Pensions
-
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్
కాప్రా, హైదరాబాద్: బతికున్నంత కాలం కాసింత ‘ఆసరా’ కోసం తపించారు. తీరా ఆ ఆశ తీరకుండానే చనిపోయాక వారికి పెన్షన్లు మంజూరయ్యాయి. దీంతో నివ్వెరపోవడం బాధిత కుటుంబాల వంతైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాప్రా సర్కిల్లో 2022లో పెన్షన్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 191 మందికి పెన్షన్ మంజూరైనట్లు తాజాగా సర్కిల్ అధికారులకు జాబితా చేరింది. కాగా ఈ జాబితాలో 32 మంది మృతుల పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. బతికున్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. చనిపోయాక వారి పేరున మంజూరైంది. 191 మందితో జాబితా సర్కిల్ కార్యాలయానికి చేరడంతో సంబంధిత అధికారులు వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ‘మీకు పెన్షన్ వస్తుంది.. బ్యాంక్ ఖాతా తనిఖీ చేసుకోండి’ అని లబ్ధిదారులకు ఫోన్ చేసి చెబుతున్నారు. కాగా, వారిలో కొందరు చనిపోయినట్లు వారి కుటుంబసభ్యులు చెప్పారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పేదల పింఛన్లు, ఆస్పత్రులు అవినీతి మయం
సాక్షి, అమరావతి: పింఛన్ల(pensioners) పంపిణీతోపాటు ఆస్పత్రుల్లో వైద్యసేవల్లో అవినీతి కంపు కొడుతోందని ఐవీఆర్ఎస్తోపాటు వివిధ రూపాల్లో చేయించిన సర్వేల్లో వెల్లడైందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. పథకాల లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సోమవారం ఆయా శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదలకు పింఛన్ల పంపిణీల్లో 15.60% అవినీతి, ఆస్పత్రుల్లో 37% అవినీతి ఉందని సర్వేల్లో తేలిందని చెప్పారు.ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సేవలపై 35% మంది అసంతృప్తి వ్యక్తం చేశారని, వివిధ పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆస్పత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించామని సీఎం చెప్పారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో పనిచేయాలి ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎవరు ఏం చెప్పినా లబ్ధిదారుల మాటే ఫైనల్ అని, ప్రజలు క్షేత్రస్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్నే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో విధానాల అమలుపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆ శాఖల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.ఇదే సమయంలో కొన్ని శాఖల్లో 7 నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై సీఎం లోతుగా సమీక్షించారు. కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1 శాతం కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తిస్థాయి మరింత పెరగాలని సీఎం సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా చార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని, నూరు శాతం సంతృప్తి కనిపించాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఇంట్లో ఏఐ ప్రొఫెషనల్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఏఐని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆరీ్టజీఎస్పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు. అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని పనితీరు మెరుగుపరచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు.త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్నామన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నట్టు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినే‹Ùకుమార్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ముఖ్యమంత్రి కార్యదర్శులు రాజమౌళి, పీఎస్ ప్రద్యుమ్న, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే‹Ùకుమార్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ పాల్గొన్నారు. -
TG: పెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్ : భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేక తండ్లాడుతున్న వితంతువు.. పెద్ద వయసులో తోడెవరూ లేక, ఎలా బతకాలో తెలియక గోస పడుతున్న వృద్ధుడు.. వైకల్యంతో ఏ పనీ చేయలేక, వైద్యం కోసం డబ్బుల్లేక ఆగమైతున్న దివ్యాంగుడు.. .. ఇలా ఎందరో.. అందరిదీ ఒకే వేదన. ఎలాగోలా బతుకు వెళ్లదీసేందుకు కనీసం ప్రభుత్వమిచ్చే పింఛన్ అయినా తోడ్పడుతుందనే ఆలోచన. తిరగని ఆఫీసులు లేవు.. కలవని అధికారులు లేరు.. వేడుకోని రాజకీయ నాయకులు లేరు.. అయినా పింఛన్ రావడం లేదు. ఏళ్లకేళ్లుగా, ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నా ఫలితం ఉండటం లేదు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి, తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఆత్మియ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్కార్డుల కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా... తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతూ దరఖాస్తులు ఇస్తున్నారు. పింఛన్ల సొమ్ము పెంచుతామన్న కాంగ్రెస్ సర్కారు హామీని అమల్లోకి తెచ్చేలోగా.. ముందు కొత్త పింఛన్లను మంజూరు చేసి పాత పింఛన్ మొత్తమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి ఆన్లైన్ పోర్టల్ మూత.. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేకుండా పోయింది. గత ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చిన 13 నెలలు కలిపి.. సుమారు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు, ఇతర రూపాల్లో వచ్చిన వినతులు కలిపి.. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల వరకు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్న అందరికీ కాకపోయినా.. అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే కనీసం 3 లక్షల మందికైనా కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు ఇతర కేటగిరీల వాళ్లు కూడా గణనీయంగా ఉన్నట్టు చెబుతున్నాయి. పాత మొత్తమైనా ఇవ్వాలంటూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు (ప్రస్తుతం రూ.4 వేలు), వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల పింఛన్ రూ.4 వేలకు (ప్రస్తుతం రూ.2 వేలు) పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం అన్ని కేటగిరీలు కలిపి 43.72 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు దాటినా పింఛన్ల పెంపు హామీ అమల్లోకి రాలేదు. నిజానికి 2024–25 బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.14,628 కోట్లు కేటాయించింది. కానీ పెంపు అమలుచేస్తే ఖజనాపై గణనీయంగా భారం పడుతుందన్న ఉద్దేశంతో.. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో పింఛను మొత్తాన్ని ఇప్పటికిప్పుడు పెంచకపోయినా.. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల వారు కోరుతున్నారు. ఇంటి పెద్ద లేడు.. వితంతు పింఛన్ ఇస్తే కాస్త ఆసరా నా భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన రావడం లేదు. ఇంటికి పెద్ద దిక్కయిన భర్త మృతితో బతుకు కష్టంగా మారింది. ఎలాంటి ఆధారం లేక కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్న. వెంటనే పింఛన్ మంజూరు చేయాలి. – కావలి సుష్మ , బొల్లారం గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్నగర్ జిల్లా దివ్యాంగ పింఛన్ వస్తే.. వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది మూడేళ్లకుపైగా దివ్యాంగుల పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు ఇచ్చినా, రాజకీయ నాయకులను వేడుకున్నా ఫలితం లేదు. గత ఏడాది ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ సర్కారు పెంచే పింఛను కాకున్నా పాత పింఛన్ సొమ్ము రూ.4 వేలు ఇచ్చినా సరే.. నా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. – అబ్దుల్ మాజిద్ ఖాన్, తిమ్మాపూర్, కరీంనగర్ భర్త చనిపోయాడు.. పింఛన్ వస్తేనే జీవితానికి ఆసరా నా భర్త చనిపోయి మూడేళ్లయింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. మొదట్లో పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరికి ఇచ్చినా నాకు రాలేదు. గతేడాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాను. ఇటీవల కులగణనలో కూడా ఆప్షన్ ఇచ్చిన. ఇప్పుడు గ్రామసభలో దరఖాస్తు చేశాను. త్వరగా పింఛన్ ఇస్తే జీవితానికి ఆసరా అవుతుంది. – కాసగాని సురాంబా, ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రం, సూర్యాపేట జిల్లా వృద్ధాప్యంలో ఒంటరి బతుకు.. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి నాకు 70 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది. గుంట భూమి లేదు. ఎలాంటి జీవనాధారం లేదు. ఇద్దరు కొడుకులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. ఒంటరిగా ఉంటున్నా. వృద్ధాప్య పింఛన్ కోసం పదేళ్లలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసినా రాలేదు. ఇప్పుడు గ్రామసభలో పింఛన్ కోసం దరఖాస్తు ఇచ్చాను. పింఛన్ వస్తే ఉన్నంతకాలం బతుకు వెళ్లదీసుకుంటా.. - తాటికోల్ సాయి గొండ, తగ్గేల్లి గ్రామం, సాలూర మండలం, నిజామాబాద్ జిల్లా పింఛన్ వస్తే బతుకు వెళ్లదీసుకుంటా.. నాకు 75 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్ కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న. గతంలో రూ.200 ఇచ్చేప్పటి నుంచీ నా భార్యతోపాటు నాకు కూడా పింఛన్ వచ్చేది. తర్వాత ఇంట్లో ఒక్కరికే పింఛన్ అని నా పేరు తీసేశారు. ఆరేళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పట్నుంచీ పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్న. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్న. ఇప్పుడు గ్రామసభలో అధికారులకు మొరపెట్టుకున్న. పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదన్నరు. పింఛన్ వస్తే ఈ వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి ఆసరా అవుతుంది. – గంటే రాములు, నేరడగందొడ్డి గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా -
పింఛన్లు తొలగించేందుకే ఈ పరీక్షలు
తణుకు అర్బన్ : ‘ఇరవయ్యేళ్ల నుంచి పింఛను తీసుకుంటున్నాం.. ఎప్పుడూ లేదు, ఇదేం ఖర్మో మరి.. కంటిచూపు కనిపించడం లేదంటే మళ్లీ పరీక్షలంటున్నారు.. పింఛను తొలగించేందుకే ఈ పరీక్షలు.. ఈ ప్రభుత్వానికి ఏ రోగమొచ్చిందో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు.. మీరు ఎన్ని డబ్బులు దొబ్బినా ఫర్వాలేదు వికలాంగుల మీద పడి ఏడుస్తున్నారు ఏంటో.. మీ ఖర్మ కాలింది మీకు కూడా మా గతే పడుతుంది’.. అంటూ దివ్యాంగులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మొదలైంది. ముందుగా పట్టణ పరిధిలోని దివ్యాంగులను వెరిఫికేషన్ శిబిరానికి రావాల్సిందిగా వార్డు సెక్రటరీలు నోటీసులిచ్చారు. మొదటి దఫాలో కంటి, చెవికి సంబంధించి ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరానికి దివ్యాంగులు తమ సహాయకులను తీసుకుని హాజరయ్యారు. ఇబ్బందులు పడ్డ దివ్యాంగులు.. ముఖ్యంగా కంటిచూపు లేని దివ్యాంగుల వెతలు వర్ణనాతీతం. వీరు అటూ ఇటూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవించారు. నిన్ననే నోటీసిచ్చి ఈరోజు నిర్థారణ శిబిరానికి రావాలంటూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ‘పింఛను మొత్తాన్ని పెంచడమెందుకు? ఇప్పుడు తొలగించేందుకు కుట్ర లు పన్నడమేంటి?’ అంటూ రుసరుసలాడారు. పింఛనుదారుల్లో ఎవరు సక్రమమో, ఎవరు అక్రమమో తెలుసుకునేందుకు మొత్తం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు నీళ్లప్యాకెట్లు తప్ప ఏమీ ఇవ్వకపోవడంతో పాటు సర్వర్ పనిచేయకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. -
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
సాక్షి, అమరావతి: దంపతులంటే..? జీవిత భాగస్వాములంటే..? భార్యాభర్తలు కాదా? వైవాహిక బంధానికి కూటమి సర్కారు కొత్త భాష్యం చెబుతోంది! పేదల పింఛన్ల విషయంలో చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతోంది. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరణించిన పింఛన్దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎడాపెడా పింఛన్లకు కోత పెడుతూ.. అసలు కొత్త వాటి ఊసే లేకుండా చేసింది. ఆర్నెల్లలో దాదాపు 1.72 లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. మరోవైపు లక్షలాది దివ్యాంగ పింఛన్లపై ఏరివేతల కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్ల మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చే విషయంలో వింత విధానాలను అమలు చేస్తోంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో కేవలం భార్యకు మాత్రమే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. స్పౌజ్ అంటేనే భార్యా భర్తలని అర్థం! కానీ ఆ పదానికే అర్థం మార్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ఇంటికి ఒకే పింఛను విధానం ప్రకారం... ఎక్కడైనా భార్య చనిపోయి, ఆ కుటుంబంలో భర్త ఇప్పటికీ పింఛను పొందని పరిస్థితి ఉంటే... 70–80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పుడా ఆస్కారమే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. ప్రస్తుతం ఫించన్ తీసుకుంటూ కుటుంబంలో భర్త చనిపోతే అతని భార్యకు మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేసేలా జారీ చేసిన సర్క్యులర్ ఇది. అది కూడా నవంబర్ 1 తర్వాత చనిపోయిన వారికే వర్తించేలా.. 23 వేల మంది చనిపోతే.. ఐదు వేల మందికే! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య పింఛను లబ్ధిదారుల్లో దాదాపు 23 వేల మంది చనిపోగా స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వీరికి డిసెంబరులో పింఛన్లు మంజూరు కాగా నెలాఖరులో తొలి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12వ తేదీ నుంచి నవంబరు 1కి ముందు వరకు దాదాపు నాలుగున్నర నెలల వ్యవధిలో భర్తలు మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల కుటుంబాల్లో వారి భార్యలకు మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామంటూ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. 50 ఏళ్లకే పింఛను దేవుడెరుగు.. కూటమి సర్కారు వచ్చాక ఉన్న పెన్షన్లే ఊడగొడుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశిస్తున్నారు. ఎడాపెడా కోతలు.. ఒకవైపు కొత్తగా పింఛన్ల కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు ఎడాపెడా పెన్షన్లు ఏరివేస్తూ పింఛన్దారులను హడలెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత ఆర్నెల్లలో ఏకంగా 1,71,921 పింఛన్లను తగ్గించేసింది. గతేడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగగా, గత డిసెంబరు 31న కూటమి ప్రభుత్వం కేవలం 63,77,943 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే.పింఛన్లకు మరింత భారీగా కోతలు పెట్టేందుకు పక్షవాత బాధితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా దీర్ఘకాలిక జబ్బుల రోగులకు శల్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న 8.18 లక్షల మంది లబ్ధిదారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు మళ్లీ సమర్పించాలంటూ వారిపై కత్తి వేలాడదీసింది. ‘రియల్’ సీన్ ఇదీ.. గత ఐదేళ్లపాటు కోవిడ్ సమయంలోనూ ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే సజావుగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం రాగానే తూట్లు పొడిచింది. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రియల్టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సర్వేలో 12.7 శాతం మంది లబ్ధిదారులు తమకు ఇంటి వద్ద పెన్షన్లు అందడం లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరు శాతం మంది లబ్ధిదారులు తెలిపారు.నాడు నిరంతరం.. సంతృప్త స్థాయిలో..వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో నిరంతరం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గత ఐదేళ్ల పాటు కొత్తగా పింఛనుకు అర్హత పొందే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వలంటీర్లే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 60 ఏళ్ల దాటిన వారు సైతం కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేసింది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు రెండు లక్షలకు పైగా అర్జీలను కూడా కూటమి ప్రభుత్వం మూలన పడేసింది. -
టీచర్ల జీతాల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష
సాక్షి, అమరావతి: కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ, వివిధ బహిరంగ సభల్లోనూ హామీలు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఆక్షేపించింది.ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించి, ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకుండా వివక్ష చూపుతోందని సంఘం అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీచర్ల జీతాల చెల్లింపులో వివక్ష చూపడం ఎందుకని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఒక్క నెల ముచ్చటేనా?
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు(Salaries), పెన్షన్లు(pensions) చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)... దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోను మూడో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు.జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు.ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక నెల మాత్రమే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఆ తర్వాత నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలే -
కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులమైనా.. ఏం‘ప్రయోజనం’?
