమే ►దళితుల కోసం అంబేద్కర్ చూపిన బాటలోనే సీఎంజగన్ నడుస్తున్నారు ►దళితుల సంక్షేమ కోసం అనేక నిరర్ణయాలు తీసుకున్నారు ►బడుగు, బలహీన వర్గాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు TIME: 10:30AM ►విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి: మంత్రి మేరుగు నాగార్జున ►అన్ని పనులూ తుది దశకు చేరుకున్నాయి. ►అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నాం ►టూరిజం స్పాట్గా దీనిని తీర్చిదిద్దుతున్నాం TIME: 10:20AM ►విద్య అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదు: మంత్రి బొత్స సత్యనారాయణ ►సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతోనే పేదవాడికి విద్య చేరువైంది. ►ట్యాబ్ల పంపిణీలతో డిజిటల్ విద్యను మరింత చేరువ చేశాం ►అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటాలి. ►దేశం మొత్తం ఏపీ విద్యావిధానాలను ప్రశంసిస్తోంది. TIME: 10:07AM ప్రారంభమైన మండలి సమావేశం ►శాసనమండలిలో రాష్ట్రంలో రోడ్లు, రహదారుల ఏర్పాటు అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పీడీఎఫ్ సభ్యులు ►వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ TIME: 10:00AM ►ఇంగ్లీష్ మీడియా, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయి. ►అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. ►నాడు-నేడు కింద 56 వేల స్కూల్స్ను బాగు చేశారు. ►నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారు. ►విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది ► విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. ►నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ►విద్యా విధానాల్లో మార్పుతోనే విద్యార్థులు హాజరు శాతం పెరిగింది. ►గతంలో స్కూల్స్లో టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉండేది. ►విద్యారంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం. ►విద్యారంగంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ►డిజిటల్ విద్యను పేదవారికి చేరువచేసిన నాయకుడు జగన్. ►గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసింది. TIME: 9:35AM ►అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ►ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ►మైనార్టీ సంక్షేమానికి టీడీపీ హయాంలో చేసిన ఖర్చు రూ. 2,665 కోట్లు మాత్రమే TIME: 9:20AM ► చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ►కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు ►మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ►మైనార్టీ సంక్షేమం అంటే గుర్తొచ్చే పేరు వైఎస్సార్ ►తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్ మైనార్టీల సంక్షేమంపై దృష్టి పెట్టారు సాక్షి, అమరావతి: అయిదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇటు శాసన మండలిలోనూ స్కిల్ డెవలప్మెంట్, విద్య రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలపై సబ్యులు చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరిరోజు. ఈ రోజుతో సమావేశాలు ముగియనున్నాయి. -
సామాజిక న్యాయం చేయాలంటే కులాల వారీగా జనగణన అవసరం
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
దేవాదయ భూముల పరిరక్షణపై రాజీపడేది లేదు
-
పోలవరం ప్రాజెక్టు పనులపై క్లారిటీ.. మంత్రి అంబటి
-
ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ విద్య ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానాలు
-
విలేజ్ హెల్త్ క్లీనిక్స్తో ఇంటింటికి ఆరోగ్య సేవలు
-
కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు.. అందుకు నిదర్శనం ఇదే..
-
జగనన్న గోరుముద్ద అద్భుతమైన పథకం
-
ప్రైవేట్ హాస్పిటల్ దక్కని వైద్యం.. గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది
-
ఇంటర్ వరకూ కొనసాగించాలన్న విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళతాం: బొత్స
-
రోజుకు సగటున 5వేలకు పైగా పేషెంట్లు ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు
-
ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతోమందికి లబ్ది జరిగింది
-
ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని: మంత్రి విడదల రజిని
-
దేవాలయాల సంక్షేమంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు: కొట్టు
-
మన జగనన్న వచ్చాకే.. దేవాలయాలు వెలిగిపోతున్నాయి: బియ్యపు మధుసూదన్ రెడ్డి
-
దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నాం:కిలారి రోశయ్య
-
అర్బన్, రూరల్ అర్చకులకు శుభవార్త
-
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది: ధర్మాన ప్రసాదరావు
-
గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి మరిన్ని సేవలు
-
అసెంబ్లీలో మంత్రికి ఎమ్మెల్యే ప్రశ్నలు..
-
పేదలకు డీబీటీ ద్వారా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం: కిలారి రోశయ్య
-
సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నాం
-
ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా
Live Updates: Time:3:20PM ►ఏపీ అసెంబ్లీ రేపటికి(బుధవారం) వాయిదా పడింది Time: 3:00PM అసెంబ్లీలో ఫైబర్ నెట్ స్కామ్పై చర్చ ►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో రూ. 114 కోట్లు కొట్టేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►స్కిల్ స్కామ్లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి ►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపింది. ►సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు ►సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు. ►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్నెట్ టెండర్ కట్టబెట్టారు ►షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ►హెరిటేజ్లో పనిచేసేవారే టెరాసాఫ్ట్లో డైరెక్టర్లుగా పనిచేశారు ►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎండగట్టారు Time: 02:20PM ► శాసన మండలి రేపటికి వాయిదా Time: 02:00PM ►చంద్రబాబు స్కిల్ స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్గా మారింది: ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ►లోకేష్ విదేశాల్లోచదివి స్కాంలపై స్పెషలైజేషన్ చేశాడు ►ఫేక్ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్ బాగా నేర్చుకున్నాడు ►ఏ విధంగా స్కిల్ స్కామ్ చేశారనేది అందరికీ తెలుసు ► పక్కా ప్లానింగ్తోనే స్కిల్ స్కామ్ జరిగింది. ► స్కిల్ స్కామ్కు కథ, స్క్రీన్పై, దర్శకత్వం చంద్రబాబే ► చంద్రాబు కనుసన్నల్లోనేస్కిల్ స్కాం జరిగింది Time: 01:30PM శాసనమండలి ► రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మంత్రి బొత్స సత్యనారాయణ ► దేశంలోని 100 టాప్ విశ్వవిద్యాలయాల్లో ఏపీలోని విద్యాలయాలు కూడా చోటు పొందేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని సీఎం సూచించారు. ► పాఠశాలలో ఇచ్చే విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లలో విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండేలా చర్యలుచేపడతాం. ► రాష్ట్రంలో 46 వేల స్కూళ్లు నాడు-నేడు కింద అభివృద్ధి చేయడం జరిగింది. ► ప్రస్తుతం మన బడి నాడు-నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి. ► సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో సైతం మన బడి నాడు-నేడు అమలు జరుగుతోంది. ► బైజూస్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇస్తామని కోరితే సీఎం అంగీకరించారు. ►బైజూస్కు ప్రభుత్వం ఒక రూపాయి కూడా చెల్లించలేదు ► టెండర్ల ప్రకారమే పారదర్శకంగా ట్యాబ్లుకొనుగోలు జరిగింది. ► బైజూస్ కంటెంట్ అంశంలో కొన్ని పత్రికలు అవాస్తవాలను రాస్తున్నాయి Time: 12:40PM బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ ►దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం అవసరం ►కులాల వారీగా జనగణన జరగడం లేదు ►సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు జనగణన చేయాల్సిందే. ►సామాజిక న్యాయం చేయాలంటే కులాల వారీగా జనగణన అవసరం ► ఏపీ అసెంబ్లీకి విరామం శాసనమండలిలో చర్చ ►గతంలో కంటే ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది: మంత్రి అంబటి రాంబాబు ►ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు రూ.55కోట్లు అవసరం ఉంది ►నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాం ►వరదల కారణంగా డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పనులు నిలిచిపోయాయి ►పనులు ఆగిపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. ►జగనన్న గోరుముద్ద అద్భుతమైన పథకం ►పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాం ►ఇంటర్ వరకూ జగనన్న గోరుముద్ద కొనసాగించాలని కోరుతున్నాం ►ఇప్పటి వరకూ రూ. 6,600 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశాం ►ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని: మంత్రి విడుదల రజిని ►ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చాం ►విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట: ఎమ్మెల్యే గోపిరెడ్డి ►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతో మందికి లబ్ధి ►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు Time: 11:00AM ►విద్య, వైద్య రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ►సీఎం జగన్ విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యతనిచ్చారు. ►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు ►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతోమందికి లబ్ది జరిగింది ►రోజుకు సగటున 5 వేలకు పైగా పేషెంట్లు ఆరోగ్య శ్రీ సేవలు Time: 10:30AM ►దేవాలయాల సంక్షేమంపై సీఎం జగన్ దృష్టిపెట్టారు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►అర్చకులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ ►గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను ఆదాయంగానే చూసింది ►ధూపదీపనైవేద్యాల స్కీమ్కు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నాం. Time: 10:13AM ప్రారంభమైన మండలి సమావేశం ►రాష్ట్ర సమగ్ర శిక్ష, కస్తూరిబా విద్యాలయాలలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పిడిఎఫ్ సభ్యులు ►వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ Time: 10:06AM ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి Time: 10:02AM AP రైతులకు శుభవార్త ►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన ►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి ►రైతులకు ఇక పై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగలేదు ►సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ►సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారు ►రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన ►తొలిసారిగా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ►ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చాం ►దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నాం ►ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు పంటలను అమ్ముకోగలుగుతున్నారు ►ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తాం :::మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి Time: 09:57AM ►ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్ కోసం బడ్జెట్ కేటాయించాం ►దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నాం ►ఇంకా కొన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాల స్కీమ్ చేర్చాలి ►అర్చకులకు ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయం :::మల్లాది దేవాలయాల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ గత ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది Time: 09:55AM సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకం: మంత్రి ధర్మాన ►సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకంగా వ్యవహరిస్తోంది ►ఫోర్జరీలకు అవకాశం లేకుండా పోయింది ►సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం ►ప్రతీ పథకం ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం Time: 09:40AM ►జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరిగింది ►గతంలో ఒక్కో సర్టిఫికెట్ కోసం ఒక్కో ఆఫీస్ తిరగాల్సి వచ్చేది. ►ఇప్పుడు జగనన్న సురక్షతో ఒకే చోట అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్నాం ►గడపడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాం: ఎమ్మెల్యే కిలారు రోశయ్య ►కులం, మతం పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ప్రజలకుసంక్షేమ పథకాలను అందిస్తున్నాం ►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చాం ►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం ►సచివాలయ భవన నిర్మాణాలకు ప్ర తిపక్షాలు అడ్డుపడుతున్నాయి: రామచంద్రారెడ్డి ►సచివాలయ సిబ్బంది స్పౌజ్ బదిలీ కేసులను సానుభూతితో పరిశీలించాలి. ►సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయి: బూడి ముత్యాల నాయుడు ►సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు అన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నాం ►సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం ► అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాం Time: 09: 20AM ►పేదలకు డీబీటీ ద్వారా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి ►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చారు. ►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం ►సచివాలయాల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం ►అసెంబ్లీలో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్ సాక్షి, అమరావతి: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్పై సభ్యులు చర్చించనున్నారు. విద్యారంగంపైనా చర్చ జరగనుంది. -
రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌరవాన్ని పెంచుతాయని వివరించారు. సీఎం జగన్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ఈ భూముల యజమానులు ఎన్ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్ జగన్ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని, ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు. వైఎస్సార్ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు. 15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు ఒక స్కూల్ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు. తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రతి సెక్రటేరియట్ ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్తోపాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్ ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్ఓఆర్ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్ టైటిల్తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు. వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్ల్యాండ్లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్ భూములపై హక్కులు నిరుపేదలకు వరం. గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్లైన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అసైన్డ్ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్. సీఎం జగన్ ఫిలాసఫీ లోకల్టెక్. చంద్రబాబు కార్పొరేట్ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది. అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్కి సపోర్ట్ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు.. జగన్ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహనరావు చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్ రీజియన్లో 1,400 ఎకరాల అసైన్డ్ భూములను దోచుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. అభినవ కొమరం భీం జగన్ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి అసైన్డ్ భూములకు సీఎం వైఎస్ జగన్ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్.. అభినవ కొమరం భీం. -
బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్.. తోక ముడిచారంటూ..
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక, సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా, ఈరోజు అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో మహిళ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లను తుడుస్తున్న సీఎం జగన్ అసెంబ్లీలో మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీర్చుతున్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్ అంటున్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో మహిళల కోసం చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు 14 ఏళల్లో మహిళల కోసం ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో మహిళలకు రాజకీయంగా సీఎం జగన్ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్ లీడర్.. చంద్రబాబు చీటర్ రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ. చంద్రబాబు చీటర్.. ముఖ్యమంత్రి జగన్ లీడర్. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా?. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమనే సునామీ దెబ్బకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సముద్రపు అలల్లో కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరు: మంత్రి అంబటి -
అవినీతి లేకుండా చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పం
-
సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు
-
స్కిల్ స్కామ్ లో దొరికిన వ్యక్తికి పవన్ సపోర్ట్ చేస్తున్నారు : సుధాకర్ బాబు
-
చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరు: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ స్కాంపై చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారని విమర్శించారు. అసెంబ్లీలో మీసాలు మెలేసీ, తొడలు కొడుతున్నారని విమర్శించారు. సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని అన్నారు. ‘రాజకీయాలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఆయనతోపాటు బాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుసు విపరీతంగా దోచుకున్నారు. దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్లు చాలానే ఉండొచ్చు. రోజురోజుకు వాస్తవాలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరు. ‘రోజు రోజు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లంగా అర్థమవుతున్నాయి. అందుకే స్కిల్ స్కాంపై చర్చించేందుకు ఆహ్వానించినా.. ఆ దొంగలు (టీడీపీ ఎమ్మెల్యేలు) పారిపోయారు. ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష కాదు. తప్పు చేశారు కాబట్టే ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద వారైనా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే. న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని మంత్రి అంబటి తెలిపారు. చదవండి: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్ -
మహిళ రిజర్వేషన్కు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ
Live Updates ►మహిళ రిజర్వేషన్కు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ ►ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ ►అసెంబ్లీ రేపటికి వాయిదా మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►సీఎం జగన్ సారథ్యంలో మహిళా సాధికారతకు అడుగులు ►వైఎస్సార్ చేయూతలో మహిళలను సీఎం జగన్ ఆదుకుంటున్నారు ►యువత పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారు ►స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చంద్రబాబు యువతను మోసం చేశారు ►హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకు మిగతా డైయిరీలకు నష్టం కలిగించారు. ►స్కాముల సీఎంగా చంద్రబాబు గుర్తుండిపోతారు ►సీఎం జగన్ సారథ్యంలో మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వాల కంటే పదిరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం ►పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకముందే.. మూడేళ్లు ముందుగానే రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు సీఎం జగన్ మంత్రి ఆర్కే రోజా ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు సీఎం జగన్ తుడిచారు ►మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారు ►ప్రతి ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీర్చుతున్నారు ►సీఎం జగన్ మహిళల కోసం చేసిన కృషిన చూసి.. మహిళలందరూ జయహో జగన్ అంటున్నారు ► సంక్షేమం అంటే ఏమిటో సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు ►సీఎం జగన్ పాలనలో మహిళలు ఆర్థికంగా ఎంతో బలంగా మారారు ►14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా? ►ఆడపుట్టకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ►చంద్రబాబు చీటర్.. జగన్ లీడర్ ►చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని మహిళలందరికీ తెలుసు ►చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు ►బాలకృష్ణ మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారు ►చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ ►సీఎం జగన్ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా? ►రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ ►మహిళలకు రాజకీయంగా సీఎం జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు ►దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే రాజకీయంగా సీఎం జగన్ అవకాశాలు ఇచ్చారు. ►రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం