Thota Trimurthulu
-
అల్లు అర్జున్ ఇంటికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన నటుడు అల్లు అర్జున్ను పలువురు ప్రముఖులు కలిశారు. ఆదివారం.. అల్లు అర్జున్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం తోట త్రిమూర్తుల మీడియాతో మాట్లాడుతూ, జరిగిన ఘటన దురదృష్ట కరమన్నారు.నేషనల్ అవార్డు నటుడి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని తోట త్రిమూర్తులు అన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మరో వైపు హైకోర్టు ఆయనకు సాయంత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ పత్రాలు అందలేదని, సర్టిఫైడ్ కాపీలను తాము పరిగణనలోకి తీసుకోబోమని చెబుతూ జైలు అధికారులు.. అల్లు అర్జున్ను విడుదల చేయలేదు.శనివారం ఉదయం విడుదల చేస్తామని ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. జైలులోని మంజీరా బ్యారక్లోని క్లాస్–1 గదిని అల్లు అర్జున్కు కేటాయించారు. అల్పాహారం అందించారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో జైలు అధికారులు అల్లు అర్జున్ను విడుదల చేశారు.అల్లు అర్జున్ను శనివారం.. పెద్ద సంఖ్యలో ప్రముఖులు పరామర్శించారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి, దిల్రాజు, రవిశంకర్, జెమిని కిరణ్, నటులు వెంకటేశ్, నాగ చైతన్య, ఆర్.నారాయణమూర్తి, రానా, సు«దీర్బాబు, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అక్కినేని అఖిల్, అడవి శేష్, సంగీత దర్శకుడు తమన్ తదితర సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్, సీఎం రేవంత్ అరెస్ట్లో కామన్ పాయింట్ ఇదే: ఆర్జీవీ ట్వీట్ -
అధికారం శాశ్వతం కాదు.. కూటమికి వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైఎస్సార్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. -
కూటమి సర్కారువన్నీ బూటకపు హామీలే : త్రిమూర్తులు
-
మండలి: పంట నష్టపరిహారం ఇచ్చేదెప్పుడు?: వైఎస్సార్సీపీ నిలదీత
సాక్షి, గుంటూరు: శానస మండలిలో పంట నష్టపరిహారంపై కూటమి సర్కార్ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని.. కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు.52 లక్షల మంది రైతులకు 10,500 కోట్లకు పైగా ఇవ్వాలని.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు పెట్టారన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. రైతులకు ఎప్పుడు నుంచి పెట్టుబడి సాయం అందిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ రామససుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో కలిపి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ పోయింది కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ యంత్రాంగం 200 మంది పోలీసులతో నా కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేసింది. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అధికారులు అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తా. రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడ: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో తన కుటుంబానికి చెందిన 11 ఎకరాల భూమి విషయంలో అధికారుల అత్యుత్సాహమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తుల భూతగాదాలు, రాజకీయ నాయకుల మధ్య జరిగే వివాదాల తరహాలో ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం వ్యవహరించి 200 మంది పోలీసులతో తన కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని త్రిమూర్తులు ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా అధికారులు వ్యవహరించారంటూ ఆయన ధ్వజమెత్తారు. నిజానికి.. 2005లో తిప్పసాని మహాలక్ష్మి, నూనె శ్రీదేవిల నుంచి ఆ భూములను కొనుగోలు చేశామన్నారు. భూమి కొన్న సమయంలో రెవెన్యూ రికార్డులతో పాటు రిజి్రస్టేషన్ శాఖ ద్వారా కూడా అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు, ల్యాండ్ సీలింగ్ సమస్యలు లేవని తేలాకే ఆ భూమిని కొనుగోలు చేశామన్నారు. చట్ట విరుద్ధంగా.. రాజకీయ కక్షతో.. ఇక సుమారు 19 ఏళ్లుగా తమ ఆ«దీనంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డులలో కూడా తమ పేర్లతో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే, ఆ భూములకు పన్నులు చెల్లిస్తున్నామని, చెరువులకు అనుమతులు కూడా ఇచ్చారని చెప్పారు. ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో అధికారులు అప్పటికప్పుడు నోటీసు ఇచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని త్రిమూర్తులు ప్రశి్నంచారు. ఇలాంటి విధ్వంసకర చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. చట్ట విరుద్ధంగా రాజకీయ కక్షతో చేసిన ఈ వ్యవహారంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. పార్టీ మారేందుకు ప్రయతి్నస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. -
గుర్తుంచుకో బాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు: తోట త్రిమూర్తులు
సాక్షి, కాకినాడ జిల్లా: దేశమంతా డా.బిర్.అంబేద్కర్ రచించిన రాజ్యంగం నడుస్తుంటే.. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో తమ బంధువుల చెరువులను ధ్వంసం చేయించారు. 34 ఎకరాల్లో 11 ఎకరాలు సీలింగ్లో ఉందని ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ధ్వంసానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.‘‘భూముల వ్యవహారం కోర్టులో ఉన్నా అధికారులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్సీపీ వ్యక్తిని కాబట్టే నాపై కక్ష కట్టారు. ప్రభుత్వాలు, అధికారం ఎల్లకాలం ఉండదు. ఇది సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్కు చెబుతున్నా.. చట్టపరంగా ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు’’ అని తోట త్రిమూర్తులు అన్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