నల్లగొండ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) కింద విధుల నుంచి తప్పుకొన్నారు. తద్వారా అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవచ్చని భావించారు. ఆమెకు గ్రాట్యుటీ, టీజీఎల్ఐసీ, లీవ్స్ ఎన్క్యాష్మెంట్, కమ్యూటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా రూ.60 లక్షల వరకు అందాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా పెన్షన్ మినహా ఇతర ప్రయోజనాలేవీ అందలేదు. దీనితో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని ఆమె వాపోతున్నారు.రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని.. జూన్లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్లో రిటైర్ అయినా.. తర్వాతి రెండు నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు. దీంతో రూ.20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే రూ.2 లక్షలకుపైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం నెలవారీ వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవీ అందడం లేదు. ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక.. బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్నిరకాల ప్రయోజనాలూ ఆపేసి.. సాధారణంగా ఉద్యోగులకు ఏటా ఆర్జిత సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది. వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము, పదవీ విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది. కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైరైన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు రూ.3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయిపడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందేవాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే. ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్), జీవిత బీమా (టీజీఎల్ఐ) పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి. ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితిలో కొంత మేర రుణరూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు 58 సంవత్సరాలు నిండితే.. ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లుగా ఉన్న నేపథ్యంలో... జీవితబీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25 వేల మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.850 కోట్లుగా అంచనా. జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు. ఇలా రూ.450 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ రావట్లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు కూడా రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష లోపు ఉన్నవాటిలో కొ న్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించినా.. అంతకంటే ఎక్కు వ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు. తిప్పలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దానితో మూడేళ్లపాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది పదవీ విరమణ పొందారు. వీరిలో 90శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఈ రూపంలో దాదాపు రూ.875 కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన నెలరోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి. ఇలా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జా ప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు.. బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో.. పోటీ చేసినవారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘ నేత ఎ.జగన్మోహన్రావు పేర్కొన్నారు. జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్నా ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు.బిల్లులు చెల్లించకుంటే.. ఉద్యమిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత నుంచీ సమస్యలు పెరిగాయి. అంతకు ముందు జిల్లా ఖజానా విభాగం(డీటీఓ) లేదా ఉప ఖజానా కార్యాలయాల (ఎస్టీఓ) పరిధిలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఐఎస్ విధానాన్ని తెచ్చి, చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లును క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల, రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు.. ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తాం. – ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
పెన్షన్దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్.. తుంచెన్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య తగ్గిపోతోంది. గత ఆర్నెళ్లలో ఏకంగా 1.57 లక్షల పింఛన్లకు కోత పెట్టిన కూటమి సర్కారు మరో 3 లక్షల పెన్షన్ల తొలగింపుపై గురి పెట్టినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పైలెట్ సర్వే పేరుతో 10,958 మందిని తనిఖీ చేసి 563 మందిపై.. అంటే దాదాపు 5శాతం మందిపై అనర్హులుగా ముద్ర వేసింది. అంటే రాష్ట్రంలోని మొత్తం పెన్షన్లను తనిఖీ చేసి అందులో 5శాతం.. అంటే దాదాపు 3 లక్షలకుపైగా పింఛన్లపై అనర్హత ముద్ర వేసి తొలగించబోతున్నట్లు అర్ధమౌతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. అంటే దాదాపు 6 లక్షల మంది పెన్షన్లను తొలగించే దిశగా సర్కారు సన్నద్ధమైనట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో 65.49 లక్షల మందికి ఫించన్లు ఇవ్వగా ఈ డిసెంబర్ నాటికి 63.92 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేసి వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసి కక్ష పూరితంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం పింఛన్లకు ఎడాపెడా కోతలు పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేత పేరుతో గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై గురి పెట్టింది. సంబంధిత సచివాలయంతో అసలు సంబంధమే లేని ఉద్యోగులను లబ్ధిదారుల ఇళ్లకు పంపి తనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా ఇప్పుడా ఆస్కారమే లేదు. ఈ ఏడాది జనవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కొత్తవి మంజూరు కాకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. దినదిన గండంగా.. గత ఐదేళ్లూ నిశ్చింతగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే టంచన్గా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్దిదారులు ఇప్పుడు దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారిని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనర్హత నోటీసుల పేరుతో కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. అనర్హుల పేరిట మరో విడత పింఛను నోటీసులు జారీ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలకు మెమో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత ఆర్నెళ్లలో పింఛన్లు 1,57,162 తగ్గిపోయాయి. ఎడాపెడా కోతలు విధిస్తూ ఫైలెట్ సర్వే, స్పెషల్ డ్రెవ్ అంటూ రకరకాల కార్యక్రమాలకు ప్రభుత్వం తెర తీసింది. రాజకీయంగా గిట్టని వారి పింఛన్లను లబ్దిదారులకు తెలియకుండా సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రస్తుతం డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 63,92,702 మందికి పింఛన్ల డబ్బులు విడుదలైనా అందులో ఐదారు లక్షల పెన్షన్లకు కోత పెట్టే యోచన ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అనర్హులంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం వారం క్రితం అన్ని జిల్లాలో ఒక్కో గ్రామ / వార్డు సచివాలయాన్ని ఎంపిక చేసుకొని మొత్తం 10,958 మంది లబ్దిదారుల పింఛన్లను తనిఖీ చేసి 563 మంది అనర్హులుగా ఉన్నారని గుర్తించింది. అంటే ఐదు శాతం పైగానేనన్న మాట. 11 వేల మందిని తనిఖీ చేసి 5శాతం మందిని అనర్హులుగా తేల్చారంటే మొత్తం 65.49 లక్షల మందిని తనిఖీ చేస్తే...అందులో 5శాతం అంటే... దాదాపు 3 లక్షల మందికి పైగా అనర్హులుగా తేల్చబోతున్నారని పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగులు టార్గెట్గా.. దివ్యాంగ పింఛన్ల లబ్దిదారులకు సైతం కూటమి ప్రభుత్వం ఎడాపెడా నోటీసులు జారీ చేస్తోంది. అధికారంలో వచ్చిన నెల తిరగక ముందే జూలైలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగ పింఛన్ లబ్దిదారులకు పలు నిబంధనలతో నోటీసులు ఇచి్చంది. దీర్ఘకాలం క్రితం శరీర వైఫల్య సర్టిఫికెట్లు పొంది ఏళ్ల తరబడి పింఛను తీసుకుంటున్న వారిని సైతం 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకుని సర్టిఫికెటు అధికారులకు అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు “సదరం’లో పేర్లు నమోదు చేసుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది 15 రోజుల్లో ఆన్లైన్లో రీ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని అర్హత నిరూపించుకోవాలని మానవత్వం లేకుండా నోటీసులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సుదూర ప్రాంతాలకు బదిలీ.. నెల నెలా పింఛన్లు కావాలంటే మా వద్దకు రావాల్సిందే..! అధికార పార్టీలో చేరాల్సిందే! ఎవరికి చెప్పుకున్నా ఏం ఉపయోగం ఉండదు!! ఇదీ పచ్చ నేతల బెదిరింపులు! ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన పింఛన్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చాలు.. సుదూర ప్రాంతాలకు పెన్షన్లు బదిలీ చేస్తున్నారు. పింఛన్ల కోసం అంతదూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లలేక లబ్దిదారులు ఆశలు వదులుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారనే అక్కసుతో బాపట్ల జిల్లాలో పలువురు వృద్ధుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బదిలీ చేశారు. పండుటాకులని కూడా చూడకుండా కూటమి సర్కారు దారుణంగా వ్యవహరించింది.563 మందికే కాదు.. మిగిలిన వారికీ నోటీసులు పైలెట్ సర్వేలో గుర్తించిన 563 మంది లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నోటీసులు జారీ చేయాలని సెర్ప్ సీఈవో తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే సెర్ప్ కార్యాలయం నుంచి అధికారులకు పంపిన ఫోన్ సందేశాల్లో మాత్రం ఫైలెట్ సర్వే నిర్వహించిన సచివాలయాలతో పాటు ఇతర గ్రామ, వార్డు సచివాలయాలలోనూ అనర్హులుగా పేర్కొంటూ ఎంపీడీవో లాగిన్లో ఉన్నవారికి కూడా నోటీసులు జారీ చేయాలని సమాచారం ఇచ్చారు. ఎవరైనా నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తే వారి పింఛన్లను ఎంపీడీవోలు అప్పటికప్పుడే హోల్డ్ (తాత్కాలికంగా నిలుపుదల) చేయాలని సెర్ప్ సీఈవో ఆదేశాల్లో పేర్కొన్నారు. -
మొదలైంది.. బాబు మార్కు ఏరివేత
సాక్షి, అమరావతి: చంద్రబాబు మార్క్ ఏరివేత మొదలైంది. ఇప్పటికే పెన్షనర్ల సంఖ్య నెలనెలా తగ్గుతున్న విషయం తెలిసిందే. సామాజిక పెన్షన్ల సంఖ్య మరింత తగ్గించేందుకు ఆయన నడుంబిగించారు. పెన్షన్లు పొందుతున్న అనర్హుల నుంచి పెన్షన్ సొమ్మును రెవెన్యూ రికవరీ చట్టం కింద వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది. దివ్యాంగుల పేరిట తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారని పలువురు కలెక్టర్లు చెప్పగా.. ఎన్నికల ముందు అనర్హులైన 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ.. 3 నెలల్లో పెన్షన్లన్నీ రీ–వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగించాలని ఆదేశించారు.సర్టిఫికెట్ల జారీలో లోపాలున్నాయట..అనర్హులను దివ్యాంగులుగా గుర్తిస్తూ సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులను ప్రాసిక్యూట్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ల జారీ మార్గదర్శకాల్లో లోపాల కారణంగానే తప్పుడు సర్టిఫికెట్లు పొందుతున్నారని, లోపాలు లేకుండా మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు ఆ మార్గదర్శకాల మేరకు వైద్యులు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందన్నారు. కాగా.. ప్రమాదాల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు. గ్రామ పంచాయతీలపై కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు, మంచినీటి వనరుల నిర్వహణ బాధ్యత పంచాయతీలదేనన్నారు. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరిశ్రమలు–ఐటీ రంగాలపై సమీక్షిస్తూ.. రాజధాని అమరావతి తరహాలోనే పారిశ్రామిక పార్కుల భూసేకరణలో రైతులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. విశాఖలోని మధురవాడ, కాపులుప్పాడ, మంగళగిరిలో ఐటీ పార్కులు, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి, తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ సంస్కరణలతో ‘పవర్’ పోగొట్టుకున్నావిద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి 2004లో పవర్ (అధికారం) పోగొట్టుకున్నానని చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో విద్యుత్ రంగంపై మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాజధాని అమరావతిపై సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే ప్రజా రాజధానిగా అమరావతి ఉండాలన్నారు. అమరావతి పరిధిలోని ఆర్–5 జోన్లో గత ప్రభుత్వం 50,793 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టగా.. వారికి అమరావతి పరిధిలో కాకుండా సంబంధిత జిల్లాల్లోనే ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కోరారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా విద్యలో భవిష్యత్కు అనుగుణంగా కరిక్యులమ్ మార్చాలన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలు మరింత చేర్చాలన్నారు. వైద్యశాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఏపీలో జనన, మరణాలను 100 శాతం నమోదు చేస్తూ, ప్రతి రికార్డు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్తో అనుసంధానం చేయాలని, జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ సమస్యలపైౖ జాయింట్ టాస్క్ఫోర్స్రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో 50 శాతం రెవెన్యూ విభాగానికి సంబంధించినవే వస్తున్నాయన్నారు. వాటి పరిష్కారానికి ప్రతి జిల్లాలో కలెక్టర్–ఎస్పీ, ఆర్డీఓ–డీఎస్పీతో రెండు స్థాయిల్లో జాయింట్ టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇళ్లను వెరిఫికేషన్ చేసి అనర్హులుంటే రద్దు చేసి కొత్త వారికి ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం‘రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం?!‘గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఆస్పత్రులు పెడతాం. ఇంటికొకటి పెట్టాలా. మీరు ఆస్పత్రులు పెడతా ఉండండి.. మేం ఎక్కడెక్కడకో పోతా ఉంటాం అంటే ఎలా’ అంటూ సీఎం చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరి శిఖర గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కోరగా సీఎం చిర్రుబుర్రులాడారు. ‘పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు కొండల్ని చదును చేసుకుంటూ వెళ్లిపోయి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కోచోట పది ఇళ్లు కూడా ఉండవు. ఒక గ్రామం కలిసి ఉండదు, అందర్నీ కలిసి ఒకచోట ఉండమని చెప్పండి’ అని అన్నారు. గంజాయి, సెల్ఫోన్ల వల్లే అత్యాచారాలుగంజాయి, సెల్ఫోన్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో హోమ్, ఎక్సైజ్, గనుల శాఖల సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ విభాగానికి ఏటా నిధులు కేటాయిస్తామన్నారు.డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేసి అందులో నిపుణులైన వైద్యులు, మానసిక వైద్యులను నియమిస్తామన్నారు. ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్స్ వంటిచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ టీవీ కవరేజీ లేనిచోట్ల డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. నేరస్తుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు.యాక్సిడెంట్ల హాట్ స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకుండా కట్టడి చేయాలన్నారు. సీనరేజి రద్దు చేశాం కాబట్టి ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నియంత్రించాలన్నారు. -
సర్కారు ఏడిపింఛన్!