జగన్ అండగా ఉన్నారు: ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ►రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారు: ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారు సీఎం జగన్ ►రాష్ట్రంలో మహిళలకు ఎన్నో పథకాలు అమలవుతున్నాయి.. అందుకు కారణం సీఎం జగన్ ►మహిళల సాధికారత కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే కె. శ్రీదేవి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మహిళలకు అన్ని విధాలుగా సీఎం జగన్ చేయూత అందిస్తున్నారు ►పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు ►మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ►మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు ►దిశా యాప్, మహిళా పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను మోసం చేశారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మహిళా రైతులకు సీఎం జగన్ అండగా ఉంటున్నారు ►మహిళా సంక్షేమంలో దేశంలో ఏపీ ఆదర్శంగా నిలిచింది ►మహిళలను శక్తివంతులుగా తయారు చేస్తున్నారు ►మహిళలకు ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు సీఎం జగన్ ►మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ►మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన ►జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ►గత ప్రభుత్వంలో మహిళలు ఎన్నో కష్టాలు పడ్డారు సమగ్ర భూసర్వేపై అసెంబ్లీలో చర్చ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►ప్రభుత్వ సంస్కరణలను అంతా అభినందించాలి ►అందుకే ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం ► ఏ సంస్కరణ తీసుకొచ్చినా అవినీతి లేకుండా చేయాలనేదే సీఎం జగన్ సంకల్పం ►రైతుపై ఒక్క రూపాయి భారం లేకుండానే సర్వే చేశాం ►ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పూర్తవుతుంది ►మరో రూ. 500 కోట్లు ఖర్చు పెడతాం ►4వేల గ్రామాల్లో సర్వే పూర్తయింది ►భూసర్వేకు 10వేల మంది సిబ్బందిని నియమించాం ►సర్వే కోసం ఇప్పటిదాకా రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాం ►సర్వే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం ►భూసర్వే ఓట్ల కోసం చేసింది కాదు..భవిష్యుత్తు తరాల కోసం చేసింది ►అసెన్డ్ ల్యాండ్స్పై గతంలో ఎవరూ దృష్టిపెట్టలేదు ►వైఎస్సార్ హయాంలో 7 లక్షల ఎకరాలు అసెన్డ్ ల్యాండ్ అందజేశారు ►లంక భూములపై సాగుదారులకు సంపూర్ణహక్కు కల్పిస్తున్నాం ►అసైన్డ్ ల్యాండ్పై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది ►ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సీఎం జగన్ ►రెవెన్యూశాఖలో సంస్కరణలు ఎంతో మేలు చేస్తున్నాయి ►అందరూ గర్వపడేలా సంస్కరణలు తీసుకొచ్చాం ►సంస్కరణలు చేయాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ►సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు ►పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నారు. ►భూములు బలవంతంగా లాక్కునే పరిస్థితులు నేడు లేవు ►అసైన్డ్ ల్యాండ్పై సర్వ హక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది. ►ఈ చట్ట సవరణ ద్వారా లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ►అత్యాధునిక పద్దతిలో భూ సర్వే జరుగుతోంది: ఎమ్మెల్యే జగన్మోహన్రావు ►భూసర్వేతో కొన్నేళ్లుగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కారం ►అన్ని వర్గాలకూ న్యాయం చేసే ఉద్ధేశంతోనే భూసమగ్ర సర్వే ►పేదలకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కు గొప్పవరం: పాడేరు ఎమ్మెల్యే భాగలక్ష్మి సమగ్ర భూసర్వేపై ఏపీ అసెంబ్లీలో చర్చ ►సీఎం జగన్ పేదవారికి అండగా నిలుస్తున్నారు: సుధాకర్ బాబు ►గత ప్రభుత్వం వదిలేసిన సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. ►హామీలు ఇవ్వడమే కాదు దానిని అమలు చేసిన ఘనత సీఎం జగన్దే ►అందదికీ సమానమైన స్థాయి, న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన ►వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం జగన్ ►సీఎం జగన్ కార్మికులు, కర్షకులను ప్రేమిస్తారు. ►భూమాతను కొందరికే సొంతం చేసిన వ్యక్తి చంద్రబాబు ►పవన్ విలన్లకు సపోర్టు చేస్తున్నాడు ►స్కిల్ స్కామ్లో దొరికిన వ్యక్తికి పవన్ సపోర్టు చేస్తున్నారు. ►రాజకీయాల్లో ఉండేందుకు చంద్రబాబు అనర్హుడు. ►ఏ వర్గానికీ చంద్రబాబు న్యాయం చేయలేదు ►ఏ రోజైనా పేదలకు ఇళ్ల పట్టలిచ్చావా చంద్రబాబూ? 4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ ►ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్ సవరణ బిల్లు ►గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు 2023 ►ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు 2023 ►ఏపీ వస్తు సేవల పన్నుల సవరణ బిల్లు-2023 కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ►రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ►గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసింది. ►సమగ్ర భూ సర్వే గొప్ప కార్యక్రమం. ►క్యూఆర్ కోడ్ ద్వారా భూ వివరాలు తెలుసుకోవచ్చు. ►అన్ని వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ►అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం పేదవారికి వరం. భూదాన్-గ్రామదాన్ సవరణ బిల్లుకు ఆమోదం ►భూదాన్-గ్రామదాన్ సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ ఆమోదం ►ఉమ్మడి రాష్ట్రంలో చట్టానికి ప్రస్తుతం కొన్ని మార్పులు చేశాం ►ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేశాం : మంత్రి ధర్మాన శాసన సభలో.. ►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు ►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది ►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు ►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు ►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం ►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్లు చాలానే ఉండొచ్చు ► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు ::: మంత్రి అంబటి రాంబాబు శాసనమండలిలో.. ►24వేల 876 మత సంస్థలు సత్రాలకు సంబంధించిన నాలుగు లక్షల 65 వేల ఎకరాల భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంది ► 1,44,000 ఎకరాల భూమి భూమి లీజుకు ఇచ్చాము ►దానిద్వారా 1. 55 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ►దేవాదాయ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ 83 జీవో ను తీసుకు వచ్చాము ►దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన సెక్షన్ 83 ద్వారా 8 సంవత్సరాలు జైలు శిక్ష ,ఒక లక్ష జరిమానా విధించ బడును ►దేవాదాయ శాఖ భూముల పై లీజు చెల్లించుకున్న ఆక్రమణ చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము ►తిరుమలలో భక్తుల రక్షణ కోసం ట్రాప్ 330 కెమెరాలను ఏర్పాటు చేశాము ►ఇప్పటికే ఆరు చిరుతలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి ►ఏడో మైలురాయి వద్ద వన్యప్రాణి సంరక్షణ నిమిత్తం టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో స్టేషన్ ఏర్పాటు చేశాము ►భక్తులకు వెదురు కర్ర సైతం అందజేస్తున్నాము ►ఏడో మైలు రాయి వద్ద వంద నుండి 200 మందిని గుంపులు గుంపులుగా పంపుతున్నాము ►కాలినడక మార్గంలో 500 మీటర్ల పొడవునాలైటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ►చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని సైతం ప్రభుత్వం ఆదుకుని ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది ►వైల్డ్ లైఫ్ ఇండియా డెహ్రాడూన్ వారిచే ఒక అధికారుల బృందం చే సర్వే చేయిస్తున్నాము ►ఆ నివేదిక ఆధారంగా పలు చర్యలు తీసుకుంటాము. :::దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్ సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ►ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోప్రసంగించడం హర్షనీయం ►విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావడమే దీనికి కారణం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చ ►గత ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆంక్షలు పెట్టింది ►సీఎం జగన్ పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అందిస్తున్నారు. ►రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 160.23 కోట్లు ►మత్స్యాకార భరోసా కింద రూ. 6.10 కోట్లు ►వైఎస్సార్ సున్నా వదడ్డీ రూ. 817.61 కోట్లు ►వైఎస్సార్ పింఛన్ కానుక రూ. 13,410.52 కోట్లు శాసనమండలి ► చేనేత కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►బడ్జెట్లోనూ చేనేత కార్మికులకు ప్రాధాన్యత ►గత ప్రభుత్వ చేనేతలకు అందించాల్సిన సబ్సిడీలో రూ. 106 కోట్ల బకాయిలను పెట్టింది ►వైఎస్సార్ నేతన్న నేస్తం రూపంలో సీఎం జగన్ అండగా నిలిచారు. ►ఐదు విడదల్లో 82 వేల మందికి రూ.960 కోట్లు వారి ఖాతాలో జమచేశారు. ►ఇతర సబ్సిడీల రూపంలో రూ.40 కోట్ల మీర నేతన్నలకు ప్రయోజనం చేకూర్చారు ►ఆప్కో వస్త్రాలను ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం ►నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు కేంద్రం రద్దు చేసింది ►దానిని పునురద్దరించాలని కేంద్రానికి లేఖ రాస్తాం ►రాష్ట్రంలో లక్షా 65వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు ►చేనేతలకు సంబంధించిన 11 రకాల వస్త్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు హ్యండ్లూమ్ రిజస్ట్రేషన్ యాక్ట్ తెచ్చాం ►కేంద్ర జౌళి శాఖలో 55 శాతం చేనేతకు బడ్జెట్ కేటాయింపులనుప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతాం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ ►విద్యలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ►రైతులకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమే: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు ►పాలవెల్లువ కార్యక్రమంతో పాడి రైతులకు ఎంతో మేలు చేశారు ►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనతో లక్షలాది మందికి లబ్ధి: మంత్రి మేరుగు నాగార్జున ►చదవుకు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది ►రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం ►ప్రతీ సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నాం రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది ►గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది ►రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ సిద్ధాంతం ►కోవిడ్ సంక్షోభంలోనూ మా ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ►రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది ►రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం ►ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం ::: మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ►రుణమాఫీపై చంద్రబాబు మోసం చేశారు. ►ఇచ్చిన హామీల్లో 10శాతం కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. ►చంద్రబాబు పెట్టి వెళ్లిపోయిన బకాయిలన్నీ సీఎం జగనే చెల్లించారు. ► గత నాలుగేళ్లుగా సీఎం జగన్ రైతుభరోసా కింద రూ.31వేల కోట్లు అందించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ►పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేడు సమావేశం ►- భేటీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ►అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చ ►తదుపరి కార్యాచరణపై ఎన్టీఆర్ భవన్లో జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చ స్కిల్ స్కామ్లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 ► మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాక్షి, అమరావతి: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. మహిళ సాధికారతపై చర్చించనున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. అనంతరం అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై చర్చ సాగనుంది. మరోవైపు 10 గంటలకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి చర్యలపై చర్చించనున్నారు. -