జగన్ సైనికులుగా మా పోరాటం: YSRCP ఎమ్మెల్సీలు
సాక్షి, గుంటూరు: శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారని ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. వైఎస్ జగన్తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ వరదు కల్యాణి మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తాం. మొన్నటి ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించినా మాట వాస్తవమే. ఎక్కడ పొరపాట్లు జరిగాయో పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు అండతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలి.ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి. వైఎస్ జగన్ సైనికులుగా మేము పని చేస్తాం. ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేస్తాం’అని అన్నారు.మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతాం: తోట త్రిమూర్తులుశాసన మండలిలో వైఎస్సార్సీపీకే మెజార్టీ ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలకు మేలు కలిగే అంశాలను సమర్ధిస్తామని అన్నారు. -
ఈ వయసులో అలాంటి మాటలు... చంద్రబాబు పై తోట త్రిమూర్తులు ఫైర్
-
చంద్రబాబూ.. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
చంద్రబాబూ.. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు: ఎమ్మెల్సీ తోట
సాక్షి, కోనసీమ జిల్లా: ప్రభుత్వంపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మండపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాలు అభినందించాయి. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ‘‘ఏరోజైనా చంద్రబాబు పేదవాడికి సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా?. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మహానేత వైఎస్సార్. ఉచిత విద్యుత్పై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. గడపగడపకూ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలన గురించి అడగండి. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి’’ అని తోట హితవు పలికారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? ‘‘మండపేటలో టీడీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం దోచుకున్నారో చర్చకు నేను సిద్ధం. ఇసుకను ఎవరు దోచేసుకున్నారో ప్రజలే చెబుతారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరింది. ఆనాడు పెన్షన్లు మీ హయాంలో ఎలా వచ్చాయి.. ఇప్పుడు ఎలా వస్తున్నాయి. ఇప్పుడు వలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ అందుతోంది. వలంటీర్లు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వలంటీర్లు ప్రజలకు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులకు కూడా లేని అనుభవం క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు ఉంది’’ అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. -
ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?: ఎమ్మెల్సీ తోట
సాక్షి, విజయవాడ: కాపు ఉద్యమంలో ముద్రగడ ఏనాడూ లబ్ధి పొందలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాపు ఉద్యమం రాజకీయ లబ్ధి కోసమే అనడం దారుణం.. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ రాజకీయంగా నష్టపోయారని ఆయన అన్నారు. ‘‘ముద్రగడ స్ఫూర్తిగా మేమంతా ముందుకెళ్తాం. 30 ఏళ్ల క్రితం ముద్రగడ చేసిన ఉద్యమం ఈ జనరేషన్కు తెలియదు. సీఎం అయ్యే అర్హత, సంఖ్యా బలం తనకు లేదని పవన్ చెప్పారు. ఎవరినో అందలం ఎక్కించడం కోసం కాపులు కొట్టుకోవాలా?. 2019లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్ మాదిరిగా వ్యక్తిగతంగా మేం మాట్లాడం పవన్ మాపై ఎందుకు కక్ష పెంచుకున్నారో అర్ధం కావట్లేదు’’ అంటూ ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యానించారు. చదవండి: స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్ -
మండపేట నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
ఏపీ: పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, తాడేపల్లి: విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని.. సీఎం జగన్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఎవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలో మండపేట(డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా) నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి.. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తుకు వచ్చేవి. తప్పుడు ప్రచారాలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పేదవాడి కోసం పని చేస్తున్న ప్రభుత్వం ఇది. దీనికి మళ్లీ గెలిపించుకుంటాం. మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే శాయశక్తులా కృషి చేస్తాం. కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీఎం జగన్ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇదీ చదవండి: ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ -
కాపు నాయకులకు సీఎం జగన్ ఎంతో ప్రాధ్యానత ఇచ్చారు : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
-
టీడీపీ ఎమ్మెల్యే నోటి దూల మాటలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అదిరిపోయే కౌంటర్
-
తండ్రిని చంపి.. కుమారుడిని పరామర్శిస్తారా?