రెండు కాళ్లూ దెబ్బ తిన్నా పింఛన్ ఇవ్వట్లేదురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బ తిని పనిచేయడం లేదు. రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్కు వచ్చి పోతున్నాను. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడంలేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతా. – ప్రభాకర్, కల్యాణపురం ఎస్టీ కాలనీ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా.. వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే.. సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై ప్రభుత్వం వెరిఫికేషన్ను చేపట్టనుంది. సంబంధిత సచివాలయాలనికి గానీ, అసలు మండలానికే సంబంధమే లేని.. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేపడతారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్దిదారుల చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయ పరిధిలో ఉండే మొత్తం పింఛను దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో 7 నుంచి 13 బృందాలను ఇప్పటికే ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యక్తి పేరు సీపాన ఆనందరావు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామానికి చెందిన ఇతను అంధుడు. 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతని పింఛన్ నిలుపుదల చేశారు.రిమ్స్ నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే మూడు నెలలు పూర్తయ్యాయి. పింఛన్ రద్దయింది. ఎంతగా వేడుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదు. ఒక్క టిక్తో అంతా తారుమారువెరిఫికేషన్కు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. ఈ యాప్లో అన్ని పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలనే పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు వెరిఫికేషన్ చేసే ఉద్యోగి ‘అవును’/ ‘కాదు..లేదు’ అని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ‘మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘అవును’/ ‘లేదు’ అని స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క ‘టిక్’తో పేద పింఛన్ లబ్ధిదారుల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగి అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి.1. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉందా?2. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?3. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?4. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా?5. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా?6. కుటుంబానికి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?7. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా?8. కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా?9. మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? రాజకీయ పైరవీలకు చోటు గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే సమయంలో దరఖాస్తుదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్ణయించేవారు. ఆపై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్) జరిపేవారు. ఆ తర్వాత పింఛన్ మంజూరు చేసేవారు. అయితే, ఇప్పుడు వెరిఫికేషన్లో ఆ లబి్ధదారుడు పింఛను మంజూరు అర్హత నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది వెరిఫికేషన్ ఉద్యోగి నిర్ణయిస్తారు. ప్రభుత్వం అనర్హుల గుర్తింపు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలోనే ఏదో మతలబు ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ప్రస్తుత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులపై ఆయా ప్రాంతాల్లో అధికార కూటమి పార్టీల నేతల ప్రభావం, ఒత్తిడి ఉంటుందని.. దీంతో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో 1.57 లక్షల పింఛన్లు తగ్గుదలరాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకూ తగ్గిపోతోంది. ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, డిసెంబర్ నెలకు వచ్చే సరికి 63,92,702 మంది లబ్దిదారులకు మాత్రమే పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయాయి. సెపె్టంబర్లో 22,601, అక్టోబర్లో 24,710, నవంబర్లో 21,472.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 పింఛన్లు తగ్గిపోయాయి. 2 లక్షల మంది వెయిటింగ్.. కొత్తగా దరఖాస్తులకు అవకాశమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పింఛన్ల మంజూరు కోసం కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో.. అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలు పని చేయడం లేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కొత్త పింఛన్లే మంజూరు కాలేదు. గత ఐదేళ్ల కాలంలో పింఛన్ల పంపిణీ అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అప్పటి దాకా కొత్తగా గుర్తించిన పింఛన్ లబ్దిదారులందరికీ పింఛన్ల డబ్బుల పంపిణీ మొదలు కాగా.. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వరకు ‘ఏపీ సేవ’ అనే ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఆ సమయంలో దాదాపు రెండు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దయలేకుండా తొలగించారయ్యా.. దివ్యాంగుడని కూడా చూడకుండా నా పింఛన్ తొలగించారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. మూడు నెలల క్రితం నా పింఛన్ తొలగించారు. ఈ కుట్ర ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. దివ్యాంగుడైన నాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. నేను ఎలాంటి పనులు చేయలేను. నాకొచ్చే పింఛన్ సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. పింఛన్ ఆపేయడంతో తినడానికి కూడా కష్టంగా ఉంది. నాకు జరిగిన అన్యాయంపై ఇటీవల శ్రీరంగరాజపురం మండల కార్యాలయం వద్ద కుటుంబంతో నిరసన తెలిపాను. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విన్నవించినా పట్టించుకోలేదు. నాకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హేమాద్రి, దివ్యాంగుడు, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా పింఛన్ ఇప్పించండి సారూ.. మా బిడ్డ హరీష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మేము మా బిడ్డ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నాం. మా బిడ్డకు పింఛన్ మంజూరు చేయండి. – ఏ.హరీష్ తల్లిదండ్రులు, కల్యాణపురం ఎస్టీకాలనీ, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లాఅర్హత ఉన్నా అందని పింఛన్ వైజాగ్ జీవీఎంసీ 47వ వార్డు కంచరపాలెం కొండవాలు ప్రాంతం జయప్రకాష్ నగర్లో టి.సునీత అనే మూగ–వినికిడి లోపం గల మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. జీవీఎంసీ జోన్–5 పరిధిలో యూసీడీ అధికారులకు ఎన్నోసార్లు పింఛన్ కోసం విన్నవించగా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసి కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదని సునీత సైగలా ద్వారా వాపోతోంది. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
జీతాలు, పెన్షన్ల కోసం పడిగాపులు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. తొలి నెల మినహా తరువాత నెలల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. గత నెల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 10వ తేదీ వచ్చే వరకు జీతాలను చెల్లించలేదు. ఈ నెల కూడా అలాగే చేస్తారనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.రాష్ట్ర సచివాలయంతోపాటు శాఖాధిపతులు కార్యాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు వారి ఖాతాల్లో పడలేదు. ఈఎంఐలు చెల్లించాల్సిన ఉద్యోగులు జీతాల మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల ఫాఠశాల్లో పనిచేసే ఉద్యోగులు, గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలివ్వడం లేదు. మంగళవారం కూటమి ప్రభుత్వం మరో రూ.4,237 కోట్ల అప్పు చేస్తోంది. ఆ నిధులు ఖజానాకు చేరిన తరువాతనైనా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జీతాల కోసం చకోర పక్షుల్లా..!
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. నవంబర్ మూడో వారం వచ్చినా..నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలుప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది. అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
ఏపీలో ప్రతినెలా తగ్గిపోతున్న పెన్షన్లు
-
ఏపీలో నెలనెలా తగ్గిపోతున్న పెన్షన్లు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. నెల నెల పెన్షన్లలో కోతలు విధిస్తోంది ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడుతోంది.గత నెల కంటే ఈ నెల పెన్షన్లు మళ్లీ తగ్గాయి. అక్టోబర్ నెలకి 64,38,884కు పెన్షన్లను తగ్గించింది ప్రభుత్వం. సెప్టెంబర్లో 64,61,485 మందికి పెంషన్లు మంజూరు చేయగా.. ఈ నెల 64,38,884కే పెన్షన్లు అందించింది. ఈ ఏడాది మేలో 65,49,864 పెన్షన్లు ఉండగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 11 వేలు మంది పెన్షన్లను తొలగించేసింది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకుండా ఉన్నవాటిని ప్రభుత్వం తగ్గిస్తుండటంపై పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అనుభవంతో అధికారంలోకి వచ్చా
చీమకుర్తి: అనుభవాన్నంతా ఉపయోగించా.. అందుకే 93 శాతం సీట్లను గెలిపించుకున్నా అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కూటమి 21 ఎంపీ సీట్లు కూడా గెలవటంతో ఢిల్లీలో పరపతి పెరిగిందన్నారు. ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడటంతో ఆకస్మికంగా ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని శాఖల్లో సర్వే చేసి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేశానన్నారు. రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందని, వాటికి ఏటా రూ. 1 లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి ఉందన్నారు. అందుకోసం సంపద సృష్టించి గాడితప్పిన పాలనను గాడిలో పెడుతున్నానన్నారు. రూ. 99కే నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పారు. దగ్గరలోనున్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లేక ఎడ్ల బండ్లపైన లేక నెత్తిమీద పెట్టుకోనైనా తెచ్చుకోవచ్చని అన్నారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వం నాసిరకం నెయ్యితో తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టమంటారా? అంటూ ప్రశ్నించారు. నంగనాచి మాటలు మాట్లాడుతున్న మాజీ చైర్మన్ ఈ జిల్లాలోనే ఉన్నాడని, ఆయన పేరు తాను చెప్పనని అన్నారు (మనం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డు ఎవరైనా తిన్నారా తమ్ముళ్లూ అని రెండు సార్లు అడిగినా.. జనం నుంచి స్పందన లేదు). ఇక నుంచి ప్రతి నెలా 1న ‘పేదల సేవలో’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ అంతా ప్రతి గ్రామంలో ఇలాంటి సభలే ఏర్పాటు చేసి నిజమైన అర్హులకు కొత్త పెన్షన్లు అందజేస్తామని, అదే సభలో దొంగ పెన్షన్లపై విచారణ చేస్తామన్నారు. మగవాళ్లూ... అర్థమైందా.. జనాభా తగ్గుతోందని, పిల్లలను పుట్టించకపోతే భవిష్యత్లో సమస్యలు వస్తాయని, అందుకే ఆడవారికి పనులు చెప్పటం తగ్గించి మగవారు ఆ పనిలో ఉండండి అంటూ చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘మగవారికి అర్థమైందా...?’’ అంటూ ప్రశ్నించారు. 15 ఏళ్ల క్రితం తానే జనాభా నియంత్రణ మార్గాలను అమలు చేశానన్నారు. దాని వలన జనాభా తగ్గిందన్నారు. రాబోయే ఐదేళ్లలో జనాభాను పెంచేందుకు పాప్యులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా సర్పంచ్ని గ్రామంలో ఇంటింటికీ తిరిగి జనాభా పెంచేందుకు అవగాహన కల్పించాలంటూ సీఎం సూచించారు. కార్యక్రమం తర్వాత కొంతమంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు మాట్లాడారు. -
పింఛన్లు పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అనర్హులను గర్తింపు, వారికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించడానికి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై గురువారం సీఎం సమీక్షించారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అర్హులకే పింఛన్లు ఇస్తామని, అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పింఛన్ల మంజూరు ప్రక్రియలో లోపాలున్నాయని, వాటిని కూడా మంత్రుల సబ్ కమిటీ సరిచేస్తుందన్నారు. 50 ఏళ్లకే పింఛన్, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో వాటిపై కొంత స్పష్టత వస్తుందని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు దాదాపు రూ.80 వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుండగా, అందులో రూ. 54 వేల కోట్లను మాత్రమే మహిళలు ఉపాధిని పెంచుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని చెప్పారు. మిగిలిన వారు తీసుకునే రుణాలను కూడా ఉపాధి మార్గాల్లోనే పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతామన్నారు. స్త్రీనిధికి సంబంధించి రూ. 950 కోట్ల మేర వేరే బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని, ఆ మొత్తాలను ప్రభుత్వ నిధులకు మళ్లించారని, ఈ కారణంగా స్త్రీనిధి కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులొచ్చాయని చెప్పారు. పది జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆ జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సర్వేచేసి పింఛన్లు తొలగిస్తాం
టెక్కలి : ‘గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారులతో సర్వే చేయించి అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’.. అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శనివారం గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ ఇవ్వాలంటే తమ దగ్గర అక్షయపాత్ర లేదని.. చెట్లకు డబ్బులు పండడంలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా ఉందని.. సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రావివలస ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తాం :స్పీకర్ అయ్యన్నపాత్రుడునర్సీపట్నం: అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శనివారం ఆయన వృద్ధాప్య, వితంతు పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అక్టోబర్2 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. -
పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు
-
పింఛన్ కోసం సచివాలయానికి రండి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పినప్పటికీ.. ఆచరణలో మాత్రం అది కనిపించడంలేదు. మెజార్టీ లబ్దిదారులను స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పిలిపించుకొని పింఛన్ల పంపిణీ చేశారు. కొన్ని చోట్ల చెట్ల కింద, రచ్చబండల వద్ద, ప్రైవేటు స్థలాల్లో పంపిణీ చేశారు. గతంలో రాజకీయాలకతీతంగా పింఛన్ల పంపిణీ జరిగితే.. ప్రస్తుతం అ«ధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పింఛన్ల పంపిణీ జరిగింది. పింఛన్ల పండుగ పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ నేతల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల బహిరంగసభలు నిర్వహించి వృద్ధులను ఇబ్బంది పెట్టారు. కక్షగట్టి పింఛన్లు ఆపేసిన ఘటన పలుచోట్ల జరిగింది. కాగా, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 64,82,052 మంది పింఛన్దారులకు పంపిణీ చేసేందుకు రూ. 2,737 కోట్లు విడుదల చేశారు. గురువారం తొలి రోజు 63,18,881 మందికి రూ. 2,668.28 కోట్లు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజే 97.48 శాతం పింఛన్దారులకు పంపిణీ పూర్తి చేశామని వెల్లడించింది. పింఛన్ల పంపిణీలో నేతలు తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలో సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లకుండా గాం«దీవీధిలోని ఓ ఇంటి వద్దకు అందరినీ రమ్మని అక్కడే పింఛన్లు ఇచ్చారు. తిరుపతి కేవీబీపురం మండలంలోని రాయపేటు గ్రామ సచివాలయ పరిధిలో వగత్తూరు గ్రామంలో టీడీపీ నేతలు గోపాల్, సురేష్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రశ్నించాడని సాక్షి విలేకరి తల్లి పింఛన్ ఆపేశారు పంచాయతీలకు రావాల్సిన నిధులు ఎందుకు పక్కదారి పడుతున్నాయని ప్రశ్నించినందుకు సాక్షి విలేకరి తల్లి పింఛన్ను నిలిపివేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలాకి మండలంలోని బెలమరపాలవలస పంచాయతీలో చేపల చెరువుకు బుధవారం వేలం జరిగింది. ఈ వేలంపాటలో వ చ్చిన సొమ్ములు స్థానిక సర్పంచ్కు కాకుండా అధికార పార్టీ నేతల వద్ద ఉంచటాన్ని అదే గ్రామానికి చెందిన ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి టీడీపీ నేతలు చేరవేశారు. దీంతో నేరుగా ఎమ్మెల్యే.. ఎంపీడీవో ఉషశ్రీకి ఫోన్ చేసి విలేకరి తల్లి అయిన చింతు రమణమ్మ వితంతు పింఛన్ ఆపేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ప్రశ్నించే గొంతును నొక్కే చర్యలకు పాల్పడటం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుతుందని అన్నారు. నరసన్నపేట ప్రెస్క్లబ్ దీన్ని ఖండించింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ అన్నారు. కష్టాన్ని కొని తెచ్చుకున్నాం మొన్నటి వరకు తెల్లవారక ముందే వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ అందించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆధార్ కార్డు పట్టుకుని పింఛన్ ఎక్కడ ఇస్తారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరైతే సచివాలయంలో పింఛన్ల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ‘ఎంతటి కష్టాన్ని కొనితెచ్చుకున్నాంరా నాయనా’ అంటూ వృద్ధులు బాధపడుతున్నారు. ఏలూరు నగరంలో గురువారం పలు డివిజన్లలో పింఛన్దారులు అవస్థలు పడుతూ కనిపించారు. ఇదేం పింఛన్ల పంపిణీ ‘స్వామి’! రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల పల్లెపాలెంలో పెన్షన్లను బహిరంగ సభకు పిలిచి ఇవ్వడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం వృద్ధులను ఇలా బాధపెట్టడం ఏంటని మంత్రి తీరును పలువురు తప్పుబట్టారు. సూపర్సిక్స్ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించడంపై మండిపడ్డారు. -
ఓట్లు వేయలేదని పింఛన్ల నిలిపివేత
పుంగనూరు: టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంగా వృద్ధ దళిత మహిళలకు పింఛన్లు ఆపేశారు. ఇదేమని నిలదీసినందుకు కులం పేరుతో దూషించడమేగాక వారిపై దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మీర్జేపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్జేపల్లికి చెందిన చెన్నమ్మ, రామయ్య, అమరక్క, మునెమ్మ, గంగమ్మ, సరస్వతి అనే దళిత మహిళలకు గురువారం పింఛన్ నిలిపివేశారు. దీంతో వారంతా కలసి పంచాయతీకి వెళ్లి పింఛను చెల్లించాలని కార్యదర్శిని కోరారు. దీంతో టీడీపీకి చెందిన నాగరాజు, గిరి తదితరులు వారిని కులం పేరుతో దూషించి.. మా ఇష్టం వచ్చిన వారికే పెన్షన్ ఇస్తాం. మీరు మా పార్టీకి ఓట్లు వేశారా అంటూ దాడి చేసి కొట్టడమే కాకుండా మీ అంతు చూస్తామని బెదిరించారని వృద్ధ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఓట్లు వేయలేదనే కారణంతో మీర్జేపల్లి నుంచి నాయకురాళ్లపల్లి, బసివినాయునిపల్లె తదితర బీసీ కులస్తులు ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్డుకు గత నెలలో గొయ్యి తవ్వించి రాకపోకల్ని ఆపేసిన విషయం విదితమే.దళిత నేతల ఆగ్రహంమీర్జేపల్లిలో పెన్షన్ అడిగిన దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులో మీడియాతో విలేకరులతో మాట్లాడుతూ మీర్జేపల్లిలో దళితులను, బీసీలను తిరగనివ్వకుండా రోడ్లను తవ్వేసి అడ్డగిస్తున్నారని, పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.పింఛన్ నిలిపేయడంతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నంవేధించిన టీడీపీ నాయకులుగత నెలలో 3 రోజులు తిప్పించుకుని పింఛన్ ఇవ్వని వైనంఈ నెల జాబితాలోనూ పేరు లేదన్న టీడీపీ నేతలుమనస్తాపంతో విషం తాగిన బాధితుడు.. పరిస్థితి విషమంకంబదూరు: పింఛన్ నిలిపివేయడంతో ఓ దివ్యాంగుడు పురుగు మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.కుర్లపల్లికి చెందిన వడ్డే శ్రీనివాసులు దివ్యాంగుడు. భార్య గోవిందమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులుకు 86 శాతం వైకల్యం ఉండటంతో ఏ పనీ చేయలేడు. దీంతో భార్య గోవిందమ్మ కంకర కొట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి పరిస్థితి గుర్తించిన ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రీనివాసులుకు పింఛన్ అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక టీడీపీ నాయకులు కమ్మ కిష్టయ్య, కమ్మ కృష్ట తదితరులు దివ్యాంగుడైన శ్రీనివాసులుపై వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న ముద్రవేసి కక్షగట్టారు. జూలై నెలలో పెంచిన పింఛన్ శ్రీనివాసులుకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాసులు టీడీపీ నాయకుల్ని సంప్రదించగా.. మూడు రోజులు తిప్పించుకుని అర్హుల జాబితాలో పేరు లేదని జూలై నెలకు సంబంధించిన పింఛన్ ఎగ్గొట్టారు. తాజాగా గురువారం కూడా ఆగస్టు నెల పింఛన్ కోసం వెళితే జాబితాలో పేరు లేదని టీడీపీ నాయకులు చెప్పారు. ఏ ఆధారం లేని తనపై కక్ష గట్టడం తగదని, పింఛన్ సొమ్ము ఇవ్వాలని శ్రీనివాసులు ప్రాథేయపడినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో సచివాలయ సిబ్బంది హడావుడిగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లి ఆగస్టు నెల పింఛన్ సొమ్మును అందజేశారు. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడెలా పింఛన్ ఇచ్చారని శ్రీనివాసులు భార్య గోవిందమ్మ ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.వలంటీర్పై కక్ష సాధింపు.. పూరి గుడిసె కూల్చివేతపల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ దురాగతంసత్తెనపల్లి : తెల్లారకముందే ఇంటికి వచ్చిమరీ పింఛన్ ఇచ్చిన వలంటీర్పై కూటమి నేతలు కక్షగట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వలంటీర్ పూడిగుడిసెను కూల్చివేసి భార్యాబిడ్డలకు నిలువనీడ లేకుండా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటూ బ్రహ్మయ్య గ్రామంలోని పోరంబోకు స్థలంలో పూరి గుడిసె వేసుకుని చిన్నపాటి టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. వలంటీర్గా పార్టీలకతీతంగా సేవలందించిన బ్రహ్మయ్యను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు గతంలో కోరారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామ టీడీపీ నాయకులు ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లో లేని సమయంలో 20 ట్రాక్టర్ల మట్టి పోసి ఇంట్లోకి దారి లేకుండా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎన్టీఆర్ విగ్రహం పున:ప్రతిష్ట చేసి ఇక్కడ పార్కుగా అభివృద్ధి చేయదల్చుకున్నామని తక్షణమే ఇంటిని కూల్చివేయమన్నారు. కనీసం నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కోరగా పట్టించుకోకపోగా, స్థానిక టీడీపీ నేతలు బుధవారం ఇన్చార్జి తహసీల్దార్ ప్రసాద్ను కలిసి బ్రహ్మయ్య ఇల్లు ఖాళీ చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆగమేఘాల మీద బుధవారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు పూరి గుడిసెను తొలగింపజేశారు. గ్రామస్తులు అక్కడ గుమికూడి టీడీపీ చర్యలపై ముక్కున వేలేసుకున్నా పూరి గుడిసె కూల్చేసే వారి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. దీంతో వలంటీర్ బ్రహ్మయ్య, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు వీధినపడ్డారు. -
ఏపీలో పెన్షనర్లకు కూటమి సర్కార్ షాక్
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరిట ఇవాళ రెండో నెల జరిగిన ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడింది. కూటమి పాలనలో ఏపీలో పెన్షనర్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో 67,812 పెన్షనర్లు తగ్గిపోయారు. అలాగే గత నెల కంటే ఈనెల(ఈరోజు జరిగిన పంపిణీ) భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెలకొచ్చేసరికి 64 లక్షల 39 వేల 41 మందికి తగ్గిపోయింది. ఏటీఆర్ కలిపితే ఆ సంఖ్య 64,82,052గా ఉంది. జులై కంటే ఆగష్టులో 79, 455 పెన్షన్లు తగ్గించి ప్రభుత్వం. జగన్ హయాంలో ఫించన్దారుల్లో కోతలు విధించిన దాఖలాలు లేవు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల కాలంలోనే పెన్షనర్లను భారీగా తగ్గించింది. దీనిపై సిబ్బందిని నిలదీస్తే.. నిబంధనల పేరుతోనే ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా ఉండొచ్చని చంద్రబాబు సర్కార్ సూత్రప్రాయంగా సంకేతాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
‘డబుల్’ పెన్షన్పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
TG: 'ఆసరా' పక్కదారి..
సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్గా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది. -
పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు. -
టీడీపీ నేతల బరితెగింపు
కుందుర్పి/దెందులూరు/సాక్షి, టాస్క్ఫోర్స్/కాశీబుగ్గ: టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులు, వితంతువులపైనా తమ దర్పం చూపుతున్నారు. మంజూరైన పింఛన్ కూడా పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పాజిపాళ్యంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు మంజూరైన వృద్ధాప్య, వితంతు పింఛన్లను పంపిణీ చేయకుండా ఆ గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.పింఛన్ పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఐదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఇప్పుడు టీడీపీ నాయకులు అడ్డుచెప్పడం బాగోలేదని వృద్ధులు హనుమయ్య, అప్పాజప్ప, వితంతువు రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గురువారం జంబుగుంపల సచివాలయం ముందు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం వేలిముద్రలు కూడా వేయించుకున్న సచివాలయ ఉద్యోగులు.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో డబ్బులివ్వడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఫకృద్దీన్ను వివరణకోరగా, ‘వృద్ధులతో వేలిముద్రలు వేయించాం... రెండు రోజుల్లో పింఛన్ డబ్బులు ఇస్తాం’ అని సమాధానమిచ్చారు.పింఛను సొమ్ము వచ్చినా ఇవ్వడం లేదు..తమకు పింఛను సొమ్ము మంజూరైనప్పటికీ నగదు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన పింఛనుదారులు తాత మాణిక్యాలరావు, కాగితాల రమేష్, తాత రమాదేవి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను నగదు ఇప్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మానసిక వికలాంగురాలనే దయ కూడా లేకుండా..అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు ఓ మానసిక వికలాంగురాలి పింఛన్ను నిలిపివేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. దీనికి కారణం ఆమె తండ్రి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడమేనని తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ మండలం పాలగూడెంలో బొమ్మవరపు గోఖునేషు కుమార్తె మార్తమ్మ గత కొన్నేళ్లుగా పింఛన్ అందుకుంటోంది. అయితే ఈ నెల ఆమెకు పింఛన్ అందలేదు. దీనిపై ఆమె తండ్రి గోఖునేషు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడి ప్రోద్బలంతోనే తన కుమార్తె పింఛను నిలిపివేశారని వాపోయారు.బతికుండగానే చంపేశారు..ఓ కిడ్నీ వ్యాధి బాధితుడు బతికుండగానే చనిపోయాడని నిర్ధారించుకుని పింఛన్ ఆపేíÜన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. 5వ వార్డు ఉప్పరపేటలో ఉమ్మడిశెట్టి రామయ్య (73)కు పింఛనే జీవనాధారం. ఈ నెల అందరికీ రూ.7వేలు పింఛన్ ఇచ్చి ఆయనకు ఇవ్వలేదు. దీంతో సచివాలయ సిబ్బందిని సంప్రదించినా లాభం లేకపోయింది. మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఆయన మరణించినట్లు సచివాలయంలో రికార్డుల్లో ఉంది. అందుకే రెండు నెలలుగా పింఛన్ అందడం లేదని తెలిసింది. దీంతో రామయ్య నిశ్చేషు్టలయ్యారు. -
పింఛన్లకు ‘అధికార’ గ్రహణం
బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఎంపీడీవో శివనాగప్రసాద్ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. ⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. ⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. ప్రభుత్వం మారగానే పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. - సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం అప్పుడు ఎవరికీ తొలగించలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. - నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. - ముత్యాలనాయక్, ఆర్.కొత్తపల్లి, రామగిరి మండలం -
పింఛన్ హామీ తప్పెన్
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. – జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు. -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
పండుటాకులకు ‘చేయూత’ !
సాక్షి, కామారెడ్డి: పింఛన్దారుల కష్టాలకు పుల్స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. చేయూత ద్వారా అందుతున్న పింఛన్లు సొంతూళ్లలోనే తీసుకుంటున్నారా? వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తుందా? అన్నదానిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుగుతోంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు ఎల్లారెడ్డిలో, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన లబ్దిదారులకు కామారెడ్డిలో పింఛన్లు ఇస్తున్న విషయంపై ఈ నెల 18న ‘పింఛన్ కోసం 50 కిలోమీటర్లు’శీర్షికన ‘సాక్షి’మెయిన్లో ప్రచురితమైన కథనంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. పింఛన్దారుల కష్టాలపై వెంటనే అధికారులను నివేదిక అడిగారు. ఇదే సమయంలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో ఒక చోట పింఛన్ మంజూరై, మరో చోట పింఛన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పింఛన్దారుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.చందర్ ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు వివరాలను మెయిల్ చేయడంతో పాటు సాఫ్ట్ కాపీ అందించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. తీరనున్న పండుటాకుల కష్టాలు... పింఛన్ కోసం పండుటాకులు పడుతున్న కష్టాలకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. ‘సాక్షి’కథనంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. ఏడాదిన్నర కాలంగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జాబితా రూ పొందించిన తరువాత చేయూత పింఛన్దారులకు వారి వారి గ్రామాల్లోనే పింఛన్ అందే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో వారి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. -
గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
సాక్షి, అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతు, ఇతర పింఛన్లను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ. మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.వెయ్యి చొప్పున జూలై నెల పింఛన్తో కలిపి వృద్ధులు, వితంతు మహిళలకు జూలై ఒకటో తేదీ ఉదయాన్నే ఒక్కొక్కరికీ రూ.7 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. అదే విధంగా దివ్యాంగులకు సైతం పెంచిన పింఛన్లను అరియర్స్తో ఇస్తామన్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీని నిర్వహించనున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలను ఆ పార్టీ పాలిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో సైతం అమలు చేయడం లేదని, అదే తరహాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తాము వ్యతిరేకించినట్లు వివరించారు. గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని, ఈసీఐ ఆదేశాల మేరకు వలంటీర్లు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అయితే పలువురు వలంటీర్లు రాజీనామాలు చేశారని, త్వరలో శాఖాపరమైన రివ్యూ నిర్వహించి ఈ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వంటి కీలక పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రంలో నిర్విర్యమైన యువతలో నైపుణ్యాలు పెంపునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని మరో మంత్రి డోలా తెలిపారు. ఒక్క చాన్స్ అని మాజీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మంత్రి ఎస్.సవిత విమర్శించారు. -
ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ అకౌంట్స్ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్ను కాగ్ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి.2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్ కోసం బడ్జెట్లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యాయని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,గత ఐదేళ్ల బడ్జెట్లో మూల ధన వ్యయం ఇలా..ఆర్థిక ఏడాది మూల ధన వ్యయం (రూ.కోట్లలో) 2019–20 17,601 2020–21 20,690 2021–22 18,511 2022–23 7,581 2023–24 23,589 మొత్తం రూ. 87,972 -
వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
-
కళ్లు చల్లబడ్డాయా బాబూ!
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ? బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా? ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా? బాబు రక్షణకు ఎల్లో మీడియా... ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే. మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే... కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు. ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ? బాబు యావ తెలియనిదెవరికి? బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు. అప్పుడు ప్రభావితం చేస్తారా..!! వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట. బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 97.91% మందికి పంపిణీ రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు ‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు. ‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్కళ్యాణ్ పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతిరెండు రోజుల్లో 16 మంది మృత్యువాత సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు. -
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. -
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
రామోజీ పెన్షన్ల లెక్క తేలుద్దాం
-
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
పేదలు పణంగా బాబు రాజకీయం
రాజకీయాల్లో వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే మరి కొంతమంది నాయకులు వెన్ను పోట్లు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. ఇవి కూడా చర్చనీయాంశమే అయినా... పవర్ కోసం కొట్లాట రాజకీయ పార్టీలు, రాజ కీయ ప్రత్యర్ధుల మధ్య ఉండటం వరకు సమర్థించవచ్చు. కాని స్వార్థం హద్దులు దాటి అధికారం కోసం, ప్రత్యర్ధిని దొంగ దెబ్బ తీయటం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకోవటం, బలహీన వర్గాల ప్రజలతో చెలగాటం ఆడే కుట్రలు... ఏ మాత్రం సహించ దగినవి కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కూటమి ఇప్పుడు ఇటువంటి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెర తీశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్ర అనారోగ్యగ్రస్థులకు వారి ఇంటి దగ్గరే వాలంటీర్లు పెన్షన్ అందించే విధానాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. తన జేబులోని మనిషి, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లు పెన్షన్లను లబ్ధిదారులకు పంచకూడదని ఫిర్యాదు చేయించారు. వీరి ఫిర్యాదుకు అను గుణంగా ఈసీ ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు 66 లక్షల మంది పెన్షనర్లు మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో, బాబు హయాంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పండుటాకులు ఎలా పడిగాపులు పడేవారో పత్రికల్లో ఫోటోలతో సహా వార్తలు నిత్యం వస్తూ ఉండేవి. వారం, పది రోజుల పాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కోసం. పూట గడవని స్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అవ్వా తాతలు అలానే అంతటి కష్టాన్నీ భరించే వారు. కాస్త కాలు చేయి బాగానే ఉన్నవారు సరే. మరి మంచాన పడిన వారు, నాలుగడుగులు కూడా వేయలేని వారు, ఆసరా లేకుండా నిలబడ లేని వారి పరిస్థితిని ఊహించగలమా? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిస్సహాయులను ఇటువంటి దుఃస్థితి నుంచి బయటపడేశారు. పెన్షన్ కోసం మంచం దిగాల్సిన అవసరం రాకుండా సగౌరవంగా వాలంటీర్లే లబ్ధి దారుల ఇళ్ళకు వెళ్ళి అవ్వా, తాతల చేతుల్లో పెట్టే విధంగా వాలంటీర్–సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అది కూడా ఫస్ట్ తేదీనే, కోడి కూయక ముందే! ఇప్పుడు అక్షరాల 3 వేల రూపాయల పెన్షన్ 66 లక్షల మందికి అందు తోంది. వృద్ధులనే కాదు వికలాంగులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ వంటి తీవ్ర రోగాల పాలైన వారిని కూడ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడేందుకు వీరి ఆరోగ్యం సహకరించదు. ఓ వైపు మండుతున్న ఎండలను తట్టుకునే శక్తీ ఉండదు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మంచాన పడిన వారు కూడా పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉన్న భయం, ఆక్రోశం ఇవాళ్టిది కాదు. గత రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. పట్టుమని పాతికేళ్లు నిండని ఈ పిల్లలను రెడ్ లైట్ ఏరియాకు మహిళలను సరఫరా చేసే బ్రోకర్లుగా, హ్యూమన్ ట్రాఫికర్లుగా, దొంగలుగా పవన్, చంద్రబాబు మొన్నటి వరకు చిత్రించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి చేసిన మంచి వల్ల ప్రజలంతా జగన్కే మళ్లీ పట్టం కడ తారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇంతటి క్రూరమైన క్రీడకు తెర తీశారు. దీని ద్వారా చంద్ర బాబు రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మొదటి లక్ష్యం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పండు టాకులనూ, నిస్సహాయులనూ మళ్లీ రోడ్డున పడవేసి పెత్తందారీ, దురహంకారపూరిత ఆనందాన్ని పొందటం రెండో లక్ష్యం. వృద్ధులు, నిస్సహాయులను క్షోభ పెడితే ఆ పాపం ఊరకనే పోదు. ఇది నిజం! – ఆర్ఎస్ -
దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు అండ్ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. పింఛన్ల విషయంలోనూ పచ్చ గ్యాంగు కుట్రలకు ఏమాత్రం వెరవకుండా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఠంఛన్గా పింఛన్లు అందజేసింది. ఎన్నికల కోడ్ను సాకుగా చూపి చంద్రబాబు అండ్ కో వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఆటంకాలు సృష్టించినా.. ప్రభుత్వం అవ్వాతాతలకు ఠంఛన్గా పింఛన్ డబ్బులను అందజేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించి, కేవలం ఆరు గంటల్లోనే 26,00,064 మంది లబ్దిదారులకు రూ. 785.25 కోట్లు అందజేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్గా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదుల మేరకు మార్చి 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇ చ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వలంటీర్లను ఈ కార్యక్రమం నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ప్రశాంతంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో హఠాత్తుగా గందరగోళం నెలకొంది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ప్రత్యామ్నాయ పద్ధతులను రూపొందించింది. మంగళవారం రాత్రికే రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వాటి పరిధిలోని లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. సచివాలయాల సిబ్బంది బుధవారం బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు డ్రా చేసి, మధ్యాహ్నం 12.30 నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. రాత్రి ఏడు గంటల వరకు పింఛన్ల పంపిణీ కొనసాగిందని అధికారులు తెలిపారు. 39.58 శాతం మేర పంపిణీ పూర్తి ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ. 1,951.69 కోట్లు విడుదల చేయగా, బుధవారం రాత్రి వరకు 26,00,064 మందికి రూ. 785.25 కోట్లను సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. మొత్తం 39.58 శాతం మందికి పింఛన్లు అందాయి. మరో మూడు రోజులు సచివాలయాల వద్ద ఈ పంపిణీ కొనసాగుతుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్ చైర్కు పరిమితమైన వారికి తప్పనిసరిగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారమే 54.82 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆ జిల్లాలో 3,16,492 మంది లబ్ధిదారులు ఉండగా, బుధవారం రాత్రి వరకు 1,73,485 మందికి పంపిణీ పూర్తయింది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలోనూ 52.13 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 50.42 శాతం, ఏలూరు జిల్లాలో 48.88 శాతం, ప్రకాశం జిల్లాలో 46.60 శాతం, తిరుపతి జిల్లాలో 46.26 శాతం చొప్పన పంపిణీ పూర్తయినట్టు అ«ధికారులు వివరించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కువ భాగం ఆఫ్లైన్ విధానంలో పంపిణీ జరుగుతున్నందున, ఆ వివరాలు అందాల్సి ఉందని అధికారులు వివరించారు. నేడు ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు. ఈ విభాగాల పింఛన్దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బంధం తెంచిన బాబుబుధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వలంటీర్లు ఉండి ఉంటే ఈ సమాచారం వెంటనే లబ్ధిదారులకు తెలిసి ఉండేది. వలంటీర్లు లేకపోవడంతో వారికి సరైన సమాచారం అందలేదు. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా, ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. 2019 ఆగస్టులో రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వివరాలను నేరుగా వలంటీర్ల ద్వారా సంబంధిత లబ్దిదారులకు సకాలంలో, స్పష్టంగా అందుతుండేదని అధికారులు చెప్పారు. లబ్దిదారులకు ఏదైనా సహకారం అవసరమైనా వలంటీర్లు అందించేవారని తెలిపారు. హఠాత్తుగా వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించడంతో ఇప్పుడు వారి ద్వారా సమాచారం తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఆ కారణంగా పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందన్న ప్రభుత్వ సమాచారం కూడా లబ్దిదారులకు తెలియలేదని అధికారులు వివరించారు. నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వలంటీర్ల బంధాన్ని చంద్రబాబు అండ్ కో తెంచడంతో పేదలకు ఈ ఇబ్బందులు వచ్చాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. -
చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు?