టీడీపీ నేతల సస్పెన్షన్.. స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని హెచ్చరించారు. ప్రతీ సభ్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కాగా, స్పీకర్ తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. శాసనసభ్యులు సభా సంప్రదాయాలను ఉల్లఘించి సమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారు. స్పీకర్ పోడియంపైకి రావడం.. గేలి చేయడం ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను శాసనసభలో ఉన్నాను అని, బాధ్యతగా వ్యవహరించాలనే స్పృహ సభ్యులకు ఉండాలి. సభ్యులపై సస్పెన్షన్ ఒక్కటే కాదు.. అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో సభలో చర్చించేందుకు సమయం ఇచ్చాం. కానీ, టీడీపీ సభ్యులు ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. ప్లకార్డులు ప్రదర్శించడం, విజిల్స్ వేయడం, సభలో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భావన ఉంటే.. శాసనసభలో ఉండి పోరాడాలి. చంద్రబాబును, టీడీపీ సభ్యులను సభ నుంచి ఎవరూ పొమ్మనలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనపై కేసు నమోదు అయ్యింది. స్కిల్ స్కాంపై సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో పొత్తులు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధించినవి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి హిమబిందుపై టీడీపీ నేతలు పోస్టులు.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ -
బాలకృష్ణ, టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు సభకు చర్చకోసం లేదని, రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బాలకృష్ణకు చంద్రబాబు సీటు మీద మనసు లాగినట్లుందని.. అందుకే బావ కుర్చీ ఎక్కి విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేశాలేశాడని విమర్శించారు. అసెంబ్లీలో తొడగొట్టడం కాదని, చేతనైతే హైకోర్టుకు పోయి జడ్జి ముందు తొడకొట్టాలని బాలకృష్ణకు చురకలించారు. బాలకృష్ణకు రోషం లేదా మా బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి బాలకృష్ణకు మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బాలకృష్ణ, టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. సోమవారం వస్తారో... మంగళవారం వస్తారో.. బుధవారం వస్తారో మీ ఇష్టం, స్కిల్ స్కామ్ మొదలు చంద్రబాబు అన్ని స్కాములపైనా చర్చిద్దామని చాలెంజ్ చేశారు. బాలకృష్ణ సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు. అసెంబ్లీకి వచ్చి మా బావ తప్పు చేయలేదు..ఈడీ ఎంక్వైరీ వేయండి అని అడగాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని. తనకెలాగూ సభకు వచ్చే సీన్ లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు చిన్న మెదడు చితికింది లోకేష్ తన మామ బాలకృష్ణను సభకు పంపించాలని, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి రోజా తెలిపారు. టీడీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందని విమర్శించారు. వ్యవస్థలను దోచుకున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఇలా దొరికిపోయానేంటో అనే భయంలో ఉన్నారని, టీడీపీ నేతలకు చిన్నమెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో అర్ధ కావడం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలను తీర్చే బదలు ప్రజలకు సమస్యగా మారారని దుయ్యబట్టారు. ఇక తమ నాయకుడైన వైఎస్ జగన్ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్ సిగ్గుచేటు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలి ‘చంద్రబాబు ఆ జాతికి పిత కాబట్టి ఎల్లో మీడియా తెగ బాధపడుతోందని మంత్రి రోజా దుయ్యబట్టారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని తెలిపారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు జైలుకి పోతే.. సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ దొంగ చంద్రబాబు సాష్టాంగపడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ దోచుకుని పక్కరాష్ట్రంలో ప్యాలెస్లు కట్టిన చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడటం చేత కాదా? టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు పారిపోయారు. చంద్రబాబు స్కామ్ చేశాడు దోచుకున్నాడని టీడీపీ నేతలకు కూడా తెలుసు. అందుకే పచ్చ ఛానల్స్లో కవరింగ్ ఇవ్వడానికి సభలో గందరగోళం సృష్టించారు. టీడీపీ నేతలకు కూడా స్కిల్ స్కామ్లో వాటా ఉందా?. బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు?. బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమే డైలాగ్ చెప్పడం వచ్చా?. అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదా?. ముందుండి పార్టీని నడిపిస్తానని చెప్పిన ఆయన ఎందుకు పారిపోయాడు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కామమ్కు పథకం వేశాడు. జీవోలో లేనప్పుడు ఒప్పందాలపై ఎలా సంతకాలు చేశారు’ అని మంత్రి రోజా పేర్కొన్నారు. చదవండి: పట్టాభిరామ్ ఓవరాక్షన్పై టీడీపీ నేతల సీరియస్ స్కిల్ స్కామ్పై చర్చ ఉందని తెలిసే టీడీపీ నేతలు రకరకాల విన్యాసాలు చేశారు. నోటితో సమాధానం చెప్పలేక విజిల్స్తో విన్యాసాలు చేసినా ప్రభుత్వం సంయమనం పాటించింది. సమాధానం చెప్పలేకే టీడీపీ నేతలు పారిపోయారు. త్వరలోనే లోకేష్కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. టీడీపీ నేతలకు దమ్ముంటే సభకు హాజరై చర్చలో పాల్గొనండి. మీ నేత తప్పు చేయలేదని నమ్మితే సభకు రండి. -ప్రభుత్వ విప్, కరణం ధర్మశ్రీ చట్టసభలంటే టీడీపీ నేతలకు గౌరవం లేదు. చంద్రబాబు పాపం పండి కటకటాల పాలయ్యాడు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. బాలకృష్ణ ఒక మెంటల్ కేసు. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉంది. -ఎమ్మెల్సీ,పోతుల సునీత -
టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్ సిగ్గుచేటు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబుకు కేటాయించిన కుర్చీపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్స్ వేయడం సిగ్గుచేటని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, అసెంబ్లీలో ఈలలు వేసి సభ సాంప్రదాయాలను బాలకృష్ణ పాడు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ కేసులో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో సీఐడీ అధికారులుకోర్టుకు వివరించారని తెలిపారు. ఢిల్లీ నుండి పెద్ద న్యాయవాదులు వచ్చినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. పీఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ఎలా డబ్బు దండుకున్నదీ సీఐడీ గుర్తించిందని అన్నారు. సమస్యలపై ఎందుకు చర్చించలేదు సభలో రచ్చ చేయటానికి టీడీపీ సభ్యులు వచ్చారని విమర్శించారు. గొడవలు చేసిన ఆరుగురిని సస్పెండ్ చేస్తే టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. మిగతా వారు సభలో కూర్చుని సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వారెవరికీ ప్రజా సమస్యలు పట్టలేదని అర్ధం అవుతుందని, అసెంబ్లీలో మాట్లాడటానికి చేతగాక టీడీపీ సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు. నేరం చేసిన గజదొంగ చంద్రబాబు అని.. అందుకే కోర్టు కూడా క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. టీడీపీ వాళ్ల దగ్గర విషయం లేదు ‘వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. సభాపతి, మండలి ఛైర్మన్ అంటే టీడీపీ నేతలకు మర్యాద లేదు. సభకు రానంటున్నారంటే నేరం అంగీకరించినట్లే. టీడీపీ నేతల దగ్గర విషయం లేదు కాబట్టే సభ నుంచి పారిపోయారు. ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, నాశనం చేయడం చంద్రబాబు, టీడీపీ నేతల నైజం. సస్పెండ్ కాకుండా మిగిలిన సభ్యులు సభలో ఉండి ఉంటే చంద్రబాబు అవినీతి వివరాలను తెలుసుకునేరు. ఆ అవసరం లోకేష్, కుటుంబానికే ఉంది చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడు. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారు. చంద్రబాబుకు హాని తలపెట్టాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్కు, ఆయన కుటుంబానికే ఉందిఏ తప్పు చేసినా తెలివిగా తప్పించుకోగలననే చంద్రబాబు స్కిల్.. స్కిల్ స్కామ్లో పారలేదు’ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు. చర్చకు రమ్మంటే రావడం లేదు: మంత్రి బొత్స చంద్రబాబు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయినా కూడా ఏకపక్షంగా కేసులు ఎత్తి వేయాలని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు మీద చర్చకు రమ్మని తాము కోరితే రావడం లేదని అన్నారు. సభ నుంచి వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కావాలనే సభలో గొడవ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దోపిడీ గురించి తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసని.. కానీ కావాలనే సభలో గొడవ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము పూర్తి వివరాలతో వివరించామని చెప్పారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్క దారి పడతాయని ప్రశ్నించారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గు తేల్చిందని తెలిపారు. దొరికిపోతామని టీడీపీ భయపడుతోంది ‘ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృధా చేస్తుంది. అవినీతికి పాల్పడ్డ బాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుంది. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలి. స్కామ్లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు. స్కిల్ స్కామ్లో ఎంత అవినీతి జరిగిందో.. ఎలా జరిగిందో మేం సభలో చెప్పాం. టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుంది. తప్పు చేశారు కాబట్టే హై కోర్ట్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలి’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
వాల్తేరు వీరయ్య నటుడు బాబీకి స్నేహితుల నుంచే హత్య బెదిరింపులు!
వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్సీజర్గా చిరంజీవితో పోటీపడి నటించిన బాబీ సింహాకు హత్య బెదిరింపులు వచ్చాయి. వాస్తవానికి అతను తెలుగు వాసి, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కానీ ఆయన తమళనాట సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా కొడైకెనాల్లో తాను నిర్మించాలనుకుంటున్న ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లే బాబీ సింహాను చంపేస్తామని బెదిరించారు. ఆ కాంట్రాక్టర్లు కూడా బాబీ స్నేహితులే కావడం గమనార్హం. కొడైకెనాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం బాబీ సింహా మాట్లాడుతూ.. 'కొడైకెనాల్లో నేను ఇల్లు నిర్మించాలని అనుకున్నాను.. కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్లు నాసిరకం పద్ధతిలో ఇల్లు నిర్మిస్తున్నారు. తమిళనాట రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి ఉసేన్.. అతను పరిచయం చేసిన బిల్డింగ్ కాంట్రాక్టర్ జమీర్తో నటుడు బాబీ సింహా తన ఇంటి నిర్మాణం కోసం కోటి 30 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకు సంబంధించిన మొత్తం డబ్బును ఉసేన్, జమీర్లు తీసుకుని అదనంగా రూ. 40 లక్షలు కావాలని ఒత్తిడి చేసి తీసుకున్నారు. (ఇదీ చదవండి: జైలర్ సినిమాను తిరస్కరించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?) అయినా ఇంటి పని పూర్తి అవ్వలేదు. దీంతో మేము కొడైకెనాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అతనికి రాజకీయ నేపథ్యం కారణంగా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో మేము కోర్టుకు వెళ్లి కేసు వేశాము.' అని బాబీ తెలిపాడు. కానీ ఆ కాంట్రాక్టర్లే తిరిగి బాబీ సింహాపై కేసు పెట్టారు. తమను బాబీ బెదిరించారని కాంట్రాక్టర్లు అయిన ఉసేన్, జమీర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేశారని ఆయన తెలుపుతున్నాడు. తాము మొదట ఫిర్యాదు చేసినప్పుడు పోలీసు శాఖ వారు కేసు తీసుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లి పోలీసుల తీరు గురించి వివరించామని బాబీ తరపున ఉన్న లాయర్ తెలిపారు. దీంతో కోర్టు జోక్యం చేసుకోవడంతో సుమారు 10 రోజుల తర్వాత తమ ఫిర్యాదును వెంటనే స్వీకరించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 58 లక్షల 50 వేల వరకు మాత్రమే వారు ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. పూర్తి నాసిరకంగా ఇంటిని నిర్మించారు. దీంతో తాము సుమారు 1 కోటి 11 లక్షల 50 రూపాయలు మోసపోయామని నటుడు బాబి సింహా తరపు న్యాయవాది తెలిపారు. తాము మోసపోయిన డబ్బును వారి నుంచి తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. ఇంత జరుగుతున్నా వారు బాబీని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు 'సినిమాలో మీరు విలన్ కావచ్చు కానీ మేం నిజమైన విలన్లమే' అంటూ నటుడు బాబీ సింహాను ఉసేన్ బెదిరించాడని, వేలచ్చేరి శాసనసభ సభ్యుడు అసన్ మౌలానా కనుసన్నల్లోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. -
ఢిల్లీలో లోకేష్ పరిస్థితేంటి.. ఎంపీల మధ్య ఎందుకు దాక్కున్నాడు?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు వారికే అర్ధం అవడం లేదు. తమకు అనుకూలమైన వాదన లేదు కనుక ఏదో రకంగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని రోజులు శాసనసభ వెలుపల టీడీపీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కానీ.. అసలు స్కామే లేదని ప్రచారం చేశాయి. తీరా శాసనసభ సమావేశాలు ఆరంభమైతే అలా తమ వాదన వినిపించడానికి బదులు రచ్చ రచ్చ చేస్తున్న తీరు వారు సెల్ప్ గోల్ వేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఆత్మరక్షణలో పడినవారు ఎలా ఇబ్బంది పడతారో తెలుగుదేశం నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. శాసనసభ సమావేశాల తొలి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రచ్చ చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత చర్చకు ఇవ్వలేదు. వారు వాయిదా తీర్మానం పేరుతో గందరగోళం సృష్టించడానికి, అరుపులు, నినాదాలు, కేకలు పెట్టడానికే యత్నించారు. నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలలో మాదిరి మీసాలు మెలివేయడం, తొడలు గొట్టడం వంటివి చేసి విమర్శలకు గురయ్యారు. మంత్రి అంబటి రాంబాబుతో గొడవపడి రా చూసుకుందాం అని అనిపించుకునే వరకు వెళ్లారు. తన తండ్రి ఎన్టీ రామారావును పదవి నుంచి దించేసినప్పుడు, ఆయనపై చెప్పులు వేసినప్పుడు ఈ మీసాలు తిప్పడం ఏమైందని బాలకృష్ణను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టినప్పుడు కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. అయితే, వారెవరూ స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించలేదు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం నిబంధనల ప్రకారం తప్పు. అయినా ఏదో నిరసన చెప్పడానికి వెళ్లినా కొద్దిసేపు ఉండి వెనక్కి వచ్చేస్తే పద్దతిగా ఉంటుంది. కానీ, టీడీపీ సభ్యులు స్పీకర్తో దారుణంగా ప్రవర్తించారు. కొంతసేపు ఓపిక పట్టిన ఆయన ఆగ్రహంతో యూజ్లెస్ ఫెలోస్ అని కూడా అన్నారంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన టేబుల్పై ఉన్న కాగితాలు చింపడం, మానిటర్ను పాడు చేయడానికి యత్నించడం, గ్లాసులోని నీళ్లు కింద పోసి పేపర్లను తడపడం వంటి అల్లర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు తెగబడ్డారు. అబద్దానికి గొంతు ఎక్కువ అన్నట్లు, వీరు ప్రవర్తించారే తప్ప, స్కిల్ స్కాంపై చర్చ సిద్దమన్నట్టుగా ప్రవర్తించలేదు. ఈ స్కాంలో చంద్రబాబుకు ఎలాంటి పాత్ర లేదని చెప్పగలిగే వాదన ఉన్నట్లయితే చర్చకు సిద్దపడేవారు. అందులోనూ సీనియర్ నేత, బాగా మాట్లాడతారని భావించే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా నిబంధనలకు విరుద్దంగా వీడియో తీయడం, అల్లర్లలో పాల్గొనడం చూస్తే అదంతా కావాలని చేసినట్లనిపిస్తుంది. సభలో ఉంటే ఆ చర్చలో పాల్గొని స్కామ్ను సమర్దించలేక యాతన పడాల్సి ఉంటుంది కనుక కేశవ్ తెలివిగా సభాకాలం మొత్తం సస్పెండ్ అయ్యారా అనిపిస్తుంది. కాకపోతే కేశవ్ బాగా మాట్లాడతారని అందువల్లే ఆయనను సభ నుంచి బయటకు పంపించారని టీడీపీ అనవచ్చు. సాధారణంగా సభలో సీనియర్ ఎమ్మెల్యేలు, చర్చలో వాదించగలిగినవారు సస్పెండ్ అవకుండా జాగ్రత్తపడతారు. అలా చేయలేదంటే ఈ చర్చ జరగడం వారికి ఇష్టం లేదనిపిస్తుంది. ప్రభుత్వం, అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో సహా కుంభకోణంలో చంద్రబాబు పాత్రను వివరిస్తుంటే అది వినాలంటే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే అల్లరి రూట్ ఎంపిక చేసుకున్నట్లుగా ఉంది. ఈ గొడవలో వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొని సస్పెండ్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అంతే చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ వైపునకు వెళ్లి అదే పనిచేశారు. ఆయనతో పాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా అనుచిత ప్రవర్తనకు గాను సభాకాలం అంతటికి సస్పెండ్ అయ్యారు. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఈనాడు దినపత్రిక ఢీ అంటే ఢీ అనో, దద్దరిల్లిన సభ అనో హెడ్డింగ్ పెట్టి సరిపుచ్చుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అల్లరి, అరాచకాన్ని మాత్రం కనిపించకుండా కవర్ చేసే యత్నం చేసింది. గతంలో టీడీపీ హయాంలో కోడెల శివప్రసాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక చిన్న మాట అన్నా, మొదటి పేజీలో ప్రముఖంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం అంటూ కథనాలు ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు స్పీకర్ సీతారాంపైకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి నానా రభస చేసినా దాని డైవర్ట్ చేస్తూ రాసింది. అలాగే, సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డా దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీని తానే మోస్తున్నానని భావిస్తున్న ఈనాడు మీడియా, దాని అధిపతి రామోజీరావు ఈ రకంగా విలువల వలువలు వదిలేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. మరోవైపు లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తమ అధినేత చంద్రబాబు అరెస్టు అవడాన్ని చంద్రయాన్ చర్చలో లేవనెత్తడం విడ్డూరంగా ఉంది. ప్రయోగం సక్సెస్ అయిన రోజున టీడీపీ నేతలు చంద్రయాన్ సఫలం కనుక ఏపీలో చంద్రబాబు గెలుపు ఖాయమని పిచ్చి ప్రచారం చేశారు. గెలుపు సంగతేమో కానీ, చంద్రబాబు స్కామ్ల్లో చిక్కి జైలుపాలయ్యారు. ఇక, రామ్మోహన్ నాయుడు శాస్త్రవేత్త నంబియార్ అరెస్టుకు, చంద్రబాబు అరెస్టుకు పోలిక పెట్టారు. చంద్రబాబు మచ్చలేని నిజాయితీపరుడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. వాస్తవం ఏమిటో రామ్మోహన్ నాయుడు ఆత్మకు తెలియదా! దీనికి ప్రతిగా వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన స్కామ్ ను గట్టిగా వివరించారు. నిజంగానే చంద్రబాబు స్కాంకు పాల్పడలేదని టీడీపీ ఎంపీలు నమ్మితే ఆయన పీఏ పెండ్యాల శ్రీనివాస్ను అమెరికా ఎందుకు పంపించివేశారో చెప్పగలరా?. అంత వరకు ఎందుకు మాజీ మంత్రి, చంద్రబాబు కుమారుడు లోకేష్ను ఢిల్లీలో తమ మధ్య పెట్టుకుని ఎందుకు కాపలా కాస్తున్నారో చెప్పగలరా?. ఆయన కూడా అరెస్టు అవుతారన్న భయంతోనా? కాదా?. అలాగే బీజేపీ పెద్దలనో, లేక ఇతర పార్టీల నేతలనో కలిసి కేసులో సాయం చేయాలని ఎందుకు అడుగుతున్నట్లు?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారి దిక్కుతోచక అల్లాడుతున్నారని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాలయ్యకు ఇదే సరైన టైం...వెన్నుపోటుకు ప్రతీకారం