మండపేట: తండ్రిని చంపిన వ్యక్తి.. తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాను చంద్రబాబు పరామర్శించడంపై ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తోట మీడియాతో మాట్లాడారు. రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబునాయుడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అటువంటి వ్యక్తి రాధాను పరామర్శించడం వల్ల రంగా ఆత్మ మరింత క్షోభిస్తుందని అన్నారు. రంగా అన్ని సామాజికవర్గాలూ అభిమానించే వ్యక్తని, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు కావస్తున్నా నేటికీ అందరి హృదయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన కుమారుడు రాధా ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రెక్కీ జరిగిన విషయాన్ని రాధా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అవసరమైన రక్షణ కల్పిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించిందని చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు తనకు తెలుసునని, బాబు మాటల్లోని మంచి, చెడును ఆలోచించుకుని అడుగులు వేయాలని తన సోదరుడైన రాధాకు సూచన చేస్తున్నానని తోట అన్నారు. -
నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం: సజ్జల
అమరావతి: నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఎమ్మెల్సీలను కాపు, ఎస్సీ, ఓసి, బీసీ వర్గాలకు ఇచ్చారని, ప్రతి సందర్భంలోను అన్ని వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సీఎం జగన్ స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తుచేశారు. ముగ్గురు మైనారిటీలకు, బీసీలకు అధిక ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. అలానే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇలానే సామాజిక న్యాయం పాటిస్తున్నామని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్ ఎంత కచ్చితంగా నిలబడతారో ఇదే నిదర్శనమని గుర్తుచేశారు. శాసన మండలిలో టీడీపీ అడ్డంకులు ఇక ఉండవని, ప్రభుత్వ పాలసీల అమలు ఇక నుంచి సులభతరం అవుతుందని అన్నారు. శాసన మండలి రద్దు ప్రతిపాదన పెండింగ్లో ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్రెడ్డిది అని అన్నారు. పార్టీ జెండా మోసిన నమ్మకాస్తులకు అవకాశాలు ఇచ్చే నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు.2006లో తనను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారని, 2014లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, అందుకే తనకు సీఎం జగన్ దేవుడు లాంటివారని చెప్పారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానని, తొలిసారి తమ నాయుకుడు, సీఎం జగన్ శాసన మండలిలో అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు.అన్ని సామాజికవర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ మోషేన్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపిస్తున్నారని అన్నారు.బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాటా దక్కేలా చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. కడప జిల్లాలో తొలిసారి బీసీ యాదవ వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అన్నారు. సమాన్యుడైన తనను చట్టసభలుకు పంపింనందుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు -
సీఎం వైఎస్ జగన్ను కలిసిన తోట త్రిమూర్తులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కుమారుడు తోట పృద్వీరాజ్ కూడా ఉన్నారు. కాగా, గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. అంతకుముందు.. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్కు సిఫారసు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. చదవండి: కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ నూతన విద్యా విధానంతో ఎనలేని మేలు: సీఎం జగన్ -
కాపులకు బాబు ద్రోహంపై నోరెత్తలేదేం?
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తూ స్క్రిప్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. ఆదివారం వారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పవన్కు కనీస పరిజ్ఞానం లేదు.. ► కాపుల సంక్షేమంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ పేర్కొనటం విడ్డూరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి రూ.4,769 కోట్లకుపైగా ఖర్చు చేసింది. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలతో లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేసింది. దీనిపై పవన్కు కనీస పరిజ్ఞానం కూడా లేదు. మాటకు కట్టుబడి... ► టీడీపీ ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి కాపుల కోసం ఖర్చు చేసింది రూ.1,874 కోట్లు మాత్రమే. చంద్రబాబు తొలి ఏడాది పాలనలో కాపులకు కేటాయించింది సున్నా. పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు నోరెత్తలేదు? చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం 2,54,335 మంది లబ్ధి పొందితే సీఎం జగన్ ఏడాదిలోనే కాపు కార్పొరేషన్ ద్వారా 22,89,319 మందికి లబ్ధి చేకూర్చారు. ► ఏటా రూ.2,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేస్తామన్న మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,392.43 కోట్లను కాపుల కోసం జగన్ ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.1,377 కోట్లకుపైగా ఖర్చు చేశారు. సాయం లెక్కలు ఇవిగో.. ► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 2,35,873 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.354 కోట్లను సీఎం జగన్ ఇటీవలే వారి ఖాతాలకు జమ చేశారు. అమ్మ ఒడి ద్వారా 3,81,185 మందికి రూ.571.78 కోట్లు, జగనన్న విద్యాదీవెన ద్వారా 1,23,257 మంది లబ్ధిదారులకు రూ.367.63 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. జగనన్న వసతి దీవెన కింద 96,739 మందికి రూ.92.93 కోట్లు, వైఎస్సార్ రైతుభరోసా కింద 7,56,107 మందికి రూ.1,497.29 కోట్లు లబ్ధి కలిగింది. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 3,92,646 మందికి రూ.1125.88 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్ర కింద 29,957 మందికి రూ.57.07 కోట్లు సాయం చేశారు. జగనన్న చేదోడు (దర్జీలకు) కింద 14,021 మందికి రూ.14.02 కోట్లు, వైఎస్సార్ నేతన్ననేస్తం కింద 2,577 మందికి రూ.6.18 కోట్లు, విదేశీ విద్యాదీవెన కింద 533 మందికి రూ.29.45 కోట్లు, వైఎస్సార్ జగనన్న ఇళ్లపట్టాల కోసం 2,56,424 మందికి రూ. 663.42 కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ బహిరంగంగా కళ్లెదుటే కనిపిస్తుంటే శ్వేతపత్రం ఎందుకు? బాబు డ్రామాలతో కాపులు నష్టపోయారు ► కాపు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత పవన్కు లేదు. సుప్రీం తీర్పు వల్ల 50% మించి రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదని తెలిసీ చంద్రబాబు ఆడిన డ్రామాలతో కాపులు నష్టపోయారు. జగన్ ధైర్యంగా, నిజాయితీగా ఈ విషయంపై మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని కాపు సోదరులు గమనించాలి. బీసీల హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించటంపై తమ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’
సాక్షి, తూర్పుగోదావరి: కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మోసం చేయడంతో ప్రజలు 151 సీట్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే 45 నుంచి 60 ఏళ్లు ఉన్న కాపు మహిళలకు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. 2.40 లక్షల మంది కాపు మహిళలకు కాపు నేస్తం అందించామని చెప్పారు. ఇంకా అర్హత ఉన్నవారు నమోదు చేసుకునేందుకు నెల సమయం కూడా ఇచ్చామని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్కళ్యాణ్ అదే చెప్పారని ఎద్దేవా చేశారు.(అవన్నీ పవన్కు కనిపించడం లేదా: అవంతి) 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి జనసేన తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని తోట త్రిముర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెపప్పారు. ముద్రగడ ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా లేని విధంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని ధ్వజమెత్తారు. కంచం కొడితే కూడా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, గాజువాకలో కూడా కాపులే ఎక్కువగా ఉన్నాపవన్ కల్యాణ్ను ఓడించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తనలోని లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కాపులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తోట త్రిముర్తులు పేర్కొన్నారు. -
‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’
-
వైఎస్సార్సీపీలోకి తోట త్రిమూర్తులు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు రామచంద్రాపురం నాయకులు పి.బాబ్జి, వంటికూటి అబ్బు, విశ్వేశ్వరరావు, తోట పృథ్వీరాజ్, రేవు శ్రీను, పేకేరు బాబ్జీ, బాలాంతరం రాజా, రావూరు సుబ్బారావు, తోట బాబు, వారి అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు త్రిమూర్తులు రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాల అమలుకు తనవంతు కృషి చేస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని అన్నారు. ఆయన ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు. అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. రాజకీయంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తాను పోటీ పడుతూ వచ్చామన్నారు. కులాల మధ్య గానీ, తమ మధ్య గానీ ఎలాంటి వైరం లేదని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. పార్టీలో సీనియర్లతో కలిసి పని చేస్తానని, అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ కాపుల తరపున మాట్లాడటం లేదని తోట త్రిమూర్తులు విమర్శించారు. అందుకే పవన్ కల్యాణ్పై కాపులకు నమ్మకం సడలిపోయిందని స్పష్టం చేశారు. త్రిమూర్తులు రాక సంతోషకరం: బోస్ తాను మొదటి నుంచీ వైఎస్సార్సీపీకి విధేయుడిగా ఉన్నానని, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో చరిత్ర పుటల్లో టీడీపీ కనిపించదని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో తీసుకున్న పీపీఎల నిర్ణయాలతో రోజుకు రూ.700 కోట్లు నుంచి రూ.1,000 కోట్ల నçష్టం జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. రానున్న రోజుల్లో చాలామంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, సి.వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ నేత పిల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మీ ఆత్మలు బీజేపీలో ఎందుకు చేరాయి