అవ్వతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు.. ముసలి వాళ్లు, వికలాంగుల కన్నీళ్లపై నోరు మెదపరు.. నిమ్మగడ్డ, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నావు.. చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు? రామోజీ.. అవ్వాతాతల కష్టాలు ఎందుకు రాయవు? చేసిదంతా చేసి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. అవ్వాతాతల రియాక్షన్ చూసి బాబు సైలెంట్ అయిపోయాడా? పింఛన్ దారులకు సమాధానం చెప్పలేక ఎల్లో ముఠా నోరు మూతబడిందా? గత ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం.. సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. అదేదో సినిమాలో డైలాగు లాగా... వాడు ఎక్స్ దొంగ.. ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ..! అన్నట్టుగా సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లోనూ చంద్రబాబు ఇంతే..! కుట్రలు, కుతంత్రాలు చేయడం.. నిమిషంలో దొరికిపోవడం. వాలంటీర్ల విషయంలో ఇదే చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని సైలెంట్ అయ్యాడు. నిమ్మగడ్డను కలుగులో దాక్కోమని చెప్పాడు. ఎల్లో మీడియాను జగన్ పై రివర్స్ అటాక్ చేయమన్నాడు. దత్తపుత్రుడ్ని హైదరాబాద్ పోయి ఆసుపత్రి బెడ్పైకి పడుకోమన్నాడు. నాకర్థం కాదు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లంటే.. చంద్రబాబు ఆయన పచ్చ ముఠాకు ఎందుకంత కోపం.. ఎందుకంత కసి.. ఎందుకంత కక్ష.. వాళ్ల నోటి దగ్గర కూడు లాగేసుకుని రాక్షసానందం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు. చంద్రబాబు ముఠా ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వం మాత్రం ఆ 66 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు వేరే మార్గాలు అన్వేషించింది.. పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. సచివాలయాలకు రాలేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో రాష్ట్రం రూపురేఖలనే జగన్ మార్చేశారు. జగన్కు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి.. ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి.. ఆఖరికి అవ్వాతాతలకు వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకూడదన్న ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని ఫలితం ఏ రకంగా ఉంటుందో.. అవ్వాతాతల శాపనార్థాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈరోజు పచ్చ ముఠాకు అర్థమైంది. దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టుగా.. ఎక్కడి దొంగలు అక్కడే సైలెంట్ అయిపోయారు. అయినా సరే అవ్వాతాతల కన్నీళ్లకు కారణమైన 74 ఏళ్ల కుప్పం తాత.. 87 ఏళ్ల ఎల్లో తాత.. ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 1. జగన్ ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో నిమ్మగడ్డను తెరపైకి తెచ్చావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 2. పేదలకు పింఛన్ల అందకుండా నిమ్మగడ్డకు పసుపు ముసుగు తొడిగి ఈసీ వద్దకు పంపించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 3. నిమ్మగడ్డతో సుప్రీం కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వరుస కేసులు వేయించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 4. జగన్ నా మనవడు.. నా కొడుకు అంటున్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 5. సంక్షేమంతో సుఖంగా ఉన్న వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 6. ఎర్రటి ఎండలోకి వృద్ధులను లాగి పచ్చమూక పైశాచికానందం పొందుతోందా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 7. పింఛన్ వస్తుందో రాదోనన్న భయంతో తాత చనిపోతే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 8. నీ కుట్రలు, కుతంత్రాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 9. వాలంటీర్లు ఫించన్లు అందించకూడదంటూ ఈసీకి ఫిర్యాదు చేయించింది నేనే అని చెప్పలేకపోతున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 10. అవ్వాతాతలు నిలదీస్తారని పవన్ హైదరాబాద్ పారిపోయి హాస్పిటల్ బెడ్ పై పడుకుని నటిస్తున్నాడా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు -
పెన్షన్ల పంపిణీని ఆపిన పాపం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తము అడ్డుకోలేదన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? ఇప్పుడేం మాట్లాడుతుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని.. ఇప్పుడు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారని పేర్ని నాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని మండిపడ్డారు. చదవండి: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ‘చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు. మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు?. పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది?. ముసలివారి ఉసురు మీకు తగలదా?. వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా?. 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా?. 58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం. 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్పై ప్రేమ తగ్గిపోతుందా?.వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా? నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే’ అంటూ ఫైర్ అయ్యారు పేర్ని నాని -
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
నేటి మధ్యాహ్నం నుంచి.. సచివాలయాల్లో పింఛన్లు
సాక్షి, అమరావతి: ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ♦తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే íపింఛన్ల పంపిణీ చేపడతారు. ♦ ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ♦ వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ♦ సచివాలయాల వద్దకు వచ్చే íపింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ♦ పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ♦ సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ♦ ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ♦ పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ♦ ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్ను పాటించాలి. ♦సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. n పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. కలెక్టర్లతో చర్చించాకే నిర్ణయాలు పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలు సేకరించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ విధానంలో పింఛన్లు అందించేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామన్నారు. వారందరికీ అప్పటికప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడంలో చాలా సమస్యలున్నట్లు తేలిందన్నారు. పింఛన్ల డబ్బులు బ్యాంకులో జమ చేసినా వాటిని తీసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని గుర్తించామన్నారు. మరో ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడంలోనూ ఇబ్బందులున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా సచివాలయాల ఉద్యోగులు కేవలం 1.27 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. 12,770 మంది ఏఎన్ఏంలు, 14,232 మంది వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీష్ అసిస్టెంట్లు, 6,754 మంది ఎనర్జీ అసిస్టెంట్లను వారి విధులకు అటంకం కల్పిస్తూ పింఛన్లు పంపిణీ చేయించే పరిస్థితి లేదని తమ చర్చల్లో గుర్తించామన్నారు. మిగిలిన సచివాలయాల ఉద్యోగులలోనూ చాలా మంది ఎన్నికలకు సంబంధించి బీఎల్వో విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. వారందరినీ మినహాయిస్తే లబ్దిదారుల ఇళ్ల వద్ద í íపింఛన్ల పంపిణీకి వినియోగించుకునేందుకు సచివాలయాల ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు లబ్దిదారుల చిరునామాలు కచి్చతంగా తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని, అందువల్ల పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్ధారించుకున్నారు. -
‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్(ట్విట్టర్)లో మెసేజ్లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. టిప్పర్ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్ పనిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్ గారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’ అని మేరుగ మండిపడ్డారు. ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే -
మళ్లీ ‘అవ్వ’స్థలు తప్పవా!
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): రేపటి నుంచి పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందేమోనని మదనపడుతున్నారు. ఇదే విషయంపై తన గోడు వెలిబుచ్చారు ఓ అవ్వ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చినదొడ్డిగల్లుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనకాపల్లి లోక్సభ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కురందాసు వృద్ధురాలు ఎరకమ్మ ఇంటికి వెళ్లారు. పింఛను వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎరకమ్మ బదులిస్తూ ‘‘ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీ పొద్దుపొద్దునే వలంటీరు వచ్చి డబ్బులిస్తున్నాడు. రేపు ఒకటోతేదీ కదా పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మేమే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంట. వలంటీర్లను తీసేశారంట నిజమేనా బాబూ! ఈ వయసులో సచివాలయం వరకు వెళ్లి తెచ్చుకోలేమయ్యా.. ఇంటికొచ్చి ఇచ్చేటట్టు చూడయ్యా’’ అంటూ వేడుకుంది. ముత్యాలనాయుడు స్పందిస్తూ చంద్రబాబు వల్లే ఎన్నికల అధికారులు వలంటీర్లను రెండునెలలపాటు ఆపారు. జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారు. మీరంతా జగన్కే ఓట్లు వేయాలని’’ అని వివరించారు. అవ్వ మాట్లాడుతూ ‘‘నా ఓటు జగన్బాబుకే కొడుకా’’ అని వెల్లడించింది. అదే గ్రామంలో అప్పారావు అనే వృద్ధుడూ పింఛన్ ఇంటికే తెచ్చివ్వాలని కోరాడు. -
పింఛన్లపై బాబు డబుల్ గేమ్
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు. దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు. వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు. నిమ్మగడ్డ ద్వారా.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలన్నది చంద్రబాబు కుతంత్రం. ఈ పనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆయన ప్రత్యేకంగా అప్పగించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన చరిత్ర ఆయనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే హైదరాబాద్లోని ఓ హోటల్లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ను కలసి చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోనని చాటుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా నిస్సిగ్గుగా చంద్రబాబుకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమందిని పోగుచేసి సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపారు. అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు. ప్రజాగ్రహంతో... పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. చంద్రబాబు, నిమ్మగడ్డ నిర్వాకాల కారణంగా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. -
అవ్వాతాతలపై బాబు పగ..