-
టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ పై బాలకృష్ణ దురుసు ప్రవర్తన
-
సభలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు
-
ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
-
సభలో విజిల్స్ వేసిన బాలకృష్ణ
-
అసెంబ్లీలో టీడీపీ రచ్చ
-
సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ.. సినిమా రేంజ్లో రెచ్చిపోయి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. విజిల్స్ వేస్తూ బాలకృష్ణ హంగామా.. వివరాల ప్రకారం.. రెండోరోజు సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన బాలకృష్ణ.. ఈరోజు కూడా రెచ్చిపోయారు. అసెంబ్లీలో చంద్రబాబు కూర్చిలో నిలుచుని బాలకృష్ణ.. విజిల్ పట్టుకుని విజిల్స్ వేశారు. సభలో సభ్యులను చూస్తూ విజిల్స్ వేస్తూ హంగామా క్రియేట్ చేశారు. ప్రజాప్రతినిధి అనే స్పృహ కూడా లేకుండా రచ్చ చేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయనతో కలిసి విజిల్స్ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ వెళ్లడంతో వారితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. ఇలా సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు పలికారు. కాగా, నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు సభ్యులు సస్పెండ్.. ఇదిలా ఉండగా.. సభలో మిగతా టీడీపీ సభ్యులు కూడా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సభలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ విధించారు. అచ్చెన్నాయుడు, బి.అశోక్లను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. టీడీపీ సభ్యులు తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం.. ► రచ్చచేసే ఉద్దేశమే తప్ప చర్చించాలనే ఆలోచనే వారికి లేదు. బజారులో ఊదాల్సిన ఈలను ఇక్కడ ఊదుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ మాట్లాడుతోంది. టీడీపీ సభ్యులు సీట్లపైకి ఎక్కి నిల్చున్నారు. చర్చలో పాల్గొనే దమ్ము వారికి లేదు. బాబు మోసగాడని టీడీపీకి బాగా తెలుసు: అంబటి రాంబాబు. ► దేవాలయంలాంటి అసెంబ్లీని కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి, టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: కాకాణి ► టీడీపీ సభ్యుడు ప్రతీ ఒక్కరూ సైకోనే: నారాయణ స్వామి -
బాలకృష్ణ ఇప్పటికైనా మేలుకో.. ఇదే నా సలహా: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీ కాదు.. టీడీపీ పార్టీలో అని హితవు పలికారు మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు.. రచ్చ.. కాగా, మంత్రి అంబటి రెండోరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్పై సరైన ఫార్మాట్లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు.. రచ్చ. శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలనేదే టీడీపీ ఉద్ధేశం. చంద్రబాబు అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజైనా సరైన ఫార్మాట్లో చర్చకు రావాలని కోరుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే రండి చర్చిద్దాం. మీ వాదనలను మీరు వినిపించండి.. మా వాదనలు మేం వినిపిస్తాం. చంద్రబాబు అవినీతి చేయలేదని మీకు నమ్మకం ఉంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని మీరు నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనండి, పారిపోవద్దు. బాలకృష్ణ ఇదే సరైన సమయం.. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్గా ఉన్నాడు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి. జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చింది. మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బ్రతికించుకోండి. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు నేను సలహా మాత్రమే ఇస్తున్నాను. పాటిస్తే పాటించు.. పాటించకపోతే అథపాతాళానికి పోతారు. దమ్ముంటే చర్చకు రండి.. మీకు మీ నాయకుడు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే కమాన్ చర్చలో పాల్గొనండి. ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు తప్పుచేశారో. ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది చర్చకు రండి. చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఉన్నారు. నేను లేచి నిలబడకపోతే స్పీకర్ మీద దాడి చేసేవారు. పేపర్ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోంది. ఈరోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్ కచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని అన్నారు. ఇది కూడా చదవండి: శవాలను వెతుకుతున్న యెల్లో రాబందులు -
ఏపీ అసెంబ్లీలో స్కిల్ స్కామ్పై చర్చ
Updates.. అసెంబ్లీలో బుగ్గన ప్రసంగం ►డేట్ అనేది మెన్షన్ చేయకుండా అగ్రిమెంట్ చేసుకున్నారు ►తేదీ లేకుండా అగ్రిమెంట్ చేసుకోవడం ఒక విచిత్రం ►2015-16లో రూ. 371 కోట్లు రిలీజ్ చేశారు ►డిజైన్ టెక్ అనేది ఒక డొల్ల కంపెనీ ►ఎంఓయూ పూర్తయ్యాకే ఓ కంపెనీ స్థాపించారు ►కీలక పదవుల్లో ఓ ప్రైవేటు వ్యక్తిని పెట్టారు.. గంటా సుబ్బారావుని అందలం ఎక్కించారు ►ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తే మనం పట్టించుకోకుండా ఉండాలా? ►దోచుకుని దొరికితే సన్మానం చేయాలా? ►ఇందులో సుమన్బోస్ కీలక వ్యక్తి ►సదరు వ్యక్తి గుజరాత్లో సోమేంద్ర బోస్ అని, ఇక్కడ సుమన్ బోస్ అని సిగ్నేచర్ చేశారు ►ఈ స్కామ్కు సంబంధించి తనకు నచ్చిన ప్రైవేటు వ్యక్తిని చంద్రబాబు పెట్టుకున్నారు ►మనకు ఇంటర్నెట్లో స్కిల్ అంశాలకు సంబంధించి చాలా వరకూ ఫ్రీగానే దొరుకుతుండగా సీమెన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్లు ఇస్తుందంటూ కట్టు కథని చెప్పారు. ►ప్రభుత్వ డబ్బును బయటకు తీయడానికే ఈ పని చేశారు ►ప్రభుత్వ డబ్బును రూ. 371 కోట్లు తీసేసి.. 3 వేల కోట్లు ఎవరో ఇస్తారంటూ కథలు వినిపించారు. ►ఇందులో చాలా క్లియర్గా స్కామ్కు తెరలేపాడు ►టెండర్లకు పోకుండా రూ. 371 కోట్లు ఎలా ప్రభుత్వ నిధులను బయటకు లాగాలానే స్కామ్లో భాగంగానే ఇది జరిగింది ►3వేల కోట్ల రూపాయలు ఒక సృష్టి అయితే దాని ద్వారా ఒక క్రెడిట్ పొందాలనే ప్రయత్నం చేశాడు బాబు ►ప్రభుత్వ నిధులు లాగేయడానికి సీమెన్స్ కంపెనీనిని చంద్రబాబు వాడుకున్నారు. బాలకృష్ణతో జాగ్రత్త ►బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదన్న ఎమ్మెల్యే బియ్యపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. ఆయనకు మెంటల్ ఉన్నట్లు ఒక ఆస్పత్రి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇలాంటి వ్యక్తి ప్రవర్తన అసెంబ్లీలో ఇతర సభ్యులకు ఇబ్బందికరం. దీని కోసం సభలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి #TDPGoonsInAssembly… pic.twitter.com/GOMVoSc64U— YSR Congress Party (@YSRCParty) September 22, 2023 12:18PM స్కిల్ స్కామ్పై చర్చ సందర్భంగా పేర్ని నాని ప్రసంగం ►ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు ►ఇప్పుడు ప్రశ్నిస్తే కాదు.. లేదు అని డైలాగ్లు చెబుతున్నారు ►ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు ►ఐఏఎస్ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు ►చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యం ►కేవలం సాంకేతిక కారణాలే కోర్టుల్లో చెబుతున్నారు ►బాబు జైలుకెళ్లగానే ఆయన సీట్లో బాలయ్య కూర్చున్నారు ►అసెంబ్లీలో కూడా బాబు చైర్లో కూడా బాలయ్య నిలబడ్డారు. ►చంద్రబాబు స్కామ్ ఏంటన్నది మనవడికి కూడా అర్ధమవుతోంది ►సీమెన్స్ రూ. 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందంలో లేదు ►చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుట్ర అమలు చేశాడు ►డిజైన్టెక్ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశాడు ►చంద్రబాబు డబ్బును ఎత్తేయడంలో ఎంతో ఆత్రంగా వ్యవరించారు. ►స్కిల్ స్కామ్లో ఏం జరుగుతుందో చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికీ అసలు విషయం తెలియదు ►గంటా సుబ్బారావును తీసుకొచ్చి అందలం ఎక్కించారు ►డొల్ల కంపెనీలకు స్కిల్ నిధులు మళ్లింపు ►అక్కడ నుంచి హవాలా ద్వారా చంద్రబాబు ఖాతాలోకి చేరాయి ►వికాస్ ఖన్వేలర్, సుమన్ బోస్లిద్దరూ తోడు దొంగలే అసెంబ్లీలో స్కిల్ స్కామ్పై చర్చ సందర్భంగా కన్నబాబు ప్రసంగం ►డొల్ల కంపెనీలు పెట్టి అడ్డంగా దోచుకున్నారు ►ఏ మొహం పెట్టుకుని నీతి పాలన చేశామని చెప్పుకుంటున్నారు ►డబ్బులను రకరకాల అకౌంట్లలోకి మళ్లించారు ►రూ. 