ద్రాక్షారామ (రామచంద్రపురం): ‘మీ ఆత్మలుగా వ్యవహరించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి ఎందుకు వెళ్లారనే విషయమై టీడీపీ శ్రేణులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది చంద్రబాబు గారూ. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఆ ఇద్దరితోపాటు గరికపాటి రామ్మోహనరావు, టీజీ వెంకటేష్ టీడీపీ ఓటమి పాలైన 15 రోజుల్లోనే బీజేపీలో చేరారు. ఆ నలుగురూ మీ కంట్రోల్లో ఉంటూ మీకు సన్నిహితంగా మెలిగేవారు. మీకు చెప్పకుండానే పార్టీ మారారా. దీనిపై మీరెందుకు నోరు మెదపటం లేదు’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత తోట త్రిమూర్తులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరుతో మనస్తాపం చెందిన తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎంతోమంది పార్టీలోకి వస్తారు, పనులు చేయించుకుని వెళ్లిపోతుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై త్రిమూర్తులు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తానెప్పుడు సొంత ప్రయోజనాలు ఆశించలేదని చెప్పారు. చంద్రబాబు వద్ద సొంత ప్రయోజనాల కోసం ఒక్క పని చేయించుకున్నట్లు నిరూపించినా.. అందరి సమక్షంలో ఎక్కడైనా సమాధానం చెబుతానన్నారు. -
టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా
-
తూర్పు గోదావరిలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ రామచంద్రాపురంలో ఏర్పాటు చేసి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కార్యకర్తల సహకారం మరిచిపోలేనిదన్న తోట త్రిమూర్తులు.. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా తాను ప్రజల మనసును గెలుచుకున్నానని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు వైఖరివల్లే తోట త్రిమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
గంటా శ్రీనివాస్తో తోట త్రిమూర్తులు భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గం నాయకులు తమ దారి తాము చూసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వీరు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ వీరి భవిష్యతు కార్యచరణపై స్పష్టత రాలేదు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్తో తోట త్రిమూర్తులు హైదరాబాద్లో భేటీ అయ్యారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశానికి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ నాయకుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. మరోవైపు తోట త్రిమూర్తులుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో త్రిమూర్తులు గంటాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి గంటా బీజేపీలోకి వెళ్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీపై టీడీపీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. -
కాపు కల్యాణ మంటపం స్థలం కబ్జా
సాక్షి, రామచంద్రపురం: నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సొంత సామాజిక వర్గం కాపుల ఓట్లతోపదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. కాపు కల్యాణ మంటపం కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఆయన బంధువులకు కట్టబెట్టారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామిశెట్టి గంగాపురుషోత్తం ఆరోపించారు. పట్టణంలోని వినయ్దుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇష్టదైవం ప్రసన్నాంజనేయస్వామి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. కాపులను కేవలం ఓట్ల కోసమే తప్ప కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏనాడు పాటు పడలేదన్నారు. అమలాపురంలో పశువుల వ్యాపారం చేసుకునే ఆయన 1994లో నియోజకవర్గానికి వచ్చారన్నారు. కల్యాణ మంటపం కట్టుకోవాలంటూ కాపులను ఏకం చేసిన ఆయన.. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇండిపెండెంట్గా కాపుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తొలిసారి ఇండిపెండెంట్గా ఆయన గెలిచిన సమయంలో తాను తోట వద్దే ఉన్నానని, ఆ సమయంలో ద్రాక్షారామలో కాపులకు కల్యాణ మంటపం నిర్మించేందుకు దేవస్థానం భూమిని తీసుకున్నట్టు ఆయన వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాపులకు మాత్రం కల్యాణ మంటపాన్ని మాత్రం నిర్మించలేదని విమర్శించారు. అప్పట్లో సేకరించిన ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.70కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ విషయంలో కాపులను ఆయన నిలువునా మోసం చేశారని విమర్శించారు. తిరిగి కాపులను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో కాపులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తుంటే అప్పుడేందుకు మాట్లాడలేదని గంగాపురుషోత్తం ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల ఓట్లు ఆయనకు కావాల్సి వచ్చాయన్నారు. ఇప్పటికైనా కాపులు మోసపోకుండా ఉండాలని ఆయన కోరారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలకాలన్నారు. కాపు నాయకులు తొగరు మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సంఘీయులు హాజరయ్యారు. -