సాక్షి, అమరావతి: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలను ఠంఛనుగా అందజేయడంలో కీలకంగా ఉన్న వలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు తన పగ సాధించింది. అవ్వాతాతలకు ఏ కష్టం లేకుండా నెలనెలా ఒకటో తారీఖు పొద్దున్నే తలుపుకొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న ఈ వలంటీర్లపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ మొదటినుంచీ రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులను మళ్లీ టీడీపీ పాలనలో మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడానికే చంద్రబాబు బరితెగించారు. ఇందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను పావుగా వాడుకున్నారు. చంద్రబాబు సేవలోనే తరిస్తున్న నిమ్మగడ్డ.. నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ.. ఆయన పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మొదటి నుంచీ పనిచేసిన వ్యక్తే. స్థానిక సంస్థల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సిఫార్సు చేశారు. వాస్తవానికి.. 2018లో రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా.. 2019 సాధారణ ఎన్నికల ముందు ఆ ఎన్నికల జరిగితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావించి నిబంధనలకు విరుద్ధంగా కోర్టు సాకుల పేరుతో సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకు సర్పంచి ఎన్నికలు జరగకుండా నిమ్మగడ్డ అడ్డుకున్నారు. ఇక జగన్ సీఎం అయ్యాక కూడా.. 2020 ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. అప్పట్లో ఈ నిర్ణయం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. వలంటీర్లపై సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ కేసులు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఆయన తన బాస్ చంద్రబాబుకే కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పలువురు ద్వారా చంద్రబాబు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ ద్వారా వలంటీర్ల వ్యవస్థపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తూ కోర్టులోనూ కేసులు దాఖలు చేయించారు. వలంటీర్ల వ్యవస్థ చెల్లుబాటునే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి, ఆ తర్వాత తనంతట తానుగా ఆ కేసును ఉపసంహరించుకున్నారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులోనూ కేసు దాఖలు చేశారని, రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో వరుసగా రెండుసార్లు వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు చేసింది. రూ.లక్షల్లో లాయర్లకు ఫీజులు.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై మొత్తం కథ నడిపించిన చంద్రబాబు ఇందుకు లాయర్ల ఫీజుల నిమిత్తం రూ.లక్షల్లో వెచ్చించారు. సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఖరీదైన లాయర్లను వినియోగించారు. నిజానికి.. అంత పెద్ద లాయర్లను భరించడం ఈ సంస్థవల్ల కాదు కాబట్టి చంద్రబాబే వెనుకనుండి ఇదంతా నడిపిస్తున్నారు. ఇక ఈ కేసులను కపిల్ సిబాల్, సిద్ధార్థ దవే., పీబీ సురేష్ వంటి సీనియర్ లాయర్లు వాదిస్తున్నారు. వీళ్ల ఫీజులు రోజుకు రూ.లక్షల్లో ఉంటుందన్నది తెలిసిందే. నరకప్రాయమైన ఆ రోజులు మళ్లీ.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర దాదాపు 66.40 లక్షల మంది లబ్ధిదారులు మళ్లీ రోడ్డున పడనున్నారు. అప్పట్లో చంద్రబాబు పాలనలో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవి మళ్లీ పునరావృతం కానున్నాయి. ఆ రోజుల్లో పింఛన్ల కోసం బ్యాంకులకు వెళ్తే చాంతాడంత క్యూలు.. మండే ఎండల్లో తిండి లేకుండా నిరీక్షణ.. ఈలోపు సమయం మించిపోతే మళ్లీ బ్యాంకుల నుంచి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. కానీ, 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరి కష్టాలన్నింటికీ మంగళం పాడుతూ వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇది ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని చంద్రబాబు గ్రహించి సందర్భం వచ్చినప్పుడల్లా వలంటీర్లపై తన అక్కసు వెళ్లగక్కేవారు. బాబు జేబు సంస్థ ముసుగులో.. తన జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను చంద్రబాబు కొద్దిరోజుల ముందే ఏర్పాటు చేయించారు. దీని ముసుగులో చంద్రబాబు తన కుట్రలకు ఎప్పటినుంచో పదునుపెట్టారు. ఎన్నికల సమయంలో ఈ వలంటీర్లను ఎలాగైనా విధుల నుంచి దూరం పెట్టాలని పచ్చబ్యాచ్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా.. తన నమ్మినబంటు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఈ సంస్థకు నేతృత్వం వహించి బాబు డైరెక్షన్లో కేంద్ర ఎన్నికల సంఘానికి మొన్న ఫిబ్రవరి నుంచి అదేపనిగా వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి నగదు పంపిణీ చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ విషయం ఈసీ కూడా తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
96.13 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. 66,15,482 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1961.13 కోట్లు విడుదల చేసింది. శనివారం వరకు మొత్తం 63,59,727 మంది లబ్ధిదారులకు రూ.1,885 కోట్లు అందజేశారు. ఇందులో దాదాపు 54 లక్షల మంది లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛను డబ్బులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
నరకం చూపి ‘నారా’ నాడు
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు. పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది.. అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్అదాలత్ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు. నేడు వేకువజామునే ఇంటికి.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి. కాళ్లు లేకున్నా.. కరుణించలేదు నేను లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం -
ఇదీ.. విశ్వసనీయత
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో ఊరూవాడా ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుంచి ఆయా మండలాలవారీగా మొదలయ్యే పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నారు. సోమవారం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుండగా ఈనెల 3వతేదీన సీఎం జగన్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పెంచిన పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందచేయనున్నారు. వలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారు. ఇలా ఈనెల 8వతేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కొత్త పింఛన్లు 1.17 లక్షలు జనవరి నుంచి కొత్తగా మరో 1,17,161 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెలలో కొత్తగా జారీ చేసిన వారికి స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పింఛను మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి మొత్తం 66.34 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీకి ప్రభుత్వం రూ.1,968 కోట్లను విడుదల చేసింది. సీఎం లేఖను చదివి వినిపిస్తూ.. ఈ నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖ ప్రతిని వలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్ధమయ్యేలా వలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నమ్మకాన్ని పెంచుకుంటూ... దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1,000 మాత్రమే పింఛన్ అందించగా సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.2,250 చొప్పున ప్రారంభించి రూ.3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది. కరోనా గడ్డు కాలంలోనూ పెంపూ ఆగలేదు.. పెన్షన్లూ ఆగలేదు. మొత్తం లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా పింఛన్లు పెంచడమూ ఆగలేదు.. పంచడమూ ఆగలేదు. ‘అవ్వాతాతల పింఛన్ రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం...’ అని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్ తు.చ. తప్పకుండా ఆచరించి చూపారు. ఆత్మ గౌరవంతో పింఛన్లు.. పింఛన్ల కోసం చంద్రబాబు సర్కారు హయాంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న దుస్థితిని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా మానవీయ కోణంలో సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తున్నారు. ► గత పాలకుల హయాంలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఒకటో తేదీనే గడప వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవైనా, పండుగైనా సరై టంచన్గా చేతిలో పింఛన్లు పెడుతున్నారు. ► టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కొత్తగా పెన్షన్లు మంజూరైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండీ ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందకుంటే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ ఏటా జూన్, డిసెంబర్లలో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. ► ఇప్పుడు పెన్షన్ల కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21 రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. ► టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన పెన్షన్ మొత్తం రూ.58,000 మాత్రమే కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయా లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.1,47,500 అందిస్తోంది. గత ప్రభుత్వం కంటే ఇది రూ.89,500 అదనం. ► టీడీపీ హయాంలో దివ్యాంగుల పెన్షన్ కింద ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.58,500 మేర మాత్రమే లబ్ధి చేకూర్చగా ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వారికి రూ.1,82,000 అందిస్తోంది. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం ► టీడీపీ సర్కారు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం 66.34 లక్షల మందికి పింఛన్లను అందచేస్తోంది. పింఛన్లకే రూ.83,526 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. ఒక్క పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏటా రూ.23,556 కోట్లు వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల రూపంలో రూ.83,526 కోట్లను అందించినట్లు అధికారులు వెల్లడించారు. పింఛన్ పెరిగిందిలా... – టీడీపీ పాలనలో పెన్షన్ రూ.1,000 మాత్రమే – జూలై 2019 నుంచి పెన్షన్ రూ.2,250కి పెంచిన సీఎం జగన్ – జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు – జనవరి 2023న రూ.2,750కు పెంపు – జనవరి 2024న రూ.3 వేలకు పెంపు నాడు 400 కోట్లు.. నేడు 1,968 కోట్లు – 2014–19 మధ్య టీడీపీ హయాంలో నెలకు పెన్షన్ల సగటు వ్యయం రూ.400 కోట్లు. – జూలై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,384 కోట్లు – జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,570 కోట్లు – జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు – జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు -
2024 ప్రాధాన్యం రైతు, మహిళ, యువత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు, మహిళ, యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం సీఎం ప్రజలకు విడుదల చేసిన సందేశం ఆయన మాటల్లోనే.. ఆ హామీలు నిలబెట్టుకున్నాం.. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యార్యంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. యవత భవితే ప్రాధాన్యం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్కు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. సాగునీటి రంగంలో అవినీతిపై త్వరలో శ్వేతపత్రం ‘గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటిరంగంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అసత్య ప్రచారాలతో గందరగోళం వద్దు.. పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురుచూశారు. త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అధికారం కోల్పోయిన కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గతపాలన కాదు, జనపాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
జార్ఖండ్లో 50 ఏళ్లకే పెన్షన్
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు. గిరిజనులు, -
విశ్వసనీయత చాటుకున్నాం
అమరావతి: అవ్వాతాతలకు పెన్షన్ల పెంపుతో పాటు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేస్తూ ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చడం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని మరోసారి రుజువు చేసుకుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇదే సందేశాన్ని అవ్వా తాతలతో పాటు ప్రతి లబ్ధిదారుడికీ, ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని అధికార యంత్రాంగానికి సూచించారు. జనవరిలో మూడు కార్యక్రమాలతోపాటు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం కలిపి మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలను తలపెట్టామని, వీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా బ్రహ్మాండంగా జరిగేలా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన విధంగా ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. జనవరి నుంచి 8 వరకు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ రూ.3 వేలకు పెంపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రెండో కార్యక్రమంగా జనవరి 19న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, మూడోది జనవరి 23 నుంచి 31 వరకు ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని తలపెట్టగా నాలుగో కార్యక్రమం ‘వైఎస్సార్ చేయూత’ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టా్మత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3,000 1వతేదీ నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నాం. పెన్షన్ల పెంపు సందర్భంగా జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019లో మన ప్రభుత్వం రాక ముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 చేశాం. ఇప్పుడు రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తున్నాం. గత సర్కారు హయాంలో పెన్షన్ల కోసం సగటున నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. మనం రాక ముందు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు దాకా పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే కాగా ఇవాళ దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మంచి మార్పు తేగలిగాం ప్రతి అడుగులోనూ అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఎవరూ ఇబ్బందులు పడకూడదని మునుపెన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా ఒకటో తారీఖు రోజు.. అది ఆదివారమైనా, పండుగైనా సరే పొద్దునే వలంటీర్ చిక్కటి చిరునవ్వుతో ఇంటివద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఈ మార్పు ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. 1.17 లక్షల కొత్త పెన్షన్లు కూడా 1 నుంచే.. అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ (ఏడాదికి రెండు దఫాలు) కార్యక్రమం జనవరి 5వతేదీన జరుగుతుంది. ఆలోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల కొత్త పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు. దీంతో 66,34,742మందికి సుమారు రూ.1,968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. క్రెడిబిలిటీకి అర్ధం చెబుతూ పని చేస్తోంది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి. అవ్వాతాతలు వేచి చూడకుండా పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేను (సీఎం జగన్) కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో వీటిని నిర్వహించాలి. 8 రోజులపాటు పెంచిన పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జరుగుతాయి. ఏ మండలాల్లో ఏ రోజుల్లో నిర్వహించాలో ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎం లేఖ, వీడియో సందేశం పెంచిన పెన్షన్తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, ఉత్సాహవంతులు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా పట్టించుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదు రాష్ట్ర చరిత్రలో అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో లేదు. పెద్దల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దే పెన్షన్ డబ్బులు అందిస్తున్నాం. వారి కోసం పట్టించుకునే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ లాంటివి గతంలో ఎప్పుడూ లేవు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు ఎక్కడా ఇవ్వలేదు. చెప్పిన మాటను నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన ప్రభుత్వం అడుగులు వేసింది. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రతి లబ్ధిదారుడికీ తెలియచేయాలి. ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.23 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలుస్తూ సమర్థంగా దీన్ని నిర్వహిస్తున్నాం. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది ►2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం ►ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం ►గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు ►ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం ►మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు ►ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం ►ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం ►ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం: ►ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది ►రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►మూడో కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ►నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది ►ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది ►అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది: ►ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు ►66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి ►మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది ►క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది ►ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి ►పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది ►ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ►అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ►ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ►ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ►8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది ►ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి పెన్షన్తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి ►ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి ►ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి ►రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు ►వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం ►వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు ►దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు ►మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది ►ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే ►ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి ►ఈ పెన్షన్ కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం వైఎస్సార్ ఆసరా... ►2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి ►ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్గా సంఘాల్లో చేరిన పరిస్థితి ►18శాతం పైచిలుకు అక్కౌంట్లు అన్నీ కూడా అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం: ►మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం ►క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం ►అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి: ►అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది ►ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం ►మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం ►నాలుగో విడతగా.... చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం ►జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ►ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది ►ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ►మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం ►ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించాం ►బ్యాంకులతో టై అప్ చేయించాం ►స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం: ►ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి ►ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం : ►మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది: వీడియోల రూపంలో విజయ గాథలు ►పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి ►ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం ►ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి: ►ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి ►ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం ►ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం ►వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు ►ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి ►ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలి వైఎస్సార్ చేయూత కార్యక్రమం... ►ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుంది ►గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ►ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ►45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం ►26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం ►ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు ►ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి ►చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు ►అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి ►ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి ►అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి జనవరి 19 – అంబేద్కర్ విగ్రహం ప్రారంభం. ►జనవరి 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం ►19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం ►సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి ►ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి ►ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి ►ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం ►సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి ►గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం ►ఇదొక గొప్ప మార్పు ►దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి ►ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్ విగ్రహం నిలుస్తుంది -