371 కోట్ల స్కామ్ జరిగితే అది పెద్ద స్కామా అంటూ యెల్లో మీడియా సిగ్గు లేకుండా కథనాలు రాస్తోంది ►చంద్రబాబు కానుకలోనూ అవినీతి చేశారు ►చంద్రబాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగింది ►ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు ►చేసిన నేరాలకు జైల్లో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది ►ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచాడు చంద్రబాబు ►యెల్లో మీడియా చూపిస్తున్నది అంతా అసత్యాలే ►ఎంతోమంది సీజేలను చూసి ఇప్పుడు రాజమండ్రి సీజేలో ఊచలు లెక్క పెడుతున్నాడు ►చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమే ►కేబినెట్లో అప్రూవ్ చేసింది ఒకటి.. ఒప్పందం చేసుకుంది మరోలా ►కరెంట్పోతే చీకట్లో సంతకాలు పెట్టామనడం సిగ్గుచేటు ►పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగింది ►సెక్రటేరియట్లో నోట్ఫైళ్లు మొత్తం మాయం చేశారు: ►అప్పటి కేబినెట్నే చంద్రబాబు తప్పుదారి పట్టించారు ►యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారు ►విజనరీ అనే చెప్పుకుని చంద్రబాబు.. ఇప్పుడు ప్రిజనరీగా మారారు: ►17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు ►ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్ట్ చేశారు ►ఏడుగురు నిందితులు బెయిల్పై బయటకొచ్చారు ►బెయిల్ మీద వచ్చిన సుమన్బోస్కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరం ►చంద్రబాబు అవినీతిని ఐటీ బట్టబయలు చేసింది ►ఎన్టీఆర్ అంత గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు ►చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు ►చంద్రబాబు ఆదేశాల మేరకు స్కిల్ నిధులను విడుదల చేశారు ►స్కిల్ స్కామ్ నిధులు నేరుగా తన ఖాతాలోకే వస్తాయి కాబట్టి.. దానిపై చంద్రబాబుకు అంతప్రేమ ►టన్నులు అంటే బరువు కాదు.. కోట్లు అనే అర్థం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ ►ఒకే రోజు.. ఒకే విధంగా రూ. 371 కోట్లు రిలీజ్ చేశారు ►బోగస్ ఇన్వాయిస్లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట ►వాదనలు విన్న తర్వాతే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది 11:04AM ►స్కిల్ సామ్పై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ 10: 51AM ►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన ►విజిల్స్తో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు ►విజిల్స్ ఆపాలని స్పీకర్ విజ్ఞప్తి ►అయినా పట్టించుకోని టీడీపీ సభ్యులు ►అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ సస్పెన్షన్ ► ఒకరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ ►టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలి: బియ్యపు మధుసూదన్ ►అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదు: బియ్యపు మధుసూదన్ 10:40AM ►తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ 10:38AM ►శాసనమండలి మళ్లీ వాయిదా 10: 30AM ►టీడీపీ సభ్యులకు చైర్మన్ హెచ్చరిక ►సభలో ఈ ప్రవర్తన సరికాదన్న చైర్మన్ 10:28AM ► మండలిలో టీడీపీ సభ్యులు ప్రకార్డులతో నిరసన ►అరుపులు కేకలతో గందరగోళంగా మారిన సభ ►కొనసాగుతున్న క్వశ్చన్ అవర్ ►మార్షల్స్ను నెట్టి వేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి బొత్స సత్యనారాయణ 10:21AM ►వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన మండలి ►మండలిలో మోహరించిన మార్షల్స్ ►టిడిపి సభ్యులు చైర్మన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న మార్షల్స్ ►నినాదాలు చేస్తున్న టిడిపి సభ్యులు ►క్వశ్చన్ అవర్ ను ప్రారంభించిన చైర్మన్ 10:13AM ►శాసనమండలి ఐదు నిమిషాల పాటు వాయిదా వేసిన చైర్మన్ 10:02AM ►రెండో రోజు ప్రారంభమైన మండలి సమావేశాలు ►మండలిలో చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ఇచ్చిన టిడిపి సభ్యులు ►జాబ్ క్యాలెండర్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన పిడిఎఫ్ సభ్యులు ►వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్ ►చైర్మన్ చైర్ చుట్టు నిలబడి నిరసన తెలియజేస్తున్న టిడిపి సభ్యులు ►ప్రాపర్ ఫార్మేట్ లో వస్తే చర్చిస్తామన్న చైర్మన్ ►నినాదాలు చేస్తున్న టిడిపి సభ్యులు.. 09:54AM ►దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి: మంత్రి కాకాణి ►పిరికిపందల్లా పారిపోవద్దు: మంత్రి కాకాణి ►దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించడం సరికాదు: మంత్రి కాకాణి ►బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు: మంత్రి కాకాణి ►టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: మంత్రి కాకాణి ► చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు: మంత్రి కాకాణి 09:51AM ►సభ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ► అచ్చెన్నాయుడు, బి. అశోక్లు సస్పెన్షన్ ► ఈ సెషన్ మొత్తం సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్లు సస్పెన్షన్ ►సభలో విజిల్స్ వేస్తూ రెచ్చిపోయిన బాలకృష్ణ 09:42AM ►రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయింది: మంత్రి జోగి రమేష్ ►అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నాడు: మంత్రి జోగి రమేష్ ►కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నాడు: మంత్రి జోగి రమేష్ 09:40AM ►వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ►సభను అడ్డుకునే యత్నం చేస్తున్న టీడీపీ రెండో రోజు మారని టీడీపీ సభ్యుల తీరు ►స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు ►టీడీపీ సభ్యుల తీరుతో సభను వాయిదా వేసిన స్పీకర్ ► టీడీపీ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని. సభలోకి ప్రవేశించిన మార్షల్స్. నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు రభస సృష్టించడంతో సభలో ప్రత్యేక చర్యలకు ఆదేశించిన స్పీకర్. ► స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు. ► సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇది టీడీపీ ఆఫీసు కాదు. చట్ట సభ. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనవసర పదాలు ఉపయోగిస్తే మేము సహించం. సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోం. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే ఊరుకునేది లేదు. ఈరోజు చర్చ ఉంది. టీడీపీ సభ్యులు పాల్గొనాలి. ► సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం. టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలి. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలుంటాయి. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. ► అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు. సభకు రావాడంతోనే నిరసనకు దిగిన టీడీపీ సభ్యులు. ► రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల నినాదాలు. రెండో రోజు కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు. సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం. ► అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ► అసెంబ్లీ పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, అరెస్ట్పై మేము చర్చకు సిద్దం. ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం చర్చకు రెడీ. టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి చర్చకు రావాలి. ప్రాపర్ ఫార్మాట్లో టీడీపీ చర్చకు రావాలి. టీడీపీ చర్చలో పాల్గొనాలి.. పారిపోవద్దు. బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదు.. టీడీపీలో తిప్పాలి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ మీసం తిప్పితే బాగుండేది. సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు. మీరు నీతిమంతులైతే దమ్ముంటే చర్చకు రండి. బాలకృష్ణ రీల్ హీరో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రియల్ హీరో. 09:00AM ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. ► నేడు అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరుగనుంది. ► అసెంబ్లీకి ముందుకు పలు బిల్లుల వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటిరోజు.. శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగజారుస్తూ, స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్లరగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపోయారు. పయ్యావుల, తదితరులు సీనియర్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ.. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూ మాట్లాడారు. -
అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ నేలబారు విన్యాసాలు
-
అసెంబ్లీ సాక్షిగా.. టీడీపీ బరితెగింపు
శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగజారుస్తూ, స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్లరగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపోయారు. పయ్యావుల, తదితరులు సీనియర్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా టీడీపీ గురువారం ఇంకో మెట్టు దిగజారింది. సభలో ఏం మాట్లాడాలో తెలియక అడ్డగోలుగా వ్యవహరించింది. బూతులు మాట్లాడుతూ.. స్పీకర్ను అడ్డుకుంటూ.. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయం 9 గంటలకు సభలో క్వశ్చన్ అవర్లో కల్యాణమస్తు పథకంపై ఎమ్మెల్యే వి.కళావతి అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగు నాగార్జున సమాధానం చెబుతుండగా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అంశంపై వాయిదా తీర్మానం కింద చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, బాలవీరాంజనేయస్వామి, చిన్నరాజప్ప తదితరులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లారు. వీరితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా కేకలు వేస్తూ వెళ్లి వారితో కలిశారు. ఇరు వైపుల నుంచి స్పీకర్ చైర్ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసురుతూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్రపై టీడీపీ వాయిదా తీర్మానం కోరిందని, ఆ సభ్యులకు కావాల్సినంత సమయం ఇచ్చి చర్చిద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వీకర్ ద్వారా టీడీపీ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి 28 నిమిషాలపాటు వారు నినాదాలు చేస్తూనే వికృత చేష్టలకు పాల్పడ్డారు. స్పీకర్ కుర్చీని సైతం లాగి పడేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కల్పించుకుని చంద్రబాబు అరెస్టు అంశం కోర్టు తేలుస్తుందని, ఆ విషయం అక్కడ వాదించుకోవాలని సూచించారు. సభలో టీడీపీ సభ్యులు ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని, సభా మర్యాదలకు భంగం కలుగుతుందని చెబుతుండగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పీకర్ టేబుల్పై ఉన్న పత్రాలను విసిరేసి, కంప్యూటర్ మానిటర్ను లాగిపడేశారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గ్లాసులో నీటిని టేబుల్పై పోయడంతో పలు పేపర్లు తడిచిపోయాయి. అయినా స్పీకర్ తమ్మినేని సంయమనంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎథిక్స్ కమిటీతో విచారణకు సిఫారసు శాసనసభలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరిస్తే 365 నియమావళి ప్రకారం సదరు సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రాబడతామని స్పీకర్ సీతారాం చెప్పారు. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్లు ఫైల్ చించి వేయడం, బాటిల్ను పగలగొట్టడం, స్పీకర్ పోడియం వద్ద మానిటర్, వైర్లను తుంచి వేయడం గర్హనీయమన్నారు. సభా మర్యాదలను కాలరాస్తూ ప్రతిపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన, సభాపతి స్థానాన్ని ధిక్కరిస్తూ చోటుచేసుకున్న ఘటనలను పూర్తిగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనగాని సత్యప్రసాద్లను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సరైన ఫార్మేట్లో వస్తే చర్చకు సిద్ధం సభలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలి క్రిమినల్ చర్యల కిందకు వస్తుందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు సరైన ఫార్మేట్లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభను అటంక పరుస్తూ ఉండటంతో తొలుత 15మంది సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్, కింజారపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఘన వెంకటరెడ్డి నాయుడు, గద్దె రామ్మోహన్రావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలతోపాటు ఉండవల్లి శ్రీదేవిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తూ సభకు అడ్డుతగలడంతోపాటు బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా సెల్ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికార పక్ష సభ్యులు రోజా, ఉషశ్రీ చరణ్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత పయ్యావుల కేశవ్ను ఒక రోజే సస్పెండ్ చేసినా.. నిబంధనలు తుంగలో తొక్కి వీడియోలు చిత్రీకరించినందుకు ప్రస్తుత సభాకాలం మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు ఎంతకీ సభలోనే నినాదాలు చేస్తుండటంతో వారిని బయటకు పంపించాలని స్పీకర్ మార్షల్స్ను ఆదేశించారు. సెల్ఫోన్లు సభ బయటే.. శాసనసభలో సభ్యులు సెల్ఫోన్ల వినియోగంపై స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జీరో అవర్లో మాట్లాడిన మంత్రి.. ప్రతిపక్ష సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడాన్ని తప్పుపట్టారు. ‘సెల్ఫోన్లు సభలోకి తీసుకురావచ్చా? తీసుకొస్తే వీడియోలు తీయోచ్చా? స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’ అని కోరారు. రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష విధించాలో కూడా చెప్పాలన్నారు. లేకుంటే సభలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్టు చిత్రీకరించుకుని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రూలింగ్పై స్పీకర్ స్పందిస్తూ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, కెమెరాలు సభలో వినియోగించకూడదని బిజినెన్స్ రూల్స్లో స్పష్టంగా ఉన్నాయని చదివి వినిపించారు. అయినప్పటికీ సభ్యుల సెల్ఫోన్లను సభ వెలుపలే డిపాజిట్ చేసిన తర్వాత లోనికి వచ్చేలా విధానాన్ని తీసుకొస్తామన్నారు. జీరో అవర్ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూ మాట్లాడారు. ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. గందరగోళ పరిస్థితుల మధ్య సభ అదుపు తప్పుతుండటంతో స్పీకర్ సభను కొద్ది నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.05 గంటలకు సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ను ముట్టడించేందుకు యత్నిస్తుండగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఇక్కడా బాలకృష్ణ రెండోసారి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూస్తూ వికృతంగా చప్పట్లు కొట్టారు. దీంతో మరోసారి రభస మొదలైంది. మంత్రి బుగ్గన మాట్లాడుతూ స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించి సభా మర్యాదలకు భంగం కలిగించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోకుంటే ఇదే అలవాటైపోతుందని, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. శాసనసభలో అసభ్యకరంగా సైగలు చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ సభ్యులు పట్టు వీడకపోవడంతో వారి నినాదాల మధ్య స్పీకర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘సభ అత్యంత గౌరవించే సభాపతి స్థానాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాపతిని అగౌరవ పరిచేలా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యహితంగా నిరసన తెలుపకుండా సభ ఔన్నత్యాన్ని కించపరిచేలా తొడలు చరుస్తూ, మీసాలు మెలివేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వెల్లోకి వచ్చి మీసాలు మెలివేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. దీనిని మొదటి తప్పుగా భావిస్తున్నామని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ రాద్ధాంతం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసన సభ వేదికగా అవినీతికి పాల్పడి, పేద విద్యార్థులను మోసం చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్న సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రెజరీ బెంచ్ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు దోపిడీకి పూర్తి ఆధారాలున్నందునే జైలుకు వెళ్లగా, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ సభ్యులు సభాకాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. -
‘బాలకృష్ణా.. అప్పుడేమైంది నీ పౌరుషం?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు అరెస్ట్పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె. ఇక ఇవాళ్టి సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా?. కక్ష సాధింపుగానే చేయాలంటే.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడో చంద్రబాబును అరెస్ట్ అయ్యేవాళ్లు కదా. మీ నాన్నను(దివంగత ఎన్టీఆర్) చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు నీ పౌరుషం ఏమైంది?.. మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ బాలకృష్ణకు చురకలంటించారామె. టీడీపీ నేతలకు దమ్ముంటే.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారు. టీడీపీ నేతలు చర్చకు మాత్రమే సభకు రావాలి కానీ..రచ్చ కోసం మాత్రం వద్దు. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నాం. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలి. సభలో ఈరోజు బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు :::ప్రభుత్వ విప్,కాపు రామచంద్రారెడ్డి కోటంరెడ్డి ఓవరాక్షన్ సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు. చంద్రబాబు ప్రజాధనం ఏవిధంగా లూటీ చేశారో కోర్టుకు అందించాం. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ,మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు. సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం. :::మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ -
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వార్నింగ్
-
అసెంబ్లీ బీఏసీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
-
టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
-
స్పీకర్ పై దౌర్జన్యం కోటంరెడ్డి సస్పెండ్