సత్యం ‘సమాధి’
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎస్సీలు కాదని నిరూపించేందుకు.. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు. బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వైద్య పరీక్షలకు నిరాకరణ
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరింది. ఈ ఉదయం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిరాకరించారు. తనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యులను ఆయన అనుమతించలేదు. ఆదివారం రాత్రి ఆయనతో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావు రెండో దఫా చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు నేడు చర్చలు జరపనున్నారు. అయితే ఈ మధ్యాహ్నం ముద్రగడ దీక్ష విరమించే అవకాముందని తోట త్రిమూర్తులు తెలిపారు. కాగా, ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నేడు కిర్లంపూడికి వస్తున్నారు. -
మంచి సినిమాలకు థియేటర్ల కొరత లేదు
రామచంద్రపురం : మంచి సినిమాలకు థియేటర్ల కొరత ఎప్పుడూ ఉండదని ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల రిలీజై విజయవంతమైన ‘భలే భలే మగాడివోయ్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉయ్యాల జంపాల’ చిత్రాలే ఇందుకు ఉదాహరణలన్నారు. రామచంద్రపురంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు చెందిన సూర్య సినిమాక్స్ ట్విన్ థియేటర్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సురేష్బాబుతో ఇంటర్వ్యూ... ప్ర: పెద్ద సినిమాల రిలీజ్కు మధ్య వారం రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల ద ర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం? సురేష్బాబు: పెద్ద సినిమాల రిలీజ్కు మధ్య గ్యాప్ ఉండాలనేది మంచిదే. కానీ దీనికి పరిష్కారం దొరకడంలేదు. అయితే తెలుగు సినిమాలకు సంబంధించి ఇటీవల బాహుబలి, రుద్రమదేవి మధ్య, బ్రూస్లీ, అఖిల్కు మధ్య గ్యాప్ తీసుకున్నారు. ఇందుకోసం థియేటర్ల కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్ర: చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఉందని అంటున్నారు.. దీనికి మీరేం చెబుతారు? సురేష్బాబు: ప్రేక్షకులు చూసి ఆదరించే విధంగా సినిమాలు తీస్తే థియేటర్లకు కొరత ఉండదు.చిన్న చిత్రాలైనా, పెద్దచిత్రాలైనా ప్రేక్షకాదరణ పొందేలా ఉండడమే ప్రధానం. ప్రశ్న: గ్రామీణ ప్రాంతాలలో సైతం మల్టీప్లెక్స్ థియేటర్లు రావడంపై మీ కామెంట్? సురేష్బాబు: థియేటర్లు ఆధునిక హంగులతో ఉంటేనే ప్రేక్షకులు వస్తారు. కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరల్లోనే అన్ని హంగులతో థియేటర్లు ఉండడం మంచిదే. సాంకేతిక విజ్ఞానాన్ని ప్రేక్షకులు ముంగిటికి తీసుకురావడం మంచి పరిణామం. ప్ర: మీ కొత్త సినిమాల గురించి చెప్పండి? సురేష్బాబు: త్వరలో రాణాతో, ఆ పైన వెంకటేష్తో భారీ చిత్రాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక చిన్న చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నాము. -
‘దేశం’లో ఉగ్రోష్ణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు లభించిన ప్రాతినిధ్యం కొందరికి మోదాన్ని, కొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ఆదివారం కొలువుదీరిన చంద్రబాబు మంత్రివర్గంలో జిల్లా నుం చి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. తొలిసారి జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించినందుకు ఒకపక్క సంతోషిస్తూనే మరోపక్క అదే సామాజికవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యే అయిన తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారంటూ ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. ఇంకోపక్క బీసీలలో బలమైన శెట్టిబలిజ, ఎస్సీలలో బలమైన మాల సామాజి కవర్గాలకు అమాత్య పదవులు దక్కకపోవడంతో వారు బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. డిప్యూటీ సీఎంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కేబినెట్ మంత్రిగా యనమల రామకృష్ణుడులకు అవకాశం లభించినందుకు సంతోషించాలో లేక రెండు సామాజికవర్గాలకు బెర్త్లు దక్కనందుకు నిరసన వ్యక్తం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. గొల్లపల్లికి నమ్మకద్రోహం.. జిల్లా నుంచి టీడీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వైన రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడు స్థానాల నుంచీ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. వారిలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి అవకాశం లభించకపోవడాన్ని ఆ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వీరిలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారనే కారణంతో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పక్కన పెట్టినా సీనియర్లు అయిన పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు మంత్రి పదవికి అర్హులు కారా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘గొల్లపల్లికి ఎంపీ సీటు