జనవరి 1న ‘కొత్త’ శోభ
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మరోసారి కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. వేలాది మంది అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, వివిధ వర్గాల వారి జీవితాలకు భరోసానిస్తూ కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవరత్నాల్లో భాగంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని వైఎసార్సీపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను జనవరి 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి పాత వాటితో పాటు కొత్త పింఛన్ల పంపిణీ మొదలు కానుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం రూ.2,750 ఉన్న పెన్షన్ కానుకను జనవరి 1 నుంచి రూ.3వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పింఛన్లను కూడ ఇదే మొత్తాన్ని అందించనుండటంతో అవ్వతాతలు, ఇతర అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడాదిలో 38,592 కొత్త పింఛన్లు 2023 సంవత్సరం జనవరి, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జనవరిలో కర్నూలు జిల్లాకు 8,446, నంద్యాల జిల్లాకు 6,843 చొప్పున ఉమ్మడి జిల్లాకు 15,289 కొత్త పింఛన్లు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో రెండు విడతలుగా కర్నూలు జిల్లాకు 12,341, నంద్యాల జిల్లాకు 10,962 చొప్పున ఉమ్మడి జిల్లాకు 23,303 పింఛన్లు మంజూరయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో 2018 డిసెంబర్ నెలలో ఉమ్మడి జిల్లాలో 3,61,563 పింఛన్లు ఉండగా వీటికి పంపిణీ చేసిన నగదు రూ.40.27 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023 సెపెంబర్ నెలలో పింఛన్ల సంఖ్య 4,71,561కి చేరుకుంది. టీడీపీ హయాంతో పోలిస్తే 1,09,998 పింఛన్లు పెరిగాయి. ప్రస్తుతం పింఛన్ల రూ.130.76 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రాజకీయాలకు అతీతం టీడీపీ పాలనలో పింఛను పొందాలంటే ఓ ప్రహసనమనే చెప్పాలి. ప్రత్యేకంగా కొత్త పింఛన్ల ఊసే ఉండేది కాదు. పింఛను పొందుతున్న వారిలో ఎవరైన మరణిస్తేనే కొత్త పింఛను మంజూరు చేసేవారు. అప్పుడు కూడా జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో అర్హతే ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరవుతున్నాయి. ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం. ప్రత్యేక టీంలతో వెరిఫికేషన్ కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్ కోసం డీఆర్డీఏ–వైకేపి సూచనల ప్రకారం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూడు, అర్బన్ ప్రాంతాల్లో ఆరు టీంలు ఏర్పాటు చేశారు. వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేశారు. దరఖాస్తుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి డేటా నేరుగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు చేరుతోంది. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు మంగళవారం నుంచి వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 25 వేలకుపైగా కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. వెరిఫికేషన్లో ఏమి చేస్తారంటే.. ► కొత్త పింఛన్ల కోసం కొన్ని నెలల క్రితం దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. ► అందువల్ల వెరిఫికేషన్లో దరఖాస్తుదారు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ►గ్రామం/పట్టణంలో నివాసం ఉంటున్నారా... లేదా? పింఛను పొందడానికి అర్హతను తెలుసుకుంటారు. ► వికలాంగులు అయితే సదరం సరి్టఫికెట్ తప్పనిసరి. ► ఇతర పింఛన్లకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. -
పింఛన్ల పంపిణీకి అదనంగా మరో రోజు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అదనంగా ఒక రోజు పొడిగించింది. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 6 వరకు పొడిగించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో పాటు వలంటీర్లు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం 65,33,781 మంది లబ్ధిదారుల కోసం రూ.1,800.96 కోట్లను విడుదల చేయగా.. నిర్ణీత ఐదో తేదీ(మంగళవారం) సాయంత్రానికే 64,62,991 మంది లబ్ధిదారులకు రూ.1,781.37 కోట్ల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ మంగళవారం కూడా 81,702 మందికి పైగా లబ్ధిదారులకు వలంటీర్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. -
ఊసే లేని కొత్త పెన్షన్ల మంజూరు
హైదరాబాద్: పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సామాజిక పెన్షన్ల పెంపుపై ఆశలు చిగురిస్తున్నా.. ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాని అభాగ్యుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. గత కొన్నేళ్లుగా కొత్తగా సామాజిక పెన్షన్ల మంజూరు లేకుండా పోయింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోల్లో సామాజిక పెన్షన్ల పెంపుపై స్పష్టమైన హామీలు ఇచ్చాయి. అధికార బీఆర్ఎస్ ప్రస్తుతం రూ. 2016 పెన్షన్ను రూ.5 వేలకు విడతల వారీగా పెంచుతామని ప్రకటించింది. వచ్చే మార్చి తర్వాత పెన్షన్ను రూ.3 వేలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు అందిస్తామని పేర్కొంది. దివ్యాంగుల పెన్షన్ రూ.4016కు ఉండగా, మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం రూ. 300కి చొప్పున ఆరు వేలకు వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను రూ. 4000కు పెంచుతామని ప్రకటించింది. దీనిపై పేదలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్లోనే.. నాలుగేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు ఊసే లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం వయసు సడలింపునకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల్లో కొన్నింటికి మాత్రమే మంజూరు లభించగా మిగతావి తిరస్కరణకు గురయ్యాయి. సామాజిక పెన్షన్లకు సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తులు మాత్రం పెండింగ్లో మగ్గుతున్నాయి. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రధానంగా బడ్జెట్ సమస్యగా తయారైనట్లు తెలుస్తోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధాప్య, వింతంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ తదితర పింఛన్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. వాస్తవంగా ఆసరా పింఛన్ల దరఖాస్తుల నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కేవలం దరఖాస్తుల స్వీకరణ తప్ప మంజూరు మాత్రం లేకుండా పోయింది. తహసీల్ ఆఫీసులో సమర్పించిన దరఖాస్తులుపై క్షేత్ర స్థాయి విచారణ జరిపి అధికారులు అర్హుల జాబితాలను కలెక్టరేట్కు సిఫార్సు చేయడం, ఆ తర్వాత కలెక్టర్ ఆమోదంతో సెర్ఫ్నకు ప్రతిపాదనలువెళ్తున్నా.. మంజూరు మాత్రం పెండింగ్లో పడిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా గ్రేటర్ పరిధిలోని సుమారు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అనధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వృద్ధాప్య పింఛనుదారు మృతి చెందితే అతని భార్యకు పింఛన్ల మంజూరు కూడా లేకుండా పోయింది. దరఖాస్తుదారులు కలెక్టరేట్, తహసీల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో అధికారుల్లో స్పష్టత కరువైంది. దీంతో పెండెన్సీ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసి కొత్తగా మంజూరు ఇవ్వాలని పేద కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆసరా పింఛన్లు ఇలా.. హైదరాబాద్ 2,59,985 రంగారెడ్డి 2,02,129 మేడ్చల్ 1,47,053 -
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
అర్హులకు లబ్ధే లక్ష్యం
సాక్షి, అమరావతి: కొత్తగా మరో 1,49,875 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు అందుతాయని చెప్పారు. అలాగే కొత్తగా 2,00,312 బియ్యం కార్డులు మంజూరు చేశామని, వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందుతుందన్నారు. 4,327 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయడంతో పాటు మరో 12,069 మందికి ఇళ్ల స్థలాలను కూడా ఇస్తున్నామని తెలిపారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు ఇవ్వకుండా.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన ఫర్వాలేదు, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ కచ్చితంగా లబ్ధి కలిగించాలని తాపత్రయ పడుతూ అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనదని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల అయినా లబ్ధి కలుగకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మేలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదని, ప్రజల పట్ల మమకారం చూపడమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు ► ఈ ఆరు నెలల్లో కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే.. వెరిఫికేషన్ చేసి మంజూరు చేస్తున్నాం. ఇందులో భాగంగా 1,49,875 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపు 64.27 లక్షలకు చేరుకుంది. ► గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే 2018 అక్టోబర్ వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఆ సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలంలో కేవలం రూ.1,000 పింఛన్ మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఇవాళ రూ.2,750 ఇస్తున్నాం. ► ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం 1,48,12,934 బియ్యం కార్డులు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే.. మొత్తం వాటి సంఖ్య 1,42,15,820కు చేరింది. ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే.. మొత్తంగా వాటి సంఖ్య 30,84,935కు చేరింది. జగన్ మళ్లీ సీఎం కావాల్సిందే రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సీఎం జగన్ అనుక్షణం పరితపిస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్ మోడ్లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం స్పష్టంగా కనిపించింది. మా మనవడు మాకు మేలు చేస్తున్నారని అవ్వాతాతలు, మా మామ సాయం చేస్తున్నారని చిన్నారులు, మా అన్న వల్ల మేం బాగుపడుతున్నామని అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెప్పడం స్వయంగా విన్నాం. ఈ రాష్ట్రానికి జగన్ మళ్లీ సీఎం కావాల్సిందేనని, అప్పుడే ఆనందంగా ఉంటామని ప్రజలు చెబుతున్నారు. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పేదల కళ్లలో ఆనందం పారదర్శకత, కుల మతాలకు.. ప్రాంతాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి కల్పించడం, జవాబుదారీతనం ప్రతి దశలోనూ కనిపిస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా రూ.2.33 లక్షల కోట్లు సాయం చేయడం దేశంలోనే రికార్డు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలా చేయలేదు. ఏ పథకాలు ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. ఇప్పుడు అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి పేదవాడి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. – ఆదిమూలపు సురేష్, మంత్రి వివిధ పథకాల కింద 2.62 లక్షల మందికి లబ్ధి ► జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మళ్లీ లబ్ధి కలిగిస్తున్నాం. 207 మందికి వైఎస్సార్ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. 1,08,000 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. జగనన్న విద్యా దీవెన సొమ్మును మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా 36,898 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 8,753 మందికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, 267 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం, 16,717 మందికి జగనన్న అమ్మఒడి.. ఇలా మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ పథకాలను అందిస్తున్నాం. 94,62,184 మందికి సర్టిఫికెట్లు ► రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి.. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి వివిధ సర్టిఫికెట్లు ఇచ్చాం. ► ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి.. వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా.. కాల్ సెంటర్కు ఫోన్ చేసిన 1,630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి చేస్తున్నాం. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం నమస్తే సార్.. నేను చేనేత కార్మికుడిని. గతంలో కూలి మగ్గం నేసేవాడిని. ఇప్పుడు సొంత మగ్గం నేస్తున్నాను. గత జూలైలో నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో లేకపోవడంతో రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు అప్రూవ్ అయ్యి డబ్బులు రావడంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో పనితనం మరింత మెరుగు పరుచుకుంటాను. మీ వల్ల సొంతింటి కల నెరవేరింది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. స్కూళ్ల స్వరూపం పూర్తిగా మార్చేశారు. సచివాలయంలోనే అన్ని పనులు జరుగుతున్నాయి. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం. – నాగశేషు, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా ఇలాంటి పాలన చూడలేదు అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మ ఒడి మూడో విడత రాలేదు. ఎందుకు రాలేదని బాధ పడుతుండగా, వలంటీర్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాలేదన్నారు. లింక్ చేసి వలంటీర్కు చెప్పాక అమ్మ ఒడి వచ్చింది. గతంలో ఏదైనా పథకం కోసం మేం ఆఫీస్ల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు గడప దగ్గరకే అన్నీ వస్తున్నాయి. మా పాలిట మీరు దేవుడు అన్నా. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిపాలన చూడలేదు. – కళ్యాణి, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా డైనమిక్ లీడర్ అంటే మీరే.. అన్నా నమస్కారం.. నేను 15 ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో ఉన్నాను. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రెండోసారి చేదోడు పథకం కింద లబ్దిపొందలేక పోయాను. తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మంజూరైంది. మా ఇద్దరు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోయాననే బాధ గతంలో ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ను మార్చారు. ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందరూ లీడర్స్ అవుతారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే డైనమిక్ లీడర్ మీరే అన్నా.. – నాగరాజ, తిమ్మాయపాలెం, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా -
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు..
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను సీఎం జగన్ అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం.. క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నాం. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నాం. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నాం. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు. గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి చేరిందన్నారు. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత నాది. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం’ అని స్పష్టం చేశారు. అనంతరం, లబ్ధిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు. ఇది కూడా చదవండి: గిరిజనం ముంగిట విద్యావనం -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 62.99 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1, 735.36 కోట్లు విడుదల చేయగా, ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 11.00 ని.ల వరకూ 66.11 శాతం పెన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్లు. -
పెరగనున్న పెన్షన్ల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. అదే స్థాయిలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా పెరగనుంది. వచ్చే తొమ్మిదేళ్లలో 1,33,417 మంది ఉద్యోగులు రిటైర్ కానుండగా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం మొత్తం రూ.2,80,141.94 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ వివరాలను పొందుపరిచింది. వచ్చే ఏడాది 13,643 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పెన్షన్ల వ్యయం రూ.20 వేల కోట్లు ఉండగా వచ్చే ఏడాది రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. 2024 నుంచి 2032 వరకు ఏటా 13 వేల నుంచి 16 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. దీంతో 2032 నాటికి పెన్షన్ల వ్యయం రూ.41,803.40 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. -
CM KCR: వారందరికీ గుడ్న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు
సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా రైతులకు రూ.65వేల కోట్టు అందించాం. వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగరేణి టర్నోవర్ను రూ.33వేల కోట్లకు పెంచాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సింగరేణి సర్వనాశం అయ్యింది. దేశంలో బొగ్గుకు కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉండగా విద్యుత్ను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోంది. వచ్చే దసరాలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. దేశంలోని చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్లు.. -
1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్కుమార్ సూచించారు. పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. డిజిటల్ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్యటించి అక్కడ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, అదనపు కమిషనర్ సుధాకర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహనరావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహశీల్దార్ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు..
సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ శనివారం ఉత్తర్వులిచ్చారు. గ్రామాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని ఆదేశాలిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ.1,750 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా అందజేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మేరకు పింఛన్ డబ్బులను ఆయా సచివాలయాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఒకరు బ్యాంక్కు వెళ్లి ఆ డబ్బులను తీసుకువచ్చి.. వలంటీర్లకు అప్పగిస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నగదు విత్ డ్రా చేసి తీసుకెళ్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మళ్లీ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ 3న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఓ సచివాలయ మహిళా ఉద్యోగి బ్యాంక్ నుంచి రూ.16.15 లక్షలు తెస్తుండగా.. దొంగలు దోచుకెళ్లారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్ల నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసిన దగ్గర నుంచి వలంటీర్లు నగదు పంపిణీ చేసే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులిద్దరూ నగదుకు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలోనే సొమ్మును విత్ డ్రా చేయాలన్నారు. ఇది కూడా చదవండి: ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా.. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆ తర్వాత వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవుల కారణంగా ఈ నెలలో పింఛన్ల పంపిణీ మూడో తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 63,42,805 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యా«ధిగ్రస్తులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1747.88 కోట్లను విడుదల చేసింది. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచే సమయానికల్లా ఈ నిధులను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బును గ్రామ సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందించారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల సోమవారం రాత్రి పొద్దుపోయాక కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తూనే ఉన్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చెప్పారు. మరో నాలుగు రోజులు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
