
అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..
- వైఎస్సార్సీపీ రమేష్ యాదవ్ కామెంట్స్..
- పెన్షన్ల గురించి ప్రశ్నోత్తరాలలో చర్చించాం..
- జూన్ 2024 నాటికి 65 లక్షల 18 పైచిలుకు పెన్షన్లు ఇచ్చారు..
- 63,57,907 నేడు ఇస్తున్నాం అని చెప్పారు..
- 14967 పింఛన్లు తొలగించామని మంత్రులు చెప్పారు..
- దాదాపు లక్ష 60వేల పెన్షన్లు తొలగొస్తే.. కేవలం 14వేలే తొలగించారని, మిగిలిన వాళ్ళు చనిపోయారని చెప్పారు.
- 9 నెలల కాలంలో లక్ష 60వేల మంది చనిపోయారా?
- దీనిపై సమాధానం లేదు..
- వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి పెన్షన్లను తొలగించారు.
- 2019 నాటికి 53లక్షల పెన్షన్లు ఉంటే వైఎస్ జగన్ వాటిని 65 లక్షలకి పెంచారు.
- జగన్ హయాంలో ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చాడు..
- గతంలో MRO కార్యాలయం వద్దకి వెళ్లి తెచ్చుకొనే పరిస్థితి ఉండేది..
- అవ్వ తాతలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది..
- కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు..
- ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్ళకు పని చేయొద్దని చెప్పడం సరైనది కాదు..
- కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులకు వైఎస్ జగన్ పెన్షన్ ఇచ్చారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..
- ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉంది అని మంత్రి చెప్పారు.. ఇది దాట వేట ధోరణి..
- ఎప్పటి నుండి అమలు చేస్తారు, ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేసారా? సబ్ కమిటీ వేశారా?
- అంటే సమయం కావాలని చెప్పడం మహిళలను వంచించడమే..
- చేయూత పేరు ఎత్తే అర్హత కూటమి నేతలకు లేదు..
- సున్నా వడ్డీ రుణాలు కూడా కూటమి ఎగ్గొటింది.
- 2019 వరకు కూటమి ఎగొట్టిన బకాయిలు జగన్ మహిళల ఖాతాల్లో వేశారు..
- ఆడబిడ్డ నిధి గురించి మ్యానిఫెస్టోలోనే కాదు.. మహానాడులో కూడా చెప్పాడు..
- సంవత్సరానికి 18వేలు ఇస్తామని మాట ఇచ్చి.. నిట్ట నిలువునా మోసం చేశారు..
- బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు..
- అసత్యాలతో కాలం గడుపుతున్నారు..
- ఆడబిడ్డ నిధికి 32400 కోట్లు సంవత్సరానికి అవసరం..
- చేయూత ద్వారా జగన్ మహిళలకు సహాయం చేశారు.
- ఆడబిడ్డ నిధి ఎప్పటి నుండి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి..
- సమయం కావాలని అనడం అంటే మహిళల్ని మోసం చేయడమే..
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..
- లక్ష 60వేల పెన్షన్లు అకారణంగా తొలగించారు..
- కుల వృత్తిపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్లను తొలగించారు..
- డప్పు కళాకారులు, చేతివృతుల వారికి సర్టిఫికెట్స్ కావాలని 13 రకాల నియమ నిబంధనలు పెట్టి పెన్షన్లను తొలగించారు.
- గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను పెంచుతామని చెప్పారు.. పెంచాలి..
- తీసేసిన పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
- ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..
- ఆరోగ్యశ్రీకి బకాయిలు వెయ్యి కోట్లు ఉన్నాయని మంత్రి చెప్పారు..
- మొత్తం బకాయిలు 4వేల కోట్లు పైనే ఉన్నాయి..
- ఏప్రిల్ ఒకటి నుండి మళ్ళీ సమ్మెకు వెళ్తున్నాయి..
- 80 శాతం ఆసుపత్రులు చిన్న ఆసుపత్రులే..
- చిన్న ఆసుపత్రులపై పెద్ద మొత్తంలో ఫైన్స్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు..
- 9 నెలల నుండి ఆసుపత్రుల్లో బకాయిలు ఉన్నాయి..
- మంత్రి చెప్పిన విధంగా పరిస్థితులు లేవు..
మంత్రిపై మండలి చైర్మన్ ఫైర్..
- జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ ఆరోపణలు
- అనవసర ఆరోపణలు చేయడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం
- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- అక్రమాలు జరిగితే ఎంక్వైరీ వేయండి
- ప్రభుత్వం మీదే కదా..
- వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం సరికాదు.
మంత్రి కొలుసు పార్ధసారధిపై మండలి ఛైర్మన్ ఫైర్
- మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కామెంట్స్..
- ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమవరం లే అవుట్లో కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నాడని నాకు ఫిర్యాదులొచ్చాయి
- నేనే స్వయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశా
- శాసనమండలి చైర్మన్ హోదాలో నేనిచ్చిన ఫిర్యాదుకే దిక్కులేదు
- ఆ జిల్లా కలెక్టర్ కనీసం ఇంతవరకూ స్పందించలేదు
- నేను ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు విచారణ చేస్తామని చెప్పడం సరికాదు
శాసనమండలి..
- మహిళలకు ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం మోసం
- మండలి సాక్షిగా బట్టబయలైన ప్రభుత్వం నిర్వాకం
- ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారో చెప్పని మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- పరిశీలనలో ఉందంటూ సమాధానం దాటేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపాటు
- వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, సాయికల్పలత
- ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు
- ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారు
- మా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
- ఎప్పట్నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలి
- గత బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు
👉ఏపీలో కూటమి ప్రభుత్వంలో రకరకాల కారణాలతో పెన్షన్లను తొలగించడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడమేంటని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు ఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారని చెప్పుకొచ్చారు.
👉ఏపీ శాసనమండలి సమావేశం ప్రారంభమైంది. ఈరోజు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల తొలగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.
👉మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్..
2024 జూన్ నాటికి 65 లక్షల 18,496 సామాజిక పెన్షన్లు ఉన్నాయి.
ప్రస్తుతం 63 లక్షల 59వేల 907 సామాజిక పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు
14,965 పెన్షన్లు తొలగించాం.
👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..
రెండు లక్షల పెన్షన్లు తొలగించారు
రకరకాల కారణాలు చెప్పి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయం
పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడం దారుణం
వివిధ రూపాల్లో లక్షలు.. కోట్లు దోచేస్తున్న వాళ్లను వదిలేసి పేదలపై పడటం బాధాకరం
👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..
రెండు లక్షల పెన్షన్లు తొలగించి రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెబుతున్నారు
ఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారు
👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..
ఏ ప్రాతిపదికన పెన్షన్ల తొలగిస్తున్నారో చెప్పాలి
గతంలో ఆరు అంశాలపై పెన్షన్లను వెరిఫై చేసేవారు
ప్రస్తుత ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకుని వెరిఫై చేస్తున్నారు
పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారు
సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెల రోజుల సమయం పడుతుంది
ఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాలి
చిరునామా మారితే పెన్షన్ తొలగించేస్తున్నారు
పెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాలి
👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్
- ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు
- ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారు
- మా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు
- ఎప్పటి నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలి
Comments
Please login to add a commentAdd a comment