ఇస్తామని నమ్మించి ద్రోహం చేశారు. స్థానికంగా కాకున్నా ఎక్కడో రాజోలు సీటు ఇచ్చినా గెలుపొందిన గొల్లపల్లికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించా’రని ఆ పార్టీలోని ఎస్సీలు రగిలిపోతున్నారు. ఇదివరకు మంత్రిగా పనిచేసి, పార్టీ కోసం గత ఏడెనిమిదేళ్లుగా కష్టపడ్డ గొల్లపల్లికి ఇచ్చే గౌరవం ఇంతేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కోనసీమలో బలమైన సామాజికవర్గాన్ని విస్మరించిన బాబు తీరును వారు గర్హిస్తున్నారు. బీసీలలో బలమైన శెట్టిబలిజ, మత్స్యకార సామాజికవర్గాలు కూడా బాబుపై మండిపడుతున్నాయి. కాకినాడ రూరల్, కాకినాడ సిటీల నుంచి ఎన్నికైన పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావులు కేబినెట్లో బెర్త్లు లభిస్తాయని ఆశించారు. తీరా వారిద్దరిలో ఎవరికీ చోటు దక్కకపోవడంపై ఆ రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మార్గమధ్యం నుంచే ‘తోట’ తిరుగుముఖం మరోపక్క నమ్మించి మోసం చేశారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తానని నమ్మించి టీడీపీలోకి తీసుకువచ్చి, ఇప్పుడు బెర్త్ లేకుండా చేశారని తోట, ఆయన అనుచరవర్గం నిప్పులు కక్కుతున్నారు. మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ వెంటబెట్టుకుని బయలుదేరిన తోట విజయవాడ నుంచి వెనుతిరిగారు. తోట సహా అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. సోమవారం రామచంద్రపురంలో సమావేశమై భవిష్యత్పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తమ్మీద బాబు తీరు.. జిల్లా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
టీడీపీలో చేరిన తోట త్రిమూర్తులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మారీచుడిని మించిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధ వారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు తన నివాసంలో మాట్లాడారు. కేసీఆర్ వ్యవసాయం చేస్తూ ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో రైతులు వ్యవసాయం చేయటంలో మంచి పేరు గడించారని, అలాంటి వారే సాగు లాభసాటి కాదని గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తే... నీళ్లు కూడా దొరకని మెట్ట ప్రాంతంలో ఎకరాకు కోటి సంపాదిస్తున్నానని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హైద రాబాద్లాంటి నగరాలను సీమాంధ్రలో నిర్మిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనలో అనుసరించిన విధానం వల్ల కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో భూస్థాపితమైందని, దాన్ని లేవకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించే సత్తా చంద్రబాబుకే ఉందని త్రిమూర్తులు చెప్పారు. -
అంతా అడ్డగోలు
రామచంద్రపురం, న్యూస్లైన్ :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధికి గత హామీలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఏదో ఒకటి చేసి ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారు. దానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. గత ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు పట్టణంలోని ఒక సామాజిక వర్గానికి జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికై, పదవీ కాలం పూర్తి కావస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు ఆ హామీ గుర్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, సంబంధిత సామాజికవర్గ నాయకులు కలిసి, పట్టణంలోని ముచ్చిమిల్లి వద్ద గల కవలవారిసావరంలో ఒక రైతు వద్ద 83 సెంట్ల భూమి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఆ స్థలంలో 80 కుటుంబాలకు జి+1 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఎంపిక చేయాలని, లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని తహశీల్దార్ను జిల్లా హౌసింగ్ అధికారులు ఆదేశించారు. ఈ తంతంగం జరుగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 9న ఆ 83 సెంట్ల భూమిలో జి+1 ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హౌసింగ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భవన నిర్మాణాలకు కావాల్సిన అనుమతులు, నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి అనుచరులు అక్కడ భవన నిర్మాణాలను ప్రారంభించేశారు. విద్యుత్ అధికారులు ఒక అడుగు ముందుకేసి ఆ నిర్మాణాలకు మీటర్లు కూడా మంజూరు చేసేశారు. అనధి కారికంగా జరుగుతున్న ఈ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ వాసులు కొందరు జిల్లా ఉన్నతాధికారులకు, విజి లెన్స అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. భూ బదలా యింపు జరగకుండానే పంట భూమిలో నిర్మాణాలు సాగుతు న్నాయని వారు పేర్కొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల్లో అయోమయం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు కదా అని వెంటనే ఆయన అనుచరులు సొంత ఖర్చులతో చకచకా పనులు ప్రారంభించేశారు. నిర్మాణం మొదలుపెడితే నిధులు మంజూరవుతాయనుకున్నారు. కానీ ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, నిధులు రాకపోవటంతో డైలమాలో పడ్డారు. నిబంధనలిలా అతిక్రమించారు ఇప్పటికీ ఆ 83 సెంట్ల భూమి రైతు పేరిటే ఉంది. అతడి నుంచి ఇప్పటివరకూ ఆ భూమిని పూర్తిగా కొనుగోలు చేయలేదు. అది వరి పండించే భూమిగానే రెవెన్యూ రికార్డులో ఉంది. భూ బదలాయింపు అనుమమతులు తీసుకోలేదు. జి+1 నిర్మాణాలకు మున్సిపల్ అధికారుల అనుమతులు కూడా పొందలేదు. ఇలా ఏ అనుమతులూ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కూడా మంజూరు చేసేసింది. ప్రభుత్వానికి నష్టం ఇలా... స్థలానికి రిజిస్ట్రేషన్ జరగలేదు. పంటభూమి బదలాయింపు కాలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు. వీటన్నింటి రూపేణా మొత్తం రూ.18 లక్షల మేరకు ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. -