ఆరుశాతం వడ్డీ చెల్లించండి: హైకోర్టు
కోవిడ్ సమయంలో ఆపిన ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కాలం కొనసాగే వరకు 50 శాతం వేతనం, పింఛన్లలో కోత విధిస్తూ 2020, మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27ను తీసుకొచ్చింది. తర్వాత దీనిపై ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు. కోవిడ్ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా ఆపారన్నారు. మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు.. మూడు నెలలపాటు 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలు ముగించింది. 2020, మార్చిలో జీవో విడుదల చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాల్లో కోత విధించారు. వీటిని ఇదే సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2021 జనవరి, ఫిబ్రవరిలో విడతలవారీగా చెల్లించారు. -
మరో మాట నిలబెట్టుకున్నా
రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది కులాల యుద్ధం కాదు.. క్లాసుల మధ్య యుద్ధం. ఒకవైపు పేదవాడు మరోవైపు పెత్తందారీ వ్యవస్థ మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విషయాన్ని గుర్తించాలి. పొరబాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడనేది మరిచిపోవద్దు. కుట్రలు, కుతంత్రాలతో వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, గజదొంగల ముఠా విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి, దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 64,06,240 మంది లబ్థిదారులకు రూ.1,765.04 కోట్ల నమూనా చెక్ను ఎలుగొండ చెల్లాయమ్మకు అందచేశారు. గత సర్కారు అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తే ఇప్పుడు ఏకంగా 64.06 లక్షల మందికి పెన్షన్లు అందచేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు పింఛన్ల కోసం రూ.400 కోట్లిస్తే ఇప్పుడు నెలకు రూ.1,765 కోట్లకుపైగా వ్యయం చేస్తూ అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తున్నట్లు తెలిపారు. నాడు కత్తిరింపులే లక్ష్యమని, జన్మభూమి కమిటీలకు 3 నెలల పెన్షన్ లంచమిస్తేనేగానీ మంజూరు కాని దుస్థితి నెలకొందన్నారు. గత సర్కారు అరకొరగా రూ.వెయ్యి పెన్షన్ ఇస్తే ఇప్పుడు నెలకు రూ.2,750 చొప్పున ఇస్తూ మిగిలిపోయిన అర్హులను సైతం గుర్తించి ఏటా రెండుసార్లు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక్క పింఛన్ల కోసమే రూ.62,500 కోట్లు వెచ్చించామన్నారు. పింఛన్ల పెంపు వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు మిగిలిపోయిన అర్హులకు కూడా.. అర్హతే ప్రామాణికంగా పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాం. ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడకుండా మనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి కూడా పథకాలన్నింటినీ అందిస్తున్నాం. వీటిని పారదర్శకంగా అర్హులకు చేర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 2.62 లక్షల మంది వలంటీర్లు, 1.30 లక్షల మంది ఉద్యోగులతో సచివాలయ వ్యవస్థను తెచ్చాం. అవ్వాతాతలకే కాకుండా పుట్టుకతో, పుట్టిన తర్వాత అంగవైకల్యానికి గురైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బాధితులు, డయాలసిస్ చేసుకుంటున్నవారు, తలసీమియా, సికిల్సెల్, ఎనీమియా, హీమోఫీలియా, ఎయిడ్స్, బోదకాలు, చివరకు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కాలేయం, గుండె మార్పిడి జరిగిన నిరుపేదలందరికీ ప్రభుత్వం తరపున పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ అవ్వాతాతలకు పెన్షన్ పెంచడంతో పాటు గత జూలై నుంచి నవంబరు వరకు అర్హులందరికీ కొత్త కార్డులిచ్చాం. బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ డిసెంబరులోనే ఇచ్చాం. మిగిలిపోయిన అర్హులకు జూలై, డిసెంబరులో ఏడాదికి 2 సార్లు మేలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొత్తగా 44,543 బియ్యం కార్డులు ఇవ్వడంతో ఏపీలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,45,88,539కు చేరింది. మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు 1,41,48,249కు చేరాయి. మరో 14,531 ఇళ్ల పట్టాలకు సంబంధించి మంజూరు పత్రాలను అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నారు. ఇలా 30,29,171 ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు అందించగలిగాం. థాంక్యూ జగనన్న అంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు అపకారికి సైతం మీ బిడ్డ ఉపకారం గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇప్పుడు పెన్షన్లకు ఎక్కడా కోటాలు, కత్తిరింపులు, వివక్ష, లంచాలు లేవు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకుని మోకరిల్లాల్సిన అవసరం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే చాలు పెన్షన్ దగ్గర నుంచి ప్రతి పథకం ఇళ్ల దగ్గరకు వెళ్లి అందించే గొప్ప వ్యవçస్థ తెచ్చాం. ఇందుకు కారణం మీ బిడ్డ మనసున్న పాలన. చెడు చేసేవారికి సైతం మంచి చేసే గుణం మీ బిడ్డకు ఉంది కాబట్టే ఇంత మంచి పరిపాలన చేయగలుగుతున్నాం. షూటింగ్ కోసం గేట్లన్నీ మూసివేసి.. ఇదే చంద్రబాబు ఫోటో షూట్, డ్రోన్ షాట్ల కోసం ఇదే రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలకు వచ్చారు. మీ అందరికీ గుర్తుందా...? (ప్రజలంతా ఒక్కసారిగా పైకి లేచి గుర్తుందంటూ నినదించారు) ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగా చంపేశాడు. అన్ని గేట్లు మూయించి సినిమా డైరెక్టర్ను పక్కన పెట్టుకుని షూటింగ్ కోసం ఈ ఒక్కగేట్ తెరిచాడు. వేల సంఖ్యలో జనమంతా ఒక్క గేటు గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ డ్రోన్ షాట్ల కోసం నాడు 29 మంది చనిపోతే.. కుంభమేళాలో చనిపోలేదా? తొక్కిసలాటలు జరగలేదా? అని ఈ పెద్ద మనిషి వాదించాడు. మనుషులను చంపేసి మానవతావాదినంటాడు.. కందుకూరులో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించేందుకు విశాలమైన ప్రదేశంలో మీటింగ్ జరగనివ్వకుండా ముందుకు తీసుకెళ్లి సందులోకి ప్రజలను తరలించారు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి తన వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లడం ద్వారా 8 మందిని చంపేసిన పరిస్థితి చూశాం. తన డ్రోన్ షాట్స్, ఫోటో షూట్ కోసం 8 మందిని చంపేశాడు. ఆ వెంటనే ఆ పెద్దమనిషి అక్కడే.. మౌనం పాటించాలంటాడు. పక్కనే ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటాడు. షూటింగ్ కోసం 5 నిమిషాల్లో ఆసుపత్రి నుంచి మళ్లీ తిరిగి వచ్చేశాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ చేశానంటాడు. తానే మనుషులను చంపేస్తాడు.. చనిపోయిన వారిపట్ల తాను ఒక మహోన్నత, మానవతావాదిలా మళ్లీ డ్రామాలాడుతున్నాడు. ప్రతి అడుగులోనూ ‘బాబు’ మోసాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ మనిషి వంకర బుద్ధి ఎలా ఉంటుందో 2014 నుంచి 2019 వరకు మనమంతా చూశాం. ప్రతి అడుగులోనూ మోసమే. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలంటూ చివరకు నట్టేట ముంచాడు. రూ.14,204 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి అక్కచెల్లెమ్మలను రోడ్ల పాలు జేశాడు. రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారు. మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేశాడు. పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలు ఒక లెక్కా? ఇలాంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ 5 చూపించదు. దత్తపుత్రుడు ప్రశ్నించడు. కారణం వీళ్లంతా ఓ గజదొంగల ముఠా. అప్పట్లో జరిగిన ఏకైక స్కీం.. దోచుకో, పంచుకో, తినుకో(డీపీటీ). అందుకే ఆ పెద్దమనిషిని అధికారంలోకి తెచ్చేందుకు వారంతా కష్టపడుతున్నారు. వీరంతా పేదవాడికి ఇంగ్లిషు మీడియం చదువులు వద్దంటున్నారు. పేదలకు ఇళ్లు కట్టించొద్దంటున్నారు. పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటున్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక శక్తులతో మీబిడ్డ పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మీ బిడ్డ పట్ల ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటంటే... ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు. ఆ పెద్దమనిషి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడిని నమ్ముకుంటే మీ బిడ్డ ఒక ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీ, పేద వర్గాలను నమ్ముకున్నాడు. పెంచిన పింఛన్లకు సంబంధించిన చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టిరాజా, కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎంపీలు పెదిరెడ్డి మి«థున్రెడ్డి, మార్గాని భరత్రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. వేలల్లో టోకెన్లు.. అరకొరగా చీరలు ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నా ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చూపించదు. టీవీ 5 అడగదు. దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. పేదలను చంపేసి చివరికి టీడీపీ కోసం త్యాగం చేశారంటారు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే తన కోసం త్యాగం చేశారని దాన్ని కూడా వాడుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఈ పెద్ద మనిషి రక్త దాహం తీరక మళ్లీ గుంటూరులో సభ పెట్టాడు. కొత్త ఏడాది రోజు మరో ముగ్గురిని ఫోటో షూట్లు డ్రోన్ షాట్ కోసం బలి తీసుకున్న పరిస్థితిని మనమంతా చూశాం. తన సభకు ప్రజలు రారనే భయంతో చీరల పంపిణీ పేరుతో మరో ముగ్గురుని బలిగొన్నాడు. వారం రోజులు ఇంటింటికీ తిరిగి టోకెన్లు ఇచ్చారు.బాబు వచ్చే వరకు, మీటింగ్ పూర్తయ్యే వరకు చీరలు పంపిణీ చేయలేదు. ముందే చీరలు పంపిణీ చేస్తే చంద్రబాబు రాకముందే మహిళలు వెళ్లిపోతారని పంచలేదు. తీరా చూస్తే ఇచ్చిన టోకెన్లు వేలల్లో ఉంటే పంపిణీ కోసం చీరలేమో అరకొరగా తెచ్చారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఆశ్చర్యమేమిటంటే చంద్రబాబు తానే బలి తీసుకుంటాడు.. మళ్లీ మొసలి కన్నీళ్లు కారుస్తాడు. పోలీసులది తప్పు అంటాడు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? 39 లక్షల పెన్షన్లు ఎక్కడ?.. 64 లక్షల పింఛన్లు ఎక్కడ? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిపాలనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్న్ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. బాబు పాలనలో పెన్షన్లు ఎలా కోత పెట్టాలా? అనే ఆలోచన చేశారు. నాడు ఎవరైనా చనిపోతేనే మరొకరికి పెన్షన్ మంజూరు చేసే దుస్థితి. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లాల్సిందే. అరకొరగా ఇచ్చే పింఛన్లు సైతం మూడు నెలల సొమ్మును లంచంగా ఇస్తేనే మంజూరయ్యేవి కావు. గత సర్కారు దిగిపోయే 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64.06 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తోంది. 39 లక్షలు ఎక్కడ? మన ప్రభుత్వం ఇస్తున్న 64 లక్షలు పెన్షన్లు ఎక్కడ? మీరే ఆలోచన చేయండి. నాడు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వగా నేడు రూ.2,750 చొప్పున ఇస్తున్నాం. తేడా గమనించండి. గత సర్కారు హయాంలో పెన్షన్ల ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు కాగా ఈరోజు మన ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.1,765 కోట్లు వ్యయం చేస్తోంది. పెన్షన్లపై ఏడాదికి రూ.21,180 కోట్లు వ్యయం చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లలో కేవలం పెన్షన్ల కోసం రూ.62,500 కోట్లను అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, అభాగ్యుల కోసం ఖర్చు చేసింది. వెన్నుపోటు, ఫొటో షూట్, డ్రామాలే బాబు నైజం.. ఇంత మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్న రాజకీయాలను ఇవాళ చూస్తున్నాం. రాజకీయ వ్యవçస్థ్ధ ఎంత దిగజారిపోయిందో వివరించేందుకు చిన్న ఉదాహరణ చెబుతా.. కోర్టులో ఒకాయన జడ్జి ముందుకు వచ్చి.. ‘అయ్యా తల్లీతండ్రి లేనివాడిని! నన్ను శిక్షించకండి..’ అని ఏడ్చాడు.. ఆ ఏడుపు చూసి జడ్జి జాలిపడి చలించి ‘ఈ మనిషి చేసిన తప్పేమిటి?’ అని ప్రాసిక్యూటర్ను అడిగారు. ‘నిజమే.. ఈ మనిషికి తల్లీతండ్రి ఇద్దరూ లేరు.. కారణం ఆ తల్లితండ్రీ ఇద్దరినీ చంపేసింది ఈ వ్యక్తే..’ అని ప్రాసిక్యూటర్ చెప్పారు. చంద్రబాబుది కూడా ఇదే పద్ధతి. ఈ పెద్ద మనిషి.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుస్తాడు. తానే చంపేస్తాడు. సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు. ఎన్టీఆర్ పార్టీని, ట్రస్టుని, ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండ వేస్తాడు. తమ్ముళ్లూ...! ఎన్టీఆర్ అంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? అని ఊరూరా అడుగుతాడు. పొడిచేది, చంపేది ఆయనే. మళ్లీ మొసలి కన్నీరు కార్చేది కూడా ఆయనే. ఎన్టీఆర్ అయినా, ప్రజలైనా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం.. వెన్నుపోటు పొడవడం. ఫోటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం. -
అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ
సాక్షి, అనంతపురం సెంట్రల్: పడిగాపులు.. ఎదురుచూపుల బాధ పోయింది. పొలంలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా అక్కడకు వలంటీర్ ద్వారా పింఛన్ చేరుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే జీతం లాగా ఒకటో తేదీనే ఠంచన్గా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకార, చర్మకార, కల్లుగీత కార్మికులకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. పాదయాత్రలో ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీని జగనన్న ప్రభుత్వం నిలబెట్టుకుంటూ బాసటగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో ఉన్న రూ.2వేల పింఛన్ను దశలవారీగా రూ.3వేలకు పెంచుతామన్న హామీని మూడో ఏడాదీ అమలు చేసింది. రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచిన పింఛన్ను ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణలో పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు తలుపుతట్టి ‘పింఛన్’ అంటూ డబ్బు అందజేశారు. నాడు పింఛన్ కోసం ఎన్ని అగచాట్లు పడ్డామో తలచుకుని.. నేడు ఉన్న చోటుకే వచ్చి ఇస్తున్న పింఛన్ విధానాన్ని బేరీజు వేసుకుని లబ్ధిదారులు అమితానందభరితులయ్యారు. పింఛన్ పెంపుతో తమకు సామాజిక భద్రతతో పాటు గౌరవం మరింత పెంచిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపి.. చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం తిమ్మాపురంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న పింఛన్దారులు జనవరి నెలకు సంబంధించి 2,79,309 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. కొత్తగా 10,143 మందికి పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రూ.77.97 కోట్ల పింఛన్ నిధులు విడుదలయ్యాయి. తొలిరోజు బుక్కరాయసముద్రం 86.52 శాతం, పామిడి అర్బన్ 85.30, నార్పల 84.68, అనంతపురం అర్బన్ 84.20, శింగనమల 83.46, పెద్దవడుగూరు 82శాతం, పుట్లూరు, ఉరవకొండ 81.61శాతం, తాడిపత్రి అర్బన్, గుంతకల్లు అర్బన్, రాయదుర్గం అర్బన్, గుత్తి అర్బన్లో 80 శాతంతో పింఛన్ల పంపిణీలో ముందంజలో ఉన్నాయి. రాప్తాడు 53.78, ఆత్మకూరు 55.19, బ్రహ్మసముద్రం 62.79, రాయదుర్గం 62 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఏడో తేది వరకు ఫింఛన్ల పండుగ ఫింఛన్ రూ.2750కు పెంచడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్తగా మంజూరైన 10,143 పింఛన్లు కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మండల, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తొలిరోజు 82.03 శాతం మందికి పింఛన్ అందించాం. ఏడో తేదీ వరకు పింఛన్ల పండుగ కొనసాగుతుంది. ఆలోపే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తాం. – నరసింహారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ (చదవండి: ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి) -
ఏపీలో జనవరి1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం రూ. 2,750ని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. కొత్తగా 2 లక్షల 31 వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి పైగా ఏపీలో పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ నిలిచింది. జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. కాగా ఇప్పటి వరకు రూ. 2,500 ఉన్న పెన్షన్ను 2,750కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన మొత్తాన్ని జనవరి 1 నుంచి లబ్దిదారులకు అందజేయనుంది. -
Fact Check: పింఛన్ల పైనా ‘పిచ్చి’ ఏడుపు.. లెక్కలు కనిపించడం లేదా బాబూ!
బాబుగారి ఘనకార్యం 2014 జూన్లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రాష్ట్రంలో మొత్తం పింఛన్దారుల సంఖ్య: 43.11 లక్షలు. 2018 ఫిబ్రవరి నెలలో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 44.44 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో కేవలం 39.38 లక్షల మందికి రూ. 447.26 కోట్లను మాత్రమే పంపిణీ చేసింది. 2019 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి కేవలం నెల ముందు 2019 జనవరిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛన్ల మొత్తం రూ. 514 కోట్లు మాత్రమే. సీఎం జగన్ ఘనత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఏడాది లోపే రాష్ట్రంలో పింఛన్దారుల సంఖ్య ఏకంగా 61 లక్షలకు పైగా పెరిగిపోయింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రతి నెలా 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తోంది. ఈ నెలలో 62.69 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో 62.02 లక్షల మందికి రూ.1,577.07 కోట్లు పంపిణీ చేసింది. కొత్తగా మరో 2,31,989 మందికి పింఛన్లు మంజూరు చేసింది. వీరిలో 83 వేల మందికి పైగా వృద్ధులు, 75 వేల మంది వితంతువులు, 37 వేల మందికి పైగా దివ్యాంగులు, 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో పాటు మరికొన్ని కేటగిరీల్లో మరికొందరు ఉన్నారు. వీటితో కలిపి జనవరి ఒకటో తేదీ నుంచి పింఛన్లు అందుకొనే వారి సంఖ్య ఏకంగా 64,45,226కు పెరిగిపోయింది. ఈ పింఛన్లకు ప్రభుత్వం చేసే నెలవారీ ఖర్చు రూ. 1,775.85 కోట్లు. ఇది వారి ఏడుపు అయినా తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీ, వాటికి మద్దతిచ్చే కొన్ని పత్రికలు ప్రభుత్వం పింఛన్లు రద్దు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అందులోనూ కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పుడల్లా వాటి ఏడుపు మరింత తీవ్రంగా ఉంటుంది. చంద్రబాబు సీఎం కావాలన్న ‘పిచ్చే’ వారి ఏడుపుకు కారణం. –సాక్షి, అమరావతి జగన్ ప్రభుత్వం రికార్డు జగన్ సీఎం అయిన నాటి నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే సామాజిక పింఛన్లు రికార్డు స్థాయికి పెరిగాయి. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది. తాజాగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ మూడున్నరేళ్లలో మొత్తం 22.31 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక వృద్ధాప్య పింఛన్లకు కనీస వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. తద్వారా కొత్తగా అర్హత సాధించిన వారితో కలిపి 2020 జనవరి నెలలో ఒకేసారి 6.12 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ మరుసటి నెలలో మరో 1.31 లక్షల మందికి, 2020 జూన్లో మరో విడత 1.16 లక్షలు, 2020 జూలైలో ఇంకొకసారి 2.42 లక్షల మంది, 2021 సెప్టెంబరులో మరొకసారి 2.20 లక్షల మంది.. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది. పింఛనుదారుల్లో ఎక్కువ మంది వృద్ధులే కావడం వల్ల మరణాలూ ఉంటాయి. గత 8, 10 సంవత్సరాల సరాసరి చూసినా మరణాల కారణంగా ప్రతి నెలా పింఛనుదారుల సంఖ్య తగ్గుతుంది. మరోపక్క అర్హత లేని వాళ్లు పింఛన్లు పొందుతున్నారా అన్న దానిపైన కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆరు నెలలకు సోషల్ ఆడిట్ చేపడుతోంది. ఏన్నో ఏళ్లుగా ఉన్న నిబంధనల ప్రకారమే.. అనర్హులుగా గుర్తించిన వారికి నేరుగా పింఛన్లు రద్దు చేయకుండా, నోటీసు ఇస్తోంది. వారి అర్హతను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 64 లక్షల మంది లబ్ధిదారుల్లో అతి కొద్ది మంది అనర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకొనేందుకు అధికారులు చేపట్టే చర్యలను, మరణాలను సాకుగా చూపి ప్రభుత్వం లక్షల సంఖ్యలో పింఛన్లను రద్దు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.