మళ్లీ జంప్?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాజకీయంగా సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ అధిష్టానంపై అదే పార్టీ కి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఘాటైన విమర్శలకు దిగడం చర్చనీయాంశమవుతోంది. ‘రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలు చేస్తే ప్రజలు క్షమించరు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తే చరిత్రహీనులవుతారు. విభజన అంశాన్ని పార్టీ అధిష్టానం పునరాలోచించాలి. స్వలాభం కోసం రాష్ట్రాన్ని రకరకాలుగా మార్చివేయడం తగదు’- పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట అన్న మాటలివి. సొంత పార్టీ పైనే ఇలా విమర్శించడం వెనుక తోట ఆవేశం కాక రాజకీయపరమైన దూరాలోచన దాగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ అడ్రస్ సీమాంధ్రలో గల్లంతవుతుందన్న ముందుచూపుతోనే తోట ఇలా మాట్లాడి ఉంటారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.త్రిమూర్తులు రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి రామచంద్రపురంలో జరిగిన ఒకో ఎన్నికల్లో ఒకో పార్టీ తరఫున పోటీ చేస్తూ వస్తున్నారు. మొదట ఇండిపెండెంట్గా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున, 2008లో ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఆ పార్టీ విలీనం తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి.. ఇలా పలు పార్టీల నుంచి పోటీ చేసి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉండి ఆ పార్టీ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేయడం సొంతగూటి(టీడీపీ)కి తిరిగి వెళ్లే ఉద్దేశంతోనా లేక ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చెపుతున్నట్టు కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలోకి వెళ్లడానికా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై అలా మాట్లాడారే తప్ప ఈ వ్యాఖ్యలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం తగదని తోట సన్నిహితులు ఖండిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే అయిన అనంతరం పలు చోట్ల తోట ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయాన్ని బలపరిచేవిగా ఉన్నాయంటున్నారు. నిష్ర్కమణపై గతం నుంచే ప్రచారం.. గతంలో రామచంద్రపురంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన సీఎం కిరణ్కుమార్రెడ్డి సమక్షంలో వీఎస్ఎం కాలేజీలో జరిగిన సభలో తాను ఏ పార్టీలోకి వెళితే ప్రజలు ఆ పార్టీలోకే వస్తారని త్రిమూర్తులు అన్నారు. ఇందుకు సీఎం కూడా అంతే వేగంగా స్పందించారు. ‘త్రిమూర్తులుకు ఇదే లాస్ట్ స్టేషన్. మరొక స్టేషన్ లేదు. అతను కాంగ్రెస్లోనే కొనసాగాలి’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. వీరిద్దరి మాటల మర్మం ఏమైనా నియోజకవర్గంలో మాత్రం త్రిమూర్తులు తిరిగి టీడీపీకి వెళ్లిపోతారనే ప్రచారం అప్పటి నుంచే జోరుగా సాగింది. గతంలో టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు కూడా త్రిమూర్తులు ఇదే రీతిన స్పందించారని తెలుగుతమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. 2008లో కాకినాడ రూరల్ తిమ్మాపురంలో పార్టీ నేతలతో భేటీ అయిన సందర్భంలో త్రిమూర్తులు టీడీపీ అధినేత చంద్రబాబు తీరును తూర్పార బట్టారు. ఆ తరువాతే పీఆర్పీకి వలసపోయారు. టీడీపీని వీడి పీఆర్పీలోకి ఎందుకు వెళుతున్నానే విషయాన్ని వివరించేందుకు ద్రాక్షారామలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభిమానుల కేరింతల మధ్య టీడీపీ జెండాలను కిందపడేసి తొక్కిన విషయాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. కాగా చంద్రబాబు కూడా ఉప ఎన్నిక సందర్భంగా ద్రాక్షారామ రోడ్షోలో త్రిమూర్తులుపై ఘాటైన విమర్శలు చేశారు. ‘భూకబ్జాదారుడు, సెటిల్మెంట్లు చేసే నాయకుడు పోటీచేస్తున్నాడు. ఆలోచించి ఓటేయండి’ అన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు తోటను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నా, ఇందుకు వ్యతిరేకంగా ఆ సామాజికవర్గంలోని మరికొందరు కీలక నాయకులు రెండు రోజుల క్రితం భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. కాగా ఇన్ని విమర్శలు చేసిన చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపికి తమ నాయకుడు వెళతారని ప్రచారంలో అర్థం లేదని త్రిమూర్తులు వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీపై త్రిమూర్తులు సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయంగా పలు ఊహాగానాలకు కారణమయ్యాయి.